● కొండపేటకు బావి నీరే దిక్కు
● నిరసన తెలిపిన గిరిజనులు
సారవకోట:
మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కొండపేట గిరిజన గ్రామం తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ మంచినీటి పథకం సరిగ్గా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు ఆ నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. పంచాయతీ ద్వారా నిర్వహించే రక్షిత మంచినీటి పథకం బోరు పూర్తిగా పాడైంది. తాగునీటి సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం స్థానికులంతా నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న బావి నీరు మాత్రమే దాహం తీరుస్తోందని, ఆ నీరు కూడా అడుగంటి పోయిందని తెలిపారు.


