జిల్లా కేంద్రంలోని ఎల్బీఎస్ కాలనీలో ఉన్న శారద, భారతి, పద్మశ్రీ, లిఖిత, స్వాతి, వనజ, తదితర 30 మంది స్నేహితులయ్యారు. వారు యోగా పాటుగా ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు చేస్తుంటారు. భర్తను కోల్పోయిన వారికి ఆర్థికంగా ఆదు కోవడం, ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మొ క్కలు పెంచమని ర్యాలీ నిర్వహించడం, ప్లాస్టిక్ వా డకంపైన అవగాహన ర్యాలీలు చేయడం వారికి నిత్యకృత్యం. బెహరా మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు ప్రతినెల వారికి తోచిన సాయం చేస్తుంటారు. ఆలయాల్లో అధికంగా భక్తులు వచ్చే సమయాల్లో క్యూల వద్ద ఉచిత సేవలు అందిస్తారు.


