ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

శ్రీకాకుళం: ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సంపత్‌రావు కిషోర్‌కుమార్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా భారత్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిని చులకనగా తీసుకోవద్దని, ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌, పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం రణభేరీ త్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, జిల్లా కేంద్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్‌ 28న చలో సెక్రటేరియట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్‌మూర్తి, గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, వై.ఉమాశంకర్‌, కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శి డి.ప్రకాశరావు, జి.నారాయణరావు, బి.శంకరరావు, జి.సురేష్‌, టి.భాస్కరరావు, ఎం.మురళి ప్రకాష్‌, గణపతరావు, జైశ్రీరామ్‌, ఎం.వి.రమణ, బి.గౌరీశ్వరరావు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement