Suryapet District Latest News
-
‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలి గిన అధ్యాపకులతో నాణ్య మైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మమత, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కొర్లపహాడ్● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● 20వ తేదీ వరకు గడువు ● ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ● ఒక్కో పాఠశాలకు 160 సీట్లుకేతేపల్లి, తిరుమలగిరి: ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలుఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో మాత్రమే ఆదర్శ పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ఎంపిక ప్రక్రియ ఇలా...పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు. బాలికలకు హాస్టల్ సౌకర్యంఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● నాలుగు గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరణనేరేడుచర్ల: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే చోరీకి పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించారు. ఈ ఘటన ఆదివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ రాములునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ స్థానిక పశు వైద్యశాలలో అంటెండర్గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇస్మాయిల్ భార్య నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడలో తన పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇస్మాయిల్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాగా.. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.15వేల నగదు, 10 తులాల వెండి, 4 గ్రాములు బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే నేరేడుచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భువనగిరి బస్టాండ్లో గుర్తుతెలియని వ్యక్తి మృతిభువనగిరిటౌన్: భువనగిరి ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి బస్టాండ్ పరిసరాల్లో బిక్షాటన చేస్తూ తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 38 ఏళ్లు) ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్లాట్ఫాం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బస్టాండ్కు చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిని పరిశీలించగా.. అతడు మృతిచెంది ఉన్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీఓఏ ఆచూకీ లభ్యంయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వీఓఏగా విధులు నిర్వహిస్తున్న మిట్ట సంధ్య ఆచూకీ ఆదివారం తెలిసింది. అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంధ్య తన స్యూటీని ఆలేరు బస్టాండ్లో పార్కింగ్ చేసి హైదరాబాద్కు వెళ్లింది. హైదారాబాద్లోని చర్లపల్లి పరిధిలో తన చెల్లెలి ఇంటి వద్ద ఉనట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించి.. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. -
గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయ కొండ చుట్టు ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీస్వామి వారి జయంతి సందర్భంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం అంటూ గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు గోమాతతో పాటు జాతీయ జెండాలు, కాషాయం జెండాలతో భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 5వేలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారి మార్గంలో వెళ్లి శ్రీస్వామిని దర్శించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్, ఈవో వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
శాటిలైట్ టోల్ వసూలు ఇప్పట్లో లేనట్లే
చౌటుప్పల్ రూరల్: జాతీయ రహదారులపై టోల్ వసూలుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్ విధానంలో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్ టోల్ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్ స్థానంలో నావిగేషన్ చిప్ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్ జీపీఎస్ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. నావిగేషన్ ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చే వరకు వాయిదా పూర్తిస్థాయిలో అభివృద్ధికాని ఐఆర్ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ -
త్యాగానికి తగిన ఫలితం దక్కింది
ఆత్మకూర్(ఎస్): ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే ఏదో ఒక రోజు పార్టీ తనను గుర్తిస్తుందని భావించానని, అనుకున్నట్లుగానే తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం తన స్వగ్రామమైన ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో అద్దంకి దయాకర్ పాల్గొని మాట్లాడారు. తనను ఉన్నత పదవిలో చూడాలని 11ఏళ్లుగా ఎందరో ఆశతో ఎదురు చూశారని, వారి దీవెనలతోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాక పార్టీ తన స్థాయికి మించి బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. తన అభివృద్ధికి, ఉన్నతికి సహకారం అందించిన శ్రేయోభిలాషులను అన్నివిధాలుగా ఆదుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం పాదాలకు పాలాభిషేకం చేశారు. క్రీస్తు రాజు దేవాలయంలో ఫాదర్ అలెగ్జాండర్చే దీవెనలు తీసుకున్నారు. మనం ఫౌండేషన్ గంపల కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా జేఏసీ చైర్మన్ భూపతి రాములు, గంపల నారాయణ, జానకిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకన్న, యాదగిరి, గరిగంటి ప్రకాశ్, గంపల లింగయ్య, సైదులు, నిమ్మ ఎల్ల య్య, వార్డెన్ లింగయ్య, కొంపల్లి మల్లారెడ్డి, గుంటూరు చిట్టిబాబు, రామకృష్ణ, గంగరబోయిన శ్రీను, గురుస్వామి, జలగం మల్లేశ్, కాటూరి రాములు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం
పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాలి – నర్సింగ్ మార్క్, మాజీ సైనికుడునల్లగొండ : పాకిస్తాన్ మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడటం భారత దళాలు వారికి బుద్ధి చెప్పడం, తోక ముడిచి వెనుదిరగడం పాకిస్తాన్కు అలవాటే. పాకిస్తాన్తో ఇప్పటికై నా తాడోపేడో తేల్చుకోవాలని అంటున్నారు మాజీ సైనికుడు, సెక్షన్ కమాండర్ నర్సింగ్ మార్క్. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్ మార్క్ 1984లో ఆర్మీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్లోని సావ్గర్లో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకుని జమ్ముకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్, నేపాల్, కేరళ తదితర ప్రాంతాల్లో పని పని చేశారు. 2004లో రిటైర్ అయ్యారు. శత్రువు మీద గురి పెట్టడమే లక్ష్యం..చేతిలో తుపాకి ఎదురుగా ఉన్న శత్రువు మీద గురిపెట్టడం ఒకటే లక్ష్యంగా సైనికులు పోరాడుతారు. సైనికుడు లక్ష్యాన్ని చేధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు. పోరాడి వీరమరణం పొందుతాడే తప్ప శత్రువు చేతికి చిక్కే పరిస్థితి తెచ్చుకోరు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యుద్ధంలో ‘జవాన్కు ఆఖరి గోలి ఆఖరి దుష్మన్’ అనే విధానం ఆఖరి తూటాతో శత్రువును నాశనం చేయడం.. అవకాశం లేకపోతే శత్రువుల చేతిలో చంపకుండా తనకు తానే కాల్చుకుని వీరమరణం పొందుతాడు తప్ప వెన్ను చూపడు. ఆ విధంగా ప్రతి సైనికుడు యుద్ధంలో పోరాడుతాడు. కార్గిల్స్ యుద్ధంలో సెక్షన్ కమాండర్గా పని చేశా..1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో నేను సెక్షన్ కమాండర్గా పని చేశా. హిమాలయాల్లో టైగర్ హిల్స్పై ఆరు నెలలు ఉన్నాం. మంచు పర్వతమిది. మంచినీళ్లు కూడా ఉండవు. మంచుని కరిగించుకుని తాగాలి. వంట చేసుకోవాలన్న అక్కడ ఉన్న మంచుగడ్డలను గిన్నెలో వేసి నీరుగా మార్చిన తర్వాతే వంట చేసుకోవాలి. ఒక్కోసారి తిండి లేకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైగర్ హిల్స్పై పైకి ఒకసారి వెళ్లామంటే ఆరు నెలలకు అవసరమైన అన్ని అహార పదార్థాలు, మెడిసిన్ తీసుకెళ్లాలి. అత్యవసరమైతే పైనుంచి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి కిందకు వదులుతారు. సమాచార వ్యవస్థ కూడా అసలు ఉండదు. కార్గిల్ యుద్ధంలో శత్రువులు మా వైపు రాకుండా ముందే మైన్ ఎం14, ఎం16లను భూమిలో పాతిపెట్టేవాళ్లం. వెంట్రుక లాంటి వైర్లును అమర్చాం. అయితే శత్రువులు అటుగా ఆ మైన్లను దాటి వస్తే ఆ వైర్కు కాలు తగిలినా.. మైన్ మీద కాలు పెట్టినా అది పేలిపోతుంది. అలా శత్రువుల ఆట కట్టంచే వాళ్లం. మళ్లీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంపాకిస్తాన్తో మళ్లీ యుద్ధం జరిగిన సమయంలో.. నన్ను పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రెయిన్డ్ జవాన్ను. ఎప్పుడైనా దేశం రక్షణ కోసం జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటాను. మాతో పాటు చాలా మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.దేశసేవ చేయడం అదృష్టం – లక్క లింగారెడ్డి, మాజీ సైనికుడు పెద్దవూర : దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలి. అది అందరికీ రాదు అని చెబుతున్నారు ఇండియన్ ఆర్మీలో 19 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన లక్క లింగారెడ్డి. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన లింగారెడ్డి. తల్లింద్రులకు ఒక్క కుమారుడు. ఆర్మీలో చేరవద్దని తల్లిదండ్రులు ఎంత వద్దని వారించినా దేశానికి సేవ చేయాలన్న తలంపుతో 2003లో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్లో రిటైర్ అయ్యారు. 19 ఏళ్లు సైన్యంలో పనిచేశా..ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ)లో ట్రైనింగ్ చేసి 47 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్లో పోస్టింగ్కు వెళ్లా. తన సర్వీసులో ఆరున్నర సంవత్సరాలు జమ్మూ కశ్మీర్లో పనిచేశా. మూడు సంవత్సరాలు ఉగ్రవాదులను ఏరివేసే స్పెషల్ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్(25 రాష్ట్రీయ రైఫిల్స్)లో పనిచేశా. ఆ సమయంలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నా. 19ఏళ్లు సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రెండు కిలోమీటర్ల వరకు ఎదురొచ్చి కుంకుమ దిద్ది, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆ అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ధైర్యంగా, విరోచితంగా, సాంకేతికతతో పోరాడుతోంది. యుద్ధం వల్ల దేశానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్లో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉంటాయి. యుద్ధ సమయంలో తన అవసరం ఉందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నా. దేశ సేవ చేసే అదృష్టం అందరికీ రాదు మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి‘ఆపరేషన్ సిందూర్తో భారత జవాన్లు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పుడు యుద్ధం జరిగినా సైన్యం పిలస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉంటాం. దేశరక్షణ కోసం ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాం. అది అందరికీ రాదని చెబుతున్నారు’ మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారు ‘సాక్షి’తో మాట్లాడారు. -
ఈఏపీసెట్లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో వి. కుషాల్ 28వ ర్యాంకు, వై. నిషాంత్ 61, డి. దుర్గా గుజిరి 222, ఏ. సాయితేజ 253, కె. విశావని వాగ్దేవి 301, బి. రిషిత 321, ఆర్. జోష్ణవ్ కుమార్ 334, కె. సాయిదివ్య వర్షిత 423, జి. సాయి ప్రణవి 491, కె. హాసిని 575, వి. ప్రణతి, కె.తేజస్విని 653, బి. ఈశ్వర్ గుప్తా 855, యు. వశిష్ఠ 908, బి. మనిశేషు 968, డి. శ్రీలేఖ 1195, పి. స్మైలికరెడ్డి 1262, కె. నిషాంత్రెడ్డి 1394, ఎల్. మనోహర్ 1422, జి. అలేఖ్య 1482వ ర్యాంకు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి. సాయిగీతిక, డీజీఎం సీహెచ్. చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె. కృష్ణ, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
జయ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
సూర్యాపేటటౌన్: ఈఏపీసెట్ ఫలితాల్లో సూర్యాపేటలోని జయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన కె. ఉజ్వన్ 141వ ర్యాంకు, జి. తేజశ్రీ 266, సీహెచ్. హన్షితశ్రీ 695, టి. అమూల్య 913, బి. లాస్య 917, పి. అమిత్ సూర్య 1948, బి. శివమణి 2270, డి. జగదీష్ రాజు 2935, వై. ప్రదీప్ 3364, కె. సాయినందన్ 3977, జి. నవదీప్రెడ్డి 4003, సీహెచ్. కుశల్ రాజు 5044, సీహెచ్. అక్షయ భారతి 5583, కె. యామిని 5823, ఎం. హన్సిని 5843, వి. బిందుమాధవి 6002, ఎస్. నక్షత్ర 6630, కె. పవన్ కుమార్ 7280, జి. సాయిరాం 8325, ఆర్. ప్రియదర్శిని 8328, ఎం. సాద్విక 8361, సీహెచ్. వైశాలిని 8449, జె. కీర్తన 8989, ఎ. కిషోర్ 9502 ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను ప్రిన్సిపాల్, కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
అంతర్జాతీయ స్థాయిలో భద్రత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో జరిగే బుద్ధపూర్ణిమకు హాజరవుతున్న ప్రపంచ సుందరీమణులకు అంతర్జాతీయ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి సమీపంలోని వెల్లంకి అతిథి గృహం నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారి వెంట పూర్తి స్థాయిలో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవిహార్, వెల్లంకి గెస్ట్ హౌస్తో పాటు బుద్ధవనంలో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ సుందరీమణులు తిరిగే ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం ఎల్లో కలర్ పాసులు కలిగిన వారిని మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతిస్తామన్నారు. పోలీసులు అధికారులు, ఇతర శాఖల అధికారులకు ఆరెంజ్ కలర్ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రవేశద్వారాల వద్ద విధులు నిర్వర్తించే వారితో పాటు వీఐపీలకు, బయటి వ్యక్తులకు గ్రీన్ కలర్ పాస్లు, మీడియాకు వైట్కలర్ పాసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడా ట్రాఫిక్ మళ్లించకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
సాగర్కు సుందరీమణులు
నేడు బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారుల బృందం టూర్ షెడ్యూల్ ఇలా.. ● మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతారు. ● 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌజ్కు చేరుకుని 3.30 గంటల వరకు అక్కడ సేదదీరుతారు. ● 4.30కు నాగార్జునసాగర్ విజయ విహార్కు చేరుకుంటారు. ● సాయంత్రం 5 గంటల వరకు విజయవిహార్లో ఫ్రెష్ అప్ అవుతారు. ● 5.30 వరకు టీ, ప్రధాన ద్వారం వద్ద ఫొటో షూట్లో పాల్గొంటారు. ● 5.45 వరకు విజయ విహార్ నుంచి బుద్ధవనం చేరుకుంటారు. ● 6 గంటల వరకు అక్కడ ఫొటో సెషన్ ఉంటుంది. ● 6.10కి స్వాగత నృత్యం నడుమ మహాస్థూపం వద్దకు చేరుకుంటారు. ● 6.20 వరకు మహాస్థూపం విషేశాలను గైడెడ్ టూర్ శివనాగిరెడ్డి వారికి వివరిస్తారు. ● 6.30 వరకు బుద్ధశాసన వద్ద ప్రపంచ సుందరీమణుల ధ్యానం చేస్తారు. ● 6.40 నుంచి 6.50 వరకు బుద్ధవనంపై సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది. ● 6.50 నుంచి 7 గంటల వరకు జాతకవనంలో గడుపుతారు. ● రాత్రి 7 నుంచి 7.45 వరకు జాతకవనం వద్ద డిన్నర్ చేస్తారు. ● 7.45 నుంచి 8.45 వరకు వెల్లంకి గెస్ట్కు చేరుకుంటారు. ● 9 గంటల వరకు అక్కడ సేదతీరుతారు. ● 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. నాగార్జునసాగర్ : హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం సోమవారం నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనుంది. వారి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ముందుగా వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవిహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహాస్థూపంలో సుందరీమణుల ధాన్యం సుందరీమణులు మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి విశేషాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం, తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అంతా నాగార్జునసాగర్లో ఆయా ప్రాంతాలను సిద్ధం చేసింది. బౌద్ధ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. పపంచ సుందరీమణులు సేదదీరేందుకు నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి గృహాన్ని తీర్చిదిద్దింది. టైల్స్, బెడ్లు, కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. సుందరీమణులు ఇక్కడే డిన్నర్ చేయనున్నందున వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే వారికి భోజనాలు తీసుకురానున్నారు.ఫ పర్యటనకు అంతా సిద్ధం చేసిన పర్యాటక శాఖ ఫ లంబాడా నృత్యంతో వారికి స్వాగతం ఫ విజయవిహార్లో విడిది.. బుద్ధవనంలో ధ్యానం చేసేలా ఏర్పాట్లు -
ఈఏపీ సెట్లో కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు
మునగాల: ఈఏపీ సెట్లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన బుర్రి శ్రీనివాసరావు–విజయలక్ష్మి దంపతుల కుమారుడు రిషిక్కుమార్ రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు సాఽధించాడు. రిషిక్కుమార్ ప్రాథమిక విద్య మునగాల, కోదాడలో, ఇంటర్ విద్య హైదరాబాద్లో కొనసాగింది. తమ కుమారుడు ఈఏపీ సెట్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా రిషిక్కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మా నాన్న చిన్నతనం నుంచి నేర్పిన క్రమశిక్షణతోపాటు అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఇంత మంచి ర్యాంకు సాధించానన్నాడు. భవిష్యత్లో ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి ప్రజాసేవ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాములు, మట్టిపల్లి సైదులు, కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, దండా వెంకటరెడ్డి, కోట గోపి, ఎం.రాంబాబు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు. వయోవృద్ధుల హక్కుల సాధనకు కృషితాళ్లగడ్డ (సూర్యాపేట) : వయోవృద్ధుల హక్కుల సాధన కోసం తనవంతు కృషిచేస్తానని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టీఏఎస్సీఏ) జిల్లా అధ్యక్షుడు ఆరె రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వయోవృద్ధుల సంఘం సమావేశం అనంతరం సీనియర్ సిటిజన్స్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కుల చట్టం 2007కు సంబంధించిన వాల్పోస్టర్ ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచామని, అలాగే సుమారు 60గ్రామాల్లో వృద్ధులకు కరపత్రాలు పంచి ఈ చట్టంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, సభ్యులు గుంటకండ్ల ముకుందరెడ్డి, అన్నపూర్ణమ్మ, పిచ్చమ్మ, ముస్కుల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓను సస్పెండ్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : అర్హతలు, ధృవపత్రాలు లేకున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లకు అనుమతులిచ్చిన డీఎంహెచ్ఓను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, మాస్లైన్ (ప్రజాపంథా) పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని మహర్షి డిగ్రీ కళాశాలలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదల ఆరోగ్యం–నకిలీ డాక్టర్స్ ప్రభుత్వ వైఖరి అంశంపై నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో మెడికల్ మాఫీయాపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కోకన్వీనర్ లింగయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు పోలెబోయిన కిరణ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నరేష్, రాష్ట్ర నాయకులు బాషిపంగు సునీల్, పోరెళ్ల విప్లవ్కుమార్, అశోక్, కరీం, గడ్ల రమాశంకర్, బంటు సందీప్, ధరావత్ వెంకటేష్, సంతోష్రెడ్డి, నాగేశ్వర్నాయక్, చామకూర మహేందర్, వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నారసింహుడికి లక్ష మల్లెల పూజ
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకట వాసుదేవాచార్యులు, సోమయాజుల సూర్యనారాయణ మూర్తిశాస్త్రి, లక్ష్మీనరసింహమూర్తి జానపాటి సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో లక్షమల్లెలతో అర్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి కల్యాణానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన టీవీ కళాకారుడు ధూళిపాళ శివరామకృష్ణయ్యభాగవతార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీరామతీర్థ సేవాశ్రమ పీఠం భక్తులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ, భక్తి సంగీతం, ససంగీత విభావరి నాదలహరి, శ్రీసీతా కల్యాణం హరికథ, శ్రీలక్ష్మీనృసింహ నామ సంకీర్తనలతోపాటు దాచేపల్లి, చౌటపల్లి, పెదవీడు, చెన్నాయిపాలెం, మాచవరం గ్రామాలకు చెందిన కోలాట, భజనలు ఆకట్టుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు స్వామివారి తిరుకల్యాణోత్సవం జరుగనుందని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్ తెలిపారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు , భక్తులు పాల్గొన్నారు. ఫ మట్టపల్లిలో రెండో రోజుకుచేరిన తిరుకల్యాణోత్సవాలు -
సంతోష్బాబు ఎంతో జాలి కలవాడు
సంతోష్బాబు 2016లో లెఫ్టినెంట్ కల్నల్గా, 2017లో కల్నల్గా పదోన్నతి పొందాడు. ఎక్కడ ఉన్నా రోజూ నాతో తప్పనిసరిగా మాట్లాడేవాడు. కొడుకుగా ఎంతటి పెద్దస్థానంలో ఉన్నా ఎప్పుడూ నాకు ఏదైనా పని చెప్తావా, నేనేమైనా సహాయం చేయాలా అమ్మ అని అడిగేవాడు. జాలి, దయ కలవాడు. 2020 జూన్ 14వ తేదీన మాకు మధ్యాహ్నం రెండు గంటలకు పిడుగులాంటి వార్త తెలిసింది. సంతోష్ ఇక లేడు అనే వార్తను టీవీలో చూస్తుండగానే వందల మంది మా ఇంటికి వచ్చారు. దేశం కోసం నా కొడుకు ప్రాణం అంకితం అయిందని గర్వపడ్డ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదలాడుతూనే ఉన్నాయి. -
మెడికల్ మాఫియాను నిర్మూలించాలి
సూర్యాపేట : జిల్లాలో మెడికల్ మాఫియాని వెంటనే నిర్మూలించి, డీఎంహెచ్ఓను విధుల నుంచి తొలగించాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా శనివారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మెడికల్ మాఫియా వల్ల అసలు డాక్టర్లు ఎవరో నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ప్రజలు గందరగోళంలో పడుతున్నారన్నారు. డీఎంహెచ్ఓ కోటాచలం అవి నీతికి పాల్పడుతూ, అనర్హులు ఆసుపత్రులు పెట్టుకోవడానికి విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రాబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న వారిలో అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లతోపాటు కొత్త వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికి లైసెన్స్లు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి అమలులో వారి సేవలను వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 500 మందికి సర్వేయర్లుగా త్వరలోనే ప్రత్యేక శిక్షణ ప్రారంభించబోతోంది. 26 నుంచి శిక్షణ భూభారతి అమలులో భాగంగా రాష్ట్రంలో ఐదు వేల మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అర్హులైన వారు ఈ నెల 17వ తేదీలోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. 60 శాతం మార్కులతో, గణితం సబ్జెక్టుగా కలిగిన ఇంటర్ పూర్తయినవారు, ఐటీఐ (డ్రాఫ్ట్మెన్ సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్, తత్సమాన అర్హతలు కలిగిన పాత సర్వేయర్లతోపాటు, కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెవెన్యూ పరిపాలనకు తోడుగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ ద్వారా ఈ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలోనే 200 మంది, సూర్యాపేట జిల్లాలో 150 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 150 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. మూడు దశల్లో శిక్షణ, పరీక్షలు సర్వేయర్లకు మూడు దశల్లో శిక్షణ ఇస్తారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, క్షేత్ర స్థాయి (ఫీల్డ్) విషయాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తరువాత 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అది పాసైతే లైసెన్స్ కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వారు సర్వే చేసేందుకు అర్హులు. వారు చేసే సర్వేకు అధికారిక గుర్తింపు ఉంటుంది. భూ భారతి చట్టం అమలులోనూ సర్వే పనుల కోసం వారి సేవలను పరిగణనలోకి తీసుకోనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చి న భూభారతి చట్టం అమలుకు అర్హులైన సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రత్యే క శిక్షణ ఇచ్చి, లైసెన్స్లు జారీ చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్లు ఫ మ్యాథ్స్తో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసినవారికి అవకాశం ఫ భూ భారతి చట్టం అమలులో భాగంగా వారికి ప్రత్యేక శిక్షణ ఫ ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 మందికి అవకాశం ఫ భూ సర్వేకు తొలగనున్న అడ్డంకులు తీరనున్న సర్వేయర్ల కొరత జిల్లాలో ఇక సర్వేయర్ల కొరత తీరనుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా, 15 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద భూసేకరణ చేపట్టే పనులకు వారే సర్వే చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం అయ్యేంది. సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల సమయం పట్టేది. మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఒకరి భూమి మరొకరికి పేరున పడటం, హద్దులు చెరిగిపోయాయి. దీంతో చాలా మంది సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వ్యవసాయ భూములు కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నాలా కన్వర్షన్ కోసం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో సర్వేయర్ల కొరత వల్ల సర్వేలో తీవ్ర జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చి, లైసెన్స్ జారీ చేయడం ద్వారా సర్వేయర్లుగా గుర్తింపు ఇవ్వబోతోంది. దీంతో సర్వే సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. -
మైనర్లకు వాహనాలిస్తే కేసులు తప్పవు
సూర్యాపేటటౌన్ : మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కేసులు తప్పవని ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలు, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ప్రమాదాలకు గురవుతూ ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తున్నారని తెలిపారు. ఎవరైనా చెడు ప్రవర్తన కలిగి ఉంటే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి లేదా చట్టపరిధిలో అవగాహన కల్పిస్తూ మంచి మార్గం వైపు నడిచేలా కృషిచేయాన్నారు. నూతన వాహన చట్టంల ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి పట్టుబడితే వారికి 25 ఏళ్ల వయసు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెనన్స్ ఇవ్వడం కుదరదన్నారు. అలాగే రూ.25 వేల జరిమానా విధిస్తారని, తల్లిదండ్రులు, వాహన యజమానులు జైలుపాలు అవుతారని గుర్తు చేశారు. వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు ఆంజనేయులు, బాలునాయక్, సాయిరాం, ఏడుకొండలు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ కె.నరసింహ -
నేటి నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ
ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదం యాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. యాదగిరీశుడి దర్శనం యాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. ● అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. ● త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ● అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ● గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. ● పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు. అరటి, మామిడి తోరణాలతో.. ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్కు రానున్నారు. ● మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. ● అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు. ● విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ● ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. ● అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాస్థూపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. ● మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. ● మహాస్తూపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు. ● అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. ● అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు. భూదాన్పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్పోచంపల్లికి ఈనెల 15న మిస్వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● మిస్వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. ● టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు. ● మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ● అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు. ● అక్కడ నుంచి హంపి థియేటర్కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్వాక్ను తిలకిస్తారు. ● తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. ● టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు. ● రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు. పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’బుద్ధుడి చెంతకు..హైదరాబాద్కు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు -
నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్ సస్పెన్షన్
ఫ సీనియర్ అసిస్టెంట్, తహసీల్దార్పై చర్యలకు సిఫారసు భానుపురి (సూర్యాపేట) : వివాదంలో ఉన్న భూమిని పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారులోని 75 సర్వే నంబర్లో నిమ్మల భారతమ్మకు చెందిన 5 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఈ భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేసేందుకు డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఏప్రిల్ 24న రెవెన్యూ లీలలు శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాంబాబు విచారణలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు తప్పు చేసినట్లు రుజువు అయినట్లు కలెక్టర్కు నివేదిక అందించారు. దీంతో అక్రమంగా పట్టా చేసిన అప్పటి నాయబ్ తహసీల్దార్ (డీటీ) హరిచంద్రప్రసాద్, ఆర్ఐ రమేష్ను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం కలెక్టర్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఇంద్రకుమార్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లినందున అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా సీసీఎల్ఏకు సిఫారసు చేశారు. ఇక అప్పటి తహసీల్దారు వినోద్కుమార్పైనా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జ్మెమో జారీ చేస్తూ సీసీఎల్ఏకు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీకి సన్మానంచివ్వెంల(సూర్యాపేట): ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్య కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీ నాతి సవీందర్ కుమార్ను శుక్రవారం ఎస్సీ నరసింహ సూర్యాపేటలోని తన కార్యాలయంలో సన్మానించారు. కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్ పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవుసూర్యాపేటటౌన్: వైద్య చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేసే వైద్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ ఎం.రాజీవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య విప్లవం–ప్రైవేట్ వైద్యరంగ ప్రక్షాళన అనే అంశంపై వైద్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజారోగ్యం మెరుగునకు చేపట్టిన ఈ కార్యక్రమానికి వైద్యులు తమ సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ సూర్యాపేట ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఎల్.రమేష్, వైద్యులు పాల్గొన్నారు. -
అయోమయంలో డిగ్రీ విద్యార్థులు
కోదాడ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన 2, 4, 6 సెమిస్టర్ల వార్షిక పరీక్షలతో పాటు 1, 3, 5 బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 14నుంచి నిర్వహిస్తామని యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. దీంతో తమకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవరకు పరీక్షల నిర్వహణకు సహకరించబోమని సహాయనిరాకరణ కొనసాగిస్తామని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు దగ్గరపడుతుండగా ఇప్పటి వరకు డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడంతో ఫైనలియర్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 64 కళాశాలలు.. 20 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ పరిఽధిలో మొత్తం 118 కళాశాలలుండగా విద్యార్థుల ఆదరణ లేక సగానికిపైగా కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న 64 డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాలకు కలిపి సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఉన్న మూడు అటానమస్ కళాశాలల్లో పరీక్షలు పూర్తి కాగా ఎంజీయూ పరిధిలోని కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు గతంలోనే వాయిదా పడగా, వార్షిక పరీక్షలు మూడుసార్లు వాయిదా వేశారు. ఆరువేల మంది ఫైనలియర్ విద్యార్థులపై ప్రభావం ఎంజీయూ పరిధిలో డిగ్రీ ఫైనలీయర్ చదువుతున్న విద్యార్థలు 6 వేలమంది వరకు ఉన్నారు. వీరు డిగ్రీ పూర్తిచేసుకుని పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే డిగ్రీ పరీక్షలు పూర్తికాకపోవడంతో పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ కాలేని పరిస్థితి. దీంతో తాము విద్యా సంవత్సరం నష్టపోతామని ఫైనలియర్ విద్యార్థులు అంటున్నారు. ప్లాన్–బీ రెడీ చేస్తున్నారా..? డిగ్రీ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించకపోతే వర్సిటీ అధికారులు ప్లాన్–బీ రెడీ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షలు మళ్లీ వాయిదా వేస్తే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రానుందని, అవసరమైతే ప్లాన్–బీని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.దోస్త్కు దూరంగా కళాశాలలు.. నాలుగేళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న డిగ్రీ కళాశాలలు ఈ విద్యాసంవత్సరం(2025–26)లో ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకోవడానికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్కు దూరంగా ఉంటున్నాయి. దాదాపు 20 కళాశాలలు ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకోవడం లేదని సమాచారం. భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు, అధ్యాపకుల వేతనాలు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నందున మూసివేతకే వీరు మొగ్గుచూపుతున్నారు. ఫ పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఎంజీ యూనివర్సిటీ ఫ సహకరించేది లేదంటున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫ దగ్గర పడుతున్న పీజీ ప్రవేశ పరీక్షలుసహాయ నిరాకరణ కొనసాగిస్తాం.. నాలుగేళ్లుగా డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.120 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. అప్పటి వరకు పరీక్షల విషయంలో మా సహాయ నిరాకరణ కొనసాగిస్తాం. – మారం నాగేందర్రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం సంఘం జిల్లా అధ్యక్షుడు సమస్య పరిష్కారం అవుతుంది విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా పరీక్షల నిర్వహణకు సహకరించాలని ప్రైవేట్ యాజమాన్యాలను కోరుతున్నాం. సోమవారం వరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పరీక్షలు నిర్వహణకు రెడీగా ఉన్నాం. విద్యార్థులు కూడా పరీక్షలకు సిద్ధం కావాలి. – ఉపేందర్రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎంజీయూ -
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం
భానుపురి (సూర్యాపేట) : ఆరోగ్యం విషయంలో ఆడపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట డివిజన్లోని నాలుగు మండలాల్లో 306 మంది లబ్ధిదారులకు రూ.3.06 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆహారంలో అన్ని పోషకాలు లేకపోవడం వల్ల వివిధ వ్యాధుల బారినపడుతున్నారన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం లక్ష రూపాయలను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందజేస్తుందన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పేద ఆడపిల్ల పెళ్లికి రూ.1,00,116 అందించడం ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఒక్క తెలంగాణలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, లాలు, హరికిశోర్శర్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నాలా నిండా వ్యర్థాలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓతాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పలు వీధుల్లో రోజూ చెత్త తొలగించకపోవడం.. డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా వారంతా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెత్త సేకరణకు పరిమితమయ్యారు. దీంతో మిగతా చోట్లలో డ్రెయినేజీల్లో చెత్త, మురుగు పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు పూడిపోతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నామని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ తొలగించకపోవడంతో..సూర్యాపేట పట్టణంలోని 28 వార్డులో తాళ్లగడ్డ ఫైర్ స్టేషన్ ఎదురుగా జెజెనగర్లో, రాజారాం కాలేజ్ రోడ్, చర్చి కాంపౌండ్ వెనుక భాగం, గోపాలపురం, 60 ఫీట్ల రోడ్ నాలా, నల్లాలబావి, డీమార్ట్ దగ్గర నాలాలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. రోజూ ఇంట్లో, వీధిలోని వ్యర్థాలు ఊడ్చి కుప్పచేసినా పారిశుద్ధ్య కార్మికులు ఎత్తకుండా వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో వాడుకునే నీరు, వ్యర్థఆహార పదార్థాలు పైపులైన్ల ద్వారా డ్రెయినేజీల్లోకి చేరుతున్నా వాటిని తొలగించడం లేదు. దుర్వాసనను తట్టుకోలేక కాలువలపై బండలు, అట్టాలు, బస్తాలు కప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పది. అలాగే చర్చి కాంపౌండ్ వెనుక ప్రాంతంలో ఖాళీ స్థలాలు చెత్త డంపు కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారారయి. 60 ఫీట్ల రోడ్డు, నల్లాలబావి ప్రాంతాల్లో ప్రధాన నాలాలకు వచ్చే కాలువల్లో పూడిక తీయక కొన్నిచోట్ల మట్టితో నిండి గడ్డి మొలకెత్తడం పారిశుద్ధ్యకార్మికుల, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ శానిటనీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ను వివరణ కోరగా కార్మికులను పంపించి మురుగు కాలువలను శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఖాళీ స్థలాల్లోని వ్యర్థాలను తొలగించాలి చర్చి కాంపౌండ్ ప్రాంతంలో డ్రెయినేజీలు మురుగు, చెత్తతో నిండి ఉన్నాయి. కాలువలు పూడి నీరుపారక దుర్వాసన వస్తోంది. ఖాళీ స్థలాల్లో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలలో దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లూ ఇబ్బంది పడుతున్నాం. అధికారులు చొరవ చూపి కాలువల్లో పూడిక తీయించాలి. – గుడుపురి సత్యం, చర్చి కాంపౌండ్ సూర్యాపేట పట్టణంలో మురుగుతో నిండుతున్న డ్రెయినేజీలు డంపింగ్ యార్డులుగా పలు వీధులు కొన్నిచోట్లనే చెత్త తొలగింపు అధికారుల పర్యవేక్షణ కరువు దుర్వాసనతో ప్రజల ఇబ్బందులుమున్సిపల్ కార్మికుల వివరాలు ఔట్సోర్సింగ్ 313కాంట్రాక్టు 110 పర్మినెంట్ 48 మొత్తం 471ప్రధాన నాలాలను శుభ్రం చేయాలి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు ప్రధాన నాలాల్లోకి వస్తోంది. దీంతో నాలాల్లోకి చెత్త చేరుతోంది. నాలాల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధభరితంగా మారుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు నాలాల నుంచి షీల్ట్ తీయించి శుభ్రం చేయించాలి. – కిరణ్ కుమార్, తాళ్లగడ్డ -
ఎగుమతికి లారీలేవీ?
తూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల్లోనే..●● లారీల కొరతతో కొన్నిచోట్ల కాంటాలు కూడా వేయడం లేదు ● ధాన్యం ఎగుమతి అయినా.. మిల్లుల వద్ద కూడా కొర్రీలు ● ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు సవాలక్ష కష్టాలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తగా మారింది. అధికారుల అజమాయిషీ లేకధాన్యం కల్లాలకు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా తూకం వేయక, వేసినా కూడా లారీలు రాక రోజుల తరబడి ఆ కల్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన వస్తోంది. కొన్ని చోట్ల లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రైతులే వాహనాలను పెట్టుకొని ధాన్యం తరలించాల్సి వస్తోంది. ఆ తరువాత ట్రక్ షీట్ ఆలస్యంగా రావడం, చివరకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావడం కూడా 20 రోజులపైనే పడుతోంది. కొర్రీలు పెట్టి కోత విధిస్తున్నారుకల్లాల్లో తూకం వేసేప్పుడు బస్తాకు కిలో అధికంగా తూకం వేస్తుండగా, తూకం వేసిన ధాన్యం మిల్ల రు వద్దకు తీసుకెళ్లాక, ధాన్యం బాగలేదంటూ దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. దీంతో సంబంధిత కొనుగోలు కేంద్రానికి మిల్లర్లు ఫలానా రైతు ధాన్యం బాగలేదని చెప్పడం, దీంతో నిర్వాహకులు నీ ధాన్యం బాగలేదంట.. బస్తాకు 2 కిలోలు మిల్లర్లు కోత వేస్తారట.. లేదంటే నీ ఇష్టం అని చెబుతుండటంతో రైతులు అంగీకరించక తప్పడంలేదు. ఇలా 40 కిలోల బస్తాకే 3 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటేనే ట్రక్ షీట్ రైతుకు అందుతోంది. అప్పుడే ఆ ట్రక్ షీట్ ఆధారంగా రైతు ఎంత విక్రయించారన్న వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు. మిల్లర్లు ఆడిందే ఆట...మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అసలే కాంట్రాక్టర్లు కొద్దిపాటి లారీలను ధాన్యం రవాణాకు పంపిస్తున్నారు. అయితే ధాన్యం దిగుమతి చేసుకోలేమంటూ నల్లగొండ చుట్టుపక్కల ఉన్న మిల్లర్లు రెండు మూడు రోజులు కొర్రీలు పెట్టడంతో నల్లగొండ ధాన్యాన్ని మిర్యాలగూడ, దేవరకొండ మిల్లులకు తరలించినట్లు సమాచారం. అంటే ఇటు ట్రాన్స్పోర్టు చార్జీలు ప్రభుత్వంపై అదనంగా పడుతున్నాయి. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వినాల్సివస్తోంది. ఆత్మకూర్.ఎస్ మండలంలో లారీల కొరత తీవ్రంగా ఉంది. కాంటాలు వేసినా లారీలు సకాలంలో రాకపోవడంతో బస్తాలు అలాగే ఉంటున్నాయి. రోజుకు రెండు మూడు లారీలు రావాల్సి ఉండగా మూడు రోజులకు ఒక లారీ మాత్రమే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నాం నేరేడుచర్లలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసినా లారీలు రావడం లేదు. దీంతో సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుంటే బిల్లులను చెల్లిస్తామని అధికారులు చెప్పారు. దీంతో సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. – ధానావత్ చాంప్లా, పుల్గంబండతండా, నేరేడుచర్ల లారీలు సమయానికి రావడం లేదుదాదాపు 60 క్వింటాల ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు అవుతుంది. వారానికి రెండు లారీలు కూడా వెళ్లడం లేదు. దీంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. రోజు రెండు నుండి మూడు లారీలు వస్తే కాంటాలు త్వరగా అవుతాయి. – గుద్దేటి జాన్రెడ్డి, ఆత్మకూరు.ఎస్ -
సీఎం వ్యాఖ్యలు ఆక్షేపనీయం
సూర్యాపేటటౌన్ : ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపనీయమని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీపీఎఫ్కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు పాలకులకు అధికారాన్ని అప్పగించారని అన్నారు. ప్రజలందరి బాగోగుల కోసమే ఉద్యోగులు పనిచేస్తారని చెప్పారు.ప్రజల్లో భాగమే ఉద్యోగులు అన్న విషయాన్ని సీఎం గుర్తించుకోవాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శ్రీనివాస్, శిరగాని యాకయ్య, సుధాకర్రెడ్డి, పోతురాజు నర్సయ్య, దీకొండ మహేష్, జిల్లా జానయ్య, ఎస్.కె.సుభాని, మల్లయ్య, తూము శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. కొలతల ప్రకారమే ఉపాధి కూలీలకు వేతనాలుమోతె: ఉపాధిహామీ పథకం కూలీలకు కొలతల ప్రకారమే వేతనాలు అందుతాయని డీఆర్డీఓ అప్పారావు తెలిపారు. మంగళవారం మోతె మండల పరిధిలోని హుస్సేన్బాద్ గ్రామంలో ఉపాధి పనులను తనిఖీ చేశారు. మట్టి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. కూలీలందరూ ఉదయం 7 గంటలకు పనులకు హాజరవుతున్నారా? రోజుకు ఎంత కూలి వస్తుందని అడిగారు.రోజూ 150 మాత్రమే కూలి వస్తుందని కూలీలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.307 వేతనం అందుతుందన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నీరు,నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూలీల మస్టర్లలో హాజరు తీసుకున్నారు. గ్రామంలో నర్సరీని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నాగేష్, పంచాయతీ కార్యదర్శి, ఈసీ శ్రీహరి, ఫీల్డ్అసిస్టెంట్ గజ్జి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా
చిలుకూరు: పేద ప్రజల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా అని మాజీ ఎమ్మెల్యే , సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే పాలకులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఉపాధిహామీ పథకానికి, వ్యవసాయ, కార్మిక రంగాలకు కేంద్రం బడ్జెట్ లో నిధులు తగ్గించడం వల్ల దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో పాలకులు ఆలోచన చేయాలన్నారు. పార్టీనాయకులు ప్రజల పక్షాన బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభకు ముందు పార్టీ జెండాను పల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల మహాసభలో 250 మంది ప్రతినిధులు పాల్గొనగా, 35 మంది కౌన్సిల్ సభ్యులను, మండల కార్యవర్గ సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సభలో సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, యల్లావుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, బూర వెంకటేశ్వర్లు, కొండా కోటయ్య, చేపూరి కొండలు, దొడ్డా వెంకటయ్య, సాహెబ్ అలీ, కాంపాంటి వెంకటయ్య, రెమిడాల రాజు, చిలువేరు అంజనేయులు, పొరడ్ల మట్టయ్య, జయసుధ, తాళ్లూరి వెంకటయ్య, కీసర వెంకటేశ్వర్లు, కందుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మట్టపల్లి ఆలయం ముస్తాబు
మఠంపల్లి: ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే అధ్యయనోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఈనెల 10 నుంచి 15వరకు తిరుకల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు చైన్నె తదితర నగరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ● 7నుంచి 10వరకు తొలక్కం, అధ్యయనోత్సవం, పరమపద ఉత్సవం, శాత్తుమరై పూర్తిచేసి అదేరోజు రాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ● 11న విశ్వక్సేనారాధన, అఖండదీపారాధన, అంకురారోపణ, ధ్వజారోహణం, లక్షమల్లికా సహస్రనామార్చన, లక్షమల్లికా పుష్పపూజ, అర్థరాత్రి ఎదుర్కోళ్లు ఉత్సవంతో శ్రీస్వామి అమ్మవార్లను అశ్వ, గజ, సింహ, గరుడ తదితర వాహనాలపై మంగళవాయిద్యాలతో భక్తుల జయజయఽ ధ్వానా ల నడుమ కల్యాణ మండపానికి చేరుస్తారు. ● 12న తెల్లవారు జామువరకు శ్రీస్వామివారి కల్యాణం నిండుపున్నమి వెన్నెల రాత్రిలో శోభాయమానంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడవాహనసేవ , శ్రీస్వామివారి రథోత్సవం, హరికథలు, బుర్రకథలు ఏర్పాటు చేశారు. ● 13న శ్రీసూక్త సహిత మహాలక్ష్మియాగం, సాయంత్రం శ్రీస్వామి వారు కృష్ణానదిలో హంసవాహనంపై నావావిహారం చేస్తారు. ● 14న చక్రతీర్థం, వసంతసేవ, దోపుఉత్సవం చేపడతారు. ● 15న శృంగార డోలోత్సవం, పవళింపు సేవతో తిరుకల్యానోత్సవాలు ముగుస్తాయి. అన్నదాన ఏర్పాట్లుఉత్సవాలకు వచ్చేభక్తులకు సుమారు 22కులాల అన్నదాన సత్రాలతో పాటు దేవస్థానం వారుకూడా భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. ఎండతీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పాలకవర్గం తెలిపింది. కృష్ణానదిలో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఆర్టీసీ ఆంధ్రాప్రాంతంలోని దాచేపల్లినుంచి, తెలంగాణ ప్రాంతంలోని హుజూర్నగర్ నుంచి అదనపు బస్సులు నడుపనుంది. 11 నుంచి వాహనసేవలుఈనెల 11న రాత్రి కల్యాణమూర్తి అలంకారంలో గజ, సింహ, శేషవాహనములు, 12న ఉదయం గరుడవాహనంపై శ్రీమన్నారాయణమూర్తి అలంకారం, సాయంత్రం శ్రీరాజమన్నార్ అలంకారంలో రథోత్సవం, 13న సాయంత్రం హంసవాహనంపై శ్రీరంగసాయి అలంకారం, 14నఅశ్వవాహనంపై శ్రీజయమన్నార్ అలంకారం, 15న పవళింపుసేవ నిర్వహించనున్నారు.నేటి నుంచి 10 వరకు అధ్యయనోత్సవాలు 11న అర్ధరాత్రి స్వామివారి తిరుకల్యాణం భారీగా తరలిరానున్న భక్తులుకల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి మట్టపల్లి దేవాలయంలో జరగనున్న తిరుకల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వివిధ కులాల అన్నదాన సత్రాలు భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయి. లడ్డూ,పులిహోర ప్రసాదాలు సిద్ధం చేస్తున్నాం – చెన్నూరు విజయ్కుమార్, అనువంశిక చైర్మన్,మట్టపల్లి దేవాలయం -
సాగర్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ
నాగార్జునసాగర్: హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పలువురు సుందరీమణులు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఈ నెల 12న నాగార్జునసాగర్కు రానున్నారు. సాగర్లోని బుద్ధవనం, విజయ విహార్ అతిథిగృహం ప్రాంతాల్లో వారు పర్యటించనున్న నేపథ్యంలో ఆ ప్రదేశాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక సోమవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై బుద్ధవనంలోని మహాస్థూపం అంతర్భాగంలో గల సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ.. భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశఽంలో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, హాలియా సీఐ జనార్దన్గౌడ్, హాలియా, సాగర్ సర్కిళ్ల పరిధిలోని ఎస్ఐలు సంపత్గౌడ్, వీరశేఖర్, వీరబాబు, సతీష్రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10నుంచి 15వరకు జరిగే తిరుకల్యాణోత్సవాలకు ఎలాంటిలోటుపాట్లు లే కుండా ఏర్పాట్లు చేయాలని హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఆదేశించారు. మట్టపల్లి ఆలయంలో తిరుకల్యాణోత్సవ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, తలంబ్రాల మండపం, వివిధ కులవృత్తుల అన్నదాన సత్రాలు, స్నానఘాట్లను పరిశీలించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు జయప్రదమయ్యేలా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమలో హుజూర్నగర్ సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ఎస్ఐ పి.బాబు, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ సిరికొండ నవీన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెడ్డి అన్నదాన సత్రంలో 10వేల మందికి భోజన ఏర్పాట్లుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలోని రెడ్డి నిత్యఅన్నదాన సత్రంలో ఈనెల 10నుంచి 15 వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలకు తరలివచ్చే సుమారు 10వేల మంది భక్తులకు సరిపడా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్రం కమిటీ అధ్యక్షుడు సాముల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక సత్రంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. సత్రంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్ను ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సత్రం కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకా చౌదరిరెడ్డి, జనరల్ సెక్రటరీ చిట్టెంరెడ్డి నాగిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వి.శంభిరెడ్డి, ఎస్. క్రిష్ణారెడ్డి, చిన్నపురెడ్డి, జి.క్రిష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. శివుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ,గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణంముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు పూజలు గావించారు. -
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
గరిడేపల్లి: భూ సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం, తాళ్లమల్కాపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గరిడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామసభలు నిర్వహించిన సమయంలో రైతులు పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. రైతులు దరఖాస్తులు నింపే విషయంలో ఇబ్బందులు లేకుండా గ్రామసభలు నిర్వహించే చోట సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేదన్నారు. ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నామని తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారని తద్వారా వారికి ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ సదస్సు ద్వారా రాయినిగూడెంలో 140 దరఖాస్తులు, తాళ్లమల్కాపురంలో 73దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్, కోదాడ ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఏఓ రాజేందర్రెడ్డి, తహసీల్దార్ బండ కవిత, నడిగూడెం, కోదాడ, తహసీల్దార్లు సరిత, వాజిద్అలీ, ఆర్ఐలు ప్రవీణ్, రాంబాబు, దబ్రేజ్తో పాటు రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలిభానుపురి (సూర్యాపేట) : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరెట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగు నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లా వెబ్ పోర్టల్లో శాఖల వారీగా ప్రొఫైల్, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్, వార్షిక నివేదిక, శాఖల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలన్నారు. రాష్ట్ర , జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై అర్జీదారులకు కచ్చితమైన సమాధానం తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వివి అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూ ఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమశాఖల అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పరిపాలన ధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, శ్రీనివాస రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి తక్షణమే దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనుమతి పత్రాలు లేకుండా, గడువు ముగిసిన వీసాలతో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించాలన్నారు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు దేశంలో నరమేధం సృష్టించి శాంతియుతంగా ఉంటున్న దేశంలో అల్లర్లు జరిగేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, మాజీ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, వెంకటరెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ. ఆబిద్, రంగరాజు రుక్మారావు, బూర మల్సూర్, రంగినేని లక్ష్మణరావు, బండపల్లి శ్రీనివాస్, పేరాల లక్ష్మణ రావు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
రూ.10 కోట్ల విలువ చేసే గంజాయి దహనం
భువనగిరి: రైళ్లలో తరలిస్తుండగా పట్టుకున్న గంజాయిని సికింద్రాబాద్ రైల్వే డ్రగ్ డిస్పోజల్ కమిటి చైర్మన్ చందనాదీప్తి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా పరిశ్రమలో దహనం చేశారు. పరిశ్రమ వద్ద చందనాదీప్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 2024 నుంచి 2025 మే 5 వరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించి 2010 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 74 కేసులను నమోదు చేసి పట్టుకున్న గంజాయి విలువ రూ. 10,05,06,750 ఉందన్నారు. సికింద్రాబాద్ అర్బన్, రూరల్, కాజీపేట డివిజన్ పరిధిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా కంపెనీలో కాల్చివేసినట్లు చెప్పారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు రైల్వే స్టేషనన్లతో పాటు రైళ్లలో పటిష్ట నిఘా పెడుతున్నట్లు చందనాదీప్తి చెప్పారు. విలేకరుల సమావేశంలో నోడల్ అధికారి ఎన్.జావేద్, కాజీపేట రైల్వే డీఎస్పీ కృపాకర్, సికింద్రాబాద్ రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రూ. 38 కోట్లు
ఎల్ఆర్ఎస్ రాబడి● 25శాతం రాయితీతో ఐదు మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం ● 3వ తేదీతో ముగిసిన స్థలాల క్రమబద్ధీకరణ గడువు ● అత్యధికంగా సూర్యాపేటకు రూ.21.07 కోట్లు.. అత్యల్పంగా తిరుమలగిరికి రూ.1.28కోట్లు..హుజూర్నగర్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. 25శాతం రాయితీతో ఫీజు చెల్లించి నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్దేశిత గడువు ముగిసేనాటికి రూ.38.39 కోట్ల ఆదాయం సమకూరింది. ఫీజు చెల్లించినవారు 12,654 మందిజిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,476 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59,135 దరఖాస్తులు ఫీజు చెల్లించేందుకు అర్హత పొందాయి. 12,654మంది అర్జీదారులు ఫీజులు చెల్లించారు. దీంతో మున్సిపల్శాఖకు రూ. 38.39 కోట్ల ఆదాయం సమకూరింది. 3వ తేదీతో ముగిసిన గడువుఎల్ఆర్ఎస్కింద 2020లో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి తోడు దరఖాస్తుదారుల ప్రయోజనం కోసం ఫిబ్రవరి 19 నుంచి వన్టైం సెటిల్మెంట్చేసిన వారికి 25శాతం ఫీజు రాయితీసైతం ప్రకటించింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు. ఫీజు చెల్లించేందుకు గడువు తక్కువగా ఉండడంతో మరో మారు ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు గడువు పొడిగించగా అది కూడా ముగిసింది.సూర్యాపేట మున్సిపాలిటీ టాప్జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయల్లో సూర్యాపేట టాప్లో నిలిచింది. సూర్యాపేట మున్సిపాలిటీకి అత్యధికంగా రూ. 21.07 కోట్లు రాగా తిరుమలగిరికి అత్యల్పంగా రూ.1.28కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం(రూ.కోట్లలో)ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ వివరాలుమున్సిపాలిటీ దరఖాస్తులు అర్హత ఉన్నవి ఫీజు చెల్లించినవి సూర్యాపేట 35,632 31,939 6,710 21.07కోదాడ 16,227 14,780 3659 12.07హుజూర్నగర్ 4,424 3,474 826 2.43తిరుమలగిరి 6,036 5,852 7661.28నేరేడుచర్ల 3,157 3,090 693 1.54మళ్లీ గడువు పొడిగిస్తే తెలియజేస్తాం ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం పొడిగించిన గడువు ముగిసింది. ఇప్పటికే గడువు పొడిగించడం వల్ల పలువురు దరఖాస్తుదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. గడువును మరొక సారి పెంచాలని కొందరు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై ఆలోచన చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం గడువును పెంచిన వెంటనే తెలిజేస్తాం. – కె. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్ -
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.● ప్రజావాణిలో బాధితులకు ఎస్పీ భ రోసా -
ఊరూరా నిఘా కమిటీలు
చిలుకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ఊరూరా నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘింస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది పని దినాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. మార్గ దర్శకాలకు అనుగుణంగా పనులు చేయలని నిర్ణయించింది. పేరుకే సామాజిక తనిఖీలుజిల్లాలో 23 మండలాల్లో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 63 వేల జాబ్కార్డులు ఉండగా వీటిలో 5,70,275 మంది కూలీలు ఉన్నారు. 3,34,539 మంది కూలీలు ఉపాధిహామీ పని చేస్తున్నారు. ఏటా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి పలు అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం నామ మాత్రపు రికవరీతో సరి పెడుతున్నారు. సమస్యను గుర్తించిన కేంద్రం ప్రభుత్వం పనుల్లో మార్గ దర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో ఐదుగురితో కూడిన నిఘా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిఘా కమిటీలు రాష్ట్ర సాయికి పరిమితం కావడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ సిబ్బందే కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరు స్థానికులు కాకుండా వేరే గ్రామానికి చెందిన వారిని నియమించనున్నారు. ఉపాధిహామీ పనుల్లో అవినీతి అడ్డుకట్టకు చర్యలు ఐదుగురు సభ్యులతో కమిటీ వారానికోసారి పనుల పరిశీలన ప్రభుత్వ ఉత్తర్వులు జారీనిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఉపాధి పనులను కమిటీ వారానికోసారి పరిశీలించి పనుల మంజూరు, పనులు జరుగుతున్న తీరు, కూలీల హాజరు, డబ్బుల చెల్లింపులు తదితర వివరాలను గుర్తించి మండల పరిషత్ అధికారులకు అందజేస్తుంది. మండలాధికారులు కలెక్టర్కు నివేదిస్తారు. ఇక నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించాలని పనుల వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని కొత్త ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
ఇంట్లోని సామగ్రి దగ్ధం
మునగాల: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్ తండాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ తండాకు చెందిన దివ్యాంగురాలు గంటపంగు సైదమ్మ తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.70వేల మేరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాఽధితురాలు కోరుతోంది. రోడ్డు వెంట రపాయన వ్యర్థాలు వదులుతున్న లారీలు సీజ్ చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట రసాయన వ్యర్థా లను వదులుతున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రసాయన వ్యర్థా లతో వచ్చిన రెండు లారీలు ఆదివారం రాత్రి అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట వాటిని వదులుతుండగా గ్రామస్తులకు తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు లారీ యజమానులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. సర్వే అడ్డగింతహుజూర్నగర్ రూరల్: మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 64వ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సర్వే నంబర్లో మొత్తం 164 ఎకరాల భూమి ఉండగా అందులో 60 ఎకరాలకు మాత్రమే పట్టా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 104 ఎకరాల భూమిని పలువురు రైతులు ఆక్రమణలో ఉంది. ఇదే భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ సర్వేయర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సర్వే నంబర్లోని కొంత భూమిని గతంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తన కుటుంబ సభ్యుల పేరుతో పట్టా చేయించుకున్నారు. ఈ అక్రమాలు బయటపడి అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్పై కేసులు నమోదయ్యాయి. యువకుడు అదృశ్యంరామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల సందీప్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సందీప్ గత నెల 28న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా సందీప్ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అతడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. -
నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద, నంబర్ ప్లేట్ లేని, మైనర్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వ్యక్తులను పట్టుకుని వారిపై కూడా ెకేసులు నమోదు చేశారు. అనంతరం డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు ఎన్ సందీప్రెడ్డి, వి. శంకర్, జె. సైదులు, ఏఎస్ఐలు శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనయ్య పాల్గొన్నారు. చిట్యాలలో..చిట్యాల: నంబర్ ప్లేట్లు లేని, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపినట్లయితే వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని నార్కట్పల్లి సీఐ నాగరాజు హెచ్చరించారు. చిట్యాలలో సోమవారం ఎస్ఐ ఎన్. ధర్మాతో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట కారిడార్ అభివృద్ధి చేయండి
సాక్షి,యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సోమవారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీని ఎంపీ చామల కలిసి వినతి పత్రం అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసర కారిడార్లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు. ప్రాచీన దేవాలయాలు, వారసత్వ గ్రామాల మధ్య సరైన రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, కొలనుపాక, కీసరగుట్ట, పెంబర్తి ప్రాంతాల మధ్య కనెక్టివిటీ రోడ్లు విస్తరించాలని కోరారు. అలాగే ఔటర్ రింగ్రోడ్డు ఎగ్జిట్ నంబర్ 8 నుంచి కీసర జంక్షన్– యాదగిరిగుట్ట–కొలనుపాక–పెంబర్తి మధ్యన రోడ్డు అభివృద్ధి చేస్తే యాదగిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్, కరీంనగర్ హైవేలపై ట్రాఫిక్ను తగ్గించేందుకు కూడా ఈ దారి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందన్నారు. ఆలేరు నుంచి బచ్చన్నపేట వరకు లింక్ రోడ్డు నిర్మాణం ద్వారా జాతీయరహదారి 163–365బీ మధ్యన అనుసంధానం కలుగుతుందన్నారు. దీనివల్ల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట రహదారిలో ఇప్పటికే ఆమోదించిన బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్పేట్ మరియు లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతాల్లో రెండు ఎలివేటెడ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించిన ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఇథిలిన్తో మాగబెట్టాలిమామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగబెడతారు. దీని వలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్భైడ్తో మాగబెట్టడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్తో మామిడిని మాగించడం అన్ని విధాలా మంచిది. ఇథిలిన్ అనేది గ్రోత్ హార్మోనన్్.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ ఇథిలిన్ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. పెద్దవూర: ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మామిడి కాయలు కోసే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా అపార నష్టం వాటిల్లే అవకాశం ఉందని పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి చెబుతున్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటుగా ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఉదయం పది గంటలోపే కోయాలి మామిడి తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చ రంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్ మీటర్ ద్వారా బ్రిక్స్ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేత పసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళ ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చ గాని, దెబ్బ గాని తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టి నేలపై ఉంచకూడదు. శుభ్రపర్చడం చాలా అవసరం మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం. 10 గ్రాముల డిటర్జంట్ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కాయలను కడగాలి. తర్వాత 52 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాంకిగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటల లోపే ప్యాక్హౌజ్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను తిరిగి మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. పురుగు మందులను పిచికారీ చేయరాదు నిషేధించిన పురుగు మందులను కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు -
స్వర్ణగిరి క్షేత్రంలో తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామికి సోమవారం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహాస్రనామార్చన నిర్వహించారు. అనంతరం పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామికి నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నదానం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అదుపుతప్పి ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలురామన్నపేట: అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రామాంతాపూర్కు చెందిన రెండు కుటుంబాల వారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో బొడ్రాయి పండుగకు వెళ్లారు. సోమవారం ఆటోలో రామాంతాపూర్కు తిరుగు పయనమయ్యారు. ఆటో రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులోని కోళ్లఫాంల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బి. జ్యోతి, వైష్ణవి, కె. గంగమ్మ, వెంకటేష్, కొండయ్యతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు లభ్యంకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యమైనట్లు ఎస్ఐ రామ్మూర్తి సోమవారం తెలిపారు. మృతుడు హైదరాబాద్కు చెందిన ముడుసు కార్తీక్(28)గా గుర్తించామన్నారు. అతడు కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆదివారం తన స్నేహితులతో కలిసి కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని రైస్ మిల్లుల వద్ద బంధువుల పెళ్లికి వచ్చి మధ్యాహ్న సమయంలో ఈత కొట్టడానికి చింతకుంట్ల గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో దిగగా.. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి తల్లి, తమ్ముడు ఉన్నట్లు సమాచారం. వడదెబ్బతో వృద్ధుడు మృతిచండూరు: ఎండల తీవ్రతకు చండూరు మున్సిపాలిటీకి చెందిన దోటి నరసింహ(80) వడదెబ్బకు గురై సోమవారం సాయంత్రం మృతిచెందాడు. సీపీఐ నాయకులు నరసింహ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
లారీల కొరత లేకుండా చూస్తాం
తిరుమలగిరి (తుంగతుర్తి): కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని మిల్లులకు పంపిన 24 గంటల లోపు ట్రక్ షీట్లు తెచ్చి ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బి. రాంబాబు, తహసీల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే జాన్మహ్మద్ ఉన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ -
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎదుట కార్మికుల ధర్నా
మోటకొండూర్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ గేటు ఎదుట సోమవారం ఉదయం అందులో పనిచేసే కార్మికులు ధర్నా చేపట్టారు. ఇటీవల కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందగా.. తమ ప్రాణాలకు భరోసా కల్పించాలని, కనీస వేతనం రూ.30వేలు ఇవ్వాలని, రోజుకు 8 గంటలే పని ఉండేలా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఇద్దరు కార్మికులను, ఒక డాక్టర్ ఎల్లప్పుడూ కంపెనీలో అందుబాటులో ఉంచాలన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించి కంపెనీ నుంచే ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేసుకోవాలన్నారు. మెరుగైన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పనిలో చేరి వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని, కార్మికుల కోసం భోజనం హాల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ వచ్చి వీలైనంత త్వరగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే విధులకు హాజరవుతామని, అప్పటి వరకు కంపెనీకి రాలేమని కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ధర్నాలో కార్మికులు జి. నాగిరెడ్డి, వాకిటి నవీన్రెడ్డి, కాదూరి ఎలేందర్, బాల్ద సిద్దులు, నాగార్జున, ప్రవీణ్, చందు, నాగరాజు తదితరులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే విధులకు హాజరవుతామని తెలిపిన కార్మికులు -
డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జహంగీర్ అలీ
ఖమ్మం సహకారనగర్ : తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ జహంగీర్ అలీ ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ హిలావత్ అంజియా వ్యవహరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఎండీ. జహంగీర్ అలీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్గౌడ్, ఖమ్మం నుంచి కె. వెంకటేశ్వర్లు అధ్యక్ష స్థానానికి నామినేషనన్లు దాఖలు చేశారు. చివరకు వెంకటేశ్వర్లు, మల్లేష్ నామినేషన్లు ఉపసంహరించుకోగా.. జహంగీర్ అలీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా, సోమవారం ఖమ్మంలోని డ్రైవర్ల సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎండీ సలీం, దాసరి వేణు, లింగంపల్లి గంగన్న, జి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కిక్కు!
రోడ్లపైనే పార్కింగ్.. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో మూడు వైన్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారి వెంటే ఉన్నాయి. దీంతో సాయంత్రమైతే వైన్స్ల ఎదుట మందుబాబులు క్యూ కడుతుండటంతో రోడ్డుపైనే బైక్లు పార్కింగ్ చేసి మద్యం సేవిస్తున్నారు. ఈ రోడ్డులో ఎక్కువగా రద్దీ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కొత్తబస్టాండ్ సమీపంలో గల వైన్స్ ఎదుట అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. అదేవిధంగా జమ్మిగడ్డ సమీపంలోని జాతీయ రహదారి వెంట, ఇందిరమ్మ కాలనీ సమీపంలో, పిల్లలమర్రి రోడ్డు సమీపంలో, కుడకుడ గ్రామ శివారులో ప్రాంతాల్లో వైన్స్లు ఉన్నాయి. మందుబాబులు ఈ వైన్స్ల సమీపంలోని ఖాళీ స్థలాల్లోనే మద్యం సేవించి హల్చల్ చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ● మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న యువకులు ● ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులుసూర్యాపేట: కొందరు మందుబాబులు బహిరంగ మద్యపానం చేస్తున్నారు. వైన్స్ల్లో పర్మిట్ రూంలు, బార్లు ఉన్నా... కొందరు ఖాళీ స్థలాలు, రోడ్డు మీదనే మద్యం తాగుతున్నారు. అటువైపుగా వచ్చిన విద్యార్థులను, మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు. మరికొందరు గొడవలకు సైతం దిగుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మందుబాబులు రోడ్ల మీదనే వాలిపోతున్నారు. దీంతో ప్రజలు ఆయా చోట్ల రోడ్ల మీదకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రివేళల్లో మద్యం సేవించి బాటిళ్లు అక్కడే పడేస్తున్నారు. ఫలితంగా ఉదయం పాదచారులకు, వాకింగ్కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. కొరవడిన పర్యవేక్షణజిల్లాలో ఉన్న మద్యం దుకాణాలపై ఎకై ్సజ్ అధికారులు, పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. రాత్రి వేళలో ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాల దగ్గర బహిరంగంగానే తాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చెస్పోటీలు మేధాశక్తిని పెంచుతాయి
సూర్యాపేట అర్బన్ : చెస్ పోటీలు విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచుతాయని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం టీటీడీ కళ్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులకు నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. విద్యార్థులు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపెందించుకోవాలని, ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలని తెలిపారు. త్వరలోనే విద్యానగర్ లో ఉచితంగా చెస్ నేర్పించడానికి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ కుమార్, కోశాధికారి మురళి, గండూరి శ్రీధర్, దేవరశెట్టి శ్రీకాంత్, వెంకటమురళి, నర్సింగరావు, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు రోజులు.. పదకొండు గ్రామాలు
గరిడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పథకం కింద సూర్యాపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలం ఎంపికై ంది. కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు మండలంలోని సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారుల బృందం గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. మండలంలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి భూ భారతి కార్యక్రమం ద్వారా పరిష్కారమయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభించనుంది. అధికారులు వారి స్థాయిని బట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. మండలం పూర్తిగా ఆయకట్టు మండలం కావటం బోర్లు, బావులు, చెరువులు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా వరి సాగవుతుంది. దీంతో మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాలో గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ధరణి చట్టం ద్వారా ఇబ్బందులు పడ్డ రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం ద్వారా పూర్తి సమస్యలు పరిష్కారం కానున్నట్లు అధికారులు తెలిపారు. సాదాబైనామాల పరిష్కారం 13బీ అసైన్డ్ భూములు వారసత్వ భూములు వికేంద్రీకరణ బ్లాక్ల విభజనతో పాటు ఇతర భూ సమస్యలు పరిష్కారం కానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నేటి నుంచి గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు భూ భారతి పైలెట్ మండలంగా ఎంపిక 12 వరకు కొనసాగనున్న సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 5 నుంచి 12 వరకు జరిగే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి రైతు హాజరై దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలి. – బండ కవిత, తహసీల్దార్, గరిడేపల్లి గ్రామసభల షెడ్యూల్ ఇలా.. గరిడేపల్లి మండల వ్యాప్తంగా ఈ నెల 5 తేదీ నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహించనున్నారు. తహసీల్దార్, డీఏఓ టీమ్ లీడర్లుగా 20మంది సభ్యులతో రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా ప్రతిరోజు 9గంటల నుంచి 5గంటల వరకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈమేరకు వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేసి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ నెల 5న తాళ్లమల్కాపురం, రాయినిగూడెం, 6న కాల్వపల్లి, గడ్డిపల్లి, 7న గరిడేపల్లి, కుత్భుషాపురం, 8న గానుగబండ, వెలిదండ, 9న పొనుగోడు, సర్వారం, 12న కల్మ లచెరువు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. -
మాట నిలబెటు్టకునా్నం
కోదాడ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశామని, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడలోని బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వతంత్ర పోరాటంలో ఓబన్న చూపిన పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కోదాడలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. గత పాలకులు బీసీలను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కాంగ్రెస్ చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకుంటుందని తెలిపారు. అంతకు ముందు భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా కోదాడలోని వైద్యశాల వద్ద 100 పడకల వైద్యశాల భవనం నిర్మించనున్న స్థలాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కలెక్టర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడే బేంచ్పై కూర్చొని కలెక్టర్, ఎస్పీలతో సమాలోచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ ఏసురత్నం, ఏబీసీ చైర్మన్ రాములు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశం, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేనిబాబు, వంటిపులి వెంకటేష్, వంటిపులి గోపయ్య, శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు. తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..తిరుమలగిరి (తుంగతుర్తి): తన సొంత గ్రామమైన తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బ్రిడ్జి, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.60లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తాటిపాముల గ్రామంలో కోటి రూపాయలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మరో కోటి రూపాయలు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చెన్నూరు రిజర్వాయర్ నుంచి తాటిపాముల గ్రామానికి నీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు సంకెపల్లి సుధీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఎస్పీ నర్సింహ పాల్గొన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రిని కోరారు. అంతకుముందు ఉత్తమ్కుమార్రెడ్డి సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికే 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ చేపట్టిన కులగణనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుంది రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సస్యశ్యామలం చేస్తాం
మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి, పౌరసరఫరాల శాఖ (వరి ధాన్యం సేకరణ, సన్న బియ్యం పంపిణీ) పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వం ట్రిబ్యునల్తో ఒప్పందం చేసుకుందని, సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 811 టీఎంసీల నీటిని 512 టీఎంసీలు ఏపీకి, 298 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా గత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ రీ ఓపెన్ చేసి పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తామే పూర్తి చేస్తామని, నిర్లక్ష్యానికి గురైన డిండి ప్రాజెక్టుకు గాను రూ.1,800 కోట్లు కేటాయించామన్నారు. సాగునీటి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తిసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో సాగునీటి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ల పనుల పురోగతిని వివరిస్తుండగా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ను పిలిచి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించాలన్నారు. సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎంపీలు కుందూరు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్నంద్లాల్, భూసేకరణ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్కృష్ణారెడ్డి, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్, అడిషనల్ డీజీపీ చౌహాన్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం హాజరైన మండలి చైర్మన్ గుత్తా, మంత్రి కోమటిరెడ్డి తదితరులు -
28 మందికి ఉద్యోగ నియామకపత్రాలు
కోదాడ: రెవెన్యూ, వైద్యారోగ్యశాఖల్లో కారుణ్య నియామకంతోపాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు పొందిన 28 మందికి ఆదివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాలు అందజేశారు. రెవెన్యూ శాఖలో ఐదుగురు, వైద్యారోగ్యశాఖలో ఒకరికి కారుణ్య నియమాకం పొందగా.. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 మంది ఉద్యోగాలు పొందారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఎంహెచ్ఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు సూర్యాపేటటౌన్ : పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని, కొత్త నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్కు గరిష్టంగా రూ.25 వేల వరకు జరిమానా ఉంటుందని, తల్లిదండ్రులను కూడా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఒకసారి పట్టుబడితే వారి వివరాలను రవాణా శాఖకు పంపుతామని తెలిపారు. వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలకృష్ణ నాగారం : వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేంద్ర, జనరల్ సెక్రటరీ రూపానిరాజు, సోషల్ మీడియా ఇన్చార్జి శివరాత్రి గోపి, కార్యదర్శి బండారి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల రమేష్చంద్ర, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్లయ్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుకల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాల వాల్పోస్టర్లను ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణా చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. -
నీట్కు 859 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలో నీట్–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం నాలుగు సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. నాలుగు సెంటర్లలో మొత్తం 890 మంది విద్యార్థులకు గాను 859 మంది హాజరు కాగా 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకేంద్రాలను కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ తనిఖీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఎస్పీ నరసింహ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. -
ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య
హుజూర్నగర్: ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్ట ణానికి చెందిన షేక్ ఖాసింబీ తన కుమార్తె షేక్ మహబూబీ అలియాస్ హసీనా(19)ని గత నెల 30వ తేదీన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసుఫ్కు ఇచ్చి వివాహం చేశారు. కాగా హసీనా తన భర్త యూసుఫ్తో కలిసి శనివారం తన తల్లిగారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన హసీనా అందులో ఉన్న ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. హసీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. -
అభినయ శ్రీనివాస్కు గద్దర్ ఐకాన్ అవార్డు
మోత్కూరు: ‘ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా’ వంటి ఉద్యమ గీతాన్ని రాసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మోత్కూరు వాసి అభినయ శ్రీనివాస్కు గద్దర్ ఐకాన్–2025 అవార్డు దక్కింది. హైదరాబాద్లోని బిర్లా మందిర్ ప్రాంగణంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాయి అలేఖ్య ఫౌండేషన్ వారి 32వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతులమీదుగా అభినయ శ్రీనివాస్కు ఈ అవార్డును నిర్వాహకులు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, అవార్డుల కమిటీ అధ్యక్షురాలు అలేఖ్య, తెలంగాణ రచయితలు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తాం
హుజూర్నగర్: భారత ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తుపాకుల ద్వారానే చరిత్ర మారుతుందనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమని, క్లిష్టమైన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సీపీఐ నమ్ముతుందన్నారు. కర్రి గుట్టల్లో కూంబింగ్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి ఎన్కౌంటర్లను నివారించాలని కోరారు. మావోయిస్టులు కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకోచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, ఎన్నికల హామీలను సక్రమంగా అములు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, సూర్యనారాయణ, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కొండమల్లేపల్లి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఆదివారం ఆటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు ఆటోలో కూర్చోగా.. మిగతా వారు బావిలోకి దిగారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆటోలో నలుగురు మాత్రమే వెళ్లారు. ఇదంతా వ్యవసాయ బావి వద్ద పనిచేసే ఓ రైతు గమనించి బావి దగ్గరకి వెళ్లి చూడగా.. జత దుస్తులు, చెప్పులు ఉండటం గమనించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు బావి వద్దకు చేరుకుని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని దేవరకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచార ఇవ్వగా వారు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని బావిలో గాలించగా.. వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 36 నుంచి 38 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిశెట్టి దుప్పలపల్లిలో..తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712670181 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు
ప్రశంసలు అందుకున్న ప్రశాంత్.. తెలంగాణ ఉద్యమంలో ‘అమ్మ తెలంగాణ.. మరో తెలంగాణ.. అమరవీరులే... అంటూ పాట రాసి స్వయంగా పాడాడు. కరోనా సమయంలో మంత్రి సీతక్క చేపట్టిన సేవలపై శ్రీమలినం లేని మట్టిమనిషి’ అంటూ వీడియో చేసి మంత్రి సీతక్క చేతుల మీదుగా అవిష్కరింపజేశాడు. ఇటీవల కశ్మీర్ పహల్గాం వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ ‘భరతమాత శిరస్సుపై సరిహద్దు కంచె తెంపి దూసుకొచ్చె సంగ్రామం’ అంటూ ఇటీవల దేశభక్తి వీడియో రూపొందించి ప్రముఖ కవి డి. అరవిందరాయుడు చేతుల మీదుగా విడుదల చేశాడు. గ్రామ పంచాయతీ కార్మికులపై కూడా వీడియోలు రూపొందిచాడు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటల రచన చేస్తున్న ప్రశాంత్ ఇటీవల హైకోర్డు జడ్జి చంద్రశేఖర్ చేతుల మీదుగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు సైతం అందుకున్నాడు. ప్రశాంత్ కృషిని మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్తేజ సైతం అభినందించారు. తనకు అవకాశం కల్పిస్తే సినిమా రంగంలో పాటలు రచన చేసి పాడగలని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ప్రశాంత్ అంటున్నాడు. ఆత్మకూరు(ఎం): మారుమూల పల్లెటూరిలో పుట్టి పాటలపై తనకున్న ఆసక్తితో సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడేనికి చెందిన చంద్రగిరి ప్రశాంత్. ప్రశాంత్ స్వయంగా పాటలు రాసి వాటిని పాడుతూ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మోదుబావిగూడేనికి చెందిన వసంత, రాజారామ్ దంపతుల కుమారుడు ప్రశాంత్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కప్రాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీ షియన్గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లో స్కూల్లో పాటల పోటీలు నిర్వహించగా.. తన తల్లి వసంత తోటి కూలీలతో కలిసి పొలంలో పాడిన పాట గుర్తొచ్చి దానిని ప్రశాంత్ పాడి వినిపించాడు. గొంతు చాలా చక్కగా ఉండటంతో ఉపాధ్యాయులు ప్రశాంత్ను అభినందించారు. అప్పటి నుంచి తానే స్వయంగా పాటలు రాసి, సీడీలు చేయాలని ప్రశాంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రతి పాట సీడీ చేయాలంటే సుమారు రూ.20వేల వరకు ఖర్చయ్యేదని, తన జీతంతో పాటు తల్లిదండ్రులు ఆర్ధికంగా సాయం అందించేవారని ప్రశాంత్ చెబుతున్నాడు. తమ కుమారుడు మంచి రచయితగా, మంచి గాయకుడుగా అందరు గర్వించే విధంగా ఎదగాలని ప్రశాంత్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రాసి, వీడియోలు రూపొందిస్తున్న ప్రశాంత్ మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోకతేజచే ప్రశంసలు -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గచ్చిబౌలి: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నూతన్కల్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి డాక్టర్ మర్రి సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన చురుకంటి పవన్రెడ్డి, చురుకంటి అశోక్రెడ్డి, చురుకంటి శ్యామ్సుందర్రెడ్డిలు టీజీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ ఆర్.రామ్మోహన్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు. -
ధాన్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి
కోదాడరూరల్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించే ధాన్యం నిబంధనల ప్రకారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్లో కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 ఉండేలా చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వారం రోజుల లోపే కాంటాలు వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకురాగానే వారికి సీరియల్ నంబర్లు ఇవ్వాలని ఆ ప్రకారం కాంటా వేయాలని ఆదేశించారు. సరిపడా గన్నీ బ్యాగులు వస్తున్నాయా లేదా లారీల సమస్య, హమాలీల కొరత ఏమైనా ఉందా అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 5000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని, మరో 1500 క్వింటాళ్లు ఉంటాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ధాన్యం రాశులను చూసి వాటి తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను సైతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో గోపతి శ్రీనివాస్ అనే రైతు ధాన్యం తేమశాతం పరిశీలించి నాణ్యత బాగుందని ఆ రైతుకు బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీజీఓ పద్మ, ఏపీడీ సురేష్, తహసీల్దార్ వాజిద్అలీ, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, డీటీసీఎస్ రాంరెడ్డి, కమతం వెంకటయ్య, అనూష ఉన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ -
రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
క్లాక్టవర్ (నల్లగొండ), తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని దేవుని గుట్టపై రాతియుగపు కాలం నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. మరుగునపడిన వారసత్వ చిహ్నాలను గుర్తించి, వాటి ప్రాముఖ్యతను స్థానికులకు తెలియజేసే శ్రీప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ఙీ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన రామలింగాలగూడెంలోని శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టపై ఆదివారం జరిపిన పరిశీలనలో పాల్గొని మాట్లాడారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, తాము నిత్యము వాడుకునే రాతి పనిముట్లతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా ఆనాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దారన్నారు. ఈ రాతికళ క్రీ.పూ. 6000– 4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని ఆయన చెప్పారు. గుట్టపై సహజంగా ఏర్పడిన నీటిదోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద బండల మాటున గల గుహల్లోనూ, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నివసిస్తూ, తీరిక సమయాల్లో తాము పాల్గొన్న సంఘటనలను, చూసిన దృశ్యాలను చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ పురాతన రాతికళను కాపాడి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పి వెంకటేష్, మోతీలాల్ పాల్గొన్నారు. పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
ఒకే కంటెయినర్లో 101 పశువుల తరలింపు
● డ్రైవర్పై కేసు నమోదు కోదాడరూరల్ : కంటెయినర్లో అక్రమంగా తరలిస్తున్న 101 పశువులను ఆదివారం తెల్ల వారుజామున కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని హనుమాన్జంక్షన్ సంత నుంచి హైదరాబాద్లోని కబేళాకు ఒకే కంటెయినర్లో 76 ఎద్దులు, 25 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. కోదాడ రూరల్ పోలీసులు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్రోడ్లో కంటెయినర్ను తనిఖీ చేయగా.. పశువులు పట్టుబడ్డాయి. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి డ్రైవర్ ఎర్రవళ్ల సునీల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణంగుర్రంపోడు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరు గ్రామానికి చెందిన నక్కనబోయిన సత్తయ్య(52) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. దిగుబడి లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలిభువనగిరిటౌన్ : న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరానికి జిల్లాలోని న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన సేవభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆదివారం సహస్రనామార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి లైనింగ్ వేయరూ..!
