చిలుకూరు: మండలంలోని కొండాపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు 20 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మూడు గదులు ఉండగా రెండు శిథిలావస్థకు చేరగా ఒక గది మాత్రమే అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు– మన బడి పథకం కింద పాఠశాలకు మూడు తరగతి గదులు, మరుగుదొడ్లుకు నిధులు మంజూరయ్యాయి. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. తరువాత మధ్యలో వదిలేశారు. తరగతి గదులు పిల్లర్ల దశలో నిలిచిపోగా రెండు మరుగుదొడ్లు కొంత వరకు నిర్మించి వదిలేశారు. పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.


