ఆమదాలవలస: మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన స్వగృహంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు శనివారం పరామర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు పలాస మున్సిపల్ మాజీ చైర్మన్ బల్ల గిరిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బడాన కృష్ణ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు అలుగురి పకీర్, జిల్లా బీసీ రైతు సంఘం అధ్యక్షుడు రామినాయుడు, కొత్తకోట ఎంపీటీసీ సురవరపు సింహాచలం, గొంటి ఈశ్వరరావు, పలాస, కోటబొమ్మాళి ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