అర్వపల్లి: తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో 2.20లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ స్టేజ్–2) లైనింగ్, పునరుద్ధరణ పనులకు ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2010లో ఎస్సారెస్పీ రెండోదశ కాలువ నిర్మాణ పనులు పూర్తవగా ఏడేళ్ల నుంచి ప్రతి సీజన్కు గోదావరి జలాలలను జిల్లాకు వదులుతున్నారు. కానీ, అప్పటి నుంచి ఈ కాలువకు లైనింగ్, ఇతర మరమ్మతులు చేపట్టింది లేదు. దీంతో అక్కడక్కడా కట్టలు తెగుతూ, తూములు ధ్వంసమవుతూ నీరు వృథాగా పోతూ చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. రూ.500 కోట్ల నిధులు అవసరమున్నా..జిల్లాలో ఎస్సారెస్సీ రెండోదశ కింద మూడు నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు 61,70, 71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్)లు ఉన్నాయి. ఇందులో 71డీబీఎం పెద్దది. 69 డీబీఎం తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో 27కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 60,572 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే 70 డీబీఎం నాగారం, తిరుమలగిరి మండలాల్లో 9కి.మీ. మేర విస్తరించి ఉంది. దీని కింద 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 71 డీబీఎం తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో 68.45కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 1,42,230 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కేవలం 71డీబీఎం పరిధిలో మాత్రమే గత కొన్నేళ్ల కిందట సుమారు 5కి.మీ. పైన లైనింగ్ చేసి మిగతాది వదిలేశారు. 69, 70, 71డీబీఎంలతో పాటు వీటి కింద ఉన్న ప్రధాన మైనర్లు 22ఎల్, 36ఎల్, 7ఎల్, 15ఎల్, 22ఆర్, 69టెయిలాండ్కు మరమ్మతుతోపాటు లైనింగ్, తూములు, షట్టర్ల రిపేర్లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాలువలు కంపచెట్లు, పూడికతో నిండిఉన్నాయి. అయితే లైనింగ్, మరమ్మతులకు రూ.500 కోట్ల వరకు నిధులు అవసరమున్నా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లే కేటాయించారు. ఈ నిధులు ఎటూ సరిపోవని అధికారులే అంటున్నారు. తాటిపాములకు నేడు మంత్రి ఉత్తమ్ రాకతుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో తన స్వగ్రామమైన తాటిపాములలో ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించనున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనుల చేయనున్నట్టు సమాచారం. మంత్రి పర్యటన ఈ నేపథ్యంలో ఏటా అధికారులు పంపుతున్న ప్రతిపాదనల ఆమోదిస్తారో లేదోనని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడి రాబోతున్న మంత్రి ఎస్సారెస్పీ కాలువల దుస్థితిని పరిశీలించి బడ్జెట్తో సంబంధం లేకుండా తగినన్ని నిధులు కేటాయించాలని కాలువలను ఆధునీకరించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.నిధులు కేటాయించాలి ఎస్సారెస్పీ–2 కాలువల పునరుద్ధరణకు రూ.500 కోట్ల నిధులు అవసరముండగా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లు కేటాయించడం సమంజసం కాదు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇక్కడకు వస్తున్నందున నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టాలి. – వజ్జె శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడుఎస్సారెస్పీ–2 స్వరూపం.. ఆయకట్టు 2.20 లక్షల ఎకరాలు ప్రధాన డీబీఎంలు 69, 70, 71 నీళ్లందే ప్రాంతాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు–2 కాలువలుఫ చివరి ఆయకట్టుకు నీరందని వైనం ఫ ఏడేళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఫ ఈసారి బడ్జెట్లో రూ.34.01కోట్లు మాత్రమే కేటాయింపు ఫ నేడు తాటిపాములలో మంత్రి ఉత్తమ్ పర్యటన ఫ మంత్రి హామీలపై రైతుల ఆశ గోదావరి జలాలే ఆధారం ప్రతి సీజన్లో పది ఎకరాల వరకు వరిపంట సాగు చేస్తాను. కేవలం గోదావరి జలాలను నమ్ముకొని పంటలు సాగు చేస్తున్నాను. గతేడాది నుంచి నీళ్లు సరిగా రావడం లేదు. కాలువలు కంపచెట్లతో నిండాయి. వెంటనే కాలువలను బాగు చేయాలి. – చెరుకుపల్లి ప్రవీణ్, రైతు, తిమ్మాపురం -
4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు
నేడు నీట్ పరీక్ష● సూర్యాపేటలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్సూర్యాపేటటౌన్ : మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఆదివారం(4వ తేదీ) నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు చేసింది. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలైన మోడల్ స్కూల్ ఇమాంపేట, టీజీఎస్డబ్ల్యూఆర్ స్కూల్–కళాశాల (బాలికలు ) ఇమాంపేట, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్–జూనియర్ కళాశాల దురాజ్పల్లి చివ్వెంల మండలం, గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో 890 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 1:30గంటల వరకే అనుమతి విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకుంటున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో కంట్రోల్ రూం, సీసీ కెమెరా లు, బందోబస్తు, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం సూర్యాపేట పరిధిలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆభరణాలు, ఫుల్ హ్యాండ్ షట్స్, బూట్లు ధరించి వచ్చినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1433 ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు శ్యాంసుందర్రెడ్డి, కృష్ణయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జయలత ఉన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలను భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన లీగల్ లిటరసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల హక్కులు, విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో బార్ అసోసియేసన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టుపల్లి ప్రవీణ్కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు ఎండీ అబ్దుల్ లతీఫ్, శ్రీనివాస్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, మధు, పీపీ లక్ష్మణ్ నాయక్, ఏజీపీ పూల్సింగ్ నాయక్ పాల్గొన్నారు. -
నేడు కోదాడ, హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్, కోదాడ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదివారం హుజూర్నగర్, కోదాడలో పర్యటించనున్నారని మంత్రి పీఆర్ఓ వెంకట్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కోదాడ బస్టాండ్ సెంటర్లో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడలోని వంద పడకల వైద్యశాల స్థలం, నిర్మాణ విషయంపై, రెడ్లకుంట, శాంతినగర్, పాలేరు ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం హుజూర్నగర్కు వెళతారు. అక్కడ 241 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని మంత్రి పీఆర్ఓ పేర్కొన్నారు. జిల్లా కోర్టుకు వేసవి సెలవులు చివ్వెంల: జిల్లా కోర్టుకు ఈనెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సెలవుల్లో సివిల్ కేసులకు సబంధించిన ఫైలింగ్లను పరిశీలించేందుకు ప్రత్యేక జడ్జీలకు బాధ్యతలు అప్పగించారు. మొదటి వెకేషన్లో భాగంగా ఈనెల 5 నుంచి 21 వరకు 17 రోజుల పాటు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద కేసులు పరిశీలిస్తారు. అలాగే 22 నుంచి జూన్ 6 వరకు నల్లగొండ జిల్లా కోర్టు పోక్సో జడ్జి కులకర్ణి విశ్వనాథ్ దిలిప్రావు బాధ్యతలు చేపడతారు. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టులకు సబంధించిన సివిల్ కేసు దావాలు, క్రిమినల్ కేసులను సంబంధిత కోర్టుల జడ్జీలు పరిశీలించనున్నారు. నాలుగు ఆసుపత్రులకు షోకాజు నోటీసులుసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఆపిల్ స్కాన్ సెంటర్, శ్రీకృష్ణా, శ్రీ సాయిగణేష్ మల్టీస్పెషాలిటి, శరత్ కార్డియాక్ సెంటర్ ఆసుపత్రులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం జిల్లా రిస్ట్రేషన్ అథారిటీ నిబంధనలను అనుసరించి షోకాజు నోటీసులు జారీ చేసినట్ట డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల వ్యవధిలోపు సరైన వివరణ, ధ్రువపత్రాలు సమర్పించని పక్షంలో సంబంధిత ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, తనిఖీలు నిర్వహించి స్పష్టమైన ధ్రువపత్రాలు కలిగి ఉన్న వారికి మాత్రమే అనుమతి రిజిస్ట్రేషన్ కొనసాగించనున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మారినా, డాక్టర్, సిబ్బంది మారినా జిల్లా వైద్యారోగ్యశాఖకు తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలిగరిడేపల్లి: భూ భారతి అమలులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గరిడేపల్లి మండలంలో ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5న రాయినిగూడెం జెడ్పీహెచ్ఎస్, తాళ్లమల్కాపురం యూపీఎస్, 6న కాల్వపల్లి ఎంపీపీఎస్, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్, 7న గరిడేపల్లి జెడ్పీహెచ్ఎస్, కుత్భుషాపురం యూపీఎస్, 8న గానుగబండ, వెలిదండ జెడ్పీహెచ్ఎస్, 9న సర్వారం యూపీఎస్, పోనుగోడు జెడ్పీహెచ్ఎస్, 12న కల్మలచెరువు జెడ్పీహెచ్ఎస్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. సివిల్ వివాదాలు, కోర్టులో ఉన్న భూ కేసుల దరఖాస్తులను ఈ సమావేశాల్లో స్వీకరించబోమన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఏఓ రాజేందర్రెడ్డి, తహసీల్దార్ కవిత, డీటీ స్రవంతి, ఆర్ఐ రాంబాబు, ప్రవీణ్, కార్యదర్శి సైదానాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎం.రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకన్న, గోపి పాల్గొన్నారు. -
రెండు రోజులు అలర్్ట!
ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయయి. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మార్చిలోనే మొదలైన ఎండలుఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చిలోనే మొదలైన ఎండలు ఏప్రిల్ చివరి నాటికి అధికమయ్యాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, అయితే ఆది, సోమవారం తర్వాత ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దుఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి కూలీలు ఉదయం వేళల్లో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పని ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న రెండు రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్ మండలం గ్రామం ఉష్ణోగ్రతదామరచర్ల దామరచర్ల 43.8మాడుగులపల్లి మాడుగులపల్లి 43.7దామరచర్ల తిమ్మాపూర్ 43.6మిర్యాలగూడ టేక్యాతండా 43.4త్రిపురారం మాటూరు 43.3అడవిదేవులపల్లి ముల్కచర్ల 43.2నార్కట్పల్లి నార్కట్పల్లి 43తిరుమలగిరిసాగర్ తిరుమలగిరిసాగర్ 43మోతె మామిళ్లగూడెం 43.1అప్రమత్తంగా ఉండాలి భానుపురి (సూర్యాపేట): జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలి. వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని ఆదేశించాం. చిన్నారులు, వయోవృద్ధులు ఎండకు బయటకు వెళ్లవద్దు. ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. – కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధాన్యం కొనాలని రైతుల ధర్నా
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మండల పరిధిలోని రాజ్నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం సూర్యాపేట–జనగామ రోడ్డుపై ధర్నాకు దిగారు. లారీలు రావట్లేదనే సాకుతో కాంటాలు నిలిపివేశారని, ఐదు రోజులకు ఒక లారీ చొప్పున కాంటాలు వేస్తే మేము ఇలా ఎన్ని రోజులు కేంద్రంలోనే నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి కాంటాలు వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రోడ్డుపై ధర్నా చేయడంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇతర వాహనదారులు పక్కనే మడికట్ల నుంచి వెళ్లాల్సి వచ్చింది. -
పేదలకు అండగా ఎర్రజెండా
గరిడేపల్లి : ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఎల్లప్పుడూ పేదలకు అండగా పోరాడేది ఎర్రజెండాయేనని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెం గ్రామంలో జరిగిన ఆ పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను సర్పంచ్లు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మండవ వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, కుందూరు వెంకట్రెడ్డి, గోవిందరెడ్డి, అంబటి వెంకటరెడ్డి, ఏసుపాదం, వెంకన్న, సైదిరెడ్డి లింగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
కోదాడరూరల్ : మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన దోరకుంట, చిమిర్యాల, నల్లబంగూడెం, రామాపురం క్రాస్రోడ్, రెడ్లకుంటలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి చిమిర్యాలలో కలకొండ పద్మ ఇంటిపై వేపచెట్టు విరిగి పడగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నది. రెడ్లకుంటలో యామపంగు దిలీప్, పిడమర్తి పెద్ద సైదులు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోగా మరో రెండు ఇళ్లు, నల్లబంగూడెంలో మూడు ఇళ్లు పాక్షింకంగా దెబ్బతిన్నాయి. ఆరబోసుకున్న ధాన్యం రాశుల కిందకు నీరు చేరి పాక్షికంగా తడిశాయి. ఆయా గ్రామాల్లో రోడ్ల వెంట ఉన్న చెట్ల కొమ్మలు విరిగాయి. 15 విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో తెల్లవారుజామున 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు విద్యుత్ను పునరుద్ధరించారు. అలాగే నల్లబండగూడెం, రెడ్లకుంట, కాపుగల్లులో ఈదురుగాలులకు దాదాపుగా 90 ఎకరాల్లో మామిడి, సపోట పంటలకు నష్టం జరిగింది. ఆయా తోటల్లో చెట్లు విరిగి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ కూలిన విద్యుత్ స్తంభాలు, విరిగిన చెట్లు ఫ లేచిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు ఫ మామిడి, సపోట తోటల్లో రాలిన కాయలు -
5 నుంచి రెవెన్యూ సదస్సులు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గరిడేపల్లి మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్కు హాజరైన అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఆవాస గ్రామాల రైతులంతా హాజరుకావాలని కోరారు. రైతులు రెవెన్యూ సదస్సుకు వచ్చేటప్పుడు తమ భూ సమస్యలకు సంబంధించిన పూర్తి ఆధార పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహ, ఏఎస్పీ నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ధర్మారెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవరావు, తహశీల్దార్లు శ్యాంసుందర్రెడ్డి, కృష్ణయ్య, నాగార్జునరెడ్డి, కవిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీటీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాననీటిని ఒడిసిపట్టాలి వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి నిర్వహించిన జిల్లా వాచ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల్లో బోర్ వెల్స్ వద్ద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శివధర్మ తేజ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అరుణాకర్రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలునాయక్, డీపీఓ యాదయ్య, సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఫ పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలంలో నిర్వహణ ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడి -
స్వనిధి.. నిలిచింది
11,922 మంది వీధి వ్యాపారులు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 11,922 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వారిలో తొలి విడతలో రూ. 10 వేల రుణం పొందిన వారు 11,542 ఉండగా రెండవ విడతలో రూ. 20 వేల రుణం పొందిన వారు 6,392 ఉన్నారు. మూడవ విడతలో రూ. 50 వేల రుణం పొందిన వారు 1,859 మంది ఉన్నారు. మూడవ విడత రుణం సక్రమంగా చెల్లించిన వారు ఈసారి రూ. లక్ష రుణం అందజేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.హుజూర్నగర్ : పట్టణ ప్రాంతాలలో చిరు, వీధి వ్యాపారులకు అందించే పీఎం స్వనిధి (ఆత్మనిర్భర్ నిధి) రుణాల ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించే సైట్ మూడు నెలలుగా పని చేయడం లేదు. దీంతో స్వనిధి రుణాలు అందడంలేదు. తొలి, మలి దశ రుణాల కోసం ఎదురు చూస్తున్న వీధివ్యాపారులు కొంత నిరాశకు గురవుతున్నారు. జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది.. మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించే వీధివ్యాపారులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. 2020లో కరోనా లాక్డౌన్ నుంచి ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గుర్తించిన వీధి వ్యాపారులకు మొదటి విడతలో లబ్ధిదారుడికి రూ. 10 వేల రుణం అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అందజేసే ఈ మొ త్తం వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది. రుణం కోసం ఎదురుచూపులు ఐదేళ్ల కిందట ప్రతి వీధి వ్యాపారికి రూ.10 వేలు ఖాతాలో జమ చేయగా ఈ మొత్తాన్ని ఏడాదిలోపు వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన వారికి మళ్లీ రుణం తీసుకోవడానికి వీలు కలిగేది. రెండో విడతలో రూ. 20 వేలు అందించగా మూడో విడతలో దానిని రూ. 50 వేలకు పెంచారు. రుణం మొత్తం పెరుగుతూ ఉండటం, వ్యాపారాభివృద్ధికి తోడుగా నిలవడంతో లబ్ధిదారులు రుణం తీసుకోవడానికి మళ్లీ మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకర్లు సైతం ఈ రుణాలు సక్రమంగా చెల్లించినవారికి అందించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారికి మూడు నెలలుగా రుణాలు అందించడంలేదు. దీంతో వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని రూ.లక్షకు పెంచితే.. ఆత్మనిర్భర్ నిధి పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించి మరీ రుణాలు అందిస్తుండగా ఇటీవల కొత్త పథకం అమలు చేసేందుకు వీలుగా సాంకేతికపరంగా ఆప్షన్ ఇవ్వక పోవడంతో పాతవారితో పాటు కొత్త వారికి కూడా రుణాలు అందించేందుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కొత్త పథకం అమలు చేసేంత వరకు పీఎం స్వనిధి పథకం నిలిచిపోయినట్లుగానే భావిస్తున్నారు. అయితే వీధి వ్యాపారులకు రూ. 50 వేల వరకు ఇస్తున్న రుణాన్ని చెల్లించిన వారికి దానిని రూ. లక్షకు పెంచాలని పలువురు కోరుతున్నారు. దీంతో ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఉపాధి పెరిగి జీవన ప్రమాణాలు మరింత పెరగనున్నాయని పలువురు భావిస్తున్నారు. ఫ అందని ప్రధానమంత్రి స్వనిధి రుణాలు ఫ మూడు నెలలుగా పనిచేయని సైట్ ఫ వీధి వాపారుల్లో నిరాశ రుణాల మంజూరు వివరాలు మున్సిపాలిటీ వీధివ్యాపారులు రూ. 10 వేలు రూ. 20 వేలు రూ. 50 వేలు సూర్యాపేట 5,276 5,151 2,390 520 కోదాడ 3,302 3,072 1810 558 హుజూర్నగర్ 1,720 1,718 1,163 419 తిరుమలగిరి 931 922 557 192 నేరేడుచర్ల 693 679 472 170 మొత్తం 11,922 11,542 6,392 1,859 -
మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు
రజాకార్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ, ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ దర్శకుడు విజయ్కుమార్ను వరించిన అవార్డుచిట్యాల, భూదాన్పోచంపల్లి : ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ, భూదాన్పోచంపల్లికి చెందిన బడుగు విజయ్కుమార్లకు ఈ అవార్డు దక్కింది. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటిసారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్కుమార్ ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే15వ ఫిల్మ్ ఫెస్టివల్లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్కుమార్ ఎంపికయ్యారు. యాట సత్యనారాయణ గురువారం రాత్రి జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లోనే అవార్డు అందుకోగా.. బడుగు విజయ్కుమార్ శనివారం అందుకోనున్నారు. -
అనుమతులకు మించి నిర్మాణాలు
సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో కొందరు గృహ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటే.. మరికొందరు ఒకటి రెండు అంతస్థులకే అనుమతి తీసుకుని అంతకుమించి అంతస్థుల నిర్మాణాలు చేపపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రం కావడంతో గృహ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు కూడా అధికమయ్యాయి. దాదాపు పట్టణంలోని సగం ఇళ్లకు అనుమతులు లేవని అధికారులు లెక్కలు సేకరించారు. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైరవీలు చేస్తున్నారు.. మున్సిపాలిటీ నుంచి గృహ యజమానులు జీ ప్లస్ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకుని ఆపైన ఇష్టానుసారంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి కన్నా అదనంగా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అధికారులు నాలుగు నెలలుగా దాదాపుగా 30 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొందరికి నోటీసులు ఇచ్చి, ఐదారు ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా రెండేళ్ల క్రితం టాస్క్ఫోర్స్ టీమ్ను నియమించినప్పటికీ రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గి క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని పట్టణ వాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో భాగంగా చాలామంది భవన నిర్మాణాలకు అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. వీటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న గృహ యజమానులు నిబంధనలను పాటించడం లేదనే చర్చ సాగుతోంది. వీధి రోడ్లు ఇరుకుగా.. అనుమతులకు మించి అక్రమ భవనాలు ఒక ఎత్తైతే పట్టణంలో చాలా వీధుల్లో ఇంటి ముందు స్థలం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ర్యాంపులను వీధిరోడ్డు మీదికి వచ్చేలా నిర్మిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఇంటి ముందు ర్యాంపులను నిర్మిస్తుండడంతో వీధుల్లో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా వీధులగుండా ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫ పర్మిషన్ ఇంటికి.. నిర్మించేది బహుళ అంతస్థులు ఫ అంతర్గత రోడ్లను ఆక్రమించి ర్యాంపులు, మెట్లు ఏర్పాటు ఫ ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో వార్డులు 48నివాస గృహాలు 39,800 పట్టణ జనాభా 1,53,000ఇటీవల గుర్తించిన అక్రమ నిర్మాణాలు 30 -
‘ఈఏపీ’ పరీక్ష కేంద్రం తనిఖీ
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈఏపీ (ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ) సెట్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. బందోబస్తును పరిశీలించారు. బందోబస్తు నిర్వహణలో సిబ్బంది పనితీరును కొనియాడారు. ‘సప్లిమెంటరీ’కి విద్యార్థులను సిద్ధం చేయాలిఆత్మకూర్ (ఎస్): అధ్యాపకులు ప్రతిరోజూ కళాశాలకు వస్తూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఐఈఓ భానునాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బాధ్యతగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన విద్యాసంవత్సరం అడ్మిషన్లపై దృష్టి సారించాలన్నారు. గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాల యాదయ్య, కాలేజీ అధ్యాపకులు గునగంటి వెంకటేశ్వర్లు, దశరథ, డాక్టర్ అమల, లింగయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధపెట్టాలి : డీఆర్డీఓ పెన్పహాడ్: నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని డీఆర్డీఓ వీవీ.అప్పారావు నిర్వహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామంలో నర్సరీ, ఐకేపీ కొనుగోలు కేంద్రం, అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లోని మొక్కలకు రోజూ నీరుపోయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాబ్ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో 48గంటల్లో ధాన్యం డబ్బులు పడేలా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ సిబ్బంది, ఉపాధి హామీ, సీ్త్రనిధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏఓ అనిల్కుమార్, సీ్త్రనిధి మేనేజర్ జ్యోతి, ఏపీఎం అజయ్నాయక్, ఏపీఓ రవి, ఈసీమహేష్, వీఓఏ విజయ, రజిని, ఇందిరమ్మ, సుశీల, సీసీ పద్మావతి, సునీత, రమణ పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణమ్మకు హారతిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జీవనది కృష్ణమ్మకు శుక్రవారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక పల్లకీలో మంగళవాయిద్యాలతో ప్రహ్లాద ఘాట్ తరలించారు. అనంతరం ప్రత్యేక హారతి పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రవేశానంతరం మహా నివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బదరీనారాయణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
31వరకు ‘పోలీస్ యాక్ట్’ అమలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ‘30 పోలీస్ యాక్ట్’ అమల్లో ఉంటుందని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాక్ట్లో అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయకూడదని సూచించారు. అనుమతులు లేకుండా ఆయా కార్యక్రమాలు నిర్వహించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి చివ్వెంల (సూర్యాపేట) : తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని సూర్యానాయక్తండా, వాల్యతండా, వట్టిఖమ్మంపహాడ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమశాతం 17 ఉండాలని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందు వల్ల ఎక్కువ మొత్తంలో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ వెంకన్న, నిర్వాహకులు పాల్గొన్నారు. హక్కుల సాధనకు పోరాడేది ఎర్రజెండానేగరిడేపల్లి: కార్మికుల హక్కుల సాధనకు నిరంతరం పోరాడేది ఎర్రజెండా అని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో మేడే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు, రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్.కె. యాకూబ్, సీపీఎం సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీరరాఘవయ్య, బొల్లెపల్లి శ్రీనివాసు, సుందరి రమాదేవి, జుట్టుకొండ కలమ్మ, వెంకటేశ్వర్లు, నారాయణ, మట్టయ్య, వెంకయ్య, సైదులు, ధనమూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసచారి, వెంకన్న, సైదులు, జంగయ్య, వీరస్వామి, భూతం నాగరాజు, శేఖర్, లక్ష్మయ్య పాల్గొన్నారు. పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగించాలిరామగిరి(నల్లగొండ): పాలిసెట్–2025 దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని పాలిటెక్నిక్ ఎస్సీ, ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ కోరారు. పాలిసెట్ దరఖాస్తులకు లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 చివరి తేదీగా నిర్ణయించి.. టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 30న ప్రకటించడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మే 13న ఎంట్రెన్స్ ఉన్నందున దరఖాస్తు తేదీని పొడిగించి మరింత మంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. -
సివిల్ కోర్ట్ జడ్జిగా గౌస్పాష బాధ్యతల స్వీకరణ
తుంగతుర్తి : తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా ఎం.డి. గౌస్ పాష గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల పట్ల కక్షిదారులకు విశ్వాసం పెంచుతామన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన సుందర్ బార్ అసోసియేషన్ సభ్యుడు జడ్జి గౌస్ పాష కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన సుందర్ మాట్లాడుతూ కోర్టు భవనానికి ప్రభుత్వం మూడు ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించిందన్నారు. భవన నిర్మాణానికి రూ.29 కోట్లను అధికారులు అంచనా వేశారన్నారు. త్వరలో అడిషనల్ కోర్టు మంజూరుకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎంను కలుస్తానని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కారింగుల వెంకటేశ్వర్లు ,ప్రధాన కార్యదర్శి కారింగుల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రవికుమార్ ,ట్రెజరర్ సతీష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రతాప్ ,సీనియర్ న్యాయవాది కుమారస్వామి, హరిచరణ్, చంద్రమౌళి ,అనిల్ పాల్గొన్నారు. -
‘హస్తం’లో సంస్థాగతం
గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సమన్వయకర్తలను టీపీసీసీ నియమించింది. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఇందులో బ్లాక్ అధ్యక్షుల ఎంపికపై సమన్వయకర్తలు పార్టీ నేతలతో చర్చించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశాలను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై ఆ సమావేశాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయి నాయకుల సమావేశాలను నిర్వహించి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై చర్చిస్తారు. జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురి పేర్లను, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను పార్టీ అధిష్ఠానానికి ప్రతిపాదించనున్నారు. అయితే, గ్రామ పార్టీ అధ్యక్షులను మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చర్యలు చేపట్టనున్నారు. రెండు జిల్లాల్లో ఆశావహులు ఎక్కువే.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల్లో ఎక్కువే ఉన్నారు. ప్రస్తుత నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, రాష్ట్ర నేతలు కొండేటి మల్లయ్య, పున్నా కై లాస్నేత, చనగాని దయాకర్ పేర్లు పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. ఈ నలుగురు నేతల అనుచరులు మాత్రం తమ నాయకుడికే పదవి ఇవ్వాలని ఎవరికివారు కోరుతున్నారు. మరోవైపు.. పార్టీలు మారిన వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు నేతలు పోటీపడుతున్నారు. జిల్లాలో సీనియర్ నేతలతో పాటు రాష్ట్రస్థాయి పదవులు కలిగిన నేతలు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. అందులో చకిలం రాజేశ్వర్రావు, తండు శ్రీనివాస్ యాదవ్, అన్నెపర్తి జ్ఞానసుందర్, ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఉండగా.. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. డీసీసీ పీఠం ఎవరికో... ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. నల్లగొండ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్నాయక్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. పీసీసీ నియమించిన ఇద్దరు సమన్వయకర్తలైన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, మరో నేత నజీర్ అహ్మద్, సూర్యాపేట జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్యే మురళినాయక్ ఇటీవల జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి గురించి పూర్తి వివరాలు సేకరించారు. ఆ జాబితాను టీపీసీసీకి పంపించనున్నారు. ఫ ఇప్పటికే సమన్వయకర్తలను నియమించిన టీపీసీసీ ఫ వారి ఆధ్వర్యంలోనే జిల్లా స్థాయి సమావేశాల నిర్వహణ ఫ డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన ఫ పోటీలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఫ 20వ తేదీ వరకు పూర్తికానున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ 20వరకు ప్రక్రియ పూర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమన్వయకర్తలు ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాల్సి ఉంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలతోపాటు బ్లాక్ కమిటీలను కూడా.. సమావేశాలు నిర్వహించి జాబితాలను టీపీసీసీకి పంపించాల్సి ఉంటుంది. ఈసారి పార్టీ విధేయులకే పదవులు దక్కుతాయని టీపీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
నివేదికను కలెక్టర్కు అందజేస్తా
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తానని అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. ఆత్మకూర్(ఎస్)మండలం నెమ్మికల్లోని 75 సర్వేనంబర్ స్థితిగతులు, కార్యాలయ అధికారులు, సిబ్బంది చేసిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 75 సర్వే నంబర్ కు సంబంధించిన పలు రికార్డులు, పహాణి ,వన్ బి,డీ ఆర్ లతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరి కిషోర్ శర్మ ,సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి!
కోదాడలో యథేచ్ఛగా మట్టిదందా రెవెన్యూ అధికారులదే కీలక పాత్ర కోదాడ మండలంలో జరుగుతున్న మట్టి దందాలో రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెందిన ఒకే సర్వేనంబర్లో లక్షల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా ఒకరిద్దరు వ్యాపారులే తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే ఇప్పటి వరకు కోదాడ రెవెన్యూ అధికారులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. అది మైనింగ్శాఖ చూసుకోవాలని చెబుతున్నారు. మైనింగ్ లీజుకు ఇచ్చిన ప్రదేశంలో అక్రమ తవ్వకాలు జరిగితే మేము చర్యలు తీసుకుంటాము, ఇతర ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరిగితే మాకు సంబంధం లేదని మైనింగ్శాఖ అధికారులు అంటున్నారు. అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమకు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటాం.. అది మైనింగ్.. రెవెన్యూశాఖలకు సంబంధించిన వ్యవహారం అని వారు తప్పించుకుంటున్నారు. ఇప్పటికై నా అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి కలెక్టర్.. మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఫ అంతా అధికారుల కనుసన్నల్లోనే..? ఫ మాజీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు కోదాడ: కోదాడ మండలం కూచిపూడి వద్ద సర్వేనంబర్ 615లో నాలుగు ఎకరాల 37 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో గత ప్రభుత్వ హయాంలో నాటి నేతల అండదండలతో అక్రమంగా మట్టి వ్యాపారం చేయడం పెద్ద దుమారాన్ని లేపింది. ప్రభుత్వం మారిన తరువాత మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, మరో మండల పార్టీ నేతల అండదండలతో మట్టిదందా జోరుగా సాగుతోంది. అధికారులు దాడులు చేసిన సమయంలో వెంటనే వీరు రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్క బెడుతుంటారు. అధికారులు, దందా రాయుళ్లకు మధ్య వీరే అన్నీ సర్దుబాటు చేస్తుంటారనే ఆరోపణలున్నాయి. నిత్యం రాబడి ఉండడంతో ఫిర్యాదులు వచ్చిన సమయంలో హడావుడి చేయడం ఆ తరవాత నామమాత్రపు జరిమానాతో సరిపుచ్చడం షరా మాములుగా మారింది. ఫిర్యాదు చేయకుండా.. గత నెల 25న కోదాడ మండలం కూచిపూడి వద్ద జరిగిన అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేయడానికి మైనింగ్శాఖ జిల్లాస్థాయి అధికారి కోదాడ రూరల్పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆయనకు పోలీసులు సహకరించకపోవడంతో ఇలా పోలీస్ స్టేషన్ బయట కింద కూర్చొని ఫిర్యాదు రాసుకోవాల్సి వచ్చింది. ఇక కొందరు రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఆయన ఫిర్యాదు చేయకుండా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. మధ్యాహ్నం స్టేషన్కు వచ్చిన ఆయనతో పోలీస్ అధికారులు రాత్రి 9–30 గంటల వరకు ఫిర్యాదు తీసుకోలేదని సమాచారం. అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి తేవడంతో ఆయన ఫిర్యాదు చేయకుండా అక్కడి వారు చెప్పినట్లు కేవలం జరిమానా విఽధించి వెళ్లిపోయారని తెలిసింది. ఇది కోదాడ మండలం కూచిపూడి వద్ద ఉన్న సర్వే నంబర్ 615 లోని ప్రభుత్వ భూమి. గత డిసెంబర్ 28న కోదాడకు చెందిన కొందరు మట్టి వ్యాపారులు అనుమతులు లేకుండా మట్టి తవ్వుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కోదాడ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి విచారణ చేశారు. ఒక పొక్లెయిన్, ఇతర వాహనాలను సీజ్ చేస్తామని, తవ్విన వారిపై చర్యలు తీసుకుంటామని, మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.ఇది జరుగుతుండగానే రాజకీయనేతలు కల్పించుకోవడంతో నామమాత్రపు జరిమానాతో నాడు వాహనాలను వదిలేశారు. మైనింగ్ శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ రెండు సంఘటనలు చూసిన తరువాత కోదాడ కేంద్రంగా సాగుతున్న మట్టిదందాలో కోదాడ రెవెన్యూ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది ఏప్రిల్ 25వ తేదీన కోదాడ మండలం కూచిపూడి వద్ద ఉన్న సర్వేనంబర్ 615లో కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తుండగా జిల్లా మైనింగ్శాఖ, కోదాడ తహసీల్దార్ కార్యాలయ అధికారులు దాడులు చేసి ఒక పొక్లెయిన్, ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. వీరు ఏకంగా మైనింగ్శాఖ 20 రోజులకు ఇచ్చిన అనుమతి పత్రాలను ఫోర్జరీ చేసి రెండున్నర నెలలు అదనంగా మైనింగ్ చేస్తున్నారు. వీరిపై కూడా ఎలాంటి కేసులు లేకుండా కేవలం జరిమానాతో అధికారులు వదిలేశారు. విచారణ చేస్తాం కోదాడ మండల పరిధిలోని సర్వే నంబర్ 615లో కొందరు అక్రమంగా మట్టి తవ్విన విషయం మా దృష్టికి కూడా వచ్చింది. మైనింగ్శాఖ అధికారులు జరిమానా విధించారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా మట్టి తవ్వితే కఠిన చర్యలుతీసుకుంటాం. 615 సర్వే నంబర్పై విచారణ చేస్తాం. – సీహెచ్. సూర్యనారాయణ, కోదాడ ఆర్డీఓ -
గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్ ఇచ్చారు
ప్రత్యేక అధికారుల పాలనలో ఎలాంటి గ్రామ సభ లేకుండా, ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా మైనింగ్ పనులకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. మైనింగ్ చేయడం వల్ల రైతు వేదిక, ఇంటిగ్రేటెడ్ పాఠశాల పూర్తిగా దెబ్బ తింటుంది. మైనింగ్ పర్మిషన్ ను అధికారులు రద్దు చేయాలి. – ఎల్లయ్య, రైతు, తొండ. పంట పొలాలు దెబ్బ తింటాయి మా భూమి పక్కనే ఉన్న పోరెల్ల గుట్టపై పశువులు, జీవాలు మేపుకొని జీవిస్తున్నాం. మైనింగ్ చేస్తే మా భూమిలో రాళ్లు పడి మేము వ్యవసాయం చేసుకో లేము. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. – ఈరంటి సోమయ్య, రైతు. మమ్మల్ని బెదిరిస్తున్నారు మా భూముల్లోనే మైనింగ్ కంపెనీ వాళ్లు బాట వేస్తున్నారు. మేము అడిగితే మమ్మల్నే బెదిరిస్తున్నారు. పక్కనే ఉన్న కుంటలో పశువులు నీళ్లు తాగకుండా మోటార్లతో నీళ్లు తోడిస్తున్నారు. అధికారులు స్పందించి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి. – కుమార్, తొండ. -
యువత చెడుమార్గంలో పయనించవద్దు : ఎస్పీ
నూతనకల్: సమాజంలో యువత చెడుమార్గంలో పయనించవద్దని ఎస్పీ నర్సింహ సూచించారు. బుధవారం నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో నిర్వహించిన పోలీసు ప్రజాభరోసా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నతమైన వారిగా గుర్తింపు పొందడానికి విద్యే ప్రధానమని అన్నారు. కష్టపడి చదువుతూ లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. సైబర్ మోసాలు, రోడ్డు భద్రత విషయలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ నర్సింహారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్రావు, ఏఎస్ఐ కోమటిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
‘స్థానిక’ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పీసీసీ పరిశీలకులు డాక్టర్ మురళీనాయక్, శత్రు బిజ్జిలు పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని, పాత, కొత్త నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో ప్రజల కోసం బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి కార్యకర్తలు వివరించాలన్నారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్ రమేష్రెడ్డి, నాయుడు సత్యనారాయణ, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు.ఫ పీసీసీ పరిశీలకులు డాక్టర్ మురళీనాయక్, శత్రు బిజ్జి -
ఆటలు నేర్చుకుందామా..
హుజూర్నగర్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, యువజన క్రీడా సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో మే 1 నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల్లో అర్హులైన వారిని శిక్షకులు (కోచ్లు)గా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో చిన్నారులకు ఈ వేసవిలో నెల రోజుల పాటు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడాకారుల వివరాలు వెబ్సైట్లో నమోదు శిబిరాలకు వచ్చే విద్యార్థుల వివరాలు గతంలో శిక్షకుల వద్ద నమోదు చేసుకునే వారు. వీరికి ప్రత్యేక హాజరు రిజిస్టర్ నిర్వహించేవారు. అయితే ఈఏడాది నుంచి క్రీడాకారుల వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేస్తారు. మే 5వ తేదీ లోపల ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇటీవల శిక్షకులకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తారు. అంతే కాకుండా వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది. దాతలు సహకారం అందిస్తే మరింత ప్రయోజనం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్థానికంగా ఉండే దాతలు స్పందించి తమవంతు సహాయ సహకారలు అందిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. నెల రోజుల పాటు జరిగే శిబిరంలో వారానికి ఒకసారి పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలి. క్రీడాకారులకు క్రీడా పరికరాలు, ప్రత్యేక క్రీడాదుస్తులు సమకూరిస్తే మరింత మంది చిన్నారులు, యువకులు ఎక్కువగా మైదానాల బాట పట్టే అవకాశం ఉంటుంది. జిల్లాలో 14చోట్ల శిక్షణ శిబిరాలు ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో 10 చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 4 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలైన తుంగతుర్తి మండలం వెంపటి, చిలుకూరు, నడిగూడెంలలో కబడ్డీ శిక్షణ శిబిరాలు, కోదాడ మండలం కూచిపూడి, సూర్యాపేట మండలం యడ్లపల్లిలో ఖోఖో, కోదాడ మండలం కొమరబండ, గుడిబండ, చిలుకూరు మండలం పాలెఅన్నారం, మేళ్లచెరువు, అర్వపల్లిలో వాలీబాల్ క్రీడల శిక్షణ శిబిరాలు నిర్వహించ నున్నారు. పట్టణ ప్రాంతాలైన సూర్యాపేట పరిధిలోని పిల్లలమర్రిలో అథ్లెటిక్స్, టేకుమట్లలో బాస్కెట్బాల్, కోదాడ పరిధిలోని కేఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బాస్కెట్బాల్, కొమరబండలో వాలీబాల్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 14 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులు. వారికి రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఆయా క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ఇప్పటికే ఆయా చోట్ల క్రీడా మైదానాలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి జూన్ 6వరకు విద్యార్థులకు వేసవి క్రీడల శిక్షణ ఫ జిల్లాలో 14 చోట్ల శిబిరాలు ఫ 14ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి శిబిరాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. సంబంధిత క్రీడాంశాలకు సంబంధించిన సామగ్రిని అందిస్తాం. శిబిరాల్లో తాగునీటి వసతి, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతాం. గ్రామీణ క్రీడాకారులు శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. ఆయా క్రీడల్లో మరింతగా రాణించాలి –జి రాంచందర్రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట -
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
మేళ్లచెరువు : భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం మేళ్లచెరువు మండలకేంద్రంలో నిర్వహించిన భూ భారతిచట్టం –2025 అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి 18 రాష్ట్రాల్లో నిపుణులు, మేధావులు, అధికారుల సూచనలు తీసుకొని భూభారతిచట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి మనిషికి ఆధార్నంబర్ ఉన్నట్లుగానే ప్రతి కమతానికి భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. రైతుల భూమికి హద్దులతో కూడిన మ్యాప్ రూపొందించి ఇస్తామన్నారు. ఫౌతి చేసేటప్పుడు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి తదనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో చేసిన మ్యుటేషన్లపై అప్పీల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో ఎటువంటి అభ్యంతరం ఉన్నా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల వద్ద పరిష్కారం చేసుకోవచ్చని లేని పక్షంలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు , మహిళా రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు అందించనున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామ పాలన అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు,వ మండల ప్రత్యేక అధికారి పద్మ, తహసీల్దార్ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికదేశ్ముఖ్, ఎస్ఐ పరమేష్, కాకునూరి భాస్కరరెడ్డి, కొట్టె సైదేశ్వరరావు, రామచంద్రయ్య, గంగయ్య, సుధాకర్నాయక్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యకల్యాణంలో భాగంగా ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు చేశారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రసరమ్యంగా రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ హెచ్చరించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారులో వివాదాస్పద భూమిని అక్రమంగా పట్టా చేసిన విషయమై ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ఈనెల 24వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ పి.రాంబాబును నియమించారు. వివాదాస్పద భూమి పట్టా విషయం, మండల రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరుపై విచారణ నిర్వహించి పూర్తి నివేదికను తక్షణమే అందించాలని ఆయన ఆదేశించారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ఫ భూమి అక్రమపట్టాపై విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ -
ముగిసిన ఈఏపీ సెట్
అనంతగిరి: అనంతగిరి మండల కేంద్రంలో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఏపీ సెట్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండవ రోజు నిర్వహించిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకు గాను 190మంది హాజరు కాగా 10మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సురేష్కుమార్ తెలిపారు. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీసూర్యాపేటటౌన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 16వ తేదీ వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించ్చని సూచించారు. రూ.50 అపరాద రుసుంతో ప్రతి పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 రుసుం చెల్లించి రీకౌంటింగ్ చేసుకోవచ్చని సూచించారు. రీ వెరిఫికేషన్ కోసం ఆన్సర్ బుక్కావాల్సిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలని తెలిపారు. ఈ రుసుంను ఫరీక్ష ఫలితాల నుంచి 15రోజుల్లోగా ట్రెజరీ చలాన్ ద్వారా చెల్లించాలని సూచించారు. చలానా, హాల్ టికెట్ కాపీ జత పరిచి ఆ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో సంతకం చేయించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. నేటి నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఈడీ, ఎంఈడీ కాలేజీలకు గురువారం నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు. ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలుసూర్యాపేట : నీటి పారుదల శాఖ సూర్యాపేట సర్కిల్ ఈఈగా సూర్యాపేట డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎన్. వెంకట రమణకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
96.81 శాతం ఉత్తీర్ణత
ఫ బాలుర కంటే బాలికలదే పై చేయి ఫ గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత ఫ అత్యధికంగా మోడల్స్కూల్ విద్యార్థినికి 586మార్కులు సూర్యాపేట టౌన్: పదో తరగతి ఫలితాల్లో 96.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెరుగైన ప్రతిభ కనబర్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 6వ స్థానంలో నిలువగా ఈ సారి 14వ స్థానానికి పడిపోయింది. బాలురకంటే బాలికలే పై చేయి సాధించారు. 11,508 మంది పాస్ జిల్లాలో మొత్తం 11,887 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 11,508 మంది పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6,077 మంది పరీక్షలు రాయగా 5,845 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 5,810 మంది పరీక్షలు రాయగా 5,663 మంది ఉత్తీర్ణత సాధించి బాలుర కంటే బాలికలే పై చేయిగా నిలిచారు. సత్తా చాటిన ప్రభుత్వ విద్యార్థులు.. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 93.75శాతం ఉత్తీర్ణత సాధించగా ఆశ్రమ పాఠశాలలో 98.65శాతం, బీసీ వెల్ఫేర్ పాఠశాలలో 99.61శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 85.76 శాతం, కేజీబీవీలలో 97.29శాతం, మోడల్ స్కూల్స్లో 97.16శాతం, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100శాతం, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 98.69 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 96.88 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలో 94.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 98.62శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే తగ్గిన జిల్లా ర్యాంకు.. గత ఏడాది 11,910 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,542 మంది విద్యార్థులు పాసై 96.91శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మొత్తం 11,887 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,508 మంది విద్యార్థులు పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ ర్యాంకు తగ్గింది. ఎం రితికారెడ్డి(586) స్నేహిత(580), మద్దిరాల గురుకుల పాఠశాల జె. ప్రవీణ్(578)సీహెచ్ ఈశ్వర్(578)ఇమాంపేట మోడల్ స్కూల్, సూర్యాపేట మండలం వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ విద్యాసంస్థలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు 85, మోడల్ స్కూల్స్ రెండు, కేజీబీవీ 10, తెలంగాణ రెసిడెన్షియల్ ఒకటి, ఆశ్రమ పాఠశాలలు 12, మైనార్టీ రెసిడెన్షియల్స్ రెండు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నాలుగు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు..!
మట్టి మాఫియాకు రాజకీయ నేతల అండదండలు రెండు నెలల 20 రోజులకు రూ. 75 వేలు తమ సంతకాలను ఫోర్జరీ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాల్సిన మైనింగ్శాఖ అధికారులు కాసులకు కక్కుర్తిపడి మైనింగ్ మాఫియాతో కుమ్మకై ్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 20 రోజుల పాటు మట్టి తవ్వకానికి అనుమతించిన అధికారులు దాని కోసం రూ. 2 లక్షలు వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి, అధికారుల ఉత్తర్వులు ఫోర్జరీ చేసి రెండు నెలల 20 రోజుల పాటు అక్రమంగా మట్టిని తరలించిన వారికి అధికారులు వేసిన ఫైన్ కేవలం రూ.75 వేలు మాత్రమే. నిబంధనల ప్రకారం దాదాపు రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. కానీ ప్రొక్లెయిన్కు రూ. 50 వేలు, ఐదు టిప్పర్లకు కలిపిరూ. 25 వేలు ఫైన్ మాత్రమే వేశారు. మైనింగ్శాఖ అధికా రులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి పోలీసులు కేసునమోదు చేయలేదని చెబుతున్నారు. కోదాడ : కోదాడ కేంద్రంగా సాగుతున్న మట్టిమాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలనే ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా లక్షలు విలువైన మట్టిని రాత్రి పగలు అనే తేడా లేకుండా మూడు నెలలుగా తరలించుకు పోతోంది. అయితే మట్టి మాఫియాపై ఫిర్యాదులు రావడంతో జిల్లా మైనింగ్ శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఆకస్మికదాడి చేసి రెడ్హ్యాండెడ్గా ఒక ప్రొక్లెయిన్, ఐదు ట్రిప్పర్లను పట్టుకున్నారు. ఈ సమయంలో తాము అనుమతి ఇచ్చిన పత్రాలను ఫోర్జరీ చేసి తేదీలను మార్చివేసి రెండు నెలలకు పైగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, కేసులు పెడతామని చెప్పారు. కానీ ఏమైందో ఏమోగాని సదరు మట్టి దందారాయుళ్లపై కనీసం పిటీ కేసు పెట్టకుండా నామమాత్రపు జరిమానాతో అధికారులు వదిలేశారు. మైనింగ్శాఖ ఉత్తర్వులనే మార్చారు కోదాడ మండల పరిధిలోని కూచిపూడి వద్ద సర్వేనంబర్ 615లో ఉన్న ప్రభుత్వ భూమిలో తాత్కాలిక మైనింగ్ చేసుకొని 1000 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వడానికి సీహెచ్. వెంకయ్య అండ్ కంపెనీకి జిల్లా మైనింగ్శాఖ అధికారులు జనవరి 16న అనుమతిని మంజూరు చేశారు. దీన్ని వీరు 2025 జనవరి 16 నుంచి 2025 ఫిబ్రవరి 4 మధ్యలోనే తవ్వుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వీరు ప్రభుత్వానికి రూ.2 లక్షల రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మట్టిదందా చేసేవారు మైనింగ్శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలలోని తేదీలను మార్చి అధికారి సంతకంతో ఫోర్జరీ పత్రాలను సృష్టించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 04 వరకు ఉన్న అనుమతిని జనవరి16 నుంచి జూన్ 04 వరకు అంటే అదనంగా నాలుగు నెలల పాటు వారే పొడిగించుకున్నారు. ఈ అనుమతి పత్రాలను చూపుతూ యథేచ్ఛగా మట్టిని వెంచర్లకు తరలించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. రెండున్నర నెలల తరువాత.. కూచిపూడి వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్న విషయాన్ని స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అది తమపని కాదంటే తమ పని కాదని ఆయాశాఖల అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ వస్తున్నారు. మట్టితోలకం అనుమతి ఫిబ్రవరి 4నే ముగిసింది.గడువు ముగిసిన రెండున్నర నెలల తరువాత అధికారులు కళ్లుతెరిచి ఈనెల 25న మైనింగ్శాఖ ఇన్చార్జి ఏడీ విజయరామరాజు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. తమ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఫోర్జరీ చేసిన విషయాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న ప్రొక్లెయిన్, ఐదు ట్రిప్పర్లను సీజ్ చేశారు. తమ ఉత్తర్వులను ఫోర్జరీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మైనింగ్శాఖ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మంతనాలు జరిపి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫ అనుమతి పత్రాలను ఫోర్జరీ చేసినా కేసు నమోదు చేయని అధికారులు ఫ రూ. 75 వేల జరిమానాతోనే సరి ఫ ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు ఫిర్యాదు చేయలేదు.. ఫైన్ వేశారు మైనింగ్శాఖ అధికారులు మట్టి తవ్వకాలపై మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. పట్టుకున్న వాహనాలలో ప్రొక్లెయిన్కు రూ.50 వేలు, ఐదు టిప్పర్లకు రూ.25 వేలు జరిమానా విధించారు. – అనిల్రెడ్డి, కోదాడ రూరల్ ఎస్ఐ -
2న మంత్రి ఉత్తమ్ రాక
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి మే 2వ తేదీన తిరుమలగిరి మండలానికి రానున్నారు. మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బిక్కేరు వాగుపై చేపట్టే బ్రిడ్జి నిర్మాణ పనులకు, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.ముగ్గురు అర్హత లేని డాక్టర్లపై కేసు నమోదుసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేకుండానే వైద్యం నిర్వహిస్తున్న మూడు హాస్పిటళ్లలో ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ కె.పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, ఆపిల్ స్కాన్ సెంటర్లలో అర్హత లేకుండా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని, ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించి అనుమతి పొందారని సూర్యాపేట ఐఎంఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్గా జాఫర్మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలోని కందిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ జాఫర్ సెక్రటేరియట్లో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మండలంలోని ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. ఈఏపీసెట్కు 379 మంది హాజరుఅనంతగిరి : అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం తెలంగాణ ఈఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది. రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలకు 400 మందికి అభ్యర్థులకుగాను 379మంది హాజరు కాగా 21మంది గైర్హాజరు అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 200 మందికి 191మంది , మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకు 188 మంది హాజరైనట్లు కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు చేశారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు.అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు. -
విజేత.. బాపట్ల జిల్లా గిత్తలు
మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఎద్దుల పందేల్లో కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా చండూరుకు చెందిన శిరీషాచౌదరి, శివరామకృష్ణచౌదరి గిత్తలు ప్రథమ బహుమతిని గెలుపొందాయి. రెండవ బహుమతిని పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన బ్రహ్మనాయుడు గిత్తలు, మూడవ బహుమతి పల్నాడు జిల్లా మాచవరంనకు చెందిన లక్ష్మయ్యచౌదరి గిత్తలు పొందాయి. విజేతలకు చర్చి కమిటీ యూత్ సభ్యులు నగదు, షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ ఆదూరి స్రవంతికిషోర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చిన్నపరెడ్డి, మధుసూదన్రెడ్డి, బాల్రెడ్డి, బాలశౌరిరెడ్డి, ఆంటోనిరెడ్డి, థామస్రెడ్డి, సోసఫ్రెడ్డి, కిరణ్రెడ్డి, రాకేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బండ లాగుతున్న బాపట్ల జిల్లా గిత్తలు -
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవ చేయాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో ఏప్రిల్ నెలలో వచ్చే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇలాంటి కార్య క్రమాలు వృద్ధాప్యంలో ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్కల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువరప్రసాద్, హనుమారెడ్డి, విద్యాసాగర్, పొట్టా జగన్మోహన్రావు, వెంకటేశ్వరరావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామంలోనే భూ సమస్యల పరిష్కారం
మోతె : గ్రామంలోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం–2025 అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ధరణిలో చాలా సమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు ఆందోళనలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధరణిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, 18 రాష్ట్రాలలో పరిశీలించి, నిపుణులు, మేధావులు, అధికారుల సూచనలు తీసుకొని ఈ భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారన్నారు. తర్వాత ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో అమలు చేసి, జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ మామిడి తోరణాలతో పండుగ వాతావరణంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దారు శ్రీకాంత్ పీపీటీ ద్వారా భూ భారతి చట్టం గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్, ఎంపీడీఓ ఆంజనేయులు, జలసాధన కమిటీ ఫౌండర్ దుశ్చర్ల సత్యనారాయణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు
బేస్మెంట్ పూర్తయిన లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష చొప్పున జమకోదాడరూరల్: పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడత బిల్లులు వచ్చేశాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ముగ్గుపోసి బేస్మెంట్ వరకు పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున పడుతున్నాయి. ఇప్పటి వరకు 291 మంది ఖాతాల్లో రూ.2.91కోట్లు జమ అయ్యాయి. మొదటి విడత రూ.లక్ష చొప్పున.. మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలో 23 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమఅవుతున్నాయి. ఈ 23 గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నవారిలో 3,240 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. గ్రౌండింగ్ పూర్తి చేసిన వారు 791 మంది ఉన్నారు. వీరిలో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన 291 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం 2.91కోట్లు వారిఖాతాల్లో జమ అయ్యాయి. 600 చదరపు అడుగులకు మించి కట్టుకుంటే.. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం పెట్టుకొని ఇంటి నిర్మాణం చేపట్టి బేస్మెట్ పూర్తయిన లబ్ధిదారులందరికీ మొదటి విడత బిల్లులు పడ్డాయి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకున్న వారికి బిల్లులు పడలేదు. ప్రభుత్వ నిబంధల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారి వివరాలను, ఇంటి కొలతలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఆటోమెటిక్గా నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉందా లేదా అనే విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు లోబడి కట్టుకున్న వారికి వెంటనే బిల్లులు వస్తున్నాయని అంటున్నారు. వీరిలో కొందరు తెలియక ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే మరికొందరు తెలిసికూడా కట్టుకున్నవారు ఉన్నారు. అయితే 600 అడుగుల విస్తీర్ణం కంటే మించి నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడంలేదు. అర్హత జాబితాలో ఉన్నవారు వెంటనే పనులు మొదలు పెట్టాలి మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. పనులు మొదలు పెట్టి బేస్మెంట్ పూర్తి చేసుకుంటే మొదటి విడత బిల్లులు పడతాయని అంటున్నారు.ఫ జిల్లా వ్యాప్తంగా 291 మందికి రూ.2.91కోట్లు.. ఫ 3,240 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు ఫ 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు నిర్మించుకుంటున్న వారికే బిల్లులు ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు.. నియోజకవర్గం పైలట్ అర్హులు గ్రౌండింగ్ రూ. లక్ష జమ గ్రామాలు అయినవారు సూర్యాపేట 4 257 75 24తుంగతుర్తి 6 431 108 16కోదాడ 6 962 329 172 హుజూర్నగర్ 7 1590 279 79600 చదరపు అడుగుల లోపే నిర్మించుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇష్టానుసారంగా ఇళ్లను నిర్మించుకొని ఇబ్బందులు పడొద్దు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో కట్టుకోవాలి. ఈ నిబంధలమేరకు ఇళ్లు నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులులేకుండా ఉంటుంది. అదే విధంగా అర్హత జాబితాలో పేరున్న వారు కూడా ఇంటి పనులు ప్రారంభించాలి. – ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ సూర్యాపేట జిల్లా -
ఇక.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ
హుజూర్నగర్ : గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ) విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం ప్రవేశపెట్టే అంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు ఆర్థిక భారం తగ్గనుందని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, భోజనంప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటులో ప్రభుత్వ బడుల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలో మొదట దాదాపు సగానికిపైగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఎంపిక చేసిన బడులను గుర్తించి రాష్ట్ర విద్యా శాఖకు నివేదిక అందజేయనున్నారు. కొత్తగా ప్రీ ప్రైమరీ ప్రారంభించే చోట ఉపాధ్యాయులను నియమించే అవకాశం ఉంది. పిల్లలకు పుస్తకాలతోపాటు యూనిఫామ్, రాగిజావ, మధ్యాహ్న భోజనం తదితరాలను ఉచితంగా అందించనున్నారు. ప్రాథమిక విద్య బలోపేతంపై దృష్టిప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సర్కారు దృష్టిపెట్టింది. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై మాట్లాడడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 78 వరకు ఉన్నాయి. వాటిల్లో 1–5 తరగతులు చదివేవారు 20 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభించినప్పుడు ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తుండడంతో అంగన్న్వాడీ కేంద్రాల నుంచి కొందరు ప్రైవేట్ పాఠశాలకు వెళుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్కారు ప్రీ ప్రైమరీ విధానం అమలుకు మొగ్గుచూపుతోంది.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు సన్నాహాలు తాజాగా నిర్ణయం తీసుకున్న సర్కారు వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచనవిద్యా సామర్థ్యాలు మెరుగుపడతాయి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేయ డం మంచిదే. ఈ విధానం అమలు అయితే సర్కారు పాఠశాలల్లోనే నర్సరీ నుంచి యూకే జీ వరకు విద్య అందనుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు మెరుగవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయి. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
‘స్వాహా’కారమే..
అవినీతికి నిలయంగా కొన్ని సహకార సంఘాలు కోదాడ: అన్నదాతలకు అండగా నిలిచి కష్ట సమయంలో అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఏర్పాటు చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) అవినీతికి కేరాఫ్గా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, చైర్మన్లు కుమ్మక్కవుతూ రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల రాయితీలను కూడా తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలు బయట పడినప్పుడు తాత్కాలిక విచారణ చేస్తున్న అధికారులు వారిని సస్పెండ్ చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఇక వీరిపై విచారణ సంవత్సరాల తరబడి కొలిక్కి రాకపోవడంతో కాజేసిన సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతకు అండేది.. సూర్యాపేట జిల్లాలో 39 సహకార సంఘాలున్నాయి. ఇవి అన్నదాతలకు అన్ని విధాలుగా చేదోడు, వాదోడుగా ఉండడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి ప్రాథమికమైన పనులను నిర్వర్తించడంతో విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతసేపటికీ సొసైటీ నిధులను ఎలా ఆరగించాలనే యావ తప్పా రైతులకు ఉపయోగపడే పనులు చేయడం లేదని రైతుల అంటున్నారు. జిల్లాలో ఉన్న 39 సహకార సంఘాలలో 18 సంఘాలపై వివిధ రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరిగిన సంఘాలలో సంవత్సరాల తరబడి విచారణ కొలిక్కిరావడం లేదు. దీనికి కాపుగల్లు ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతే ఉదాహరణగా చెప్పవచ్చు. నడిగూడెం మండల పరిధిలోని తెల్లబల్లి సహకార సంఘంలో సీఈఓగా పని చేస్తున్న ఉద్యోగి, ప్రజాప్రతినిధులతో కలిసి సొసైటీలోని రైతుల పేర కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు. ఇందులో కొంతమందివి మాఫీ కాగా మరికొన్ని మాఫీ కాలేదు. దీంతో వారికి రుణాలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం బయట పడింది. అధికారులు ప్రాథమిక విచారణ చేసి సీఈఓను తొలగించారు. ఇది గడిచి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటి వరకు తుది విచారణ పూర్తి కాలేదు. ఈ లోగా సదరు సీఈఓ ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా ఇక్కడి సొసైటీ పెద్దకు చెందిన బంధువు ఒకరు అన్నీ తానై వ్యవహారాలను నడుపుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది.. మునగాల మండల పరిధిలోని తాడువాయి సహకార సంఘం. ఇందులో పనిచేస్తున్న సీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్లు కలిసి రైతుల రుణమాఫీ సొమ్మును తమ సొంత ఖాతాలోకి మార్చుకున్నారు. దాదాపు రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఈ సొసైటీ చైర్మన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలను తన సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. అక్రమార్కుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నా ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని రైతులు అంటున్నారు. సొసైటీ నిర్వాహకం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేవారే కరువయ్యారు. అక్రమార్కుల నుంచి రికవరీ చేస్తాంజిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాలలో సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాం. వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం. సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. సంఘాల కార్యకలాపాలపై నిగా పెంచాం. – పద్మ, డీసీఓ, సూర్యాపేట -
ప్రతి కమతానికి ‘భూధార్’
హుజూర్నగర్ : భా భారతి చట్టంతో సులువుగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం హుజూర్నగర్లో భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కమతానికి భూధార్ కార్డు కేటాయించి దీనిలో హద్దులతో కూడిన మ్యాప్ పొందుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఫౌతి చేసేటప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన మ్యుటేషన్లపై అపీల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో మ్యుటేషన్ల అభ్యంతరాలు ఉంటే రెండు అంచెలుగా అపీల్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. భూభారతి చట్టంపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీఓ శ్రీనివాసులు భూభారతిలోని ఒక్కొక్క అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. సదస్సులో ఏఎంసీ చైర్పర్సన్ దేశ్ముఖ్ రాధిక, డీసీసీబీ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, ఏడీఏ రవి, ఇన్చార్జి తహసీల్దార్ నాగేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్లు జక్కుల నరేందర్, శౌరిరెడ్డి, గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సాదాబైనామాకు మోక్షం!
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్పై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పోర్టల్లో సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్ల క్రితం సాదాబైనామా కింద భూముల మార్పిడి కోసం రైతులు వేలాది దరఖాస్తులు ఇచ్చారు. నాటినుంచి వీటికి అతీగతి లేకుండా పోయింది. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు చేతికి రావడం లేదు. ఈ నేపథ్యంలో భూభారతి పోర్టల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో 29,814 పెండింగ్ దరఖాస్తుదారులకు మోక్షం కలగనుంది. సాదాబైనామాకు అవకాశం ఇవ్వడంతో..2014 జూన్ 2 నాటికి ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల క్రమవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం అవకాశమిచ్చింది. దీనికి సంబంధించి 2020 నవంబర్ 10 వరకు జిల్లావ్యాప్తంగా దాదాపు 29,814 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉండగా.. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ధరణి చట్టాన్ని ప్రవేశపెట్టారు. పాత చట్టం ప్రకారం సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించగా కొత్తచట్టం అమలులోకి రావడంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. పెండింగ్లో 29,814 దరఖాస్తులు ఐదేళ్లుగా కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు పట్టాలు రాక నానా అవస్థలు భూ భారతి పోర్టల్పై ఆశలుఆర్డీఓలకు బాధ్యతలు.. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో సాదాబైనామా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ చట్టంలోనే ఈ సాదాబైనామా దరఖాస్తులపై 90 రోజుల్లోపు విచారణ చేపట్టాలని, ఈ బాధ్యతలను సైతం ఆర్డీఓలకు అప్పగించారు. విచారణ చేపట్టి దరఖాస్తుదారులకు హక్కులు కల్పించాలని చట్టంలో పేర్కొనడంతో వారికి ఊరట కలగనుంది. -
వరి కొయ్యలను కాల్చొద్దు
గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే.. ● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్తో పాటు 1400 కిలోల కార్బన్డైయాకై ్సడ్ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్ పాస్పేట్ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్డైయాక్సెడ్ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి. నేలలో కలియ దున్నితే అధిక లాభాలు గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్ -
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్మార్, దోగిపర్తి సంతోష్, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు. -
మఠంపల్లిలో పందెం గిత్తల జోరు
● కొనసాగుతున్న ఎద్దుల పందేలుమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్రెడ్డి, గ్రేగోల్డ్ సిమెంట్స్ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్రెడ్డి, రవీందర్రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు
నకిరేకల్: వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్పై కాంగ్రెస్ మంత్రులు పొగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, వంటల చేతన్, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ రెడ్డి, పరమేష్, నవీన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఆటో సీజ్ -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి.. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్, దొడ్డి మనోజ్ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
కోతుల దాడిలో వృద్ధుడికి గాయాలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోదాడలో పిచ్చి కుక్క స్వైర విహారం ● 10 మందిపై దాడి ● ఓ బాలుడికి తీవ్రగాయాలు కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్నగర్, తిలక్నగర్, ఖమ్మం క్రాస్రోడ్ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్ విగతజీవిగా కనిపించాడు. హజరత్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
సూర్యాపేట టౌన్: బైక్పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గల అండర్ పాస్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఫార్మసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ పాస్కు అడ్డదారులుకోదాడ: కోదాడ కేంద్రంగా కొద్ది రోజులుగా జరుగుతున్న జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల బీఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో భాగంగా బ్యాక్లాగ్ సబ్జెక్ట్లు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. పరీక్ష రాయాల్సిన విద్యార్థులను ఓ ఫంక్షన్ హాల్ వద్ద కూర్చోబెట్టి పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లును అక్కడికి తెచ్చి ఇచ్చి పరీక్ష రాసిన అనంతరం వాటిని తీసుకెళ్లి పరీక్షా కేంద్రంలో ఉన్న ఇతర విద్యార్థుల పేపర్లతో కలుపుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి కళాశాల యాజమాన్యాన్ని భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని భావించిన కళాశాల యాజమాన్యం దీనిలో కొంత మొత్తం ముట్టజెప్పినా ఈ విషయం బయటకు పొక్కి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందంటే... కోదాడలో ఉన్న ఐదు బీఫార్మసీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో చదువుతున్నారు. వీరిలో కొందరు ఫైనల్ ఇయర్కు వచ్చినప్పటికి మొదటి సంవత్సరం సజ్జెక్ట్లు పాస్ కాలేదు. ఈ సారి కూడా పాస్ కాకపోతే విద్యాసంవత్సరం వృథా కావడంతో పాటు వచ్చే సంవత్సరం మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుందని భావించి సెంటర్ నిర్వాహకులతో మాస్కాపీయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలుంటాయి కాబట్టి అక్కడ కాకుండా వేరే చోట పరీక్ష రాసి ఆ జవాబు పత్రాలను తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలోని జవాబు పత్రాలతో కలపడానికి కోదాడలోని ఓ సెంటర్ నిర్వాహకులు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీని కోసం ప్రతి విద్యార్థి నుంచి సబ్జెక్టుకు రూ.10 వేల చొప్పున సదరు సెంటర్ నిర్వాహకులు వసూలు చేశారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రహస్య ప్రదేశంలో.. ఒప్పందంమేరకు విద్యార్థులందరినీ ఒక రహస్య ప్రదేశం(ఓఫంక్షన్హాల్) లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తుండగా కొందరికి సమాచారం తెలిసింది. దీంతో దాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి కళాశాల యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు కొంత మొత్తం ముట్టజెప్పి విషయాన్ని బయటకు రాకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు స్థానిక విద్యార్థులు గమనించి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై జేఎన్టీయూహెచ్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అక్రమాలకు పాల్పడిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ ఫంక్షన్హాల్కు రహస్యంగా పరీక్ష పేపర్లు, ఆన్సర్షీట్లు తెచ్చి రాయిస్తున్న సెంటర్ నిర్వాహకులు ఇతర రాష్ట్రాల బ్యాక్లాగ్ విద్యార్థుల నుంచి కళాశాల నిర్వాహకుల వసూళ్లు! కోదాడలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం -
సస్యశ్యామలం చేస్తాం
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. బక్కతాయికుంట (రూ.20.22 కోట్లు), మునుగోడు (రూ.6.08 కోట్లు), నర్సింగ్బట్ల (రూ.19.95 కోట్లు) ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్కు ఎదుల ద్వారా నీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. తాము రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పిలిిప్పిన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రణాళికా బద్ధంగా జిల్లా అభివృద్ధి.. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్ అదనపు బ్లాక్, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్ సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నిర్మించే అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్కు తీసుకొస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నామన్నారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే ఎక్కువ సమయం కార్యాలయాల్లో ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, మందుల సామేల్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ శరత్చంద్రపవార్, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్కుమార్, నీటిపారుదల సీఈ అజయ్కుమార్, డీఆర్ఓ అశోక్రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈఈ సతీష్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణం సాగుతోంది : మంత్రి కోమటిరెడ్డి ఫ కలెక్టరేట్ అదనపు భవన సముదాయం, లిఫ్టు పనులకు శంకుస్థాన -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
సూర్యాపేట అర్బన్: ఆపరేషన్ కరాగ్ను నిలిపివేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ పిలుపుమేరకు వామపక్ష పార్టీలతో కలిసి నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపి మాట్లాడారు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అడవులన్నీ బాంబుల మోతలతో తల్లడిల్లుతున్నాయని, కర్రెగుట్ట పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుంచి ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా వందలాదిమంది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్రె గుట్ట ప్రాంతం నుంచి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా స్పందించి ములుగు, చర్ల ప్రాంతాల్లో ఉన్న బలగాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ జిల్లా నాయకుడు దంతాల రాంబాబు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎల్. భద్రయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. లింగయ్య, ప్రజా ఫ్రంట్ నాయకులు కోటయ్య, కరీం, సీపీఐ జిల్లా నాయకులు బూర వెంకటేశ్వరు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దండ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
తీరని కషా్టలు
వడువని వడ్లు..భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వసతులు కల్పించలేదు. ఏ సెంటర్లోనూ రైతులకు నిలువ నీడ లేకుండా పోయింది. కేవలం చెట్ల నీడనే సేదదీరే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల తాగునీటి వసతి లేక వేసవిలో మండుతున్న ఎండలకు దాహార్తి తీర్చుకోవడానికి రైతులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. వీటితో పాటు టార్పాలిన్లు లేకపోవడంతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతోంది. గన్నీ బ్యాగులు, సరైన రవాణా సదుపాయంలేక కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. 4.07 లక్షల మెట్రిక్ టన్నలే లక్ష్యంగా..జిల్లాలో యాసంగి సీజన్లో అత్యధికంగా వరి సాగైంది. దొడ్డురకమే కాకుండా సన్నరకాలను రైతులు సాగు చేశారు. దాదాపు 4.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. రైతులు అవసరాలు, విత్తనాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా చివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను 286 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా మందకొడిగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తేమ పేరుతో చాలాచోట్ల కాంటాలను నెమ్మదిగా వేస్తున్నారు. మరికొన్నిచోట్ల గన్నీబ్యాగుల కొరత, రవాణా సదుపాయం లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. అసౌకర్యాలతో ఇబ్బందులు..ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కరెంటు, టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు, టెంట్ సౌకర్యం ఉండాల్సి ఉంది. అయితే జిల్లాలోని 286 సెంటర్లకు గాను ఏ సెంటర్లోనూ కనీస సౌకర్యాలను నిర్వాహకులకు కల్పించడం లేదు. చాలాచోట్ల నీడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టెంట్ కూడా వేయకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల నీడన ధాన్యం ఆరబోయడం, రాశి చేసేందుకు వచ్చి అలసిపోయిన రైతులు ఉంటున్నారు. కేవలం సెంటర్ల నిర్వాహకులు ఉండేలా చిన్నపాటి టెంట్ మాత్రమే వేస్తున్నారు. ఇక మంచినీళ్లు సైతం చాలా సెంటర్లలో అందుబాటులో ఉండడం లేదు. అలాగే టార్పాలిన్లు ఒక్క సెంటర్లోనూ అందుబాటులో లేవు. రైతులే స్వయంగా కొనుగోలు చేసి తమ పంటను కాపాడుకుంటున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా అకాల వర్షాల నేపథ్యంలో నిర్వహకులు ముందు జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం కొనుగోళ్లను సైతం ముమ్మరం చేయకపోవడంతో రైతులు రోజుల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు. రైతులపై టార్పాలిన్ల కిరాయి భారంకొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు టార్పాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు పట్టాలను కిరాయికి తెచ్చుకుంటున్నారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ.30కి తెచ్చుకొని ధాన్యంపై కప్పుకుంటున్నారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సుమారు 20 రోజులకుపైగా పడుతోంది. అయితే రెండు ఎకరాల్లో పండించిన ధాన్యం ఆరబోయడంతో పాటు కప్పడానికి ఐదు పట్టాలు అవసరం. వీటి కోసం రోజు రూ.150 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా 20 రోజుల పాటు ఉంటే రైతుపై రూ.3వేల అదనపు భారం పడుతుంది.ఇది.. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం. ఈ కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. నీడకోసం చిన్న గుడిసె వేసినప్పటికీ అది నిర్వాహకులు ఉండడానికే సరిపోతుంది. రైతులు మాత్రం చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. టార్పాలిన్ల సరఫరాలేక రైతులే కిరాయికి తెచ్చుకొని ఇలా కొప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఈ పరిస్థితే నెలకొందిఫ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు ఫ ఎండలో చెట్లను ఆశ్రయిస్తున్న రైతులు ఫ తాగునీటికీ ఇబ్బందే.. ఫ టార్పాలిన్లులేక వర్షాలకు తడుస్తున్న ధాన్యం ఫ మందకొడిగా ధాన్యం కొనుగోళ్లుచెట్ల కిందనే ఉంటున్నాం రామన్నగూడెం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 20 రోజుల కిందట 600 బస్తాల ధాన్యం అమ్మడానికి పోశాను. ఇంతవరకు కాంటాలు కాలేదు. లారీలు రాకపోవడం, మిల్లులలో తొందరగా దిగుమతి కాకపోవడం మూలంగా రోజుల తరబడి కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సౌకర్యాలు ఏమీ లేవు. నీడలేక చెట్ల కిందనే ఉంటున్నాం. ఈ కేంద్రంలో ధాన్యం పోయడానికి స్థలం లేక గంగ దేవమ్మ బండపైనే ధాన్యం పోశాను. వర్షం వస్తే ధాన్యం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. – వజ్జె శ్రీనివాస్, రైతు, రామన్నగూడెం -
సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం
రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్ రెగ్యూలేటరీని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్ బాక్స్లను బిగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. హెడ్రెగ్యూలేటర్ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్, అమర్, వర్క్ ఇన్స్పెపెక్టర్ రజినీకాంత్, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్రెడ్డి, చాడ రమేశ్చందర్రెడ్డి, దండ అశోక్రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, రైతులు తదితరులు ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సూర్యాపేటటౌన్ : ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్జీలు పరిష్కరించాలి● అదనపు కలెక్టర్ రాంబాబుభానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 80 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలు, హౌసింగ్పై దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. తహసీల్దార్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి లత, ఎల్డీఎం బాపూజీ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 10 నుంచి కల్యాణమహోత్సవాలుహుజూర్నగర్ : మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి 15 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకొని సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగ, ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేవ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మహానివేదన చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి , ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
రైతులకు సోలార్ ప్లాంట్లు
పీఎం–కుసుమ్ పథకం కింద యూనిట్ల స్థాపన సబ్స్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరం.. వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. హుజూర్నగర్ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్ రెడ్కో అధికారులు ఎల్ఓ (లెటర్ ఆఫ్ అవార్డు) అందజేశారు. దీర్ఘకాలిక ఆదాయ వనరు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. ఫ విద్యుదుత్పత్తితో ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక ఫ మూడున్నర ఎకరాల పట్టాభూమి ఉన్నవారికి అవకాశం ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి. నిబంధనల ప్రకారం ఈఎండీ చెల్లించిన దరఖాస్తుదారులు డిస్కంలతో పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల అభీష్టం మేరకు ప్లాంట్లు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తున్నాం. బ్యాంకులు కూడా రుణాలు అందిస్తాయి. – ఎం.పాండురంగారావు, ఉమ్మడి జిల్లా మేనేజర్, టీజీ రెడ్కో నల్లగొండ జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్ఓ చెల్లింపులు ఇచ్చింది నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24యాదాద్రి 224 58 31 -
అందని హమాలీ చార్జీ
హమాలీ డబ్బులు చెల్లించాలి కాంటాలు వేసిన వడ్లకు హమాలీ ఖర్చు భారంగా మారింది. ఏటేటా హమాలీ కూలి పెంచుతున్నారు. ప్రభుత్వం ఈ డబ్బులను రైతుల అకౌంట్లలో వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సీజన్లో రూ.7నుంచి రూ.8వేల వరకు ఈ హమాలీలకే ఇవ్వాల్సి వస్తుంది. – బండి సత్యనారాయణ, కొత్తగూడెం, తుంగతుర్తి మండలం నేరుగా హమాలీలకే ఇవ్వాలి ప్రభుత్వం మొదట్లో హమాలీ ఖర్చులను రైతుల అకౌంట్లలో జమచేసింది. ఈ డబ్బులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. రైతులు కాకుండా నేరుగా హమాలీలకు ఇస్తే బాగుంటుంది. హమాలీ చార్జితో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. – బోళ్ల లక్ష్మయ్య, అనంతారం సూర్యాపేట : విత్తనం నాటిన నాటినుంచి పంటను అమ్మేదాకా రైతులకు ఖర్చుల భారం తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకుని ధాన్యం పండించిన రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామన్నా.. కష్టకాలంగానే మా రింది. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులు కాంటాలు వేసిన ధాన్యానికి హమాలీ ఖర్చును మొదట్లో ప్రభుత్వమే భరించింది. కానీ కొన్ని సీజన్లుగా హమాలీ ఖర్చు చెల్లించకపోవడంతో రైతులే హమాలీలకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారికి ఖర్చు తడిసిమోపడవుతోంది. ఈ యాసంగి సీజన్లోనైనా ప్రభుత్వం హమాలీ చార్జి చెల్లిస్తుందేమోనని రైతులు ఆశపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లక్ష్యం.. 4.07 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 4.07లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే గోనెసంచుల్లో వడ్లను నింపి లారీల్లో ఎత్తే హమాలీ ఖర్చును జిల్లాలో రైతులే భరిస్తున్నారు. ఈ సెంటర్లను నెలకొల్పిన తొలినాళ్లలో 2014, 2015 సీజన్లలో ప్రభుత్వం చెల్లించింది. మొదటగా రైతులు ఇస్తే వడ్ల బిల్లులు పడే సమయంలోనే హమాలీల డబ్బులను క్వింటాకు రూ.32 చొప్పునప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం అధికారులు ఈ లెక్కలు ప్రభుత్వానికి పంపుతున్నా.. డబ్బులు అందడం లేదు. ఏటేటా రైతులపై భారం వడ్ల కాంటా సమయంలో రైతులకు హమాలీల ఖర్చు విపరీతంగా ఉంటుంది. మొదట్లో క్వింటాకు రూ.30లకు వేసిన హమాలీలు సీజన్ సీజన్కు పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల క్వింటాకు రూ.50ల వరకు వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఉల్పాల పేరుతో వడ్లను బట్టి అదనంగా మరో రూ.500 నుంచి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఎకరం సాగు చేసిన వారికి హమాలీ ఖర్చు మొత్తంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అవుతుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఈ లెక్కన హమాలీల ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రైతులపై భారం పడుతోంది. ఇలా ప్రతి సీజన్లోనూ రూ.20 కోట్ల వరకు హమాలీ చార్జీల రూపంలో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఫ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు భారంగా హమాలీ ఖర్చు ఫ ఏటా ఒక్కపైసా విడుదల చేయని ప్రభుత్వం ఫ ఇప్పటికై నా చెల్లించాలని అన్నదాతల వేడుకోలు కొన్న ధాన్యం.. హమాలీ చార్జీల వివరాలు ఇలా.. సీజన్ కొన్నధాన్యం హమాలీ ఖర్చు (లక్షల మెట్రిక్ టన్నుల్లో) (రూ.కోట్లలో..) వానాకాలం(2024–25) 2.40 12 వానాకాలం(2023–24) 2.80 14 యాసంగి(2023–24) 3.30 16.5 వానాకాలం(2022–23) 3.10 15.50 యాసంగి(2022–23) 3.80 19 -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆ తరువాత గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : దొంగతనాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల్లో చాలామంది దూర ప్రాంతాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. ఎక్కువ రోజులు ఇళ్లు వదిలి వెళ్ళేవారు ఇరుగుపొరుగు వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటికి అలారం సిస్టమ్ పెట్టుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్ ఫోన్ ద్వారా చూసుకోవాలని సూచించారు. ఆరుబయట మేడపైన పడుకునే వారు మెడలో ఆభరణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, వాకిట్లో ముగ్గులు వేసే సమయంలో ఆభరణాలను చీర పైటతో కవర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా అపరిచితులు అడ్రస్ అడుగుతూ ఏమార్చి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరుచిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్వహించిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో రెండు నూతన గ్రామ శాఖ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ శాఖ కార్యదర్శులుగా బెజవాడ వినోద్, తాళ్లూరి వెంకటయ్య, సహా కార్యదర్శులుగా కడారి నరేష్, అలవాల రాజేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, చేపూరి కొండలు, సాహెబ్ అలీ, చిలువేరు అంజనేయులు, పిల్లుట్ల కనకయ్య, తాళ్లూరి మట్టయ్య, పెదమల్లయ్య, ఖాజామియా, నాగయ్య పాల్గొన్నారు. తొలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి సూర్యాపేట అర్బన్ : తెలంగాణ తొలిదశ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తొలిదశ ఉద్యమకారులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలతో పాటు వారికి గౌరవ పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్య సదుపాయంతో పాటు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో తొలి తెలంగాణ ఉద్యమకారులు దేవత్ కిషన్ నాయక్, కక్కిరేణి వెంకన్న, వున్నం సత్యనారాయణ, హజారి రంగయ్య, కొల్లూరి రామారావు, బందు రుద్రమ్మ, చిత్రం భద్రమ్మ, బత్తుల మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని పూర్తిచేసి నిత్యకల్యాణం నిర్వహించారు. అదే విధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
బోనస్ డబ్బుల కోసం కక్కుర్తి!
చిలుకూరు: సన్నధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బుల కోసం కక్కుర్తిపడి అక్రమాలకు తెర తీశారు కొందరు. ఈ వ్యవహారం ఆదివారం చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2,300తోపాటు బోనస్గా రూ.500 కలిపి రూ.2,800 చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకే బోనస్ వస్తుంది. కానీ, నారాయణపురం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ఓ వ్యాపారి వద్ద ధాన్యం కొంటూ నిబంధనలు విరుద్ధంగా వ్యవహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. నారాయణపురం గ్రామానికి చెందిన ఒక వ్యాపారి స్థానిక పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను మచ్చిక చేసుకున్నాడు. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు లారీల్లో 600కుపైగా ధాన్యం బస్తాలను (70 కేజీల బస్తాలు) తీసుకొచ్చి కేంద్రంలో రాశులుగా పోశాడు. ఆ ధాన్యాన్ని కేంద్రం నిర్వాహకులు కాంటా వేశారు. వారం రోజుల క్రితం కూడా ఇదే వ్యాపారికి చెందిన మరో లారీ ధాన్నాన్ని కాంటా వేయించినట్లుగా తెలిసింది. ఈ విషయం గ్రామ రైతులు, సంఘం చైర్మన్కు తెలియడంతో నిబంధనలకు విరుద్ధంగా ఎలా కాంటా వేస్తారని కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. అయితే సదరు వ్యాపారి రైతుల నుంచి తక్కువ రేటుకు కొని మద్దతు ధరతోపాటు బోసస్ వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఈ కేంద్రంలో అమ్మినట్టు తెలుస్తోంది. అయితే బినామీ రైతుల పాస్ పుస్తకాలు చూపించి అమ్మడం, కేంద్రం నిర్వాహకులు ఆ వ్యాపారి ఇచ్చే కమీషన్కు ఆశపడి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో కూడా మండల పరిధిలోని కొండాపురం ఐకేపీ కేంద్రంలో ఇత ర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయడంతో అధికా రులు స్పందించి దిగుమతి కోసం మిల్లుకు వెళ్లిన సదరు లారీని వెనక్కి రప్పించారు. ఈ ఘటనపై విచారణ చేసి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయినా అధికారుల తనిఖీలు లేక మళ్లీ నారాయణపురంలో ఇలాంటి వ్యవహారమే కొనసాగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీలు చేయాలని, సదరు కొనుగోలు కేంద్రంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు. ఫ బినామీ రైతుల పేరుతో ధాన్యం అమ్ముతున్న వ్యాపారి ఫ నారాయణపురం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు ఫ కమీషన్కు ఆశపడి సహకరిస్తున్న సెంటర్ నిర్వాహకులు -
గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో భువనగిరి డీఆర్డీఏ పీడీగా పనిచేసి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లారు. మొదటిసారి ఐఏఎస్ అధికారి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) హోదాలోనే దేవాదాయ శాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయ శాఖ డైరెక్టర్గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా పధ్నాలుగు నెలలుగా ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న భాస్కర్రావు బదిలీ అయ్యారు. -
మండే కాలం.. జర భద్రం!
లోక రక్షణార్థమే ఏసు జననం లోక రక్షణార్థమే ఏసుక్రీస్తు జన్మించారని విజయవాడ మేత్రాసన పీఠాధిపతి జోసెఫ్ రాజారావు అన్నారు. శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదుల రక్షణ తప్పనిసరి ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు. కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి. ● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు. ● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి. ● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి. ● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి. ● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి. ● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో పాల్గొనాలి వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో అందరూ భాగస్వాములు కావాలి. – కనుకుంట్ల విద్యాసాగర్రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్ న్యూస్రీల్పెంపుడు జంతువులు – జాగ్రత్తలు.. -
ఏడాదైనా 20శాతం పనులే..
సూర్యాపేట పట్టణంలో నత్తనడకన యూజీడీ నిర్మాణందోమలు వృద్ధిచెందాయి రోడ్ల పక్కనే మురుగు కాల్వలు ఉండడంతో దుర్వాసన వస్తోంది. దోమలు వృద్ధిచెందుతున్నాయి. యూజీడీ ఏర్పాటు చేయడం సంతోషకరం. కానీ నెలల తరబడి పనులు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. – చిత్తలూరి నరేష్, శ్రీనివాస కాలనీనిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తాం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఇప్పటికీ 20శాతం మేర పూర్తయ్యాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తాం. అన్ని వార్డుల్లో పైప్లైన్ వేసిన తర్వాత మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తాం. – నరేందర్, ఏఈ ఫ రూ.316 కోట్లతో పనులకు శ్రీకారం ఫ మొదటి జోన్లో కొనసాగుతున్నా.. రెండో జోన్లో మొదలు కాలే.. ఫ డిజైన్ రూపకల్పనలో జాప్యం.. బిల్లులు అందక ఆలస్యంసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డిజైన్ సర్వే చేయడంలో జాప్యం.. కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు అందకపోవడం.. వెరసి రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది దాటినా 20శాతం మాత్రమే పూర్తయ్యాయి. 2024 మార్చిలో ప్రారంభించినా.. సూర్యాపేట పట్టణంలో సుమారు రూ.316కోట్ల అంచనా వ్యయంతో 290 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇంటి నుంచి మెయిన్పైప్లైన్కు ఎనిమిది ఈంచుల వ్యాసం గలపైపులు, మెయిన్లైన్ కోసం ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రెండు నుంచి మూడు ఈంచుల వ్యాసం గల పైపులు వేయాలని నిర్ణయించారు. యూజీడీ పనుల కోసం పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. పనులకు 2023లో శంకుస్థాపన చేయగా 2024 మార్చిలో ప్రారంభించారు. మొదటి జోన్లో.. మొదటి జోన్లో భగత్సింగ్నగర్, జమ్మిగడ్డ, చింతలచెరువు, తిరుమలనగర్, చర్చికాంపౌండ్, అంబేద్కర్ నగర్, పాత ఎమ్మార్వో ఆఫీస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పైపులు వేసి వీటిని జమ్మిగడ్డలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన తర్వాత పుల్లారెడ్డి చెరువులోకి తరలించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ జోన్లో పనులు ప్రారంభమయ్యాయి. చర్చికాంపాండ్, బాలాజీ నగర్, భగత్సింగ్నగర్, అంబేద్కర్నగర్లో మొయిన్ పైప్లైన్ వేసే పనులు పూర్తయ్యాయి. ఇళ్ల నుంచి మెయిన్ పైప్లైన్కు పైపులు వేయలేదు. మిగతా చోట్ల మెయిన్పైప్లైన్ వేసే పనులు సాగుతున్నాయి. రెండో జోన్లో ఇలా.. రెండో జోన్ లో 9, 23, 24,25,29, 39, 40,41 42 వార్డుల్లో యూజీడీ పైపులు వేసి ఆ మురుగునీటిని నల్లచెరువు వద్ద నిర్మిస్తున్న ముగురునీటి శుద్ధి ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నల్లచెరువులోకి తరలిస్తారు. కానీ ఈ జోన్లో పనులే మొదలు కాలేదు. ఇందిరమ్మ ఫేస్–1, ఫేస్2, ఫేస్–3, శ్రీనివాస కాలనీ, రాజీవ్నగర్ ప్రాంతాల్లో మెయిన్ పైప్లైన్ వేయడానికి మార్కింగ్ వేసి వదిలేశారు. బిల్లులు రాక.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ డిజైన్ రూపకల్పనలో ఆలస్యం కారణంగా పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. దీనికితోడు కాంట్రాక్టర్కు గతంలో సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రజలకు తప్పని ఇబ్బందులు బాలాజీ నగర్, శ్రీరాంనగర్, కాశీంపేట ప్రాంతాల్లో రోడ్డును తవ్వి మెయిన్పైస్ లైన్ వేసి పూడ్చారు కానీ రోడ్డును చదును చేయకపోవడంతో గుంతలుగుంతలుగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలి ఇందిరమ్మ ఫేస్–1 కాలనీలో ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. రోడ్డు మధ్యలో డ్రిల్లింగ్ మిషన్లతో రంధ్రాలు చేసి వదిలేశారు. చీకట్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేయాలి. – యాతాకుల రాజయ్య, ఇందిరమ్మ కాలనీసూర్యాపేట పట్టణంలో వార్డులు 48నివాస గృహాలు 39,800జనాభా 1.53 లక్షలు యూజీడీ అంచనా వ్యయం రూ.316 కోట్లు -
చిన్న పిల్లల రక్షణ ప్రధానం
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ -
కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా..
కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధికారులు. ● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి. ● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి. ● గ్రీన్మ్యాట్పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి. ● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు. కుండీల్లో పదును ఉండేలా చూస్తున్నా.. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ వేడిమికి మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. కుండీల్లో నాటిన మొక్కలకు ఎప్పుడు తడిగా ఉండేలా చూస్తున్నా. సూర్యరశ్మి తక్కువ సోకే ప్రాంతాల్లో మొక్కలను ఉంచుతున్నా. – దాత్రక్ పద్మ, భువనగిరి -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
హుజూర్నగర్ : వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్నగర్లో వాల్ పెయింట్ వేసి నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సభతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్స్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, నాయకులు పి.ఉపేందర్, డి.నరసింహారావు, ఆర్.రాము, నరసింహారావు, అంజి, చుక్కయ్య, నాగరాజు, కొరివీరయ్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి చట్టం.. రైతులకు వరం
మునగాల: భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిదని.. ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోదాడ ఆర్డీఓ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 279 రెవెన్యూ గ్రామాల్లో గ్రామపరిపాలన అధికారుల వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ సంద్భంగా స్థానిక తహసీల్దార్ చట్టం విధివిధానాలను సదస్సులో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శిరీష, కోదాడ ఏడీఏ డి.ఎల్లయ్య, ఏఓ బి.రాజు, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, ఐకేపీ ఏపీఎం నాగెల్లి నగేష్, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, పీఏసీఎస్ల చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, తొగరు సీతారాములు, వి.రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే.. నడిగూడెం: భూసమస్యల పరిష్కా రానికే భూ భారతి చట్టం వస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపట్టారని, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి భూ భారతి పోర్టల్లో మార్పుల అనంతరం ఈ చట్టాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి జిల్లా అటవీశాఖ అధికారి పి.సతీష్ కుమార్, కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ దాసరి సంజీవయ్య, ఏడీఏ యల్లయ్య, ఏఓ రాయపు దేవప్రసాద్, సహకార సంఘాల చైర్మన్లు కొల్లు రామారావు, గోసుల రాజేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లా జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. - IIలోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు బాగా తాగాలి. – రమణ, జనరల్ ఫిజీషియన్, సూర్యాపేట -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదకు సన్మానం
చివ్వెంల: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ శారదను శుక్రవారం సూర్యాపేటలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఎక్స్ అఫీషియో సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఎక్స్అఫీషియో సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, నల్లపాటి మమత తదితరుల పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి భానుపురి (సూర్యాపేట): ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో కోదాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై నిర్వహించినసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రతిరోజూ విద్యార్థులకు తెలుగు రాయడం, చదవడం నేర్పించడానికి సమయం కేటాయిస్తూ నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అర్థంకాని విద్యార్థులకు వీడియోల ద్వారా తెలుగు, హిందీ భాషలు నేర్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ అశోక్, క్వాలిటీ కోఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్కుమార్, ఇంక్లూజివ్ కోఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కోఆర్డినేటర్ పూలమ్మ పాల్గొన్నారు. నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదు సూర్యాపేటటౌన్ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్ష తప్పదని ఎస్పీ కె.నరసింహ అన్నారు. కన్న కూతురిని నరబలి ఇవ్వగా తల్లికి ఉరిశిక్ష విధించిన కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవిందర్ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పోలీస్ లైజన్ అధికారి హెడ్ కానిస్టేబుల్ గంపల శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్వహించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఆ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్రెడ్డి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ పాండు నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రెటరీ డి.స్వప్న, సీటీఓ విభాగం చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం.సైదులు, వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జిల్లా కోర్టు ప్రాంగణంలో జూన్ 9 నుంచి 14 వరకు జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులకు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరి నోట్ కేసులు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో తీసుకున్న లోన్కు సంబంధించిన కేసులను పరిష్కరించనన్నట్లు తెలిపారు. బ్యాంకుల కార్యకలపాలు, లావాదేవీలను నిలబెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయం చేకూర్చేలా జూనియర్ సివిల్ జడ్జిలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నగదు చెల్లించే క్రమంలో బ్యాంకులు వడ్డీమాఫీ చేస్తాయని సూచించారు. ఇతర ఆర్థిక సంస్థలు రెండు వాయిదాల్లో చెల్లిస్తే 20 నుంచి 25 శాతం వడ్డి తగ్గిస్తాయన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన శ్రీనివాస్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, డీఎల్ఎస్ఏ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలిసూర్యాపేటటౌన్ : కేసు దర్యాప్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు అవసరమైన వివరాలు అందించడంలో బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలని ఎస్పీ కె.నర్సింహ కోరారు. సైబర్ నేరాల నివారణ, సైబర్ కేసుల దర్యాప్తుకు సంబంధించి గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు లతో కలిసి బ్యాంక్ సంస్థల కంట్రోలర్స్, రీజనల్ మేనేజర్స్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు రోజూ పెరుగుతున్నాయని, సైబర్ మోసాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులతో కలిసి బ్యాంక్ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిఅర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లను నిర్వాహకులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి సూరారపు శ్రీను, రైతులు భద్రయ్య, రాములు, సంజీవ, పూల్సింగ్, రాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకొని గురువారం లక్ష పుష్పార్చన పూజను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు సుగ్రంథ పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
హుజూర్నగర్ మార్కెట్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
హుజూర్నగర్ : హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలక వర్గం బాధ్యతలు స్వీకరించింది. గురువారం ఆ కార్యాలయములో ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీధర్ సమక్షంలో చైర్పర్సన్ దేశ్ముఖ్ రాధిక అరుణ్ కుమార్, వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి, సభ్యులు ముత్యాలంపాటి నాగుల్ మీరా, బత్తుల సైదిరెడ్డి, తొడేటి శ్రీనివాస రావు, మోదాల వెంకన్న, లచ్చిమల్ల నాగేశ్వరరావు, గజ్జెల కొండా రెడ్డి, నట్టె జానకిరాములు, నందిపాటి కోటయ్య, భూక్యా రాయ్సిల్, చెక్కర వెంకటరెడ్డి, మట్టపల్లి వెంకటనారాయణ, గుండా శ్రీనివాసరావు, జవ్వాజి రామ చంద్రయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి శర్మ, ఏడీఏ రవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారిని స్థానిక నాయకులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ ద్వితీయ శ్రేణి కార్యదర్శి, సిబ్బంది, రైస్ మిల్లుల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హతకు మించి వైద్యం!
సూర్యాపేటటౌన్ : నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏళ్లతరబడి అధికారుల కళ్లుగప్పి వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణిఅవుతున్న బాగోతం గుట్టురట్టు చేశారు. తాజాగా గురువారం నిర్వహించిన తనిఖీల్లోనూ నలుగురు డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది. అర్హత లేకుండానే 13 ఏళ్ల నుంచి వైద్యం అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్తో 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్లూ ఎండీ రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. అయితే గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం తనిఖీల్లో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. డాక్టర్ కిరణ్ తన తండ్రి వీరభద్రం పేరులోని ఇంగ్లిష్ అక్షరాలలోని ఎం.డీ. పదాలను ఎంబీబీఎస్ పక్కన చేర్చి ఎంబీబీఎస్ ఎం.డీ. రేడియాలజిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈసర్టిఫికెట్తో ఆపిల్ స్కాన్ సెంటర్ పేరుపై 2013 లో రిజిస్టర్ చేసుకోగా గతేడాది సెప్టెంబర్ నెలలో దీనిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుడ్డిగా రెన్యువల్ చేశారు. అంతేకాకుండా ఇదే స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న మరో రేడియాలజిస్ట్ జుల్ఫిఖర్ అలీ ఖాన్ అనే డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎం.డీ.గా చెప్పుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవహారం బయట పడడంతో వెంటనే బోర్డు మార్చేయడం గమనార్హం. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్ సీజ్.. సూర్యాపేటలో శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. గుండె సంబంధిత వైద్యం అందిస్తామని డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు. మేనేజ్మెంట్ డాక్టర్గా.. సూర్యాపేటలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెలనెలా జీతం చెల్లిస్తూ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. కమీషన్ల ఎరచూపి జిల్లాలోని ఆర్ఎంపీల ను తమ వైపు తిప్పుకొని రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్లు లేకుండానే వాళే్ల్ డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్లు సంపాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్య హాస్పిటల్ లో డాక్టర్ లేకుండానే కేవలం మేనేజ్మెంట్ హాస్పిటల్ నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తనిఖీల సమయంలో డాక్టర్ స్థానంలో మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తి ఉండడం గమనార్హం. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవి శేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా హాస్పిటల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పని చేస్తున్న రేడియాలజిస్ట్ సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉండడం కొసమెరుపు. రెన్యువల్ చేయకుండా రెండేళ్లుగా ప్రాక్టీస్... సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎం.డీ.గా చలామణి అవుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా.. రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినా.. మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఔట్ పేషెంట్ షీట్ లను పరిశీలించి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఫ చదివిందొకటి.. చేసేవైద్యం మరొకటి ఫ అర్హతలేకున్నా ఎండీ రేడియాలజిస్ట్గా ఒకరు.. ఫ ఎంబీబీఎస్ చేసి ఎండీగా మరో ఇద్దరు.. ఫ అనస్తీషియా డాక్టరే ఆపరేషన్లు చేస్తూ.. ఫ ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణి ఫ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బట్టబయలు -
భూ భారతితో రైతులకు సత్వర న్యాయం
అర్వపల్లి: భూ భారతి చట్టంతో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. భూ భారతి చట్టంపై అర్వపల్లిలో గురువారం నిర్వహించిన సదస్సుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి పాల్గొని మాట్లాడారు. భూ భారతి ద్వారా గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించవచ్చని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ధరణితో రైతులు పడిన కష్టాలను చూసిన సీఎం రేవంత్రెడ్డి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో రైతుల భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ భూసమస్యలను పరిష్కరించి రైతులు, ఇళ్ల యజమానులకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ సదస్సులో ఆర్టీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు జక్కర్తి శ్రీనివాసులు, బ్రహ్మయ్య, హరిప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బైరబోయిన సైదులు, జలేందర్రావు, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేష్, నాయబ్ తహసీల్దార్ సీహెచ్. యాదగిరి, ఏపీఓ ఉపేందర్, గిర్దావర్లు జలేందర్రావు, వెంకట్రెడ్డి, ప్రసన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అవిలయ్య, నాయకులు గుడిపల్లి మధుకర్రెడ్డి, జీడి వీరస్వామి, బైరబోయిన మహరాజు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రాత్రివేళ తెరిచి ఉన్న జీఎస్టీ కార్యాలయం
కోదాడ: కోదాడ పట్టణంలోని జీఎస్టీకార్యాలయం రాత్రివేళ తెరిచిఉండడం.. అధికారులు విధులు నిర్వహించడం.. ఆఫీస్ ఎదుట అధికారి వాహనం ఉండడం చర్చనీయాంశమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై జీఎస్టీ కార్యాలయం ఉంది. గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఆఫీస్కు సొంత వాహనంలో వచ్చిన అధికారి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నట్లు తెలిసింది. తెల్లవారే వరకు కార్యాలయంలోనే ఉన్నారని సమాచారం. అర్ధరాత్రి నుంచి అధికారి వాహనం కార్యాలయం ముందే ఉందని తెల్సుకున్న కొందరు 4 గంటలకు అక్కడికి వచ్చి చూసినట్లు సమాచారం. కార్యాలయం తాళం తీసి ఉండడమే కాకుండా లోపల గడియ పెట్టుకొని ఉండడంతో దాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోదాడకు చెందిన కొందరు జీఎస్టీ అధికారులు అర్ధరాత్రి రామాపురం క్రాస్రోడ్డు వద్ద అనధికార తనిఖీలు నిర్వహించి రెండు లారీలను పట్టుకున్నారని, వారి నుంచి భారీగా వసూలు చేసి కార్యాలయానికి చేరుకున్నారని, పంపకాల్లో తేడాలు రావడంతో వారిలో కొందరు ఈ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు ఇక్కడ ప్రచారం సాగుతోంది. జీఎస్టీ అధికారికి ప్రభుత్వం ప్రతినెలా వాహన అలవెన్స్ చెల్లిస్తున్నా సొంత వాహనాన్ని అద్దె వాహనంగా చూపి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై స్థానిక అధికారులు మాత్రం ఇది డ్యూటీలో భాగమేనని, ప్రత్యేకం ఏమీ లేదని స్పష్ట చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా బాత్రూం కోసం కార్యాలయానికి వచ్చినట్లు చెబుతున్నారు.ఫ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు ఫ కోదాడలో చర్చనీయాంశం -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాడని, ఇప్పుడు సభలో ఏం చెబుతాడో, తమకు ఏం భరోసా ఇస్తాడో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా ఎండిపోయాయని, పండిన కొద్ది పంటను కొనక రైతులు తగులబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. నాడు 14 ఏళ్లు ఉద్యమం చేసినా, పదేళ్లపాటు అభివృద్ధి చేసినా, నేడు 16 నెలలు ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని చెప్పారు. సభకు సూర్యాపేట జిల్లా నుంచి 40 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ సభకు పయనమైన రైతుల ఎడ్ల బండ్లకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సమావేశంలో గ్రంథాయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్షం, జిడి భిక్షం, బొమ్మ గాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ -
చాడలో బౌద్ధ చరిత్ర
ఫ గతేడాదిగా పురావస్తు శాఖ తవ్వకాలు ఫ పెద్ద ఎత్తున బయటపడుతున్న బౌద్ధం ఆనవాళ్లు ఫ ఏడు రోజుల క్రితం తవ్వకాల పనులను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంఏడు రోజుల క్రితం చాడ గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కో–కన్వీనర్ భద్రగిరీష్, సభ్యులు ఎం. రవి, కుండె గణేష్, ఎండీ ఇమ్రాన్ సందర్శించారు. తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన సంపదను పరిశీలించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో తెలంగాణ వారసత్వశాఖ అధికారులు పి. నాగరాజు, సాగర్, పూణా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ ఘన్వీర్ శ్రీకాంత్, ఇతర సిబ్బంది ఉన్నారు. తవ్వకాల్లో దాదాపు 80మంది పాల్గొంటున్నారు. చాడను సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంతవ్వకాలను పరిశీలిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి తర్వాత అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇందులో బుద్ధ విగ్రహాలు, శిల్పాల శకలాలు, మట్టిపూసలు, బొక్కగాజులు, శాతవాహన కాలం నాటి డిజైన్న్ పెంకులు, పొడవైన పెద్ద ఇటుకలు, బౌద్ధ విహార గోడలు బయల్పడుతున్నాయి. 2003లోనే గుర్తింపు.. 2003లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాడ గ్రామంలో బౌద్ధం ఆనవాళ్లు గుర్తించింది. అంతేకాకుండా 2010లో గ్రామానికి చెందిన భూమయ్యగౌడ్ పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దీంతో పురాతన చరిత్రను బయటకు తీయడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఈ గ్రామంలో ఎన్నో బౌద్ధ మత ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని దేవతామూర్తులుగా పూజిస్తారు. 2024లో చాడ గ్రామంలో ఆర్కియాలజీ శాఖ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. భూమయ్యగౌడ్కు చెందిన రెండు ఎకరాల్లో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం వేసవిలో చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్కియాలజీ శాఖ అధికారులు, విద్యార్థులు తవ్వకాలను పరిశీలిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దొరికిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరుస్తున్నారు. గతేడాది బయటపడిన శాసనం 2024లో జరిపిన తవ్వకాల్లో బ్రహ్మీ లిపిలో ఉన్న శాసనం బయటపడింది. ఈ శాసనంలో చాడ పేరు సదరిక అని ఉంది. సదరిక క్రమంగా వాడుకలోంచి చాడగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాడ శాసనం గురించిన వివరాలు ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి గతంలోనే వెల్లడించారు. బిక్కేరు వాగు బౌద్ధం నుంచే.. ఆలేరు వాగు కాస్తా చాడ వరకు వచ్చేసరికి బిక్కేరు వాగుగా మారుతుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి బిక్కేరు అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ లభించిన నిలబడి ఉన్న బౌద్ధ విగ్రహం నల్లగొండలోని పానగల్ మ్యూజియంలో ఉంది. 2024 నుంచి జరుపుతున్న తవ్వకాల్లో మరికొన్ని విగ్రహాలు దొరికినా వాటి వివరాలు ఆర్కియాలజీ శాఖ అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ లభిస్తున్న వస్తువులు, మట్టిపొరలు, గాజులు, పూసలు, విగ్రహాలు, నాణేలు తదితర బౌద్ధం ఆనవాళ్లను ఆర్కియాలజికల్ విద్యార్థులు గ్రేడింగ్ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఇటుకల కుప్పలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అవి చెదిరిపోయాయి. తవ్వకాల్లో ఇంకా బౌద్ధ శిల్పాలు బయటపడే అవకాశం ఉంది. ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిగితే మరింత చరిత్ర బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లను అక్కడే భద్రపరిచారు. అయితే చాడలో లభిస్తున్న వాటిని ఇక్కడే భద్రపర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి చరిత్ర మరో ప్రాంతానికి తరలిపోకుండా ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత విడుదల చేసే సంపూర్ణ నివేదిక వచ్చినప్పుడు ఇక్కడి ప్రాముఖ్యత, విశిష్టత వెలుగు చూస్తుందని పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు. గాంధార శిల్ప సంపదఇక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలలో గాంధార శైలికి చెందిన బుద్ధుడి స్థానక భంగిమ శిల్పాలు, అర్ధ శిల్పాలు, బుద్ధ విగ్రహాల తలలు, విగ్రహాల శకలాలు, క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దపు నాణేలు, టెర్రకోట బొమ్మలు, దంతపు గాజుల ముక్కలు, శాతవాహన కాలం నాటి కుండ పెంకులు, శాతవాహనకాలం నాటి ఇటికెలు, పూసలు అనేకం వెలుగుచూస్తున్నాయి. -
వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన తల్లి, కుమార్తె మరణ మిస్టరీ 11 రోజులవుతున్నా ఇంకా వీడలేదు. ఈ నెల 12వ తేదీన వారిద్దరు ఇంట్లో మృతిచెందగా.. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్గా బదిలీపై 15 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ఈ నెల 10వ తేదీన సీతారాంరెడ్డి కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో హైదరాబాద్కు వెళ్లి.. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి చిన్న కుమార్తె వేద సాయిశ్రీ గొంతుపై కత్తిగాటుతో, భార్య రాజేశ్వరి బెడ్రూంలో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. నాలుగు బృందాలతో దర్యాప్తు.. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఒక బృందం ఏపీలోని జమ్మలమడుగు, రొంపిచెర్ల, కుంబంపాడు, దాచేపల్లి, నకిరేకల్ ప్రాంతాలలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినా.. మరో బృందం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్ఫోన్స్ సిగ్నల్స్ వంటి అంశాలపై కూపీ లాగినా.. మరో బృందం మృతుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ తాను నిద్రలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కేసు మిస్టరీ వీడడంలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి క్లూ దొరకలేదా..? ఒకవేళ దొరికినా.. ఆ విషయాలను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో సేకరించిన విషయాలను పోల్చి చూసుకునేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఫ నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫ 11 రోజులవుతున్నా కొలిక్కి రాని కేసు -
శాస్త్రోక్తంగా శ్రీలక్ష్మీ నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక అర్చనలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేసి నిత్యకల్యాణం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్ఎస్ సభనా, లేక టీఆర్ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్రెడీ బీఆర్ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు. ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది. చరిత్రలో నిలిచిపోనుంది రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు ఫ కాంగ్రెస్కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది ఏ నోట విన్నా సభపైనే చర్చ ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు. -
రేపు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాక
నల్లగొండ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10గంటలకు నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11:30గంటలకు జిల్లా జైలుఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7గంటలకు తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. బుద్ధ జయంతికి రావాలని మంత్రి జూపల్లికి ఆహ్వానంనాగారం: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మే 12న నిర్వహించనున్న బుద్ధ జయంతి వేడుకలకు రావాలని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రం అందించినట్లు బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్ తెలిపారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో వీరమల్లుయాదవ్ మాట్లాడుతూ... ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ జయంతి రోజున ప్రపంచ సుందరీమణులతో హెరిటేజ్ వాచ్ కార్యక్రమం నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి జపాల్లోని హిరోషిమా ప్రభుత్వంతో బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. కుటుంబ తగాదాలతో దాడి ● ఇద్దరికి గాయాలునకిరేకల్: కుటంబ తగదాల కారణంగా అత్త, ఆమె తమ్ముడిపై అల్లుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో నివాసముంటున్న బోయింద జానమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను సూర్యాపేటకు చెందిన పెరుమాళ్ల రవికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య తగదాలు రావడంతో జానమ్మ నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో అల్లుడిపై మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో అల్లుడు రవితో పాటు మరో వ్యక్తి చింతమల్ల రాహుల్ జానమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తమ్ముడు ఎడ్ల ప్రకాష్పై దాడి చేసి గాయర్చారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చారి తెలిపారు. సీహెచ్సీని సందర్శించిన వరల్డ్ బ్యాంక్ బృందంఆలేరురూరల్: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులుకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కేసుల గురించి వివరాలు అడిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, మంచి ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్, కళ్యాణ్, డాక్టర్ యశోదా, డాక్టర్ శిల్ప, డీపీఓ నెహ్రూ, సీహెచ్సీ సూపరింటెండెంట్ స్వప్న, రజిని, రామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. పాఠశాలలు జూన్ 12న తెరుచుకోనున్నాయి. ఫ చివరి రోజు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ఫ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం -
జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకుల నియామకం
భానుపురి (సూర్యాపేట) : క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాకు ఇద్దరు పీసీసీ పరిశీలకులను నియమించింది. సూర్యాపేట జిల్లా పీసీసీ పరిశీలకులుగా డాక్టర్ బి.మురళీనాయక్, శత్రు బిజ్జిలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధుల మధ్య సమన్వయం కోసం ఈ పరిశీలకులను నియమించారు. వీరు త్వరలో డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలోని విఽవిధ వర్గాలను సమన్వయం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి నివేదికలు రూపొందించి అధిష్టానానికి అందజేయనున్నారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులను ఆశించే వారికి ప్రాధాన్యం ఉంటుందని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు. ఈ– ఫైలింగ్పై దృష్టి సారించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఈ– ఫైలింగ్ విధానంపై న్యాయవాదులు దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆన్లైన్ ఫైలింగ్ విదానం వల్ల పని తక్కువగా ఉంటుందని, మనకు కావాల్సిన కాగితాలు వెంటనే చూసుకోవచ్చన్నారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ప్రవీణ్ సూర్యాపేటటౌన్ : తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్గా సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈయన పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి గా కూడా పనిచేస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మర్రిగూడ: ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కె. అజయ్కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూటనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూ.3లక్షల విలువైన రెండు ఆక్సిజనేటర్ మిషన్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డయాలసిస్ సెంటర్ను, రోగులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. ఓపీ థియేటర్ను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ఇంక్యూబేషన్ అన్నిరకాల పరికరాలు కూడా అందుబాటులోకి తేవాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మాత్రునాయక్, సూపరింటెండెంట్ శంకర్నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ -
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
నాగారం : పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం నాగారం పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారథి, సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. చట్టాలను గౌరవించాలి తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, నాగారం సీఐ, రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
భూ భారతితో విప్లవాత్మక మార్పు
నూతనకల్: భూ భారతి చట్టం విప్లవాత్మక మార్పు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలోని వైఫల్యాలను గుర్తించి రైతులకు మేలు జరిగే విధంగా కోదండరాంరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేసి 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాల్లోని అంశాలను స్వీకరించి ప్రజలకు మేలు జరిగే విధంగా భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా 2లక్షల 46వేల దరఖాస్తులతో పాటు నేటి వరకు 3లక్షల 50వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతన్నలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. అన్ని రంగాల్లో వెనకబడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి, ఎంపీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామాలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రకటించిన 3500 ఇళ్లకు బదులు అదనంగా 1500 ఇళ్లను కేటాయించాలని మంత్రిని కోరగా స్పందించిన మంత్రి విడతల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మద్దిరాల, నాగారం, అడ్డగూడూరు మండలాలకు ప్రభుత్వ కార్యాలయాల కోసం నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధసుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, సుంకరి జనార్దన్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి దృష్టికి సమస్యలు నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బద్దం సత్తిరెడ్డి తన 20గుంటల భూమి మరొకరి పేర పట్టా కావడంతో దాని పరిష్కారం కోసం నాలుగు సంవత్సరాలు తిరిగినా పరిష్కారం కాలేదని, అదేవిధంగా సోమ్లాతండాకు చెందిన మోహన్నాయక్ తన భూమి గుండా వెళ్లిన ఎస్సార్ఎస్పీ కాల్వ కింద 19గుంటల భూమిని కోల్పోయామని వాటిని రెవెన్యూ అధికారులు తొలగించి పాస్పుస్తకం అందించినప్పటికీ మరలా 22గుంటల భూమిని రికార్డు నుంచి తొలగించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిల్పకుంట్ల గ్రామానికి చెందిన జటంగి సతీష్ తమ తాతల కాలంలో ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన జెన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డి దగ్గర భూ సంస్కరణ చట్టానికి పూర్వమే కొనుగోలు చేసినప్పటికీ నేటికి పట్టాలు కాలేదని వాపోయాడు. జెన్నారెడ్డి కుటుంబీకుల దగ్గర భూములు కొనుగోలు చేసిన సుమారు 2వేల మంది రైతులకు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో బ్యాంకుల్లో రుణాలు ఇచ్చారని, కేసీఆర్ హయాంలో ఇవ్వకపోవడంతో పాటు భూమిలేని రైతులుగానే చిత్రీకరించారని మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి జెన్నారెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూముల వివరాలను తీసుకురావాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. -
ఇంటర్ ఒకేషనల్లో ‘శ్రీలక్ష్మి వెంకటసాయి’ హవా
సూర్యాపేటటౌన్: ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ హవా కొనసాగించారు. కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ కారింగుల బాలగౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థిని జి. హాసిని ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో 500 మార్కులకు గాను 494 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కంప్యూటర్ సైనన్స్లో నక్కల కీర్తన 500 మార్కులకు గాను 482, డెయిరీ గ్రూప్లో ముండ్ల మౌనిక 500 మార్కులకు గాను 475, ఎంఎల్టీ గ్రూప్లో ఎం. ఇందు 475, ఫిజియోథెరపీలో అష్మిత 466 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)లో కె.వంశవర్థిని 1000 మార్కులకు గాను 989 మార్కులు, ఎంఎల్టీ గ్రూపులో కారింగుల సౌజన్య 981, ఫిజియోథెరపీలో వి. గణేష్ 978 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు చైర్మన్ కారింగుల విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ స్వాతి, అధ్యాపకులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన దాసరి యోగేంద్ర విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ప్రమాదాలు జరగకుండా వాహదారులకు సూచనలు చేసేందుకు గాను కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. బుధవారం పాలకేంద్రం సమీపంలో విధులు నిర్వహిస్తున్న యోగేంద్రను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
కల్యాణ కట్ట పంచాయితీ
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యాదగిరిగుట్ట ఆలయంలో 20 మంది నాయీ బ్రాహ్మణులను కొత్తగా నియమించడానికి కోర్టు ఆర్డర్ ఉందని ఈఓ చెబితే అది చూపెట్టాలని అడిగాం. కల్యాణ కట్టకు కొత్తగా ఎవరినైనా కేటాయిస్తే దేవస్థానం ఆధ్వర్యంలో మా సంఘానికి లెటర్ ఇస్తారు. కానీ ఎలాంటి కాపీ ఇవ్వలేదు. ఈఓతో పాటు కొంతమంది అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డర్ తయారు చేసి 20 మందిని నియమించారు. – రాచకొండ జానకిరాము, రాష్ట్ర దేవాలయ కల్యాణ కట్ట అధ్యక్షుడు మా కల నెరవేరింది కల్యాణ కట్టలో విధుల్లో చేరడంతో మా కల నెరవేరింది. కల్యాణ కట్టలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు మా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. తిరిగి మేము కూడా హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈఓకు ఇచ్చాం. దీంతో విధుల్లో చేర్చుకునేందుకు ఈఓ ఆదేశించారు. తోటి నాయీ బ్రాహ్మణులతో కలిసి పనిచేస్తాం. – జంపాల రాజు, యాదగిరిగుట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణుల మధ్య పాత.. కొత్త పంచాయితీ నెలకొంది. ప్రస్తుతం దేవస్థానం కల్యాణ కట్టలో 96మంది నాయీ బ్రాహ్మణులు కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 20మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించే విధంగా దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఈఓ భాస్కర్రావు నియమించారు. ఆ 20మంది నాయీ బ్రాహ్మణులు బుధవారం విధుల్లో హాజరయ్యేందుకు కల్యాణ కట్టకు చేరుకున్నారు. దీంతో అప్పటికే కొనసాగుతున్న 96మంది వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఏఈఓతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ఉండటంతో నూతనంగా 20 మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించేందుకు అనుమతించామని ఏఈఓ వివరించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించారు. అనంతరం కోర్టు ఆర్డర్, దేవాదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపెట్టిన తర్వాత 20 మంది ఉద్యోగంలో చేరారు. ఉత్తర్వుల కాపీలో ఇలా.. దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన 33 మంది నాయీ బ్రాహ్మణులకు కల్యాణ కట్టలో పని కల్పించేందుకు కమిషన్ పద్ధతిలో తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ మేరకు 20 మందిని అదనంగా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫ యాదగిరిగుట్ట క్షేత్రం కల్యాణ కట్టలో కొత్తగా 20 మంది నాయీ బ్రాహ్మణుల నియామకం ఫ ఇప్పటికే పనిచేస్తున్న వారి నుంచి అభ్యంతరం ఫ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నూతనకల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి.. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకన్న–సుమలత దపంతుల రెండో కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ఎంపీసీ విభాగంలో 467మార్కులు సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవిని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్రెడ్డి, జెన్నారెడ్డి వివేక్రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
న్యాయవాదులు అందుబాటులో ఉండాలి
చివ్వెంల: న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణిని బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్క్లాస్ మేసిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి -
వాగు కషా్టలకు చెక్!
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కలనెరవేరనుంది. తమ పంటపొలాలతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లడానికి వాగుదాటే కష్టాలు త్వరలో తీరనున్నాయి. గ్రామ సమీపంలోని బిక్కేరువాగు(యశ్వంతపూర్వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఇటీవల రూ.16కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. పొలాల వద్దకు వెళ్లాలంటే..తాటిపాములకు చెందిన రైతుల పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. ఏటా వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు రైతులతో పాటు గ్రామస్తులు తమ పొలాల వద్దకు, అలాగే వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు వాగు నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎడ్ల బండ్లు, పశువులు, మేకలు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇచ్చినాఅమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్ బిక్కేరువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16కోట్లు, చెక్డ్యాం నిర్మాణానికి రూ.7.14కోట్లు మంజూరు చేయించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుతాటిపాములలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఉత్తమ్మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బిక్కేరు వాగుపై డబుల్ లేన్ రోడ్, బ్రిడ్జి, చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైతులకు బిక్కేరు వాగుపై ప్రయాణించడానికి 20కి.మీ. దూరం తగ్గుతుంది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల 750 ఎకరాల పంట భూములకు లబ్ధి చేకూరనుంది. అలాగే చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల 2కి.మీ. పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది. దీని వల్ల రైతులకు బోర్లు, వ్యవసాయ బావుల్లో నీళ్లు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. తన సొంత నిధులతో 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు.తాటిపాములలో బ్రిడ్జి నిర్మించే ప్రాంతం తాటిపాములలో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు నేడు మంత్రి ఉత్తమ్ చేతులమీదుగా శంకుస్థాపన నెరవేరనున్న ప్రజల కలబ్రిడ్జి నిర్మాణం ఇలా.. పొడవు : 120 మీటర్లు పిల్లర్లు : 12 వెడల్పు : 11 మీటర్లు ఇబ్బందులు తొలగనున్నాయిగ్రామ రైతుల పంట పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. వర్షా కాలంలో వాగుదాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఉత్తమ్నిధులు మంజూరు చేయడం శుభ పరిణామం. రాష్ట్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. బ్రిడ్జి నిర్మిస్తే ఇబ్బందులు తొలగనున్నాయి. – కోల రమేష్, తాటిపాములప్రజలకు ఎంతో మేలు వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. బ్రిడ్జి నిర్మించడం వల్ల ప్రజలకుఎంతో మేలు కలుగుతుంది. వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లే వారికి కూడా దూరా భారం తగ్గుతుంది. – కె.శ్రీనివాస్, రైతు, తాటిపాముల -
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోదాడరూరల్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలో పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయని, ప్రతి సమస్యను కలెక్టర్ లేదా కోర్టు ద్వారా పరిష్కరించే విధంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని తద్వారా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కల్టెకర్ స్థాయిలో పరిష్కారం కానునున్నట్లు తెలిపారు. 2014కు ముందు సాదా కాగితం, బాండ్ పేపర్పై భూమిని కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా సాగుచేస్తున్నవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టాదారు పాస్పుస్తకంలో అప్డేట్ చేస్తామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్31న అన్నిగ్రామాల్లో సభలు నిర్వహించి రైతులందరికీ 1బీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్అలీ, ఎంపీడీఓ రాంచందర్రావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఏఓ రజిని, ఎంపీఓ పాండురంగన్న, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల పాల్గొన్నారు. 30 వరకు విచారణ పూర్తి చేయాలిభానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల విచారణ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 14,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వీటి పర్యవేక్షణకు కోదాడకు డీఎఫ్ఓ సతీష్ కుమార్, హుజూర్నగర్కు డీటీడీఓ శంకర్, సూర్యాపేటకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్నాయక్, తుంగతుర్తికి డీపీఓ యాదగిరిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఎఫ్ ఓ సతీష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీపీఓ యాదగిరి, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు ఉత్తమ్ పర్యటన
● అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న మంత్రికోదాడరూరల్ : కోదాడ నియోజకవర్గం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. చిలుకూరు మండలంలోని నారాయణపురం, కోదాడ మండలంలోని తొగర్రాయి, కూచిపూడిలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాన చేయనున్నారు. ఆతర్వాత కోదాడ పట్టణంలో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణ పనులు, జ్యోతిబాఫూలే విగ్రహాన్ని, బాలాజీ నగర్లో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 93 దరఖాస్తులు అందజేశారన్నారు. భారతి రంగా ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ సొసైటీ జిల్లాలోని 700 మంది టీబీ పేషెంట్లకు 3,000 న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అదనపు కలెక్టర్ రాంబాబు చేతుల మీదుగా అందించింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్కుమార్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీపీఓ ఎల్.కిషన్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, డీసీఓ పద్మ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్రెడ్డి, మార్కెటింగ్ డీఎం శర్మ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమలగిరిలో పార్కింగ్ కష్టాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీలో పార్కింగ్ స్థలం లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా కొనుగోలు చేసేందుకు స్థానిక తెలంగాణ చౌరస్తాకు వస్తే అవస్థలు తప్పడం లేదు. రోడ్డు కొందరు ఇంటి యజమానులు భవనాలు నిర్మించి వాటి ముందు ఉన్న స్థలాలను కూడా కిరాయిలకు ఇస్తున్నారు. దీనికి తోడు షాపులు, హోటళ్లు, ఇతర దుకాణాల ముందు వాహనాలు, ఇతర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపాల్సి వస్తుంది. దీంతో పోలీసులు ఆ వాహనాల ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. సాయంత్రం వేళ నరకమే.. సూర్యాపేట–జనగామ, మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారుల్లో సాయంత్రం సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా తొర్రూరు రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కొంత మంది ఇంటి యజమానులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు వందలాది వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. గతంలో పలువురు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, రోడ్లు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఫ సూర్యాపేట–జనగామ, మోత్కూరు–తొర్రూరు రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఫ హోటళ్లు, ఇతర దుకాణాల ఎదుట వాహనాల నిలిపివేత ఫ జరిమానా విధిస్తున్న పోలీసులు -
రేషన్ దందాలో ఆరితేరారు!
ఫ నెల రోజుల వ్యవధిలో 5 చోట్ల పట్టుబడిన తమ్మర గ్రామవాసులు ఫ అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ దందాను వదలని గ్రామస్తులు ఫ పోలీసులు నిఘా పెంచడంలో విఫలమవుతున్నారని విమర్శలుకేసులు నమోదు చేస్తున్నాం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిని ఇప్పటికే రిమాండ్ చేశాం. ఈ అక్రమ వ్యాపారం చేసేవారిపై బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్రోడ్, అన్నారం, గోండ్రియా, రెడ్లకుంటల వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రజితారెడ్డి, కోదాడరూరల్ సీఐ కోదాడరూరల్ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర గ్రామం రేషన్ దందాకు కేరాఫ్ అడ్రాస్గా మారింది. గత నెల 17 నుంచి ఇప్పటివరకు ఆ గ్రామానికి చెందిన వారే రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడగా 5 కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామానికి చెందిన పలువురు ఈ రేషన్ బియ్యాన్ని గత 15 ఏళ్లుగా యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఒకొక్కరిపై అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆటోల్లో సరిహద్దు దాటిస్తున్నారు గతంలో లారీల్లో రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటించేవారు. పెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే నష్టం జరుగుతుందని భావించిన రేషన్ వ్యాపారులు గత కొద్దికాలం వారి రూట్ మార్చారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని లారీల్లో కాకుండా ఆటోల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. నిఘా పెట్టని పోలీసులు చిలుకూరు, అనంతగిరి, కోదాడ, మోతె, నడిగూడెం గ్రామాల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామకు చెందిన రేషన్ మాఫియాకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని ఆటోల్లో జాతీయరహదారిపై కాకుండా మారుమూల గ్రామాల నుంచి వెళ్తూ రామాపురం క్రాస్రోడ్తో పాటు అన్నారం గ్రామాల మీదుగా రాష్ట్రం దాటిస్తున్నారు. అయితే సరిహద్దులో పోలీసులు నిఘా పెంచడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెల రోజుల్లో 5 కేసులు ఆ గ్రామం వారిపైనే.. మార్చి 17 నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలోనే పలు స్టేషన్లో 5 రేషన్ బియ్యం అక్రమ సరఫరా కేసులు నమోదు కాగా పట్టుబడిన వారందరూ తమ్మర వారే కావడం గమనార్హం. మార్చి17న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన రాముపై, అదే రోజు అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన ఉపేందర్, ఎస్.వీరబాబు 9 బస్తాల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 21న అనంతగిరి స్టేషన్ పరిధిలో తమ్మరకు చెందిన వెంకటలక్ష్మి, నరేష్ 4.5 క్వింటాళ్ల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 25న మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద పట్టుబడిన బియ్యం తమ్మరకు చెందిన జానకిరాములివి. ఈ నెల 11న తమ్మరకు చెందిన షేక్. సికిందర్ కోదాడ మండలంలో నాలుగు క్వింటాళ్ల బిరయ్యాన్ని కొనుగోలు చేసి నందిగామకు తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇతనిపై ఇదివరకు కోదాడ టౌన్, రూరల్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న రేషన్ బియ్యం గత నెల 17న కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని కోదాడ మున్సిపాలిటీ, అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరకు చెందిన సుల్తానీ రాము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ఏపీలో విక్రయించేందుకు తరలిస్తుండగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.గత నెల 25నెల కోదాడ మండల పరిధిలోని మొద్దుల చెర్వు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎంలో 30 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను తమ్మరలోని ఆర్.జానకిరాములు వద్ద కొనుగోలు చేసి సిద్ధిపేటలోని సంజయ్కు విక్రయించేందుకు తరలిస్తున్నానని తెలిపాడు. దీంతో డీసీఎంను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు. -
క్రీడా శిక్షణకు రంగం సిద్ధం
హుజూర్నగర్: చిన్నారులూ వేసవి సెలవుల్లో మీకు ఇష్టమైన ఆటలు ఆడాలనుకుంటున్నారా.. క్రీడల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ (డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ–డీఎస్ఏ) ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగు అంశాలు.. పన్నెండు శిబిరాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 14 ఏళ్లలోపు పిల్లలకు నాలుగు క్రీడా అంశాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతించారు. ఈ మేరకు ఆయా క్రీడా మైదానాల ఏర్పాటుకు డీఎస్ఏ సిబ్బంది నిమగ్నమయ్యారు. శిక్షణ శిబిరాలు ఎక్కడెక్కడంటే.. ● అథ్లెటిక్స్– పిల్లలమర్రి (సూర్యాపేట మండలం) ● కబడ్డీ– తుంగతుర్తి, చిలుకూరు, నడిగూడెం ● ఖోఖో– కూచిపూడి(కోదాడ మండలం) యడ్లపల్లి (సూర్యాపేట మండలం) ● వాలీబాల్– టేకుమట్ల(సూర్యాపేట మండలం), అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం మండలం), కొరమబండ, గుడిబండ(కోదాడ మండలం), పాలెఅన్నారం(చిలుకూరు మండలం) మేళ్లచెరువు. ఫ వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేకం ఫ అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్లో శిక్షణ ఫ పన్నెండు చోట్ల శిబిరాలు ఏర్పాటు ఫ మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. శిబిరాల నిర్వహణకు పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి వచ్చిన దరఖాస్తులు నుండి 12 మందిని ఎంపిక చేశాం. ఉచితంగా క్రీడా పరికరాలు అందించి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. శిక్షణ కాలానికి నిర్వాహకులకు గౌరవ వేతనం ఇస్తాం. ఆసక్తిగల చిన్నారులు శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన క్రీడలో శిక్షణ పొందాలి. – జి.రాంచందర్రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట