breaking news
Suryapet District Latest News
-
వరుణుడు కరుణించాలని కృష్ణానది తీరంలో యాగం
అక్రమ కలప సీజ్ జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల సండ్ర కలపను సీజ్ చేశారు. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోనాగార్జునసాగర్ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో.. సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు. 11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు విజయవిహార్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది. పూర్ణాహుతి ఘట్టం.. యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు. ప్రజలు వీక్షించేలా ఎల్ఈడీ తెరలు యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తాంఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛారణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాష్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మహిళా రిజర్వేషన్ సాధనకు ఉద్యమం
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ను తక్షణం అమలు చేయాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్నగర్ బైపాస్ రోడ్డులో నిర్వహించిన సమావేశంలో సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14 వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు మునగ సామ్రాజ్యం, శ్రీలత, మంగమ్మ, నరసమ్మ, వీరమ్మ, జ్యోతి, కుమారి, వెంకటమ్మ, సూరమ్మ, పద్మ, రాణి, నాగమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
సూర్యాపేట : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కార్మిక, రైతు సంఘాల నాయకులు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన జైల్ భరో కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. దాంతో ప్రజా సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని, అసభ్య పదజాలం ఉపయోగించారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు మండారి డేవిడ్కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాలపల్లి శ్రీను మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, గంట నాగయ్య, మట్టి పెల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు. పలువురి అరెస్ట్జైల్ భరో నేపథ్యంలో పోలీసులు ఉదయమే రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డిని అరెస్ట్ చేశారు. జైల్భరో కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులను సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు -
మార్కెట్కు తాళం
ప్రభుత్వం కోట్ల రూపాయతో మార్కెట్ నిర్మించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్డుపైనే బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ నిరుపయోగంగా మారగా మున్సిపల్ అధికారులు దానికి తాళం వేశారు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ఎక్కువైన సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత మార్కెట్లో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలకు అవసరమైన సదుపాయాలను కల్పించి వ్యాపారులను అక్కడికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. -
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేలా చూడాలి
సూర్యాపేట : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ ట్రైన్న్ కారిడార్ పాత అలైన్మెంట్ కొనసాగించి, సూర్యాపేటలో స్టేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్న్ సాధన సమితి, అఖిలపక్ష నాయకులు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం అందించారు. ఆయన కోదాడకు వచ్చినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి మరీ విన్నవించారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్న్ వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని వారు కోరారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వినతిపత్రం అందించిన వారిలో బుల్లెట్ ట్రైన్న్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు మట్టిపెల్లి సైదులు, పేర్ల నాగయ్య, మిట్ట గనుపుల ముత్యాలు, జర్నలిస్టులు ఉన్నారు. -
మార్కెట్ ఉన్నా.. రోడ్లపైనే విక్రయాలు
సూర్యాపేటటౌన్ : ప్రజలకు కూరగాయలు, మాంసం, చేపలు ఇలా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేందుకు నిర్మించిన సమీకృత మార్కెట్ వృథాగా మారింది. సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మార్కెట్ను అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తున్నారు. మటన్, ఫిష్ విక్రయ దారులు అసలు మార్కెట్లోకే రాలేదు. ప్రస్తుతం ప్రధాన రహదారిపైనే వాటి విక్రయాలలు సాగుతుండడంతో నిత్యం రద్దీ నెలకొంటుండగా.. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రూ.19 కోట్లతో నిర్మాణంకూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు. మార్కెటింగ్, మున్సిపల్ శాఖల నుంచి సుమారు రూ.19 కోట్ల నిధులు వెచ్చించి పాత వ్యవసాయ మార్కెట్ స్థలంలో మోడల్ మార్కెట్ను నిర్మించారు. ఇందులో వ్యాపారులతో పాటు కొనుగోలు దారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆగస్టు 2023లో అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి సమీకృత మార్కెట్ను ప్రారంభించారు. అప్పట్లో అధికారులు హడావిడిగా కొన్ని దుకాణాలను మార్కెట్లోకి తరలించారు. అన్ని దుకాణాలు మార్కెట్లోకి తరలక పోవడం, చాలా మంది వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మటన్, ఫిష్తో పాటు ఇతర వస్తువులు విక్రయిస్తుండడంతో లోపల ఉన్న వ్యాపారులు సైతం తమకు గిరాకీ కావడం లేదంటూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు సైతం వాటిని పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం వృథాగా మారింది.నిరుపయోగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొనుగోలు దారులు, వాహనాలతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వాహనదారులు -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పోరాటాలతోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కల్లాల వద్దనే ఎలా కొనుగోలు చేస్తున్నదో, అలానే చేనేత సహకార సంఘాల వద్ద కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకపొతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని, చేనేత కార్మికులకు హౌస్ కమ్ వర్క్ షెడ్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా అమలు చేయాలని కోరారు. వంగరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం నాయకులు మహేశ్వరం జయచందర్, వైట్ల మురళి, వెంకన్న, నరసింహస్వామి, మద్దూరి వెంకన్న, పొన్నం వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సోమనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ -
బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను విన్న ఎస్పీ వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందన్నారు. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలినాగారం : ఎల్నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేనందున రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. సోమవారం మండలంలోని నాగారంబంగ్లా, వర్థమానుకోట గ్రామాల్లో ‘రైతులతో మాట–పంట మార్పిడికి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉందని, విద్యుత్ కొరత ఏర్పడవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి విస్తీర్ణం తగ్గించి కందులు, పెసర్లు, మినుములు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, కుసుమ, ఆముదం, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్, ఎంపీడీఓ అంజిరెడ్డి, ఏఓ పి.కృష్ణకాంత్, సర్పంచ్లు ఆకుల బుచ్చిబాబు, బయ్యం సుజాతవెంకన్న, ఎంపీఓ సుమలత పాల్గొన్నారు. ఇంకుడు గుంతలతో ప్రయోజనంకోదాడరూరల్ : ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో భూ గర్భజలాలు పెరగడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా వీఓఏలు అవగాహన కల్పించాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. సోమవారం పట్టణంలోని మహిళా సమాఖ్య భవన్లో మహిళా రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, ఊరకుంటలు, పామ్పాండ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి అనిత, ఎంపీఓ రాంబాబు, డీపీఎం లక్ష్మీనారాయణ, ఏపీఎం పొన్నం వెంకన్న, వెంకయ్య, పరిమళ, వీఓఏ, వీఓబీ పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుని నిత్య కల్యాణం మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుని ఆలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమశాలలో నిత్యాగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో లక్ష్మీనరసింహుని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ , అర్చకులు పాల్గొన్నారు. -
రోడ్డునే అమ్మేశారు!
కోదాడ : ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని.. అంగుళం కూడా ఆక్రమణకు గురైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కమిటీ (డీటీపీసీ) లేఅవుట్ చేసిన రోడ్డునే తప్పుడు సర్వే నంబర్తో దొడ్డిదారిని విక్రయించినా.. దీనిపై అధికారులు కనీస విచారణ చేసిన దాఖలాలు లేవు. అసలు విషయం ఏమిటంటే.. కోదాడ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 149లో నాగుబండి పద్మయ్యకు భూమి ఉంది. 1959లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ తవ్వకం సమయంలో సిబ్బంది క్వార్టర్స్, గెస్ట్హౌస్ల నిర్మాణాలకు ఈ సర్వే నంబర్ నుంచి ప్రభుత్వం 3.06 ఎకరాల భూమిని సేకరించింది. ఈ స్థలానికి తూర్పున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని పద్మయ్య 1963లో కోదాడ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి రిజిస్టర్ దానపత్రం ద్వారా ఇచ్చారు. ఈ స్థలాన్ని డీటీపీసీ వారు లేఅవుట్ చేసి వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఎన్ఎస్పీ, దాత ఇచ్చిన వైద్యశాల స్థలాలకు మధ్య 30 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డునే తప్పుడు సర్వే నంబర్(208) వేసి అమ్మగా దానిలో కొందరు భవనాలు నిర్మించుకున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా విచారణే లేదు డీటీపీసీ లేఅవుట్ రోడ్డును తప్పుడు సర్వే నంబర్తో అమ్ముకున్న వారి వారసుల్లో ఒకరు తమ భూమిని ప్రభుత్వమే ఆక్రమించిందని తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్ఎస్పీలో 20 గుంటల స్థలాన్ని అక్రమంగా పొందారని, మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో తాము ఇచ్చిన రెండు ఎకరాలకు ఎక్కువగా స్థలం ఉందని 520 గజాల స్థలాన్ని తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పట్టానికి చెందిన పలువురు గడిచిన 20 ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే సర్వే నంబర్ 149లో ఉన్న ఎన్ఎస్పీ స్థలానికి, ప్రభుత్వ వైద్యశాల స్థలానికి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందని కనీస విచారణ చేసేవారు కరువయ్యారని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనూ ఇదే తంతు.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలం కంటే ప్రస్తుతం 20 గుంటలు తక్కువగా ఉంది. అయినా సర్వే అధికారులు వైద్యశాల స్థలానికి తూర్పు రోడ్డును కూడా వైద్యశాల స్థలంగా కొలుస్తున్నారు. ఈ స్థలం తమదేనని దాత వారసులు 1991లో కోర్టుకు వెళ్లగా అది గ్రామపంచాయతీ రోడ్డు అని కోర్టు తీర్పునిచ్చింది. అయినా అధికారులు ఈ రోడ్డును కూడా కొలిచి ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో దాత వారసులకు కోదాడ ప్రభుత్వ వైద్యశాల కాంపౌండ్ లోపల రెండు ఎకరాల కన్నా ఎక్కువ స్థలం ఉందని దాదాపు 520 గజాల స్థలాన్ని అధికారులు అప్పజెప్పారు. ప్రస్తుతం వైద్యశాల లోపల ఎకరం 20 గుంటలు మాత్రమే ఉందని రిపోర్టు ఇస్తున్న అధికారులు మిగిలిన 20 గుంటల ఎటుపోయిందో చెప్పడం లేదు. ఫ 30 అడుగుల రోడ్డులో 18 అడుగుల ఆక్రమణ ఫ తప్పుడు సర్వే నంబర్లో విక్రయం ఫ 20 ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కనీస చర్యలు శూన్యం ఇది కోదాడ పట్టణంలోని సర్వే నంబర్ 149లోని ప్రభుత్వ వైద్యశాలకు పడమర, ఎన్ఎస్పీ స్థలానికి తూర్పున ఉన్న 30 అడుగుల రోడ్డు. ఈ స్థలాన్ని గతంలో వైద్యశాల నిర్మాణానికి దానమివ్వగా దాత వారసుడు నాగుబండి వీరయ్య ఈ 30 అడుగుల రోడ్డును 18 అడుగుల మేర ఆక్రమించి ఇది సర్వే నంబర్ 208లో ఉన్నట్లు చెప్పి రిజిస్టర్ డాక్యుమెంట్స్ 1815, 1816 ద్వారా 495 గజాల స్థలాన్ని అమ్ముకున్నాడు. సర్వే నంబర్ 149లో ఎన్ఎస్పీ స్థలం, ప్రభుత్వ వైద్యశాల ఉండగా ఈ రెండింటి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందో అర్థకాని పరిస్థతి. -
వర్షాలు కురవాలని యాగం
నాగార్జునసాగర్ : వర్షాలు కురవాలని ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున సీఎం రేవంత్రెడ్డి చేపట్టే మహా వరుణయాగానికి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాగర్లో వరుణయాగం ఏర్పాట్లను ఆయన.. ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో కలిసి పరిశీలించారు. యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీ రిపోర్టు ప్రకటించి అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : పీఆర్సీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ సంగం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ప్రకటించడంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. జీవో నంబర్ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ కార్డులను జారీ చేసి ఆసుపత్రుల లిస్టును ఫైనల్ చేసి వెంటనే చికిత్సను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్కుమార్, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, ఎన్.నాగేశ్వరరావు, వెలుగు రమేష్, చిలక రమేష్, డి.లాలు తదితరులు పాల్గొన్నారు. ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య -
రైతులు వరి వేసి నష్టపోవద్దు
భానుపురి (సూర్యాపేట) : వర్షాభావ నేపథ్యంలో వరిపంట సాగుచేసి నష్టపోవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి ఎల్నినో ప్రభావంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సెప్టెంబర్ నాటికి ఎల్నినో ప్రభావంతో వానలు తక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, ఎస్సారెస్పీలలో సమృద్ధిగా నీరు లేనందున నీటి విడుదలపై స్పష్టత లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వరిసాగుకు వెళ్లకుండా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు పంట మార్పిడిపై స్పెషల్ డ్రైవ్ పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రైతులతో మాట–పంట మార్పిడికి బాట అనే పంట మార్పిడి పథకాన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 10 రోజుల పాటు ప్రతి అధికారి కనీసం 10 మంది రైతులను వ్యక్తిగతంగా కలిసి అవగాహన కల్పిస్తారన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. కరువు వచ్చినా అండగా ఉంటాం : ఎమ్మెల్యే మందుల సామేల్రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నా ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి ఈనెల 10న నాగార్జున సాగర్లో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సిబ్బంది ఆదరణతోనే గుర్తింపు
హుజూర్నగర్ : కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆదరణే ఉన్నత ఉద్యోగికి గుర్తింపునిస్తాయని విద్యుత్ శాఖ ఎస్ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకటకిష్టయ్య అన్నారు. బదిలీ అయిన ఎస్ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకట కిష్టయ్యలకు శనివారం హుజూర్నగర్లో డివిజన్ ఆర్టిజన్ కార్మికుల ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు, పూల మాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజం అన్నారు. అనంతరం నూతన డీఈ రామ్మోహన్రెడ్డికి స్వాగత సన్మానం చేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఏడీఈ గోవింద్, కోదాడ ఏడీఈ వెంకన్న, ఏఈలతో పాటు డివిజన్ బాడీ కమిటీ సభ్యులు వెంకట నరసింహ చార్యులు, పిడతల శ్రీనివాస్, నిమ్మా ప్రభాకర్, మట్టపల్లి, హఫీజ్, వీరభద్రం, వేణు, పబ్బు మల్లయ్య, జోనస్రెడ్డి, ఉసిరికాయల సైదులు, ఆర్టిజన్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ఆలయంలో ముందుగా సుప్రభాత సేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం రాత్రికే ఆలయానికి చేరుకున్న రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాముననే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధనకు ఉమ్మడి పోరు సాగిద్దాం సూర్యాపేట : జాతీయ రహదారి–65 వెంట ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పుపై 20 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని ఉమ్మడిగా సాగిద్దామని బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని మహావీర్ బ్యాంకెట్ హాల్లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో రైల్వే లైన్ సాధన సమితి పేరుతో సాగుతున్న మరో ఉద్యమ కమిటీ కన్వీనర్ డేగల జనార్దన్ రాచూరు ప్రతాప్తో అఖిలపక్ష కమిటీ చర్చలు జరిపారు. రెండు సంఘాల కలిసికట్టుగా పోరా టాలు కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుములపురి రవి, కునుకుంట్ల సైదులు, మట్టిపల్లి సైదులు, జర్నలిస్ట్ భూపతి రాములు, సట్టు నాగయ్య ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పేర్ల నాగయ్య, మాధవరెడ్డి, గట్ల రమాశంకర్, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేడు సమన్వయం సమావేశం సూర్యాపేట : జాతీయ రహదారి వెంట ఉన్న ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలకు చెందిన రైల్వేలైన్ సాధన సమితి సభ్యులతో ఆదివారం ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్లో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు బుల్లెట్ రైలు సాధన కమిటీ కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సూర్యాపేటలోని వ్యాపారులు, అన్ని రకాల ఉద్యమ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
మునగాల : అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఆయన మునగాల మండల పరిధిలోని 65వ నబర్ జాతీయ రహదారిపై ఉన్న మునగాల పీహెచ్సీ, మాధవరం, మొద్దులచెరువు, తాడువాయి వద్ద ప్రమాదం జరిగే స్థలాల(బ్లాక్స్పాట్ల)ను పరిశీ లించారు. అలాగే గురువారం రాత్రి ముకుందాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృత్యువాత పడిన ఘటన స్థలాన్ని కూడా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక ఎస్ఐని ఆదేశించారు. బ్లాక్స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది, స్థానికులకు పలు సూచనలు చేశారు. మునగాల పీహెచ్సీ వద్ద బ్లాక్స్పాట్స్ పరిశీలనలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, నాయకులు బచ్చు అశోక్, తక్కెళ్లపాటి సాయి, ముస్కుల సైదిరెడ్డి, నర్రా శ్రీపాల్రెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు కోల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మూడు అడుగులు పెరిగిన సాగర్ నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పాదనతో 81,565 క్యూసెక్కుల నీరు విడుదల నాగార్జునసాగర్ : సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడు అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం జలాశయం విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయానికి 81,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద విద్యుదుత్పాదన చేస్తూ 31,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 900 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టిఎంసీలు)కాగా.. ప్రస్తుతం 516.50 అడుగులు (142.9715 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో త్వరలోనే శ్రీశైలం జలాశయం నుంచి రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా సాగర్ జలాశయంలోని నీటిని విడుదల చేస్తారని తెలంగాణ సాగునీటి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్స్పాల్ ఎన్. వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15వ తేదీలోగా www.iti.te langana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడతలో సీటు పొందని వారు కూడా రెండో విడతలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8247506920, 8499084414, 9160284139, 8247443682 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలినడిగూడెం : విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి విశాల్ ధార పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కరివిరాలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మోడల్ స్కూల్ బాలురకు వసతి గృహానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి వంశీ, వార్డెన్ లతిమూన్, ఉపాధ్యాయులు ఉన్నారు. డీఎస్సీడీఓగా కె.లతభానుపురి (సూర్యాపేట) : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న కె.లత డీఎస్సీడీఓ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధి కారిగా శుక్రవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ హరిసింగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, సాయికుమారా చార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
అడవుల సంరక్షణకు కలిసి పనిచేయాలి: ఎస్పీ
సూర్యాపేటటౌన్ : అడవుల సంరక్షణకు పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. అడవులను నాశనం చేయవద్దని, వాటి విస్తీర్ణం పెరిగితేనే కరువు లాంటి తీవ్ర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల ఆక్రమణలను నిరోధించాలని ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ, పోడు భూములకు సంబంధించి ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఫారెస్ట్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారంతో ముందుకు సాగాలన్నారు. అడవుల విషయంలో తరచూ సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి, వారికి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఫారెస్ట్, పోలీస్ పరిధిలో నమోదైన పాత కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్రెడ్డి, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆదిత్య, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యం
సూర్యాపేట టౌన్ : అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ రమావత్ సైదానాయక్ అన్నారు. శుక్రవారం డిస్టిక్ లెవెల్ వన్డే రెడ్ రిబ్బన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరమన్నారు. వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరగాలని, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తులను సమాజంలో చులకనగా చూడవద్దన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, ప్రిన్సిపాల్ వి.వెంకటేషులు, వైస్ ప్రిన్సిపాల్ ఎంఎస్ఆర్ శాస్త్రి, ప్రోగ్రాం ఆఫీసర్లు మధుసూదన్, సృజన, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ రమావత్ సైదానాయక్ -
చేయూతకు దరఖాస్తులు
భానుపురి (సూర్యాపేట) : చాలా కాలంగా చేయూత పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పంద్రాగస్టు నుంచి ఇవ్వనున్న కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గతంలో లబ్ధిదారులు ఇచ్చిన దరఖాస్తుల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియకపోవడం... అర్హులకు పెన్షన్ అందాలన్న భావనతో నేటి నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ లాగిన్లు ఓపెన్ అయ్యాయి. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,56,000 మందికి ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయి. మరెందరో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఇచ్చిన వారు సైతం పింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయడం తప్పనిసరి. గతంలో ప్రజాపాలన, మీ–సేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్ల కాగితాలపై దరఖాస్తు చేసిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు కొత్త దరఖాస్తు ఫారాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది. దరఖాస్తులు ఎక్కడివ్వాలి.. గ్రామీణ ప్రాంతాల వారైతే గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపాలిటీలో ఇవ్వాలి. లబ్ధిదారుల ఆన్లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను కొత్త ఫారంలో పొందుపరిచి ఇవ్వాలి. గ్రామాల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో స్వీకరించిన వాటిని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. అనంతరం ఆన్లైన్ చేసిన దరఖాస్తులను డీఆర్డీఓ ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపిస్తారు. కలెక్టర్ పరిశీలన అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ముగింపు తేదీ లేదు పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంత ప్రక్రియ అని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నప్పటికీ ప్రభుత్వం ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా (బోధకాలు) బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులు తర్వాతి దశలో ఇవ్వనున్నారు. తలసేమియా, సికిల్ సెల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. కొత్త పింఛన్ల మంజూరుకు నేటి నుంచే స్వీకరణ ఫ ఆగస్టు 15 నాటికి ఎంపిక.. సెప్టెంబర్లో పంపిణీ ఫ ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రభుత్వం ప్రాధాన్యం ఫ అర్జీల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదు -
మోదీ ప్రభుత్వ విధానాలపై పోరాటం
సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల మోదీ పాలనలో రైతులకు, కార్మికులకు తీరని నష్టం జరిగిందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసిన సందర్భంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం దుర్మార్గం అన్నారు. వీటికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ఎలుగురి గోవిందు, మేకనబోయిన శేఖర్, తదితరులు పాల్గొన్నారు -
బుల్లెట్ రైలు అలైన్మెంట్ మార్పుతో అన్యాయం
సూర్యాపేటటౌన్ : బుల్లెట్ రైలు మార్గం అలైన్ మెంట్లో మార్పులతో నేషనల్ హైవే– 65 వెంట ఉన్న ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదట జాతీయ రహదారి–65కు సమాంతరంగా బాటసింగారం, చౌటుప్పల్, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మునగాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా అమరావతి రూట్ను ప్రకటించారన్నారు. ఆంధ్రా ప్రాంత పెత్తందారుల ఒత్తిళ్లు, కొంతమంది పాలకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రస్తుతం రూట్మ్యాప్ను శంషాబాద్ నుంచి హాలియా మీదుగా అమరావతికి మార్చారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పుల్లూరి సింహాద్రి, తగుళ్ల జనార్దన్, శ్రీకాంత్, భాషపంగు సునీల్, బొమ్మగాని వినయ్, పోలోజు మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది, ఇకపై వర్షాలు వచ్చే అవకాశం కూడా లేనందున సాగర్ ఆయకట్టు రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్నినో పరిస్థితులు, ఆరుతడి పంటల సాగు, పౌర సరఫరాలపై వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన వన, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో నీరు డెడ్ స్టోరేజ్కి చేరినందున తాగునీటికి మాత్రమే నీటిని వదులుతారని తెలిపారు. జిల్లాలోని రైతులు వరికి బదులుగా పెసలు, కందులు, మినుములు, కూరగాయలు పండించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, డీఏఓ శ్రీధర్రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, డీఆర్డీఓ సన్యాసయ్య, జడ్పీ సీఈఓ శిరీష పాల్గొన్నారు. అన్ని సూచనలతో జనగణన హ్యాండ్బుక్ జనగణన సంచాలకులు ఇచ్చిన అన్ని సూచనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేసి జనగణన హ్యాండ్బుక్ను తయారు చేస్తామని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీపై కలెక్టర్లతో జనగణన సంచాలకులు భారతి హోళీకేరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారం సేకరించి, గడువులోపు పూర్తి స్థాయిలో పరిశీలించి, జిల్లా జనగణన హ్యాండ్బుక్కు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, సీపీఓ కిషన్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
చేనేత వృత్తిని కాపాడేందుకు చొరవ చూపాలి
సూర్యాపేట : చేనేత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గండూరి రమేష్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ప్రస్తుతం చేనేత వృత్తి కనుమరుగయ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట పారిశ్రామిక సహకార సంఘం భవనంలో చేనేత పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తికి ఎంతో చరిత్ర ఉందన్నారు. 1905 ఆగస్టు 07న ఎందరో మహానుభావులు విదేశీ వస్త్రాలను బహిష్కరించారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 07న అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కడారి భిక్షం, రిటైర్డ్ ప్రొఫెసర్ విపూరి సుదర్శన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మిర్యాల గోపాలకిషన్, కౌన్సిలర్ నాగుల వాసు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం నగేష్, మాజీ ఎంపీటీసీ పున్నం వెంకటేశ్వర్లు, సంఘం ఉపాధ్యక్షుడు చిలివేరు నరసింహారావు, కార్యదర్శి భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముశం హరి ప్రసాద్, డైరెక్టర్లు, మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిట్టకోల సతీష్ కుమార్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఫ సహకార సంఘం అధ్యక్షుడు రమేష్ -
కృష్ణమ్మ చెంత మహా వరుణయాగం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగాన్ని తలపెట్టింది. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున విజయవిహార్ ఆవరణలో ఈ మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పాల్గొననుండగా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణయాగం నిర్వహించనున్నారు. దేవస్థాన పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇంతటి స్థాయిలో వరుణయాగం నిర్వహిస్తుండడం విశేషం. యాగం విజయవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి యాగ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 10వ తేదీ మధ్యాహ్నం.. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి యాగ కార్యక్రమాలు ప్రారంభమై, సాయంత్రం 3.20 నుంచి 3.24 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ మహాయాగంలో 108 మంది ఋత్విక్కులు, వేద పండితులు, అర్చక బృందం వర్ష పాశుపత వరుణ యాగంలోని విశేష మంత్రాలతో 11 హోమ గుండాల్లో ప్రత్యేక వేద మంత్రోచ్ఛరణల మధ్య హోమాలు నిర్వహించనున్నారు. ముమ్మరంగా ఏర్పాట్లు.. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నప్పటికీ, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు ఇంకా ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. దీంతో సాగర్ ఇంకా డెడ్ స్టోరేజ్కే పరిమితమై ఉంది. మరో వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండితే సాగర్కు నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాగాన్ని తలపెట్టింది. ఇప్పటికే జిల్లా అధికారులు, దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు యాగ వేదిక వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, రాకపోకలు, వాహన పార్కింగ్, వేదిక, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పరిశీలించారు. విజయ విహార్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్యాగం నిర్వహణపై అర్చకులతో చర్చిస్తున్న కలెక్టర్రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి, విస్తారంగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, జలాశయాలు నిండాలని ప్రభుత్వం ఈ యాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందేలా జలాశయంలో సమృద్ధిగా నీరు చేరాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. నాగార్జునసాగర్లో 10వ తేదీన నిర్వహణ ఫ వర్షాలు కురవాలని యాగం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఫ స్వయంగా పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి ఫ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా అధికారులు -
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) సులోచన రాణి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇటీవల నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, ప్రత్యేక కోచింగ్, ఇలా ఎన్నో ఉచిత సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.అనంతరం కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ కోతలపై రైతుల నిరసన పాలకవీడు : పాలకవీడు మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ను గురువారం రైతులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ ఇష్టానుసారంగా కోతలు విధిస్తుండడం వల్ల పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు, బావుల సాయంతో సాగు పనులు చేపట్టిన రైతులకు మోటార్లు సక్రమంగా నడవక ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. రోజుకు పది నుంచి పదిహేను విడతలు కరెంటు వచ్చిపోతుండడంతో పొలాలకు నీరు పారించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ కోతలు విధించడం వల్ల మోటార్లు ఒత్తిడికి గురై కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. మండల విద్యుత్ అధికారి శ్రీనివాస్ స్పందించి.. విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. -
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
పెన్పహాడ్ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ రోల్ కాల్కు హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో ఉండి నేరాలను అరికడుతూ ప్రజలకు, బాధితులకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేస్తూ, గ్రామాలను సందర్శిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచాలని అన్నారు. స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. గంజాయి సరఫరా, వినియోగం అరికట్టేందుకు, పాత నేరస్తులపై నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, ఇతర చట్టాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలునాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
ఆయకట్టులో ఆశలు
నాగార్జునసాగర్ : కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. సాగర్కు ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో నాలుగైదు రోజుల్లో గరిష్టస్థాయికి చేరవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు (215టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 871.70 అడుగులకు (149 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి శ్రీశైలానికి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం నమోదవుతోంది. జలాశయంలో నీటి నిల్వలు పెరగడంతో ఎడమ వైపు గల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ నాగార్జునసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 6,589 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పాదన ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి వదిలారు. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం కూడా క్రమంగా పెరగనుంది. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా. ప్రస్తుతం 513.40 అడుగులు (137 టీఎంసీలు) ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటే.. త్వరలోనే నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మరింత పెరుగుతాయి. దీంతో ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. సెప్టెంబర్లోనైనా సాగునీరివ్వొచ్చు.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైప్పటి నుంచి సాగునీటి కొరతతో సాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు వరినార్లు పోయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే, కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటం, శ్రీశైలం నుంచి సాగర్కు స్వల్పంగా నీటి విడుదల కొనసాగతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోపు ఎడమ కాల్వకు నీరు విడుదలైతే ఆలస్యమైనా వరి, పప్పుధాన్యాల వంటి పంటలను సాగు చేసి కనీసం ఒక పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2017లో కూడా సెప్టెంబర్ నెలలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినప్పటికీ రైతులు విజయవంతగా పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతందనే నమ్మకంతో ఆయకట్టు రైతులు కృష్ణమ్మ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలాగే కొనసాగి సాగర్ జలాశయం గరిష్టానాకి చేరుకుంటే తప్ప ఇప్పుడే నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సరఫరా సాగర్ జలాశయంపై ఆధారపడి ఉంది. సాగర్ ఆయకట్టు మూడు లక్షల ఎకరాలతో పాటు, ఎస్ఎల్బీసీ రెండు లక్షల ఎకరాలకు నీరందించాలి. –చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి కృష్ణమ్మ పరుగులు ఫ శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ఫ విద్యుదుత్పాదన ద్వారా సాగర్కు నీటి విడుదల ఫ ఆలస్యంగానైనా సాగునీరు ఇవ్వొచ్చంటున్న రైతులు -
కూరగాయల సాగు.. ఆదాయం బాగు
● డ్రిప్, మల్చింగ్ పద్ధతులు వాడటం వల్ల వరి, పత్తి సాగుతో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ● శాశ్వత పందిళ్లతో నాణ్యమైన దిగుబడి వస్తుంది. కాయలు నేలకు తగలకుండా, పురుగుల బెడద లేకుండా గుణాత్మకమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. ● తక్కువ కాలపరిమితిలో కోతకు వచ్చే కూరగాయలు రైతులకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తాయి. సూర్యాపేట : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగు బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, తక్కువ కాలపరిమితిలో అధిక లాభాలందించే కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని ఉద్యాన శాఖ అధికారులు సూచింస్తున్నారు. ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ సాగునీటితోనే బంగారు పంటలు పండించవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం.. వాతావరణ మార్పుల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,350 ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటిస్తోంది. ఎక్కడైనా విత్తనాలు లేదా నారు కొనుగోలు చేసి నాటుకున్న బిల్లులను సమర్పిస్తే, ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) చొప్పున అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అందిస్తున్న ప్రధాన సబ్సిడీలు, పథకాలు కూరగాయల విస్తరణ పథకం: హైబ్రిడ్ కూరగాయల సాగు విస్తరణకు ఎంఐడీహెచ్ కింద ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్లాస్టిక్ మల్చింగ్ (ఎంఐడీహెచ్) : నేలలో తేమ ఆవిరి కాకుండా కాపాడుతూ, కలుపు నివారణకు ఉపయోగపడే మల్చింగ్ షీట్ల కొనుగోలుపై ఎకరానికి రూ.8,000 (50 శాతం సబ్సిడీ) లభిస్తుంది. శాశ్వత పందిళ్లు (ఆర్కేవీవై) : సొర, కాకర, బీర వంటి తీగజాతి కూరగాయల నాణ్యమైన సాగు కోసం వేసే శాశ్వత పందిళ్ల నిర్మాణానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎకరానికి రూ.లక్ష (50 శాతం సబ్సిడీ) అందజేస్తున్నారు. వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) అనుసంధానం వికసిత్ భారత్–గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రాంజీ ) ద్వారా పందిళ్ల నిర్మాణం, తోటల పెంపకం, ఫీల్డ్ పనులకు కూలీల వేతనం రూపంలో అదనపు ఆర్థిక సహాయం అందుతుంది. బిందు సేద్యం (టీజీ ఎంఐపీ) తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ప్రతి నీటి బొట్టు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తున్నారు.ఫ జిల్లాలో 23 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం ఫ రైతులపై భారం తగ్గించేందుకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం ఫ ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక లాభాలుఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తమ పరిధిలోని ఉద్యాన విస్తరణ అధికారులను లేదా సూర్యాపేట జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. – తీగల నాగయ్య, జిల్లా ఉద్యానపట్టు పరిశ్రమల అధికారి -
సర్ను పారదర్శకంగా నిర్వహించండి
భానుపురి (సూర్యాపేట) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 తో ముగియాల్సిన బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును.. క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమీక్షలో కొత్త పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, సీహెచ్ రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండీ హాబిద్, ఎం. స్టాలిన్, కరుణాకర్ రెడ్డి, డి.రమేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మూసీ రిజర్వాయర్ కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలి
పెన్పహాడ్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమర్ డిమాండ్ చేశారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, జంగంపడిగ, నాగులపహాడ్, నారాయణగూడెం, అన్నారం, అనంతారం, పొట్లపహాడ్ గ్రామాల్లోని పాఠశాలల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల కోసం గతంలో సమ్మె చేసిన కేజీబీవీ టీచర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లెద్దు నరేందర్, గంటపంగు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎ.గణిత, జి. ఆనంద్ భాస్కర్, చర్లపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.ఫ డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమర్ -
పోటీ తత్వంతోనే ఉన్నత శిఖరాలు
సూర్యాపేటటౌన్ : ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచే పోటీ తత్వంతో ముందుకు సాగితేనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన ఫౌండేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నవోదయకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 10 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్, లైబ్రరీని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అద్దె భవనంలో ఉన్నప్పటికీ విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కోదాడలో నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిన్నర కాలంలో భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన కలెక్టర్.. తన చిన్ననాటి సైనిక్ స్కూల్ జ్ఞాపకాలను కలెక్టర్ విద్యార్థులతో పంచుకున్నారు. నేను కూడా మీలాగే ఆరో తరగతిలో ఇల్లు వదిలి సైనిక్ స్కూల్లో చేరాను. నాతో పాటు చదివిన బ్యాచ్మేట్స్లో 22 మంది ఈరోజు డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారని, ముగ్గురికి శౌర్య చక్ర అవార్డులు వచ్చాయని తెలిపారు. నవోదయ విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మాత్రమే కాకుండా దేశాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ రోజువారీ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ ఆదినారాయణ, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, గంగాభవాని, జ్ఞానేశ్వరి, రాంబాబు, వైష్ణవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధరణి.. భవితవ్యమేమి?
భానుపురి (సూర్యాపేట) : ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూ భారతి అమలుతో వారి ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఔట్సోర్సింగ్ విధానంలో ఇప్పటివరకు పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 19 మంది ఆపరేటర్లు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2018 సంవత్సరంలో ధరణి పోర్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయానికి ఒక ధరణి ఆపరేటర్ చొప్పున నియమించారు. ఈ లెక్కన జిల్లాలో 23 మండలాలకు 23 మందిని నియమించారు. అయితే పలు సందర్భాల్లో అవినీతి అక్రమాలు, నిర్లక్ష్యం తదితర కారణాలతో నలుగురు ధరణి ఆపరేటర్లను తొలగించగా ప్రస్తుతం జిల్లాలో 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. భూ భారతి అమలుతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి విధానాన్ని తీసుకొచ్చింది. అయితే గతంలో ధరణి పోర్టల్ ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనికి ప్రధానంగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ధరణి ఆపరేటర్లుగా పనిచేసే ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో ఈ విధానాన్ని చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన రైతుల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేపట్టే ఆపరేటర్లు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండడంతో వీరంతా ప్రభుత్వం ఉద్యోగులుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం ఫ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే యోచన ఫ వివరాల సేకరణలో యంత్రాంగం ఫ ఆందోళనలో కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ధరణి ఆపరేటర్ల సేవలను రద్దు చేయకుండా సగానికి పైగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తుండగా వీరిలో కేవలం 7 నుంచి 8 మంది ధరణి ఆపరేటర్లను మాత్రమే కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమచారం. మిగతా వారి భవిష్యత్తు ప్రశ్నార్థంకంగా మారగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 19 మంది ధరణి ఆపరేటర్లలో ఎవరు ఉంటారు..? ఎవరు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనలో పడ్డారు. -
గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈనెల 2న అమరవీరుల యాదిలో పేరిట మహబూబాబాద్లో ప్రారంభమైన గీతన్నల చైతన్య యాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్లో యాత్ర బృందానికి కార్మికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా పబ్లిక్ ఆడిటోరియం వరకు మోకు, ముస్తాదులు, తాటి, ఈత కొమ్మలు చేత పట్టుకొని మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి తాటి, ఈత చెట్లకు ప్రభుత్వం నంబర్లు వేసి సంరక్షించాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ మాట్లాడుతూ నీరాకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.25 కోట్లు, కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు చౌగాని సీతారాములు, గౌని వెంకన్న, కొండం కరుణాకర్, మడ్డి అంజిబాబు, గౌని సాంబయ్య, తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, బత్తుల జనార్దన్, బోడపట్ల జయమ్మ, కృష్ణ, నాగ మల్లయ్య, బోడపట్ల సుదర్శన్, సుధాకర్, నరసయ్య, రాజేష్ గౌడ్, శ్రీను, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు -
‘నవోదయ’కు గడువు పెంపు
ఫ సూర్యాపేట జిల్లాకు కొత్తగా గతేడాది నవోదయ విద్యాలయం మంజూరు ఫ 2027–28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఫ రేపటి వరకు గడువు ఫ నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య, వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, క్రీడలు, కంప్యూటర్ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసే విద్యాసంస్థగా నవోదయ విద్యాలయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సూర్యాపేటటౌన్ : అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్వీ)లు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. 2027–28 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ఇది వరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దరఖాస్తుల గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశం కల్పించి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారు. జిల్లాకు తొలి నవోదయ స్కూల్.. సూర్యాపేట జిల్లాకు తొలిసారిగా గత ఏడాది మొదటి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం నిర్మాణానికి కోదాడ పట్టణంలో అన్ని వసతులతో కూడిన స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు సొంత భవనంలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన జరగనుంది. ప్రస్తుతం సూర్యాపేటలో కొనసాగుతున్న నవోదయంలో రెండు బ్యాచ్లు కొనసాగుతుండగా మూడో బ్యాచ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులు ఎవరంటే.. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలో నివాసితులై ఉండాలి. 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. గ్రామీణ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం నవోదయ విద్యాలయం ప్రవేశాల్లో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. ఇందుకు వారు మూడో, నాలుగో, ఐదో తరగతులను గ్రామీణ పాఠశాలల్లోనే అభ్యసించి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు బాలికలకు కేటాయించగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తింపుజేస్తారు. 100 మార్కులకు ప్రవేశ పరీక్ష మొత్తం 40 సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఆర్థమెటిక్, లాంగ్వేజ్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంశాల నుంచి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ, కన్నడ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు విద్యార్థి ఫొటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలతో ఈనెల 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఫలితాలను 2027 మార్చి లేదా ఏప్రిల్లో ప్రకటిస్తారు. -
ఆరుతడి పంటల సాగే మేలు
చివ్వెంల(సూర్యాపేట) : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగు చేయడమే మేలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో కూరగాయల పంటల సాగును పరిశీలించి మాట్లాడారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని, వరిసాగును తగ్గించి ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, చిరుధాన్యాలు, కూరగాయలను పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పంటల సాగు విధానంలో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవస అధికారి నాగయ్య, తహసీల్దార్ జి.చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, ఏఈఓలు మానస. శైలజ, సరిత, ఆర్ఐ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలిసూర్యాపేటటౌన్ : సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23న లక్ష మందితో హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్, జిల్లా కోశాధికారి గుయ్యని ప్రసాద్లు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ డీప్యూటీ సీఈఓ మహాలక్ష్మితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ పర్యవేక్షకులు నరేందర్ రెడ్డి, కృష్ణమోహన్, సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, వలియాద్ బేగం, హాసన్ అలీ, మమత, దశరథ, నాగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాలలో నేడు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫార్మా, కెమికల్ తయారీ సంస్థ వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ సౌజన్యంతో గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉపేందర్, టీఎస్కేసీ కోఆర్డినేటర్ ఎం.అనిల్కుమార్ తెలిపారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ డ్రైవ్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్జీ కళాశాలలోని సెమినార్ హాల్లో ఉదయం 9.30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం వేద మంత్రాల నడుమ అర్చకులు నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా మహానివేదన గావించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఆలయ ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పెట్టొద్దు
సూర్యాపేట : విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పెట్టొద్దని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చందన ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ అవగాహన సదస్సులో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెలంతా ప్రజలను, యువతను సైబర్ నేరాలపై చైతన్య పరుస్తామన్నారు. ప్రతి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ జాగృక్త దివస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు విషయాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం పాటల ద్వారా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, రూరల్ ఎస్ఐ అనిల్, షీ టీం ఎస్ఐ నీలిమ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది, రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్య, విజ్ఞానం కోసమే ఇంటర్నెట్ను ఉపయోగించాలి సూర్యాపేటటౌన్ : విద్యార్థులు ఇంటర్నేట్ను విద్య, విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలు, వాటి నివారణ పట్ల సూర్యాపేట పట్టణ పోలీస్, సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. ఈ సదస్సులో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు సందీప్, యాదవేందర్రెడ్డి, షీటీమ్ ఎస్ఐ నీలిమ, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాలరాజు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు అర్చన, నిత్య హోమం జరిపారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, ఈవో చలపతిరావు, అర్చకులు కృష్ణమా చార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, భక్తులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలిఅర్వపల్లి : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ కోరారు. అర్వపల్లిలోని పీహెచ్సీలో మంగళవారం జరిగిన ఆశా డే సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి సకాలంలో వైద్య సేవలందించాలన్నారు. ప్రతి వారంలో రెండు రోజులు డ్రై డేగా పాటించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, డీపీఎంఓ సురేష్కుమార్, సూపర్వైజర్ లలిత, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పంట మార్పిడితోనే అధిక దిగుబడిగరిడేపల్లి : రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించి దిగుబడులు సాధించాలని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డి.ఆదర్శ్ అన్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు మంగళవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి సొసైటీలో నిర్వహించిన గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు ఒకే పంట పండిస్తుండడంతో భూసారం తగ్గి దిగుబడులు కూడా తగ్గుతున్నాయన్నారు. కార్యక్రమంలో గడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మాశెట్టి శ్రీహరి నాగలక్ష్మి, ఉప్ప సర్పంచ్ షేక్ గులాం, కేవీకే శాస్త్రవేత్తలు పి.అక్షిత్ సాయి, ఏ కిరణ్, ఛిజి నరేష్, ఎన్ సుగంధి, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఏ.నరేష్, రైతులు, అరబిందో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కాల్వ ఆక్రమణల గుర్తింపునకు ‘డ్రోన్’ చిత్రీకరణనేరేడుచర్ల : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నేరేడుచర్ల మీదుగా వెళ్తుతున్న ఆర్–3 మేజర్ కాల్వ ఆక్రమణలపై ఎన్ఎస్పీ అధికారులు మంగళవారం డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. ముందుగా కాల్వకు మార్కింగ్ చేసి డ్రోన్ కెమెరాతో ఫొటోలు తీసి వీడియో చిత్రీకరించారు. ఇప్పటికే గుగూల్ మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించిన అధికారులు మరోసారి పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు డ్రోన్ ద్వారా కెమెరా సహాయంతో వివరాలను సేకరించారు. ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించి లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోకుంటే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుని తొలగించనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. -
నాలుగు పోస్టులు.. 635 దరఖాస్తులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా జిల్లాలో స్టాఫ్ నర్సు నియామక ప్రక్రియ ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్న నాలుగు స్టాఫ్ నర్సు పోస్టులకు ఏకంగా 635 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఒక పోస్టుకు సగటున 159 మంది పోటీ పడుతుండడం గమనార్హం. ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా..కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు భారీగా స్పందించారు. సూర్యాపేటతోపాటు నల్ల గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పరిమితంగా ఉండటంతో చిన్న పోస్టులకే తీవ్ర పోటీ నెలకొంది. కాగా స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాల ప్రక్రియకు జూలై 31న దరఖాస్తుల గడువు ముగిసింది. కేటగిరీల వారీగా దరఖాస్తుల పరిశీలనప్రస్తుతం అందిన దరఖాస్తులను అధికారులు కేటగిరీల వారీగా పరిశీలిస్తున్నారు. విద్యార్హతలు, సర్టిఫికెట్లు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా వర్గీకరణ చేపడుతున్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలపై ఉత్కంఠ భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేవలం నాలుగు పోస్టులే ఉండటంతో మెరిట్లో స్వల్ప తేడా కూడా ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే ఈ పక్రియ మరో పది నుంచి పదిహేను రోజులు పట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఫలితాల కోసం దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మెరిట్, రోస్టర్ విధానం ఆధారంగానే ఎంపిక దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే కమిటీ మెరిట్, రోస్టర్ విధానాన్ని అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా ప్రకటించనున్నారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు యమ డిమాండ్ ఇటీవల నోటిఫికేషన్.. ముగిసిన దరఖాస్తు గడువు ఒక్కో పోస్టుకు 159 మంది పోటీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ -
డిజిటలైజేషన్ వందశాతం పూర్తి
అర్వపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తయినట్లు అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ వెల్లడించారు. మంగళవారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో సర్ ప్రక్రియపై న్విహించిన పునఃపరిశీలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ పునఃపరిశీలన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ సమ్మెట అశ్వని, గిర్ధావర్ వెంకట్రెడ్డి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పెరుమాళ్ల ప్రసన్న, మల్లేశ్వరి, జీపీఓలు అజయ్, షరీఫ్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
ఆరోగ్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
పెన్పహాడ్ : జాతీయ ఆరోగ్య కార్యక్రమాల విజయవంతానికి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు బాధ్యతగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి.వెంకటరమణ అన్నారు. మంగళవారం పెన్పహాడ్లోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ఫలాలు గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికీ అందేలా కృషిచేయాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు అన్ని టీకాలు వంద శాతం పూర్తి చేయడంతో పాటు అర్హులందరికీ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు. క్షయవ్యాధి అనుమానితులతోపాటు 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎనన్సీడీ స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో డెంగీ, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి రాజేష్, పద్మ, ఆరోగ్య విస్తరణ అధికారులు తాడూరి వెంకన్న, ప్రభాకర్, సూపర్వైజర్ పూలమ్మ, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ -
రూ.48 కోట్ల ధాన్యం పక్కదారి
భానుపురి (సూర్యాపేట), మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్లో రీజినల్ ఎన్ఫోర్స్మెంట్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు రూ.48 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రబీ 2022–23, రబీ 2023–24, ఖరీఫ్ 2024–25, రబీ 2024–25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా ఆన్లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు, మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక పరిశీలనలో యాక్షన్ ధాన్యాన్ని మినహాయించి సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.48 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా, రబీ 2022–23 సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.5.66 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉన్నట్లు కూడా గుర్తించారు. అన్ని సీజన్లలో కలిపి ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విలువ, బకాయిలను కలిపి సుమారు రూ.53.66 కోట్ల మేర నష్టం సంభవించినట్లు అధికారుల బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నివేదికను సంబంధిత ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో రీజినల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సభ్యులు సీఐ గౌస్, డీటీసీఎస్లు రాజశేఖర్, గిరిప్రసాద్, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేళ్లచెరువులోని రైస్ ఇండస్ట్రీస్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు మరో రూ.5.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తింపు -
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం
భానుపురి (సూర్యాపేట) : మహిళలు, యువతలో దాగిన ఉన్న వ్యాపార ఆలోచనలకు గ్లోబల్ వేదికను కల్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త జాతీయ స్థాయి ప్రోగ్రామ్స్ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, సోషల్ ఇంపాక్ట్ –ఆంత్రప్రెన్యూర్షిప్ పేర్లతో ఈ శిక్షణ కార్యక్రమాలను అందించనున్నట్లు వెల్లడించారు. యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా, ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమన్నారు. 17 నుంచి 23 ఏళ్ల వయస్సు ఉన్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ అశోక్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీతా పళ్ళచుని, అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్, ఊహ సజ్జ, టీం సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మొదటి అలైన్మెంట్నే కొనసాగించాలి
● మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష నేతల విజ్ఞప్తిసూర్యాపేట : సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి అలైన్మెంట్నే కొనసాగించాలని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష నేతలు కోరారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీష్రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతి పత్రాలు అందజేశారు. మొదట ప్రకటించిన ప్రకారం శంషాబాద్ వయా సూర్యాపేట మీదుగా రైల్వేలైన్ నిర్మించాలన్నారు. కార్యక్రమంలో బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షాల కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, రమణాచారి, అఖిలపక్షాల నేతలు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, అనుములపురి రవిబాబు, డాక్టర్ రామ్మూర్తి, చల్లమల్ల నరసింహ, పాండురంగాచారి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు, కునుకుంట్ల సైదులు, గంట నాగయ్య ఆనంతుల మధు, సట్టు నాగయ్య, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. -
కళాశాలల్లో మధ్యాహ్న భోజనమేదీ
హుజూర్నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందని ద్రాక్షాగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. దీంతో విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని కళాశాలలకు వచ్చి అర్ధాకలితో తరగతి గదుల్లో కూర్చుని సాయంత్రం వరకు పాఠాలు వినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 2,969 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఫస్టియర్కు చెందిన విద్యార్థులు 1,575 మంది, సెకండియర్ విద్యార్థులు 1,394 మంది ఉన్నారు. దెబ్బతింటున్న ఏకాగ్రత ప్రతిరోజూ విద్యార్థులు ఉదయాన్నే బస్సులు, ఆటోలు ఇతర వాహనాలలో వెళ్లాలనే తొందరలో చాలా మంది ఇంటి వద్ద అల్పాహారం కూడా తినకుండానే కళాశాలలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అధ్యాపకులు బోధించే పాఠాలపై ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి. రెండు నెలలైనా పథకం ఊసేలేదు!ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాదుకదా కనీసం అల్పాహారం కూడా విద్యార్థులు అందడం లేదు. జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో గ్రామీణులే అధికంగా ఉన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం ఇళ్ల నుంచి ఉదయమే బయలుదేరి 15 నుంచి 25 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కళాశాలలకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద ఏమీ తినకుండా వచ్చిన విద్యార్ధుల పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, ఉదయం అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినా అమలుకాని మధ్యాహ్న భోజన పథకం కనీసం అల్పాహారమూ అందించని ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 2,969 మంది విద్యార్థుల నిరీక్షణప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే అమలు చేస్తాం. – బి.సులోచన రాణి, డీఐఈఓ -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కోదాడ : తెలంగాణ సాధనలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేత ఏనుగుల రాకేష్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూలై నెలతో కలిపి ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం కట్ చేస్తున్నా వారికి సరైన వైద్యసేవలందడం లేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కుక్కడపు బాబు, చీమ నరేష్, ఎస్కె.నయీం, గట్ల కోటేశ్వరరావు, చలిగంటి వెంకట్ పాల్గొన్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 12 గంటల కరెంట్ కూడా అందించలేకపోతుందని విమర్శించారు. అనంతరం వివిధ డిమాడ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎస్కె.నయీం, కుక్కడపు బాబు, గట్ల కోటేశ్వరరావు, తుమ్మలపల్లి భాస్కర్, నర్సిరెడ్డి, అలువాల వెంకట్, సంగిశెట్టి గోపాల్, చలిగంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్రెడ్డి -
పది రోజుల్లో అందేనా!
సూర్యాపేట : పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం ఇంకా ఉచిత యూనిఫాం అందించలేదు. దీంతో వేలాది మంది విద్యార్థులు రోజూ సివిల్ డ్రెస్సులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందించాల్సి ఉన్నా, ఈసారి యూనిఫాం కలర్ మార్చడంతో పాటు వస్త్రాల సరఫరా ఆలస్యమైంది. దీంతో యూనిఫాం కుట్టే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాం అందిస్తామని అధికారులు చెబుతున్నా.. అప్పటిలోగా అందుతుందో లేదో అనుమానంగానే ఉంది. యూనిఫాం అందకపోవడంతో విద్యార్థులు సివిల్ డ్రెస్సుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు. పూర్తిస్థాయిలో అందని వస్త్రంజిల్లాలో 950 పాఠశాలలు ఉండగా వీటిల్లో 23,547 మంది బాలురు, 19,985 మంది బాలికలతో మొత్తం 43,472 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వస్త్రాల పంపిణీ చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వస్త్రం అందలేదు. వచ్చింది చొక్కా క్లాత్ మాత్రమే.. యూనిఫాం తయారీ కోసం అవసరమైన చొక్కా క్లాత్ మాత్రమే జిల్లాకు చేరింది. అయితే ప్యాంటు, స్కర్ట్ల కోసం బాటమ్ క్లాత్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అధికారులు షర్టింగ్ క్లాత్ను గతంలో మాదిరిగానే ఈసారి కూడా యూనిఫాం కుట్టే బాధ్యతలను మండలాల మహిళా సంఘాలకు అప్పగించారు. వస్త్రాలు పూర్తిగా అందిన వెంటనే కొలతలు తీసి కుట్టించాలని సూచించినా, అవసరమైన క్లాత్ అందకపోవడంతో కుట్టుపని ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రెండు జతలు పంపిణీ చేస్తాం విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం కలర్ మారడంతో వస్త్రం రాక ఆలస్యమైంది. ఇప్పటి వరు అవసరమైన చొక్కా క్లాత్ జిల్లాకు చేరింది. బాటమ్ క్లాత్ కూడా రెండు మూడు రోజుల్లో వస్తుంది. మహిళా సంఘాలు కుట్టు పని ప్రారంభించాయి. ఆగస్టు 15వ తేదీలోపు రెండు జతల యూనిఫాం అందిస్తాం. – అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారిపంద్రాగస్టుకు యూనిఫాం ఇస్తామంటున్న విద్యా శాఖ కొనసాగుతున్నది చొక్కా కుట్టుపనే.. ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాని వస్త్రం ఎదురుచూపుల్లో విద్యార్థులు -
‘వరి’లో కాలిబాటలతో అధిక ప్రయోజనాలు
నడిగూడెం : ప్రస్తుతం వానాకాలం సీజన్లో బావులు, బోర్లు, చెరువుల కింద వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి పొలంలో కాలిబాటలు తీయిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ చెబుతున్నారు. వరి పొలంలో కాలిబాటలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, పైరుపై చీడపీడల సమస్య కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. వరి పొలంలో కాలిబాటలపై ఆయన సలహాలు, సూచనలు ఇవీ.. పాటించాల్సిన విధానం..కాలిబాటలు తీసుకునే సమయంలో రైతులు పొడవైన ప్లాస్టిక్ తాడును గట్టుకు ఒకవైపు నుంచి రెండో వైపునకు సాగదీసి కట్టాలి. తాడు వెంబడి 12 సెం.మీ. వెడల్పున వరి నాట్లు తొలగించి పక్కనే పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. చేను గట్టు పక్క నుంచి అడుగు దూరంలో కాలిబాట వేసి అక్కడి నుంచి ప్రతి రెండు మీటర్ల దూరంలో ఒక కాలిబాట తీయాలి. కొందరు రైతులు ప్రతి 6 నుంచి 7 మీటర్లకు ఒక కాలిబాట తీస్తుంటారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. ముందు నాట్లు వేసిన తర్వాత రైతులు గట్లకు ఇరువైపులా తాడు కట్టి మార్క్ చేసిన చోట ఉన్న మొక్కలను తీసివేసి కాలిబాట తీస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో పైరు ఎదుగుతున్న సమయంలో 15 నుండి 20 రోజుల వ్యవధిలో 20 సెం.మీ. వెడల్పులో వరి నాట్లు తొలగించి కాలిబాట వేసుకోవచ్చు. ఇవీ ప్రయోజనాలు..కాలిబాటతో పైరు మొదళ్ల వరకకు వెలుతురు, గాలి తగులుతుంది. దీంతో పైరు ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది. చీడపీడల బెడద కొంతవరకు తగ్గుతుంది. కాలిబాట మార్గంలో వెళ్లి కలుపు మొక్కలు తొలగించడానికి, మందులు చల్లుకోవడానికి వీలవుతుంది. తెగుళ్లు గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి, ఎలుకల నివారణకు కాలిబాటలు ఉపయోగపడతాయి. తుఫానులు, భారీ వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పంట చేలలో కిరణజన్య సంయోగక్రియ సమర్ధవంతంగా జరిగి దిగుబడి పెరుగుతుంది. పైరులో చీడపీడల ఉధృతిని అతి సమీపం నుంచి గమనించి, దానికి అనుగుణంగా సకాలంలో సస్యరక్షణ తీసుకునే వీలు ఉంటుంది.ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి మల్సూర్ సూచనలు -
నేరాలకు దూరంగా ఉండాలి
మిర్యాలగూడ టౌన్ : ప్రతిఒక్కరూ నేరాలకు దూరంగా ఉండాలని మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం మిర్యాలగూడలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రౌడీ షీటర్లకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ప్రశాంతతకు ఎలాంటి భంగం కల్గించొద్దన్నారు. బెదిరించడం, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. నేరాలకు పాల్పడితే నిర్భంద చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు నాగభూషణం, సోమ నర్సయ్య, రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య, వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, మాడుగులపల్లి ఎస్ఐ సురేష్, అడవిదేవులపల్లి ఎస్ఐ శేఖర్, వన్ టౌన్, టూటౌన్ ఎస్ఐలు ఆంజనేయులు, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి -
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలి
మునుగోడు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆ పార్టీ నాయకులకు సూచించారు. మంగళవారం మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 6న జీపు జాతా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ జీపు జాతాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్జ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిరిపారి వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాదగోని సత్తమ్మ, ఈదులకంటి కై లాస్ గౌడ్, ఉప్పునూతల రమేష్ యాదవ్, బండమీది యాదయ్య, గోసుకొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
టీఎంయూను గెలిపించండి
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, బకాయిపడ్డ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నల్లగొండ రీజియన్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ నీతి నిజాయితీ గల తమ సంఘంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. యాజమాన్యం కార్మికుల శ్రమను దారుణంగా దోచుకుంటోందని, కొన్ని డిపోల్లో మహిళా ఉద్యోగులు రాత్రివేళల్లో డ్యూటీలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సమ్మె సమయంలో జేఏసీ నాయకులు 10 శాతం ఫిట్మెంట్కు ఒప్పుకోగా, తాము మాత్రం దాన్ని వ్యతిరేకించడంతో 11 శాతానికి పెంచిందన్నారు. రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో సీఐటీయూ మద్దతు తమకే ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే ఏకై క నాయకుడు అశ్వత్థామరెడ్డి అని కొనియాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆలస్యం కావడానికి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులే ప్రధాన కారణమని విమర్శించారు. తమ సంఘం సుదీర్ఘంగా చేసిన పోరాటాల ఫలితంగానే ఉద్యోగులకు 44 శాతం జీతాలు పెరిగాయని, అలాగే 17 వేల మంది ఉద్యోగుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అయ్యాయని స్పష్టం చేశారు. కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి తమ ప్యానెల్కు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిరంజన్, నాగశేషు, యాదయ్య, శ్రీదేవి, మీలా ప్రభాకర్, శ్రీనివాస్, రీజియన్ సెక్రెటరీ గోపనబోయిన శ్రీనివాస్, అధ్యక్షుడు తయబ్, అన్ని డిపోల సెక్రటరీలు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి నల్లగొండలో ఆర్టీసీ రీజియన్ సర్వసభ్య సమావేశం -
గవర్నర్ను కలిసిన ఎంజీయూ వైస్ చాన్స్లర్
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో నిర్వహించిన యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల సమావేశం సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. యూనివర్సిటీ పురోగతి, సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్కు వీసీ వివరించారు. బీఈడీ పరీక్షలు ప్రారంభం నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ రెగ్యులర్, 1, 3 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంజీయూ పరిధిలోని 13 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఎంజీయూ సీఓఈ జి. ఉపేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలను పకర్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.గంజాయి సేవిస్తున్న నలుగురి అరెస్టు ● మరొకరు పరారీ మేళ్లచెరువు : గంజాయి సేవిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు చింతలపాలెం ఎస్ఐ పరమేష్ మంగళవారం తెలిపారు. చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శ్మశానవాటిక వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అదే గ్రామానికి చెందిన కేతారపు సాయి, చిన్నపంగు అభిలాష్, సాకి వెంకటేశ్వర్లు, దేశాల నితీష్ ఉన్నారు. తిరుమలగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి పారిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, సిగరెట్ పెట్టె, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ హాలియా : పట్టణంలోని సాగర్ ఎడమ కాల్వ సమీపంలో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీని అపహరించారు. ఆ హుండీని సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వెనుక భాగంలో పగులగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్ చెరుపల్లి ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాఘవరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
నకిరేకల్ : సెల్ఫోన్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నకిరేకల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సీఐ హరిబాబు వెల్లడించారు. శాలిగౌరారం మండలం మాదారంకలాన్ గ్రామానికి చెందిన గర్రె లక్ష్మయ్య గత నెల 17న తన సెల్ఫోన్ పోయిందని నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మంగళవారం ఉదయం నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి సెల్ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి రూ.3.50లక్షల విలువ చేసే 21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బేతంపల్లి ప్రభు, సిద్దిపేట జిల్లా రంగదంపల్లి గ్రామానికి చెందిన ఆవుల విజయ్, ఏపీలో నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన ఎరుకల శివశంకర్ ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల యజమానులను గుర్తించి వారికి అందజేస్తామని సీఐ తెలిపారు. 21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం -
30 రోజుల్లోనే కుల, నివాస ధ్రువపత్రాలు
గట్టుప్పల్ : రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం, నివాస ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజా సేవల హక్కు (రైట్ టు పబ్లిక్ సర్వీసెస్) చట్టం కింద పేపర్ లెస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే పత్రాలను గరిష్టంగా 30 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం వారం రోజుల్లోనే అందించనున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సేవలు అందకపోతే బాధ్యులపై ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే హక్కును కూడా పౌరులకు కల్పించారు. ఆన్లైన్ పర్యవేక్షణతో జాప్యానికి చెక్ ప్రతి ఏటా విద్య, ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి విచారణలో ఆలస్యం, ఫైళ్లు పెండింగ్లో పడటంతో పత్రాల జారీ తీవ్ర జాప్యమవుతోంది. ఫలితంగా విద్యార్థులు అడ్మిషన్లు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు, రైతులు సబ్సిడీలు కోల్పోతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కాలపరిమితి నిబంధన తెచ్చింది. మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రతి దశను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల ఫైలు ఏ దశలో ఉందో, ఆలస్యానికి కారణమైన సిబ్బంది ఎవరో సులభంగా గుర్తించవచ్చు. దరఖాస్తుల ప్రాసెస్.. అప్పీల్ విధానం దరఖాస్తు విధానం మీసేవలో ప్రారంభమై ఆపై గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) పరిశీలనకు వెళ్తుంది. విచారణ అనంతరం జీపీఓ వివరాలను రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) లాగిన్కు పంపుతారు. ఆర్ఐ పరిశీలన పూర్తయ్యాక తహసీల్దార్ లాగిన్కు చేరుతుంది. తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత ధ్రువపత్రం నేరుగా మీసేవ కేంద్రానికి చేరుతుంది. దరఖాస్తు నిర్ణీత గడువులోగా రాకపోయినా లేదా తగిన కారణం లేకుండా తిరస్కరించినా బాధితులు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ ఆధారంగా అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారు. ఆదాయ ధ్రువీకరణ ప్రతం జారీకి వారం రోజులే గడువు ప్రజా సేవల హక్కు చట్టంలోకి రెవెన్యూ సేవలు -
మద్యం అనుకుని.. కాళ్ల నొప్పుల తైలం తాగి వృద్ధుడి మృతి
గుర్రంపోడు : మద్యం అనుకుని పొరపాటున కాళ్ల నొప్పులకు వాడే తైలం తాగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తేనపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. తేనపల్లి గ్రామానికి చెందిన కాసర్ల బక్కయ్య(75) నివాసముంటున్న ఇంటి పక్కన ఆదివారం దశదిన కర్మ జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ఇంటి పరిసరాలు శుభ్రం చేయడానికి బక్కయ్య కూలీగా వెళ్లాడు. శుభ్రం చేసే క్రమంలో అక్కడ కనిపించిన కాళ్ల నొప్పులకు వాడే కేసరి తైలం సీసాను మద్యం సీసా అనుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బక్కయ్య తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత మద్యం అనుకొని సెల్ఫ్లో ఉన్న కేసరి తైలం తాగాడు. కొద్దిసేపటి తర్వాత కడుపులో మంటగా ఉండి వాంతులు చేసుకోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు సీసాను పరిశీలించి అది కాళ్ల నొప్పులకు వాడే తైలంగా గుర్తించి వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుమారుడు కాసర్ల వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
● ఐదుగురు మహిళలకు గాయాలునడిగూడెం : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన రమేష్ తన ఆటోలో అదే గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలను రత్నవరం గ్రామంలో వరి నాట్లు వేసేందుకు తీసుకెళ్తున్నాడు. రత్నవరం నుంచి తెల్లబల్లికి వెళ్లే రహదారిలో గుంతలను గమనించకుండా ఆటోను నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మందుల త్రివేణి, నేలమర్రి నాగమణి, చిన బుజ్జి, పులి ఉమ, మందుల అరుణ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగింత సంస్థాన్ నారాయణపురం : మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి గోడ దూకి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను తిరుపతి రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు మంగళవారం ఉదయం పాఠశాలకు తీసుకొచ్చారు. చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ పాండు విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డికి అప్పగించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వారికి అప్పగించారు. హాస్టల్లో ఉండలేకే పాఠశాల నుంచి వెళ్లిపోయామని విద్యార్థులు తెలిపినట్లు సమాచారం. -
వానైనా.. ఎండైనా.. వాకింగ్ తప్పను
ఫ చిరుజల్లుల్లో తలకు హెల్మెట్తో వాకింగ్ అర్వపల్లి : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బందెల వెంకన్న ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్తుంటారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, ఏ ఇతర సమస్యలు ఎదురైనా గ్రామం నుంచి అర్వపల్లికి వాకింగ్ చేసుకుంటూ వచ్చి తిరిగి వెళ్తారు. ఆయన గత 25 ఏళ్లుగా ఇలానే వాకింగ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం వర్షం వస్తున్నా హెల్మెట్ ధరించి వాకింగ్ చేశారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సైకిల్పై, మోపెడ్పై తిరిగేటప్పుడు కూడా హెల్మెట్ ధరించేవారు. ప్రతిరోజు రెండు పూటలా వాకింగ్ చేయడం, బయటకు వెళ్తే హెల్మెట్ ధరించడం తనకు అలవాటుగా మారిందని వెంకన్న తెలిపారు.వర్షంలో హెల్మెట్ ధరించి వాకింగ్ చేస్తున్న వెంకన్న -
విద్యుత్ తీగ యమపాశమైంది
● వ్యవసాయం పొలం వద్ద విద్యుదాఘాతంతో యువకుడు మృతిమఠంపల్లి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం బక్కమంతలగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్కమంతలగూడేనికి చెందిన నిమ్మల నరేష్ (30) మంగళవారం ఉదయం పనుల నిమిత్తం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పొలం వద్ద విద్యుత్ వైరు తెగి పక్కనే ఉన్న ఫెన్సింగ్పై పడింది. ఇది గమనించని నరేష్ ఫెన్సింగ్పై చేయి పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 117 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, అధికారులు పాల్గొన్నారు. 10 వరకు ఎన్యూమరేషన్ పూర్తిచేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందున బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను ఈనెల 10 నాటికి వంద శాతం పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారంసూర్యాపేట కలెక్టరేట్ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు వెంటనే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి సర్కు సహకరించేలా అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఎన్నికల విభాగం నుంచి రాజేందర్రెడ్డి, భరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సమ్మె కాలం వేతనం చెల్లించాలి
సూర్యాపేటటౌన్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గతంలో విధులకు ఆటంకం కలగకుండా సమ్మె చేసిన కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలం వేతనం వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట మండలంలోని గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్య త్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇమాంపేట కేజీబీవీలో లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులు అనేక సమస్యలు, పని ఒత్తిడితో సతమతం అవుతున్నా ప్రభుత్వ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాస్టల్ వార్డెన్స్, కేర్ టేకర్స్ను వెంటనే నియమించాలన్నారు. అందరికీ కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రామ్సింగ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నాగన్న పాల్గొన్నారు. -
టీచర్లకూ ‘మధ్యాహ్నం’ ఉత్తర్వులు
సూర్యాపేట : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహారం (టీజీ బ్రేక్ఫాస్ట్), మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ జూలై 30న ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఇతర పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరికీ టీజీ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని జిల్లా, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పథకం అమలుకు అవసరమైన విధంగా ఎండీఎం (మిడ్ డే మీల్స్), టీజీ బ్రేక్ఫాస్ట్ పోర్టల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది భోజన వినియోగ వివరాలు నమోదు చేసేలా తగిన మార్పులు చేయాలని అదనపు ఎండీఎం డైరెక్టర్కు సూచించారు. ఈ ఉత్తర్వులను అన్ని సంబంధిత అధికారులు వెంటనే అమలు చేసి, ధ్రువీకరించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. జిల్లాలో 4,118 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం టీజీ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి విస్తరించడంతో జిల్లాలో సుమారు 4,118 మంది ఉపాధ్యాయులతో పాటు మరో 2వేల మంది బోధనేతర సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని 950 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండగా, సుమారు 4,118 మంది ఉపాధ్యాయులు, 2000 మందికి పైగా బోధనేతర సిబ్బంది, ఇకపై విద్యార్థులతో పాటు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి అదనపు భోజన సౌకర్యం కల్పించడంతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దశల వారీగా అమలు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి టీజీ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా, ముందుగా ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేసి, అనంతరం అందుబాటులో ఉన్న వసతులు, నిర్వహణ సౌలభ్యాన్ని బట్టి మిగతా జిల్లాలకు విస్తరించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ అమలు విధానం, ఎంపికయ్యే జిల్లాలు, తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ నుంచి పూర్తిస్థాయి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.పకడ్బందీగా అమలు చేస్తాం ఉపాధ్యాయులకు భోజనం, బ్రేక్ ఫాస్ట్కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు అవసరమైన సమయంలో భోజనం చేసుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం తినొచ్చు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రాగానే పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. – అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి భోజనంతోపాటు అల్పాహారమూ అందించేలా ప్రభుత్వం కార్యాచరణ బోధనేతర సిబ్బందికి సైతం వర్తింపు పథకం అమలుకు ఆదేశాలు జారీచేసిన విద్యా శాఖ -
ఇల్లు కట్టి చూడు..
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గతంలో ఇంటి మంజూరు కోసం నానా అవస్థలు పడగా.. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగినా బిల్లులు అందక అంతే తిప్పలు పడుతున్నారు. ప్రధానంగా చివరి బిల్లు కోసం కొందరు ఆరు నెలల నుంచి మరికొందరు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవైజీ) ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ నిధుల విడుదలలో జాప్యమవుతోంది. అప్పు చేసి ఇళ్ల నిర్మాణం ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.5 ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడత బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, రెండో విడత స్లాబ్ లెవల్లో రూ.లక్ష, మూడోవిడత స్లాబ్ పూర్తి కాగానే రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద రూ.1.60 లక్షలు ఇస్తుండగా.. దీన్ని చివరి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తూ స్లాబ్ పూర్తయిన తర్వాత ఇచ్చే రూ.2లక్షలను రూ.1.40 లక్షలుగా మార్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా.. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చు అధికంగా ఉండడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు బంగారం తాకట్టు పెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో అప్పులు చేసి మరి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే నిధులకు అదనంగా మరో రూ.5లక్షలకు పైగా వెచ్చిస్తే గానీ ఇంటి నిర్మాణం పూర్తికాలేదు. నెలలు గడుస్తున్నా ఖాతాల్లో నగదు జమచేయని ప్రభుత్వం పీఎంఏవైజీ నిధులు వస్తేనే బిల్లులు అందే అవకాశం 2 వేల మందికిపైగా లబ్ధిదారుల ఎదురుచూపుఈ చిత్రంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందినది. ఈ ఇంటి నిర్మాణం పూర్తయి ఆరు నెలలు కావొస్తోంది. దాదాపు రూ.13 లక్షల వరకు వెచ్చించి ఈ ఇంటిని లబ్ధిదారుడు నిర్మించుకున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.5 లక్షల్లో ఇప్పటి వరకు కేవలం రూ.3.40 లక్షలే లబ్ధిదారుడికి అందాయి. మిగతా రూ.1.60 లక్షలు బిల్లు కోసం వేచి చూస్తున్నాడు. జిల్లా అంతటా ఇందిరమ్మ గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులందరిదీ ఇదే పరిస్థితి నెలకొంది.2వేలకుపైగా గృహప్రవేశాలు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున జిల్లాకు 12,868 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2వేలకు పైగా ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు సైతం చివరి బిల్లు కోసం ఫోటోను ఆప్లోడ్ సైతం చేశారు. మరో 5వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అధిక భాగంగా ఇళ్లు స్లాబ్ పూర్తయి మరో నెలరోజుల్లో చివరి బిల్లు కోసం సిద్ధమవుతున్నాయి. 2025 జనవరిలో నిర్వహించిన గ్రామసభల్లో మండలానికో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 4,140 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తయి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. కానీ వారికి కూడా ఇప్పటి వరకు చివరి బిల్లు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చివరి బిల్లును మంజూరు చేయాలని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులు కోరుకుంటున్నారు. -
వృద్ధుడిని ఆప్యాయంగా పలకరించి సమస్య విని..
ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన నాయిని హనుమంతు అనే వృద్ధుడిని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆప్యాయంగా భుజం మీద చేయివేసి పలకరించి అతడి సమస్యను తెలుసుకున్నారు. దీంతో వృద్ధుడు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని తన పొలానికి వెళ్లేందుకు బాట లేదని, బాట సౌకర్యం కల్పించాలని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి బాట సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ -
5న బహిరంగ వేలం
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గల పాత పోలీసు కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు పోలీసు వాహనాల పాత బ్యాటరీలు, టైర్లు ఇతర పాత సామగ్రికి ఈ నెల 5న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సాహవంతులైన వ్యాపారులు నేరుగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు ఆర్ఎస్ఐ సురేష్ సెల్ 8712686019 నంబర్ను సంప్రదించాలని కోరారు.మట్టి నమూనాలపై అవగాహన అవసరంగరిడేపల్లి : మట్టి నమూనాలపై రైతులకు అవగాహన అవసరమని హైదరాబాద్ కు చెందిన చైతన్య టీం టు బి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు అన్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గరిడేపల్లి మండల కేంద్రంలో రైతులకు మట్టి నమూనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి, లహరి, వినీల, సీజ, జబీన్, అభివర్షరెడ్డి, శరణ్య, పలువురు, రైతులుపాల్గొన్నారు. శివయ్యకు పుష్పార్చనమేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పుష్పార్చన చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, గోపూజలు చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్దన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. శివగంగా లిప్టు ద్వారా సాగు నీరు విడుదలమేళ్లచెరువు : చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద కృష్ణానదిపై ఉన్న శివగంగా లిప్టు నుంచి సోమవారం సాగు నీటిని విడుదల చేశారు. లిప్టు చైర్మన్ గుడిసె వెంకట్రెడ్డి నీటి విడుదల కోసం స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వానలు లేక రైతులు అరకొర వేసిన మెట్టపంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో సాగునీటిని విడుదల చేశామన్నారు. దీంతో లిఫ్టు ఆయకట్టులోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రోక్తంగా నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు మహోత్సవం చేపట్టా రు. కల్యాణం నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు అన్నదానం చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, దుర్గాప్రసాద్శర్మ, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఐక్య ఉద్యమాలతోనే రైల్వేలైన్ సాధ్యం
సూర్యాపేట : ప్రజల సహకారం, ఐక్య ఉద్యమాలతోనే రైల్వేలైన్ సాధన సాధ్యమవుతుందని సూర్యాపేట రైల్వేలైన్ సాధన సమితి ప్రతినిధులు అన్నారు. సోమవారం సూర్యాపేటలోని ఆ సమితి కార్యాలయంలో రైల్వే సాధన సమితి ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకు రైల్వే మార్గం అత్యవసరమని, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కోకన్వీనర్లు డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర, రాచూరి ప్రతాప్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.రంగారెడ్డి, గౌరవ సలహాదారులు న్యాయవాది అయోధ్య, లింగంపల్లి భద్రయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ వి.రామ్మూర్తి, న్యాయవాదులు నూకల సుదర్శన్ రెడ్డి, తల్లమల్ల హసేన్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ వస్తువులు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని, నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాంపోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి ఒక్క బాధితుడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ నరసింహ -
పత్తిని ఆశించే పురుగులు.. నివారణ చర్యలు
పెద్దవూర: బీటీ పత్తిలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం, సేంద్రియ ఎరువుల వాడకంపై మొగ్గుచూపటం, అధికారులు సిఫారసు చేసిన పురుగు మందులను వాడకంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. యాజమాన్య పద్ధతులపై ఆయన పలు సూచనలు చేశారు. పూత పద్ధతిలో.. తొలి దశలో ఆశించే పురుగులను అదుపు చేయటానికి కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. 3 పర్యాయాలు 30, 45 రోజుల్లో మోనోక్రోటోఫాస్ 1:4(ఒక భాగం మందు, 4 భాగాలు నీళ్లు) నిష్పత్తిలో వాడాలి. తిరిగి 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో( ఒక పాళ్లు మందు, 20 పాళ్లు నీరు) వాడాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందుల పిచికారీ లేకుండా 70–80 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్ర పురుగుల సంతతి పెరిగి చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి. రసం పీల్చు పురుగుల నివారణకు 5 శాతం వేపగింజల కషాయం వాడాలి. కాయతొలుచు పురుగు ఆశించే దశ.. 60 నుంచి 90 రోజుల పంట దశలో పత్తి పైరులో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గరి నుంచి కాయతొలుచు పురుగులు ఆశించటం మొదలవుతుంది. ముఖ్యంగా తలనత్త, శనగ పచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులు పంటను వివిధ దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఎకరంలో 50 శాతం మొక్కల్లో కనీసం ఒక్కొక్క మొక్కను ఒక గూడ కంటే ఎక్కువ నష్టపోతే (పురుగు చేసిన రంధ్రంతో విచ్చుకున్న గూడలు) 5 శాతం వేపగింజల కషాయం పిచికారీ చేస్తే శనగపచ్చ పురుగు గుడ్లను, మొదటి దశ గొంగళి పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. బీటీ క్రిమి సంహారక మందులను బీటీ వంగడాలపై వాడకూడదు. వృక్ష మందులైన వేపగింజల కషాయం 5 శాతం లేదా 0.5 శాతం వేపనూనె లేదా 0.2 నుంచి 0.5 శాతం పిచికారీ చేయవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 1.0 మి.లీ. నోవల్యూరాన్ లేదా 1.0 మి.లీ. లూఫెన్యూరాన్ లేదా ఇమామెక్టీన్ బెంజోయోట్ను 0.5 మి.లీ. పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు ఆశించు దశ.. 90 నుంచి 120 రోజుల దశలో శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల నుంచి బీటీ పత్తిలో గూడ, పిందెలలో ఉండే బీటీ ప్రోటీన్ స్థాయి క్రమేపీ తగ్గుతూ ఉండటం వలన శనగపచ్చ పురుగుల నియంత్రణ తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ఏవైనా గొంగళి పురుగుల నష్టపరిమితి స్థాయి గమనిస్తే 1 లేదా 2 పర్యాయాలు క్రిమి సంహారక మందులు ఉపయోగించటం ద్వారా పురుగును అదుపు చేయొచ్చు. థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ. ను పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందులను 3మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ఫిప్రోనిల్ లేదా .03 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెనిథియురాన్ లీటరు నీటికి కలిపి వాడాలి. 120 రోజుల తర్వాత దశలో గులాబీ రంగు పురుగు పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టపరిమితి స్థాయిని గమనించి పత్తి పంటలో అక్కడక్కడా కొన్ని కాయలను కోసి తెరిచి చూడాలి. పది కాయలకు ఒక లార్వా ఉంటే నష్టపరిమితి స్థాయి అధిగమించినట్లుగా గుర్తించాలి. అవసరం మేరకు పంట చివరి దశలో ఒకటి లేదా రెండు పర్యాయాలు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయడం ద్వారా పురుగును నివారించవచ్చు. పెద్ద గొంగళి పురుగులను ఏరి నాశనం చేయాలి. పిండినల్లి నివారణకు ఎసిఫేట్ లేదా ప్రొఫెనోపాస్ మందులను వాడాలి. పంట విత్తిన వెంటనే 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించినట్లయితే ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. బుట్టలో 8 తల్లి రెక్కలు పడినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
రైస్ మిల్లులో అధికారుల తనిఖీ
చిలుకూరు: మండలంలోని రామాపురంలో ఉన్న రైస్మిల్లు, గోదాంలో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారంటూ శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీస్, సివిల్ సప్లై అధికారులు స్పందించారు. వారు రామాపురంలోని రైస్మిల్లుతో పాటు గోదాం, కోదాడ మండలం ద్వారకుంట ఆటోనగర్లోని రెండు గోదాంలు, చిలుకూరులోని రెండు గోదాంలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సీఎంఆర్ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ మోహన్, సవిల్ సప్లై డీటీసీఎస్ రాజశేఖర్, ఆర్ఐలు కృష్ణారెడ్డి, గిరిప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఐదుగురి అరెస్టు
పెద్దవూర : చైన్ స్నాచింగ్కు పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పేర్కొన్నారు. శనివారం ఆయన పెద్దవూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జె. గోపాల్రావుతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దవూర మండలం బెట్టెలతండాకు చెందిన బొమ్ము మరియమ్మ ఇంటికి గత నెల 1వ తేదీ మధ్యాహ్నం ఏపీలోని పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన దండగల యేసురాజు, షేక్ మబు సుభాని, బత్తుల లోకేష్, పల్లె ఝెలియజారఱ్, సయ్యద్ నాగుల్బాషా రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. తమకు భోజనం వండి పెడితే డబ్బులు ఇస్తామని చెప్పి.. మరియమ్మతో భోజనం వండించుకుని తిన్నారు. ఆ సమయంలో బెట్టెలతండాకు చెందిన కరంసింగ్ అక్కడికి రాగా అతడితో మాటలు కలిపి ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు కరంసింగ్ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సాగర్ వైపు తీసుకెళ్లారు. సమ్మక్క–సారలమ్మ జంక్షన్ వద్దకు వెళ్లగానే అతని సెల్ఫోన్ను లాక్కున్నారు. అక్కడి నుంచి తిరిగి మరియమ్మ ఇంటి వద్దకు వచ్చి ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్ను లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనాలు తనిఖీల్లో పట్టుబడి.. శనివారం మధ్యాహ్నం తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డు వద్ద పెద్దవూర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఆ ఐదుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై సాగర్ నుంచి పెద్దవూర వైపు వెళ్తున్నారు. వారు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు. విచారణలో భాగంగా మరియమ్మకు చెందిన రోల్డ్ గోల్డ్ చైన్ను, కరంసింగ్కు చెందిన సెల్ఫోన్ను అపహరించినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితులందరూ జల్సాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నట్లు సీఐ శ్రీనునాయక్ తెలిపారు. గతంలో గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్స్టేషన్లో లోకేష్, నాగూర్బాషా, సుభానీలపై దొంగతనం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు ద్వి చక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఫ రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం -
127 మంది బాలలకు వెట్టి నుంచి విముక్తి
సూర్యాపేటటౌన్ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా సూర్యాపేట జిల్లాలో 127 మంది బాల, బాలికలను వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఎక్కువ మంది పిల్లలకు విముక్తి కల్పించేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నెలరోజుల పాటు పోలీసులతో పాటు సంక్షేమ, బాలల పరిరక్షణ, లేబర్, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరాదరణకు గురైన వెట్టిలో మగ్గుతున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించినట్లు చెప్పారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 56 మంది, ఉండగా అందులో 52 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 71 మందిలో 65 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, మహిళా ఎస్ఐలు మౌనిక, నీలిమ, చైల్డ్ కేర్ అధి కారులు శ్రీలక్ష్మీ, ఉమామహేశ్వరి, నాగుల్మీరా, నాగరాజు, వంశీ, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఒత్తిడి లేకుండా పని చేయాలి పోలీసులు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది క్రమశిక్షణతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీలు రవి, ప్రసన్నకుమార్, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానయ్య, సీఐలు పాల్గొన్నారు.ఫ ముగిసిన ఆపరేషన్ ముస్కాన్ ఫఎస్పీ నరసింహ -
స్నేహితుల పేరుతో సైబర్ నేరాలు
ప్రస్తుతం స్నేహితుల ముసుగులో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతూ మెసేజ్లు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని సూర్యాపేట సైబర్ క్రైమ్ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఫ్రెండ్షిప్డే సందర్భంగా ఆన్లైన్లో ఫ్రెడ్స్ పేరుతో జరుగుతున్న మోసాలపై ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సూర్యాపేటటౌన్ : ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులు స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని, ఆ తర్వాత బహుమతులు, పెట్టుబడులు, అత్యవసర అవసరాలు, ప్రేమ పేరుతో డబ్బులు అడిగి మోసం చేసే ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, యూపీఐ వివరాలు ఇవ్వకూడదు. అనుమానాస్పద లింకులు, యాప్లు డౌన్న్లోడ్ చేయడం, తెలియని ఖాతాలకు నగదు బదిలీ చేయడం ప్రమాదకరం. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్ పెట్టుకోవడం, టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్న్ను తప్పనిసరిగా వినియోగించాలి. ఫ్రెండ్ రిక్వెస్ట్కు వెంటనే స్పందించొద్దు సామాజిక మాధ్యమాల్లో స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తాను ఆపదలో ఉన్నానని, డబ్బులు కావాలని అడుగుతూ మెసేజ్లు పంపుతున్న ఘటనలు ఈమధ్య చోటు చేసుకుంటున్నాయి. పరిచయం ఉన్న వ్యక్తి పేరుతో మెసేజ్ వచ్చినా నమ్మి వెంటనే డబ్బులు పంపవద్దని, అతడి నంబర్కు ఫోన్ చేసి ముందుగా నిర్ధారించుకోవాలి. 1930కు ఫిర్యాదు చేయాలి ఆన్లైన్లో, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్న్కు ఫోన్ చేయాలి, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. సమయానికి ఫిర్యాదు చేస్తే మోసగాళ్లు కాజేసిన డబ్బు అతను తీసుకోకుండా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చు. ఫ సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు అడిగితే పంపొద్దు ఫ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ఫ సైబర్ క్రైమ్ సీఐ లక్ష్మీనారాయణ -
నిజమైన సే్నహితులు కరువయ్యారా..!
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. ఇద్దరు యువకులు బైక్పై దైవ దర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దోస్త్.. మేరా దోస్త్ఐదుగురి అరెస్టు చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సాగర్ సీఐ శ్రీనునాయక్ తెలిపారు.- 8లోఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి నెట్వర్క్: రక్తసంబంధం కాకపోయినా.. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే ఆత్మబంధువే స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహానికి హద్దులుండవు. అవసరమైనప్పుడు ముందుడి నడిపించడమే కాకుండా వెనకుండి వెన్నుతట్టి నడిపించేవాడే స్నేహితుడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ హితుడు తప్పకుండా ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్నేహితుడి ప్రాధ్యాతను గుర్తిస్తూ.. ఆ బంధాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఐదు ముఖ్యపట్టణాల్లో వివిధ వయస్సులున్న 200 మంది అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. దీనిలో పలు ఆసక్తికలిగిన అంశాలు వెలుగు చూశాయి. స్నేహితుల దినోత్సవ సాక్షిగా నేడు నిజమైన స్నేహితులు కువయ్యారనే అభిప్రాయం కాస్తా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల ఎంపికలో డబ్బుకు, చదువుకన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనించదగ్గవ విషయం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో స్నేహితులతో గడిపే సమయం తక్కువైందని సాయంత్రం కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే స్నేహితులు కనుమరగయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 1. నేటి రోజుల్లో నిజమైన స్నేహితులున్నారని మీరు భావిస్తున్నారా? 2. స్నేహితుల ఎంపికలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు..? 61 లేరువ్యక్తిత్వానికిఅవును 903. స్నేహితుల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారా? 49ఫ స్నేహితుల ఎంపికలో వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఫ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కలుసుకోవడం తక్కువే.. ఫ ‘సాక్షి’ సర్వేలో వెల్లడి చదువుకు -
స్కూల్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారు
ఫ నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : పాఠశాలలో ఎంతో మంది స్నేహితులు ఉన్నా, ఇద్దరు మాత్రమే ఇప్పటికీ టచ్లోనే ఉన్నారని.. స్కూల్లో ఆటపాటలతో పాటు చదువులోనూ ముందుండే వాళ్లమని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుల గురించి ఆయన మాటల్లోనే.. ‘నేను పుట్టి, పెరిగింది సికింద్రాబాద్లోని వెస్ట్మారేడుపల్లి. అక్కడే మహేంద్ర హిల్స్లో ఆగ్జిలియం హైస్కూల్లో పదో తరగతి వరకు చదివాను. నాన్న బాలాజీ పవార్ డాక్టర్ కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. అమ్మ సుశీల, చెల్లి, నేను వెస్ట్మారేడుపల్లిలోనే ఉండేవాళ్లం. పదో తరగతి వరకు ఎంతో మంది స్నేహితులు ఉన్నా రఘు, శ్రీకాంత్ మాత్రం ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఎంతో అల్లరి చేస్తూ చదువుతో పాటు ఆటలు, పాటలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. నేను స్కూల్లో క్రికెట్ టీమ్కు కెప్టెన్గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అదే స్ఫూర్తితో ఐపీఎస్ అయ్యాను. అయినా మా దోస్తాన్ అలానే ఉంది. ఆనాటి రోజులు, చిన్ననాటి స్నేహితులను గుర్తుచేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.’ చిన్ననాటి స్నేహాలే స్వచ్ఛమైనవిఫ యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు యాదగిరిగుట్ట రూరల్ : స్నేహం మనిషి జీవితంలో ఒక అపురూపమైన బంధం. ప్రతీ సంవత్సరం నేను, నా చిన్ననాటి మిత్రులను కలుస్తుంటాను. నాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను, సాదకబాధకాలను ఒకరినొకరు పంచుకుంటాం. చిన్నప్పటి స్నేహాలు మాత్రమే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రస్తుతం చాలామంది స్నేహాలు గఅవసరాల కోసం ఏర్పరుచుకుంటున్నారు. చిన్ననాటి స్నేహాలు కాలం మారినా, దూరం పెరిగినా జీవితాంతం తోడుంటాయి. కష్టకాలంలో ప్రేమను, ఆపదలో సహాయాన్ని అందించే స్నేహాలే గొప్పవి. -
స్నేహితులంతా ఒక్కటై.. ఆపదలో తోడై
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాలలో 1985–86లో పదోతరగతి చదివిన వారిలో కొంతమంది 2025లో కలుసుకున్నారు. అదే ఏడాది ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని 120 మిత్రులు కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారికి ఆపదలో ఉన్న తమ తోటి మిత్రులను ఆదుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మిత్రులు చామకూరి గురుపాదం, ఆకుల రాము, గోపాల్దాసు వెంకటేశ్వర్లు, ముక్కా ధనేష్, జనిగ శ్రీను, నిడిగొండ భిక్షపతి, మహబూబ్ అలీ, చింత్రియాల వెంకటేశ్వర్లు, చింతకాయల కోటయ్య, ముడంబై దామోదరాచార్యులు కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆత్మీయ సమ్మేళనం కోసం సేకరించిన డబ్బులో రూ.లక్ష మిగలడంతో ఆ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. వాటిని ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకునేందుకు వినియోగించాలని సంకల్పించారు. అంతేకాకుండా ప్రతినెలా తమ స్నేహితుల్లో ఒక్కో వ్యక్తి కనీసం రూ.100 బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని తీర్మానం చేసుకున్నారు. అందులో నుంచి గోవిందపురానికి చెందిన తమ మిత్రుడు దివంగత గుజ్జుల శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహానికి 6 నెలల క్రితం రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. అంతేకాకుండా ఖమ్మంలో ఉంటున్న దివ్యాంగ మిత్రుడు కండె కష్ణారావుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడిని మిత్ర బందం పరామర్శించి తమ వంతు సాయంగా రూ.75 వేలు అందజేశారు. ఇటీవల మరో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లి రూ.10 వేలు అందజేశారు. ఇలా ఎవరికి ఏ ఆపద వచ్చినా వారిని గుర్తించి తోటి మిత్రులు ఆర్థికసాయం అందించి ఆదుకుంటున్నారు. ఆస్పత్రిలో ఉన్న తమ మిత్రుడికి ఆర్థికసాయం అందజేస్తున్న స్నేహితులు -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
ఫ బైక్ టైరుకు గుచ్చుకున్న మేకు ఫ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డుపై పడి ఇద్దరు యువకులు దుర్మరణం చిలుకూరు : ఇద్దరు యువకులు బైక్పై దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. వెనుక టైరుకు మేకు గుచ్చుకోవడంతో సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఎగిరి రోడ్డుపై పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామ పరిధిలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన గడ్డం లోకేష్ (19), ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటకు చెందిన చల్లా అనిల్(20) దగ్గర బంధువులు. గడ్డం లోకేష్ షేర్మహ్మద్పేటలో అనిల్ ఇంట్లో ఉంటూ వైద్యశాలలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం వారిద్దరు షేర్మహ్మద్పేట నుంచి బైక్పై సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనమైన తర్వాత తిరిగి షేర్మహ్మద్పేటకు వెళ్తుండగా... చిలుకూరు గ్రామ పరిధిలోని లారీ అసోసియేషన్ వద్దకు రాగానే వారి బైక్ వెనుక టైరుకు మేకు గుచ్చుకుంది. దీంతో టైరు పంక్చర్ అయినట్లు గుర్తించి సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు గడ్డం లోకేష్ తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. -
విద్యార్థులు కష్టపడి చదవాలి
నడిగూడెం : విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల రిజిస్టర్లను, కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉన్నారని, కార్పోరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ తరగతులు కూడా బోధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కళాశాలకు నిత్యం హాజరు కావాలని సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ డి.విజయ్ నాయక్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. ఫ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి -
వణికిస్తున్న వైరల్ జ్వరాలు
సూర్యాపేటటౌన్, హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా ప్రజలను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి పెరిగింది. ఔట్ పేషెంట్ల సంఖ్య గతంతో పోల్చితే 50శాతం పెరిగింది. రక్తపరీక్ష కిట్ల కొరతతో ఆసుపత్రికి వచ్చిన రోజే రిపోర్టులు ఇవ్వడం లేదని, రెండు రోజుల సమయం పడుతుందని రోగులు వాపోతున్నారు. మందులు కూడా అన్ని ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి రోగుల క్యూ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వస్తున్నారు. రోజుకు 1100 మందికి పైగా ఓపీ నమోదవుతుండటంతో ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. రోగుల్లో చాలామందికి డెంగీ, టైఫాయిడ్ అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్యులు రక్త పరీక్షలు సూచిస్తున్నారు. ఆస్పత్రిలో డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణకు అవసరమైన కిట్లు సరిపడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఒకరోజు తర్వాతే రిపోర్ట్లు సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో రక్త నమూనాలు ఇచ్చిన వారికి అదేరోజు ఫలితాలు అందడం లేదు. రిపోర్టు కోసం ఒక రోజు వేచి చూడాల్సి వస్తోంది. దాంతో చికిత్స ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఉదయం 9.15గంటలకు రావాల్సి ఉండగా 11గంటల వరకు వస్తున్నారు. దాంతో ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. ఈసీజీ, ఎక్స్రే మిషన్లు ఒక్కొక్కటే ఉండటంతో రోగులు క్యూ కట్టాల్సి వస్తున్నది. వైద్యుల పోస్టులు ఖాళీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలు డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కొందరు బదిలీ కాగా ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. రెండు గైనకాలజిస్టులు, ఒక జనరల్ మెడిసిన్, రెండు రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఈఎన్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఫ పెరిగిన మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులు ఫ ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి ఫ పరీక్షల కిట్లు లేక రోగ నిర్ధారణకు రెండు రోజుల సమయం ఫ వసతులు, వైద్యుల కొరతతో తప్పని అవస్థలుతేదీ ఓపీ ఐపీ జూలై 27 1130 82 28 1017 60 29 1100 70 30 1030 50 31 1100 65 ఆగస్టు 1 1050 60మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో సూర్యాపేట ఆసుపత్రికి వచ్చాను. వైద్యులు రక్త పరీక్షలు చేశారు. రక్త కణాల సంఖ్య తగ్గిందని, వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. వైద్యులు మంచిగానే చికిత్స అందిస్తున్నరు. – ఎ.శ్రీను, గాయంవారిగూడెం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. వంద పడకల ఆస్పత్రిలో దాదాపు 35 మంది వరకు వైద్య నిపుణులు ఉండాలి. ప్రస్తుతం 15 మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈఎన్టీ, కంటి పరీక్షల పరికరాలు, శస్త్రచికిత్సల పరికరాలు అందుబాటులో లేవు. ల్యాబ్లో వివిధ పరీక్షలు చేసేందుకు సరిపడా పరికరాలు లేక సేకరించిన నమూనాలను సూర్యాపేట టీ హబ్కు పంపుతున్నారు. సీటీ స్కాన్ కేంద్రం ప్రారంభించినప్పటికీ రేడియోలజిస్ట్ లేక ఫలితం లేకుండా పోయింది. బ్లడ్ స్టోరేజీ సెంటర్ ప్రారంభించినప్పటికీ పరికరాలు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. రోగులకు అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సి వస్తోంది -
పాత అలైన్మెంట్ కొనసాగించాలి
హైదరాబాద్ చైన్నె హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ముందు ప్రకటించినట్లుగానే నేషనల్ హైవే 65 వెంటే మార్గాన్ని నిర్మించాలి. భూ సేకరణ కూడా తక్కువగా ఉండటం వల్ల ఖర్చు తగ్గుతుంది. సూర్యాపేటను కాదని బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ఆరుట్ల జానకిరెడ్డి, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ హైస్పీడ్ ట్రైన్ అలైన్మెంట్ను ఇంతకుముందు ఉన్నట్లుగానే కొనసాగించాలి. సూర్యాపేటకు రైల్వే లైను తీసుకురావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని విస్మరించడం మంచిది కాదు. జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం – డేగల జనార్దన్, రైల్వే సాధన సమితి కన్వీనర్ -
స్నేహం.. దేవుడిచ్చిన వరం
● భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి శాలిగౌరారం : మనిషి జీవితంలో దేవుడు ఇచ్చిన అత్యంత విలువైన వరాల్లో స్నేహం ఒకటని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం గురించి ఆయన మాటల్లోనే.. ‘బాల్యం నుంచి జీవిత ప్రయాణంలోని ప్రతీ దశలో మనతో పాటు నడిచే స్నేహితులు మనకు గొప్ప బలం. వారితో గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మనం ఎక్కడ ఉన్నా నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. నిజమైన స్నేహం విశ్వాసం, నిజాయితీ, గౌరవం, పరస్పర సహకారంతో నిర్మించబడుతుంది. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా బాల్య స్నేహితులకు, స్కూల్ మిత్రులకు, వ్యక్తిగత మిత్రులకు, నా రాజకీయ ప్రయాణంలో నాతో కలిసినడుస్తున్న ప్రతీ మిత్రుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ -
అనుమతుల్లేకుండా వైద్యం
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి కొందరు అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ ల్యాబ్లు, పడకలు ఏర్పాటు చేసి అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తిరుమలగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అధికారుల తనిఖీల్లో విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆస్పత్రిలోనే ఆల్ట్రా సౌండ్ మిషన్, ఇతర పరికరాలను సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సదరు దవాఖాన అనుమతి కూడా ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తునట్లు తేలింది. అర్హత లేకుండానే వైద్యం అందిస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధం అయినప్పటికీ డబ్బులకు ఆశపడి కొద్ది మంది ఈ ప్రాంతంలో పరీక్షలు చేసి జనగామ, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అబార్షన్లు చేపిస్తున్నారని సమాచారం. వారం రోజుల క్రితమే జనగామ జిల్లాలో ఓ మహిళకు గర్భస్రావం చేస్తుండగా తల్లి మరణించిన ఘటన వెలుగు చూసింది. నామ మాత్రంగా తనిఖీలు పట్టణాలతో పాటు మండల కేంద్రాలలో ఇలాంటి ఆస్పత్రులు వెలుస్తున్నా వైద్యశాఖ అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి తీసుకొని ఆస్పత్రిలోనే ల్యాబ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొంత కాలం పని చేసిన వ్యక్తులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లుగా అవతారం ఎత్తుతున్నారు. అరకొర వైద్యం అందిస్తూ ప్రాణాల మీదికి వస్తే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా వైద్యశాలను ఏర్పాటు చేయకూడదు. – వెంకటరమణ, డీఎంహెచ్ఓ ఫ తిరుమలగిరిలో ప్రైవేటు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు ఫ చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ ఫ తనిఖీలు లేక యథేచ్ఛగా నిర్వహణ -
కోదాడను మోడల్ కోర్టుగా తీర్చిదిద్దుతాం
కోదాడరూరల్ : కోదాడ కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దేంకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం కోదాడ కోర్టు భవన నిర్మాణ పనులను జిల్లా ఒకటవ అదనపు జడ్జి శివరాంప్రసాద్తో కలిసి పరిశీలించారు.పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కోర్టు హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని, అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల డిజటలైజేషన్ను వేగవంతం చేసి, వ్యాజ్యదారులకు సత్వర న్యాయం అందిలా కోదాడ కోర్టును ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సబ్ జడ్జి సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, రామిశెట్టి రామకృష్ణ, జానిపాషా, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటంసూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం ఆఫీస్లో నిర్వహించిన సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, పోసనబోయిన హుస్సేన్, జంపాల స్వరాజ్యం, జిల్లా ఆఫీస్ బేరర్స్ సిరికొండ శ్రీను, సోమ పంగు జానయ్య, కడెంకుమార్ పాల్గొన్నారు. చెట్టును నరికినందుకు రూ.2వేల జరిమానాసూర్యాపేట అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని ఏపూరు బస్టాండ్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్డుపై ఉన్న చెట్టును నరికిన వారికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చెట్టును నరికిన ఇంటి యజమాని వేణుగోపాల్కు రూ.2వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, వార్డు అధికారి రాజేశ్వరి, సిబ్బంది నవీన్, జాకబ్, రమేష్, మల్లేష్, పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యానాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్
హుజూర్నగర్ : మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం హుజూర్నగర్లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ డీఏపీ బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు మండలంలోని రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావులకు సంబంధించి డీఏపీ తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 బస్తాల నకిలీ డీఏపీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లా లింగనవాయికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రం విజయపురిజిల్లా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, మారుతి కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ బస్తాలు, మిషన్, నకిలీ పాస్పేట్, రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీ నం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి -
సీఎంఆర్ ధాన్యం పక్కదారి
చిలుకూరు : ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యం పక్క దారి పడుతోంది. ప్రభుత్వ ధాన్యాన్ని చిలుకూరులోని మిల్లుల్లో స్టాక్ పెడితే సదరు మిల్లు యాజమాన్యం ఏకంగా లారీల్లో బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మండలంలోని నారాయణపురం, చిలుకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు మండలంలోని రామాపురం గ్రామంలోని రైస్ మిల్లుకు అప్పగించారు. మిల్లు నిర్వాహకులు చిలుకూరులో ఒక గోదామును కిరాయికు తీసుకొని స్టాక్ వేశారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా ధాన్యం రేటు (77.50 కేజీలపై) సుమారుగా రూ. 3 వేల వరకు ఉంది. దాంతో సదరు మిల్లు నిర్వాహకులు ప్రభుత్వ ధాన్యాన్ని ఇతరులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో గోదాము నుంచి 2 లారీల ధాన్యం బయటి వ్యక్తులకు అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం అడిగిన సమయంలో తక్కువ ధరకు లభించే ధాన్యం కొనుగోలు చేయడమో, లేదా ఏదో ఒక రకం బియ్యాన్ని పంపి లెక్కలు చూపించుకుంటురని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యు, సివిల్ సప్లై అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రూ.3.8 కోట్ల ధాన్యం మాయం మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు పరిధిలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్యేశ్వర మోడ్రన్ రైస్మిల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.3.8 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. అసలు ఉండాల్సిన ధాన్యంలో 2050.280 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు గుర్తించిన అధికారులు మిల్లు యజమాని వై.రమేష్పై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఉమ్మడి నల్లగొండ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సీఐ గౌస్, డీసీఎస్ఓ మోహన్బాబు, డీటీసీఎస్లు రాజశేఖర్, గిరిప్రసాద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఫ గోదాములో నిల్వ ఉంచిన ధాన్యం అమ్ముకుంటున్న మిల్లర్లు ఫ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజ బోయిన సుమన్, ప్రధాన కార్యదర్శి పరాల సాయి, గణేష్. శివ చరణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా భానుపురి (సూర్యాపేట) : పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే బకాయిలను విడుదల చేయకపోతే సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్చారి జనసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్యాదవ్, టీఆర్వీఎస్ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి సాయితేజ, నాయకులు యశ్వంత్, మనోజ్, ఉమేష్, చింటు రమ్య, లక్ష్మీ, ప్రణవి, నరేష్, సతీష్, శశిప్రీతం తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
విచారణ లేకుండా సస్పెండ్ చేయడం అన్యాయం
హుజూర్నగర్ : బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఇటీవల జరిగిన శస్త్ర చికిత్సల అనంతరం కొంత మంది ఇన్ఫెక్షన్కు గురికావడంతో సరైన విచారణ లేకుండా ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయడం, కాంట్రాక్ట్ వైద్యుడిని సర్వీసెస్ నుంచి తొలగించడం అన్యాయమని హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయరాణి అన్నారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఏరియా హాస్పిటల్ వద్ద వైద్యులు, సిబ్బందితో కలిసి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలతో సిబ్బంది ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారిని మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వారికి టీవీవీపీ జాక్ సభ్యులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రవి కుమార్, రాజేష్, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. -
తిరుమలగిరిలో ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
తిరుమలగిరి (తుంగతుర్తి) : నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తిరుమలగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిని జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ హాస్పిటల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈమేరకు ఆల్ట్రా సౌండ్ మిషన్తో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించి, ఆస్పత్రిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పీసీపీఎన్డీటీ పీఓ డాక్టర్ నజియా తబస్సుమ్ తెలిపారు. ఆమె వెంట ఎస్ఓ ఎంఏ బాసిత్, డిప్యూటీ డీఈఎంఓ సంజీవరెడ్డి, ఏఎస్ఓ మత్స్యగిరి, శర్మ, ఉపేందర్, శంకర్, రామచంద్రు తదితరులున్నారు. ఆస్పత్రి పరిశీలన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ హెచ్చరించారు. గురువారం తిరుమలగిరిలో సీజ్ చేసిన ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డాక్టర్ నజియా తబస్సుమ్, ఎస్ఓ ఎంఏ బాసిత్, డిప్యూటీ డీఈఎంఓ సంజీవరెడ్డి, ఏఎస్ఓ మత్స్యగిరి, శర్మ, ఉపేందర్, శంకర్ వెద్య సిబ్బంది ఉన్నారు. -
లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, పంచామృభిషేకం చేపట్టారు. నిత్య కల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల సంవాదం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ జరిపించి, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఈఓ చలపతి రావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులు ఓటు హక్కు కోల్పోవద్దు
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట నియోజకవర్గంలో అర్హులెవరూ ఓటు హక్కును కోల్పోవద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మిగిలిపోయిన అర్హులైన ఓటర్లు ఉంటే వారిని గుర్తించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్లు ఏబీ శ్రీనివాస్, శ్రీనివాస్, పీసీసీ కో ఆర్డినేటర్ అన్సారీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజల ఓటుహక్కు కోల్పోకుండా పనిచేశారు హుజూర్నగర్ : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రజల ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ బీఎల్ఏలు పనిచేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై బీఎల్ఏలు, సూపర్ వైజర్లతో గురువారం హుజూర్నగర్లోని మంత్రి ఉత్తమ్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూర్నగర్లో ఇప్పటి వరకు 90.5.7 శాతం, కోదాడలో 90 శాతం ఎస్ఐఆర్ పూర్తయిందన్నారు. సమావేశంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, నల్గొండ పార్లమెంట్ ఎస్ఆర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, కోదాడ నియోజక వర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అన్సారి, హుజూర్నగర్ నియోజకవర్గ ఈఆర్ఓ చిలక కిషోర్ పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ -
లిఫ్ట్లను రైతులు సొంత ఆస్తిగా భావించాలి
హుజూర్నగర్ : పొలాలకు సారు నీరందించే లిఫ్ట్లను రైతులు తమసొంత ఆస్తిగా భావించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. లిఫ్ట్ల నిర్వహణపై గురువారం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని రైతులు, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ అధికారులతో కలిసి హుజూర్నగర్లోని టౌన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్లను రైతులు తమ సొంత ఆస్తిగా భావించి రక్షించుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాల కోసం, సాగునీటి లిఫ్టుల్లో దొంగతనాల నివారణకు అన్ని శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ నరసింహను, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎమ్మెల్యే అభినందించారు. చోరీలు జరిగితే నష్టపోయేది రైతాంగమే.. లిఫ్ట్ ఇరిగేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, వైర్లు, ఆయిల్ దొంగతనానికి గురైతే తీవ్రంగా నష్టపోయేది రైతాంగమేనని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. దొంగతనాలు జరిగాక పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తున్నారని, అయితే దొంగతనాలు జరగకుండా ముందస్తుగా అడ్డుకోవడమే ముఖ్యమని అన్నారు. లిఫ్ట్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి లిఫ్ట్ పరిధిలో రైతులు సహకార సొసైటీలు, కమిటీలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించుకోవాలన్నారు. రైతు కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రజల్లో ఐకమత్యం, సామాజిక బాధ్యత పెరిగినప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. పోలీసు శాఖ తరఫున లిఫ్టుల వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సూర్యనారాయణ, నీటిపారుదల సీఈ నాగభూషణం, విద్యుత్ డీఈ రామ్మోహన్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చరమందరాజు, తహసీల్దార్ కవిత, నీటిపారుదల, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి -
ముందస్తు ప్రణాళికతో సాధన ప్రారంభించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో సాధన ప్రారంభించాలని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దని హెచ్చరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. వీ బీజీ రామ్జీ పనుల నిర్వహణపై ఆరా మోతె: మండల కేంద్రంతోపాటు హుస్సేన్బాద్ గ్రామాన్ని డీఆర్డీఓ సన్యాసయ్య గురువారం సందర్శించారు. మోతెలో వీ బీజీ రామ్జీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి హాజరు పట్టిక, రికార్డులు తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న వీ బీజీ రామ్జీ పథకం పనుల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు సరైన పద్ధతిలో రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని కూలీలకు సూచించారు. అనంతరం మోతె నర్సరీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సందీప్కుమార్, ఈసీ శ్రీహరి, టీఏలు ఉన్నారు. మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాస్ భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సుంకరి శ్రీనివాస్ నియామకమయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో డీఎం సునీతకు తన నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారులు విప్లవ రెడ్డి, చెరుకు వెంకటయ్య, డిపో అధ్యక్షుడు భాను, కార్యదర్శి మాచర్ల భాస్కర్, నాయకులు ఘని, అనిల్కుమార్, వీరయ్య, జానయ్య, ఎంఆర్ స్వామి సైదులు, డీఎస్ రావు, రవి, మహిళా సెక్రెటరీ నేతి సావిత్రి, లక్ష్మీ, సునీత పాల్గొన్నారు. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కేటాయించాలి సూర్యాపేట అర్బన్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లగుండ్ల శిరోమణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మట్లాడారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు అన్ని పాలకవర్గ పార్టీలు మనువాదాన్ని బలపరుస్తూ, మహిళలను రెండవ శ్రేణి పౌరులుగానే గుర్తిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి ఒంటికొమ్ము సంతోషిమాత, కోశాధికారి మోటకట్ల జయమ్మ, సభ్యులు ఐతరాజు పద్మ, కట్టా కల్పన పాల్గొన్నారు. -
120 సెకన్ల నిరీక్షణ.. 30 సెకన్ల ప్రయాణం
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ నివారణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్స్ టైమింగ్లో సరైన ప్రణాళిక లేక వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. కొత్త బస్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్లు లేకపోవడం, ప్రైవేట్ వాహనాల అక్రమ పార్కింగ్, ఆటోల విచ్చలవిడి రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టైమింగ్స్ తప్పులతడక.. ప్రస్తుత సిగ్నల్ విధానంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే సుమారు 2 నిమిషాలు వాహనాలను ఆపుతుండగా, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రం కేవలం 30 సెకండ్లు మాత్రమే సమయం ఇస్తున్నారు. దీంతో ముందున్న వాహనాలు కదిలేసరికి సమయం అయిపోవడంతో, వెనుక ఉన్నవారు మరోసారి ఆగాల్సి వస్తోంది. ఫలితంగా సిగ్నల్స్ పెట్టినప్పటికీ ట్రాఫిక్ తగ్గకపోగా మరింత పెరుగుతోందని వాపోతున్నారు. ముఖ్యంగా ఎంజీ రోడ్ నుంచి హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే మార్గాల్లో శ్రీఫ్రీ లెఫ్ట్శ్రీ సౌకర్యం లేకపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయని పేర్కొంటున్నారు. స్పందించాలని విజ్ఞప్తి పట్టణ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా ట్రాఫిక్ నిర్వహణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ అధికారులు స్పందించి.. సిగ్నళ్ల వద్ద అన్ని వైపులా ఫ్రీ లెఫ్ట్లను ఏర్పాటు చేయాలని, అక్రమ పార్కింగ్లు, నిబంధనలు ఉల్లఘించే ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్పై కఠిన చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేటలో ట్రాఫిక్ అవస్థలు ఫ రెడ్, గ్రీన్ సిగ్నల్ టైమింగ్స్లో అసమతుల్యత ఫ ఫ్రీ లెఫ్ట్ల కొరత, అక్రమ పార్కింగ్తో ఇబ్బందులు రద్దీతో ఉక్కిరిబిక్కిరి.. కొత్త బస్టాండ్ నుంచి ఖమ్మం, నల్లగొండ, హన్మకొండ, వరంగల్తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు జంక్షన్ల వద్ద రద్దీని మరింత పెంచుతున్నాయి. ఇక బస్టాండ్ ప్రధాన ద్వారం వద్దే ఆటోలను అడ్డగోలుగా నిలిపివేయడంతో బస్సులు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరోవైపు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం వల్ల ఫ్రీ లెఫ్ట్లు ఉన్నా వాహనాలు ముందుకు కదలని దుస్థితి నెలకొంది. ఇక.. సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోవడంతో వర్షం వస్తే ద్విచక్ర వాహనదారులు పూర్తిగా తడిసిముద్దవుతున్నారు. ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్న పిల్లలు, వృద్ధులు వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. -
7న ఓబీసీ జాతీయ మహాసభ
భానుపురి (సూర్యాపేట) : బెంగళూరులో వచ్చేనెల 7న జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఓబీసీ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమళ్ల నర్సింహ కోరారు. గురువారం సూర్యాపేటలో పూలే విగ్రహం వద్ద ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో సభ వాల్ పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో జనాభా లో 50 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు 50 శాతం కల్పించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు బిల్లు పెట్టాలని, కేంద్రం చట్టసభల్లో మహిళలకు ఇచ్చే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని చర్చించి తీర్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు బూర మన్సూర్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణగౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, తండ అంజయ్య గౌడ్, కందాల భాస్కర్, కోడి లింగయాదవ్, యేలే సత్యనారాయణ, యేలుగురి రామ్మూర్తి గౌడ్, వెంకన్న, విజయ్కృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాంబాబు, నాగేందర్ పాల్గొన్నారు. -
వర్క్ అడ్జస్ట్మెంట్లను రద్దుచేయాలి
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్లను జీఓ 25కు భిన్నంగా చేస్తున్నారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డీటీఎఫ్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం మాట్లాడుతూ.. ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రైమరీ పాఠశాలలకే వర్క్ అడ్జస్ట్ చేయాల్సి ఉండగా ఉన్నత పాఠశాలల్లో తెలియని సబ్జెక్టులను బోధించేందుకు అడ్జస్ట్ చేస్తున్నారని, వీటిని రద్దు చేయాలని కోరారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
చిలుకూరు: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం చిలుకూరు పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు పోలీస్స్టేషన్లో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ చేసి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. పోలీస్స్టేషన్లో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ముందుగా ఎస్పీకి పోలీసులు స్వాగతం పలికారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ మోహన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రాంబాబు, మేళ్లచెర్వు ఎస్ఐ నవీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
‘సర్’కు రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి(సూర్యాపేట), తుంగతుర్తి : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా, తప్పుల్లేకుండా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్తోపాటు తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన వేర్వేరు సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని, ఫారాల డిజిటలైజేషన్ ప్రస్తుతం 98.77 శాతానికి చేరుకుందని తెలిపారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ప్రేమ్రాజ్, వివిధ పార్టీల నాయకులు రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండి హబిద్, ఎం.స్టాలిన్, ఎస్.సత్యనారాయణ, కరుణాకర్రెడ్డి, కోట గోపి, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తిలో జరిగిన సమావేశంలో డీటీ కంఠమయ్య, కార్యాలయ సిబ్బంది మహేష్, శ్రవణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ -
అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్
సూర్యాపేటటౌన్ : ప్రజల్లో అవగాహన, అప్రమత్తతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ వారియర్ సిబ్బంది, పోలీసు అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలపై వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేసి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. బాధితులు మోసపోయిన డబ్బును సాధ్యమైనంత త్వరగా వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలని సూచించారు. దీనికోసం బ్యాంకులు, కోర్టు అధికారులతో తగిన సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారాయని, సిబ్బంది ప్రతి కేసును ఎంతో బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. సమావేశంలో సైబర్ వారియర్ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
విద్యాపరంగా జిల్లాను అగ్రగామిగా నిలపాలి
సూర్యాపేటటౌన్ : ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను విద్యాపరంగా అగ్రపథాన నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న మూడు రోజుల సమగ్ర వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో సూర్యాపేట జిల్లా ప్రచేష్ట–1లో స్థానాన్ని సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యా శాఖ బృందాన్ని అభినందించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్యాధార బోధన, ప్రయోగాలు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.అశోక్, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, రేణుక, సెంటర్ ఇన్చార్జి నాగరాణి, జిల్లా రిసోర్స్ పర్సన్లు శ్రీహరి శ్రవణ్, సత్యనారాయణరెడ్డి, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఈసారి ఎస్సారెస్పీ నీళ్లు రావు
అర్వపల్లి : తుంగతుర్తి నియోజకవర్గంలో పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అయితే 2019 నుంచి రెగ్యులర్గా గోదావరి జలాలను వదులుతున్నారు. దీంతో రైతులు ఎన్నో ఏళ్లుగా పడావుపడిన భూములను సాగులోకి తెచ్చారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్లో ప్రాజెక్టు రెండో దశ కాల్వలకు నీళ్లు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సీజన్లో గోదావరి జలాలు వచ్చే అవకాశం లేనట్టుగా స్పష్టమవుతోంది. ప్రాజెక్టు చరిత్రలో పంటల సాగుకు నీరివ్వకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆ శాఖ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయకట్టు గ్రామాల్లోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టునియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, మద్దిరాల, నాగారం మండలాల్లో ఎస్సారెస్పీ రెండోదశ కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలు అందుతుండడంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కానీ, ఈసారి సాగు ప్రశ్నార్థకంగా మారింది.నీళ్లు ఇవ్వలేం ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు అనుబంధ రిజర్వాయర్లలో తగినన్ని నీళ్లు లేనందున ఈసీజన్లో పంటలకు సాఉనీళ్లు వదలలేం. రైతులు గమనించి సహకరించాలి. ఈ విషయమై నియోజకవర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. – సత్యనారాయణ, నీటి పారుదల శాఖ, ఈఈ అడుగంటిన ప్రాజెక్టు రెండోదశ కాల్వలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఆందోళనలో ఆయకట్టు రైతాంగం -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుదవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్యం కల్యాణం జరిపి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కేఎల్ఎన్ ప్రసాద్కు సినారె పురస్కారంకోదాడరూరల్ : కోదాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, తెలంగాణ గౌడ సంఘాల నాయకుడు కేఎల్ఎన్ ప్రసాద్ను జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జాతీయ పురస్కారం వరించింది. బుధవారం హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో నిర్వహించిన సినారె జయంతి సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్కు కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. కేఎల్ఎన్ యువసేన ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ వార్డును అందించారు. కేఎల్ఎన్ను సన్మానించి అభినందించారు. మట్టపల్లి హుండీ ఆదాయం రూ.13.17లక్షలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలను బుధవారం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కె.భాస్కర్ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ చలపతిరావు మాట్లాడుతూ 78 రోజులకు గాను రెగ్యులర్ హుండీల ద్వారా రూ.12,40, 040 ఆదాయం రాగా అన్నదాన హుండీ ద్వారా రూ.77,920తో కలిసి మొత్తం రూ.13,17,960 ఆదాయం వచ్చినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడిట్ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలిఅనంతగిరి : పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఆడి ట్ అధికారి శ్యాంసుందర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన అనంతగిరి మండల పరి షత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 2022–23, 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలు ఎందుకు పూర్తి కాలేదని గ్రామ కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్కు గల కారణాలను నివేదించాలని సూచించారు. -
చిత్తడిగా భానుపురి రోడ్లు
సూర్యాపేటటౌన్ : ఒక చినుకు వర్షం పడితే చాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రహదారులు బురదమయంగా మారుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పైప్లైన్ పనుల కోసం తవ్విన గుంతలను మట్టితో పూడ్చినప్పటికీ సీసీ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా మట్టి రోడ్లలన్నీ బురదమయంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా పట్టించుకోవట్లే!ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టారు. పనులు ముగిసిన చోట వెంటనే రోడ్లను యధాస్థితికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ, నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చిరుజల్లులకు సైతం మట్టిరోడ్లన్నీ బురదతో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్కు ఆటంకం కలగడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని కాలనీల్లోనూ ఇదే సమస్యసూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు చెందిన రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్వి పైపులు వేసి పూడ్చారు. అనంతరం మట్టి రోడ్లపై సీసీ వేయలేదు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొనడంతో ప్రజలు సంబంధిత శాఖల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లపై సీసీ లేదా డాంబర్ వేయించి తమ ఇబ్బందులు తీర్చాలని పట్టణవాసులు కోరుతున్నారు.యూజీడీ పనులతో పట్టణ రోడ్లు అధ్వానం గుంతలు పూడ్చి సీసీ నిర్మాణాలు చేపట్టని కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో వాహనదారులు, పాదచారులు -
కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా
పాలకవీడు : ఒక్కసారి రైతుకు కష్టం వస్తే ఆదుకోలేరా అంటూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్నిన్ ప్రభావాన్ని సాకుగా చూపిస్తూ కరెంటు కోతలు విధిస్తున్నారంటూ బుధవారం పాలకవీడు సబ్స్టేషన్ వద్ద బీఆర్స్ నాయకులు రైతులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించాలరని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 10 గంటల కరెంటు సరఫరా చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని, కోతల వల్ల విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. కోతలు లేకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్ఎస్ నాయకులు పెరుమాల్ల సతీష్, మంద నాగయ్య, యరడ్ల గణపతిరెడ్డి, హరినాయక్, సైదిరెడ్డి, కొండలు, బాలరాజు, వీరబాబు, కోటేశ్వరరావు, వెంకన్న, నరేష్, మధు, అఖిల్రెడ్డి, రవి, మరియదాసు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్యం అందించాలి
నేరేడుచర్ల : నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాన్పు కోసం వచ్చే వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని లెప్రసీ, టీబీ వాధ్యుల నివారణ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ అన్నారు. బుధవారం ఆయన నేరేడుచర్ల పీహెచ్సీని తనిఖీ చేశారు. గదులు, రికార్డులను పరిశీలించి రోగులను వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవం చేసిన మండల వైద్యాధికారిని పున్నా నాగిని, సిబ్బందిని అభినందించారు. వారి వెంట సీహెచ్ఓ సల్వాది శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం సునిత ఉన్నారు. -
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
మేళ్లచెరువు : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కవాతు, వారి యూనిఫాం, పరికరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు నవీన్కుమార్, మోహన్, రాంబాబు, సిబ్బంది ఉన్నారు. ఇంకుడు గుంతలతో జల సంరక్షణపెన్పహాడ్ : ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా జలసంరక్షణలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ‘జలసిరి’ కార్యక్రమంపై ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రాజశేఖర్రెడ్డి, ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ రాజేశ్వర్, ఏపీఓ రవి, ఏఓ అనిల్కుమార్, మండల వైద్యాధికారి రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలనభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఖాళీగా ఉన్న 67 అంగన్వాడీ టీచర్లు, 64 హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.నరసింహరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు సెట్ల జిరాక్స్లతో హాజరు కావాలని కోరారు. లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: Ð]l$rtç³-ÍÏ ÌSMîS-ÿ¯]l-Æý‡-íÜ…çßæ-ÝëÓ-Ñ$ BÌS-Ķæ$…-ÌZ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÝëÓÑ$ÐéÇ °™èlÅ-MýS-ÌêÅ-×ê°² AÆý‡a-MýS$-Ë$ OÐðl¿ýæ-Ð]l…-V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BÌS-Ķæ$…-ÌZ ÝëÓÑ$ÐéÇ Ð]lÊÌS-ÑÆ>sŒæMýS$ ç³…^éÐ]l$–-™éÀ-õÙMýS… ^ólÔ>Æý‡$. MýSÌêÅ-׿ Ðólyýl$-MýS-ÌZ ¿êVýS…-V> ÑÔèæÓ-MóSÞ-¯éÆ>«§ýl¯]l, ç³#׿Åçßæ-Ð]l-^èl¯]l…, Æý‡„>-º…«§ýl¯]l…, Æý‡$†ÓVýSÓ-Æý‡×æ…, Ð]l$«§ýl$-çœÆý‡P-ç³Nf, Ð]l*…VýS-ÌS-Å«§é-Æý‡-׿, ™èlÌS…{»ê-ÌS-™ø OÐðl¿ýæ-Ð]l…-V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ BÌSĶæ$ A¯]l$-Ð]l…-ÕMýS «§ýlÆý‡Ã-MýS-Æý‡¢-Ë$, DK, AÆý‡a-MýS$-Ë$, ¿ýæMýS$¢-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.˘ మహిళా సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నికహుజూర్నగర్ : జాతీయ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా కమిటీని హుజూర్నగర్లో జరిగిన మహాసభలో ఎన్నుకున్నట్లు సంఘం బాధ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా ఉప్పతల కోటమ్మ, ప్రధాన కార్యరద్శిగా దేవరం మల్లీశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐలాపురం లక్ష్మీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. వారిని పలువురు నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. ఉప్పతల కోటమ్మదేవరం మల్లీశ్వరి -
జర చూసి వెళ్లండి..
అర్వపల్లి: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారి (365బీ)పై జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వచ్చే వాహన దారులు గుంతను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోక పోవడంతో స్థానికులు గుంతపై కంపవేసి చుట్టూ రాళ్లు పెట్టారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.365 జాతీయ రహదారిపై రోడ్డు మధ్య ప్రమాదకరంగా ఉన్న గుంత -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
కోదాడరూరల్ : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం కోదాడ మండలంలోని అల్వాలపురం రైతు వేదికలో నిర్వహించిన మండల సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను రైతులకు వివరించి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరుతడి పంటల విత్తనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు, వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఎంపీడీఓ ఇసాక్హుస్సేన్, తహసీల్దార్ సంతోష్కిరణ్, ఏఓ పాలెం రజిని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అలసకాని శరభేశ్వరరావు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. రైతులతో మాట్లాడిన మంత్రి, కలెక్టర్నడిగూడెం : రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నడిగూడెం రైతు వేదికలో ఉన్న పలువురు రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ రైతునేస్తం ద్వారా వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ, మండల ప్రత్యేకాధికారి దామోదర్రెడ్డి, ఏడీఏలు జ్ఞానేశ్వరి దేవి, ప్రశాంతి, తహసీల్దార్ మంగ, ఎంపీడీఓ మల్సూర్, ఏఓ మల్సూర్, సర్పంచ్లు రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం
భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం బాలల సైన్స్ కాంగ్రెస్తో విద్యార్థుల్లో శాస్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలు, సృజనాత్మకత, పర్యావరణంపై బాధ్యత, సామాజిక సమస్యల పరిష్కారం సామర్థ్యం పెంపొందుతాయి. భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి విద్యార్థులకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య విద్యా సంస్థల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. – ఎల్.దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారిసూర్యాపేటటౌన్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, పరిశోధనా దృక్పథం, సమస్యను స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం బాలల సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నారు. జాతీయ శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో రాష్ట్ర సాంకేతిక మండలి, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులను ఈ పోటీల్లో భాగస్వాములు చేస్తున్నారు. వినూత్న ప్రయోగాలను రూపొందించేందుకు ఈ సైన్స్ కాంగ్రెస్ దోహపదపడనుంది. రెండు సంవత్సరాల తర్వాత సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. విజ్ఞాన ఆవిష్కరణలే ప్రధాన అంశం ఈ విద్యా సంవత్సరం నిర్వహించే బాలల సైన్స్ కాంగ్రెస్లో ‘సుస్థిర అభివృద్ధి కోసం విజ్ఞాన ఆవిష్కరణలు’ అనే అంశం ఆధారంగా ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఉపఅంశాలను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. ● వ్యర్థాలను తగ్గించడం, పుర్వినియోగించడం, తిరిగి పొందడం. ● శక్తిని అన్వేశించడం, ప్రయోగించడం, మెరుగు పర్చడం, పరిణామం చెందడం. ● నీటి సేకరణ, సద్వినియోగం, రీ– సైక్లింగ్, సంరక్షణ ● ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం ● సుస్థిర కోసం జాతీయ జ్ఞాన వ్యవస్థల అనువర్తనం ఒక్కో ప్రాజెక్టుకు ఇద్దరుసైన్స్ కాంగ్రెస్లో పాల్గొనేందుకు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ప్రాజెక్టుకు ఇద్దరు విద్యార్థులు, ఒక గైడ్ టీచర్ పర్యవేక్షణలో పని చేయాలి. శాసీ్త్రయ పద్ధతి ప్రాజెక్టులు కేవలం ప్రదర్శన నమూనాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపై సర్వేలు, ప్రయోగాలు, కేస్ స్టడీలు, ప్రశ్నావళి, డేటా విశ్లేషణ ఆధారంగా రూపొందించాలి. విద్యార్థులు స్వయంగా పరిశోధనలు చేసి ప్రాజెక్టు నివేదిక, లాగ్బుక్, ప్రదర్శన సామాగ్రిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తుగా రిజిస్ట్రేషన్విద్యార్థులు ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ఎన్సీఎస్ఈ.ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు పాల్గొనేలా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ప్రాజెక్టును రాష్ట్ర స్థాయికి, అక్కడ ఉత్తమంగా ఎంపికై తే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అక్టోబర్లో రాష్ట్ర స్థాయి, డిసెంబర్లో జాతీయ స్థాయి పోటీలు ఉండనున్నాయి. జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్కు దరఖాస్తులు ఫ ఆగస్టు 15 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఫ సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహణకు ఏర్పాట్లు ఫ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం -
రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమం
అనంతగిరి : సాగర్ ఎడమ కాల్వకు విడుదలైన నీటితో కోదాడ చెరువులను నింపకుండా పాలేరు రిజర్వాయర్కు తరలించడం వల్ల ఇక్కడి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనంతగిరి సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలోని చెరువులు నిండకపోవడానికి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డే బాధ్యత వహించాలన్నారు. మంత్రి సొంత జిల్లా రైతుల ప్రయోజనాలను విస్మరించారని, ప్రధాన కాలువలను శుభ్రం చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపయోగంలో లేని లిఫ్టుల పేరుతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి పేరుతో మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్నాయక్, ఉపాధ్యక్షులు మట్టపల్లి పుల్లయ్యగౌడ్, ఎండీ అఫ్జల్, నాయకులు పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, వివిధ గారమాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
జలసిరిపై అవగాహన కల్పించాలి
నేరేడుచర్ల : జలసిరిపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని, ఎలోనిన్ ప్రభావంతో వర్షాలు కురువనందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్రావు సూచించారు. మంగళవారం నేరేడుచర్లలో వీబీజీరామ్జీ, జలసిరి కార్యక్రమంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతులు పంటల మార్పిడితో పాటు అంతర పంటలను సాగు చేయాలన్నారు. యాసంగిలో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ సోమ సుందర్రెడ్డి, తహసీల్దార్ సైదులు, ఎంపీఓ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి జావిద్, మండల వైద్యాధికారి పున్నా నాగిని, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మోహన్రావు -
గడ్డి కొరతను అధిగమించేలా చర్యలు
కోదాడరూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులు పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడెపూడి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గ పశువైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడి రైతులు ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న గడ్డి నిల్వలను దృష్టిలో పెట్టుకొని, రానున్న ఆరు నెలల వరకు కావాల్సిన గడ్డిని సమకూర్చునేందుకు సిద్ధం కావాలన్నారు. రైతులు తమకున్న భూమిలో కొద్దిమేర గడ్డి విత్తనాలను సాగు చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులకు కావాల్సిన గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో పశువైద్యాధికారులు డాక్టర్ పెంటయ్య, ఉషారాణి, వీరారెడ్డి, రవికుమార్, అఖిల, మధు, హరిత, సురేష్, సురేంద్ర పాల్గొన్నారు.ఫ జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు -
హెపటైటిస్పై అవగాహన అవసరం
సూర్యాపేటటౌన్ : హెపటైటిస్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హైపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరినగర్ ఆరోగ్య కేంద్రంలో హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ సోకితే వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. పుట్టిన 24 గంటల్లోగా హెపటైటిస్ టీకా ఇప్పించడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. ఆశా కార్యకర్త పుట్టిన పిల్లలకు టీకా ఇప్పించాలని, ఆరోగ్య కార్యకర్తలు విధిగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రసిద్ద్, డాక్టర్ నాజియా తబస్సుమ్, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ ప్రణీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ డీఎంహెచ్ఓ వెంకటరమణ -
హెల్త్స్కీమ్ అమలులో జాప్యం తగదు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, పుప్పాల వీరన్న కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మూల వేతనం నుంచి 1.5 శాతం నగదును మే నుంచి కట్ చేసుకుంటున్నప్పటికీ నేటికి హెల్త్ కార్డులు అమలులోకి రాక పోవడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్నా వారు అనారోగ్యం బారిన పడినప్పుడు నాణ్యమైన వైద్య సేవలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే హెల్త్ స్కీమ్ను అమలు చేయక పోతే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. -
డయాలసిస్కు కష్టకాలం
సూర్యాపేటటౌన్ : జిల్లాలో మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో పాటు మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. రెండు కిడ్నీలు దెబ్బతింటే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మూడు కేంద్రాలలో సుమారు 200 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా కేంద్రాలపై ఒత్తడి పెరుగుతోంది. రోగుల సంఖ్యకు తగినట్లుగా బెడ్లు, డయాలసిస్ యంత్రాలు లేకపోవడంతో మరి కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటులో లక్షల్లో ఖర్చు పెట్టాల్సి రావడంతో పేద, మధ్య తరగతి రోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మూడు ఆసుపత్రులలో సేవలుజిల్లాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కేంద్రంలో 7 డయాలసిస్ యంత్రాలు అందుబాటులో ఉండగా 63 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో తొమ్మిది యంత్రాల ద్వారా 86 మందికి, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు యంత్రాల ద్వారా 51 మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఆయా కేంద్రాలకు రోగుల తాకిడి అధికం కావడంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షిఫ్టుల్లో డయాలసిస్ చేస్తున్నారు. రోగి పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు రక్తశుద్ధి చేస్తున్నారు. జిల్లాలో బెడ్లు పెంచితే ఉపశమనం...సూర్యాపేట జిల్లాలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య అధికమవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 మందికే చికిత్స అందుతుండగా మరో 200 మంది వరకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, ఒక్కో రోగికి డయాలసిస్ చేసేందుకు నాలుగు గంటల సమయం పడుతుండడంతో రోగులు తమ వంతు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొంత మంది వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉన్నా బెడ్లు దొరక్క రెండు సార్లు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు హుజూర్నగర్, కోదాడలో అదనపు యంత్రాలు, బెడ్లు ఏర్పాటు చేస్తే రోగుల ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. తుంగతుర్తి, నడిగూడెంలో కేంద్రాలు జిల్లాలో ప్రస్తుతం మూడు ఆసుపత్రులతో పాటు తుంగతుర్తి, నడిగూడెం ఆసుపత్రులకు సైతం డయాలిసిస్ కేంద్రాలు మంజూరయ్యాయి. తుంగతుర్తి, నడిగూడెంలో ఐదు బెడ్ల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతానికి ఆయా గ్రామాల్లో ఆస్పత్రి భవనాలు నిర్మిస్తుండటంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న కిడ్నీ బాధితులు సరిపోని ప్రభుత్వ సేవలు జిల్లాలో మూడు చోట్ల డయాలసిస్ కేంద్రాలు బెడ్లు సరిపోక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు లక్షల్లో ఖర్చు వస్తుండడంతో పేదలపై ఆర్థిక భారం డయాలసిస్ కేంద్రాల్లో సేవలిలా.. సూర్యాపేట జీజీహెచ్ : 7 బెడ్లు, 63 మంది రోగులు హుజూర్నగర్ ఆసుపత్రి : 9 బెడ్లు, 86 మంది రోగులు కోదాడ ఏరియా ఆసుపత్రి : 5 బెడ్లు, 51 మంది రోగులుజిల్లాలో రోజు రోజుకు డయాలసిస్ రోగులు పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా వారికి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయి. కొత్తగా తుంగతుర్తి, నడిగూడెం ఆసుపత్రులకు డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయి. త్వరలో అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్, సూర్యాపేటజీవన శైలిలో మార్పుతోనే మారుతున్న జీవన శైలితో ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తపోటు, షుగర్ వ్యాధులు అదుపులో లేకపోవడం, పొగ తాగడం, మద్యపానం సేవించడం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ఉప్పు, పొటాషియం ఉన్న ఆహారాన్ని తగ్గంచుకోవడం, వ్యాయామంతో కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. -
ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు
భానుపురి (సూర్యాపేట) : ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అని, ప్రభుత్వం ఆయా రంగాలను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు మట్టిపల్లి సైదులు, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, బెల్లంకొండ సత్యనారాయణ, పల్లె వెంకట్రెడ్డి, వట్టెపు సైదులు, దండ వెంకటరెడ్డి, మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా -
సుందరీకరణ ముందుకు సాగేనా..
కోదాడ: కోదాడ పెద్దచెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసే పనులు ముందుకు సాగడం లేదు. మూడు శాఖల మధ్య సమన్వయలోపంతో పదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ పూర్తికాలేదు. మొదట నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టగా మధ్యలో మున్సిపల్శాఖ, మూడోసారి పబ్లిక్హెల్త్ వారు పనులు చేశారు. తాజాగా వారం రోజుల క్రితం పర్యాటకశాఖ అధికారులు వచ్చి పెద్దచెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అసలు పనులు ఎవరు చేస్తారు, ఎప్పటికి పూర్తవుతాయో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దశాబ్దకాలంగా సాగదీత కోదాడ పెద్దచెరువు పూడిక తీయడంతో పాటు దానిని మినీ ట్యాక్బండ్గా అభివృద్ధి చేయడానికి పదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 కోట్లను కేటాయించింది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రూ.3.5 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నాలుగు సంవత్సరాలు అరకొర పనులు చేసి మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీ నిధులు రూ.8 కోట్లతో పెద్దచెరువు సుందరీకరణతో పాటు ఖానాపురం వైపు మున్సిపల్ పార్కును ఏర్పాటు చేసే పనులకు అప్పటి మంత్రి జగదీష్రెడ్డి శంకుస్థాపన చేశారు. నిధుల కేటాయింపు ఆలస్యం కావడం, తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో మున్సిపల్ అధికారులు రూ. 30 లక్షలతో చెరువుకట్టపై మొక్కలు నాటడం, విద్యుత్ దీపాలు, సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. రూ.5 లక్షలతో చెరువు కట్టపైకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డును వేశారు. సరైన పర్యవేక్షణ లేక ఇప్పుడు అవన్నీ పనికి రాకుండా పోయాయి. ముచ్చటగా మూడోసారికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గతంలో మధ్యలో వదిలేసిన రూ. 8 కోట్ల పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఆరు నెలల క్రితం కాంట్రాక్టర్ జేసీబీతో చెరువుకట్టను శుభ్రం చేయించాడు. పది రోజుల్లోనే పనులను ఆపివేసి వెళ్లాడు. తాజాగా వారం రోజుల నుంచి మళ్లీ పనుల్లో కదలిక మొదలైంది. కట్టను శుభ్రం చేయడంతో పాటు కట్టపై ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు నీటిపారుదల శాఖకు తెలియకుండానే పబ్లిక్హెల్త్ వారు చేస్తున్నట్లు సమాచారం. కోదాడ పెద్దచెరువు కట్టకు ఏర్పాటు చేస్తున్న ర్యాంప్కోదాడ ట్యాంక్బండ్తో పాటు సుందరీకరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాను. సోమవారం చెరువు కట్టను స్వయంగా పరిశీలించాను. రెండు మూడు రోజుల తరువాత అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వేగంగా పనులు పూర్తిచేయిస్తాను. – నలమాద పద్మావతి, ఎమ్మెల్యే కోదాడ నత్తనడకన కోదాడ పెద్ద చెరువు అభివృద్ధి పనులు మినీ ట్యాంక్బండ్ ఏర్పాటుకు పదేళ్ల క్రితం శంకుస్థాపన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అసలు పనులు ఎవరు చేస్తారో తెలియక తికమకనాలుగోశాఖ రంగప్రవేశం.. ఇప్పటి వరకు మూడు ప్రభుత్వ శాఖలు చేపట్టిన పనులు ముందుకు సాగక పోగా తాజాగా వారం రోజుల క్రితం పర్యాటకశాఖ అధికారులు కోదాడ పెద్దచెరువును సందర్శించారు. కట్ట సుందరీకరణతో పాటు చెరువులో బోటింగ్ షికారుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కోదాడకు చెందిన విశ్రాంత అధికారితో పాటు ప్రజాప్రతినిధికి పీఏగా పని చేస్తున్న వ్యక్తికి పర్యాటకశాఖ ప్రాంచేజీ ఇచ్చి పెద్దచెరువులో బోటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా అన్ని శాఖలను సమన్వయ పరిచి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
మహిళల అభ్యున్నతికి పాటుపడాలి
హుజూర్నగర్ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్నగర్లో సమాఖ్య నాలుగో జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం సృజన మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలతో మహిళల అభ్యున్నతి సాధ్యం కాదని, వారి ఆర్థిక స్వావలంబనకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక వేధింపులు, వివక్షత ఇంకా కొనసాగడం బాధాకరమన్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉప్పతల కోటమ్మ, పట్టణ అధ్యక్షురాలు ఎల్లావుల ఉమా, అయిలాపురం లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సభ్యులు సింగినం పుల్లమ్మ, సుందరి పద్మ, కౌన్సిలర్ చెనగాని సైదులు, సీపీఐ నాయకులు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ పాల్గొన్నారు. జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన -
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. సోమవారం 98 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ ఐపాస్, టీ–ప్రైడ్ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. జీఎం ఇండస్ట్రీస్ భారతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
ఆగస్టు 3 వరకు సర్ ఎన్యుమరేషన్ ఫారాల అందజేతకు అవకాశం
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్ఓలకు అందిచేందుకు ఆగస్టు 3వరకు గడువు ఉండగా.. ఆలోగానే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 96.76 శాతం ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ఫారాలు తిరిగి తీసుకోవడంతో పాటు వాటిని ఆన్లైన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ముసాయిదా జాబితాలోంచి సుమారు 83,002 ఓట్లు తొలగించే అవకాశం ఉంది. హుజూర్నగర్లో అత్యధికంసూర్యాపేట జిల్లావ్యాప్తంగా 1,205 పోలింగ్ కేంద్రాలు, 10,08,252 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. బీఎల్ఓలు ఇప్పటి వరకు ఇంటింటికి తిరిగి ఫారాలు తిరిగి తీసుకొని వివరాలను 96.76శాతం డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రక్రియ అత్యధికంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో 99.82 శాతం పూర్తయింది. కోదాడలో 96.76 శాతం, తుంగతుర్తిలో 95.73 శాతం, సూర్యాపేటలో 95.57 శాతం మేర పూర్తయింది. తొలగించే ఓట్ల గుర్తింపుఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు తిరిగి బీఎల్ఓలకు అప్పగించేందుకు ఆగస్టు 3 వరకు అవకాశం ఉంది. అదే రోజు వాటిని ఆన్లైన్ చేయనున్నారు. అర్హులైన ఓటర్లతో ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఓటర్లలో దాదాపు 83,002 మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇందులో మృతిచెందిన వారు 25,037, శాశ్వతంగా జిల్లా నుంచి వలస వెళ్లిన వారు 39,046, ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారు 11,589 వరకు ఉన్నారు. ఇవే కాకుండా ఇతర కారణాలతో 7330 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఫారాలు అందించేందుకు మరో ఆరు రోజుల పాటు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యలో కొంత మేర మార్పులు ఉండనున్నాయి. ఇప్పటి వరకు 96.76 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తి మృతులు, వలస వెళ్లిన వారిని గుర్తిస్తున్న బీఎల్ఓలు -
శివుడికి ప్రత్యేక అలంకరణ
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్పీ సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులుతో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని సూచించారు. జానపద కళాకారుల సంక్షేమానికి పోరాటంభానుపురి(సూర్యాపేట) : జానపద కళాకారుల సంక్షేమం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల కోసం సంక్షేమ నిధి, వృద్ధ కళాకారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం మహిళా విభాగం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ్ల ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న, కోశాధికారి మేకల నారాయణ, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సల్గుటి విజయశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల నాగార్జున, కోశాధికారి చింతకుంట్ల వీరన్న, మహిళా అధ్యక్షురాలు ఆకారపు జయ, ప్రధాన కార్యదర్శి వెన్న కవిత, కోశాధికారిగా వడ్డె మౌనిక పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు పంచామృతాభిషేకం చేశారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంజనాపూరి కాలనీ వద్ద జాతీయ రహదారి–65పై అఖిలపక్షం, ప్రజా సంఘాలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతి పాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, మూడో అలైన్మెంట్లో తొలగించడం సరికాదన్నారు. దీని వల్ల సూర్యాపేట జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాకు రైలు మార్గం కోసం 20 సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, ఊర రామ్మూర్తి యాదవ్, చల్లమల్ల నరసింహ, మల్లు నాగార్జునరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, బూర వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శివకుమార్, గంట నాగయ్య, షేక్ నజీర్, సతీష్, వల్లోజు ప్రశాంత్, రమణాచారి, నెమ్మాది వెంకటేశ్వర్లు, సైదులు, గోపి, తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో -
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
నార్కట్పల్లి : విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ నార్కట్పల్లిలో సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీఓ నంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలన్నారు. ఫీజులను ప్రభుత్వమే భరించాలి, విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం శాంతియుతంగా ధర్నా చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, పల్లపు దుర్గయ్య, పాలకూరి రమేష్, డెక్కంటి గణేశ్, సిలువేరు నాగరాజు, పి సర్వయ్య గౌడ్, కారంపూడి సాయి తేజ, మహేష్, ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల సమస్యలు ఎవరికి చెప్పాలి..!
మండల పరిషత్ పాలకవర్గాలు లేవు.. మండల సభలూ లేవుపెద్దవూర : గ్రామ సమస్యలను అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయడానికి సర్పంచులకు సరైన వేదిక దొరకడం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. అందులో సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారులకు వివరించేవారు. గత రెండేళ్లుగా మండల పరిషత్ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం మండల సభలు జరగడం లేదు. దీంతో గ్రామ సమస్యలు ఎవరికి చెప్పాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి మండల సభలు గతంలో ఎంపీపీ అధ్యక్షతన ప్రతీ మూడు నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ నుంచి మండల స్థాయి అధికారులకు తమ శాఖలకు సంబంధించిన మూడు నెలల ప్రగతి నివేదికలతో వచ్చేవారు. శాఖల వారీగా అధికారులు తమ నివేదికలను చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. సమస్యలకు పరిష్కారాలను అధికారులు వివరించేవారు. గ్రామాల సమస్యలు ఎలా..? గడువు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాలలో సమస్యలు పేరుకుపోయాయి. కానీ ఇప్పటికీ మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో.. ఎలా చెప్పుకోవాలో తెలియక సర్పంచులు సతమతమవుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సైతం కొంత ప్రత్యేక నిధులు కేటాయించేవారు. వీటితో గ్రామాలలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేవి. కనీసం మండల అధికారులకు, తమకు మధ్య పరిచయం కోసమైనా సభలు నిర్వహించాలని సర్పంచులు కోరుతున్నారు. గతంలో మూడు నెలలకు ఒకసారి మండల సభలు సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లేదని సర్పంచుల ఆవేదన -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
భువనగిరి(బీబీనగర్) : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు పుస్తెలతాడు అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న బీబీనగర్కు చెందిన కుక్కడపు అండాలు, ఆమె భర్త ఇంట్లో ఉండగా.. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన గంగాధరప్ప, కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన జంగాల శివరాజ్ బైక్పై వారి వద్దకు వచ్చారు. తాము ప్రభుత్వ ప్రతినిధులమని పరిచయం చేసుకుని.. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకానికి సంబంధించి ఫొటో తీయాలని నమ్మించారు. ఫొటో తీయాలంటే మెడలో ఉన్న మంగళసూత్రం తీయాలని అండాలుకు సూచించారు. దీంతో ఆమె తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి పక్కనే ఉన్న భర్తకు ఇచ్చింది. ఇద్దరు నిందితులు ఫొటో తీస్తున్నట్లు చేసి అండాలు భర్త చేతిలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బీబీనగర్ పోలీసులు ఆదివారం నిందితులను పట్టుకుని వారి నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం -
ప్లాస్టిక్ నియంత్రణతోనే సుస్థిరాభివృద్ధి
నల్లగొండ టూటౌన్ : ప్లాస్టిక్ నియంత్రణ ద్వారానే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ మార్పును ఎదుర్కోవడంలో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ.. పర్యావరణహితమైన జీవితం కార్యాచరణ విద్యార్థుల నుంచే ప్రారంభం కావాలన్నారు. అనంతరం ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వసంత, నీలకంఠం శేఖర్, కిరణ్మయి, రమేష్ నాయక్, శ్రీనివాస్, శ్రీధర్ రావు, సత్తిరెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన అయిటిపాముల సోమలింగం కుమారుడు అభినవ్(32) ఓ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభినవ్ సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య మర్రిగూడ(చింతపల్లి) : ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్(45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్లో గల ది రెయిన్బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్(కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురై సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి ఖాజా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ మృతి
నిడమనూరు : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన కొంపెల్లి సైదులు(50) ఇటీవల అప్పు చేసి అర ఎకరం పొలం కొనుగోలు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. సాయంత్రం పొలం నుంచి అతడి భార్య వచ్చి చూసి చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్లో నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కేతేపల్లి : ఇరవై రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఊర యాదగిరి(53) ఈ నెల 7న కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయపడ్డాడు. చికిత్స నిమ్తితం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్దతు ధర కల్పించడంలో విఫలం మిర్యాలగూడ : రైతులు పండించే పంటలకు మద్తు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామంలో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వాల మాటలు నీటిమూటలే అయ్యాయన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నల్లగొండలో నవంబర్ నెలలో రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ సభలకు రైతులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మంగారెడ్డి, రవినాయక్, అప్పారావు, కాంతారెడ్డి, ఉమాకాంత్రెడ్డి, వెంకట్రెడ్డి, కోటిరెడ్డి, బెనర్జీ, కన్యానాయక్, తదితర రైతులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు చోరీ కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం కొండమల్లేపల్లి బస్టాండ్లో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు దేవరకొండకు వెళ్తూ.. మార్గమధ్యలో కొండమల్లేపల్లి బస్టాండ్కు చేరుకుంది. కొండమల్లేపల్లికి చెందిన జక్క పుష్పలత, నాంపల్లి మండలం దేవత్పల్లికి చెందిన కుందారపు అనసూయ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మహిళల వద్ద హ్యాండ్బ్యాగ్లను తస్కరించారు. ఆ బ్యాగుల్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
భువనగిరిలో ఉమ్మడి జిల్లా సెపక్ తక్రా పోటీలు
భువనగిరి : పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్ తక్రా లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రంగరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఖేల్ ఇండియా కోచ్, ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆస్మిత క్రీడల పర్యవేక్షుడు జీవీ సుబ్బారావు మాట్లాడారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి వికేష్కుమార్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కలుగుతుంది
రెండు మూడు నెలలకు ఒకసారైనా మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలనే అంశంలో అవగాహన కలుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుంది. దీంతో ప్రజలకు కూడా అవగాహన కలిగించవచ్చు. – కూతాటి సంధ్య, సర్పంచ్, బట్టుగూడెం సభలు ఏర్పాటు చేయాలిగతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించిన మాదిరి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీంతో ఆయా శాఖల అధికారులకు, సర్పంచ్లకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అధికారులతో పరిచ యం ఏర్పడి స్నేహపూర్వక వాతావరణంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. – మెండె ముత్యాలు, సర్పంచ్, తుంగతూర్తి -
భర్త మృతిని తట్టుకోలేక..
● 24 గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి నార్కట్పల్లి : భర్త మృతిని తట్టుకోలేక 24 గంటల వ్యవధిలోనే భార్య మృతిచెందింది. ఈ ఘటన సోమవారం నార్కట్పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్వాయి గ్రామానికి చెందిన శనిగారపు బాలయ్య(80), చంద్రమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధ దంపతులు కొడుకుల వద్ద ఉండకుండా వేరుగా ఒక గదిలో నివసిస్తున్నారు. కాగా.. బాలయ్య అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలయ్య మృతిని తట్టుకోలేక అతడి భార్య చంద్రమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం ఉదయం చంద్రమ్మ ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దగ్గరకు వెళ్లి చూడగా.. ఆమె కూడా మృతిచెందింది. భార్యాభర్తలు ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిర్యాలగూడ నుంచి దామరచర్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరొక ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పగిడి జీడయ్యయాదవ్ తలకు తీవ్ర గాయాలు కాగా.. వాచ్యాతండాకు చెందిన ధరావత్ మల్సూర్ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ శంకర్నాయక్ గమనించి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను తన వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్సీ కోరారు. -
పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సూర్యాపేటటౌన్ : పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మరింత మెరుగ్గ సేవలు అందించగలుగుతారని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీసు శాఖ, పట్టణంలోని డివైన్ టచ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పోలీసు సిబ్బందికి లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ప్రజా రక్షణలో బిజీగా ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారన్నారు. అందుకే సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, డాక్టర్ విజయమోహన్, సంధ్య మోహన్, సీఐ వెంకటయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, అశోక్, రాజశేఖర్, అన్వర్, ఎస్ఐలు పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
పిల్లలమర్రి దేవాలయంపై డాక్యుమెంటరీ
సూర్యాపేట : త్వరలో పిల్లలమర్రి దేవాలయాలపై డాక్యుమెంటరీ ఫిలిం నిర్మిస్తామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కలర్ హెరిటజ్ కేంద్ర కమిటీ సభ్యుడు మణికొండ వేదకుమార్ అన్నారు. ఆదివారం ిపిల్లలమర్రి దేవాలయాలను ఆయన సంస్థ నల్లగొండ జిల్లా సభ్యుడు పెద్దిరెడ్డి గణేష్తో కలసి పరిశీలించారు. ఎరుకేశ్వర, త్రికూటేశ్వర ఆలయాలు, అక్కడ ఉన్న చారిత్రిక ఆనవాళ్లు, శాసనాలు పరిశీలించారు. పిల్లలమర్రి దేవాలయాలపై డాక్యుమెంటరీ ఫిలిం నిర్మించి ఢిల్లీ సంస్థకు అందించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు సాధించి ఇలాంటి జాతీయ సంపదలను కాపాడి ముందు తరాలకు అందించ వచ్చని చెప్పారు. ఆయన వెంట ఇంటాక్ సభ్యులు భోనగిరి భాస్కర్,ఽ ధనంజయ తదితరులు ఉన్నారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదురుకోళ్ల సంవాదం రక్తి కట్టించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, బదరీ నారాయణ చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, బ్రహ్మచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
సాగుకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి
కోదాడరూరల్ : వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం గణపవరం స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. గణపవరం, ఎర్రవరం, రాలక్ష్మీపురం, బీక్యాతండా, తొగర్రాయి, కాపుగల్లు గ్రామాల చెందిన రైతులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొట్టా కిరణ్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు రాక రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సరిగా లేక పోవడంతో బోరు కింద వరి నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా అందక, మార్కెట్లో ధాన్యం అమ్ముకోలేక విద్యుత్ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని విమర్శించారు. రూరల్ ఎస్ఐ యాకూబ్ ఆందోళన కారులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. కార్యక్రమంలో దొంగల లక్ష్మీనారాయణ, బెల్లంకొండ బ్రహ్మం, వరదరావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బాలేబోయిన వేలాద్రి, అన్నెం అంజిరెడ్డి, చంద్యా తదితరులు పాల్గొన్నారు. -
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు
సూర్యాపేట టౌన్ : రాష్ట్రంలో ఇప్పుడున్నది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. గోదావరి నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ సూర్యాపేట జిల్లాకు సాగునీరు అందడం లేదన్నారు. కాళేశ్వరం, కన్నెపల్లి పంప్హౌస్ నుంచి జిల్లాకు నీటిని అందించే వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వరుసగా అన్ని పంటలకు నీరు అందించామని, ప్రస్తుతం ఒక్క పంటకై నా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా తీవ్రంగా దెబ్బతిందని, రైతులకు రోజుకు 12 నుంచి 13 గంటల పాటు కూడా నాణ్యమైన విద్యుత్ అందడం లేదన్నారు. సాగునీటి కొరతతో రైతులు మళ్లీ బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అప్పులు చేసి బోర్లు వేసుకున్నా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకే ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దుశంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మీదుగా చైన్నె వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అలైన్న్ మెంట్ను మార్చవద్దని మాజీ మంత్రి జగదీష్రెడ్డి కోరారు. గతంలో ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం శంషాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట మీదుగా చైన్నె వరకు బుల్లెట్ ట్రైన్ రూట్ ఉంటుందని ప్రజలు విశ్వసించారన్నారు. ఇప్పుడు అలైన్మెంట్ను మార్చి మరో మార్గాన్ని పరిశీలిస్తున్నారనే వార్తలతో ఉమ్మడి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!
ఆకాశమే హద్దుగా.. ‘విక్రమ్–1’ ప్రయోగంలో మనోళ్ల సత్తాఫ దేశ చరిత్రలో నిలిచిన ప్రయోగం.. ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు ఫ రాకెట్ డిజైనింగ్లో వంశీ, లక్ష్మీనాథ్ అరుదైన మైలురాయి గ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు.. కానీ వారి లక్ష్యాలు మాత్రం ఆకాశాన్ని దాటాయి. దేశ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్–1’ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికుడి కుమారుడైన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన ప్రజ్ఞాపురం వంశీ క్యాడ్ ఇంజనీర్గా.. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి బిడ్డ, సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంధం లక్ష్మీనాథ్ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం.నార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞాపురం రవి వెంకట్పటేల్, సృజన దంపతుల కుమారుడు వంశీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో వంశీ క్యాడ్ ఇంజనీర్గా తన వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి, వివిధ హోదాల్లో పని చేసి సాధించిన ఈ చరిత్రాత్మక ఘటనలో నిపుణులైన బృందంతో పాటు వంశీ కూడా భాగస్వామి కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. వంశీ తండ్రి రవి వెంకట్పటేల్ ఆర్టీసీలో కండక్టర్గా ప్రస్థానం ప్రారంభించి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి, స్క్వాడ్ ఇన్చార్జ్గా ఉద్యోగ విరమణ పొందారు. వంశీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను నల్లగొండలోనే ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ (2014) పూర్తి చేశారు. డీఆర్డీఓ నుంచి స్కైరూట్ వరకు.. బీటెక్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో ప్రాజెక్ట్ ఇంజనీర్గా దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ద్రవ చోదక వ్యవస్థ (లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్) విభాగంలో ఇంటిగ్రేషన్, డిజైన్ పనుల్లో సంపాదించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2025 జనవరి 2న హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ప్రైవేట్ సంస్థలో క్యాడ్ ఇంజనీర్గా చేరారు. ఆ అనుభవంతోనే ‘విక్రమ్–1’ రాకెట్ తయారీలో క్యాడ్ ఇంజనీర్గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి, రాకెట్ విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లోనూ సేవలందించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. క్యాడ్ ఇంజనీర్గా వంశీ -
ఈ– కేవైసీ 83 శాతమే..
హుజూర్నగర్ : అర్హలైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించడంతో పాటు అనర్హులను తొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కేవైని తప్పనిసరి చేసింది. రెండేళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం ప్రారంభంలో వేగవంతంగా జరుగగా క్రమంగా మందగించింది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఈ కేవైసీ 83శాతం మాత్రమే పూర్తయ్యింది. ఈ నెల 31లోగా ఈ–కేవైసీ చేయించుకోక పోతే రేషన్ కార్డులు రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 3.55 లక్షల కార్డులుసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 610 రేషన్ దుకాణాలు ఉండగా వాటి పరిధిలో మొత్తం 3,55,057 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు కలిపి మొత్తం 9,85,061 యూనిట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రతినెలా 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8.17 లక్షల మంది(83శాతం) ఈ కేవైసీ చేయించుకున్నారు. మిగిలిన 17 శాతం మంది ఈ నెలాఖరు లోగా చేయించుకోవాల్సి ఉంది. ఐదు రోజులే గడువుఈ–కేవైసీ ప్రక్రియను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రం ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ కేవైసీ చేయించుకోకపోతే వారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. రేషన్ డీలర్లకు సైతం కమీషన్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రేషన్ కార్డు దారులు ఈ–కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ ఈ–కేవైసీ కోసం దుకాణాలు తెరిచే ఉంచాలని అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఫ 31వరకే అవకాశం ఫ చేయించుకోకుంటే రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం -
నీటిని విడుదల చేయకపోతే నిరాహార దీక్ష
కోదాడరూరల్ : ప్రజల తాగునీటి అవసరాల కోసం, చెరువులు నింపేందుకు వారం రోజుల్లో సాగర్ నీటిని విడుదల చేయకపోతే నిరాహారదీక్షకు దిగుతానని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని గణపవరం శివారులో ఆరు గ్రామాల రైతులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో తాగునీటి అసరాల కోసం నీరివ్వకుండా కాల్వ తూములు మూసేసి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు నీటిని తరలించుకు పోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తమ్కుమార్రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి కావడం జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఎల్నినోతో వర్షాలు కురువక బావులు, బోర్ల కింద సాగు చేద్దామంటే కరెంటు సరిగా లేక నారుమడులకు కూడా నీరందక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, బ్రహ్మం, వేలాద్రి, అంజిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ -
ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్గా లక్ష్మీనాథ్
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్ కేబుల్ హెర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టు ఇంజనీర్గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్.. తండ్రి స్థానిక ఓ సిమెంట్ పరిశ్రమలో మిల్లర్గా, తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తూ లక్ష్మీనాథ్ను చదివించారు. టెన్త్ వరకు స్థానిక సీతా పబ్లిక్ స్కూల్లో చదివిన లక్ష్మీనాథ్.. ఇంటర్, బీటెక్ (2023)హైదరాబాద్లో పూర్తి చేశాడు. బీటెక్ తర్వాత డీఆర్డీఓలో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజ నీర్గా ఏడాదిపాటు పనిచేశాడు. స్కైరూట్ ఏరోస్పేస్లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్గా పనిచేస్తూ విక్రమ్–1 (మిషన్ ఆగమన్)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్ పేర్కొన్నారు. -
మహాసభలను విజయవంతం చేయాలి
చిలుకూరు : హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 27 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన పిలుపునిచ్చారు. శనివారం చిలుకూరు మండలం నారాయణపురంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం జాతీయ మహిళా సమాఖ్య అనేక సంవత్సరాల నుంచి పోరాడుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రెమిడాల జయసుధ, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కోటమ్మ, దేవరం మల్లీశ్వరి, ఐలాపురం లక్ష్మి, అలివేలు సర్పంచ్లు మండవ జయమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు చేయూతనందించాలి
ఆత్మకూర్ (ఎస్): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధికి రైతులకు విద్యావంతులు, మేధావులు, అనుభవజ్ఞులు ప్రోత్సాహిస్తూ చేయూనందించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. ఏరువాక –రైతు బిడ్డల పొలం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు (ఎస్) మండలం మంగలితండాలో నిర్వహించి సదస్సులో ఆయన మాట్లాడారు. చదువుకున్న యువత, వివిధ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులు రైతులకు తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలనేదే ఈ ఏరువాక–రైతు బిడ్డల పొలం బాట ఉద్దేశం అని వివరించారు. మంగళి తండాలో ప్రధానంగా 650 ఎకరాలలో 200లకుపైగా గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కానీ, వారికి ఎలాంటి భూమి పాసుపుస్తకాలు, రెవెన్యూ రికార్డులలో పేరు నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అమిన్సింగ్, వ్యవసాయ అధికారి దంతాల దివ్య, లిప్స్ వైస్ ప్రెసిడెంట్ జీవన్రెడ్డి, సభ్యులు ప్రవీణ్రెడ్డి, రవి, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షులు లింగయ్య యాదవ్, కోటేశ్వరరావు, కమ్యూనిటీ సర్వే ముత్తయ్య, గ్రామ సర్పంచ్ శ్రీదేవికృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసి మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని, 100 శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలన్నారు. ఉదయం ఇన్ టైంలో పంచ్ చేయకపోయినా, సాయంత్రం ముందే వెళ్లిపోయినా శాఖాపరంగా చర్యలు ఉంటాయన్నారు. డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డాక్టర్లు జనార్దన్, అనిత, ఉపేందర్, యశ్వంత్, గీత, సంధ్య, వినయ్ పాల్గొన్నారు. -
కార్మికులకు అండగా ఏఐటీయూసీ
నేరేడుచర్ల : వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడుతోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అన్నారు. ఆగస్టు 1న సూర్యాపేటలో నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల వాల్ పోస్టర్ను శనివారం నేరేడుచర్లలో విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయనాయుడు, ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు చిలకరాజు శ్రీను, రఫి, సలీం, వెంకన్న, జానీ, పాష, నాగులు, సాయి పాల్గొన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్గా నాగేంద్రనాయక్నేరేడుచర్ల : ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) మీడియా, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్గా రమావత్ నాగేంద్రనాయక్ను నియమిస్తూ ఆ సంస్థరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో నియమక పత్రాన్ని అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా నాగేంద్రనాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వరి సాగు తగ్గించాలిగరిడేపల్లి : ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగును తగ్గించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ సూచించారు. శనివారం గరిడేపల్లి మండలం పొనుగోడులో రైతులకు ఆరుతడి పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని, రైతులు వరి, పత్తికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ స ర్పంచ్ వేణు, కేవీకే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎ.నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి మనోజ్ కుమార్, చైతన్య డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ విద్యార్థినులు రితిక, స్నేహవల్లి, సుచరిత, అనూష, వినయశ్రీ, దివ్య, రైతులు పాల్గొన్నారు. అర్హులంతా ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇవ్వాలి కోదాడరూరల్, గరిడేపల్లి : అర్హులైన ప్రతిఒ క్కరూ ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందజేసి ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సర్ సర్వే గురించి మాట్లాడారు. అంతకు ముందు గరిడేపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరయ్య మా ట్లాడారు. సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని పేర్కొనానరు. కోదాడలో జరిగిన కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్, రామినేని శ్రీనివాసరావు, పత్తిపాక జనా ర్దన్, బత్తిని కృష్ణమూర్తి, నాళం రాజన్న, గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వ హించిన సమావేశంలో గరేడేపల్లి సర్పంచ్ నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ బాల్దూరు సందీప్, ఎడవెల్లి ఉపేందర్రెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టానుసారం.. వన మహోత్సవం
ఆత్మకూర్ (ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలంలో వన మహోత్సవం లక్ష్యం నీరుగారిపోతుంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా రోడ్డును ఆనుకుని గుంతలు తీస్తూ మొక్కలు నాటడం కనిపిస్తోంది. ఇప్పటికీ పలు విడతల్లో నాటిన మొక్కల్లో కనీసం ఒక్క శాతం కూడా బతికిన దాఖలాలు లేవు. మొక్కలు నాటి ఫొటోలు దిగేందుకు ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు వాటిని సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రోడ్ల వెంట విద్యుత్ వైర్ల కింద నాటడం.. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారలకు ఆనుకుని గుంతలు తీసి నాడడంతో అవి పెరిగిన కొన్ని రోజులకే నరికేయాల్సి వస్తోంది. ఇక, ఎస్సారెస్పీ కాలువ రోడ్లు, బంజరు భూములు ప్రభుత్వ భూముల్లో మొక్కలు అంతంత మాత్రంగానే నాటి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. టార్గెట్ 1.40 లక్షలు వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది మండల వ్యాప్తంగా 1.40లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 16 విడతల్లో నాటగా 17వ విడత కార్యక్రమానికి ఎల్నినో ప్రభావంతో కాస్త ఆలస్యమవుతోంది. అయినప్పటికీ మొక్కలు నాటేందుకు మండల వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది గుంతలు తీస్తూ కొన్నిచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక సిబ్బంది, కూలీలు మొక్కలు నాటి నీళ్లు పోయడం లేదు. ఫలితంగా ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం వృథా కాకుండా వన మహోత్సవాన్ని పకడ్బందీగా కొనసాగించాలని మండల వాసులు కోరుతున్నారు. ఫ రహదారులకు దగ్గరగా మొక్కలు ఫ సంరక్షణ బాధ్యతలు మరిచిన సిబ్బంది ఫ నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని స్పందన జూనియర్ కళాశాలలో చట్టాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కళాశాలలో సోదరభావంతో మెలగాలని, ర్యాగింగ్ భూతాన్ని తరిమి వేయాలన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీ వ్యవస్థ రద్దు, బాల కార్మిక వ్యవస్థ నిషేధం, బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ నామినేటేడ్ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కనకరత్నం, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసోళ్లకు వసతి కరువు
కోదాడ: కోదాడ పట్టణ నడిబొడ్డున విశాలమైన ఆవరణలో 100 మంది సిబ్బంది ఉండడానికి ఏర్పాటు చేసిన పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. నాణ్యత లేకుండా నిర్మించడంతో కొన్ని సంవత్సరాలకే శిథిలమై పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అందులో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఇది జరిగి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా వాటిని కూల్చి కొత్తవాటిని నిర్మించే విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో వసతి లేక అద్దె ఇళ్లకోసం పోలీస్ సిబ్బందికి నిత్యం వెతుకులాట తప్పడం లేదు. రెండు విడతల్లో క్వార్టర్స్ నిర్మించినా.. కోదాడ టౌన్ పోలీస్స్టేషన్ దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. గతంలో ఇక్కడ ఎస్ఐ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. 25 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్కు తూర్పువైపు పోలీస్ సిబ్బంది ఉండేందుకు నాలుగు క్వార్టర్స్ నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్ది సంవత్సరాలకే అవి శిథిలావస్థకు చేరాయి. వాటిని కూల్చివేసి కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచారు. జాతీయ రహదారి వైపు క్వార్టర్ల స్థానంలో పోలీస్ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ వెనుక వైపు పాత క్వార్టర్స్ ముందు ఖాళీ స్థలం ఉండడంతో 15 ఏళ్ల క్రితం మొదటిసారి రెండు అంతస్తుల్లో ఒక్కోదానిలో 8 కుటుంబాలు ఉండేలా క్వార్టర్స్ నిర్మించారు. రెండవసారి కూడా మరో 8 క్వార్టర్స్ నిర్మించారు. ఇవి పట్టుమని పదేళ్లు కూడా పని చేయలేదు. స్లాబ్ పెచ్చులు ఊడిపడడం, కంటె గోడలు కూలడం, డ్రెయినేజీ పనిచేయక పోవడంతో వాటిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం టౌన్ పోలీస్స్టేషన్ చుట్టూ ఈ శిథిల భవనాలు ఉత్సవ విగ్రహాల్లా కనిపిస్తున్నాయి. అద్దె ఇళ్లలో సిబ్బంది పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న క్వార్టర్స్ సక్రమంగా ఉంటే వీటిలో 40 నుంచి 50 పోలీస్ కుటుంబాలు నివాసం ఉండవచ్చు. పోలీసులకు రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు పడుతుంటాయి. ఇక్కడ తమ కుటుంబాలు ఉంటే ఇబ్బంది ఉండదని, బయట వారిని ఒంటరిగా ఉంచడం ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు. బయట అద్దెలు కూడా ఎక్కువగా ఉండడంతో తమకు భారంగా మారిందని వారు అంటున్నారు. రెండేళ్ల క్రితం వీటి నుంచి ఖాళీ చేయించిన అధికారులు కొత్తవాటి నిర్మించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికై నా పాత క్వార్టర్స్ను కూల్చివేసి కొత్తవాటిని నిర్మించాలని వారు కోరుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో పక్కాగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు పట్టుమని పదేళ్లు కూడా మన్నికగా ఎందుకు ఉండడం లేదు. సామాన్యులు కట్టుకున్న ఇళ్లు 40 నుంచి 50 సంవత్సరాలైన ఎందుకు చెక్కు చెదరడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోదాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన క్వార్టర్స్ 20 సంవత్సరాల వ్యవధిలోనే రెండుసార్లు ఎందుకు శిథిలావస్థకు చేరుకున్నాయి.. దీనికి కారణమైన కాంట్రాక్టర్స్, ఇంజనీర్లపై కనీస చర్యలు తీసుకున్నారా.. అంటే సమాధానం దొరకదు. కోదాడ ఎన్ఎస్పీ స్థలంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన గెస్ట్హౌస్ ఇప్పటికి చక్కుచెదరకుండా ఉంది. అంటే నేటి భవనాల నాణ్యత నేతిబీరలోని నెయ్యిచందంగా మారిందని పలువురు అంటున్నారు. శిథిలావస్థకు చేరిన కోదాడ పోలీస్ క్వార్టర్స్ ఫ సిబ్బందిని ఖాళీ చేయించి ఐదేళ్లు ఫ అతీగతిలేని కొత్త క్వార్టర్స్ నిర్మాణం ఫ ఇబ్బంది పడుతున్న పోలీసులు ఫ కురుస్తున్న భవనంలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొనసాగింపు ఈ చిత్రం కోదాడలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్లో పదేళ్ల క్రితం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్. ఇది 60 ఏళ్ల క్రితం సిమెంట్ రేకులతో నిర్మించిన క్వార్టర్స్ కావడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఫలితంగా చిన్నపాటి వర్షానికి కూడా స్టేషన్ కార్యాలయం కురుస్తుంది. దీంతో పోలీసులు రేకులపై టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచారు. అయితే పదేళ్ల క్రితమే కొత్త భవనం నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సూర్యాపేటటౌన్ : పర్యావరణ పరిక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవం సందర్భంగా ఎస్పీ నరసింహతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లు, అడవులు పెంచడం వల్ల పర్యావరణ రక్షణకు, సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వనమహోత్సవం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలి భానుపురి (సూర్యాపేట) : వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఆర్ఎంఓ డాక్టర్ ఉపేందర్తో కలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీడీఎస్. ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంఓలతో నిర్వహించిన వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. పైథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల అభివృద్ధి, అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్ఎంఓ జి.ఉపేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల హెచ్ఓడీలు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖ
ఫ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన ఫ అందుబాటులో ఉంచిన విత్తనాలు ఫ లక్ష ఎకరాలపైనే సాగు అంచనా భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా యంత్రాంగం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక రూపొందించింది. దాదాపు లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ యేడు ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు వివిధ ఆరుతడి పంటల విత్తనాలకు కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచింది. ఈ పంటల సాగు వైపు మొగ్గు చూపేలా రైతులకు గ్రామస్థాయి నుంచే వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏటా ఐదు లక్షల ఎకరాల వరకు సాగయ్యే వరిపంట ఈ సారి 2 లక్షల ఎకరాలకు మించి సాగు కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గత అంచనాలు తారుమారు ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 5,80,729 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో అత్యధికంగా ఏటా మాదిరిగానే వరి 4,73,656 ఎకరాలు ఉంటుందని, పత్తి 97,566 ఎకరాలు, ఆరుతడి పంటలైన జొన్నలు, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ కలిపి 6,852 ఎకరాల్లో రైతులు సాగు చేయొచ్చని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎల్నినో పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు తిరిగి అంచనాలు రూపొందించారు. ఈ క్రమంలో భారీగా ఆరుతడి పంటల సాగు పెరగనుంది. 6,852 ఎకరాల నుంచి 1,40,121 ఎకరాల వరకు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో జొన్నలు 10 ఎకరాల నుంచి 6,293 ఎకరాలు, కంది 3,927 నుంచి 1,03,190 ఎకరాలకు, పెసర 2,374 నుంచి 13,756 ఎకరాల వరకు, మినుములు 22 ఎకరాల నుంచి 16,882 ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సాగైన పంటలు ఇలా.. ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో జిల్లాకు భారీగా ఆరుతడి విత్తనాలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే జిల్లాలో వరి 46,301 ఎకరాల్లో, కంది 1,195 ఎకరాలు, పెసర 1,218 ఎకరాలు, వేరుశనగ 123 ఎకరాలు, పత్తి 81,607 ఎకరాల్లో సాగైంది. ఆరుతడి పంటలు 2,536 ఎకరాల్లో సాగుకాగా.. మరో 1.37 లక్షల ఎకరాల వరకు సాగు కానుంది. కావాల్సిన విత్తనాలుఅందుబాటులో ఉన్న విత్తనాలు (క్వింటాళ్లలో..) కంది 245.84 పెసర 103.06 మినుములు 110 జొన్నలు 95 వివిధ కూరగాయల విత్తనాలు 16 -
రైలు మార్గం సాధించేందుకు ఉద్యమిస్తాం
సూర్యాపేట : సూర్యాపేటకు రైలు మార్గం సాధించేంత వరకు సాగే ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తానని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి అన్నారు. సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించాలనే ప్రజల చిరకాల ఆకాంక్షతో శుక్రవారం స్థానిక వాణిజ్య భవన్ చౌరస్తాలో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, తమ సంతకాల ద్వారా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో రైల్వే విస్తరణ చాలా తక్కువగా జరిగిందని, ఆ లోటును భర్తీ చేయడంలో సూర్యాపేట రైల్వే లైన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఊర రామ్మూర్తి, రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కే.రంగారెడ్డి, గౌరవ సలహాదారులు లింగంపల్లి భద్రయ్య, బత్తుల వెంకన్న, యాతాకుల రాజన్న, మహంకాళి సోమయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పుట్ట కిశోర్, ఆకుల లవకుశ, చింతలపాటి చిన్న శ్రీరాములు, చామల అశోక్కుమార్, భయ్యా మల్లికార్జున్, బొమ్మగాని శ్రీనివాస్, రాచూరి ప్రతాప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, కార్యదర్శి తలమల్ల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి ఫ జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ చౌరస్తాలో సంతకాల సేకరణ -
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉండేలా చూడాలి
చిలుకూరు : ప్రతి ఇంటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండేలా చూడాలని జెడ్పీ సీఈఓ, కోదాడ నియోజకవర్గ ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయినేజీ, సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ తదితర ఉపాధి హామీ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ఆ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, ఏపీఓ నిర్మల, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలనే సాగు చేయాలి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నందున, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలనే సాగు చేయాలని జెడ్పీ సీఈఓ శిరీష అన్నారు. చిలుకూరులో జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, చిలుకూరు జెడ్పీ పాఠశాల హెచ్ఎమ్ రాజారాం, గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫ జెడ్పీ సీఈఓ శిరీష -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ 55 శాతమే
14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు ఈ హెచ్పీవీ టీకాను తప్పనిసరిగా వేయించాలి. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను తల్లిదండ్రులు నమ్మవద్దు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో సురక్షితమైనది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ పెండెం వెంకటరమణ, డీఎంహెచ్ఓసూర్యాపేట టౌన్ : జిల్లాలో బాలికలకు అందిస్తున్న హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో 14 ఏళ్లు నిండిన 9,567 మంది బాలికలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 5,274 మందికి (55 శాతం) మాత్రమే టీకా అందించారు. జూలై నాటికే ఈ టార్గెట్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ గడువును మరో మూడు నెలలు (సెప్టెంబర్ వరకు) పొడిగించింది. వ్యాక్సిన్పై అవగాహన లోపం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) నివారణకు ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఉంది. ఇంత ఖరీదైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, అపోహలు, అవగాహన లోపం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఉచిత వ్యాక్సిన్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు కొంతమేర విఫలమయ్యారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభ్యం ఈ టీకా జిల్లాలోని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ఏరియా ఆస్పత్రులు, నడిగూడెం సీహెచ్సీ, 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంది. లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ బాలికలకు హెచ్పీవీ టీకా వేయించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు ఫ 9,567 మందికి గానూ ఇప్పటివరకు 5,274 మందికే టీకా ఫ మరో మూడు నెలలు గడువు పెంపు ఫ పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ -
చీకటిమయంగా కోదాడ–జడ్చర్ల హైవే
హుజూర్నగర్ , చిలుకూరు : కోదాడ– జడ్చర్ల (ఎన్హెచ్–167) జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో ప్రయాణం ప్రయాసగా మారుతోంది. రహదారి మధ్యలో ఉన్న లైట్లు వెలగకపోవడంతో రోడ్డంతా చీకటిమయంగా మారుతోంది. పదిహేను రోజులుగా వీధిలైట్లు బంద్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది. మూన్నాళ్ల ముచ్చటగా మున్సిపల్ వెలుగులు హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు పక్షం రోజులుగా పనిచేయడం లేదు. మొదట్లో కాస్త మెరిసిన ఈ లైట్లు.. ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి నేషనల్ హైవే అధికారులను కలవాలో, మున్సిపల్ అధికారులను ఆశ్రయించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. సమన్వయ లోపం.. మరోవైపు చిలుకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇక్కడ రెండు రోజులు లైట్లు వెలిగితే, మరో రెండు రోజులు ఆగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ డివైడర్ లైట్ల నిర్వహణను జాతీయ రహదారి అధికారులే చూసుకున్నారు. అయితే వారి కాంట్రాక్ట్ గడువు ముగిసిందని, ఇకపై నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీ చూసుకోవాలని హైవే అధికారులు చెబుతున్నారు. కానీ, కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయనే నెపంతో తమకు సంబంధం లేదని పంచాయతీ పాలకవర్గం చేతులెత్తేసింది. ఇరు వర్గాల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ చీకట్లకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల పట్టింపులేనితనం, శాఖల మధ్య వివాదాల వల్ల రాత్రి వేళల్లో ప్రధాన బస్టాండ్ సెంటర్లు చీకటి నిలయాలుగా మారుతున్నాయి. సంబంధిత జాతీయ రహదారి, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి, సమన్వయంతో వీధిలైట్లకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ఫ హుజూర్నగర్, చిలుకూరుల్లో హైవేపై వెలగని వీధి లైట్లు ఫ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రయాణికుల అవస్థలు ఫ తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఫ పట్టించుకోని యంత్రాంగం


