రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా! | BSNL Introduces an Upgraded Rs 225 Recharge Plan | Sakshi
Sakshi News home page

BSNL: రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!

Jan 5 2026 6:48 PM | Updated on Jan 5 2026 7:22 PM

BSNL Introduces an Upgraded Rs 225 Recharge Plan

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వెల్లడించిన తరువాత.. నెల రోజుల ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఇప్పుడు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు (గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించేది). ఈ ప్లాన్ ఆఫర్ కేవలం ఈ నెల 31వరకు (జనవరి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.

బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement