breaking news
Suryapet District Latest News
-
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎనిమిది మండలాల్లో 152 పంచాయతీలు, 1,241 వార్డులకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించగా.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. దాదాపు 89.69 శాతం పోలింగ్ నమోదైందని, 2,05,583 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళి, లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. గ్రామాల్లో పండుగ వాతావరణం ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలామంది ఓటర్లు బుధవారం రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి పల్లెలకు చేరుకున్నారు. అభ్యర్థులు వలస ఓటర్లకు ప్రత్యేకంగా చార్జీలు చెల్లించి మరీ రప్పించారు. ఇక గురువారం ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారు. హైదరాబాద్, చైన్నె తదితర పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉదయం వేళ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న టిఫిన్ సెంటర్లు కళకళలాడాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బంది వికలాంగులు, వృద్ధులను వీల్చైర్లలో తీసుకెళ్లారు. పోలింగ్ సరళి ఇలా.. తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో 2,29,222 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరి కోసం 1,403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకుని పోలింగ్కు ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రతి కేంద్రం వద్ద ఓటర్లు బారులుదీరారు. ఉదయం 9గంటలకు 62,367 మంది ఓటు వేయగా 27.21 శాతం పోలింగ్ నమోదైంది. 11గంటల వరకు 61.75 శాతంతో 1,39,745 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంటవరకు 87.77 శాతంతో 2,01,184 మంది, మొత్తంగా 89.69 శాతం నమోదైంది. పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికం పురుష ఓటర్లు 1,13,812 మంది, మహిళా ఓటర్లు 1,15,410 మంది ఉన్నారు. మొదటి విడతలో మొత్తం 2,05,583 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,02,631 మంది ఓటు వేయగా 90.18 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు 1,02,948 మంది ఓటు వేయగా 89.20 శాతం పోలింగ్ నమోదైంది.ఫ ఓటు హక్కు వినియోగించుకున్న 2,05,583 మంది ఓటర్లు ఫ ఉదయం ఏడు గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు ఫ తిరుమలగిరి మండలంలో అత్యధికం, తుంగతుర్తిలో అత్యల్ప ఓటింగ్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మండలాల వారీగా చూస్తే తిరుమలగిరి మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 15,979 మంది ఓటర్లు ఉండగా 14,549 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 91.05 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 22,330 ఓట్లు పోలవ్వగా 90.72 శాతం పోలింగ్ నమోదైంది. ఆత్మకూర్లో 39,565 మంది ఓటువేయగా 89.81 శాతం, సూర్యాపేటలో 28,225 మంది ఓటువేయగా 90.30 శాతం, మద్దిరాలలో 22,467 మంది ఓటువేయగా 89.75 శాతం, నాగారంలో 22,091 మంది ఓటువేయగా 89.17 శాతం, నూతనకల్లో 26413 మంది ఓటువేయగా 90.87 శాతం, తుంగతుర్తిలో 29,943 మంది ఓటువేయగా 89.69 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలం ఓటర్లు పోలైనవి శాతం ఆత్మకూర్ (ఎస్) 44,053 39,565 89.81 సూర్యాపేట 31,256 28,225 90.30 జాజిరెడ్డిగూడెం 24,615 22,330 90.72 మద్దిరాల 25,032 22,467 89.75 నాగారం 24,775 22,091 89.17 నూతనకల్ 29,066 26,413 90.81 తిరుమలగిరి 15,979 14,549 91.05 తుంగతుర్తి 34,451 29,943 86.91 మొత్తం 2,29,227 2,05,583 89.69 -
పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
కోదాడ: పెన్షనర్లు పోరాడి సాధించుకున్న హక్కులను అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. గురువారం కోదాడ పెన్షన్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వచ్చే మార్చిలో పెన్షనర్లతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షనర్లు పూర్తి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించామని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్దారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యసేవలు అందించాలన్నారు. 2024 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి సీతరామయ్య, రాజేంద్రబాబు, లింగన్న, ప్రభాకర్, జానయ్య, రఘువరప్రసాద్, విద్యాసాగర్, భ్రమరాంబ, శోభ పాల్గొన్నారు. కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం సూర్యాపేటటౌన్ : ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో కొనసాగుతుందని పేర్కొన్నారు. తొలి దశ ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతియుత వాతావరణం కోసం ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు. విశేషంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ వైభవంగా నిర్వహించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల కోచ్గా యూనుస్ కమాల్ నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రెఫరీగా నల్లగొండ పట్టణానికి చెందిన సీనియర్ కోచ్ ఎండీ.యూనుస్ కమాల్ ఎంపికయ్యారు. తన మీద నమ్మకంతో జాతీయ రెఫరీగా ఎంపిక చేసిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్కు యూనుస్ కమాల్ కృతజ్ఞతలు తెలిపారు. -
యాదగిరీశుడి సన్నిధిలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలను అర్చకులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళ అర్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వార బంధనం చేశారు. -
రెండో విడత ప్రచారానికి నేటితో తెర
కోదాడ: జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామపంచాయతీల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుండడంతో అభ్యర్థులకు శుక్ర, శనివారం ఈ రెండు కీలకం కానున్నాయి. శుక్రవారం గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బలప్రదర్శన చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలా చేయడానికి ఒక్కొక్కరికి ముఖ్యంగా మహిళలకు రూ.400 నుంచి రూ.500వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఓటర్లకు మద్యం, మాంసం పంపిణీ చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కోదాడలోని పలు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు వందల కేజీల ఆర్డర్లు రావడంతో రోజువారీగా వచ్చేవారికి కేజీ, అరకేజీ ఇవ్వడం లేదు. ఇక మద్యం పంపిణీ కోసం క్వార్టర్ బాటిల్స్ ఎక్కువగా అభ్యర్థులు కొనుగోలు చేస్తుండడంతో మద్యం దుకాణాల్లో వీటి కొరత ఏర్పడింది. ఎక్కడ ఉన్నా రప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కార్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు యువకులు బెంగళూరులో ఉండడంతో వారికి ఫ్లైట్, రైల్ టికెట్లను కూడా బుక్ చేసి పిలిపిస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 8 మంది యువకులు పూణేలో ఉండడంతో వారిని రప్పించడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థులు శుక్రవారం ఓటర్లకు మద్యం పంపిణీ పూర్తిచేసి శనివారం డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి ఇచ్చేదాన్ని బట్టి తాము ఇస్తామని రెండు వర్గాలు వేచి చూస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో పోటాపోటీగా ఉన్న మునగాల, బేతవోలు, చిలుకూరు, గుడిబండ, గణపవరం, రెడ్లకుంట, వాయిల సింగారం గ్రామాల్లో రూ.3వేల వరకు పంచడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో కూడా ఓటుకు రూ.2వేల వరకు పంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఫ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ఫ డబ్బు, మాంసం, మద్యం పంపిణీకి కసరత్తు ఫ దూరప్రాంతాల్లోని ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థుల ప్రయత్నం -
మొదటి విడత ప్రశాంతం
అర్వపల్లి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని అడివెంల, రామన్నగూడెం పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎస్ఐ ఈట సైదులు పాల్గొన్నారు. నాగారం : మండలంలోని నాగారం, శాంతినగర్, పస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిషేధిత ఆజ్ఞలు అమలు చేయాలని, కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని తెలిపారు. -
కాంగ్రెస్ మద్దతుదారుల విజయకేతనం
భానుపురి (సూర్యాపేట) : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. 152 గ్రామ పంచాయతీలకు 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ప్రజావ్యతిరేకతతో తమకు కలిసొస్తుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన స్థానాలు కై వసం చేసుకోలేకపోయారు. కేవలం 52 స్థానాల్లోనే బీఆర్ఎస్ మద్దతుదారులు రాణించారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. చాలా చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు వాయిదాలు పడ్డాయి. కలిసొచ్చిన పథకాలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పథకాలు కలిసొచ్చాయి. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భర్తీ చేసినట్లయింది. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచేందుకు దోహదపడినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ప్రభావం కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, ఇదే అదునుగా అత్యధిక స్థానాల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తే.. రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ భావించింది. అయితే ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజల్లో మద్దతు లేకపోయింది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం చూపించింది. అది కూడా ఇతర పార్టీలు, వ్యక్తులతో పొత్తులే ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చించుకుంటున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదన్న భావన ఈ ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామంలో కనీసం మూడునాలుగు వార్డు మెంబర్లను గెలిపించేందుకు కూడా కష్టపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఫ నాగారంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందారు. ఫ మద్దిరాల మండలం తూర్పు తండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న సమీప ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఫ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత గ్రామం బాలెంలలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 260 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఫ ఆత్మకూరు మండలం కోటినాయక్తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తులసికి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టికి సమానంగా ఓట్లు రాగా టాస్ వేశారు. ఇందులో ధరావత్ చిట్టికి అదృష్టం కలిసి రావడంతో సర్పంచ్గా గెలుపొందారు. మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆత్మకూర్ (ఎస్) 30 15 12 02 01 తుంగతుర్తి 24 15 05 01 03 తిరుమలగిరి 16 12 03 00 01 మద్దిరాల 16 08 07 00 00 నూతనకల్ 17 07 07 00 01 నాగారం 14 10 02 00 01 సూర్యాపేట 25 15 08 00 01 జాజిరెడ్డిగూడెం 17 08 09 00 00 మొత్తం 159 90 53 03 08 (నాగారం మండలం ఈటూరులో అర్థరాత్రి దాటే వరకు రీకౌంటింగ్ కొనసాగింది)ఫ మొదటి విడతలో 90 సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ మద్దతుదారులు కై వసం ఫ 53 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఫ ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి దేవరకొండ : విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం పట్టుదలతో శ్రమించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. బుధవారం ్చదేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 11వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కళాశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్ రవితోపాటు అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, అధ్యాపకులు కోటయ్య, లింగమయ్య, లింగారెడ్డి, పృథు, ధనుంజయ పాల్గొన్నారు. పంచ నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బుధవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. -
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. మన హక్కులతో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం ద్వారా శిక్ష విధిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సత్యంబాబు పాల్గొన్నారు. -
ఊరూరా కిక్కు
నాగారం : జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడు విడతల్లో ఎన్నికలు జరుతున్నాయి. తొలివిడత ఎనిమిది మండలాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇక రెండు, మూడు విడత ఎన్నిల ప్రచారం జోరుగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎరగా వేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా సిట్టింగ్లు పెట్టించి మరీ మద్యం పోయిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లో పెద్ద ఎత్తున డంప్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు మూడింతలు పెరిగినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న లిక్కర్ గోదాములు కిక్కిరిసి ఉంటున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకుసూర్యాపేట జిల్లాలో రూ.61.91 కోట్ల విలువ గల మద్యం విక్రయాలు జరిగాయి. తొలిరోజు నుంచే... జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు, 19 బార్లు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త వారికి ట్రేడ్ లైసెన్స్లు మంజూరు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారికి తొలి రోజు నుంచే కాసుల వర్షం కురుస్తోంది. కొత్త దుకాణదారులకు గ్రామాల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. అభ్యర్థులు కొందరు ఏకంగా ఉద్దెర ఖాతాలు పెట్టేశారు. ప్రధానంగా బెల్ట్ దుకాణాలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఎన్నికల సందడి ఉండటంతో మద్యం భారీగా అమ్ముడుకానుంది. ఈ విషయంపై సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులను వివరణ కోరగా.. మద్యం దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో ఎవరు కొన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తమ సిబ్బందితో నిఘా పెట్టామని వెల్లడించారు. ఫ ఈనెల 1 నుంచి 9 వరకు జిల్లాలో రూ.61.91 కోట్ల మద్యం అమ్మకాలు ఫ పంచాయతీ ఎన్నికలే కారణం -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట రూరల్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలో బుధవారం సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని స్పష్టం చేశారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కాని వారిని పరిసరాల్లో రానివ్వొద్దని, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్న్, ఎలక్ట్రానిక్ వస్తులు ఏమైనా వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మానవ హక్కుల పరిరక్షణకు కృషి
కోదాడ: సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడు నైతిక విలువలతో జీవించి మానవహక్కుల రక్షణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో ప్రతి పౌరుడు తమ హక్కులను స్వేచ్ఛగా పొందగలరన్నారు. విద్యాహక్కు కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని భద్రత కోసం మహిళలు పోరాడుతున్నారని అన్నారు. ఇండియన్ జస్టిస్ రిపోర్టు 2024 ప్రకారం దేశంలోనే తెలంగాణా రాష్ట్రం పోలీసింగ్ వ్యవస్థలలో నంబర్ 1 స్థానంలో నిలవడం ఇక్కడి పోలీసులు పనితీరుకు నిదర్శనం అని అన్నారు. రాబోయే రోజుల్లో శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు మరింత సమర్థంగా పని చేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. తన విధులు సక్రమంగా నిర్వర్తించి పోలీస్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం సమాచార హక్కువికాస సమితి అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్గా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లును ప్రభుత్వం నియమించడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు శివ, సత్యనారాయణ, వెంకటరెడ్డి, సైదులు, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు -
ఆరు సబ్జెక్టులు.. నెల రోజులు
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి సబ్జెక్టు మధ్య నాలుగు రోజుల గ్యాప్ రానుంది. దీని వల్ల రివిజన్కు సమయం ఉండటంతో పాటు విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉండనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించేందుకు వీలుంటుంది. మార్చి 14నుంచి పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల ప్రకారం మార్చి 14న పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 16న ముగియనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. వీటి ఆధారంగా సబ్జెక్టుల వారిగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. 12,325మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి వరకున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 354 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులు 7,000, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు 5,325 మంది ఉన్నారు. వీరంతా వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.టెన్త్ వార్షిక పరీక్షల విధానంలో మార్పులు ఫ ప్రతి సబ్జెక్టు మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల -
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్కు వేళయ్యింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవాలతో పాటు నామినేషన్దాఖలు కానివి పోగా మిగిలిన 152 గ్రామపంచాయతీలు, 1,241 వార్డులకు గురువారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4నుంచి 5గంటల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియ బుధవారం రాత్రే పూర్తయ్యింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,31,851 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎనిమిది మండలాల్లో.. జిల్లాలో మొత్తం 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డుల ఎన్నికలకు గత నెల 27న నోటిఫికేషన్ జారీఅయ్యింది. అయితే సర్పంచ్లకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 7 సర్పంచులు, 198 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3 వార్డులకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. ఈ క్రమంలో మొదటి విడత 152 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 471 మంది బరిలో ఉన్నారు. 1,241 వార్డులకు పోలింగ్ జరగనుండగా 2,736 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 4,356మంది సిబ్బందితో.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది నియామకం నుంచి బ్యాలెట్ పత్రాల వరకు అన్నింటినీ సమకూర్చుకున్నారు. 58 రూట్లను ఏర్పాటు చేసి బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రిని 133 పెద్దవాహనాలు, మరో 59 చిన్న వాహనాల్లో ఆయా మండలాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి గ్రామాలకు తరలించారు. గురువారం 232 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1,403 పోలింగ్ కేంద్రాల్లో 2,31,851 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జోనల్ అధికారులు 28 మంది, 1,683 మంది పీఓ (ప్రొసైడింగ్ అధికారి), 2,260 మంది ఓపీఓలు, స్టేజ్–1 ఆర్ఓలు 104, 178 మంది స్టేజ్ –2 అధికారులు, 65 మంది రూట్ ఆఫీసర్లు, 38 మంది మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. వీరితో పాటు అదనంగా 16ఎఫ్ఎస్టీ బృందాలు ఎన్నిల విధుల్లో ఉంటాయి. ఇప్పటికే తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్న వీరంతా తెల్లవారుజాము నుంచే పోలింగ్కు అనుగుణంగా 1,543 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకున్నారు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ జరగనుంది. 2,31,851 మంది ఓటర్లు.. మొదటి విడతలో మొత్తం 2,31,851 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,16,705 మంది, పురుషులు 1,15,141 మంది, ఇతరులు మరో ఐదుగురు నమోదై ఉన్నారు. అత్యధికంగా ఆత్మకూర్ (ఎస్)లో 44,053 మంది ఓటర్లు, తుంగతుర్తిలో 34,616 మంది ఓటర్లు ఉన్నారు. జాజిరెడ్డిగూడెం 24,615, మద్దిరాల 25,307 మంది, నాగారం 24,775 మంది, నూతనకల్ 29,066 మంది, సూర్యాపేట 31,620 మంది, తిరుమలగిరి 17,799 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. వీరికి బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి పోల్చిట్టీలు పంపిణీ చేశారు. ఈ పోల్ చిట్టీలతో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లి ఓటువేయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి 154 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాలు వెల్లడించి.. ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు.మండలాలు 08 పోలింగ్ సిబ్బంది : 4,356 రూట్లు : 58 బ్యాలెట్ బాక్సులు : 1,543 కౌంటింగ్ కేంద్రాలు : 154మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లో 264 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలను బిగించారు. అవే కాకుండా 24 సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఫ 4గంటల వరకు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,31,851 మంది ఓటర్లు -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సూర్యాపేటటౌన్ : ‘మొదటి విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచార ముగిసింది. ఎవరు కూడా ఇక ప్రచారం చేయవద్దు.. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు’ అని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిశిత పరిశీలన ఉందని, ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1500 మంది సిబ్బందితో ఐదెంచల భద్రత సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో 1,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదెంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఈ కేంద్రాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కేసులు.. మూడు విడతల్లో 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, రౌడీలు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వివరించారు. 136 కేసుల్లో రూ.9.50 లక్షలు విలువైన 1,425 లీటర్ల మద్యం సీజ్ చేశామని 53 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేయించినట్లు పేర్కొన్నారు. ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు.. ఫ మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదా, లేదా నిర్ధారించుకోండి. ఫ పోలింగ్ సెంటర్ కు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దు, సెల్ఫీలు దిగవద్దు. ఫ మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి. ఫ పోలింగ్ రోజున ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి. ఫ వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. దీనికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫ కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి. ఫ ఎస్పీ నరసింహ -
కేజీబీవీలకు బంకర్ బెడ్లు
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. కొన్నేళ్లుగా రాత్రి సమయంలో విద్యార్థినులు నిద్రించేందుకు మంచాలు లేకపోవడంతో నేలపై చాపలు, దుప్పట్లు వేసుకొని కాలం వెల్లదీశారు. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు (డబుల్ డెక్కర్, డార్మిటరీ మంచాలు) అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇప్పటికే విద్యార్థినుల వివరాలు, ఎన్ని బంకర్ బెడ్లు అవసరమో ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. ఇద్దరికి ఒకటి చొప్పున.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 కేబీబీవీలు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల ఆరు నుంచి పదోతరగతి వరకు.. మరికొన్నింట్లో ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాలయాల్లో 3,409 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఇద్దరికి చొప్పున వీటిని అందజేయనున్నారు. మొత్తం 1,700 వరకు బంకర్లు రానున్నాయి. ఇందులో కింద ఒకటి, పై భాగంలో మరో బెడ్ ఉండనుంది. రాత్రి సమయంలో పిల్లలు నిద్రించిన తరువాత కింద పడకుండా చుట్టూ రక్షణ ఉండేలా వాటిని తీర్చిదిద్దారు. సులభంగా పైకి ఎక్కేందుకు అవరమైన ఏర్పాట్లతో రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేజీబీవీల్లో సరైన వసతులు లేక విద్యార్థినులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సరఫరా అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఫ ఇద్దరికి ఒకటి చొప్పున అందించేందుకు కసరత్తు ఫ తీరనున్న విద్యార్థినుల కష్టాలు ఫ వివరాలు సేకరించి నివేదిక సమర్పించే పనిలో అధికారులు కస్తూర్బా విద్యాలయాలు: 18 విద్యార్థినులు: 3,409 రానున్న బంకర్బెడ్లు: 1,700 -
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండు, మూడు విడతల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. రెండవ విడత అనంతగిరి, చిలుకూరు ,చివ్వెంల, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెం, పెన్పహాడ్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకు సంబంధించి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ నెల 7నుంచి 10వ తేదీ వరకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈనెల 10,12,13,15 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను వినియోగించుకోవాలని సూచించారు. వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శివాలయంలో మంగళవారం సాయంత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి భక్త కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశరుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తాలిబొట్టు తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు దుర్గాప్రసాద్శర్మ, లక్ష్మీనరసింహ మూర్తి, నాగభూషణం, సీతారామాచార్యులు, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. ఎంజీయూ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్గా శ్వేతనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సూరం శ్వేతను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు శ్వేత ఈ పదవిలో కొనసాగనున్నారు. దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఎంజీయూకు అనుసంధాన పర్చేందుకు కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా శ్వేతను వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి అభినందించారు. ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీఆంజనేయస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి అర్చకులు అభిషేకం జరిపించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి నాగవల్లి దళార్చన చేపట్టారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఇక.. ప్రలోభాల ఎర
సూర్యాపేట : మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో పరిసమాప్తం అయ్యింది. ఇక గప్చుప్గా ప్రలోభాల ఎరకు అభ్యర్థులు తెరలేపారు. డబ్బు, మద్యం, విందులు, చికెన్ పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ ప్రధాన మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా.. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, నాగారం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు మంగళవారం సైతం ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. మరోవైపు రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోనూ ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు పంచుతున్నారంటూ ఓటర్లు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, ఓటర్లు సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏ వాడ ఓటర్లను ఆ వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం డంప్ చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందు ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు సిల్వర్, రాగి ఉంగరాలు అందజేస్తున్నారు. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నారు. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు పంపిణీ చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మోతె, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతు దారుల కోసం రోడ్షోలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల విజయంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఫ మద్యం, డబ్బు పంపిణీ.. విందులు ఫ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థుల తంటాలు ఫ రేపే మొదటి విడత పోలింగ్.. కౌంటింగ్ -
కాంగ్రెస్ పాలనలో అరాచకాలు
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి పాలనలో అరాచకాలు చూస్తున్నామని, కేసీఆర్ అంటే అభివృద్ధి.. రేవంత్ అంటే దందాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని తాళ్ల ఖమ్మంపహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్లు కేసీఆర్ పాలన ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. రేవంత్ మాయమాటలకు మోసపోయామని తేలిపోయిందని, కేసీఆర్ను దూరం చేసుకున్నామని అంతా ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులంతా కమీషన్లు, కబ్జాల పనిలో పడ్డారని విమర్శించారు. నిరంతరం అభివృద్ధి పనులకు కేసీఆరే చిరునామా అని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా.. కొత్తగా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని, ఇక ఆ పార్టీ సర్పంచ్లను గెలిపిస్తే మాత్రం ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, అందుకే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు.ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి -
బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం
నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామ జనాభా 2,200 మంది ఉన్నారు. ఓటర్లు మొత్తం 1,501 మంది ఉన్నారు. వార్డులు 10 ఉన్నాయి. ఈ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రెండో విడత ఈనెల 14న ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఏకతాటిపైకి వచ్చి చర్చలు జరిపి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన విద్యావంతురాలు కంభంపాటి సరితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్గా మూడవ వార్డు సభ్యురాలు పుట్ట సైదమ్మను అధికారుల సమక్షంలో ఎన్నుకున్నారు. మొత్తం ఈ గ్రామంలో 10వార్డుల్లో సీపీఎం బలపర్చిన ముగ్గురిని, బీఆర్ఎస్ మద్దతురాలు ఇద్దరు, టీడీపీ బలపర్చిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వార్డు సభ్యులుగా ఎన్నికై న వారిలో గోలి వెంకటేశ్వర్లు, కంభంపాటి నాగేశ్వరావు, పుట్ట సైదమ్మ , పుట్ట ఆంజనేయులు, కాసాని వీరమ్మ, కాసాని కిషోర్, నారా ఇందు, మాధ వీరబాబు, నోసిన త్రివేణి , మాధవరావు ఉన్నారు. సర్పంచ్గా కంభంపాటి సరిత ఎన్నిక -
నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలి
పెన్పహాడ్ : సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని రైతువేదిక కార్యాలయంలో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, వ్యయం, ప్రచారం, సమయపాలన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పరిమితికి మంచి ఖర్చు పెట్టవద్దని ప్రతి విషయాన్ని పరిశీలకులు గమనిస్తూ ఉంటారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, మద్యం డబ్బు, ఉచితాలు, బహుమతులు లాంటి వాటిపై పోలీసు నిఘా ఉందన్నారు. సమయపాలన ముఖ్యమని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల బరిలో అంతా సొంత ఊరు వారే ఉంటారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని ప్రచారం సమయంలో ఒకరినొకరు ఎదురుపడే సమయంలో గొడవలు పెట్టుకోవద్దన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. బాణాసంచా పేల్చ డం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే వారిని ముందస్తుగా బైండోవర్ చేశామని బైండోవర్ అనేది కేసు కాదు అది వ్యక్తిగత సత్ప్రవర్తన కోసం స్వతహాగా ఇచ్చే హామీ పత్రమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, ఎస్ఐ గోపికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. నియమావళి పాటించాలిమునగాల: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. సోమవారం రాత్రి మునగాల మండలం కలకోవలో ఎన్నికల నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి గ్రామం శాంతి కోవెలగా వెలగాలని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి సామరస్యంగా ఉండాలని సూచించారు. సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తామన్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలని, దీనికోసం భవిష్యత్లో కలకోవ గ్రామంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ సదస్సులో కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మునగాల, నడిగూడెం, మోతె ఎస్ఐలు బి.ప్రవీణ్కుమార్, అజయ్కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
స్కూల్లో ఫర్నిచర్ ఉందా!
నాగారం : పాఠశాలలో అవసరానికి మించి బెంచీలు, ఫర్నిచర్ ఉంటే.. అవసరం ఉన్న పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పంపించండి.. ఇది రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు. 2024–25 యూడైస్ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని పాఠశాలల్లో ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అదనంగా డ్యూయల్ డెస్కు లు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో ఫర్నిచర్ విషయంలో సర్దుబాటు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎన్ని పాఠశాలల్లో మిగులు డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి.. ఎన్ని అవసరం అనే విషయాలను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. జిల్లాలో ఇలా...జిల్లాలోని కొన్ని పాఠశాలలకు పూర్వ విద్యార్థులు, దాతలు తమ కుటుంబ సభ్యుల పేరిట బెంచీలు, కుర్చీలు తదితర సామగ్రిని అందజేశారు. బెంచీలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. గతంలో మన ఊరు–మన బడి పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు కూడా పంపిణీ చేశారు. ఈ విద్యాసంవత్సరంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట నిర్వహించినా ఆశించిన విధంగా విద్యార్థులు చేరలేదు. అలాంటి పాఠశాలల్లో ఫర్నిచర్ మిగులుగా ఉంది.వివరాలు ఇలా పంపాలి..ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు దాతలు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించిన ఫర్నిచర్ వివరాలను పరిశీలించాలి. మిగులు ఫర్నిచర్ ఉంటే ఆ వివరాలను ఎంఈఓకు తెలియజేయాలి. వారు పరిశీలించి ఆ వివరాలను డీఈఓకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 15 వరకు నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశం లెక్కలు తేల్చే పనిలో అధికారులు అదనంగా ఉంటే ఫర్నిచర్ కొతర ఉన్నబడికి పంపించేలా ప్రణాళిక 15 వరకు ఉన్నతాధికారులకు నివేదిక -
కేసులతో ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్
హుజూర్నగర్ : బీఆర్ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన సీఐ చరమంద రాజుతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని తాము కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా ఎవరినీ వ్యక్తిగతంగా వాడుకోలేదని ఆయన తెలిపారు. ప్రజా క్షేత్రంలో ఎవరికి నచ్చినట్లు వారు పోటీ చేస్తారని, ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వారు గెలుస్తారని చెప్పారు. అంతేకానీ భయపెట్టి ఇబ్బందులకు గురిచేసే స్వభావం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత ఉండటంతో బీఆర్ఎస్ పార్టీవారిని భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు ఏ ఇబ్బందులు ఎదురైనా పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వై.వి.ఆర్, కేఎల్ఎన్రెడ్డి, అప్పిరెడ్డి, జక్కుల నాగేశ్వరావు, సైదిరెడ్డి, అమర్, ఉపేందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల -
పక్కా వ్యూహం.. గెలుపే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : పల్లె రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీలతో సంబంధం లేకున్నా పంచాయతీ సమరంలో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఉదయం గుర్తులతో ప్రచారం చేయడంతో పాటు సాయంత్రం విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈనెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న మండలాల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నువ్వానేనా అన్నట్లుగా అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఉదయం పూట ప్రచారం..మొదటి విడత ఎన్నికలు జరగనున్న 159 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుసభ్యులకు పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం పూట ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తులపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకేసారి పెద్దఎత్తున మద్దతుదారులతో కలిసి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కో గ్రామంలో ఉన్న వార్డులను విభజించి రోజుకు నాలుగైదు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. రాత్రికి పసందైన విందులురెండు రోజులుగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు రాత్రికి ఇంటింటికీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో ఉన్న తమ వార్డు ప్రజలను ఏకం చేస్తూ పసందైన మందుతో విందులు ఇస్తున్నారు. అక్కడక్కడ మద్యమే కాకుండా ఇంటింటికీ అరకిలో చికెన్ పంపిస్తూ వినూత్నంగా ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎత్తుగడలు ఉదయం పూట ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా రాత్రికి విందులు మొదటి విడతలో జోరుగా మద్యం పంపిణీప్రత్యేక వాహనాలు పంపించి..ఎన్నికలకు రెండురోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానున్న నేపథ్యంలో గ్రామంలోని వివిధ వార్డులకు చెందిన ప్రజలు హైదరాబాద్, ఖమ్మం, చైన్నె, ఇలా నగరాల్లో ఉన్న వారికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి విడతలో ఈనెల 11న పోలింగ్ ఉండడంతో ఆయా మండలాలకు చెందిన ఓటర్లు ఈనెల 10నే సొంత గ్రామాలకు చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లను అభ్యర్థులు చేస్తున్నారు. కొందరు రవాణాకు కావాల్సిన డబ్బులను పంపిస్తుండగా.. మరికొందరు పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్న చోటకు ప్రత్యేక వాహనాలను సైతం పంపించేలా చూస్తున్నారు. -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
చివ్వెంల : కేసుల పరిష్కారంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీశారద సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల విషయంలో కక్షిదారులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి పర్వీన్కౌసర్, న్యాయవాదులు పాల్గొన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి సోమవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, దుర్గాప్రసాద్శర్మ, సీతారామా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. శివుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరికొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అభిషేకం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలో..సోమవారం వేకువజామున ప్రధాన ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేశారు. గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఘనంగా ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. -
తొలిదశ ప్రచారం నేడు ఆఖరు
సూర్యాపేట : పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడనుంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అయితే 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపాల్సి ఉండడంతో ఆ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో బ్రేక్పడనుంది. ఇక, పోలింగ్కు అధికారులు అంతా సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్న్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు. 159 పంచాయతీల్లో ఎన్నికలుసూర్యాపేట జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికోసం గత నెల 27న నోటిఫికేషనన్ విడుదలైన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్ 29తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నవంబర్ 30న స్క్రూట్నీ నిర్వహించి డిసెంబరు 1న అప్పీల్కు అవకాశం ఇచ్చారు. 2న వాటిని పరిష్కరించి.. 3వ తేదీన 3 గంటల వరకు ఉపసంహరణలు కొనసాగాయి. ఆ తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు. 10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..11న మొదటి విడత పోలింగ్ జరగనున్నందున.. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్న్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషనన్ కేంద్రాల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇలా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.11న ఎనిమిది మండలాల్లో పోలింగ్ మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరిన పోలింగ్ సామగ్రి సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ పూర్తి 10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది -
విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
సూర్యాపేట అర్బన్ : 2025–విత్తన, విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న, మట్టిపల్లి సైదులు, దంతాల రాంబాబు డిమాండ్ చేశారు. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోమవారం సూర్యాపేటలో 2025–విత్తన, విద్యుత్ బిల్లుల పత్రాలను దహనం చేసి నిర్వసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ఈ బిల్లులను తీసుకువస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎం జిల్లా నాయకులు షేక్ నజీర్, కునుకుంట్ల సైదులు, పెరుమాళ్ల రాజారావు, నారబోయిన వెంకట్ యాదవ్, పుల్లూరి సింహాద్రి, ప్రవీణ్, చారి, ఇందిరా, ప్రమీల పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలి
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మద్దిరాల : ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చిన్ననెమిల, మామిండ్లమడవ, జి.కొత్తపల్లి, కుంటపల్లి, కుక్కడం, గుమ్మడవెల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. ఈనెల 10వతేదీన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆయేషా పర్వీన్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ ఎం.వీరన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలితుంగతుర్తి : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు ఆయనతోపాటు తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమారు ఉన్నారు. -
సమస్యాత్మక పల్లెలపై పక్కా నిఘా
అర్వపల్లి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై పక్కా నిఘా ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు తెలిపారు. సమస్యాత్మక గ్రామమైన జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సమాగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్లు పరిశీలించి ఓటింగ్ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ సైదులు, ఎంపీఓ గోపి, సీనియర్ అసిస్టెంట్ నర్సింహరాజు, సిబ్బంది సైదులు, నాగరాజు, వెంకన్న, మల్లయ్య, స్టేజ్–2 అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ కలిసిరాలేదు..
భానుపురి (సూర్యాపేట) : శ్రీఅన్ని కలిసొస్తే సర్పంచ్ అవుదామకున్నా.. పార్టీ అండదండలు ఉన్నాయి.. జనంలోనూ పార్టీపై సానుకూలత ఉంది. అన్నింటికీ మించి ఇరుగు పొరుగువారితో, ఊరిలోనూ అన్నివర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.. కానీ తీరా చూస్తే రిజర్వేషన్ మారింది. ఇక సర్పంచ్ అయ్యే అవకాశం చేజారింది..శ్రీఅంటూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకున్న ఆశావాహులు కొందరు అక్కడక్కడ తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. సర్పంచ్గా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆశావహులు ప్రస్తుతం వ్యూహం మార్చుతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ కాకపోయినా.. చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచ్ పదవి దక్కించుకుందామని పథకాలు రచించుకుంటున్నారు. ఆయా రిజర్వేషన్లకు చెంది.. తమ వెంటే ఉండే వారు, చెప్పినమాట వినే అనుచరుడు.. లేదంటే అనుచరుడి సతీమణిని ఇలా.. ఏదోవిధంగా తన మనిషినే సర్పంచ్గా బరిలోకి దింపి గెలిపించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థికంగా అండగా..! సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవాలన్నా.. ఉప సర్పంచ్ను ఎన్నుకోవాలన్నా డబ్బే ప్రధానం. ఒక్కో గ్రామంలో ఒకలా ఖర్చు ఉంటుంది. జనాభా బట్టి ఒక్కో గ్రామంలో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని పోటీలో ఉన్న అభ్యర్థులు పేర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఓ సామాజిక వర్గం రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండగా.. అక్కడ సర్పంచ్ స్థానం బలహీన వర్గాలవారికి రిజర్వేషన్ అయింది. ఈ క్రమంలో రిజర్వేషన్ వచ్చిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అంత భారీగా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో అన్ని విధాలుగా ఉన్న సామాజిక వర్గం నాయకులు తమ ఇంట్లోని కుమారుడు, కోడళ్లను వార్డు మెంబర్ బరిలో ఉంచుతున్నారు. వార్డు మెంబర్గా గెలిచి.. ఉప సర్పంచ్గా గ్రామంలో తమ బలాన్ని చాటాలని చూస్తున్నారు. ఇందుకోసం సర్పంచ్ అభ్యర్థికి ఎన్నికల్లో అయ్యే ఖర్చును భరిస్తూ.. గెలిచాక పనులు అప్పగించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యుల ఎంపికే కీలకం ఉప సర్పంచ్గా బరిలో ఉండే నాయకుడు తమ ప్రధాన అనుచరులను వార్డుల్లో మెంబర్లుగా నిలిపేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఉప సర్పంచ్ కావాలంటే వార్డు సభ్యుల పాత్ర కీలకం. దీంతో చెప్పిన మాట వినే వారితోనే నామినేషన్ వేస్తున్నారు వారికి అవసరమైన నామపత్రాలు, పన్ను చెల్లింపు, ధ్రువపత్రాలు తీసుకోవడం వంటి పనులన్నీ ఆ నాయకులే చూసుకుంటున్నారు.ఉప సర్పంచ్గా ఉందాం..! ఫ సర్పంచ్ పదవులు ఆశించినవారి మనోగతం ఫ వార్డు మెంబర్గా బరిలో ఉండేందుకు నామినేషన్లు ఫ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు భరించేందుకు ముందుకు -
ఈశ్వరాచారి త్యాగం మరువలేనిది
హుజూర్నగర్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో అన్యాయం జరిగింద ట హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి త్యాగం మరువలేనిదని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాసరావు అన్నారు. సాయి ఈశ్వరాచారిని త్యాగాన్ని స్మరిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హుజూర్నగర్లోని మిర్యాలగూడ రోడ్డు చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి త్యాగం ప్రతి బీసీ బిడ్డ గుండెలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. పోరాడి మన హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈశ్వరాచారి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఓరుగంటి మధు, చేపూరి నరసింహాచారి, చిలకరాజు అజయ్ కుమార్, కర్నె కృష్ణ, శెట్టి శ్రీనివాస్, వట్టికూటి శ్రీనివాస్గౌడ్, కొట్టు శేఖర్, ఎస్కే.హసన్మియా, జి.సైదులు యాదవ్, కాలువ పెదవెంకటేశ్వరావు, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుల రద్దీతో పంచనారసింహుడి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేసి, గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. -
చిత్ర విచిత్రాల పొత్తులు..!
భానుపురి (సూర్యాపేట) : తొలి, మలి విడతల పల్లెపోరులో చిత్ర విచిత్రాల పొత్తులు తెరపైకి వచ్చాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూసుకునే పార్టీలు సైతం పంచాయతీ పోరులో కలిసి ముందుకు సాగుతున్నాయి. గ్రామాన్ని బట్టి ఒక్కో పార్టీలో మూడు నాలుగు చీలికలు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీకి సై అంటే సై అంటున్నారు. వార్డులు తగ్గినా.. ఉపసర్పంచ్ ఇవ్వకున్నా మరోవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. గెలుపే లక్ష్యంగా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించరు. కేవలం అభ్యర్థిని చూసే ఆయా పార్టీలు బలపర్చి మద్దతు ఇస్తుంటాయి. అయితే పార్టీలు సైతం తమ పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలనే సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. వార్డు సభ్యుల పరిస్థితీ ఇలాగే ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులతోపాటు రెండో విడత ఎన్నికలు జరిగే చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్పహాడ్ మండల్లాలోని 181 గ్రామాలు, 1,628 వార్డుల్లో పార్టీలతో సంబంధం లేకుండా పొత్తులు కుదిరాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పలుచోట్ల ఒకే అభ్యర్థిని బలపర్చడం గమనార్హం. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లు.. ఇంకొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఇలా.. రాజకీయాలతో సంబంధం లేకుండా తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పొత్తులు పెట్టుకున్నాయి. తొలి విడత పల్లెల్లో ఇలా.. ● తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో కుంభం మంజులను కాంగ్రెస్ పార్టీ బలపరిచి బరిలో నిలిపింది. ఇదే గ్రామంలో జేఏసీలో ఉన్న కాంగ్రెస్ వర్గీయులు, బీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి మాడిశెట్టి వేదవాణిని నిలబెట్టాయి. ● తుంగతుర్తి మండలం అన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీచేశాయి. వెలుగుపల్లిలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బరిలో నిలిచాయి. ● ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా గట్టికల్లు గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం.. కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి. తుమ్మల పెన్పహాడ్, ఇస్తాళ్లాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతిస్తోంది. ● జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే సామేలు ఇరు వర్గీయులు వేర్వేరుగా సర్పంచ్ బరిలో ఉన్నారు. దామోదర్రెడ్డి వర్గీయుల అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. అలాగే జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, అడివెంల, తిమ్మాపురం, వేల్పుచర్ల, రామన్నగూడెం, కాసర్లపహాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేలు వర్గీయునికి సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతు తెలిపాయి. కత్తులు దూసుకునే పార్టీలు సైతం మిత్రులుగా ఫ పార్టీల్లో వర్గాలుగా చీలికలు ఫ పంచాయతీ ఎన్నికల్లో వెలుగు చూస్తున్న పొత్తుల చిత్రాలు ఫ కలిసి ప్రచారం చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటున్న ఓటర్లుపంచాయతీల్లో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది తమ పార్టీ మద్దతుదారులు గెలిచేలా ప్రణాళికలు రూపొందించింది. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు సైతం తమతమ పార్టీలు బలంగా ఉన్నచోట సత్తాచాటాలని భావిస్తూ పోటీలో నిలిచాయి. అయితే స్థానిక పరిస్థితుల్లో బలంగా లేని పార్టీలు సర్పంచ్ అభ్యర్థిగా తమ పార్టీ వ్యక్తిని బలపర్చి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని పొత్తులకు వెళ్లాయి. ఈ పొత్తుల కారణంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారివారు చూసుకునే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో మొదటినుంచి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నచ్చకపోవడం మరో పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పొత్తులు ఇలా ఉండగా.. రెండు రోజులుగా ప్రచారాలకు వెళుతున్న నాయకులను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. -
నేడు సాగర్కు విదేశీ ప్రతినిధులు
నాగార్జునసాగర్ : తూర్పు, పశ్చిమ ఆసియా దేశాల బౌద్ధ ప్రతినిధులు సోమవారం నాగార్జునసాగర్ను సందర్శించనున్నారు. వీరికి మూడు రోజులపాటు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. విజయవిహార్ ప్రాంగణం, బుద్ధవనం పరిసరాలు, లాంచీ స్టేషన్ దారి తదితర ప్రాంతాలు ముస్తాబు చేశారు. ప్రతినిధులు ముందుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విజయవిహార్కు రానున్నారు. డ్యామ్ను సందర్శించి లాంచీలో జలాశయంలో విహరించనున్నారు. విమానాల రద్దుతో అయోమయం కొన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో ఏ దేశాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తారన్న వివరాలు పర్యాటక శాఖ వద్ద స్పష్టంగా లేవు. విదేశీ అతిథులు హైదరాబాద్కు చేరుకున్న తర్వాతే తుది టూర్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
ఏఎస్ రావు జ్ఞాపకార్థమే టాలెంట్ టెస్ట్
సూర్యాపేట టౌన్ : ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు ఏఎస్ రావు జ్ఞాపకార్థమే ఆదివారం సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. పరీక్ష అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ సారి జిల్లా నుంచి 1000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతోపాటు 25 మందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సహకరించిన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటేశులుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాలరావు, కేకేబీఏ.శర్మ, వైవీ.సుబ్బారావు, ఆర్.కృష్ణమూర్తి, కె.సత్యనారాయణ, పి.రాజు పాల్గొన్నారు. -
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయండి
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 11న మొదటి విడత ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులంతా ముందస్తుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల విధులు కేటాయించి ఉద్యోగులు ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు సూర్యాపేట, ఆత్మకూరు (ఎస్), జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో విధిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికసూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని సరస్వతి విద్యా నిలయంలో ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీయూపీఎస్) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా ప్రస్తుతం అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా యామా రమేష్, ప్రధాన కార్యదర్శిగా జూలకంటి వెంకట్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి లింగంపల్లి హరిప్రసాద్ ప్రకటించారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్లగొండ విభాగ్ భౌద్దిక్ ప్రముఖ్ బంటు జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు నేర్పాలన్నారు. ఈ సమావేశంలో బెల్లంకొండ రామమూర్తి, బ్రహ్మచారి, రామారావు, శ్రీనివాసరావు, సుధాకర్రావు, నాగేశ్వర్రావు, జితేందర్రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్, పూల్సింగ్, శ్రీనివాస్, శ్రీదేవి, రజని, ధనేశ్వర్రావు, శ్రీనివాసరావు, ఆంజనేయులు, ఉపేందర్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం చేపట్టి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
మలి విడత బరిలో 456 మంది
సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారు ఆదివారం ఉదయమే ప్రత్యేక ప్రచార వాహనాలను సిద్ధం చేసుకొని దేవాలయాలు, చర్చీల వద్ద ప్రత్యే పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. రంగురంగుల కరపత్రాలను ముద్రించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. యువకులు వాట్సప్ గ్రూప్ల్లో ఓటర్లకు సందేశాలను పంపుతూ తమ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కోదాడ : రెండో విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లోని 181 పంచాయతీల్లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 158 పంచాయతీలో 456 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇక 181 పంచాయతీల్లో మొత్తం 1,628 వార్డులు ఉండగా వాటిలో 336 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,292 వార్డుల్లో 2,790 మంది పోటీలో నిలిచారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో ఆదివారం నుంచి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెన్పహాడ్లో అత్యధికం.. రెండో విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో పెన్పహాహడ్ మండలంలోని 29 పంచాయతీల్లో 91మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. చిలుకూరు మండలంలోని 17 పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం కాగా 12 పంచాయతీల్లో అత్యల్పంగా 30మంది పోటీలో ఉన్నారు. అలాగే అనంతగిరిలో 54 మంది, కోదాడలో 45 మంది, నడిగూడెంలో 40 మంది, మోతెలో 63 మంది, మునగాలలో 58 మంది, చివ్వెంలలో 87మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసలెవరో.. రెబల్ ఎవరో! ఎన్నికలు జరుగుతున్న పలు గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అసలెవరో.. రెబల్స్ ఎవరో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. పలు గ్రామాల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. మునగాల మండలం ముకుందాపురంలో ఇద్దరు కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి చిలుకూరు మండలం బేతవోలు, కోదాడ మండలం గణపవరం, గుడిబండ గ్రామాల్లోనూ నెలకొంది. ఆయా గ్రామాల్లో నాయకులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు ఒకరికి.. మరికొందరు ఇంకొక్కరికి మద్దతు నిస్తూ ప్రచారం సాగిస్తుండడంతో పంచాయతీ రాజకీయం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెర వెనుక ఉండి తమ బంధువులను ఎన్నికల బరిలో దింపారు. కోదాడ మండలం గుడిబండలో నీటిపారుదలశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన భార్యను పోటీగా నిలపగా, ఆమైపె పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న ఒకరు తనతల్లిని పోటీకి దింపారు. ముకుందాపురంలో ఇద్దరు పోలీస్ అధికారులు సర్పంచ్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఫ 158 గ్రామాల్లో తేలిన సర్పంచ్ అభ్యర్థుల లెక్క ఫ మొత్తం 181 పంచాయతీలకు 23 ఏకగ్రీవం ఫ ఎనిమిది మండలాల్లో 336 వార్డులు కూడా.. ఫ 1,292 వార్డులకు 2,790 మంది పోటీ -
దేవరకొండతో ప్రత్యేక అనుబంధం ఉంది
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవరకొండ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తన అమ్మమ్మ ఊరు దేవరకొండ మండలంలోని ముదిగొండ అని, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే స్వగ్రామం ముదిగొండే అన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సమయంలో దేవరకొండ ప్రాంత ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ అందించారని, ఈ ప్రాంతం వాసులు తనపై చూపే అప్యాయతను ఎప్పటికీ మరువలేనన్నారు. జిల్లాలో 2.50లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. జిల్లా వ్యాప్తంగా 15.63 లక్షల మందికి సన్న బియ్యం అందుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ముందున్నామని, దేవరకొండ నియోజకవర్గంలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.45 కోట్లు చెల్లించామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అంభభవాని, కంబాలపల్లి, పొగిళ్ల, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టు ఇరిగేషన్ పనులకు రూ.440 కోట్లు మంజూరు చేశామని, ఈ లిఫ్టు ఇరిగేషన్ పనులు పూర్తయితే 37వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పెండ్లిపాకల ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల, మిర్యాలగూడ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్ట్తోపాటు మిగతా ప్రాజెక్టులన్నీ ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు. -
మూడో విడతకు ఏర్పాట్లు చేసుకోవాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లతో శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు చూసుకోవాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లు లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డివిజనల్ ప్రిసైడింగ్ అధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎల్బీసీ పూర్తిచేస్తాం
దేవరకొండ, కొండమల్లేపల్లి : ‘నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యం.. నిజాం పాలనకు చరమగీతం పాడింది ఈ జిల్లానే. గత పాలకులు జిల్లా ప్రజలపై కక్షగట్టి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పనులను పక్కన బెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం’ అని ముఖ్యమంతి రేవంత్రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలు’ సభలో ప్రసంగించారు. రెండేళ్ల క్రితం ఓటు అనే ఆయుధంతో గడీల పాలన బద్దలు కొట్టి ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారినే సర్పంచ్లుగా ఎన్నుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేపట్టలేదని, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగా నే టన్నెల్ పనులకు నిధులు కేటాయించామన్నారు. రాబోయే రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎమ్మెల్యే బాలునా యక్ చొరవతో ఒక్క దేవరకొండ నియోజకవర్గానికే అత్యధికంగా 14వేల రేషన్కార్డులు మంజూరయ్యాయనితెలిపారు. దేవరకొండకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తామని, అందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిస్తామన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులలు మంజూరు చేస్తామని, దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5కోట్లు కావాలని ఎమ్మెల్యే బాలునాయక్ అడగగా.. రూ.6 కోట్ల మంజూరు చేయిస్తానన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక దేవరకొండ ప్రాంతానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్కను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘాలకు రూ.11.33కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్రెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, గుత్తా అమిత్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, సిరాజ్ఖాన్, మాధవరెడ్డి, వేణుధర్రెడ్డి, నర్సింహారెడ్డి, యూనూస్, ఏవిరెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, మాధవరెడ్డి, దూదిపాళ్ల రేఖ, దేవేందర్, ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ అంటే.. చైతన్యానికి ప్రతీక ఫ మంత్రులను పంపి సమీక్షలు నిర్వహిస్తాం ఫ పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి ఫ దేవరకొండలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం ఫ ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ సభకు భారీగా తరలివచ్చిన జనం -
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.రవినాయక్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో సూక్ష్మ పరిశీలకులు, జోనల్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ స్టేషన్కు చేరుకుని పరిశీలించాలన్నారు. అలాగే జోనల్ అధికారులు 7, 8 గ్రామ పంచాయతీలకు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఏమైనా పోలింగ్ మెటీరియల్ కావాలన్నా, సిబ్బందికి భోజనాలు చూసే బాధ్యత జోనల్ అధికారులదేన న్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
రెండో విడత ఉపసంహరణ
కోదాడ : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల వరకు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్ధానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పలువురు ఉపసంహరించుకున్నారు. కోదాడ నియోజకవర్గంలో కోదాడ, అనంతగిరి, నడిగూడెం, మోతె, మునగాల, చిలుకూరు మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్, చివ్వెంల మండలాల్లో మొత్తం 181 పంచాయతీలు ఉండగా ఇందులో 23 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్నారు. ఇక 158 పంచాయతీల్లో సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఇక, వీటి పరిధిలోని 1,628 వార్డులకు గాను 256 వార్డులు ఏకగ్రీవం కాగా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి క్షణం వరకు సాగిన బుజ్జగింపులు సర్పంచ్ ఎన్నికల్లో ఒకే పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని బుజ్జగించి రంగం నుంచి తప్పించడానికి ఆయా పార్టీల పెద్దలు తీవ్రంగా శ్రమించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావులతో పాటు ముఖ్యనాయకులు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నాయకులతో చివరి క్షణం వరకు మంతనాలు జరిపి బుజ్జగించి చాలాచోట్ల నామినేషన్లను ఉపసంహరింప జేశారు. కానీ, కొన్నిచోట్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుర్తుల కేటాయింపు.. శనివారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగానే అభ్యర్ధులకు గుర్తులను కేటాయించారు. గుర్తులు పొందిన అభ్యర్ధులు కరపత్రాలు, మోడల్ బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ల బాటపట్టారు. కాగా రెండో విడత 8 మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మరో 7 రోజులు మిగిలి ఉండడంతో అభ్యర్థ్ధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 23 సర్పంచ్, 256 వార్డు స్థానాలు ఏకగ్రీవం ఫ బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన అధికారులు ఫ 158 గ్రామాల్లో ఈనెల 14న పోలింగ్ పంచాయతీలు వార్డులు 181 1,628 23 ఏకగ్రీవాలు 256 158 ఎన్నికలు జరిగేవి 1,372 -
రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషి శ్లాఘనీయం
సూర్యాపేట టౌన్ : భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి శ్లాఘనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి జగదీష్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల రాజన్న మాదిగ, చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, వల్లపట్ల దయానంద్, అమరారపు, పద్మభూషణం మాదిగ, చింత జాన్ విల్సన్ మాదిగ, మల్లేష్ మాదిగ, డాక్టర్ బట్టు గోపి, మాలమహానాడు నాయకులు తల్లమల్ల హస్సేన్, బొల్లెద్దు వినయ్, గాలి వికాస్, ఇతర ప్రజా, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
సూర్యాపేట టౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ నరసింహ అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాపోటీలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమానికి ఎంతగానో కృషిచేస్తున్నామన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డు ఆఫీసర్స్కు ప్రశంసా పత్రాల అందించి అభినందించారు. కార్యక్రమంలో ఆర్ముడ్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, హోంగార్డు ఇన్చార్జి, ఆర్ఎస్ఐ అశోక్, ఇతర ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, రాజశేఖర్ పాల్గొన్నారు. -
సర్పంచ్ పదవులకు 1,052.. వార్డు స్థానాలకు 3,493
ఫ మూడో విడత పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు ఫ హుజూర్నగర్ డివిజన్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో చివరి రోజు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ నెల 3వ తేదీనుంచి డివిజన్లోని ఏడు మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు, 1,318 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్కు 107 నామినేషన్లు, వార్డు సభ్యులకు 116 నామినేషన్లు వచ్చాయి. ఇక రెండోరోజు సర్పంచ్కు 196, వార్డు సభ్యులకు 589 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు క్లస్టర్ల సెంటర్లకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో సాయంత్రం 5.30గంటల వరకు లైన్లో ఉన్న ఆశావహులకు టోకెన్లు జారీచేసి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ పదవులకు 749, వార్డులకు 2,788 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు గరిడేపల్లి మండలం నుంచి దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మండలం జీపీలు వార్డులు సర్పంచ్ వార్డు నామినేషన్లు నామినేషన్లు చింతలపాలెం 16 148 113 422 గరిడేపల్లి 33 300 228 785 హుజూర్నగర్ 11 110 76 323 మఠంపల్లి 29 254 255 775 మేళ్లచెరువు 16 152 82 356 నేరేడుచర్ల 19 168 132 365 పాలకవీడు 22 186 166 467 -
నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి
భానుపురి (సూర్యాపేట) :గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా.. ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినా, ఇతరాలపై ఫిర్యాదులను నేరుగా తన ఫోన్ నంబర్ 9676845846కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి రద్దు భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలులో ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి తిరిగి యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కోర్టుల భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలికోదాడ: కోదాడ పట్టణంలో నూతనంగా చేపట్టిన నాలుగు కోర్టుల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద కోరారు. శనివారం ఆమె కోదాడ కోర్టును అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో నిర్మాణలో ఉన్న నాలుగు కోర్టుల నూతన భవనాన్ని పరిశీలించారు. అనంతరం కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం కోర్టులు నడుస్తున్న భవనాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నందున సదరు కాంట్రాక్టర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మోతె మండలాన్ని కోదాడ కోర్టు పరిధిలో కలపాలని న్యాయవాదులు ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కోదాడ కోర్టు న్యాయమూర్తులు కె.సురేష్, భవ్య, ఎండి.ఉమర్, కోదాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ, రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. విత్తన, విద్యుత్ బిల్లులను వ్యతిరేకించాలిఅర్వపల్లి : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నష్టం చేకూర్చేలా తీసుకొచ్చిన ముసాయిదా విత్తన, విద్యుత్ బిల్లులు–2025ను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు కోరారు. శనివారం తిమ్మాపురంలో జరిగిన ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8న చేపట్టనున్న ఆయా బిల్లల కాపీల దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, గంట నాగయ్య, సాగర్, ఉదయగిరి, కునుకుంట్ల సైదులు, పి.కిరణ్, చిరంజీవి, రవి, ఉపేంద్ర, వెంకట్యాదవ్ పాల్గొన్నారు. -
సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలి
గరిడేపల్లి : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ నేల కోతను అరికట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ ఇన్చార్జి డి.నరేష్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు హాజరయ్యారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డెమోస్ని చూసి రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయాన్ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, పి.అక్షిత్సాయి, సుగంధి, నూతనకల్ మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డి, కంప్యూటర్ ప్రోగ్రామర్ నరేష్ రైతులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి -
రూ.కోటైనా.. పోటీకి సై!
అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామాల్లో ఖర్చు కూడా ఎక్కువే..రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో బరిలో ఉన్న రెబల్స్ను తప్పించడానికి భారీ ఎత్తున బేరసారాలు సాగుతున్నాయి. ఎన్నికలకు పెట్టిన ఖర్చు మొత్తం ఇస్తామని, బరిలోనుంచి తప్పుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కొందరు పోటీదారులను బతిమిలాడుతున్నారు. చివరి నిమిషం వరకు పోటీలో ఉంటే కలిసి వస్తుందని, అప్పటివరకు వేచి చూడాలని కొందరు భావిస్తున్నారు. తాము గెలవలేకపోయినా ఓడించడానికి పనికివస్తానని కొందరు ప్రత్యర్థులను భయపెడుతూ ధర పెంచుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోదాడ: జిల్లా పరిధిలో అత్యధిక ఓటర్లు కలిగిన పది గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒక్కొక్కరు కోటి రూపాయలకు మించి ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సిమెంట్ ఫ్యాక్టరీలు కలిగిన మేళ్లచెరువు, దొండపాడు గ్రామాల్లో రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లు అధికంగా ఉన్న గ్రామాలను పరిశీలిస్తే.. మేళ్లచెరువు (10,567), దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041), తుంగతుర్తి (5,338), పొనుగోడు (5,161), రామాపురం (4,797), నూతన్కల్ (4,568), మునగాల పంచాయతీలు ఉన్నాయి. ఈ పది గ్రామాల్లో 7 గ్రామాలు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి అప్పు చేసైనా సరే.. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఉండడంతో ఇక్కడ భూములకు ఎక్కువ ధరలున్నాయి. పెద్ద గ్రామాల్లో పోటీ చేస్తున్నవారు అవసరమైతే నాలుగు ఎకరాలైన అమ్ముతామని, అప్పు తెచ్చయినా సరే ఖర్చు పెడతామని చెబుతుండడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. చిలుకూరు మండలం బేతవోలు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇద్దరు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడే ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇక మునగాల గ్రామపంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోదాడ మండలం గుడిబండ, నల్లబండగూడెం, గణపవరం పంచాయతీల్లో కూడా ఖర్చు రూ.కోటి పైమాటేనని పలువురు అంటున్నారు. విచ్చలవిడిగా మద్యం.. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి ఆశావహులు మద్యానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో సోమవారం నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంగా మద్యానికి రూ.లక్ష ఖర్చు చేసినట్లు అభ్యర్థి ఒకరు చెప్పారు. ఎన్నికల బరిలో ఉండేవారు మద్యం కోసం అప్పుడే కొత్త దుకాణదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెద్ద గ్రామాల్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మద్యానికి ఖర్చు చేయాల్సిందేనని, ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. -
ముగిసిన మూడవ విడత నామినేషన్లు
హుజూర్నగర్ : హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో శుక్రవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. హుజూర్నగర్, చింతలపాలెం, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లోని ఆయా క్లస్టర్ సెంటర్లలోకి సాయంత్రం ఐదు గంటలకు వరకు చేరుకున్న వారి నామినేషన్లను అర్ధరాత్రి వరకు అధికారులు స్వీకరించారు. పలు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు రవినాయక్, శ్రీను, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సందర్శించి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 11.30 గంటల వరకు హుజూర్నగర్, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మిగతా నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో కొనసాగుతూనే ఉంది. మండలం సర్పంచ్ వార్డులు హుజూర్నగర్ 73 324 పాలకవీడు 166 467 గరిడేపల్లి 228 785 (మిగతా మండలాల్లో ప్రక్రియ కొనసాగుతూనే ఉంది)ఫ హుజూర్నగర్ డివిజన్లో చివరి రోజు భారీగా దాఖలు ఫ అర్ధరాత్రి వరకు క్యూకట్టిన అభ్యర్థులు -
ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు. జిల్లాలో మొదటి విడతలో 159 సర్పంచ్, 1,442 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1,683, ఓపీఓలు 2,260 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి
సూర్యాపేట అర్బన్ : పోలీసుల దాడి కారణంగా మరణించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అతడి మృతికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, టీజేఎస్ జిల్లా ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, మాస్లైన్ నేత నరసన్న డిమాండ్ చేశారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఎల్గూరి గోవింద్ గౌడ్, సట్టు నాగన్న, బొల్లెద్దు వినయ్ మాల, అంబేద్కరిస్టు కాశిమల్ల వెంకట నరసయ్య, దైద శీను, మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి కృషిచేస్తామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ నెల 6న హోంగార్డుల వ్యవస్థ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన రక్తదాన శిబిరం, హోంగార్డు ఆఫీసర్స్కు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ పోలీస్ సిబ్బందితో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో పనిచేస్తున్నారని అభినందించారు. రక్తదాన శిబిరం అనంతరం కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్స్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, హోంగార్డ్ ఇన్చార్జి ఆర్ఎస్ఐ అశోక్, సాయిరాం, సురేస్, సిబ్బంది పాల్గొన్నారు. మీ సేవలపై కమిషనర్ ఆరాకోదాడ: పట్టణంలోని మీ సేవ కేంద్రాలను శుక్రవారం రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ రవికుమార్ తనిఖీ చేశారు. పలు కేంద్రాల్లో సేవల నిర్వహణ, రుసుముల వసూలు, టోకెన్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. మీసేవ కేంద్రానికి వచ్చిన ప్రజలను సేవలపై ఆరా తీశారు. నాగార్జున మీ సేవ కేంద్రం అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాహకుడిని అభినందించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, ఈడయం గపూర్అహ్మద్, జిల్లా మేనేజర్ సైదానాయక్ మీసేవ నిర్వాహకుడు కె.ప్రవీణ్ ఉన్నారు. దండు మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయ హుండీని శుక్రవారం లెక్కించారు. 120 రోజులకు గాను భక్తులు కానుకలు సమర్పించుకోగా రూ.7,32,310 వచ్చినట్లు ఆలయ అధికారి జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్రెడ్డి, సర్వయ్య, జిల్లా దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సిబ్బంది, అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ‘వీఎన్’ జీవితం స్ఫూర్తిదాయకంసూర్యాపేట అర్బన్ : జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మల్లు వెంకటనరసింహారెడ్డి (వీఎన్) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లు వెంకటనరసింహారెడ్డి 21వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం వీఎన్ పోరాటం మరుమలేనదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు కోట గోపి, వేల్పుల వెంకన్న,ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మేకనబోయిన శేఖర్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, వల్లపు దాసు సాయికుమార్, పిండిగా నాగమణి, మేరెడ్డి కృష్ణారెడ్డి, సైదమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపోరుకు పటిష్ట భద్రత
సూర్యాపేట టౌన్ : ‘జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంపై పోలీస్ నిరంతరం నిఘా ఉంటుంది’ అని జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే ప్రజలంతా సహరించాలని, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. పలు వివరాలు ఆయన మాటాల్లోనే.. 173 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇందులో మొదటి విడత 159 గ్రామాలకు గాను 47 సమస్యాత్మక గ్రామాలుగా, రెండవ విడతలో 181 గ్రామాలకు 65, మూడవ విడతలో 146 గ్రామాలకు 58 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కొంటారని వివరిస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఐదంచెల భద్రత.. జిల్లాలోని 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. అందులో గ్రామ పంచాయతీలో భద్రత, రెండు మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఒక ఎస్ఐ లెవల్ అధికారి రూట్ మొబైల్స్, మండలానికి సీఐ, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. పోలింగ్ కేంద్రాలను ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు నిరంతరం పర్యవేక్షిస్తారు. 97 కేసులు నమోదు జిల్లాలో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 97 కేసులు నమోదు చేశాం. అలాగే ఎన్నికల సామగ్రిని తరలించేందుకు మొదటి విడత రూట్ మొబైల్స్ 58, రెండవ విడతకు 47, మూడవ విడత రూట్ మొబైల్స్ 45 ఏర్పాటు చేశాం. నిరంతర పర్యవేక్షణకు నాలుగు ఎస్ఎస్ టీంలు, 23 ఎంసీసీ టీంలు, 23 ఎఫ్ఎస్టీలు, ఎనిమిది పోలీస్ స్పెషల్ స్టైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశాం. 9వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం ఈ నెల 11వ తేదీన జరగనున్న తొలి విడత ఎన్నికలకు 9వ తేదీ సాయంత్రం వరకు గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బహుమతులు, మద్యం, డబ్బు పంచకుండా నిఘా ఉంచాం. జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా జిల్లా సరిహద్దుల వెంట ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. మూడు విడతల్లో పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ కూడా విజయోత్సవాలు, బాణసంచాలు కాల్చేందుకు అనుమతి లేదు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి బుక్లెట్ సైతం ఇచ్చాం. ఎన్నికల నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఫ ప్రతి విడతకు 1,500 మందితో బందోబస్తు ఫ సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఫ నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఫ ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటెయ్యాలి ఫ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి ఫ ఘర్షణలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం ‘సాక్షి’తో ఎస్పీ కె.నరసింహ గతంలో నేరాలకు పాల్పడిన వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని, సమస్యలు సృష్టించమని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ముందస్తు పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో లైసెన్స్డ్ గన్లను కూడా డిపాజిట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 59 గన్లను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డిపాజిట్ చేయించాం. -
నామినేషన్ల ఎంట్రీలో తప్పులు దొర్లొద్దు
మేళ్లచెరువు : నామినేషన్ల వివరాలను తప్పులు దొర్లకుండా టీపోల్ యాప్లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ సూచించారు. శుక్రవారం ఆయన మేళ్లచెరువు, చింతలపాలెం మండల కేంద్రాల పాటు రామాపురం, దొండపాడు గ్రామాలలోని క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులు వేసే నామినేషన్ పత్రాల విషంయలో ఏమైనా సందేహలుంటే హెల్ప్ డెస్క్ల సిబ్బంది తీర్చాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు రాజేందర్రెడ్డి, సురేందర్రెడ్డి, ఎంపీడీఓలు అస్గర్అలీ, రామచంద్రరావు, మండల పంచాయతీ అధికారి, భూపాల్రెడ్డి, ఎస్ఐ పరమేష్, ఆర్ఓలు ఉన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
భానుపురి (సూర్యాపేట) : పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులతో గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే.నరసింహతో కలిసి రవినాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ 2, జోనల్ అధికారులకు శిక్షణ, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల వారీగా సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో రవినాయక్ మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు.. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ మొదటి విడత జరిగే 8 మండలాల్లో డిసెంబర్ 6 నుంచి 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రెండో విడత జరిగే 8 మండలాల్లో డిసెంబర్ 7 నుంచి 10 వరకు, మూడో విడత జరిగే 7 మండలాల్లో డిసెంబర్ 10, 12, 13, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఒకే గ్రామ రెండు ప్రాంతాల్లో పోలింగ్ జరిగితే పోలీస్ బందోబస్తు మధ్య ఒకే ప్రాంతానికి బ్యాలెట్ బాక్స్లను తరలించి ఓట్లు లెక్కింపు చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
సూర్యాపేట : బరిలో నిలిచిన అభ్యర్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకుడు రవినాయక్, ఎస్పీ నరసింహులు అన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సూర్యాపేట మండల పరిధిలోని సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఖర్చులు పెట్టాలని సూచించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. గుర్రంపోడు : కూరగాయల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కొత్తగా కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 350 ఎకరాల్లో సాగు పెంచనుంది. హెక్టార్కు గరిష్టంగా రూ.24 వేలు, ఎకరాకు రూ.9,600 రాయితీ అందించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎన్ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. కానీ, జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని అన్ని రకాల కూరగాయల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, పంజాబ్ నుంచి ఆలుగడ్డ, బెంగళూరు నుంచి క్యారెట్, బీట్రూట్ దిగుమతి చేసుకుంటున్నారు. కోతులతో సాగుకు వెనుకంజ చాలా ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వడం లేదని భయాందోళనతో రైతులు కూరగాయల సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోతులను నివారించేందుకు టపాసులు పేల్చడం, మంకీగన్స్ ఉపయోగించడం, పంట చుట్టూ జే వైర్ లాంటివి కట్టాలంటే.. అధిక శ్రమకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల ఆవరణలో సొరకాయ ఇతర కూరగాయ పంటలు సాగు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల వల్ల ఇంటి ఆవరణల్లో కూరగాయలు సాగు చేయడం లేదు. రాయితీ పొందడం ఇలా.. కూరగాయల పంటలను సాగు చేసుకునే రైతులు ముందుగా ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తారు. కూరగాయల నారును హైదరాబాద్లోని జీడిమెట్లలో గల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పెంచుతున్నారు. అక్కడి నుంచి నారు పొందితే రాయితీ డబ్బును.. నారు అందించిన కంపెనీకి చెల్లిస్తారు. కూరగాయల విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 250 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పందిరి సాగుతోపాటు ఇతర కూరగాయల సాగును ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉన్నవి పండించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. రాయితీలతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – కె.సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కొత్తగా 350 ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యం ఫ విత్తనాలు, నారు కొనుగోలుకు ఉద్యానశాఖ రాయితీ ఫ కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక -
రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి
కోదాడ: రిమాండ్ ఖైదీగా ఉన్న దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి, రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. రాజేష్ తల్లి రెండుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా నేటికీ కేసు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న చలో కోదాడ కార్యక్రమానికి వేలాదిమంది తరలిరావాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్మాదిగ, బీఆర్ఎస్ నాయకుడు ఎస్కె.నయీం, బీజేపీ నాయకుడు జనార్దన్రావు, సీపీఐఎంఎల్ నాయకుడు రవి, పిట్టల భాగ్యమ్మ, సోమశేఖర్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, దైద సత్యం, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, చీమ శ్రీనివాసరావు, కర్ల సుందర్బాబు, సత్యరాజు, కృష్ణ, భిక్షం, నాగరాజు పాల్గొన్నారు. ఫ రాజేష్ మృతిపై అఖిలపక్ష నాయకుల డిమాండ్ -
తప్పుల తడకగా జాబితా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది జాబితా సవరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంలో ఉన్న ఓటర్ జాబితాలోనే కొత్తగా నమోదైన ఓటర్లను జతచేసి.. అస్తవ్యస్తంగా జాబితా తయారు చేశారు. రెండు, మూడేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండడం చూస్తుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు పలుమార్లు అవకాశం కల్పించినా.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లాలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,54,050 మంది, పురుషులు 3,40,743 మంది. సవరణలకు అవకాశం ఇచ్చినా.. గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇందుకోసం జిల్లా అధికారులతో ఓటర్ల జాబితా రూపొందించింది. ఆ సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటర్ జాబితా ఆధారంగా ముసాయిదా జాబితా రూపొందించి.. అక్టోబర్ 1వ తేదీన తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,47,320 మంది, పురుషులు 3,35,542 మందిగా అధికారులు ప్రకటించారు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడగా.. 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్లో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను మరోసారి ప్రకటించింది. మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినా బీఎల్ఓలు ఎక్కడా ఇంటింటికి తిరిగిన పాపాన పోలేదు. గతంలో ఉన్న జాబితానే ముందు ఉంచి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించారు. దీంతో పల్లె ఓటర్ల సంఖ్య 6,94,815 మందికి చేరింది. అందరి ఓట్లు ఒకేచోట ఉండాలని సూచించినా.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కొక్కరివి ఒక్కో వార్డులో నమోదై ఉన్నాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగా ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ బీఎల్ఓలు తిరిగి కుటుంబంలోని ఓట్లన్నీ ఒకేవార్డులో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినా జిల్లాలో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో తూతూమంత్రంగానే బీఎల్ఓలు ఈ ప్రక్రియను చేపట్టారు. కుటుంబంలో మూడు ఓట్లు ఉంటే.. రెండు ఓట్లు ఓ వార్డులో, ఇంకో ఓటు మరో వార్డులో ఉన్నాయి. ● తుంగతుర్తి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొత్తగూడెం గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులు వేరువేరు వార్డుల్లో ఉన్నారు. కొత్తగూడెంలో గొల్లపల్లి లక్ష్మయ్య కుటుంబంలో ముగ్గురు ఓటర్లు ఉండగా.. తల్లి కొడుకుది మూడో వార్డులో ఓటు ఉంది. తండ్రి లక్ష్మయ్య ఓటు ఒకటో వార్డులో ఉంది. ఇలా అనేక తప్పిదాలతో అస్తవ్యస్తంగా జాబితా ఉంది. ● చిలుకూరు మండలంలోని జానకీనగర్ గ్రామంలో ఒక మహిళకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే మహిళకు ఇంటి పేరు, భర్త పేరు మార్చారు. అదే మహిళను గుర్తు పట్టకుండా ఒకటి కలర్ ఫొటో, మరొకటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగా మార్చారు. గ్రామానికి చెందిన 6వ వార్డులో 514, 518 నంబర్లలో ఒకే మహిళకు రెండు ఓట్లు వచ్చాయి. ● చిలుకూరులో గుండు పద్మ, గుండు రామయ్య వీరిద్దరికి సంబంధించి గుండు పద్మ ఫొటోనే ఉంది. చిలుకూరు మండలం నారాయణపురంలో కొంద ఉదయ్కిరణ్కు రెండు ఓట్లు వచ్చాయి. ఫ చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలోనే.. ఫ భర్తది ఓ వార్డు, భార్యది మరో వార్డులో ఓటు ఫ ఎన్నిమార్లు సవరణలకు అవకాశమిచ్చినా అంతే.. ఫ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు తిప్పలేఈ ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి పేరు గుద్దేటి మల్లారెడ్డి. ఇతడిది ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఏడాది క్రితమే మల్లారెడ్డి మృతి చెందాడు. కానీ పంచాయతీ ఎన్నికల తుది ఓటరు జాబితాలో గ్రామంలోని 8వ వార్డులో ఇతడి పేరు ఉంది. ఈ ఏడాది రెండుమూడుసార్లు ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చినా.. మల్లారెడ్డి పేరును తొలగించకపోవడం క్షేత్రస్థాయి అధికారుల పనితీరుకు నిదర్శనం. గ్రామపంచాయతీలు : 486వార్డులు : 4,332ఓటర్లు : 6,94,815మహిళలు : 3,54,050పురుషులు : 3,40,743 -
రెండోరోజు సర్పంచ్కు 203, వార్డులకు 605 నామినేషన్లు
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రెండో రోజు గురువారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 146 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచ్ పదవికి 105 వార్డు మెంబర్ పదవికి 110 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ కు 203, వార్డ్ మెంబర్ కు 605 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్ పదవికి హుజూర్నగర్లో 21, నేరేడుచర్లలో 15, మేళ్లచెరువులో 18, మఠంపల్లిలో 35, గరిడేపల్లి లో 53, పాలకవీడులో 36, చింతలపాలెం లో 25 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు హుజూర్నగర్లో 124, నేరేడుచర్ల లో 52, మేళ్లచెరువులో 46, మఠంపల్లిలో 59, గరిడేపల్లి లో 141, పాలకీడులో 96, చింతలపాలెం లో 87 చొప్పున నామినేషన్లు అధికారులకు అందాయి. శుక్రవారం చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ముమ్మరంగా వాహనాల తనిఖీమోతె : మోతె మండలంలో హైదరాబాద్–ఖమ్మం జాతీయ రహదారిపై సింగరేణిపల్లె టోల్గేట్ వద్ద గురువారం జిల్లా వ్యయ పరిశీలకుడు బి.హుస్సేన్ వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనాల్లో లెక్క చూపని డబ్బు మద్యం సరఫరా చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలు పకడ్బందీగా చేయాలని సూచించారు. సహాయ వ్యయ పరిశీలన టీంకు ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ కర్ణాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా బాలుర కబడ్డీ జట్టు ఎంపికకోదాడ: మహబూబ్నగర్లో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర 51వ జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొనే బాలుర జట్టును గురువారం కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎంపిక చేసినట్టు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఒక ప్రకటనలో తెలిపారు. కెప్టెన్గా బి.సైదులు, సభ్యులుగా బి.నరసింహ, కె.నరేందర్, బి.సాయి, యాకస్వామి, ఎస్కె.యాసీన్, వై.సాయిగౌతమ్, జావీద్, తేజేష్, భరత్చంద్ర, చంద్రహరి, ఇమ్రాన్, చందు, ధీరజ్, స్టాండ్బైలుగా గౌతమ్, కోటేష్ను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిమోతె : పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేగవంతం చేయాలని డీసీఓ ప్రవీణ్ అన్నారు. గురువారం మోతె మండల పరిధిలోని సిరికొండ, రాఘవాపురం, ఉర్లుగొండ గ్రామాల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 11,875 మంది రైతుల నుంచి 77,294 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 56,414 మెట్రిక్ టన్నులకు సంబంధించి 8,645 మంది రైతులకు రూ.134 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశామని అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయండి
అర్వపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు జాగ్రత్తగా జారీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం అర్వపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్టేజ్–1, 2 అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6 నుంచి 9 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి స్టేజ్–1 ఆర్ఓలు 37ఏ రిజిస్టర్లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, స్టేజ్–2 ఆర్ఓలు 37సీ రిజిస్టర్లో ఎన్నికల్లో విధులు నిర్వర్తించేవారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లను కౌంటింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మొదట శాసనసభకు.. తర్వాత సర్పంచ్
ఫ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సర్పంచ్గా ఎన్నికమోతె : ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, సర్పంచ్గా ఒకసారి ఎన్నికై నా.. కుటుంబ పోషణకు కులవృత్తిని నమ్ముకున్న ఆదర్శ నేత ఉప్పల మల్సూర్. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 20 ఏళ్ల వయసులోనే ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో సీడీపీ, సీపీఎం అభ్యర్థిగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 1972 వరకు ఏకధాటిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన సిరికొండలో కులవృత్తి అయిన చెప్పులు కుట్టే పనిచేస్తూ జీవనం సాగించారు. 1995లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపాదించారు. కానీ సీపీఎంపై ఉన్న అభిమానంతో ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తిపై 700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్గా పదవిలో ఉండగానే 1999లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. -
ప్రజా సేవకులే పాలకులు కావాలి
గుండాల : గ్రామాలలో స్థానిక సంస్థలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ఇంద్రసేన ప్రజా సేవకులే ప్రజా పాలకులు కావాలని కోరుతూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై.. ‘మన స్వతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు ప్రజలకు నచ్చిన పాలన జరుగ లేదు. గడిచిన కాలం గడిచింది .. వర్తమానాన్ని సరిదిద్దుకుందాం, అందుకు అనువైన సమయం జరగబోయే స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలలో అధికారం కోసం ఆరాట పడే వ్యక్తులు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ సభ్యుడి దాక ఎన్నికల సమయంలో అక్కరకు రాని ఖర్చు , ఓటుకు నోటు ఇవ్వడాలు ఆపి ఎన్నికల తరువాత ప్రజల ఆరోగ్యం, విద్య, రైతు కోసం, యువకుల కోసం ఖర్చు చేయాల్సిన విధానం అవలంభించాలి’. అని ఫ్లెక్సీపై పేర్కొన్నారు. -
అమ్మో.. పోస్టల్ బ్యాలెట్ !
ఫ ఓటు గోప్యత లేకపోవడంతో జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్టేజ్–2, ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చిన వారికి పెన్నుతో టిక్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామపంచాయతీ స్టేజ్–2 ఆఫీసర్కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్ బ్యాలెట్ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటు పడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవి కూడా కలపాలని వారు కోరుతున్నారు. బైండోవర్ అంటే .. తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా నేరస్థులు, రౌడీషీటర్లు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెడతారు. అందుకే ఎన్నికలు రాగానే పాత నేరస్థులను బైండోవర్ చేస్తుంటారు. పోలీసులు వారిని స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ ఎదుట హాజరు పర్చి జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరిస్తారు. ప్రత్యేక బాండ్ పేపర్పై వారి నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుంటారు. స్వంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. -
నామినేషన్ రుసుముగా రూపాయి నాణేలు
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుడిగె పుల్లమ్మ గ్రామస్తుల నుంచి సేకరించిన రూపాయి నాణేలతో రూ.1001 రుసుము చెల్లించి గురువారం నామినేషన్ వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి కొన్ని రోజులుగా స్థానికుల వద్ద రూపాయి నాణేలను సేకరించి భద్రపర్చుకొని నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తన కుమారుడు రమేష్ గ్రామస్తుల ద్వారా, వాట్సాప్ గ్రూప్ల సాయంతో డబ్బులు సేకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. -
ఆరోగ్యకరమైన నేలలే భవిష్యత్తుకు పునాది
గరిడేపల్లి : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేలలోని సారాన్ని కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 5న జరుపుకుంటారు. ఈ ఏడాది మృత్తిక దినోత్సవం థీమ్ని శ్రీఆరోగ్యకరమైన నేలలు–ఆరోగ్యకరమైన నగరాలకు పునాదిశ్రీగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆహార భద్రత, నీటి నాణ్యత, పర్యావరణ స్థిరత్వాన్ని మెరుగుపర్చడంలో నేలలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ థీమ్ తెలియజేస్తుంది. నగరాల్లో సైతం కాలుష్యాన్ని తగ్గించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నేలలు పట్టణ వ్యవసాయానికి దారి తీసి నగరాల్లో సైతం ఆహార లభ్యతను పెంచుతాయి. నేలల్లోని ఇతర జీవులు జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. నేల నాణ్యత మెరుగైతే నీరు భూమిలోకి సులభంగా ఇంకి కాలుష్యం తగ్గుతుంది. క్షీణిస్తున్న నేల నాణ్యత.. వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్న రసాయన ఎరువులు, అడ్డూ అదుపులేని నీటి వినియోగం, నేల క్రమక్షయం, సూక్ష్మపోషకాల కొరత వంటి సమస్యల వల్ల మట్టి నాణ్యత ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతమైన మట్టి పంటకు ఎక్కువ పోషకాలు అందిస్తుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని వల్ల రసాయనాల వాడకం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. రైతులు పాటించాల్సిన పద్ధతులు.. రైతులు పంటలు వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా అవసరం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా లోపించిన పోషకాలకు తగ్గట్టు ఎరువులు వినియోగించాలి. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం పెంచాలి. పశువుల ఎరువు, పచ్చి ఎరువు, కంపోస్టు ఎరువులు భూసార నాణ్యతను పెంచి, నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా డ్రిప్, స్పింక్లర్లు ఉపయోగిస్తే నీటి ఆదా జరగడమే కాకుండా నేల క్రమక్షయం నివారించబడుతుంది. అదేవిధంగా పంట మార్పిడి కూడా నేల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వరి, కంది, పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ వేయడం వల్ల నేలకు విశ్రాంతి లభించి, పోషక సమతుల్యత మెరుగుపడుతుంది. పంట అవశేషాలను కాల్చకూడదు. అవశేషాలను నేలలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి మట్టి, సూక్ష్మజీవులు రక్షించబడతాయి. మల్చింగ్ పద్ధతి ఉపయోగించడం మంచింది. నేలపై ఆకులు, గడ్డి వంటి పదార్థాలను కప్పడం వల్ల నేలలో తేమ నిల్వ ఉండి కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. నేల క్షీణిస్తే పంటలే కాదు మానవ జీవన వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని గుర్తుంచుకోవాలి. నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం -
ముగిసిన అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
హాలియా : నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్లో ఈ నెల 2న ప్రారంభమైన 51వ అంతర్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా.. నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు అనిల్, సత్యనారాయణ, చంద్రమౌళిగౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కారదర్శులు భూలోకరావు, కర్తయ్య, డీఎస్పీ శంకర్రెడ్డి, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్రెడ్డి, శ్లోక స్కూల్ గ్రూప్ డైరెక్టర్ కుకుడాల ఆంజనేయులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు యడవెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు -
ఏఐ వీడియోలతో ప్రచారం
యాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పద్ధతిలో ప్రచారాలు సాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విన్నూత్నంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) వీడియోలతో గ్రామంలోని సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఏఐ వీడియోల ద్వారా తమను గెలిపించాలని, గ్రామాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఏఐ వీడియోలను సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడం పట్ల గ్రామీణ ప్రజలు సోషల్ మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
ఓటేసిపోండి
అన్నా ఊరికి రండి..తిరుమలగిరి (తుంగతుర్తి) : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు ఫోన్లు చేయడమే కాకుండా ప్రసన్నం చేసుకోవడానికి పట్నం బాట పట్టారు. వారిని పోలింగ్ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరెవరు వలస వెళ్లారు.. ఎక్కడెక్కడ ఉంటున్నారు.. ఈనెల 11న సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గల 159 గ్రామాలు, 1,442 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మండలాల్లో గల 153 పంచాయతీలు, 1286 వార్డులు, నల్లగొండ జిల్లాలోని 14 మండలాల్లో గల 318 పంచాయతీలు, 2870 వార్డులకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లోని వారు ఉపాధి కోసం హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటరు లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరు వలస వెళ్లారు. ఎక్కడెక్కడ ఉంటున్నారు. వారి ఫోన్నంబర్లు తెలుకొని వారిని కలిసేందుకు వెళ్తున్నారు. మీరు వస్తారా? లేదా డబ్బులు పంపమంటారా అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చి ఓటేసి వెంటనే వెళ్లిపోతామని అందుకు అయ్యే ఖర్చులు భరించాలని కొందరు ఓటర్లు చెబుతున్నట్లు సమాచారం. వారే కీలకం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. హైదరాబాద్, భీమండి, నిజామాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఓటింగ్ రోజు తప్పకుండా గ్రామానికి వచ్చి, తమకు ఓటు వేయాలని మెసేజ్లు పంపించి వేడుకుంటున్నారు. పలు గ్రామాలకు చెందిన నాయకులు ఇప్పటికే పట్నం బయలుదేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేసి వారి మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు. ఫ వలస ఓటర్లకు గాలం వేస్తున్న అభ్యర్థులు ఫ ప్రతి ఓటు కీలకం కావడంతో ఫోన్లు చేసి నజరానాల ప్రకటన ఫ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పట్నం బాట ఓటర్లను ఆకర్షించేందుకు విందులు గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే విధంగా విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. పట్నంలో ఉండే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అక్కడికి వెళ్లి దావత్లు సైతం ఇస్తున్నారు. ఒక్కో ఏరియాకు ఇన్చార్జిలను నియమించి పోలింగ్ రోజు తీసుకొచ్చే బాధ్యతను కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్లు నడుస్తుండగా మరో రెండు రోజుల్లో విందులు మొదలు కానున్నాయి. -
పల్లెలకు సిద్ధమైన శ్రీనృసింహుడి రథం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రచార రథం పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని శ్రీస్వామి వారి ప్రచార రథాన్ని ఆలయ ఈఓ వెంకట్రావ్ బాగుచేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాలు, పట్టణాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవంతో పాటు ఆలయ విశిష్టతను ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని వినియోగించనున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ గురువారం వెల్లడించారు. ఈ నెల మూడవ, నాల్గవ వారంలో భూపాలపల్లి, నాగర్కర్నూల్ జిల్లాలో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలో జరిగే శ్రీస్వామి కల్యాణోత్సవానికి ఏఈఓ నవీన్, నాగర్కర్నూల్లో నిర్వహించే కల్యాణానికి ఏఈఓ రఘులను నోడల్ అధికారులుగా ఈఓ నియమించారు. దశల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వామివారి ప్రచార రథాన్ని పంపి, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
గ్లోబల్ సమ్మిట్కు సూర్యాపేట వాసి
● పేరిణి నృత్య కళాకారుడు రాజ్కుమార్ బృందానికి ఆహ్వానంసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముందు పేరిణి నాట్యం ద్వారా స్వాగతం పలికేందుకు సూర్యాపేటకు చెందిన డ్యాన్స్ మాస్టర్ పేరిణి రాజ్కుమార్కు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీల సీఈఓలు నెల 7వ తేదీన సాయంత్రం శిల్పారామానికి రానుండడంతో వారికి పేరిణి నాట్యంతో స్వాగతం పలకనున్నట్లు పేరిణి రాజ్కుమార్ తెలిపారు. 8న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి స్వాగతంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరంచౌటుప్పల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలో పంతంగి టోల్ప్లాజా వద్ద, తుప్రాన్పేట గ్రామ శివారులో పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచార వాహనం సీజ్యాదగిరిగుట్ట రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ శివారులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మల్లాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్య ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అందులో కర్రె లింగస్వామి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యంతోపాటు, వాహనాన్ని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. -
సర్పంచ్ బరిలో 471 మంది
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల తొలి విడత సమరానికి అభ్యర్థులు ఖరారయ్యారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుదిపోరులో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. సర్పంచ్ పదవులకు 471 మంది, వార్డులకు 2736 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవే కాకుండా 193 వార్డు స్థానాలకు ఒకటే నామినేషన్ ఉండడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని తుంగతుర్తి, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, తిరుమలగిరి, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులను అధికారులు కేటాయించారు. ఈ గుర్తులతోనే అభ్యర్థులు గురువారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. బరిలో నిలిచే జాబితా విడుదల..తొలివిడత ఎన్నికల కోసం నవంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా.. మూడురోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్లకు 1,387 నామినేషన్లు, వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి. ఇదేనెల 30న నామినేషన్లను పరిశీలించారు. డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి 2వ తేదీ నాటికి పరిష్కరించారు. బుధవారం విత్డ్రాలకు అవకాశం కల్పించడంతో పొత్తులు కుదరడంతో పాటు ఎన్నికల్లో గెలుపోటములు, పార్టీల మద్దతు.. ఇలా పలు సమీకరణలతో నామినేషన్లు వేసిన ఆశావహులు భారీగానే తమ నామనేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో అధికారులు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన జాబితాలను విడుదల చేశారు. ఆత్మకూర్ (ఎస్) నుంచే పోటీ ఎక్కువ..సర్పంచ్ పదవుల కోసం ఆత్మకూర్ (ఎస్) మండలం నుంచే అధిక పోటీ నెలకొంది. ఇక్కడ మొత్తం 30 గ్రామపంచాయతీలు ఉండగా 257 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయగా.. చివరకు 92 మంది అభ్యుర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తుంగతుర్తి మండలం నుంచి 222 మంది నామినేషన్లు వేయగా ఎన్నికల బరిలో 78 మంది ఉన్నారు. నాగారంలో 48 మంది, నూతనకల్లో 40 మంది, తిరుమలగిరిలో 29, జాజిరెడ్డిగూడెంలో 64 మంది, మద్దిరాాలలో 40మంది, సూర్యాపేటలో 80 మంది చొప్పున సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక వార్డు సభ్యుల బరిలోనూ ఆత్మకూర్ (ఎస్) నుంచే అత్యధికంగా 526 మంది ఉన్నారు. ఇక్కడ 274 వార్డులు ఉన్నాయి. అత్యల్పంగా సూర్యాపేట మండలం నుంచి 178 ఎన్నికల్లో పోటీ పడనున్నారు. ఊపందుకోనున్న ప్రచారం.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో తొలి విడత ఎన్నికలు జరిగే 159 గ్రామపంచాయతీల్లో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే ఆయా పార్టీల మద్దతు ఇవ్వగా, గుర్తులతో కూడిన పత్రాలను ముద్రించి ఇంటింటికీ తిరగనున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు సైతం ఇప్పటికే ఫోన్ల ద్వారా అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.గ్రామ పంచాయతీలు 158 ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ఏడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం వార్డులకు 2,736 మంది, మరో 193 వార్డులు ఏకగ్రీవం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు.. ఇక ప్రచారమే.. 11న ఎన్నికల పోలింగ్బరిలో మిగిలింది వీరే వార్డు స్థానాలు 1,442 07 ఏకగ్రీవం 152 ఎన్నికలు జరిగేవి 1387 నామినేషన్లు 916 విత్డ్రా 471 పోటీలో ఉన్నది 193 1,249 3,79110552,736 -
మఠంపల్లి చర్చిలో దివ్యబలి పూజ
మఠంపల్లి: మఠంపల్లి పట్టణంలోని శౌరీనగర్లోగల శౌరి చర్చి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం దివ్యబలిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ రాజిరెడ్డి క్రైస్తవులకు ఉపదేశం చేశారు. ఏసుక్రీస్తు బోధనలు లోకవ్యాప్తంగా ప్రచారం చేసిన శౌరి పునీతుడయ్యాడన్నారు. అనంతరం సత్ప్రసాదం పంపిణీచేశారు. క్రైస్తవ గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పలువురు గురువులు, చర్చికమిటీ పెద్దలు, క్రైస్తవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థుల ఆరోగ్యంపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధవహించాలని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత సూచించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సైనింగ్ భాష మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు. డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 170 సమస్యాత్మక గ్రామాల గుర్తింపునేరేడుచర్ల : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎస్బీ సీఐ రామారావు, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, తహసీల్దార్ సైదులు, ఎస్ఐ రవీందర్నాయక్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవభానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పోలీస్ అధికారులు దివ్యాంగుల సమస్యల పరిష్కరిస్తారని ప్రత్యేక చొరవ చూపుతారని ఏఎస్పీ రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహరావు అధ్యక్షతన జిల్లాస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు నిమిత్తం వచ్చే దివ్యాంగుల స్కూటీలను అనుమతిస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు వచ్చే అన్నిరకాల పథకాలను అందిస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల జిల్లాకేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, అధికారులు నాగప్రసాద్, బెనర్జీ పాల్గొన్నారు. -
ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్యం తీసుకొస్తాం
సూర్యాపేట: రాష్ట్రంలో ప్రజలు కోరుకునే ప్రజాస్వామ్య పరిపాలనను తీసుకొస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, బీసీ వర్గాల అభివృద్ధికి పార్టీ తీసుకోబోయే కార్యాచరణను ప్రకటించారు. అనేక మంది మేధావుల ఆలోచన నుంచి పుట్టిన ఈ పార్టీ అగ్రకులాలకు వ్యతిరేకంగా స్థాపించామన్నారు. 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తే తెల్లారే వారు ఇవ్వరని చెప్పానని, ప్రస్తుతం అదే జరిగిందన్నారు. 2028లో రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోష్యం చెప్పారు. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న -
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
నేరేడుచర్ల : పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సూచించారు. బుధవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, దిర్శించర్ల గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనలను తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురిగి సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్రెడ్డి, ఎంపీఓ నాగరాజు, ఎస్ఐ రవీందర్నాయక్ ఉన్నారు. తప్పిదాలకు తావివ్వొద్దుపెన్పహాడ్: నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో తప్పిదాలకు తావివ్వొద్దని అధికారులు పనిచేయాలని ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సూచించారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్లో నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా ఉండాలన్నారు. తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, ఎస్ఐ గోపికృష్ణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
హుజూర్నగర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం హుజూర్నగర్ మండలం మర్రిగూడేనికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తోట భిక్షం, వార్డు మాజీ సభ్యుడు తోట కోటేశ్వరరావు, చిల్ల అశోక్, శ్రీనివాసరావు, గోవిందరాజు, ప్రవీణ్ రాంప్రసాద్ లతో పాటు దాదాపు 50 కుటుంబాలకు చెందిన వారు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని అన్నారు. అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యరగానీ నాగన్న గౌడ్, దొంగరి వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్ దేష్ముఖ్, గూడెపు శ్రీనివాస్, అజ్మతుల్లా, రబ్బాని, మౌలానా, ఆదినారాయణ, జాన్ మియా పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రలోభాలకు గురిచేయవద్దు
భానుపురి (సూర్యాపేట) : అభ్యర్థులను నామినేషన్ ఉపసంహరణలో ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మొదటి విడత కింద నిర్వహించనున్న 8 మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి బుధవారంతో ఉపసంహరణ పూర్తి అయ్యిందన్నారు. సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సపోర్టింగ్ స్టాఫ్కు, ఎన్నికల్లో ఉపయోగించే వాహన డ్రైవర్లకు ఫారం 14 ద్వారా పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని సూచించారు. వారి ఓటు ఉన్న సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పారదర్శకంగా నిర్వహించాలిపోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. ప్రతిరోజు ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్కు పోలీస్ బందోబస్త్తో తీసుకెళ్లాలని, అక్కడ గ్రామపంచాయతీల వారీగా బ్యాలెట్ బాక్స్లను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలన్నారు. తిరిగి సాయంత్రం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్కు పోలీస్ ఎస్కార్ట్తో తరలించి భద్రపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీకె.నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీనివాస్, డీఎల్పీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మూడో విడతలో జోరు
భానుపురి (సూర్యాపేట) : జిల్లా పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన మూడోదశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 146 గ్రామ పంచాయతీలు, 1,318 వార్డులకు సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం ఉదయం 10గంటల నుంచి 38 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఆశావహుల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టారు. తొలిరోజు సర్పంచ్ పదవికి 105, వార్డు సభ్యుల పదవికి 110 నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 5వ తేదీ వరకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. 9వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి.. గుర్తుల కేటాయిస్తారు. తొలిరోజు 215 నామినేషన్లు దాఖలుసూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు, 4,388 వార్డులకు గాను మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ తొలిరోజు నుంచే భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొదటి విడత తొలిరోజు 245 నామినేషన్లు రాగా.. రెండోవిడతలో కేవలం 105 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మూడో విడతలో మాత్రం పెరిగి 215 నామినేషన్లను ఆశావహులు అధికారులకు సమర్పించారు. ఇందులో అత్యధికంగా సర్పంచ్ కోసం గరిడేపల్లి మండలంలో 26 నామినేషన్లు వచ్చాయి. ఆ తర్వాత మఠంపల్లి మండలంలో 24, పాలకవీడులో 14 నామినేషన్లను వేశారు. ఇక అత్యల్పంగా మేళ్లచెర్వులో 7 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వార్డు సభ్యుల ఎన్నికకు అత్యధికంగా మఠంపల్లిలో 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా చింతలపాలెంలో రెండు మాత్రమే వచ్చాయి. రెండోవిడతలో 5,825 నామినేషన్లునవంబర్30వ తేదీ నుంచి రెండోవిడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ విడతకు మంగళవారం చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. కొన్నిచోట్ల రాత్రి 11.30 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ విడతలో మొత్తం 5,825 నామినేషన్లను ఆశావహులు సమర్పించారు. ఇందులో సర్పంచ్కు 1447, వార్డు సభ్యుల కోసం 4,378 నామినేషన్లు ఉన్నాయి. ఈ విడతలో 181 గ్రామ పంచాయతీలు, 1628 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 146 గ్రామపంచాయతీలు, 1318 వార్డుల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు 215 నామినేషన్లు దాఖలు ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం 9న తుది జాబితా, 17న పోలింగ్తొలిరోజు ఇలా.. మండలం జీపీలు సర్పంచ్ వార్డులు వార్డు నామినేషన్లు నామినేషన్లుహుజూర్నగర్ 11 09 110 06 నేరేడుచర్ల 19 12 163 11 పాలకవీడు 22 14 186 10 గరిడేపల్లి 33 26 300 28 మఠంపల్లి 29 24 254 36 మేళ్లచెర్వు 16 07 152 17 చింతలపాలెం 16 13 148 02 మొత్తం 146 105 1318 110 -
ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగేలా చూడాలి
పెన్పహాడ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచేలా ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ కోరారు. మంగళవారం పెన్పహాడ్మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణుల పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల టీకాల కార్యక్రమాన్ని 100శాతం సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రజలకు టెలిమెడిసిన్ సేవలను చేరవేయడంలో ఆశాకార్యకర్తలు, ఎల్హెచ్పీలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంఓ ఆనంద్, సీహెచ్ఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సూచించారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.చంద్ర శేఖర్, ఎంపీడీఓ సీహెచ్. సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలనపెన్పహాడ్ : పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అనంతారంలోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సీతారామారావు మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా దాఖలైన నామినేషన్లు, జారీ చేసిన నామినేషన్ పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, తహసీల్దార్ లాలు, ఎంపీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు -
మూడో విడతకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, హుజూర్నగర్, మఠంపల్లి మండలాల్లోని 146 గ్రామపంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్న 146 పంచాయతీల సర్పంచ్లు, 1,318 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల దాఖలు నుంచి పరిశీలన వరకు పనులు చకాచకా సాగిపోతున్నాయి. ఇక మూడో విడత ప్రారంభంతో జిల్లా అంతటా ఎన్నికల సందడి నెలకొంది. చివరి దశ పోలింగ్ ఈనెల 17వ తేదీన జరగనుంది. 2,10,219 మంది ఓటర్లుమూడో విడత ఎన్నికల్లో 2,10,219 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 146 గ్రామపంచాయతీలకు గాను 1,333 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 38 క్లస్టర్లను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రికే సామగ్రితో పాటు అధికారులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. వారం రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ రావడం, మొదటి, రెండోదశల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో మూడోవిడతలో ఆశావాహులు భారీగా నామినేషన్ల దాఖలుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పోటీలో ఉండే అభ్యర్థులు సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు. రెండో విడత చివరిరోజు భారీగా ర్యాలీలతో..రెండో విడత ఎన్నికల్లో చివరి రోజు కొన్ని చోట్ల అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండోవిడత ఎన్నికలు జరిగే చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లోని 181 పంచాయతీ సర్పంచ్లు, 1,628 వార్డు సభ్యుల ఎన్నిక కోసం చివరిరోజు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ 67, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు భారీగా సర్పంచ్లకు 479, వార్డులకు 993 చొప్పున నామినేషన్లను ఆశావహులు సమర్పించారు. ఈ విడత నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి క్యూలైన్లలో ఉన్న అందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి స్వయంగా పరిశీలించారు.మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి రెండో విడతకు రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణమండలం పంచాయతీలు వార్డులు క్లస్టర్లుచింతలపాలెం 16 148 04 గరిడేపల్లి 33 300 08 హుజూర్నగర్ 11 110 04 మఠంపల్లి 29 254 05 మేళ్లచెర్వు 16 152 05 నేరేడుచర్ల 19 168 06 పాలకవీడు 22 186 06మొత్తం 146 1,318 38 -
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఖర్చుల లెక్క చెప్పాల్సిందే
భానుపురి (సూర్యాపేట), నాగారం : పంచాయతీ బరిలో నిల్చిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల లెక్కలు విధిగా చెప్పాల్సిందే. లేకుంటే అనర్హత వేటు పడనుంది. పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టువేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించింది. ఎన్నికల ప్రచారానికి పెట్టే ప్రతీ పైసాకు కచ్చితంగా లెక్కలు సమర్పించాలని సూచించింది. ఈసీ ఇచ్చిన పుస్తకాల్లో అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ వివరాలు వెల్లడించడంలో నిర్లక్ష్యం వహించినా.. పరిమితికి మించి ఖర్చు చేసినా వేటు వేయనుంది. 2019 ఎన్నికల సందర్భంగా సకాలంలో లెక్కలు తెలపని జిల్లాలోని 240 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. వీరిలో గెలుపొందిన వార్డుమెంబర్లతో పాటు ఓడిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. ఈసీ నిర్ణయించిన ధరల ప్రకారమే..గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుకు పోటీ చేసే అభ్యర్థుల తరఫున రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును కూడా వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఖర్చుపై ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు.. వీడియోలు, ఫొటోల ద్వారా లెక్కిస్తారు. ప్రచార సామగ్రికి ఎన్నికల సంఘం ముందుగానే ధరలు నిర్ణయించగా.. దాని ప్రకారమే అభ్యర్థుల ఖర్చులు చూపాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు రెండు రోజుల ముందే ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి దాని ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో వార్డు సభ్యులు రూ.30 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉంటే వార్డు సభ్యులు రూ.50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు వెచ్చించే అవకాశం ఉంది. వివరాల నమోదు..అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రచార ఖర్చును ఏ రూపంలో నిల్వ చేసుకున్నారో వివరాలను పొందుపరుస్తూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలి. రిటర్నింగ్ అధికారి అందించిన పుస్తకాల్లో ప్రచార ఖర్చుల వివరాలను నమోదు చేయాలి. మూడు విడతలుగా తనిఖీలు..అభ్యర్థుల ప్రచార ఖర్చుల లెక్కలను అధికారులు పరిశీలిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు దఫాలుగా తనిఖీలు చేస్తారు.45 రోజుల్లో తెలియజేయకుంటే.. నామినేషన్ సమర్పణ నుంచి పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు విడతల్లో అధికారులు తనిఖీ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లోగా వ్యయం వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత వార్డు, సర్పంచ్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది. అయితే గెలిచిన అభ్యర్థులు అయితే తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. వార్డు మెంబర్గా గెలిచి ఉపసర్పంచ్గా బాధ్యతలు చేపట్టినా.. వివరాలు సమర్పించకుంటే అనర్హత వేటు ప్రకారం ఈ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా చాలామంది పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని పట్టించుకోరు. అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే కొద్ది సమయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున నిర్లక్ష్యం వహిస్తే రానున్న మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీకి అర్హులు కాకుండా పోతారు. అందువల్ల పోటీ చేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చులను తెలియజేయడంతో పాటు పరిమితికి లోపు ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచిస్తున్నారు. నామినేషన్ల దాఖలు నుంచే పరిగణనలోకి.. జనాభా ప్రాతిపదికన ఖర్చుల పరిమితి మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు.. 2019 ఎన్నికల్లో లెక్కలు సమర్పించని 240 మందిపై అనర్హత వేటు అభ్యర్థులు అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవంటున్న అధికారులు -
విద్యార్థుల సమగ్ర ప్రగతి నివేదిక
సమగ్ర అభివృద్ధిపై.. పాఠశాలల్లో ఇచ్చే హెచ్పీసీ కార్డు విద్యార్థి సమగ్రఅభివృద్ధిని అన్నికోణాల్లో అంచనా వేస్తుంది. వారి వ్యక్తి గత వివరాలతో పాటు, శారీరక, మానసిక సామర్థ్యాలు, అవగాహన, సున్నితత్వం, పాఠశాలల్లో నిర్వహించే కృత్యాల్లో విద్యార్థి ప్రతిభ, ప్రశ్నలపై సమయస్ఫూర్తి, వాటి వివరణ తదితర వాటిని నిక్షేపించనున్నారు. ఈ విధానంతో జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్, కేంద్రీయ, నవోదయ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగనుంది. తమ పిల్లలకు సంబంధించిన అకడమిక్ అంశాలను తల్లిదండ్రులు నేరుగా చిన్నప్పటి నుంచి అతని ప్రతిభను చూడటానికి అవకాశం ఉంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు త్వరలోనే అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.నాగారం : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న ప్రోగ్రెస్ కార్డు విధానం మారనుంది. కేవలం మార్కులకే పరిమితమైన ఈ ప్రగతి పత్రం.. ఇక నుంచి అన్నిరకాల అంశాలతో మిళితమై ఉండనుంది. ఇదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు (హెచ్పీసీ). జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ) 2020లో ప్రతిపాదించిన విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల మూల్యాంకన విధానంలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇందుకు ‘పరాఖ్’ (పర్ఫామెన్స్ అసెస్మెంట్ రివ్యూ, అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న సమ్మెటీవ్, విద్యార్థుల బట్టీ విధానానికి స్వస్తి పలకనుంది. విద్యార్థుల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచనలు, భావనాత్మక స్పష్టత వంటి ఉన్నతస్థాయి విద్యా నైపుణ్యాలను పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 981 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్స్కూల్స్లలో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉండనుంది. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా రూపకల్పన త్వరలో అమలుచేసేలా ప్రణాళిక 981 పాఠశాలల్లో 45,841 మందికి ప్రయోజనం -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చిలుకూరు: ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలులో నామినేషన్ క్లస్టర్ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ నరసింహారావు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. పొరపాట్లకు తావివ్వొద్దుఅనంతగిరి: నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం అనంతగిరిలో నామినేషన్ క్లస్టర్ కేంద్రంతో పాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. నామినేషన్లను స్వీకరించిన తరువాత డేటాలో ఎటువంటి తప్పులు లేకుండా టీపోల్ యాప్లో పొందుపర్చాలన్నారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ కె. హిమబిందు, ఎంపీడీఓ హరిసింగ్, ఎంపీఓ సుష్మా, సినియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఆర్ఐ వెంకట నగేష్ ఉన్నారు. టీపోల్ యాప్లో వివరాలు నమోదు చేయాలిమునగాల: రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్వీకరించిన నామినేషన్ల వివరాలను టీపోల్ యాప్లో సంక్షిప్తంగా నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి మునగాల మండలంలోని ఆకుపాముల క్లస్టర్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.శీరిష, ఎంపీఓ నరేష్, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ -
పంచాయతీ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
హుజూర్నగర్ : హుజూర్నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంతి నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా హుజూర్నగర్ చేరుకున్న మంత్రి స్థానిక క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపుపై వారికి పలు సూచనలు, సలహాలు అందించారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి చిలుకూరు: నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ సూచించారు. బుధవారం చిలుకూరు మండలం బేతవోలు, చిలుకూరు గ్రామాల్లో నామినేషన్ క్లస్టర్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు హెల్ప్ డెస్క్పై అవగాహన కల్పించి నామినేషన్ పత్రాల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు పూరించడంలో సహకారం అందించాలన్నారు. నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఆయన కోరారు. ప్రజలు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు షరీఫుద్దీన్, సత్యనారాయణ, ఆర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని ఎన్నుకోవాలిహుజూర్నగర్ : ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు. మంగళవారం హుజూర్ నగర్లోని అమరవీరుల భవన్లో నిర్వహించిన సీపీఎం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో సేవ చేసేవారిని, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ముందుకు పోతున్నామన్నారు. జిల్లాలో మొదటి, రెండో విడతలో అనేక గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ , వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీతో, మరి కొన్నిచోట్ల ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. సమావేశంలో ఎన్. పాండు, పల్లె వెంకటరెడ్డి, పాండ నాయక్, దుగ్గి బ్రహ్మం, హుస్సేన్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, బోనోఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వివరించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్ల పదవి కాలానికి గాను నూతన అధ్యక్షుడిగా బి.రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా దండా శ్యాంసుందర్రెడ్డిలు ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా ఎస్ఏ హమీద్ఖాన్, సహ అధ్యక్షుడిగా కె.రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.విద్యాసాగర్రావు, బి. కృష్ణయ్య, ఆర్. నిర్మల, కార్యదర్శులుగా ఎస్. నర్సయ్య, ఎం.దేవదానం, జాయింట్ సెక్రటరీలుగా ఎం. పద్మారెడ్డి, బి.సుందరయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్. వెంకటేశ్వర్ రావు, జి.నర్సయ్య, టి.శోభా రాణి, ప్రచార కార్యదర్శిగా గాలి శ్రీనివాస్, స్టేట్ కౌన్సిలర్లుగా పి. జగన్మోహనరావు, టి.యాదగిరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతా రామయ్య రాగా, ఎన్నికల అధికారిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎం. సుబ్బయ్య, పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి పి.శరత్ బాబు, ఖమ్మం కార్యదర్శి టి. వేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కారణాలు చెప్పకుండా తిరస్కరించారని..
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలన సమయంలో ఎలాంటి కారణాలు చెప్పకుండా తిరస్కరించడంపై ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్, తుమ్మలపెన్పహాడ్ గ్రామాల్లో క్లస్టర్ల వద్ద బాధితులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియడంతో ఆదివారం నామినేషన్లను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అర్ధరాత్రి దాకా పరిశీలించి కొందరి నామినేషన్లలో తప్పులు ఉన్నాయని రిజెక్ట్ చేశారు. సోమవారం రిజెక్ట్ అయిన నామినేషన్ పత్రాలను ఆర్డీఓకు అప్పీలు చేసుకోవాలని చెప్పారు. అయితే తిరస్కరణకు గురికావడానికి గల కారణాలను చెప్పకపోవడంతో ఆర్డీఓకు ఎలా అప్పీల్ చేసుకోవాలని బాధితులు ఆందోళన చేశారు. అధికారులు.. అభ్యర్థులకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు కొనసాగాయి. తర్వాత క్లస్టర్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ హసీం, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అక్కడికి చేరుకొని నామినేషన్లలో జరిగిన తప్పులను రిటర్నింగ్ అధికారి చదివి వినిపించారు. దాంతో ఆందోళన విరమించి ఆర్డీఓ అప్పీల్కు వెళ్లారు. అదేవిధంగా తుమ్మల పెన్పహాడ్ క్లస్టర్లో ఆదివారం రాత్రి వరకు సాగిన నామినేషన్ల పరిశీలనలో కోటపాడుకు చెందిన రెండు వార్డుల నామినేషన్ పత్రాలలో తప్పులు ఉన్నాయని రిజెక్ట్ చేస్తున్నట్లుఅధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం తప్పులు ఉన్న నామినేషన్ పత్రాలను అధికారులు గ్రీన్ ఇంకుతో సరిచేసి తప్పులను చూపించిన పత్రాలపై కొట్టివేతలు ఉండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. రిజెక్ట్ అయిన నామినేషన్ పత్రాలను కొందరు నాయకుల ప్రమేయంతో అధికారులు సరిచేయడం మరికొందరివి రిజెక్ట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రిజెక్ట్ అయిన నామినేషన్ వివరాలను అభ్యర్థులకు అందజేసి ఆర్డీఓ కు అప్పీల్ చేసుకోవాలని సూచించారు. దాంతో ఆందోళ వివరించారు. ఫ నామినేషన్ క్లస్టర్ల వద్ద బాధితుల ఆందోళన -
ఆత్మవిశ్వాసం పెంచేలా చెలిమి
నాగారం : నేటి డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు అతి సున్నిత మనస్కులుగా తయారవుతున్నారు. చిన్న, చిన్న సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకొంటూ తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. దీనికి కారణం అతి గారాబం, సామాజిక మాధ్యమాల ప్రభావం. విద్యాపరమైన ఒత్తిళ్లేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆదిలోనే గుర్తించి, సరైన అవగాహన కల్పిస్తే మార్పు వస్తుందని కేంద్ర విద్యా శాఖ గుర్తించింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం బడుల్లోని విద్యార్థుల్లో భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు చెలిమి (సోషియో ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు మేలు కలుగుతుంది. పాఠశాలకో ఉపాధ్యాయుడి ఎంపిక ప్రతి పీఎంశ్రీ పాఠశాలకు ఒక నోడల్ ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. వీరికి మనస్తత్వం, ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడ నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులకు నేర్పించాలి. అంతా కలిసి విద్యార్థుల్లో భావోద్వేగాల (కోపం, భయం, బాధ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. సమస్యలను అర్థం చేసుకుని సున్నితంగా పరిష్కరించాలి. పిల్ల లకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా వారికి ధైర్యాన్నిస్తారు. కలిగే ప్రయోజనాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మానసిక పరివర్తనే కీలకం. ఇది లోపిస్తే భవిష్యత్తు మొత్తం అంధకారమవుతుంది. నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలతో అప్రమత్తమై కేంద్ర విద్యా శాఖ చేపడుతున్న చెలిమి కార్యక్రమం బాలలకు ఎంతో మేలు చేయనుంది. కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో వినమ్రతతో, గౌరవంగా మసలుకునేలా బాలలను తీర్చిదిద్దనున్నారు. విడతల వారీగా... జిల్లాలో పీఎంశ్రీ పథకానికి 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. నోడల్ ఉపాధ్యాయులకు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో 4 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 4వ విడతతో ఎంపికై న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 15 నుంచి 17 తేదీల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మానసిక పరివర్తనే కీలకం. దీనిని అధిగమించేందుకు విద్యా శాఖ చేపడుతున్న చెలిమి కార్యక్రమం బాలలకు ఎంతో మేలు చేయనుంది. జిల్లాకు చెందిన పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 15 నుంచి 17 వరకు శిక్షణ ఇస్తారు. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఫ పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణకు నూతన కార్యక్రమం ఫ పీఎంశ్రీ స్కూళ్లలో అమలుకు కేంద్రం శ్రీకారం ఫ జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం చివ్వెంలతోపాటు మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు. అనంతరం ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని, గ్రామంలో ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉండాలని, పోలీస్, ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. సమస్యలు సృష్టిస్తున్న వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైండోవర్ను అతిక్రమిస్తే వారి పూచీకత్తు నగదును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు.. ప్రజల మనసును చూరగొనాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫేస్–2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేసి మాట్లాడారు. అభ్యర్థి రోజూ వారి ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేయడం, వివరాలు ఇవ్వడంలో విఫలమైతే వారికి నోటీసులు జారీ చేసే అధికారం, మండల కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ను పోలింగ్ కేంద్రానికి, పీఓకు అందించడంలో ఆర్ఓల పాత్ర కీలక అని అన్నారు. గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఇతర ఏర్పాట్లు పరిశీలించాలని, ఓటర్లకు బీఎల్ఓ ద్వారా ఫొటో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్కు పంపించడం, సామగ్రి సరఫరా, పోలింగ్ను సమర్థంగా పర్యవేక్షించడం, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని, పోలింగ్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించాలన్నారు. కౌంటింగ్ ప్రదేశం, పోలీస్ సిబ్బంది, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఫలితాలు ప్రకటించడం, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాల పంపిణీ, వ్యయాన్ని పర్యవేక్షించటం, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ తదితర విధులు రిటర్నింగ్ ఆఫీసర్లు సమర్థంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్, ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలపై నిఘా
ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా కీలకం. ఒక పండుగలా జరగాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు పోలీసు శాఖ ప్రణాళికతో పని చేస్తోంది. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవడానికి పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తారు. – ఎస్పీ నరసింహసూర్యాపేటటౌన్ : పంచాయతీ ఎన్నికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలు, గొడవలు సృష్టించే వారిపై దృష్టిసారించారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ బహుమతులు, మధ్యం, డబ్బు, వస్తువులు పంచకుండా నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు. 170 సమస్యాత్మక గ్రామాలు జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలు, 4388 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఇందులో మొదటి విడత 159 గ్రామాల్లో ఎన్నికల జరగనుండగా 47 సమస్యాత్మక గ్రామాలు, రెండవ విడతలో181 గ్రామాలకు గాను 65 సమస్యాత్మక గ్రామాలు, మూడవ విడతలో 146 గ్రామాలకు ఎన్నికలు ఉండగా 58 సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారు. బైండోవర్ నిబంధనలను వివరిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడబోమని ముందస్తుగా పూచీకత్తుతో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు బైండోవర్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 24గంటల పాటు తనిఖీలు జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా, ప్రజలను ప్రలోభాలకు గురు చేయకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కోదాడ రూరల్ పరిధిలోని 65వ నంబర్ హైవేలో రామపురం వద్ద చెక్పోస్టు, చింతలపాలెం పరిధిలోని దొండపాడు, మఠంపల్లి పరిధి మట్టపల్లి బ్రిడ్జి, తిరుమలగిరి పరిధి పాత తిరుమలగిరి, మద్దిరాల పరిధి కుంటపల్లి, మోతె పరిది మామిల్లగూడెం వద్ద, సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు చేయనున్నారు. 23 మండలాల్లో.. జిల్లాలో 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరిలో రూట్ మొబైల్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, వంద మీటర్ల పరిధిలో సిబ్బంది పోలింగ్ బూత్ల వద్ద సిబ్బంది, ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండి ఎన్నికల నిర్వహణను సజావుగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. విడత రూట్ మొబైల్స్ మొదటి 58 రెండవ 47 మూడవ 45ఫ అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో 7 చెక్ పోస్టులు ఫ 170 సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి స్పెషల్ సెక్యూరిటీ టీములు(ఎస్ఎస్టీ) 04 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) 23 ఫ్లైయింగ్ సర్వేలెన్స్ టీములు(ఎఫ్ఎస్టీ) 23 పోలీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 18 -
జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక
కోదాడ: నల్లగొండ జిల్లా హలియాలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే 51వ జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్టును ఆదివారం కోదాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామా నరసింహారావు తెలిపారు. జట్టు కెప్టెన్ జి. శ్రీజా, బి లహరి, ఎం. వైష్ణవి, ఎ. దివ్య, ఆర్. దీప్తి, బి.అక్షర, సీహెచ్. అమూల్య, ఎం. సాహిత, టి. హర్షిత, కె. కళ్యాణి, పి. నందిని, అక్షయ, ఎం. శివాణి, ఎన్. శ్రీలేఖ, గంగోత్రిలను ఎంపిక చేసినట్లు వివరించారు. వీరికి కోచ్గా టి. రమేష్బాబు వ్యవహరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో శెట్టి రామచందర్రావు, మాతంగి సైదులు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలిచివ్వెంల(సూర్యాపేట) : హెచ్ఐవీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్నిబంధనలు పాటించాలి మునగాల: ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ సూచించారు. సోమవారం ఆయన మునగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. స్వీకరించిన నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ ఫోన్లో ఎంట్రీ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంటన ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, తహసీల్దార్ వి.సరిత, ఆర్ఐ ఎన్.రామారావు, ఎంపీఓ నరేష్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 3న నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 కార్యదర్శి కుంభం నర్సిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ : 8096745465 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
రెండో విడతకు సై..
భానుపురి (సూర్యాపేట) : రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని కోదాడ రెవెన్యూ డివిజన్లోని కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాలతో పాటు సూర్యాపేట రెవెన్యూ డివిజన్లోని పెన్పహాడ్, చివ్వెంల, మోతె మండలాలకు ఆదివారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వెంటనే ఆయా మండలాల్లోని 181 గ్రామ పంచాయతీల్లోని 181 సర్పంచ్, 1,628 వార్డు స్థానాల ఎన్నికలకు సంబంధించి 49 క్లస్టర్ సెంటర్లలో ఆశావహుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తొలి విడత మాదిరిగానే.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత 8 మండలాలు, రెండో విడత 8 మండలాలు, మరో 7 మండలాలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ నామినేషన్లు మందకొడిగా వస్తున్నాయి. తొలిరోజు కేవలం 105 రాగా, ఇందులో సర్పంచ్కు 67, వార్డు స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలుకూరు, పెన్పహాడ్ మండలాల్లో అసలు వార్డు సభ్యుల నామినేషన్లు ఖాతా కూడా తెరవలేదు. అత్యధికంగా సర్పంచ్కు చివ్వెంల మండలంలో 15, పెన్పహాడ్ మండలంలో 13 దాఖలయ్యాయి. వార్డు మెంబర్లలో అత్యధికంగా అనంతగిరి నుంచి 12, మునగాల మండలంలో 11 నామినేషన్లు వేశారు. బేరీజు వేసుకుంటూ.. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో ఎనిమిది మండలాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం పోటీ చేసే ఆశావహులు వివిధ పార్టీలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోసం తపనపడుతున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసే ఏర్పాట్లలో ఉన్నారు. ఇక వార్డు సభ్యుల ఎన్నిక ఇప్పటికే పార్టీలకు అతీతంగా కొన్నిచోట్ల, పార్టీల వారీగా పొత్తులు కుదుర్చుకుని అభ్యర్థిగా ఎవరైతే గెలుస్తామనే బేరీజు వేసుకుని ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి రోజు నామినేషన్కు కావాల్సిన పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజే అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ విడతలో నామినేషన్ల స్వీకరణకు మంగళవారం వరకు గడువు ఉండగా 14వ తేదీన పోలింగ్ జరగనుంది. మండలం జీపీలు సర్పంచ్ వార్డులు వార్డులకు నామినేషన్లు నామినేషన్లు చిలుకూరు 17 04 158 00 కోదాడ 16 06 158 08 అనంతగిరి 20 07 178 12 మునగాల 22 10 210 11 నడిగూడెం 16 03 148 02 మోతె 29 09 262 01 చివ్వెంల 32 15 258 04 పెన్పహాడ్ 29 13 256 00 మొత్తం 181 67 1,628 38 ఫ 181 గ్రామ పంచాయతీల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఫ తొలి రోజు 105 నామినేషన్లు దాఖలు ఫ రేపటి వరకు గడువు -
ఎన్నికలకు ఐదంచెల భద్రత : ఎస్పీ
మునగాల : ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఐదంచెల పోలీస్ భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. ఆదివారం ఆయన మునగాల మండలం రేపాల క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100మీటర్ల పరిధి ఆంక్షలు అమలు చేయాలని, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలకు పంపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఘర్షణలకు తావివ్వొద్దన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడడ, ఎస్ఐ బి.ప్రవీణ్కుమార్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
అడ్డదారిన బోనస్ నొక్కేస్తున్నారు!
తిరుమలగిరి (తుంగతుర్తి) : సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే క్వింటాకు రూ.500 బోనస్ కాజేసేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారిలో వ్యాపారం సాగిస్తున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు సన్న ధాన్యం (సాంబ మసూరి) క్వింటాకు రూ.2వేల నుంచి రూ.2,200 వరకు కొనుగోలు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా రూ.2,389కు అమ్ముతున్నారు. దీనికితోడు క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ కూడా నొక్కేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క తెలిసిన రైతుల పేర్ల మీద ధాన్యం అమ్ముతూ క్వింటాకు రూ.500నుంచి రూ.600 లాభం గడిస్తున్నారు. కొన్ని రోజులుగా తిరుమలగిరి మార్కెట్లో రోజూ 500 నుంచి వెయ్యి బస్తాల వరకు కొనుగోలు చేసి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా తిరుమలగిరి మండలం చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని తమకు అనుకూలమైన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నారు. వచ్చిన లాభాల్లో కేంద్రాల నిర్వాహకులకూ కొంత ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసి.. కొందరు రైతులు వ్యవసాయ మార్కెట్లోనే సన్న ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు అమ్ముకుంటున్నారు. రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యం లేకపోవడంతోపాటు కొనుగోళ్లు జాప్యం కావడం, డబ్బులు ఆలస్యంగా వస్తాయని, తేమ శాతం కొర్రీల వంటి కారణాలతో రైతులు తక్కువ ధరకై నా మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. ఇలా రైతులు అమ్ముకుంటున్న ధాన్యాన్ని కొందరు వ్యాపారులు, బడా రైతులు కొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతోపాటు బోనస్ పొందుతున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్తోపాటు మండల వ్యాప్తంగా గతం నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం హాకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను ఈ కేంద్రం ద్వారా అమ్మి రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు కొందరు మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క లేని భూమి ఉన్నట్లు, అందులో పంట పండినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దాని కొనసాగింపుగా ఐకేపీ కేంద్రాలకు ధాన్యం విక్రయించినట్లు, మిల్లుకు సరఫరా చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా భూముల్లేని కొందరి బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యాయి. వాటిని మిల్లర్లు, వ్యాపారులు, కేంద్రాల నిర్వాహకులు పంచకున్నారు. ఏటా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. సన్న ధాన్యం వ్యాపారుల తప్పటడుగులు ఫ తిరుమలగిరి మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు ఫ ప్రభుత్వ కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముకం ఫ మద్దతుతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ పొందుతూ.. ఫ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు -
49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట), మునగాల : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట మండలం ఇమాంపేట, మునగాల మండల కేంద్రంతోపాటు బరాఖత్గూడెంలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కలెక్టర్ మాట్లాడుతూ పెన్పహాడ్, చివ్వెంల, మోతె, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని 181 పంచాయతీలు, 1,628 వార్డులకు నేటి నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈనెల 14న పోలింగ్ జరగునుందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని కోరారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పత్రాలు సమర్పించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓలు బాలకృష్ణ, రమేష్ దీన్దయాళ్, మాల్సుర్నాయక్, ఆర్ఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పొంచి ఉన్న తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట టౌన్ : దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది సెలవులు రద్దుచేసి విధుల్లో నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల స్థలాలు, నాలాలు, వంతెనలు, కల్వర్టుల వద్ద పికెట్ ఏర్పాటు చేశామని, వరద నీరు ప్రవహించే వాహనాలతో వంతెనల పైనుంచి వాహనదారులు రాకపోకలు సాగించవద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్కు నంబర్ 8712686026 ఫోన్ చేయాలని కోరారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణమగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతికి తరలిరావాలిమోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాంతాచారి వర్ధంతికి తరలి రావాలని పిలుపునిచ్చారు. -
గీతన్నల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాలి
సూర్యాపేట: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్ (వర్ధిల్లి బుచ్చిరాములు నగర్)లో మూడు రోజులుగా జరుగుతున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 23న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా గీత కార్మికుల సంక్షేమానికి ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్రంలో 4వేల కల్లుగీత సొసైటీలు, 3,600 టీఎఫ్టీల్లో 2,23,000 మంది గీత కార్మికులు ఉన్నారన్నారు. టాడి కార్పొరేషన్కు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి కేవలం రూ.30 కోట్లే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ప్రభుత్వ విధానాల మూలంగా మూతబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతి లేదన్నారు. అంతకుముందు ప్రతినిధుల సభలో తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్గూరి గోవింద్, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, నాయకులు ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, నోముల వెంకన్న, వల్లపు దాసు సాయికుమార్ పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ -
సర్పంచ్కు 1,387.. వార్డులకు 3,791
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల లెక్క తేలింది. నవంబర్ 27వ తేదీ నుంచి శనివారం సాయంత్రం వరకు ఎన్నికల కమిషన్ నామినేషన్ల స్వీకరణకు అవకాశమిచ్చింది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు స్థానాలకు శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులుదీదారు. దీంతో రాత్రి 10 నుంచి 11గంటల వరకు పలు సెంటర్లలో ప్రక్రియ కొనసాగింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఎన్నికల అధికారులు జిల్లాలో సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలు అయ్యాయని ప్రకటించారు. చివరి రోజు 1,021 నామినేషన్లు తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నిలకు నవంబర్ 27న ఉదయం నోటికేషన్ విడుదలైంది. వెంటనే 159 సర్పంచ్, 1,442 వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించినా.. తొలి రోజు సర్పంచ్కు 207, వార్డు సభ్యులకు 38 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకుకు 159, వార్డు సభ్యుల స్థానాల కోసం 142 నామినేషన్లతో కలిపి మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్కు 366, వార్డు స్థానాలకు 180 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 1,021, వార్డులకు 3,611 నామినేషన్లు వేశారు. ఫ మొదటి విడత పంచాయతీ పోరుకు దాఖలైన నామినేషన్లు ఫ రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పరిశీలన ఫ 3న విత్డ్రా.. అభ్యర్ధుల తుది జాబితామొదటి విడత ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఆశావాహులు దాఖలు చేసిన నామినేషన్లను ఆదివారం పరిశీలించారు. ఒక్కో నామినేషన్ పరిశీలనకు సమయం పట్టడంతో ఈ ప్రక్రియ కూడా ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. పరిశీలన పూర్తి చేసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 1న సోమవారం ఏదైనా కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించి, డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. 3న అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించి, అదేరోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. తదనంతరం గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. -
దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
భానుపురి (సూర్యాపేట) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియ్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ అధికారి నరసింహా రావు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు ఆటల ద్వారా మానసిక ఉల్లాసం, మనోధైర్యం కలుగుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి డిసెంబర్ 3న నిర్వహించే జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకట రమణ, డీఈఓ అశోక్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సహకరించాలి నూతనకల్: ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని జెడ్పీ సీఈఓ అప్పారావు కోరారు. శనివారం నూతనకల్తో పాటు మండల పరిధిలోని మిర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆర్డీఓ వేణుమాధవ్తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, అధికారులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జుల నియామకంనల్లగొండ టూ టౌన్: బీజేపీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు జిల్లా ఇన్చార్జులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉదయ్ ప్రతాప్ నల్లగొండ జిల్లా ఇన్చార్జిగా, నల్లగొండ జిల్లాకు చెందిన టి.రవికుమార్ను సూర్యాపేట జిల్లా ఇన్చార్జిగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్.శ్రీనివాస్రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామకం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ కార్యక్రమాలు వీరు పర్యవేక్షిస్తారని తెలిపారు. పకడ్బందీగా ఆలయ భద్రతా వ్యవస్థ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా వ్యవస్థను పకద్బందీగా అమలు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. కొండపైన, కొండ కింద, భక్తుల ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న బ్యాగేజీ స్క్రీనింగ్ యంత్రాల ఏర్పాటును శనివారం ఆయన పరిశీలించారు. ఎస్పీఎఫ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతను మరింత పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, ఎస్పీఎఫ్ అధికారులకు స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను నిరంతరం నడిపించే విధంగా చూడాలని, ఆలయంలోని వివిధ ప్రదేశాల్లో వీల్చైర్లు అందుబాటులో ఉంచాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు సూచించారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలి యాదగిరిగుట్ట: రాష్ట్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం డిసెంబర్ 1న ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ నిర్వహించనుందని ఆలయ ఈఓ వెంకట్రావ్, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 5గంటలకు యాదగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. -
నియమావళికి లోబడి నడుచుకోవాలి
ఫ ఎస్పీ నరసింహ అర్వపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, నాయకులు నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గొడవలు, విభేదాలకు పోకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించకుండా పాత నేరస్తులు, గతంలో సమస్యలు సృష్టించిన వారిని రూ.5లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు నాగేశ్వరరావు, రామారావు, స్థానిక ఎస్ఐ ఈట సైదులు, స్థానిక దేవస్థాన చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, వజ్జె వీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలి
సూర్యాపేట : కల్లు గీత వృత్తిని ఆధునీకరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్( వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చలేదన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కౌడిన్య, అమెరికన్ ఆఫ్ నార్త్ ఇండియా అసోసియేషన్ చైర్మన్ నాతి శ్రీనివాస్ గౌడ్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్, బాలగాని జయరాములు, ఎస్.రమేష్ కుమార్, మడ్డి అంజిబాబు, బుర్ర స్వప్న, చౌగాని సీతారాములు, నాగరాజు, శాంత కుమార్, గౌని వెంకన్న, బాలే వెంకట మల్లయ్య, బూడిద గోపి, ఉషా గాని వెంకట నరసయ్య, ఎల్గూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులకుహైదరాబాద్ కు చెందిన సుప్రజ హాస్పిటల్ ఎం.డి శిగ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు.ఫ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
నామినేషన్ల జోరు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాల వద్ద బారులుదీరారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం మేరకు సర్పంచ్ స్థానాలకు 866 , వార్డు స్థానాలకు 4,506నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజు మాత్రం సర్పంచ్కు 500, వార్డులకు 4326 మంది నామినేషన్ల వేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ సెంటర్లకు వచ్చిన వారికి అధికారులు అవకాశం కల్పించారు. సమయం ముగిసిన తర్వాత కూడా.. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలోగల 486 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 27వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నప్పటికీ మొదటి రోజు అభ్యర్థులకు 207, వార్డు సభ్యులకు 157 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు శుక్రవారం అష్టమి కారణంగా మంచిరోజు కాకపోవడమే కాకుండా నామినేషన్ దాఖలుకు బ్యాంక్ అకౌంట్తో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉన్న కారణంగా కేవలం సర్పంచ్కు 159 , వార్డులకు 142 నామినేషన్ల వచ్చాయి. చివరి రోజు కావడం, పొత్తులు, హామీలు, సమీకరణలు చూసుకుని ఆయా పార్టీలు, వ్యక్తిగతంగా పెద్దగా ఆయా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్ల దాఖలుకు పోటీ పడ్డారు. ఆత్మకూర్ (ఎస్)లోని ఏపూరు, తుమ్మలపెన్పహాడ్ గ్రామాల్లో పోలింగ్ జరిగే సమయంలో ఉన్న మాదిరిగానే అభ్యర్థులు పెద్దఎత్తున క్యూలో నిల్చొని నామినేషన్లు వేశారు. తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, తొండ, తుంగతుర్తి మండలంలోని పలుచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు గ్రామపంచాయతీ ఆవరణల్లోనే ఉండి నామినేషన్లు వేశారు. రాత్రి సమయం కావడంతో క్యూలో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిబ్బంది లైటింగ్తో పాటు మంచినీరు, తదితర సదుపాయాలు కల్పించారు.మండలం పంచాయతీలు వార్డులు క్లస్టర్లు అనంతగిరి 20 178 06 చిలుకూరు 17 158 05 చివ్వెంల 32 258 09 కోదాడ 16 158 04 మోతె 29 262 07 మునగాల 22 210 06 నడిగూడెం 16 148 05 పెన్పహాడ్ 29 256 07 మొత్తం 181 1,628 49మొదటి విడత ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఫ పంచాయతీలకు 866, వార్డులకు4,506నామినేషన్లు దాఖలు ఫ క్లస్టర్ల వద్ద బారులుదీరిన అభ్యర్థులు ఫ చివరిరోజు కావడంతో రాత్రి వరకు సాగిన ప్రక్రియ ఫ నేటి నుంచి రెండో విడత 181 పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణరెండోవిడతలో చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లోని 181 గ్రామపంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకరణ కోసం క్లస్టర్ల వారీగా గ్రామాలను విభజించారు. ఈ మేరకు 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించేందుకు 49 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే రెండో విడత పోలింగ్లో 2,52,745 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. -
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ
సూర్యాపేటటౌన్ : తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఆమరణ దీక్ష చేయడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిర్వహించిన దీక్షా దివస్లో ఆయన మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలో పదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్కు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక, ఒంటెద్దు నరసింహారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, గుజ్జా యుగేందర్రావు, పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆకుల లవకుశ పాల్గొన్నారు. -
రూ.64లక్షలు కొల్లగొట్టారు
సైబర్ నేరానికి గురైన బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సైబర్ మోసాలు జరిగినప్పుడు 1930టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు. ఫోన్లకు వచ్చే అనవసరమైన లింక్లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. – లక్ష్మీనారాయణ, సైబర్క్రైం సీఐ సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపంలో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లకు వచ్చే మెసేజ్లను క్లిక్ చేయడం వల్ల కొందరు మోసపోతున్నారు. బ్యాంకింగ్ యాప్స్, ఫేక్ లింక్లు, లక్కీ డ్రాలు, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్లు అంటూ అనేక మార్గాల్లో ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒక చోట సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు. విద్యా వంతులు సైతం సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాగా కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరికొందరు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... ఆన్లైన్ మోసాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. విద్యాసంస్థలు, గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి ఎక్కడో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలకు పాల్పడే వారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కేసు నమోదు చేసిన వారిని ఛేదించడం సవాల్గా మారుతోంది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు అప్రమత్తంగా ఉంటే మేలు అని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన సామాన్య ప్రజలతో పాటు విద్యావంతులు కూడా చాలా వరకు మోసపోయి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.8కోట్లు.. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 750పైగా సైబర్ కేసులు నమోదుకాగా రూ.8కోట్లకు పైగా డబ్బులను నేరగాళ్లు కొల్లగొట్టారు. అయితే ఈ ఒక్క నెల(నవంబర్)లోనే 127 కేసులు నమోదుకాగా రూ. 64,21,230 బాధితులు పోగొట్టుకున్నారు. ఇందులో రూ.13,14,163 ఫ్రీజ్ చేశారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు అప్రమత్తమై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తే కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీకే ఫైల్స్పై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ ప్రస్తుతం వాట్సాప్లలో ఏపీకే ఫైల్స్ విపరీతంగా వస్తున్నాయి. అలాగే ఇతర బ్లూ లింక్స్ వస్తున్నాయి. వాటిని ఆదమరిచి క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయి మీ సమాచారం మొత్తం సైబర్ మోసగాళ్ల చేతికె వెళ్తుంది. దీంతో మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అపరిచితులు చెప్పితే నమ్మవద్దని, వారు సైబర్ మోసగాళ్లని గ్రహించాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు అడగరు. అలాగే అడిగితే అది సైబర్ నేరస్తుల పనే. అనవసరమైన ఫోన్ కాల్స్, తెలియని లింకులను ఓపెన్ చేయకపోవడం మంచిది. బ్యాంక్ ఓటీపీ, పిన్, సీవీ వివివరాలను ఎవరికీ చెప్పవద్దు. రుణ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ స్కీం, తదితర రకాల ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఫేక్ ప్రొఫైల్స్, క్యూ ఆర్ కోడ్స్, ఫేక్ జాబ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నవంబర్లో అత్యధికంగా 127 సైబర్ కేసులు ఫ రోజూ ఎక్కడో ఒక చోట మోసపోతున్న బాధితులు ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్కు ఇటీవల పార్ట్టైం జాబ్ అంటూ వాట్సాప్లో ఓ లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ యాప్ డౌన్లోడ్ అయింది. ఈ యాప్లో రూ.100 పెట్టుబడి పెడితే రూ.200 వస్తాయని అందులో చూపించింది. అయితే అతను రూ.100 నుంచి రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టగా రెండింతల డబ్బులు వచ్చాయి. దీంతో మరో సారి రూ.50వేలు పెడితే రూ.1లక్ష వచ్చాయి. దీంతో బయట వేరేవాళ్ల దగ్గర నుంచి రూ.9లక్షలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగానే సైబర్మోసగాళ్లు వెంటనే డబ్బులు రాకుండా చేశారు. ఆ యాప్లో ఆ మొత్తం కనడుతుంది. కానీ అవి తీసుకోవడానికి వీల్లేకుండా చేశారు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి 1930కి కాల్చేసి సైబర్ క్రైంను ఆశ్రయించగా కేసు నమోదుచేశారు. ఇలా జిల్లాలో చాలామంది సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు. -
విధుల నిర్వహణలో పొరపాట్లుకు తావివ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజాస్ నంద్లాల్ పవార్, జిల్లా వ్యయ పరిశీలకుడు హుస్సేన్తో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికలపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వ్యయ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ ఎస్ఎస్టీ, ఎఫ్ఎఫ్టీ విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల కమిషన్ రూల్స్ పాటిస్తూ బాధ్యతాయుతంగా, కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్నారు. సహాయక వ్యయ పరిశీలకులు ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, ఏ రోజు నివేదికలు ఆ రోజే పంపించాలని సూచించారు. నివేదికల్లో ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు మండలానికి ఒక బృందం చొప్పున ఉండాలని, సమావేశాలు, మీటింగ్లలో పీఎస్ సిస్టంతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీది వీడియోగ్రఫీ చేయించాలని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తనిఖీల సందర్భంగా రూ.10వేలకు మించి ఆర్టికల్స్ తీసుకువెళ్తున్నా.. రూ.50 వేలకు మించి నగదును తీసుకువెళ్లే వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అసిస్టెంట్ వ్యయ అధికారులు సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా నగదు, ఆర్టికల్స్, లిక్కర్స్ తరలిస్తే ఈ వ్యయాన్ని వారి ఖాతాలో జమ చేయాలన్నారు. లోకల్ ప్రింటింగ్ ప్రెస్ మీద నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే వ్యయ పరిశీలకుడు బి.హుస్సేన్ మాట్లాడుతూ ఏఈఓలు ఎంపీడీఓలతో కలిసి వారికి కేటాయించిన గ్రామపంచాయతీలను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ అప్పారావు, డీసీఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్, జోనల్ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ
తుంగతుర్తి, మద్దిరాల : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి, మద్దిరాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మొదటి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాలలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ను సంప్రదించాలన్నారు. అనంతరం మండల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్రావు, తుంగతుర్తి తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓలు శేషుకుమార్, సత్యనారాయణరెడ్డి, సీఐ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. -
కేసుల పరిష్కారానికి కృషిచేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. ఇటీవల ఎంపికై న జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ సభ్యులు జె.శశిధర్, ఏడిండ్ల అశోక్, మంతపురం కిశోర్, మాండ్ర మల్ల య్య, పసల బాలరాజు, పోలోజు మధు, పల్లేటి రాముడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దు
సూర్యాపేట : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షణికావేశంలో ఘర్షణకు దిగి కేసుల పాలు కావొద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ రవితో కలిసి సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిని పాటించాలని ప్రజలకు సూచించారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి భద్రత, రక్షణ కల్పిస్తుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, బహుమతులు, మద్యం, ఇతర ఉచితాలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, ఫలితాలు వెలువడిన రోజు ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. అక్రమ రవాణా నిరోధం కోసం 24 గంటలకు తనిఖీలు ఉంటాయి అన్నారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో పటిష్ట నిఘా ఉంచామన్నారు. ఆకస్మిక తనిఖీలకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు బాలునాయక్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఓవర్ లోడుతో రోడ్డెక్కితే సీజ్
సూర్యాపేట టౌన్ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంంది. రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేసింది. ఇటీవల చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికడుతూ మరణాల రేటును తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలు ఓవర్ లో డుతో రోడ్డెక్కితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.లక్షల్లో జరిమానా విధిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మూడు విజిలెన్స్ అధికారుల బృందంతో పాటు ఉమ్మడి జిల్లాలో మూడు, జిల్లాలో మరో ఆరు టీంలతో పాటు ఏవీంఐలు తనిఖీలు విస్తృతం చేశారు. పన్నుల చెల్లింపులు, అనుమతి పత్రాలు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ఓవర్లోడు అంశాలను పరిశీలిస్తూ ని బంధనలు పాటించని వాహనాలను పట్టుకొని భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. వందలాది వాహనాలపై కేసులు నమోదు రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలతో పాటు జిల్లాలోని రవాణా శాఖ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. వీరు జిల్లాల్లో ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తూ వాహనాల పత్రాలు పరిశీలించి తేడాలుంటే జరిమానా విధిస్తున్నాయి. ఇసుక, కంకర, మొరం లోడుతో వెళ్లే లారీలు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలను పట్టుకొని ఫైన్లతో పాటు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి చేపడుతున్న తనిఖీల్లో 342 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో 64 వాహనాలు ఇసుక ట్రాక్టర్లు, కంకర లారీలు, ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకున్న ఆటోలు ఉన్నాయి. ఈ వాహనాలకు మొత్తం రూ.11.46లక్షలు జరిమానా విధించారు. అలాగే మిగతా 278 వాహనాలకు సరైన పత్రాలు, ఫిట్నెస్, ఇతర ధ్రువపత్రాలను లేనివిగా రవాణా శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. వీటన్నింటికి మొత్తం రూ.54.82 లక్షల జరిమానాలు విధించారు. రెండో సారి దొరికితే అంతే సంగతులు.. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడు వల్లే అధికంగా జరుతుండడంతో వాటిమీదే యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవర్ లోడు అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు రెండో సారి ఓవర్లోడుతో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల బస్సులు కూడా ఓవర్ లోడ్తో వెళితే కేసులు తప్పవని రవాణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ తనిఖీలు ఫ నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఫ సరైన పత్రాలు, ఫిట్నెస్లేని 278 వాహనాలకు జరిమానా ఫ 342 వాహనాలపై కేసులువాహనదారులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. ముఖ్యంగా ఓవర్ లోడుతో, పరిమితికి మించి వాహనదారులను తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. ఓవర్ లోడ్తో పాటు నిబంధనలు పాటించకుండా రెండో సారి కూడా పట్టుబడే వాహనాల పర్మిట్ రద్దుతో పాటు డ్రైవర్ లైసెన్స్ను సస్పెండ్ చేస్తాం. – జయప్రకాష్రెడ్డి, ఇన్చార్జి జిల్లా రవాణా శాఖ అధికారి -
గీతన్నల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
సూర్యాపేట : కల్లుగీత కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాల్గవ మసహాసభల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హారై మాట్లాడారు. నిత్యం స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పే బీజేపీ నాయకులు స్వదేశీ కల్లును, నీరాను ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి దండాలు పెడుతున్న పాలకులు పాపన్న వారసులైన కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గీత కార్మికుల ప్రతి సొసైటీకి రూ.20 లక్షలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్లుగీత వత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మోకు, ముస్తాదులతో భారీ ప్రదర్శన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంవీ.రమణ రచించగా ప్రభుత్వ కళాకారుడు మానుకోట ప్రసాద్ పాడిన ‘మోకు పైలం మోయి గౌడ వెంకీ పైల మోయి గౌడ’ అనే పాటల సీడిని హైదరబాద్ సుప్రజ హాస్పిటల్ ఎండీ సిగ విజయ్కుమార్గౌడ్ ఆవిష్కరించారు. సంఘం ఉద్యమ నిర్మాత తొట్ల మల్సూర్ స్వగ్రామమైన నూతనకల్ మండలం చిల్పకుంట్ల నుంచి తీసుకొచ్చిన స్మారక జ్యోతిని రమణకు సభా వేదికపై అందజేశారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ చౌగాని సీతారాములు, బోలగారి జయరాములు, జయరాములు, గౌని వెంకన్న, బొల్లె వెంకట మల్లయ్య, ఎస్.రమేష్ గౌడ్, బూడిద గోపి, పామన గుండ్ల అచ్చాలు, ఉష గాని వెంకటనరసయ్య, బండకింది అరుణ, గౌరీ అంజయ్య, జిల్లా నాయకులు కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న గౌడ్, టైసన్ శ్రీను, ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు, బత్తుల జనార్దన్, సైదయ్య పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ ఫ సూర్యాపేటలో ఆ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం ఈ నెల 29, 30వ తేదీల్లో కల్లుగీత కార్మిక సంఘం మహాసభల ప్రతినిధుల మహాసభ జిల్లా కేంద్రంలోని అంతటివిజయ్ ఫంక్షన్ హాల్( కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించనున్నారు. 30న రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికతో సభ ముగుస్తుంది. -
30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయకుమార్రెడ్డి, తునికి విజయసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో నిర్వహించే పురుషులు, మహిళల ఎంపీక పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వెంట ఆధార్కార్డుతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఉదయం 10 గంటలకు వరకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్ సంపత్ను 9182842387లో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలిమద్దిరాల : నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మద్దిరాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ నరసింహ, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ అయేషా పర్వీన్, ఎస్ఐ ఎం.వీరన్న, పీఓ, ఆర్ఓ, సిబ్బంది ఉన్నారు. వరికొయ్యలను కాల్చొద్దుమునగాల: పొలాలు కోసిన అనంతరం రైతాంగం వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్రెడ్డి సూచించారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో వరికొయ్యలను కాల్చిన పలువురి రైతుల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరికోతల తర్వాత మిగిలిన వరికొయ్యలు, గడ్డిని త్వరగా తొలగించేందుకు తగులబెట్టడం సాధారణమైందని, ఈ పద్ధతి వల్ల నేలకు, పంటకు, మన ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. నేల భూసారాన్ని కోల్పోతుందని, గాలిలో కాలుష్యం పెరగుతుందని, ఎరువుల ఖర్చు పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.రాజు, ఏఈఓలు నాగు, రమ్య, భవాని, మహిత, రైతులు పాల్గొన్నారు. భవిష్యత్ అంతా సైన్స్దే.. సూర్యాపేట టౌన్ : రేపటి భవిష్యత్ అంతా సైన్స్దేనని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అందె సత్యం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఆ వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్లమూడి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, పుస్తకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్కుమార్, రాంబాబు, సూర్యనారాయణలు ప్రిన్సిపాల్ జీవీ.విద్యాసాగర్, డాక్టర్ విజయమోహన్, షేక్ జాఫర్, కలకుంట్ల సైదులు, డీఎన్ స్వామి, యాదయ్య, రామచంద్రయ్య, దయానంద్, సోమ సురేష్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలినడిగూడెం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో చదవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డీసీఓ సీహెచ్.పద్మ కోరారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ, సునిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ స్కూళ్లకు నిధులు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ విద్యను బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల కోసం బోధన సామగ్రి కొనుగోలు, తరగతి గదుల అలంకరణ, లెర్నింగ్ మెటీరియల్, మల్టీ మీడియా కిట్లు, శానిటేషన్ వంటి అవసరాల కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు ఆకర్షణీయమైన శ్రద్ధ పెంచేలా విద్యా వాతా వరణం అవసరమని భావించి ఈ నిధులను విడదల చేసింది. వీటితో చిన్నారులకు ఆట పాటలతో, చిత్రాలతో, రైమింగ్, లెర్నింగ్ కిట్లతో నేర్పే ప్లే–వే విధానం మరింత బలోపేతం కానుంది. 40 ప్రీప్రైమరీ పాఠశాలలు.. జిల్లాలో మొత్తం 30 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. వీటితో మరో పది పీఎంశ్రీ పాఠశాలలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు బోధన సామగ్రి, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాలకు రూ. 1.70 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన.. ప్రీ ప్రైమరీలో చేరే పిల్లలు నాలుగేళ్లు నిండిన వారై ఉండాలి. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలను ప్రీ ప్రైమరీకి పంపిస్తారు. ప్రీ ప్రైమరీ కోసం పాఠశాలలోనే ఒక గదిని కేటాయించి, గదిని ఆహ్లాదం పంచేలా అందంగా అలకరించడం, గోడలను అక్షరాలు, బొమ్మలతో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయాలపై సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే బోధన సిబ్బందిని ఎంపిక చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఇవే.. ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ తొండ(తిరుమలగిరి మండలం), ఎంపీపీఎస్ అమరవరం(హుజూర్నగర్ మండలం), ఎంపీయూపీఎస్ భీక్యాతండా(కోదాడ), ఎంపీపీఎస్ పూలగడ్డపస్త్యాల(నాగారం), ఎంపీపీఎస్ పోలుమల్ల(మద్దిరాల), ఎంపీపీఎస్ గోండ్రియాల(అనంతగిరి), ఎంపీపీఎస్ సోమవరం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ బొత్తలపాలెం(పాలకవీడు), ఎంపీయూపీఎస్ బుర్కచర్ల(మోతె), ఎంపీపీఎస్ రత్నవరం(నడిగూడెం), ఎంపీయూపీఎస్ సర్వారం(మోతె), ఎంపీయూపీఎస్ రత్నపురం(సూర్యాపేట), పీఎస్ మున్యానాయక్తండా(చివ్వెంల), ఎంపీపీఎస్ అలాంగ్పురం(పాలకవీడు), ఎంపీపీఎస్ మానాపురం(తుంగతుర్తి), ఎంపీయూపీఎస్ బక్కమంతులగూడెం(మఠంపల్లి, ఎంపీపీఎస్ శాంతినగర్(నాగారం), ఎంపీపీఎస్ తాళ్లఖమ్మంపహాడ్(సూర్యాపేట), ఎంపీపీఎస్ ముకుందాపురం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ తోల్తండా(మోతె), ఎంపీపీఎస్ లాల్తండా, ఎంపీపీఎస్ కొత్తగూడెం, ఎంపీపీఎస్ సిరిపురం(నడిగూడెం), ఎంపీపీఎస్ నరసింహపురం(మునగాల), ఎంపీపీఎస్ కలకోవ, ఎంపీపీఎస్ త్రిపురవరం(అనంతగిరి), ఎంపీపీఎస్ చెనుపల్లి, ఎంపీపీఎస్ నర్లెంగులగూడెం(పాలకవీడు), ఎంపీపీఎస్ కచ్చవారిగూడెం(గరిడేపల్లి), ఎంపీపీఎస్ కర్విరాలకొత్తగూడెం(తుంగతుర్తి), ఎంపీపీఎస్ గాజులమొల్కాపురం(పెన్పహాడ్), మొర్సకుంటతండా, రంగయ్యగూడెం, చినగారకుంటతండా, ఎంపీపీఎస్ జేత్యతండా(తిరుమలగిరి), ఎంపీపీఎస్ వడ్డరివాడ(అనంతగిరి), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హుజుర్నగర్, ఎంపీపీఎస్ ఎన్ఎస్పీ క్యాంపు, ఎంపీపీఎస్ వెంపటి(తుంగతుర్తి మండలం) ప్రీప్రైమరీ కింద ఎంపికయ్యాయి.ఫ ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షల నిధులు మంజూరు ఫ జిల్లాలో 40 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఫ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా.. ఫ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన -
జిల్లాకు ఇద్దరు పరిశీలకులు
భానుపురి(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు పంచాయతీ ఎన్నికల కోసం ఇద్దరు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.వీరిలో సాధారణ పరిశీలకుడిగా గుగులోతు రవి నాయక్, వ్యయ పరిశీలకుడిగా హుస్సేన్ ఉన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతుంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులుపాల్గొన్నారు. బహిరంగ వేలం వాయిదామట్టపల్లి క్షేత్రంలో కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకోసం గురువారం స్తానికంగా నిర్వహించిన బహిరంగ వేలానికి సరైన పాటదారులు పాల్గొనక పోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈఓ బి.జ్యోతి తెలిపారు. త్వరలోనే మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తామని చెప్పారు. 56 సర్పంచ్ స్థానాల్లో పోటీసూర్యాపేట అర్బన్ : పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలోని 56 సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుంటామన్నారు. ప్రస్తుతం చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సర్పంచ్గా పోటీ చేయని గ్రామాలలో బీజేపీయేతర పార్టీలతో కలిసి సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, నాయకులు గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మే రెడ్డి కృష్ణారెడ్డి, పోలోజుసైదులు, బత్తుల జనార్దన్ పాల్గొన్నారు. కొనసాగుతున్న మూసీ నీటి విడుదల కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి 724 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉండడంతో అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఒక క్రస్టు గేటును అడుగున్నర మేర పైకెత్తి 988 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 44 క్యూసెక్కులు సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో తగ్గుతోంది. ఈఏడాది మొదటిసారిగా జూలై మాసంలో మూసీ గేట్లను అధికారులు పైకెత్తగా.. నాటి నుంచి నిర్విరామంగా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 62 ఏళ్ల మూసీ చరిత్రలో ఇన్నిరోజులపాటు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. -
పల్లె ఓటర్లు 6,94,815
భానుపురి (సూర్యాపేట) : పల్లె ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 6,94,815 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది, ఇతరులు మరో 22 మంది ఉన్నారు. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది ఓటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. తిరుమలగిరి మినహా అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాతోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 486 పంచాయతీలుసూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫ్రిబవరిలో గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసింది. అయితే అక్టోబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఈ సమయంలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ మొదటివారంలోనే ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు నమోదయ్యారు. నోటిఫికేషన్ రాగానే తుది జాబితా ప్రకటిస్తే 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇదే జాబితాతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనంతగిరి 12545 13343 01 25,889 ఆత్మకూర్ 21800 22252 01 44,053 చిలుకూరు 15915 16984 00 32899 చింతలపాలెం 13132 13700 00 26832 చివ్వెంల 14328 14882 01 29211 గరిడేపల్లి 22654 24135 07 46796 హుజూర్నగర్ 10287 10744 00 21031 జాజిరెడ్డిగూడెం 12157 12458 00 24615 కోదాడ 15462 16418 01 31881 మద్దిరాల 12569 12738 00 25307 మఠంపల్లి 18314 19349 00 37663 మేళ్లచెరువు 16740 17546 01 34287 మోతె 18731 19087 05 37823 మునగాల 17695 18699 00 36394 నడిగూడెం 12089 12481 01 24571 నాగారం 12227 12545 03 24775 నేరేడుచర్ల 10720 11422 00 22142 నూతనకల్ 14503 14563 00 29066 పాలకీడు 10358 11110 00 21468 పెన్పహాడ్ 16632 17445 00 34077 సూర్యాపేట 15652 15967 01 31620 తిరుమలగిరి 8925 8874 00 17799 తుంగతుర్తి 17308 17308 00 34616 మొత్తం 3,40,743 3,54,050 22 6,94,815 తుది ఓటరు జాబితా విడుదల అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి -
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలి
● ఎన్నికల పరిశీలకుడు రవినాయక్అర్వపల్లి: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు గుగులోతు రవినాయక్ ఆదేశించారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ పత్రాలు పరిశీలించి ఆర్ఓకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, డీఆర్డీఓ అప్పారావ్, డీపీఓ యాదగిరి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎంపీఓ గోపి, ఎస్ఐ సైదులు, పంచాయతీ కార్యదర్శులు నవీన్రెడ్డి, నెహ్రూనాయక్, ఆర్ఓ, ఏఆర్ఓలు పాల్గొన్నారు. -
నేటి నుంచి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
సూర్యాపేట : తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నారు. దీనికోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ కొనసాగుతుంది. ఈనెల 29,30 తేదీల్లో పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోగల అంతటి విజయ్ ఫంక్షన్ హాల్(వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 600 మంది కల్లుగీత కార్మికోద్యమ ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.వి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు. తొలిరోజు బహిరంగ సభ 29, 30 తేదీల్లో ప్రతినిధుల సభ -
గెలుపు గుర్రం ఎవరు?
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా మన మనిషికి రిజర్వేషన్ అనుకూలించిందా..? గెలుపు గుర్రమేనా..? ఏ వార్డులో ఎవరు ఉన్నారన్న.. చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల రాజకీయాలను పక్కనబెట్టి ఆశావాహుల వ్యక్తిగత చరిష్మా, గ్రామాల్లో మంచి పేరున్న వారిని రాజకీయాల్లో తీసుకొచ్చే మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక బరిలో ఉండాలనుకున్న ఆశావహులు గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు తమ గాడ్ఫాదర్ల మద్దతు కోసం క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే గ్రామాల్లో పట్టున్న నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులను సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎన్నుకునేలా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నిక కోసం సామాజిక వర్గం, ధనబలం, మంచి పేరున్న అభ్యర్థుల కోసం అన్వేషణ షురూ అయింది. పార్టీలతో సంబంధం లేకున్నా..వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. కానీ అన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికలను ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు సైతం తమవర్గం వ్యక్తి, తాము బలపర్చిన వ్యక్తులే సర్పంచ్గా గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలిస్తేనే రానున్న రోజుల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సైతం సులువుగా గెలుచుకునేందుకు వీలుంటుందన్న భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా రంగంలోకి దిగింది. సన్నబియ్యం, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.గెలిస్తేనే నిలుస్తామని.. మొదడి విడత ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాలు, గ్రామాలు, వార్డుల్లో తమ కేడర్ నుంచి బలమైన వ్యక్తులను బరిలో ఉంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తామని బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుంచి అందిన ఆదేశాల మేరకు గెలుపు గుర్రాల వేట ముమ్మరంగా సాగుతోంది. నామినేషన్ల కోసం శుక్ర, శనివారాలు మాత్రమే అవకాశం ఉండడంతో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ తాము బలపర్చిన అభ్యర్థే గెలవాలన్న కసిలో పార్టీలు మొదటి విడత ఎన్నికల పల్లెల్లో వేడెక్కిన రాజకీయం -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జనరల్ పరిశీలకుడు గుగులోతు రవినాయక్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. ఓటర్ స్లిప్స్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపినా ప్రచారంలో పాల్గొన్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ మొదటి విడతలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మొదటి విడతలో 44 , రెండవ విడతలో 49 , మూడవ విడతలో 38 ఏర్పాటు చేశామని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు,4 స్టాటిస్టిక్ టీములు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు పోలీసు శాఖ నామినేషన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాలలో భద్రతకు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియా, గ్రీవెన్స్ సెల్ ప్రారంభం సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓలు నారాయణ రెడ్డి, పార్థ సారధి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. జనరల్ పరిశీలకుడు రవినాయక్ -
నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం
సూర్యాపేట టౌన్ : సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, రహదారుల వెంట హోటళ్లు, డాబాల్లో మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలా జరగాలని, అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. జిల్లాలోకి అక్రమ రవాణా జరగకుండా, అక్రమంగా మద్యం ఇతర వస్తువులు రవాణా కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడతామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 కు, పోలీస్ కంట్రోల్ రూం 8712686057 , సోషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం 8712686026 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని సూచించారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
విద్య ఒక ఆయుధం
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ చివ్వెంల(సూర్యాపేట) : విద్య ఒక ఆయుధం అని దానిని సద్వినియోగం చేసుకుని గ్రామానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ, సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీతో కలిసి విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించారు. జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని, భావిభారతపౌరులుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, చారిటబుల్ సోసైటీ అధ్యక్షుడు తల్లమళ్ల హస్సెన్, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు నాతి సవీందర్ కుమార్, జ్యోతి, కోక రంజిత్, సుంకర రవి కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
మణిహారంలా ఔటర్ రింగ్ రోడ్
హుజూర్నగర్: ఔటర్ రింగ్ రోడ్ హుజూర్నగర్ పట్టణానికి మణిహారంలా ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 6 కోట్లతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2013లో రూ. 22 కోట్లతో ఒక వైపు , ఇప్పుడు రూ. 6 కోట్లతో మరోవైపు రింగ్రోడ్డు నిర్మించామన్నారు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, డీఈ రమేష్, వివిధ శాఖల అధికారులు రమేష్, రామకిషోర్, సత్యనారాయణ పాల్గొన్నారు. కోదాడ: విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని కలిగించడానికి పాఠశాలలు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. బుధవారం కోదాడపట్టణంలోని సీసీరెడ్డి విద్యానిలయంలో 19వ సీఎస్ఏ స్పోర్ట్స్మీట్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 30 ఏళ్లుగా కోదాడలో తాను సీసీరెడ్డి విద్యానిలయాన్ని పరిశీలిస్తున్నానని, ఇందులో అన్ని రకాల వసతులను కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా పాఠశాల వాతావరణం ఉండాలని అందుకు ప్రతి స్కూల్ నిర్వాహకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మూడేళ్లకు ప్రజాభిప్రాయం
కట్టంగూర్ : కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన గద్దపాటి దానయ్య 2001లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 800 ఓట్లు ఉండగా దానయ్యకు 450 ఓట్లు రాగా ప్రత్యర్ధి పులి నర్సింహకు 350 ఓట్లు వచ్చాయి. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత 2004లో తన పాలనపై రెఫరెండం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో రెఫరెండం చేపట్టారు. దానయ్య రైతు గుర్తుతో, వ్యతరేకంగా క్రాస్ గుర్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఈ రెఫరెండం పోలింగ్లో మొత్తం 750 ఓట్లు పోలవ్వగా 110 ఓట్ల మెజార్టీతో గద్దపాటి దానయ్య గెలుపొందారు. తన పాలనపైనే ప్రజల తీర్పు కోరిన దానయ్య ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15, 2004లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రజల ఆమోదంతో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ప్రజాపాలనలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే రెఫరెండం విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ మెరుగు పడుతుంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు కలిగేలా పనులు చేయాలంటే ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలి – గద్దపాటి దానయ్య, మాజీ సర్పంచ్, పందెనపల్లి -
సీఐటీయూ అధ్యక్షుడిగా వెంకటనారాయణ
కోదాడ: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా కోటగిరి వెంకటనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 24,25 తేదీల్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కార్మికులకు, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టెట్ నుంచి మినహాయించాలినేరేడుచర్ల : టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్కుమార్ కోరారు. బుధవారం ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ తప్పని సరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి పార్లమెంటులో విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ని సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శ్రీనయ్య, అక్కయ్యబాబు, నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్రావు, కృష్ణయ్య తదదితరులున్నారు. -
ఓట్ల జాతర
తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ సూర్యాపేట : సంగ్రామానికి వేళయ్యింది. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే రోజు క్లస్టర్ గ్రామాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 159 గ్రామాలతో పాటు 1,442 వార్డుల్లో డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. 44 క్లస్టర్ల ఏర్పాటు తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరిగే గ్రామాలలో నాలుగైదు ఊళ్లకు ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 44క్లస్టర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రి అంతా జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు చేరింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలకు బుధవారం శిక్షణ కూడా పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. దీని పై డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి, 2న పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. కాగా అదే రోజు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడించి గుర్తులు కేటాయిస్తారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఎనిమిది మండలాల్లో తొలివిడత ఎన్నికలు ఆత్మకూరు(ఎస్), జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నాగారం, నూతనకల్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలాలు : 08 గ్రామాలు: 159 వార్డులు : 1,442 క్లస్టర్లు : 44 మొత్తం ఓటర్లు 2,31,851 పురుషులు: 1,15,141 మహిళలు : 1,16,705 ఇతరులు: 05 ఫ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఫ 44 క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తిఫ డిసెంబర్ 11న 159 పంచాయతీలు, 1,442 వార్డులకు పోలింగ్ -
ప్రజలు మద్దతుగా నిలిచారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి. అందుకుగాను నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల ఆలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది. – దుబ్బాక నర్సింహారెడ్డి, నేరడ, చిట్యాల మండలంచిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది. -
రెఫరెండం
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలివ్వడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోవడం పరిపాటి. కానీ, కొద్దిమంది ప్రజాప్రతినిధులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు తమ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. అందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అలా నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తమ పాలనపై రెఫరెండం నిర్వహించుకుని.. ప్రజాభిప్రాయం తీసుకున్నారు. ఈ రెఫరెండంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. స్థానిక సంస్థల్లోఆలగడప మాజీ సర్పంచ్ వేనేపల్లి పాండురంగారావు తమ పాలనపై ప్రజాభిప్రాయం తీసుకున్న ఇద్దరు సర్పంచ్లు, ఒక ఎంపీటీసీ రెఫరెండంలో మరింత ఆదరణ పొందిన ఆ నాయకులు మిర్యాలగూడ : దేశంలో 22ఏళ్ల క్రితం ఆ గ్రామం పేరు మారుమోగింది. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా అప్పటి సర్పంచ్ తన పాలనపై పెట్టుకున్న రెఫరెండం దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా తన పాలనపై రెఫరెండం పెట్టుకొని గెలిచి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడంతోపాటు గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి ‘తెలంగాణ మట్టి మనిషి’గా పేరుతెచ్చుకున్నాడు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ‘మనిల్లు’ అని పేరు పెట్టుకుని ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు వేనేపల్లి పాండురంగారావు. ప్రజలే నామినేషన్ వేయించారు.. ఊరి జనం మొత్తం పాండురంగారావును సర్పంచ్గా చేయాలని పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు పోటీ చేయకుండా నిరాకరించాడు. ఎట్టకేలకు 2001లో ప్రజలే ఆయనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పాండురంగారావుకు కాంగ్రెస్, సీపీఎం మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థి బరిలో ఉన్నాడు. పాండురంగారావు కేవలం రూ.200 ఖర్చు పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో అప్పుడు సుమారు 3,800 ఓట్లు ఉండగా 3,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. అందులో పాండురంగారావుకు 2,800 ఓట్లు వచ్చాయి. ఇంకా 400 ఓట్ల పోలింగ్ చిట్టీలపై అభిమానులు నినాదాలు రాయడంతో అవి చెల్లలేదు. ప్రత్యర్థికి కేవలం 400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీతో పాండురంగారావు గెలుపొందారు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊరిలో సారా నిషేధం పెట్టాడు. ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చాలా మందిని సొంత ఖర్చులతో చదివించారు. 2003లో రెఫరెండం.. పాండురంగారావు సర్పంచ్గా తన రెండేళ్ల పాలనపై 2003లో రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పట్లోనే దేశానికి ఆలగడప పేరును పరిచయం చేశాడు. ‘పదవిలో నేను ఉండాలా.. వద్దా..’ అని బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ నిర్వహించగా 1710 మంది ఉండాలని, 70 మంది వద్దని తీర్పు ఇచ్చారు. అప్పట్లో ఆలగపడ గ్రామాన్ని జాతీయ మీడియా వెతుక్కుంటూ వచ్చింది. ఈ విజయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎంపికై కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దేశంలోనే మొట్టమొదటగా ఆలగడప గ్రామంలో.. ‘సాక్షి’తో వేనేపల్లి పాండురంగారావు మా గ్రామంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న సమయంలో ప్రజలు నన్ను సర్పంచ్గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. 2001లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగాక.. పదవిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండెం పెట్టాను. దానిలో 90శాతం మంది ప్రజలు పదవిలో ఉండాలని, పాలన బాగుందని తీర్పు ఇచ్చారు. ఈ రెఫరెండెం దేశ చరిత్రలో మొదటిసారి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
బాలికల విద్యకు బాసట
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే పేద, ప్రతిభ గల విద్యార్థినులకు ఉన్నత విద్యావకాశాలు దక్కేలా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థినులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరేలా నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ (వైఐఐఓఈ) కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. ఇందుకోసం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేల నుంచి లక్షల రూపాయలు చెల్లించి శిక్షణ తీసుకుంటారు. అలాంటి అవకాశాన్ని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు అందించాలనే సంకల్పంతో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి శని, ఆదివారాల్లో పాఠశాల వేళలు ముగిసిన తర్వాత తరగతులు నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంబీబీఎస్లో చేరేలా నీట్, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేలా ఐఐటీ–జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా– క్లాట్కు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఎంపిక చేసిన కేజీబీవీ విద్యార్థినులకే శిక్షణ ఇస్తారా? లేక ఆసక్తి గలవారికి పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఒకచోట శిక్షణ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. వైఐఐఓఈ కేంద్రాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లను సమకూర్చి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. నిపుణుల ఎంపిక, ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల నియామకం చేపట్టాల్సి ఉన్నందున మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరికి మేలు.. జిల్లాలోని మూడు పెన్పహాడ్, గడ్డిపల్లి, చింతలపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు వైఐఐఓఈ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. వీటిలో పెన్పహాడ్ కేజీబీవీలో ఐఐటీ జేఈఈ (ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి), గడ్డిపల్లి కేజీబీవీలో నీట్ (ఎంబీబీఎస్కు సంబంధించి), చింతలపాలెం కేజీబీవీలో క్లాట్(న్యాయవాద వృత్తికి సంబంధించి) ద్వితీయ సంవత్సరం చదివే బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పెన్పహాడ్ ఐఐటీ జేఈఈ గడ్డిపల్లి నీట్ చింతలపాలెం క్లాట్ ఫ కేజీబీవీల్లో ఐఐటీ, నీట్, క్లాట్కు ఉచితంగా శిక్షణ ఫ జిల్లాలో మూడు విద్యాలయాలు ఎంపిక ఫ ద్వితీయ సంవత్సరం చదవి విద్యార్థినులకు ప్రయోజనం -
ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్ క్రీడాకారుల ఎంపిక
మేళ్లచెరువు : చింతలపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నల్లగొండ జిలా అండర్ 14,అండర్ 17 బాలబాలికల సాఫ్ట్బాల్ సెలక్షన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలను తహసీల్దార్ సురేందర్రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్లు ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ సెలక్ట్ అయిన జట్లు వచ్చే నెల జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ప్రతి జట్టు నుంచి 16 మంది క్రీడాకారులను ఎంపికచేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఈటీ ఉస్మాన్, పీఏసీఎస్ చైర్మన్ రంగాచారి, ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వీరన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పాఠశాలలకు క్రీడా నిధులు
ఫ తొలి విడతగా 606 స్కూళ్లకు రూ 68.10 లక్షలు మంజూరు ఫ క్రీడా పరికరాల కొనుగోలుకు మార్గం సుగమం ఫ ఆటల్లో శిక్షణకూ తోడ్పాటు హుజూర్నగర్ : విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఆటల్లో శిక్షణతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 606 ప్రభుత్వ పాఠశాలలకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేశారు. 606 పాఠశాలలకు.. జిల్లాలోని 606 పాఠశాలలకు తొలి విడతగా రూ 68.10 లక్షలు మంజూరు చేశారు. వీటిలో 369 ప్రాథమిక పాఠశాలలకు రూ 18.45 లక్షలు, 64 ప్రాథమి కోన్నత పాఠశాలలకు రూ 6.40 లక్షలు, 14 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ 39.25 లక్షలు, 16హయ్యర్ సెకండరీ (కేజీబీవీ, గురుకుల) స్కూళ్లకు రూ 4 లక్షల చొప్పున మంజూరు చేశారు. నిధుల వినియోగం ఇలా.. ఈ ఏడాది తొలి విడతగా మంజూరు చేసిన ఈ నిధులను ప్రాథమిక పాఠశాలలకు రూ. 5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 10 వేలు, ఉన్నత పాఠశాలలు, హయ్యర్ సెకండరీ స్కూళ్లకు రూ. 25 వేల చొప్పున ఇస్తారు. ఈనిధులతో పాఠశాలల్లో క్రీడల్లో మెళకువలు నేర్పించడంతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చ డానికి వినియోగించాలి. నిధులు అరకొరగా కేటాయించడంతో ఆట వస్తువులు ఎలా కొనుగోలు చేయాలా అని వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రారంభంలో కేటాయిస్తే మరింత ఉపయోగకరంగా ఉండేదని మరికొందరు అంటున్నారు. -
రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి
హుజూర్నగర్ : పాలకవీడు మండలంలో పంచాయతీ రిజర్వేషన్లను అధికారులు పునః పరిశీలించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నల్ల కండువాలు మెడలో వేసుకొని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవీడు మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా కనీసం బీసీలకు ఒక్క స్థానం కూడా రిజర్వేషన్ ద్వారా కేటాయించలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాపోలు నవీన్ కుమార్, కొండమీది నరసింహారావు, పి. కనకయ్య, చిలకరాజు శ్రీను, కె. వెంకట్, ఎ. నాగేంద్రబాబు, ఎ. వెంకటేశ్వర్లు, కొండా నాయక్, నరసింహ, పి. నాగయ్య, ఎస్. కృష్ణ పాల్గొన్నారు. -
ధాన్యం తూకంలో అవకతవకలు
అనంతగిరి: ధాన్యం తూకంలో కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనంతగిరి మండలంలోని అనంతగిరి, శాంతినగర్, ఖానాపురం కేంద్రాల్లో ప్రతి బస్తాకు తూకం 40కేజీల500గ్రాములు వేయాల్సి ఉండగా 41కేజీల200 గ్రాములు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రతి బస్తాకు 700గ్రాముల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దీనిపై నిర్వాహకులను వివరణ కోరగా కొందరు 41 కేజీలు మాత్రమే వేస్తున్నామని, మరికొందరు తమకేమీ తెలియదని చెప్పారు. బస్తాకు 41కే జీల200 గ్రాములు తూకం వేస్తున్నట్లు హమాలీలు తెలపడం గమనార్హం. ఖానాపురంలో రైతులు ఽతెచ్చింది కాకుండా దళారులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసేందుకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫ బస్తాకు 41కేజీల 200గ్రాములు తూకం వేస్తున్న నిర్వాహకులు ఫ అదనంగా 700గ్రాములు స్వాహా -
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మహిళా కానిస్టేబుళ్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో ట్రాన్స్ జెడర్లను ప్రత్యేకంగా గౌరవించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో, కోర్టులో మహిళా కానిస్టేబుల్స్ను గౌరవించాలని సూచించారు. మహిళలకు ఎటువంటి సమస్యలు వచ్చినా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుండి, వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కోదాడ డీఎస్పీగా శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణకోదాడ: కోదాడ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్(డీఎస్పీ)గా ఆర్. శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీరించారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన శ్రీధర్రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ పనిచేసిన శ్రీధర్రెడ్డి బదిలీపై హైదరాబాద్లోని పౌరసరఫరాల శాఖకు వెళ్లిన విషయం విదితమే. పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలిసూర్యాపేట టౌన్ : పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థిని మాస్టర్ ఇందిర జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై న సందర్భంగా చెస్ అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారిని అభినందించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని, నైపుణ్యం ఉన్న రంగంలో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలిగరిడేపల్లి: చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కోటిరత్నం సూచించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ నరేష్, వీసీసీఎం లతీఫ్ పాల్గొన్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిసూర్యాపేట టౌన్ : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య కోరారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ మంగళవారం టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కె. అరుణ భారతి, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, చిలక రమేష్, ధరావత్ లాలు, సీహెచ్.వీరారెడ్డి, బి.పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు చేయూత
కోదాడ: స్వయం సహయక సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించి ప్రభుత్వం చేయూత నిచ్చింది. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయా సంఘాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 9,323 సంఘాలకు రూ. 6.99 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. కోదాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేటలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, హుజూర్నగర్లో డీఆర్డీఓ అప్పారావు రుణాలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా.. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,713 సంఘాలకు రూ. 2.10 కోట్లు, హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 2,888 సంఘాలకు రూ. 2.12 కోట్లు, సూర్యాపేట నియోజకవర్గంలో 1,998 సంఘాలకు రూ. 1.51 కోట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 1724 సంఘాలకు రూ. 1.24 కోట్ల చొప్పున రుణాలు మంజూరు కావడంతో పంపిణీ చేశారు. మండలం సంఘాలు అందించిన రుణాలు(రూ.లక్షల్లో) చింతలపాలెం 291 26.09 గరిడేపల్లి 717 49.06 హుజూర్నగర్ 360 34.06 మఠంపల్లి 423 38.07 మేళ్లచెరువు 367 20.09 నేరేడుచర్ల 390 24.09 పాలకవీడు 340 17.17 అనంతగిరి 496 41.96 చిలుకూరు 432 31.80 కోదాడ 547 51.68 మోతె 293 17.89 మునగాల 554 32.10 నడిగూడెం 391 35.53 ఆత్మకూరు (ఎస్) 537 41.87 చివ్వెంల 452 36.52 పెన్పహాడ్ 470 37.91 సూర్యాపేట 539 35.61 జాజిరెడ్డిగూడెం 310 23.61 మద్దిరాల 269 23.08 నాగారం 289 14.24 నూతనకల్ 348 29.32 తిరుమలగిరి 139 11.17 తుంగతుర్తి 369 23.33 ఫ రూ.6.99కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ ఫ 9,323 సంఘాలకు లబ్ధి -
విత్తనాలు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
త్రిపురారం : రైతులు వానాకాలం వరి కోతలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు యాసంగి వరి సాగుకు నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోసుకోవడానికి తయారవుతున్నారు. అయితే రైతులు విత్తనాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. ఫ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం. ఫ ఎలాంటి అనుమాలు తలెత్తినా వెంటనే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించాలి. ఫ మండల కేంద్రాలు, గ్రామాల్లో లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయకూడదు. ఫ సరుకు లాట్ నంబర్, తయారీ తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఫ విత్తనాలు కొనుగోలు సమయంలో రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై డీలరు, రైతు సంతకం తప్పకుండా ఉండాలి. ఫ రశీదు పంటకాలం పూర్తయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి. ఫ స్థానిక పరిస్థితులకు అనుకూలమైన, దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ఫ విత్తన సంచుల సీల్ తీసినట్లు లేదా విప్పతీసి తిరిగి కుట్లు వేసినట్లు గమనిస్తే కొనుగోలు చేయొద్దు. ఫ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన డీలర్లు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక సహకార సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రం, వరి పరిశోధనా స్థానాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం. -
బీబీనగర్ ఎయిమ్స్ పనులు ఇంకెన్నాళ్లు..!
సాక్షి,యాదాద్రి : అధునాతన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన బీబీనగర్ ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నిధుల కేటాయింపుల్లో జాప్యంతో మందకొడిగా పనులు నడుస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పనులు పూర్తిచేయాలని గడువు పొడిగించారు. 2023లో శంకుస్థాపన తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో 2023 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్ యోజనలో భాగంగా దీనికి రూ.1365.95కోట్లు మంజూరు చేశారు. ఈపీసీ విధానం ద్వారా ఏసీసీ కంపెనీకి టెండర్ ద్వారా పనులను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 201.65 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్కు అప్పగించగా అందులో పనులు జరుగుతున్నాయి. 24 నెలల్లో అంటే 2024 జూనలై 13 నాటికి పనులన్నీ పూర్తిచేసి ఎయిమ్స్కు అప్పగించాలి. అయితే పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో 2025 నవంబర్ వరకు ఆస్పత్రి, సేవలకు చెందిన భవనాలు, ఇతర బ్లాక్లు సిద్ధం చేశారే కానీ పూర్తి పనులు కాలేదు. పనులు జాప్యం జరగడానికి కారణం నిధులు కేటాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని తెలు స్తోంది. పనులు జరుగుతున్న విధంగా నిధులు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.834.90 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో రూ.805.59 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.29.31 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. దీంతో పనుల గడువు పొడిగించారు. 2026 ఫిబ్రవరి నాటికి 390 బెడ్ల ఆస్పత్రి బ్లాక్లతో పాటు పూర్తిస్థాయి మెడికల్ పరికరాలతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణాలు ఇలా.. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఎయిమ్స్ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల వసతి కోసం 24 అంతస్తుల్లో రెండు టవర్స్ నిర్మించారు. 750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు. డాక్టర్లు, లెక్చర్ థియేటర్, ఎగ్జామ్ హాల్, రీసెర్చ్ ల్యాబ్, 22 ఫ్యాకల్టీల రీసెర్చ్ ల్యాబ్లు, నర్సింగ్, పారా మెడికల్ స్టాఫ్ వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్, న్యూ ఆస్పత్రి బ్లాక్, అకడమిక్ బ్లాక్, ఆడిటోరియం, ఆయుష్ బ్లాక్, రోగుల వెంట వచ్చేవారి కోసం నైట్ షెల్టర్, మార్చురీ, డైరెక్టర్ రెసిడెన్స్, గెస్ట్హౌజ్ అండ్ క్లబ్, ఆరు రకాల క్వార్టర్స్, యూజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ వర్కింగ్ నర్సుల హాస్టల్, డైన్నింగ్ బ్లాక్, కమ్యూనిటీ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, అమృత్ ధార, అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ప్యానల్ రూం, పార్కులతోపాటు పోస్టాఫీస్, బ్యాంకు ఇతర మౌలిక వసతులు తదితర పనులు చేపడుతున్నారు. ఫ రూ.1,365.95కోట్లతో నిర్మాణానికి శ్రీకారం ఫ నిర్దేశించిన గడువులోగా పూర్తికాని పనులు ఫ 2026 ఫిబ్రవరి వరకు గడువు పొడిగింపు ఫ అందని అత్యవసర వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించిన నిమ్స్ భవనాలలో ప్రస్తుతం 38 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఎయిమ్స్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్ధోపెడిక్, న్యూరా లజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, అప్తామాలజీ, రేడియాలజీ, డెర్మటాలజీ, స్కిన్ సర్జరీలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, ఎంఆర్ఐ స్కాన్, లాప్రోస్కోపిక్, సీటీ స్కాన్, క్యాన్సర్ చికిత్సలు, ఆపరేషన్ ఽథియేటర్లు, పీడియాట్రిక్, డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. -
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
ఫ నేడు సెమీఫైనల్స్, ఫైనల్స్చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు ప్రతి జట్టు 9 జట్లతో పోటీపడ్డాయి. మంగళవారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. గెలుపొందిన జట్లకు కలెక్టర్ హనుమంతరావు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, టి. సురేందర్రెడ్డి తదితరులు పాల్డొన్నారు. -
కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యం
సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోకాపేటలో ఎకరం రూ.100కోట్ల నుంచి రూ.170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని, భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో గోల్మాల్ జరుగుతోందని, ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదన్నారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ 2014కు ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బీసీలను పెద్దఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సేనని, రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జగదీష్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్ నిర్వహించుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగులు లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్రావు పాల్గొన్నారు. ఫ కోకాపేటలో భూముల ధర ఇప్పుడు ఎందుకు తగ్గింది ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శ -
చైనా మాంజా గొంతుకు తగిలి గాయాలు
భూదాన్పోచంపల్లి : బైక్పై వెళ్తున్న యువకుడికి చైనా మాంజా తగలడంతో గొంతుకు గాయాలపాలయ్యాడు. చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ మదార్ వ్యక్తిగత పనిమీద సోమవారం బైక్పై పోచంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్హౌజ్ సమీపంలోకి రాగానే మెయిన్ రోడ్డుపై కరెంట్ తీగలపై నుంచి కిందికి వేలాడుతున్న చైనా మాంజా.. మదార్ గొంతుకు తగిలి కోసుకుపోయింది. వెంటనే అతను అప్రమత్తమై బైక్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పింది. గొంతు కోసుకుపోయి రక్తస్రావం అవుతుండగా స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. -
ఏపూర్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్
చిట్యాల : తక్కువ వ్యయంతో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు కరెంట్ సరఫరాలో సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో 750 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం సుమారు 109 ఎకరాల్లో తెలంగాణ ట్రాన్స్కో 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ సబ్స్టేషన్కు ఖమ్మంతో పాటు త్వరలో విద్యుత్ ఉత్పత్తి జరగనున్న దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ గ్రిడ్ల ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి చౌటుప్పల్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో, రోజువారి విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా భారత ఇంధన ఎక్స్ఛేంజి(ఐఈఎక్స్) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీనిని నివారించడానికి బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. 10 నుంచి 15 ఎకరాలు కేటాయింపు.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బ్యాటరీ ఇంధన ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, చిట్యాల మండలం ఏపూర్లో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపూర్లోని 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇందులో 187.50 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు బేస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో సుమారు పదహారు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో గ్రేటర్ హైదరాబాద్కు విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు వీలవుతుంది. ఫ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫ సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఫ త్వరలో ప్రారంభంకానున్న పనులుఏపూర్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చు. – కిశోర్, ఏఈ(ఆపరేషన్), 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, ఏపూరు -
బీపీ, షుగర్ పెరుగుతోంది..
సూర్యాపేటటౌన్ : జిల్లాలో అసాంక్రమిక వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రక్తపోటు (బీపీ), మధుమేహం(షుగర్)తో పాటు క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వం 2018 నుంచి నిర్వహిస్తున్న అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ సర్వేలో ఈ వ్యాధుల గల వారు బయటపడుతున్నారు. బీపీ, షుగర్ వ్యాధి ఒకప్పుడు 30ఏళ్ల పైబడిన వారికే వచ్చేది. ప్రస్తుతం మారిపోయిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఉద్యోగం, ఇతరత్రా ఒత్తిడి వంటి వాటి కారణాలతో 25ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారుకూడా వాటి బారిన పడుతున్నారు. ఇక 30ఏళ్లు దాటిన వారిలో సగం మందిని బీపీ, షుగర్ వదలడం లేదని వైద్యారోగ్యశాఖ, ప్రైవేట్ పరిశోధన సంస్థల సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చొని ఒత్తిడిలో పనిచేసే సాప్ట్వేర్, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా వీటి బారిన పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. 30ఏళ్లు దాటిన వారిపై వైద్యారోగ్య శాఖ సర్వేఎన్సీడీ(నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30ఏళ్లు దాటిన వారితో ఏటా వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో 303 మంది ఏఎన్ఎం, 100 మందికి ఎంఎల్హెచ్పీ, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏఎన్ఎం రోజూ పది మందికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఎక్కువ..ప్రభుత్వం నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ) స్క్రీనింగ్కు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో పాటు బీపీ, షుగర్పరీక్షలను వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అత్యధికంగా ఉంటున్నట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. 30ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే వైద్యారోగ్యశాఖ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. జిల్లాలో 30ఏళ్ల వయస్సు దాటిన 6,49,086 మందికి పరీక్షలు చేయగా 1,42,110 మంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఉన్నట్లు తేలింది. వీరికి ప్రతినెలా పీహెచ్సీల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా మొత్తం 997 మందికి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు తేల్చారు. ఇంకా తమ దృష్టికి రాని బాధితులు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్డీసీ సర్వేలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అధికంగా ఉన్నారు.ఈ జాగ్రత్తలు తప్పనిసరి షుగర్, బీపీ సమ్యల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా సమతుల పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన ఆహార పదార్థాలు, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, దూమపానం చేయకూడదు. నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి రోజు గంట సమయం కేటాయించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.30 ఏళ్లలోపు వారికే అసాంక్రమిక వ్యాధులు ఫ క్యాన్సర్ కూడా విస్తరిస్తోంది ఫ వైద్యారోగ్య శాఖ సర్వేలో వెల్లడి ఫ శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లే కారణం ఫ నిత్యం వ్యాయామం చేయాలంటున్న వైద్యులుఎన్సీడీ సర్వే వివరాలు.. బీపీ ఉన్నట్లు గుర్తించిన వారి సంఖ్య : 86244షుగర్ బాధితులు : 55,866 సర్వైకల్ క్యాన్సర్ : 373బ్రెస్ట్ క్యాన్సర్ : 258ఓరల్ క్యాన్సర్ : 134ఇతర క్యాన్సర్ల బాధితులు : 232ప్రస్తుత జీవన విధానంలో ప్రతిఒక్కరూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం తప్పనిసరి. ఆరు నెలలకోసారి కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది. – డాక్టర్ పెండెం వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
94.698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నేరేడుచర్ల : ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) వి.మోహన్బాబు అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా కేంద్రాల ద్వారా రైతుల నుంచి 41.626 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 53.071 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 6,451 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి రూ.3.22 కోట్లు బోనస్ కూడా చెల్లించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,67,710 రేషన్కార్డుల్లో 10,71,021 మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6,042 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సోమ సుందర్రెడ్డి, ఎంపీఓ నాగరాజు తదితరులు ఉన్నారు. సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలితుంగతుర్తి: ఖమ్మం జిల్లా కేంద్రంలో వచ్చేనెల 26 జరగనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం తుంగతుర్తిలో కొనసాగిన ప్రచార యాత్రలో ఆమె మాట్లాడారు. ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజీ.నరేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య, నాయకులు ఎల్లంల యాదగిరి, గుగులోతు రాజారాం, కోట రామస్వామి, పున్నయ్య, ఫయాజ్, ఏక్ బాల్, శ్రీకాంత్, మల్లయ్య, మనోజ్కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు ఏటా జాబ్మేళాసూర్యాపేటటౌన్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏటా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నామని ఆ విశ్వవిద్యాలయ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సార్వత్రిక అధ్యయన కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ను కళాశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, ఇన్చార్జి ప్రసాద్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆల య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలి
సూర్యాపేట: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 16న జరగనున్న క్రిస్మస్ వేడులకను విజయవంతం చేయాలని పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్ కోరారు. వేడుకల పోస్టర్ను ఆదివారం పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు సినీనటుడు రాజా హాజరు కానున్నారని తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్టు చర్చి 150వ వార్షికోత్సవంలో సూర్యాపేటకు చెందిన చర్చికాంపౌండ్ బాప్టిస్టు చర్చి పాస్టర్ ప్రభుదాస్కు రాష్ట్ర బాప్టిస్టు సంఘాల స్థాయిలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో పాస్టర్లు సాల్మన్రాజు, మీసాల ప్రభుదాస్, డి ఫౌల్, జాన్ మార్క్, గాబ్రియల్, సాయిని జాకబ్, సామ్యూల్ కిరణ్, పుల్లూరు డానియల్, బాబురావు, హజార్య, పూర్ణ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
తేలిన రిజర్వేషన్ల లెక్క
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండుమూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేపట్టింది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా లెక్కించి కేటాయించారు. 2019 ఎన్నికల నాటి రిజర్వేషన్లతో రొటేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను అమలు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ కార్యాలయాల్లో సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశారు. అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, హైకోర్టు రద్దు చేయడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా మార్పు లేకపోగా.. బీసీలకు కేటాయించిన సీట్లు భారీగా తగ్గాయి. అయితే 2019 పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు స్వల్పంగా మూడు స్థానాలు మాత్రమే పెరిగాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో వారం రోజులుగా కలెక్టరేట్లో యంత్రాంగం బిజీబిజీగా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2019 ఎన్నికల సమయంలో అమలైన రిజర్వేషన్ల వివరాలను రెండురోజులుగా అధికారులు సేకరించారు. ఈనెల 21న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, గత ఎన్నికల రిజర్వేషన్లను రొటేషన్ చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా డ్రా పద్ధతిలో కేటాయించారు. తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్ బూత్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకున్నారు. నోటిఫికేషన్ వస్తే పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు. రిజర్వేషన్ల కేటాయింపు ఇలా.. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎస్టీలకు 111 స్థానాలు, ఎస్సీలకు 91, బీసీలకు 68, జనరల్ కేటగిరీకి 216, ఇందులోనే మహిళలకు 215 స్థానాలు కల్పస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా అప్పుడు ఎస్టీలకు 111, ఎస్సీలకు 91, బీసీలకు 177, జనరల్ కేటగిరీకి 107 స్థానాలను కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకపోగా.. బీసీలకు మాత్రం సుమారుగా 109 సీట్లు తగ్గాయి. ఈ మేరకు జనరల్ కేటగిరీ స్థానాలు పెరిగాయి. కాగా 2019 పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఎస్టీలకు 111 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 97, బీసీలకు 65, జనరల్కు 202 స్థానాల చొప్పున రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే సారి జిల్లాలోని చివ్వెంల, పాలకవీడు మండలాల్లో బీసీలకు ఒక్క సీటు కేటాయించలేదు. హుజూర్నగర్, నడిగూడెం మండలాల్లో ఎస్టీలకు ఒక్కస్ధానం రిజర్వేషన్లో దక్కకపోవడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈసారి బీసీలకు 3 స్థానాలు పెరగ్గా ఎస్సీలకు 6 స్థానాలు తగ్గాయి. ఇక జనరల్ కేటగిరీకి 14 స్థానాలు పెరిగాయి. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు ఫ బీసీలకు మొత్తం 68 స్థానాలు ఫ గత ఎన్నికల కంటే 3 స్థానాలు అధికం ఫ ఎస్సీలకు తగ్గిన ఆరు స్థానాలు ఫ జనరల్కు 14 స్థానాలు పెరుగుదల ఫ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కసరత్తు ఫ రొటేషన్ పద్ధతిలో కేటగిరీ వారీగా కేటాయింపుసర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఏవైనా రిజర్వేషన్లు మారాయా..? అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్లు తీయడంతో దాదాపు అందరికీ రిజర్వేషన్లు సైతం తెలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది. డివిజన్ పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ సూర్యాపేట 249 73 46 27 103కోదాడ 91 09 19 20 43హుజూర్నగర్ 146 29 26 21 70మొత్తం 486 111 91 68 216 -
28న భగవద్గీత ప్రతిభా పోటీలు
సూర్యాపేట : గీతా జయంతిని పురస్కరించుకుని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి పాఠశాల విద్యార్థులకు ఈనెల 28న జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో భగవద్గీత ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు నిర్దేశించిన 10 భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయాలని, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు భగవద్గీతలోని 1 నుంచి 6 అధ్యాయాలపై ప్రతిభా పరీక్షకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనేవారు 25 తేదీ లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని, పూర్తి వివరాలకు 9848749022 మొబైల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిసూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తోందని, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి–65 కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా రోడ్లు దాటాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహన నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయొద్దన్నారు. ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా 43 రోడ్డు ప్రమాద నివారణ కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హుజూర్నగర్కు రెండు కోర్టులు మంజూరుహుజూర్నగర్ : హుజూర్నగర్కు నూతనంగా రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 142 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల మంజూరుకు సహకరించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయనతోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వీటి ఏర్పాటుతో హుజూర్నగర్లో న్యాయస్థానాల సంఖ్య ఆరుకు చేరింది. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలి చివ్వెంల : ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేటలో సబ్ జైలును సందర్శించి మా ట్లాడారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్కుమార్, జైలు సూపరింటెండెంట్ బి.సుధాకర్రెడ్డి, న్యాయవాదులు కట్ట సుధాకర్, బానోతు మంగునాయక్, భావ్సింగ్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థి ఆధార్ అప్డేట్ చేయాలి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని అన్ని పాశాలల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన మండల ఆపరేటర్లకు నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలానికి ఒక ఆపరేటర్ను ఎస్ఎన్ఆర్ ఏజెన్సీ ద్వారా నియమించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,532 విద్యార్థుల ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆపరేటర్లకు పాఠశాలల వారీగా ఉన్న వివరాలను ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రవణ్ కుమార్, సూర్యనారాయణ, ఇ–డిస్ట్రిక్ట్ మేనేజర్ గఫార్ అహ్మద్, జిల్లా టెక్నికల్ పర్సన్ శ్రీధర్, ఆపరేటర్లు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
ముగిసిన బాలోత్సవ్
కోదాడ: బాలల వికాసానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సంఘం దివంగత నేతడు బజ్జూరి నర్సిరెడ్డి జ్ఞాపకార్థం నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోదాడ పబ్లిక్క్లబ్ ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకుబహుమతులు అందజేశారు. నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు పప్పుల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకుడు సుంకరి భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు, కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్, బజ్జూరి వెంకట్రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, సాదె లక్ష్మీనారాయణ, కీతా వెంకటేశ్వర్లు, బజ్జూరి భాస్కర్రెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు అన్నారు. శనివారం బేటి పడావో–బేటి బాచావో కార్యక్రమంలో భాగంగా మున్యానాయక్ తండాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ మంగతాయమ్మ, మండల వైద్యాధికారి భవాని, సిబ్బంది నాగరాజు, వినోద్ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
సూర్యాపేట : స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండలో నిర్వహించిన క్రికెట్ సెలక్షన్స్లో జిల్లా కేంద్రానికి చెందిన ఎంఎస్కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 12 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో అండర్–14 విభాగంలో జిల్లేపల్లి కనిష్క్, యర్రంశెట్టి రిశాంక్, కౌశిక్, తరుణ్, అండర్–16 విభాగంలో ఆహిల్ పాల్, అఖిలేష్ యాదవ్, కుశ్లేశ్వర్, అండర్–19 విభాగంలో విష్ణు, శివ, ధనుష్ పుష్కర్ ఎంపికయ్యారు. అలాగే, అండర్–17 విభాగంలో పల్లవి ఎంపికై నట్టు అకాడమీ హెడ్ కోచ్ షేక్ ఉస్మద్ తెలిపారు. -
అస్తవ్యస్తం.. అగమ్యగోచరం!
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పనిచేయిస్తున్నాం. సిబ్బంది, వాహనాల కొరత వల్ల కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సెగ్రిగేషన్ షెడ్ వద్ద రెండు కొత్త ట్రాక్టర్లను ఎందుకు ఉంచారో మాకు తెలియదు. వాటిని మాకు అప్పగించలేదు. – ఎం.సురేష్, శానిటరీ ఇన్స్పక్టర్, కోదాడ మున్సిపాలిటీ కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పరిస్థితి అస్తవ్యస్తంగా.. అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 80 వేల జనాభా ఉన్న పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పెను సవాలుగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కొరతతో ఇంటింటి చెత్త సేకరణ నాలుగైదు రోజులకు ఒకసారి చేయడమే గగనమైపోతుంది. మరోపక్క లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొత్త వాహనాలను మూలన పడేశారు. మున్సిపాలిటీలో ఎన్ని వాహనాలున్నాయి..? ఎన్ని పనిచేస్తున్నాయి...? రిపేర్కు ఇచ్చిన వాహనాలు ఎన్ని అనే లెక్కలే అధికారుల వద్ద లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగం సిబ్బందితో సతమతం.. కోదాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 35 వార్డులున్నాయి. వార్డుకు ఐదుగురు సిబ్బంది, ఒక వాహనం, ఒక డ్రైవర్ చొప్పున ఆరుగురు పారిశుద్ధ్య విభాగానికే ఉండాలి. కానీ, ప్రస్తుతం సగం వార్డులకు ఇద్దరు.. సగం వార్డులకు ముగ్గురు చొప్పున మాత్రమే సిబ్బంది ఉన్నారు. 35 చెత్త సేకరణ ఆటోలు కావాల్సి ఉండగా కేవలం 18 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని తరచూ రిపేర్కు వస్తున్నాయి. రిపేర్కు వెళ్లిన వాహనాలు మళ్లీ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. గతంలో బ్యాటరీతో నడిచే ఐదు ఆటోలను మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అవి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో మున్సిపాలిటీ అధికారులే చెప్పలేక పోతున్నారు. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి ఎనిమిది ట్రాక్టర్లు అవసరం కాగా ప్రస్తుతం నాలుగే పనిచేస్తున్నాయి. రెండు కొత్త ట్రాక్టర్లను రూ.16 లక్షలు పెట్టి కొనుగోలు చేసి సెగ్రిగేషన్ షెడ్లో పడేశారు. అక్కడెందుకు పెట్టారంటే మాకు తెలియదని.. మాకు అప్పగించలేదని శానిటేషన్ అధికారులు అంటున్నారు. సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉన్నా.. మున్సిపాలిటీలో పాలన గాడితప్పడంతో ఎవరిని ఎవరూ అజమాషీ చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నారని 70 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నారు. వీరి నియామకం కోసం కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో రెండేళ్ల తర్వాత వారిని తొలగించారు. దీంతో అప్పటి నుంచి ఉన్న అరకొర సిబ్బందితో పనిచేయిస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి మరో వంద మంది కార్మికులను పెట్టుకొనే వెసులుబాటు ఉన్నపటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. విచిత్రమేమిటంటే పనిచేసే వారికంటే పని చేయిస్తామని చెప్పుకొనే జవాన్ల సంఖ్య పెరిగి పోయింది. మరి కొందరు మున్సిపాలిటీ నుంచి వేతనం తీసుకుంటూ నేతలు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లలో సేవకులుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ యంత్రాంగం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి రోజూ ఇంటింటా చెత్తను సేకరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కోదాడ పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం ఫ నాలుగు రోజులకు ఒకసారి ఇంటింటి చెత్త సేకరణ ఫ పనిచేసేవారు తక్కువ.. చేయించేవారు ఎక్కువ ఫ వాహనాల కొరతతోనూ సతమతం ఫ మూలనపడిన కొత్త వాహనాలు పారిశుద్ధ్య కార్మికులు (అవుట్ సోర్సింగ్) 146 ఎన్ఎంఆర్లు 11 రెగ్యులర్ కార్మికులు 21 చెత్త సేకరణ ఆటోలు 18 ట్రాక్టర్లు 04 జేసీబీ 01 వైకుంఠధామం వాహనం 01 ఈ ఫొటో కోదాడ మున్సిపాలిటీ రెండున్నరేళ్ల క్రితం రూ.16 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్లు. వీటిని ఊరి చివరన ఉన్న సెగ్రిగేషన్ షెడ్డు వద్ద పడేయడంతో నిరుపయోగంగా మారాయి. వీటిని ఎందుకు కొనుగోలు చేశారు..? అక్కడ ఎందుకు ఉంచారు..? అంటే అధికారులు ఆ విషయం మాకు తెలియదంటున్నారు. మరోపక్క వాహనాల కొరతతో పట్టణంలో చెత్త తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ అధికారులే చెప్పడం గమనార్హం. -
ఇ–నామ్.. అమలేది?
తిరుమలగిరి (తుంగతుర్తి) : రైతులు పండించిన పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడి మార్కెట్లోనైనా విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ–నామ్ విధానం నామమాత్రంగానే కొనసాగుతోంది. ఈ విధానం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోక రైతులకు మద్దతు ధర అందడం లేదు. 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇ–నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్) విధానాన్ని తెచ్చింది. దేశంలోని 617 మార్కెట్లను దీని పరిధిలోకి తీసుకొచ్చి ఒక్కో యార్డులో రూ.5 లక్షల వ్యయంతో కంప్యూటర్లు, ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొమ్మిది సంవత్సరాలు దాటినా ఇ–నామ్ యార్డులను జాతీయ సర్వర్తో అనుసంధానించలేదు. ఇప్పటికీ రైతుల పంట ఉత్పత్తులను ఆన్లైన్లో వేరే రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. మొత్తంగా స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండడంతో ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండడం లేదు. కంప్యూటర్ ద్వారా ధరల నిర్ణయం ఒక్కటే మార్పు.. గతంలో మార్కెట్లలోని బీట్లో వేలం ద్వారా వ్యాపారులు ధరలు నిర్ణయించి రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అయితే ఇ–నామ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్ల ద్వారా ధరలు కోడ్ చేస్తున్నారు. ఈ ఒక్క మార్పు తప్పితే ఈనామ్ విధానం వచ్చాక పంట ఉత్పత్తుల ధరల్లో కూడా ఏమాత్రం పెరుగుదల లేకపోవడంతో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. అమలైతే పదిశాతం అధికం ఇ–నామ్ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొందిన వ్యాపారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఏ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసినా సదరు వ్యాపారి తమ ప్రాంతానికే తరలించుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం మార్కెట్ కార్యదర్శి ద్వారా ఆన్లైన్లో చెల్లింపులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యాపారులు పోటీలో ఉంటే కనీసం 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ ఏకీకృత మార్కెట్కు విస్తరిస్తే దూర ప్రాంతాల వ్యాపారులు ఆన్లైన్ ద్వారానే మన దగ్గరి మార్కెట్లలోని ఉత్పత్తులను కొనవచ్చు. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఈ మేరకు అన్ని యార్డులను ఇ–నామ్ సర్వర్కు అనుసంధానించాల్సి ఉంటుంది. జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులను ఇ–నామ్ పరిధిలోకి చేర్చారు. ఇ–నామ్ పరిధిలోకి చేర్చినా స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దూరప్రాంతాలకు చెందిన వ్యాపారులెవరూ ఇక్కడి పంట ఉత్పత్తులను కొనడం లేదు. ఈ విధానంలో ఒక్క వేరుశనగ మాత్రమే వేరే ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెండు మార్కట్లలో ఇ–నామ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తమకు లబ్ధిచేకూరేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం నామమాత్రం ఫ దేశంలో ఎక్కడి నుంచైనా పంట ఉత్పత్తులు కొనేలా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఫ అన్ని మార్కెట్లకు అనుసంధానించని జాతీయ సర్వర్ ఫ స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తున్న పంట ఉత్పత్తులు ఫ రైతులకు చేకూరని ప్రయోజనం -
డీసీసీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల పీసీసీ, ఐఏసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి డీసీసీ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి 12 మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలకులు అధిష్టానానికి ఆరుగురి పేర్లతో కూడిన జాబితా పంపారు. ఇందులో ఎస్సీ(మాదిగ) వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యకు పదవి దక్కింది. అజ్ఞాతం నుంచి రాజకీయాల్లోకి.. నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జన్మించిన నర్సయ్య ప్రాథమిక విద్య స్వాగ్రామంలోనే పూర్తిచేశారు. తుంగతుర్తిలో ఇంటర్, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. గుడిపాటి నర్సయ్య.. కళాశాల స్థాయి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపారు. విప్లవ పార్టీకి ఆకర్షితుడైన నర్సయ్య 1990 నుంచి 1995 వరకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చండ్రా పుల్లారెడ్డి వర్గంలో చేరి అజ్ఞాత జీవితం గడిపారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి సూచనల మేరకు అప్పటి నల్లగొండ ఎస్పీ రవిగుప్త సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా దామోదర్రెడ్డి చెరదీసి జడ్పీటీసీగా అవకాశం కల్పించారు. 2001 నుంచి 2006 వరకు తుంగతుర్తి జడ్పీటీసీగా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2009లో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులయ్యారు. 2009లో తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్కు భీఫామ్ ఇచ్చింది. నర్సయ్య 2014 నుంచి 2018 వరకు టీపీసీసీ సభ్యుడిగా పనిచేశాడు. పార్టీలో చేరిన నాటినుంచి ఇప్పటి వరకు పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. దీంతో అధిష్టానం గుడిపాటి నర్సయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఫ ఐదేళ్లపాటు అజ్ఞాత జీవితం ఫ మాజీ మంత్రి ఆర్డీఆర్ సూచనతో రాజకీయాల్లోకి ఫ తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఫ ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా ఉన్న నర్సయ్య


