ఆమదాలవలసలో లాయర్ల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఆమదాలవలసలో లాయర్ల విధుల బహిష్కరణ

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్‌ అసోసియేషన్‌ సభ్యు లు, లాయర్‌ దానేటి రామ్మోహన్‌రావును క్రైమ్‌ నంబర్‌ 117/2026 లో నిందితుడిగా ఎ–8 గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలో మహిళా ఎస్‌ఐపై అస భ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆ సమయంలో కోర్టు విధుల్లో ఉండడాన్ని అందరం గమనించామన్నారు. అందుకే విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement