breaking news
Suryapet District Latest News
-
చెరువుకు చేప
జిల్లాలోని మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లల అందించేలా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెలలో చెరువుల్లోకి చేపపిల్లలను వదలేలా చూస్తాం. చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు మేలు జరగనుంది. – నాగులునాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి భానుపురి (సూర్యాపేట) : చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 3,41,18,033 చేపపిల్లలను జిల్లాలోని జలాశయాల్లో వదలాలని నిర్ణయించింది. ఈ మేరకు చేప పిల్లల సరఫరాకు గాను ఏజెన్సీ ఎంపిక కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ నెలాఖరునాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదలనున్నారు. అయితే గతంలో టెండర్ల నుంచి పంపిణీ వరకు అన్నీ అక్రమాలే జరిగినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టెండర్లు, పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సాఫీగా జరిగేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు. టెండర్ల దశలో ప్రక్రియ సూర్యాపేట జిల్లాలో 165 మత్స్య సొసైటీలు ఉన్నాయి. ఇందులో 15,540 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించనుంది. ఈనేపథ్యంలో ఈ సారి 621 చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ ఈనెలాఖరు నాటి వరకు కొనసాగనుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు చేపపిల్లలను సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు క్షేత్రస్తాయి పరిశీలనను సైతం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. మూడు రకాలుగా.. జిల్లాలో కాలానుగుణంగా సీజనల్, శాశ్వతంగా నీరు ఉండే చెరువులు కుంటలే కాకుండా జలాశయాలు ఉన్నాయి. వీటిలో ఎంపిక చేసిన చెరువులు, కుంటల్లోనే ఈ ఏడాది చేపపిల్లలను వదలన్నారు. శాశ్వతంగా నీరు ఉండే 188 చెరువులు, కుంటల్లో 80 –100 ఎంఎం సైజ్ ఉన్న చేపపిల్లలు 2,05,51,248 , అదే సైజ్లో ఉండేవి రెండు జలశయాల్లో 37,98,902 చేపపిల్లలను అధికారులు వదలనున్నారు. సీజనల్గా నీరు ఉండే జిల్లాలోని 431 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజ్ గల 97,67,883 చేపపిల్లలను సరఫరా చేసేందుకు ఈ టెండర్లను పిలిచారు. ఈ ఏడాది 3.41కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం ఫ టెండర్లు ఆహ్వానించిన అధికారులు ఫ ఈనెలాఖరుకు ప్రక్రియ పూర్తి ఫ వచ్చేనెలలో పంపిణీకి సన్నాహాలు -
ఫ పర్యావరణ హితం.. మా అభిమతం
సీపీఎస్ను రద్దు చేయాలిఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజ్ డిమాండ్ చేశారు. వచ్చేనెల 1న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు కుమార్, రవీందర్ , చౌదర్ రెడ్డి, రాజశేఖర్, లింగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు మేలు
చివ్వెంల(సూర్యాపేట) : బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం చివ్వెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి బోధన అభ్యసన పరికరాల ప్రదర్శనను సందర్శించారు. మండల వ్యాప్తంగా ఉన్న 37 పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. బోధన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండల స్థాయి ప్రదర్శనలో 1నుంచి 5 వతరగతి వరకు ప్రాధమిక స్ఠాయి బోధన కోసం తయారు చేసిన పరికరాల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ కళారాణి కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ ప్రకాశ్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముగిసిన పదోన్నతుల ప్రక్రియ
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 21న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకాగా మొదటగా అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించేందుకు ఈ నెల 25న రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్జీటీల నుంచి ప్రమోషన్లు పొందిన పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. వెంటనే ప్రమోషన్ పొందిన పాఠశాలలో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. 24 మందికి జీహెచ్ఎంలుగా ప్రమోషన్ జిల్లాలో మొత్తం 24 జీహెచ్ఎంల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ప్రక్రియ కొనసాగించారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్లు కల్పించారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 24 మందికి ప్రమోషన్లు రాగా అందులో నలుగురు ఇతర జిల్లాలకు వెళ్లగా మరో నలుగురు సూర్యాపేట జిల్లాకు వచ్చారు. గెజిటెడ్ హెచ్ఎంలుగా గత గురువారం రాత్రి ఉత్తర్వులు అందుకున్నారు. వీరు వెంటనే ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు. 111 మంది పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి... గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారి ఖాళీ స్థానాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)తో భర్తీ చేసేందుకు పదోన్నతుల ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభించారు. సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్సైట్లో పొందుపరిచి ప్రక్రియ కొనసాగించారు. ఈ నెల 23న ఎస్జీటీల నుంచి వివిధ కేటగిరీలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి జాబితాను ప్రదర్శించగా, ఈ నెల 24, 25, 26 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులకు కసరత్తు కొనసాగింది. జిల్లాలో మొత్తం 111 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంలు 24 పీఎస్ హెచ్ఎంలు 28 ఎస్ఏ(బయోసైన్స్) 17 ఎస్ఏ(ఇంగ్లిష్) 13 ఎస్ఏ(మ్యాథ్స్) 13 ఎస్ఏ(ఫిజికల్ ఎడ్యుకేషన్) 05 ఎస్ఏ(ఫిజికల్ సైన్స్) 05 ఎస్ఏ(సోషల్) 30ఫ జిల్లాలో 24 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా ప్రమోషన్ ఫ 111 మంది ఎస్జీటీలకు ఎస్ఏలు, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి ఫ వెంటనే జాయిన్ కావాలని ఆర్డర్లు ఇచ్చిన డీఈఓ -
‘స్థానిక’ ఎన్నికల కసరత్తు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. జిల్లాలో 6,92,511 మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల్లో 6,92,511 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,39,857 మంది, మహిళలు 3,52,633 మంది ఉన్నారు. మరో 21 మంది ఇతరులు నమోదయ్యారు. 4388 వార్డులు ఉండగా 4,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం వచ్చేనెల 2 నాటికి తుది జాబితా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై తుది జాబితాలు రూపొందించాలని ఎన్నికల సంఘం డీపీఓలను ఆదేశించింది. ఈ మేరకు 28వ తేదీలోపు గ్రామపంచాయతీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించాల్సి ఉంది. అలాగే 29న జిల్లాస్థాయిలో ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 30న మండల స్థాయిలో పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈనెల 31 నాటికి తొలగించి, వచ్చే నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ జాబితాను ప్రకటించనుంది. ఫ తుది ఓటరు జాబితా విడుదలకు నోటిఫికేషన్ ఫ 29న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఫ వచ్చే నెల 2న ఫొటో ఓటరు జాబితా ప్రకటన -
ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాం
నల్లగొండ టూటౌన్: ఎన్సీసీ శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణ, దేశభక్తి సమ్మిళితమైన ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తామని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడేట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో ప్రవేశానికి 60 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎత్తు, బరువు, ఆరోగ్యం, రాత పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఎన్సీసీ ద్వారా నేషనల్ డిపెన్స్ అకాడమీ, అగ్నివీర్ లాంటి పథకాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి డాక్టర్ మశ్చేందర్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.సుధారాణి, కొమ్ము మల్లయ్య, చంద్రవీర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణచివ్వెంల(సూర్యాపేట): కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీకాంత్పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
పవిత్ర మేడమ్ స్ఫూర్తితో..
బోధన తీరుతో స్ఫూర్తి పొందా.. సూర్యాపేటలోని ఎంఎస్ఆర్ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్ ప్రైవేట్ లెక్చరర్గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – రాసమళ్ల సికిందర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు పెన్పహాడ్: పెన్పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.స్కాలర్షిప్కు ఎంపికయ్యా.. నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. – ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులుసంతోషంగా ఉంది ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్ పవిత్ర మేడమ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. – ఎం. మేఘన 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రాక్టికల్ విధానంలో బోధన చూసి.. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్ ప్రాక్టికల్ విధానంలో సైన్స్ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్లోని కులీ కుతుబ్షా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్ నుంచే నేర్చుకున్నాను. – ప్రవీణ్కుమార్, పాలిటెక్నికల్ లెక్చరర్జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది పవిత్ర గైడెన్స్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో వీడర్ అండ్ సీడర్ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. – బి. శ్రీశాంత్, 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా సైన్స్ ఫెయిర్లో అవార్డు దక్కింది నేను తయారు చేసిన క్రాప్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్ఫెయిర్లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. – శ్వేత 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడేనికి చెందిన చిర్ర బాలరాజు(55) హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలునాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరీ మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్గా, తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం షఫీ పాఠశాల వెనుక గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో కుక్కలు అతడిపై దాడి చేశాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేయగా.. అతడిపై కూడా కుక్కలు దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి. -
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: రాత్రి వేళ కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్కుమార్, మట్టి సురేష్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నాగర్ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్రెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ, నార్కట్పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు. రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం బాపూజీనగర్కు వచ్చారు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్షరను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
విహారం కావొద్దు విషాదం
● సాగర్ సందర్శనకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన ● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక ● సూచిక బోర్డులు, ట్రంచ్ల ఏర్పాటునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు.. పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం , పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, కంబాల మురళినాయుడు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతె: మోతె మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 1.200 కేజీ గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన యువకుడు, తన స్నేహితులతో కలిసి భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి మోతె మండలానికి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ అజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని రత్నాలకుంట ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 1.200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పట్టణాల్లో దోమల మోత
సూర్యాపేట అర్బన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించిన వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీరు నిలువ ఉండడంతో దోమల బెడదతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలని ఆదేశాలున్నా పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దోమలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ● సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో 1,53000 జనాభా ఉంది. అంతర్గత రహదారుల్లో ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు బురద పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడద ఎక్కువైంది. ఖాసీంపేట, దురాజ్పల్లి, పిల్లలమర్రి, ఇందిరమ్మ కాలనీ, అంజరాపురి కాలనీల్లోని ఖాళీ ప్లాట్లలో నీరు నిలవడంతో దోమలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 15 రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మూడు యంత్రాలు 48 వార్డుల్లో ఫాగింగ్ చేయడానికి సరిపోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ● కోదాడ మున్సిపాలిటీలోని నయా నగర్, అనంతగిరి రోడ్డు, భవాని నగర్, షిరిడీ సాయి కాలనీ, శ్రీమన్నారాయణ కాలనీ, 41వ వార్డులోని ఖాళీ స్థలాల్లో వర్షం నీరు నిల్వ ఉండి దోమల వృద్ధి చెంది స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో నాలుగు ఫాగింగ్ మిషన్లు ఉన్నా ఒకటే పని చేస్తోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా ఫాగింగ్ చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● తిరుమలగిరి మున్సిపాలిటీలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. నాలుగు ఫాగింగ్ యంత్రాలు పనిచేస్తున్నా అధికారులు పట్టణంలో ఫాగింగ్ చేయడంలో ఆలస్యం వహిస్తున్నారని పేర్కొంటున్నారు. ● హుజూర్నగర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ కాలనీ, గోవిందాపురం, మట్టపల్లి బైపాస్ రోడ్డు, చెరువు కాలనీలో పలు చోట్ల ఖాళీ ప్లాట్లలో మురుగు నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. హుజూర్నగర్లో రెండు ఫాగింగ్ మిషన్లు ఉన్నా సమయానికి ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● వర్షం వచ్చినప్పుడు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ని ఎన్టీఆర్ నగర్, నర్సయ్య గూడెంలో వరద నీరు నిలిచి ఆయా ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది స్థానికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రెండు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా.. సరైన సమయంలో ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఫ ఐదు మున్సిపాలిటీల్లో వందరోజుల ప్రణాళిక తర్వాత కూడా పారిశుద్ధ్య నిర్వహణ అంతంతే ఫ ఫాగింగ్ను విస్మరించిన అధికారులు ఫ ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలని ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు సూర్యాపేట పట్టణంలో మురుగు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. మురుగునీరు నిలిచే ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. – హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట -
ఇన్సై్పర్ మనక్పై అనాసక్తి!
తిరుమలగిరి( తుంగతుర్తి ): విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల వైపు మళ్లించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని శాస్త్ర, సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతియేటా ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది. దీనికి జిల్లాలో ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. గతనెల 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతేడాది 676 దరఖాస్తులొస్తే ఈసారి ఇప్పటి వరకు 126 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సెప్టెంబరు 15వ తేదీ లోగా ప్రాజెక్టులను ఆన్లైన్లో నామినేట్ చేయడానికి అవకాశముంది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు ఇన్స్పైర్ మనక్కు సంబంధించి గత నెలలో అప్లోడ్ ఎలా చేయాలో సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. దరఖాస్తు చేయించేందుకు మండల స్థాయిలో సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఆన్లైన్లో నమోదు ఇలా.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించేందుకు గడువు ఉంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ఉన్నత పాఠశాల నుంచి ఐదు, యూపీఎస్ నుంచి మూడు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్లో భాగంగా విద్యాలయాల వివరాలు పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి వాటికి ఆమోదం లభించిన తర్వాత ఈమెయిల్ ఐడీ, లింకు లభిస్తాయి. వాటి సాయంతో పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. అనంతరం ప్రాజెక్టు నమూనాకు సంబంధించి పూర్తి వివరాలు అప్ లోడ్ చేయాలి. ఫ ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించింది 126 మంది మాత్రమే ఫ గతనెల 1న ప్రక్రియ ప్రారంభం కాగా.. వచ్చేనెల 15న ముగియనున్న గడువు ఫ ఇప్పటికే మండల స్థాయిలో సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు ఫ దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా కనిపించని ఫలితం ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావిశాస్త్రవేత్తలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి ఉన్నత పాఠశాలలు: 184 ప్రాథమికోన్నత పాఠశాలలు : 84జూనియర్ కళాశాలలు : 08 డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, సమా జాభివృద్ధి– క్లీన్ ఇండియా తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై న నమూనాను ప్రదర్శించడానికి రూ.10 వేలను ప్రోత్సాహకంగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై తే వాటిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయస్థాయికి ఎంపికై న నమూనాల రూపకర్తలకు ప్రభుత్వం పేటెంట్ హక్కు కల్పిస్తుంది. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను మరింత మెరుగైన విధంగా తయారు చేయడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మరో రూ.25 వేలు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్లో అభినందనలు, అతిథ్యంతోపాటు పేరొందిన శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జపాన్ వరకు వెళ్లి నోబెల్ శాస్త్రవేత్తలను కలుసుకునే సువర్ణావకాశం లభిస్తుంది. -
అనుమతులు రద్దు చేయడం అప్రజాస్వామికం
సూర్యాపేట అర్బన్ : వరంగల్లో ఆదివాసీల హక్కుల వేదిక, ప్రజా సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయడం అప్రజా స్వామికమని ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భద్రయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే సభకు అనుమతులు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో వెంకటయాదవ్, మాధవరెడ్డి, లింగయ్య, సత్యనారాయణ, నరసయ్య, నాగయ్య, పిడమర్తి భరత్, దేశోజు మధు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరణ కోదాడరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీ ఎల్ఐసీ ఆఫీస్ వీధిలో నివాసముంటున్న చిన్నపిల్లల వైద్యుడు చింతలపాటి శ్రావణ్కుమార్ కోదాడ పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. శనివారం హాస్పిటల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో రాత్రి శ్రావణ్కుమార్ అక్కడే ఉండిపోగా.. అతడి భార్య పిల్లలను తీసుకుని సూర్యాపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రావణ్కుమార్ తాళం పగులగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంనల్లగొండ: నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో మార్బుల్ షాపు వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడు నలుపు రంగు చొక్కా, గళ్ల లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70141 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేసే విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరణకు గురవుతారని పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు నమోదై వారి విద్య, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వార్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్షాప్లు నిరంతరంగా నిర్వహించాలని తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు ఎదురైతే బాధితులు తక్షణమే ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యం లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు. ర్యాగింగ్ సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్ను పూర్తిగా నిర్మూలించడానికి విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. సూర్యక్షేత్రంలో పూజలు అర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, బాలమురళీకృష్ణ, బీరవోలు ఇంద్రారెడ్డి, రత్నం లక్ష్మాజి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల వేళల్లో మార్పు అర్వపల్లి : సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై నడుస్తున్న ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల వేళల్లో ఆర్టీసీ అధికారులు మార్పులు చేశారు. ఉదయం 5గంటలకు సూర్యాపేట డిపో నుంచి మొదటి ఎలక్ట్రికల్ బస్సు మొదలవుతుంది. ఆతర్వాత ఉదయం 6.30, 7.30, 10.50, 11.50, మధ్యాహ్నం 12.50 గంటలకు బస్సులు బయలుదేరి అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూర్, భువనగిరి, ఉప్పల్ల మీదుగా హైదరాబాద్కు వెళ్తాయని ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సైదులు తెలిపారు. ఇవే బస్సులు ప్రతి రోజు హైదరాబాద్లోని జేబీఎస్ నుంచి ఉదయం 5గంటలకు, 6.00, 7.00 గంటలకు, సాయంత్రం 3.15 గంటలకు, 4.30, 5.30 గంటలకు బయలుదేరి ఇదే రూట్లో తిరిగి సూర్యాపేట డిపోకు చేరుతాయని చెప్పారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. -
అసలేం జరిగింది..!
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పిన అధికారులు.. ఆదివారం మాత్రం రియాక్టర్ లీకై మంటలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోని ద్వారకామయి ప్రొడక్షన్ బ్లాక్లో వారం రోజుల క్రితం పాత రియాక్టర్ను తీసి దాని స్థానంలో కొత్తది బిగించినట్లు కార్మికులు చెబుతున్నారు. దీనితో పాటు మరో రియాక్టర్ మార్చాల్సి ఉండగా.. దానిని మార్చలేదు. మార్చని రియాక్టర్ నుంచే రసాయనాలు లీక్ కావడంతో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. మంటలు వచ్చిన సమయంలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్చారి అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను అప్రమత్తం చేయగా.. వారు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల దాటికి రియాక్టర్లకు ఉన్న దూది కోటింగ్ కాలిపోయింది. ఓ రియాక్టర్ కిందపడిపోయింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో రియాక్టర్లు పేలలేదు. లేదంటే ప్రమాదం తీవ్రత భారీగా ఉండేది. ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రొడక్షన్ బ్లాక్ను ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రొడక్షన్ ఇన్చార్జిగా ఉన్న మధుసూదన్చారిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ లేదు.. శనివారం రాత్రి ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో రియాక్టర్లోని రసాయనాలు లీకై చిన్నగా మంటలు వస్తున్నాయని సమాచారం రావడంతో చౌటుప్పల్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పూర్తిస్ధాయిలో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని గతంలోనే యాజమాన్యాలకు సూచించామని, కానీ ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో ఇంతవరకు పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సరైన ఫైర్ సేఫ్టీ లేక ఫైరింజన్తో పాటు దివీస్ పరిశ్రమ నుంచి మంటలను అదుపుచేసే రసాయనాలను తీసుకొచ్చి త్వరగా మంటలను అదుపు చేయగల్గినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి కారణాన్ని అంచనా వేయలేకపోతున్నాం.. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇప్పటికిప్పుడే అంచనా వేయలేకపోతున్నామని పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఎస్. జంగయ్య తెలిపారు. పరిశ్రమ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నుంచి నివేదిక వచ్చిన తర్వాత నిర్ధారణకు వస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు రియాక్టర్ లీకై ప్రమాదం జరిగిందని సమాచారం అందిందంటున్న అగ్నిమాపక అధికారులు షార్ట్ సర్క్యూటే కారణమంటున్న కంపెనీ సిబ్బంది మంటల వల్ల వెలువడిన రసాయనాలతో వాడిపోయిన పంట పొలాలు ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ను సందర్శించిన ఉమ్మడి జిల్లా పరిశ్రమల ఇన్స్పెక్టర్ పరిశ్రమలో పూర్తిస్థాయి ఫైర్ సేఫ్టీ లేదంటున్న జిల్లా అగ్నిమాపక అధికారివాడిపోయిన పంట పొలాలు.. మంటల ధాటికి రియాక్టర్లలోని రసాయనాలు ఎగిసిపడడంతో పరిశ్రమ చుట్టుపక్కల గల జైకేసారం గ్రామానికి చెందిన పలువురు రైతులు వరి, జొన్న పంటలు వాడిపోయాయి. దీంతో పాటు రామన్నపేట వెళ్లే రోడ్డుపై కెమికల్ పడి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని పంట నష్టపోయిన రైతులు పరిశ్రమ యాజమాన్యాన్ని కోరినట్లు సమాచారం. -
రాత్రి అయితే దోమలతో జాగారమే..
సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీలో ఖాళీ ప్లాట్లలో వర్షం నీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు చుట్టుపక్కల ఇళ్లలోని వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కాలనీలో పలువురు జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరారు. – కనకటి రవి, స్నేహనగర్ కాలనీవర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద అధికమైంది. ఇప్పటి వరకు కోదాడలో దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇళ్ల మధ్య మురుగునీరు నిలవడం ప్రధాన సమస్యగా ఉంది. ఫాగింగ్ చేసి దోమల బెడదను నివారించాలి. – ఈదుల కృష్ణయ్య, కోదాడ -
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
నకిరేకల్: గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న ఆరుగురిని నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నకిరేకల్ సీఐ వెంకటేష్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణ శివారులోని తాటికల్ రోడ్డులో కుమ్మరిబావి దగ్గరలోని చెట్ల పొదల్లో శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేసి సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ గంజాయి దందాలో మొత్తం ఎనిమిది ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి రూ.32,500 విలువ చేసే 1.290 కిలోల గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురిలో నకిరేకల్లోని తాటికల్ రోడ్డు వాసి యన్నమల్ల సాయిరాం, నల్లగొండలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన బోరిగం సంపత్కుమార్, నకిరేకల్లోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన ముక్కాముల అఖిల్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పల్లెబోయిన శివ, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన బండారి వినయ్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన కుంచం నవీన్తో పాటు ఓ బాల నేరస్తుడు ఉన్నారు. నల్లగొండకు చెందిన సమీర్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వీరాంతా కలిసి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసు విచారణ చేస్తున్నామని సీఐ వెల్లడించారు. స్థానిక ఎస్ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి, పోలీస్ సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కె. జనార్దన్, బి. మధుకర్, వి. సురేష్, డి. శ్రీకాంత్, ఎం. నాగర్జున్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించినట్లు తెలిపారు. 1.290 కిలో గంజాయి, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం -
నేడు, రేపు ఎన్జీ కాలేజీలో జాతీయ సదస్సు
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ కాలేజీ)లో సోమవారం, మంగళవారం శ్రీసుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జీవశాస్త్రాల పాత్రశ్రీ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు ఎం. అనిల్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు రామాచారి పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు సదస్సుకు హాజరుకావాలని కోరారు. కెనడాలో యాదగిరీశుడి కల్యాణం యాదగిరిగుట్ట: కెనడా దేశంలోని విండ్సర్ నగరంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానంతో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు విండ్సర్ నగరంలో సంప్రదాయ పద్ధతిలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజవెల్లి రఘు ఆధ్వర్యంలో జరిపించారు. ఈ వేడుకకు విండ్సర్ నగరం ఎంపీ అండ్ర డోవి, ఎంపీపీ అర్బెగిల్తో పాటు స్థానిక ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్ రఘునందన్, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ వెంకట్రావ్లు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూలను, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఆత్మహత్య దేవరకొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాటికోల్ గ్రామానికి చెందిన నాయిని భాస్కర్(55) గ్రామంలో ఫర్టిలైజర్, కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా భాస్కర్ నిర్వహిస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తెల్ల వారుజామున ఫర్టిలైజర్ దుకాణంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
కనువిందు చేస్తున్న రాచకొండ వాటర్ ఫాల్స్
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయపురం మండల పరిధిలోని రాచకొండ అటవీ ప్రాంతంలో పల్లగట్టుతండా, గంగమూలతండా పరిధిలో వాటర్ ఫాల్స్ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలకు రాచకొండ గుట్టల్లో నుంచి జాలువారుతున్న నీరు మల్కాచెర్వు, గంగకుంటలోకి వస్తున్నాయి. గుట్టలు, చెట్ల మధ్యలో నుంచి జాలువారే నీటిని చూసేందుకు ఆదివారం పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. యువకులు నీటిలో ఈత కొడుతూ ఆనందంగా గడిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు పర్యాటకులను హెచ్చరిస్తూ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
అట్టపెట్టెల మాటున మూగజీవాల రవాణా
చౌటుప్పల్ రూరల్: అట్టపెట్టెల మాటున మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంత నుంచి 12 ఆవు దూడలు, 21 ఎద్దు దూడలను కొనుగోలు చేసి గూడ్స్ వాహనంలో హైదరాబాద్లోని బహదూర్పురా కబేళాకు తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ పెద్దపూడి అప్పలకుమారస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఐదు ఎద్దులు.. నాలుగు ఆవులుచౌటుప్పల్: కోదాడ సంతలో కొనుగోలు చేసిన ఐదు ఎద్దులు, నాలుగు ఆవులను గూడ్స్ ఆటోలో హైదరాబాద్కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. కోదాడ ప్రాంతంలోని జగన్నాయక్ తండాకు చెందిన వాహనం డ్రైవర్ బానోతు సురేందర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు. పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు -
‘నవోదయ’ పనులు త్వరగా పూర్తిచేయాలి
సూర్యాపేట, కోదాడ : కోదాడలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయం భవన నిర్మాణ పనులు సంవత్సరంలోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. భవన నిర్మాణం, పురోగతిపై ఆదివారం హైదరాబాద్లో ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానుండగా పనులు సంవత్సరం లోపు పూర్తి చేసేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. క్యాంపస్ వాతావరణం ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు కోసం కేటాయించిన 19 ఎకరాల స్థలాన్ని విద్యా భవనాలు, హాస్టళ్లు, సిబ్బంది క్వార్టర్ల కోసం సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. ప్రతి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎన్వీఎస్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎన్బీసీసీ హైదరాబాద్ డీజీఎం అబ్దుల్ రహీం పాల్గొన్నారు. ఫ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
కాటేపల్లిలో టైర్ల కంపెనీ తొలగించే వరకు పోరాటం
పంజగుట్ట: ప్రపంచంలో అత్యంత వేగంగా కాలుష్యం పెరుగుతున్న దేశం భారతదేశమని, ఇప్పటికే ఢిల్లీ నాశనమైందని, కాలుష్యం వచ్చే పరిశ్రమలకు పాలకులు అనుమతులు ఇస్తూ హైదరాబాద్ను ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాటేపల్లిలోని టైర్ల కంపెనీల కాలుష్యంపై అఖిలపక్ష సమావేశం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సమాజం కోసం దేశంకోసం పాటుపడేవారు, త్యాగాలు చేసే వారు నాయకులుగా ఉండేవారని, కానీ ఇప్పుడు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తూ, రాజకీయాన్ని వ్యాపారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులకు ఏదైనా తెలియనప్పుడు సమాజంలో నిస్వార్థంగా ఆలోచించే మేధావులు ఎంతో మంది ఉన్నారని, వారి సలహాల ప్రకారం చేయాలి కానీ వారి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు కాలుష్యం వచ్చే పరిశ్రమలు మాకు వద్దు అంటుంటే ఆ సంస్థలను భారత్కు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటేపల్లి గ్రామం మొత్తం ఐక్యం కావాలని, వారికి తాము అండగా ఉంటామని ప్రజా ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రొఫెసర్ బాబూరావు మాట్లాడుతూ.. కాటేపల్లి పారిశ్రామిక ప్రాంతం కాదని, కానీ అక్కడ టైర్ల కంపెనీకి అనుమతులు ఇచ్చారంటేనే మన కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో అర్థం అవుతుందన్నారు. సదరు కంపెనీ ముందు బోర్డు కూడా లేదని, ఇటీవల సియాచీన్ కంపెనీలో 50 మంది చనిపోయారని, ఏదైనా ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ.. కాటేపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల మధ్య ఊరికి దగ్గరగా రెండు టైర్ల రీసైక్లింగ్ కంపెనీలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. దాని యజమాని మార్వాడీ, కానీ మన వారిని కొంతమందిని పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. సమావేశంలో విఠల్, రఘు, సుభాష్, జలంధర్, శ్రీనివాస్, వెంకట్, అరుణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ -
బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహల నిర్మూలనకు ఏవిధంగా కృషి చేస్తున్నారని వారికి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూఓ రమణారావు, డీసీపీఓ రవికుమార్, ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ‘అగ్రి’ కళాశాలకు భూములు ఇవ్వంహుజూర్నగర్ : వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు తాము సాగుచేసుకుంటున్న భూములు ఇవ్వబోమని పలువురు రైతులు స్పష్టం చేశారు. హుజూర్నగర్ పట్టణ శివారులోని మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్లో గల వ్యవసాయ భూమి వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుమందుల డబ్బాలతో పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్లో గల వ్యవసాయ భూమిలో అగ్రికల్చరల్ కాలేజీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో 1041 సర్వే నంబర్ భూమిని సాగుచేసుకుంటున్న రైతులు పాల్గొన్నారు. -
పరిష్కారం అరకొరే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో సమస్యలు అరకొరగానే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు.. పరిష్కారానికి పొంతన లేదు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో పరిష్కారానికి అనుకూలంగా లేనివే అధికంగా ఉండటంతో వాటి పరిష్కారానికి తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అధిక దరఖాస్తులు పరిష్కరించిన జిల్లాల్లో నల్లగొండ ముందు స్థానంలో ఉండటం గమనార్హం. పరిష్కారానికి సిద్ధంగా 8,384 దరఖాస్తులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో పావలావంతు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,02,768 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 3,996 దరఖాస్తులను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించగలిగారు. పరిష్కారానికి సిద్ధంగా మరో 8,384 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని తహసీల్దార్లు వారి స్థాయిలో పరిశీలించి.. ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్లకు పంపించారు. వారి లాగిన్ నుంచి అప్లోడ్ చేస్తే ఆయా దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. సమస్యల పరిష్కారంలో ఎన్నో అడ్డంకులు భూ సమస్యలు పరిష్కరించే విషయంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లకు తంటాలు తప్పడం లేదు. సాదాబైనామా విషయం కోర్టులో ఉండటంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీఓటీ) పరిధిలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. మిగిలిన టీఎం 33 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ఇందులో పౌతిల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తహిసీల్దార్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోర్టు కేసులు, ఇతర భూ సమస్యలకు సంబంధించి మొండి కేసులే అధికంగా ఉండటంతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొందరికి భూమి ఉండి కాగితాలు లేవు. అలాంటి వాటి విషయంలో పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ భారతి దరఖాస్తులకు కలగని మోక్షం ఫ క్షేత్రస్థాయిలో కుస్తీలు పడుతున్న తహసీల్దార్లు ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 1,02,768 ఫ వాటిలో 3,996 అప్లికేషన్లకే మోక్షం ఫ అయినా పరిష్కారంలో నల్లగొండ జిల్లానే ముందంజ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. భూ భారతిలో వాటిని పరిష్కరించే క్రమంలో అధికంగా నల్లగొండ జిలాల్లోనే 2,633 దరఖాస్తులు పరిష్కరించారు. తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం దరఖాస్తులు 61,145 వచ్చాయి. వాటిల్లో పరిష్కారమైంది 99 మాత్రమే. నల్లగొండ జిల్లాలో 43,545 దరఖాస్తులు వస్తే అందులో 2,633 దరఖాస్తులు పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా దరఖాస్తులు పరిష్కరించినవి నల్లగొండ 43,545 2,633సూర్యాపేట 44,741 551యాదాద్రి 14,482 812 మొత్తం 1,02,768 3,996 -
డెంగీ పంజా..
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025పార్వతి తనయ.. ముస్తాబు చేస్తుంటిమయాసూర్యాపేటటౌన్ : డెంగీ పంజా విసురుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెలలోనే 15 డెంగీ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కురిసి దోమలు వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరంతో ఆస్పత్రుల బాట జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. అపరిశుభ్ర పరిసరాలతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విష జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ(ఔట్పేషెంట్ల) సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు(ఈ నెల)లోనే 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవి వైద్యాధికారులు గుర్తించినవి మాత్రమే. ఇంకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకునే వారిలో కేసులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కిట్లు అందుబాటులో ఉన్నా.. డెంగీని నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిట్లు అందుబాటులో ఉన్నా పరీక్షలు మాత్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో అత్యధికంగా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50కి పైగా డెంగీ కేసులు ఫ ఈ నెలలోనే అత్యధికంగా 15 కేసులు ఫ డెంగీతో పాటు వైరల్ ఫీవర్ ఫ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం ఫ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచననమోదైన డెంగీ కేసులు జనవరి నుంచి జూన్ వరకు 30 జూలై 05 ఆగస్టు 15 ఈ ఫొటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు ధరావత్ హర్ష. సొంతూరు చివ్వెంల మండలం మున్యానాయక్ తండా. ఇతడు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించారు. జ్వరం తగ్గిందనుకొని ఈనెల 21న స్కూల్కు వెళ్లాడు. మధ్యాహ్నానికి జ్వరం తీవ్రత పెరగడంతో మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. హర్షను చివ్వెంల పీహెచ్సీలో శనివారం పరీక్షలు చేయించగా డెంగీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రజలు ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆ పరిసరాల్లోని 50 ఇళ్ల కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తాం. చుట్టు పక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. గ్రామాల్లో ప్రతి శుక్రవారం ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నారు. – డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ -
చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట): విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ మెమోరియల్ (జీజేఎమ్) పాఠశాలలో విలేజ్ లీగల్ కేర్, సపోర్ట్ సెంటర్ (వీలేజ్ లీగల్ సర్వీస్ క్లినిక్)ను ప్రారంభించి మాట్లాడారు. దీని ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని, తద్వారా వారు గ్రామాల్లోని వారి తల్లిదండ్రులకు చట్టాల గురించి తెలియజేస్తారన్నారు. సెంటర్ నిర్వహణకు న్యాయవాదితో పాటు, పారాలీగల్ వలీంటర్, నలుగురు విద్యార్థులతో టీమ్ ఏర్పాటు చేస్తామన్నారు. చట్టాలు అందరికీ చుట్టాలు అని, చుట్టాలు మనకు రక్షణతో పాటు, అధికారాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, బార్ అసోసియేషన్ ఈసీ సభ్యులు పాల్గొన్నారు. 13న జాతీయ లోక్అదాలత్ వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్అదాలత్లో క్రిమినల్, సివిల్, మోటర్ వెహికల్, విద్యుత్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చున్నారు. దీని ద్వారా ఇరు పక్షాలవారు గెలుపొందిన వారవుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
విజయానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యం
సూర్యాపేటటౌన్ : జీవితంలో విజయం సాధించడానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యమనికలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చదువు, ఇతర అంశాలపై వారి అభిప్రాయాలు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని గమ్యం చేరేవరకు కష్టపడి చదువుకోవాలన్నారు. తరగతి గదుల్లో లైటింగ్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్, బాత్ రూమ్ లు వేరు వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, ఆర్సీఓ స్వప్న, డీసీఓ స్వప్న, హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు. -
అస్తమించిన ఎర్ర సూరీడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సురవరం పుట్టిపెరిగింది నాగర్కర్నూల్ జిల్లా అయినా.. ఆయన ఉద్యమ ప్రస్తానం నల్లగొండ జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ విస్తరణకు ఆయన కృషిచేశారు. నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వం అంశాలపై సీపీఐ తరఫున ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఆయన నల్లగొండ లోక్సభ స్థానం నుంచి 1998, 2004లో గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్యలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించారు. కాగా, సురవరం సుధాకర్రెడ్డి మృతికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
