హిరమండలం: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళ్తున్న బస్సు గురువారం రాత్రి పాత హిరమండలంలోని కొత్త గౌడవీధి వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం జేసీబీ సాయంతో గ్రామస్తులు బస్సును గోతి నుంచి బయటకు తీశారు.