రామగిరి(నల్లగొండ), త్రిపురారం : వ్యవసాయ రంగంలో నానో ఎరువు మెరుగైన ఫలితాలనిస్తూ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుంది. ఇది ద్రవరూపంలో ఉండే ఎరువు. మార్కెట్లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరియాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవ రూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. నానో యూరియా లక్షణాలు ఇది నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన యూరియా. దీనిలో నత్రజని కణాలు చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. సంప్రదాయంగా వాడే యూరియాతో పోల్చితే దీని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండి మొక్కలు నత్రజనిని త్వరగా గ్రహిస్తాయి. ఒక బస్తా యూరియాకు సమానమైన ఫలితాన్ని అర లీడర్ నానో యూరియా అందిస్తుంది. ద్రవ రూపంలో ఉండటం వల్ల మొక్కలకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది. సాధారణంగా వాడే యూరియా నేలలోకి వెళ్లడం వల్ల భూమికి కాలుష్యం కలుగుతుంది. ద్రవ రూపంలోఉంటే నానో యూరియా నేరుగా మొక్క ఉపరితలాన్ని చేరుతుంది తద్వారా భూగర్భజల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. సాంకేతిక వ్యవసాయానికి సూచిక.. నానో యూరియా పంటల దిగుబడితో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే కాకుండా దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరియాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు. ధరలు ఇలా.. నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. నానో యూరియా ఒక్క బాటిల్ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది. నానో యూరియా వినియోగించే పద్ధతులు ఫ 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు. ఫ 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి. ఫ ఇతర పురుగు మందుల కలిపి పిచికారీ చేసుకోవద్దు. అవసరమైతే వ్యవసాయ అధికారులు, శాస్త్రవ్తేతల సూచనలు పాటించాలి. ఫ గుళికల రూపంలో ఉండే యూరియాతో పోల్చుకుంటే నానో యూరియా ఉపయోగించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ పంటలపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూరియాను పిచికారీ చేయడంతో దిగుబడులు పెరుగుతాయి. ఫ యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు. ఫ మార్కెట్లోకి నానో యూరియా, డీఏపీ ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా.. ఫ పంటలకు అధిక నత్రజనిని అందిస్తున్న ‘నానో’ ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఫ రవాణా, నిల్వ చేయడం తేలిక అంటున్న వ్యవసాయాధికారులు -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీప్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు గిరిజన హక్కులు– అమలుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు, రాజ్యాంగం గిరిజనులకు కల్పిస్తున్న హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపాల్ శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, న్యాయవాదులు తల్లమల్ల హస్సేన్, ఎడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలిభానుపురి (సూర్యాపేట) : 2025 – 26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ చాంబర్లో ఐకేపీ, సహకార, మార్కెటింగ్ మెప్మా శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ శాఖల పరిధిలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎస్ఓ మోహన్బాబు, డీసీఓ పద్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పులిచింతలకు 3,70,063 క్యూసెక్కుల ఇన్ఫ్లోమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టుకు 3,70,063 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 11గేట్లను నాలుగున్నర మీటర్ల మేర ఎత్తి 3,58,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయంనాగారం : ఉద్యాన పంటలను సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలని తుంగతుర్తి డివిజన్ ప్రాంతీయ ఉద్యాన శాఖ అధికారిణి ప్రమిత అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఉద్యాన పంటలను ఆమె సందర్శించి మాట్లాడారు. అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన శాఖలో వివిధ పథకాలకు సంబంధించి 2025–26 వార్షిక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఆయిల్ పామ్ విస్తరణ, సమగ్ర ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ శశికుమార్, ఉద్యాన విస్తరణ అధికారి ముత్యంరాజు తదితరులు పాల్గొన్నారు. -
నానో యూరియాతో ప్రయోజనాలు
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూర్యాపేట : నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో రైతు బీరెల్లి రామచంద్ర రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నానో యూరియా, నానో డీఏఓ మందును డ్రోన్ ద్వారా పిచికారీ చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఏఈఓ సుష్మా, డ్రోన్ ఆపరేటర్ మధుసూదన్, రైతులు పాల్గొన్నారు. నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి -
నేరాల కట్టడికి సాంకేతికతను వినియోగించాలి
సూర్యాపేటటౌన్ : నేరాలు కట్టడికి సాంకేతికతను వినియోగించాలని, ప్రజల భాగస్వామ్యంతో పటిష్టంగా పని చేయాలని ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమ రవాణా నిరోధంలో క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని రికార్డ్స్లో నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. అదనపు ఎస్పీలు రవీందర్, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్రెడ్డి, నరసింహచారి, మంజుభార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్పీ నరసింహ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో సామూహికంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, శ్రీధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెలు మురిసేలా..
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనుల జాతర – 2025 కార్యక్రమం ప్రారంభమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు. జిల్లాలో రెండో విడతగా ఈ పనులు ప్రారంభించడమే కాకుండా కొత్త పనులకు భూమి పూజ చేశారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. రూ.391 కోట్లు.. 356 పనులు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.391 కోట్లతో చేపట్టిన 356 పనులను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు ప్రారంభం కాగా చివ్వెంల మండలంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, మునగాల మండలంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తుంగతుర్తి మండలంలో మందుల సామెల్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవే కాకుండా కొత్తగా రూ.1.54 కోట్లతో 187 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పనుల జాతరలో మరిన్ని పనులు చేపట్టి పూర్తి చేయాలన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫామ్లు, కొత్తగా వ్యవసాయ బావుల నిర్మాణం, వన మహోత్సవం ద్వారా ఈత, తాటి, పండ్ల తోటల పెంపకం, నూతన అంగన్వాడీ, గ్రామపంచాయతీ, సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మెరుగవనున్న పాలన గ్రామపంచాయతీలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన అనంతరం పల్లె పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం శుక్రవారం చేపట్టిన పనుల జాతరతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభమై పాలన మెరుగుపడనుంది. ఓవైపు అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా ఉపాధి హామీ కూలీలకు ఉపాధి దొరకనుంది. ఫ పనుల జాతర – 2025 రెండో విడత ప్రారంభం ఫ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం ఫ ఆయా ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చివ్వెంల(సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. చివ్వెంల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి చెందిన వడ్డెపల్లి రాములు నిర్మించుకున్న పశువుల పాకను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. పశువుల వివరాలు, పాడి ద్వారా వస్తున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన యల్కపల్లి ప్రమీల నిర్మించుకుంటున్న పశువుల పాక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీహెచ్ఎస్లో వాన నీటి సంరక్షణ కట్టడం పనులు ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వీవీ అప్పారావు, పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులున్నారు. -
ఉత్సవం.. అప్రమత్తం
సూర్యాపేటటౌన్ : ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీల సభ్యులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సూచిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను జారీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికోసం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్టించే విగ్రహాల ఎత్తు, మండపం ప్రదేశం, నిమజ్జనం తేదీ, నిమజ్జనం ప్రదేశం తదితర వివరాలతో దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉంటే అనుమతితోపాటు క్యూ ఆర్ కోడ్ను జారీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో.. మండపం ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతికి పోలీస్ స్టేషన్ తిరగాల్సిన పని లేదు. https-://po liceportal.tspolice.gov.in వెబ్సైట్లో అనుమతి కోసం వివరాలను నమోదు చేసుకోవాలి. ఇదిరకంగా దరఖాస్తు ప్రక్రియ. వీటి ఆధారంగానే అనుమతులు జారీ అవుతాయి. అనంతరం ఆయా మండపాల్లో పోలీసుల అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలను విధిగా ప్రదర్శించాలి. పోలీసుల సూచనలు ఇవే..● గణేష్మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే. ● ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ● నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తిచేయాలి. ● గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ● మండపం స్థలం కోసం సంబంఽధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. ● రాత్రి 10గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. ● డీజేలు ఏర్పాటు చేయరాదు. ● గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగించడం, పాటలు పాడటం పూర్తిగా నిషేధం. ● ఎవరికై నా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీస్వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. గణేష్ నవరాత్రులకు జాగ్రత్తలు తప్పనిసరి ఫ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి పొందాల్సిందే.. ఫ ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం ఫ రూ.500 డీడీ చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఫ సూచనలు పాటించాలంటున్న పోలీసులు -
సీనియర్ సిటిజన్స్ను గౌరవించాలి
చివ్వెంల : సీనియర్ సిటిజన్స్ను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్కౌసర్ అన్నారు. ప్రపంచ సీనియ ర్ సిటిజన్స్ డే సందర్భంగా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని శ్రీఅన్నపూర్ణ చాటిటబుల్ ట్రస్ట్లో వృద్ధులను కలిసివారి సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. వృద్ధుల సమస్యలతోపాటు ఆశ్రమానికి దారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.రాజు, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
స్వచ్ఛ పాఠశాలలకు ప్రోత్సాహం
తిరుమలగిరి (తుంగతుర్తి): సర్కారు పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛ పాఠశాలలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు అందజేస్తోంది. ప్రతి సంవత్సరం పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపికై న వాటికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పురస్కారాలకు 2025–26 విద్యా సంవత్సరానికి పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్వచ్ఛ పాఠశాలలను ఎంపిక చేసేందుకు నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకొని రేటింగ్ ఇవ్వనున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు దరఖాస్తు చేసుకునే స్కూళ్లు వివిధ అంశాలను నమోదు చేయడంతో పాటు సౌకర్యాలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత– పచ్చదనం పెంపు, తాగు నీటి వసతి, ఇంకుడు గుంతలు–మూత్రశాలల నిర్మాణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డించడం వంటి నాలుగు అంశాలపై ఇచ్చిన 60 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలి. మొత్తం 125 మార్కులు కేటాయించనున్నారు. 90 శాతానికిపైగా మార్కులు సాధించిన పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు బృందాలు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపనున్నారు. పరిశీలించి మార్కులు ఖరారు చేసి రేటింగ్ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయి పరిశీలనకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేసి 5 స్టార్ రేటింగ్లు సాధించిన 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. నగదు పురస్కారం కోసం దరఖాస్తు చేసుకునేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్ కోసం మోడల్ స్కూల్ నుంచి దరఖాస్తు చేశాం. మా పాఠశాలలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. స్వచ్ఛతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు చేయడానికి కృషి చేస్తున్నాం. – సంజీవ్కుమార్, అనంతారం మోడల్ స్కూల్, తిరుమలగిరి మండలం ఫ నగదు పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం ఫ ఉత్తర్వులు జారీచేసిన విద్యా శాఖ ఫ రిజిస్ట్రేషన్కు సెప్టెంబర్ 30 వరకు గడువు ఫ ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్పీ కె.నరసింహతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మండపాల్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మారావు, రాజేశ్వరరావు, రమేష్, నరసింహారావు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కారింగుల ఉపేందర్, కార్యకర్తలు, షేక్ ఫారూక్ పాల్గొన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ భూమికి సంబంధించి పహాణీలో ఇతరుల పేరు రాసి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఇదేవరకే అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ విషయమై తాను రెండు రోజుల క్రితమే గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ను ఆదేశించామని పేర్కొన్నారు. సూర్యాపేట : సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు పక్కన ఖాళీ ప్రదేశంలో పిచ్చిమొక్కలను తొలగించి అందమైన పూల మొక్కలు పెంచాలన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం సద్దల చెరువు పరిధి ఎక్కడ వరకు ఉందో మున్సిపల్ కమిషనర్ను, చెరువు ఎఫ్టీఎల్ ఎక్కడకు ఉందో ఇరిగేషన్ అధికారులు, ఖాళీ ప్రదేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పర్యాటక శాఖ ఏఈని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఇరిగేషన్ డీఈ పాండునాయక్, టూరిజం ఏఈ మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కొత్త కార్డులకు సన్న బియ్యం
సూర్యాపేట : కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. ఎన్నికల హామీలో భాగంగా గతనెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 36,812 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. పదేళ్ల తర్వాత కార్డులు వచ్చాయని సంబరపడిన లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ఒకేసారి కోటా పంపిణీ చేసింది. అయినప్పటికీ కొత్త కార్డుదారులకు రేషనన్ బియ్యం తీసుకునే అవకాశం దక్కలేదు. దీంతో కొత్తకార్డుదారులకు సెప్టెంబర్ నుంచి మొదటి సారిగా కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా వచ్చేనెల 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రేషన్ షాపులకు కోటా సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందనున్న పథకాలు జిల్లా వ్యాప్తంగా గతంలో 3,26,057 రేషన్ కార్డులు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 36,812 కార్డులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డులేక ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి చాలా మంది పేదలు దూరమవుతున్నారు. దీంతోపాటు వారి పిల్లల చదువుల విషయంలోనూ రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు కూడా దక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. చివరికి ఆపద సమయంలో ఆరోగశ్రీ ద్వారా వైద్యసేవలను కూడా పొందలేక పేదలు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పేదల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అడ్డంకులు తప్పాయి. సెప్టెంబర్ ఒక టవ తేదీ నుంచి పంపిణీ ఫ మొదటిసారి 36,812 కుటుంబాలకు బియ్యం ఫ కొత్త కార్డుల మంజూరుతో పథకాల వర్తింపునకు తొలగిన అడ్డంకులు -
జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి అరెస్టు
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ జాన్పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలంటే పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు వైరల్ కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్యదర్శి వెంకయ్యను అదుపులోకి తీసుకుని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపుమద్దిరాల : ఇంకుడు గుంతలతో భూగర్భజల నీటిమట్టం పెరుగుతుందని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గురువారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించిన ఇంకుడు, రీచార్జ్ గుంతలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, బోరుబావుల చుట్టూ రీచార్జ్ గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఏపీఓ గుండు వెంకన్న, ఈసీ చారి, పంచాయతీ కార్యదర్శి ఉమ, టీఏ మురళి ఉన్నారు. -
టెండర్ ఫీజు రూ.3 లక్షలు
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు సూర్యాపేటటౌన్ : కొత్త మద్యం దుకాణాల (వైన్స్)కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. ఈ సారి మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ఫీజు ఒక్కటే పెంచిన ప్రభుత్వం మిగతా విధానాలు పాత పద్ధతుల్లోనే కొనసాగించేందుకు సిద్ధమైంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి 99 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో సూర్యాపేట సర్కిల్లో 30 దుకాణాలు, తుంగతుర్తి సర్కిల్లో 17, కోదాడలో 24, హుజూర్నగర్ సర్కిల్లో 28 దుకాణాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయింపు.. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ విధానం అమలు చేయనున్నారు. ఈసారి రిజర్వేషన్లు 30 శాతంగా నిర్ణయించారు. అందులో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఆయా దుకాణాలకు జనాభా ప్రాతిపదికన రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్లలో లైసెన్స్దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సెప్టెంబర్ 2వ వారంలోపే షెడ్యూల్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నెలలో దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన పూర్తిచేసి అక్టోబర్లో డ్రా పద్ధతిన దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎకై ్సజ్ శాఖ కమిషన్ ఆదేశాల మేరకే దుకాణాల లైసెన్స్ల జారీకి దరఖాస్తుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. లాటరీ పద్ధతిన ఎంపిక.. మద్యం దుకాణాలను గతంలో మాదిరిగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు తీసుకుని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన దరఖాస్తులను ఆయా మద్యం దుకాణాల వారీగా డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ డ్రా తీస్తారు. ఫ 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు ఫ 5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు ఫ 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు ఫ లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు ఫ 5 లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.85లక్షలు ఫ 20 లక్షల పైచిలుకు జనాభాకు రూ.1.10కోట్లు మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం ఫ గతంలో రూ.2లక్షలు.. ఈ సారి అదనంగా మరో రూ.లక్ష పెంపు ఫ డిసెంబర్ 1నుంచి 2027 నవంబర్ 30 వరకు కాలపరిమితి ఫ గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వుడ్ ఫ జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్లు -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల: గ్రామాల్లో ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో పలు వీధులు, మురుగు కాలువలను పరిశీలించారు. ఇంటి ముందు ఇంకుడు గుంతల లేకుండా ఇళ్లలో వాడుకున్న నీరు వీధుల్లో ప్రవహించడాన్ని గమనించి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జ్వరాల బారిన పడిన పలువురిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. పలు వీధులు లోతట్టు ప్రాంతంలో ఉండడం, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిసరాల పరిశుఽభ్రత లోపించడం, కొన్నిచోట్ల చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయడం, జనావాసాల మధ్య పిచ్చిమొక్కలు పెరగడం, ఇంకుడు గుంతలు లేకపోవడాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతి వీధిలో డెమోపాస్ స్ప్రే, బ్లీచింగ్ చల్లాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. ఇందు కోసం రూ.50వేల చెక్కును ఎంపీడీఓకు అందజేశారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పైలెట్ గ్రామంగా ఎంపికై న తాడువాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, తహసీల్దార్ చంద్రశేఖర్, వైద్యాధికారులు శ్రీశైలం, వినయ్కుమార్, వైష్ణవి, పంచాయతీ కార్యదర్శి రాము, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ తాడువాయిలో పర్యటించిన కలెక్టర్ -
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
కోదాడ: కోదాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పనిచేసే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న కలప వ్యాపారి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రామాపురంతండాకు చెందిన సెనావత్ హరినాయక్ కలప వ్యాపారం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం పనికిరాని చెట్లను కలప కోసం కొడుతుండగా అక్కడికి వెళ్లిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న వారిని అడ్డుకున్నాడు. తాను ప్రభుత్వానికి చలానా కడతానని కలప వ్యాపారి చెప్పాడు. ప్రభుత్వానికి రూ.60 వేలు చలానా కట్టాల్సివస్తుందని, తనకు రూ.50 వేలు ఇస్తే అన్నివిధాలా సహకరిస్తానని వెంకన్న చెప్పాడు. వ్యాపారితో చివరకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో అక్రమంగా కలప వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు తట్టుకోలేక హరినాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం కోదాడ సమీపంలోని ఒక హోటల్ వద్ద బాధితుడి నుంచి బీట్ ఆఫీసర్ వెంకన్న లంచం తీసుకొని తన బైక్ కవర్లో పెడుతుండగా అక్కడే మాటు వేసిఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని వెంకన్నను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ కలప వ్యాపారి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత -
విద్యార్థి భవితకు ‘విజ్ఞాన్ మంథన్’
తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు శ్రీవిద్యార్థి విజ్ఞాన్ మంథన్శ్రీ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందజేస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షలో పాల్గొనేందుకు అర్హులు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. పరీక్ష రుసుం రూ.200 చెల్లించాలి. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష విధానం ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలు జూనియర్, సీనియర్ విభాగాలుగా నిర్వహిస్తారు. 6 నుంచి9వ తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు 14 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. టెలిఫోన్, ట్యాబ్, ల్యాప్ట్యాప్, డెస్క్టాప్ దేనినైనా వినియోగించుకోవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయోలజీ 50 శాతం, భారతదేశం కృషిపై 20, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20, లాజికల్ రీజనింగ్పై 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్లకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, సీనియర్లకు నవంబర్ 19 నుంచి 23 తేదీల్లో వారికి నచ్చిన రోజు పరీక్ష రాయొచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయి, జనవరి 30న జాతీయ స్థాయి పోటీలు ఉంటాయి. ఫ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాల అందజేత ఫ 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు అవకాశం ఫ వచ్చేనెల 30లోపు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఫ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ముగ్గురికి నగదు బహుమతులు ఫ ఏడాదిపాటు రూ.2వేల చొప్పున ‘ఉపకారం’పాఠశాల స్థాయిలో 18 మందిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున గుర్తిస్తారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా ఇస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురికి రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశంతోపాటు ఏడాది పాటు నెలకు రూ.2వేల ఉపకార వేతనం అందజేస్తారు. -
రిజర్వేషన్లకు మించి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు, వారు గెలుపొందిన స్థానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వారికి కేటాయించిన స్థానాలతోపాటు, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా అమలు చేసే యోచనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని పార్టీలు అమలు చేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో 23శాతం రిజర్వేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 ఎన్నికల్లో బీసీలు తమకు ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానాలను దక్కించుకున్నారు. రిజర్వు అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో అధిక సీట్లను కై వసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 23 శాతం రిజర్వేషన్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లోనూ 35 శాతం వరకు, జెడ్పీటీసీ స్థానాల్లోనూ 25 శాతం వరకు స్థానాలను సాధించారు. జనరల్ స్థానాల్లో గెలుపు ఇలా.. ● నల్లగొండ జిల్లాలో 844 సర్పంచ్ స్థానాలు ఉండగా.. బీసీ రిజర్వేషన్ కింద 209 స్థానాలతోపాటు 79 జనరల్ స్థానాల్లోనూ బీసీలే పోటీ చేసి విజయం సాధించారు. మొత్తంగా 288 స్థానాలను (35 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 346 ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 93తోపాటు 23 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. మొత్తంగా 121 స్థానాలను బీసీలు దక్కించుకున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ రిజర్వుడ్ స్థానాలు 4తో పాటు మరో 4 జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి.. 8 స్థానాల్లో గెలుపొందారు. ● సూర్యాపేట జిల్లాలోనూ 475 సర్పంచ్ స్థానాలకు గాను బీసీ రిజర్వుడ్ స్థానాలు 171తోపాటు మరో 52 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. 233 స్థానాలను (47 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 255 ఎంపీటీసీ స్థానాల్లో 29 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 50 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 79 స్థానాలను కై వసం చేసుకున్నారు. 23 జెడ్పీటీసీ స్థానాల్లో 3 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 2 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 5 జెడ్పీటీసీ స్థానాలను సాధించారు. ● యాదాద్రి భువనగిరి జిల్లాలోని 420 సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వుడ్ 117 స్థానాలతోపాటు 59 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి.. 176 స్థానాలను (42 శాతం) కై వసం చేసుకున్నారు. 117 ఎంపీటీసీ స్థానాల్లో 39 రిజర్వుడ్ స్థానాలతోపాటు 12 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తం 51 స్థానాలను బీసీలు సాధించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో 4 బీసీ రిజర్వుడ్ స్థానాలతోపాటు మరొక జనరల్ స్థానంలో పోటీ ఐదింటిని దక్కించుకున్నారు. ఫ ఈసారి బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు ఫ ప్రభుత్వ పరంగా కుదరకపోతే పార్టీ తరఫున అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ఫ మిగతా పార్టీలూ బీసీలకు ప్రాతినిధ్యం పెంచక తప్పని పరిస్థితి ఫ రిజర్వేషన్ల అమలుపై పార్టీల్లో విస్తృత చర్చ గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పరంగా చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకపార్టీ 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు సీటు కేటాయించినా, అక్కడ మరో పార్టీ జనరల్ అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేసేందుకు తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. జాతీయస్థాయిలో కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు
తుంగతుర్తి : ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిని తనిఖీ చేసి మాట్లాడారు. ఆర్ఎంపీ బండి శ్రీనివాస్ గదిలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ డాక్టర్ల నేమ్ స్టాంప్స్లు, కన్సల్టెన్సీ డాక్టర్ల పేరుతో గల ఐడీ కార్డులు, లెటర్ ప్యాడ్స్, ఆపరేషన్ కోసం వాడుతున్న యాంటీబయాటిక్ మందులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జయ, డాక్టర్ నజియా, డాక్టర్ జి చంద్రశేఖర్, రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ లింగమూర్తి ఉన్నారు. 30, 31 తేదీల్లో శిక్షణ తరగతులుసూర్యాపేట : ఈ నెల 30, 31 తేదీల్లో మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు కోరారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం బలోపేతానికి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిన విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు పిడమర్తి భరత్, జిల్లా నాయకులు బోర లెనిన్, సంతోష్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా స్టాలిన్సూర్యాపేట : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన మామిడి స్టాలిన్ నియామకమయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నట్లు బుధవారం ఆయన తెలిపారు. స్టాలిన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మగౌరవ సభకు తరలిరావాలిసూర్యాపేట : సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆత్మ గౌరవసభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో జీవించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శిరందాసు రామదాసు, జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజు, టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, జానయ్య, శివమూర్తి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ బకాయిలు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్ బకాయిలు 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించినవి సెప్టెంబర్ 12 నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం వేగవంతంగా మిల్లింగ్ చేసి ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేపట్టాలని, రోజువారీ నివేదికలను తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్బాబు, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, డీటీ రాజశేఖర్, ఆర్ఐలు శ్రీకాంత్, ప్రమోద్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలినడిగూడెం : పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంట గది, హాస్టల్ స్టోర్ను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. వానాకాలం సీజన్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట కోదాడ డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎంపీఓ విజయకుమారి, ప్రిన్సిపాల్ వాణి, డాక్టర్.హరినాఽథ్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, ఏఎన్ఎం సుజాత, ఆశా కార్యకర్తలు సైదమ్మ, సునిత, స్టాఫ్నర్స్ నాగలక్ష్మి, ఉన్నారు. మెడికల్ షాపు తనిఖీతుంగతుర్తి: అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో గల మెడికల్ దుకాణాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మహిళకు వైద్యం చేసేటప్పుడు ఎలాంటి మందులు ఉపయోగించారో పరిశీలించారు. వారివెంట సీఐ నరసింహారావు, ఎస్ఐ క్రాంతికుమార్ ఉన్నారు. -
బాధితులతో స్నేహపూర్వకంగా మెలగండి
పెన్పహాడ్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసు స్టేషన్ ఆవరణలో సిబ్బంది కవాతు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు, పోలీస్ స్టేషన్ మ్యాప్, గ్రామాల హద్దులు, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో నిరంతరం పెట్రోలింగ్, తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా కేసుల్లో ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మానవ అక్రమ రవాణా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ గోపికృష్ణ, డీసీఆర్బీ ఎస్ఐ యాకూబ్, డీసీఆర్బీ సిబ్బంది అంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
‘కసరత్తు’కు కషా్టలు
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్లు నిర్వహణ లేక నీరసించిపోతున్నాయి. పర్యవేక్షణ లోపంతో పరికరాలు మూలనపడుతున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో ఏర్పాటు చేయలేదు. అయితే ఓపెన్ జిమ్లు ఉన్న మున్సిపాలిటీల్లోనూ వాటి పరిస్థితి గాలిలో దీపంలా మారింది. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వ్యాయామ పరికరాలు పాడైపోతున్నాయి.సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో 2018లో సీడీఎంఏ ఆధ్వర్యంలో రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉండడంతో ప్రభుత్వం 2022లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో మరో ఏడు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. మొత్తంగా సూర్యాపేట పట్టణంలో తొమ్మిది ఓపెన్ జిమ్లు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణను అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. కొత్తగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసిన చోట సిమెంట్ ఫ్లోరింగ్పై రబ్బర్ షీట్లు వేశారు. వాటిని గమ్తో అతికించడంతో కొన్నాళ్లకే ఊడిపోయాయి. వర్షం పడితే పైకి తేలుతున్నాయి. వీటిపై విమర్శలు రావడంతో అధికారులు మెత్తటి టైల్స్ వేయడం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో ప్రస్తుతం కొన్ని వస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓపెన్ జిమ్కు వచ్చే వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినా పార్కుకు తాళాలు వేస్తుండడంతో అక్కడికి వెళ్లే స్థానికులు ఓపెన్ జిమ్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.కోదాడ: నాలుగు సంవత్సరాల క్రితం కోదాడలోని గాంధీ పార్కు ఆవరణలో రూ.5లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నాణ్యతలేని పరికరాలు కావడంతో సంవత్సరం లోపే అవి పాడైపోయాయి. కింద వేసిన ఫ్లోర్ కూడా పాడైపోయింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించి గాంధీ పార్కును ఆధునీకరిస్తున్నామని మరో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓపెన్జిమ్ స్థానంలో పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. దీంతో ఓపెన్జిమ్ ఆనవాలు లేకుండా పోయింది.పరికరాల్లో లోపించిన నాణ్యత హుజూర్నగర్: హుజూర్నగర్లో గత ప్రభుత్వ హయాంలో రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్లో, ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో ఈ జిమ్లు ఉన్నాయి. ఒక్కో జిమ్లో దాదాపు రూ. 10 లక్షలు వెచ్చించి వ్యాయామ పరికరాలు, నేలపై మ్యాట్లను ఏర్పాటు చేశారు. నాణ్యత లేని వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ లేక పరికరాలు చాలావరకు సరిగా పనిచేయడం లేదు. ఫ్లోర్ మ్యాట్లు కూడా పాడైపోయాయి. ప్రస్తుతం ఆయా జిమ్లలో నేలపై ఏర్పాటు చేసిన మ్యాట్లు మాయమయ్యాయి. జిమ్కు వచ్చే ప్రజలు గత్యంతరం లేక సరిగా పనిచేయని వ్యాయామ పరికరాలను అలాగే ఉపయోగిస్తున్నారు.ఆధునీకరణ పేరిట ఆట వస్తువుల ఏర్పాటు నిర్వహణ లేక నీరసించిపోతున్న ఓపెన్జిమ్లు పర్యవేక్షణ లోపంతో పాడైపోతున్న పరికరాలు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలంటున్న పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఓపెన్ జిమ్లు జనాభా సూర్యాపేట 09 1,33,339 కోదాడ తొలగించారు 75,093 హుజూర్నగర్ 02 35,850 -
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
పొనుగోడు పీఏసీఎస్ గోదాంను పరిశీలిస్తున్న కలెక్టర్ గరిడేపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్గరిడేపల్లి : యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని పరిశీలించి యూరియా నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. పలు రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పొనుగోడు పాఠశాలలో ఒకే ఆవరణంలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు ఉండడంతో రెండు పాఠశాలలకు కలిపి వంటలు వండించాలని సూచించారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, సహకార సంఘం, ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ, ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆరోగ్య కేంద్రానికి ఎంత మంది అవుట్ పేషెంట్స్ వస్తునా ్నరని వైద్యాధికారి నరేష్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా అసంపూర్తిగా ఉన్న సీ్త్రశక్తి భవనం విషయం విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండ కవిత, ఎంపీడీఓ సరోజ, ఎస్ఐ చలికంటి నరేష్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ ఏఈలు కళ్యాణ్, సిద్ధార్థ, ఆర్ఐలు ప్రవీణ్, రాంబాబు, ఏపీఎం అజయ్, ఏపీఓ సురేష్, ఎంపీఓ ఇబ్రహీం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గరిడేపల్లి మండలంలో నాలుగు గంటలకుపైగా సమయాన్ని కేటాయించిన కలెక్టర్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గరిడేపల్లిలో ఎరువుల దుకాణం ఎదుట మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్ వాహనం నుంచి దిగుతున్న సమయంలో వాహనం కదలడంతో ఆయన కాలిపై వాహనం టైర్ ఎక్కడంతో గాయమైంది. దీంతో ఆయనకు దగ్గరుండి చికిత్స చేయించాలని ఆర్ రాంబాబుకు కలెక్టర్ సూచించారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామిఅమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ
నాగారం : ప్రస్తుతం సమాజంలో పిల్లలకు ఇంటా, బయట రక్షణ కొరవడింది. ఈవ్ టీజింగ్, ఇతర వేధింపులు, గృహ హింసకు గురవుతున్నారు. దీంతో పిల్లల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి పి ల్లల భద్రత, మానవ అక్రమ రవాణా, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జిల్లాస్థాయిలో మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 181 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఈ శిక్షణకు ఎంపిక చేశారు. శిక్షణ వివరాలు.. జిల్లాలోని 181 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాల్లో మొదటి విడత శిక్షణ అక్టోబర్ 6, 7 తేదీల్లో, రెండో విడత అక్టోబర్ 8, 9 తేదీల్లో, మూడో విడత అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకు అవగాహనపిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా పిల్లలకు అవగాహన కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక స్థితి, ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తున్నారు. కుటుంబంలో, బయట భద్రత పొందేలా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. గృహ హింస, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో సూచిస్తారు. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు.ఫ ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒకరి ఎంపిక ఫ మూడు విడతల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ఫ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్న ప్రభుత్వం పిల్లల భద్రత అంశంపై ఉపాధ్యాయులకు జిల్లాలో మూడు విడతలో్ల్ శిక్షణ ఇప్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ శిక్షణ అక్టోబర్ 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. సమాజంలో పిల్లలు భద్రత పొందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. –అశోక్, డీఈఓ, సూర్యాపేట -
మరమ్మతులు చేపట్టాలి
ప్రతిరోజు జూనియర్ కాలేజీలోని ఓపెన్ జిమ్కు ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తుంటాం. కసరత్తు చేసే పరికరాలు పాడైపోయాయి. అవి సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి. – బొర్ర పుల్లయ్య, చర్చి కంపౌండ్, సూర్యాపేట చందాలు వేసుకుని పరికరాలకు రిపేర్ చేయించాం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యాపేటలోని ఓపెన్ జిమ్కు వస్తుంటాం. పరికరాలు పాడవడంతో తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి కష్టమవుతోంది. ఒకసారి ఓపెన్ జిమ్కు వచ్చే వాళ్లం చందాలు వేసుకొని రిపేరు చేయించాం. అవి మళ్లీ పాడైపోయాయి. అధికారులు స్పందించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్తవి బిగించి వినియోగంలోకి తేవాలి. – పడిశాల ఊశయ్య, సూర్యాపేట -
బీసీ కోటాపై ఆశలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే ఈసారి పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వపరంగా అమలు విషయంలో అడ్డంకులు ఉండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ ముందుకు సాగేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో దీనిపై పక్కా అభిప్రాయానికి రానుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎన్ని పెరిగే అవకాశం ఉంటుందో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల్లోనూ ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. భారీ అంచనాల్లో అధికార పార్టీ ఆశావహులు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు 2019లో జరిగాయి. 2024లో పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఇందుకు చాలా అడ్డుంకులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల పెంపుపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నా, పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ముందుకెళ్లే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏయే మండలాల్లో ఏయే గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు అవకాశాలు దక్కుతాయన్న విషయంలో అధికార పార్టీ నేతలు, ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం ఫ పార్టీ పరంగా ఓకే.. ప్రభుత్వ పరంగా తప్పని చిక్కులు ఫ త్వరలోనే పీఏసీ, కేబినెట్ సమావేశాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఫ సెప్టెంబర్ మొదటి వారంలోపే రానున్న ఎన్నికల షెడ్యూల్ -
పంట.. వంట.. మనదే
ప్రభుత్వం సరఫరా చేసిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లు పంపిణికి సిద్ధం ఉన్నాయి. ఈ విత్తనాలను ఎంపిక చేసిన కేంద్రాలకు సరఫరా చేస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లోని ఆయాలు, టీచర్లకు తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఉద్యానశాఖ అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ●నాగారం : ఖాళీ స్థలాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకు కూరలు పండించాలని ప్రభుత్వం నిర్ణయించించి. బయట కూరగాయల ధరలు పెరగడం, నాణ్యత కొరవడడం, సమయానికి సరిపడా లభించకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాల ప్యాకెట్లను పంపిణీకి సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ పోషణ్ వాటిక పథకం కింద జిల్లాలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఇందుకోసం ఎంపిక చేశారు. టమాట, వంగ, బెండ, పాలకూర, తోటకూర, మెంతి కూర విత్తనాల ప్యాకెట్లు ఇవ్వనున్నారు. ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా..పోషణ్ వాటికను తొలి విడతలో జిల్లాలో 150 కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టమాట, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, మెంతికూర సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైన విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 180 కేంద్రాల్లో తోటలు పెంచుతుండగా తాజాగా మరో 150 అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు వచ్చాయి. వీటిని ఎంపిక చేసిన కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో సాగుచేస్తారు. ఐదేళ్లపాటు పెంపకం, నిర్వహణకు ప్రభుత్వం రూ.10వేలు అందజేస్తుంది. వీటిని ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఫ పోషణ్ వాటిక పథకం కింద కూరగాయల సాగు ఫ నూతనంగా 150 అంగన్వాడీ కేంద్రాల్లో సాగు చేసేలా ప్రణాళిక ఫ ఒక్కో కేంద్రానికి త్వరలో విత్తనాల ప్యాకెట్లు పంపిణీఅద్దె భవనాల్లోనే అధికం.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 313 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 435 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 461 ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్స్లో కొనసాగుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 0–6 నెలల పిల్లలు 3669, 7నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 25,669 మంది, 3–6 సంవత్సరాల పిల్లలు 18,066 మంది, గర్భిణులు 5,947 మంది, బాలింతలు 3,888 మంది నమోదై ఉన్నారు. సొంత భవనాల్లోనూ స్థలాలు లేనిచోట పెరటి సాగు చేయడం లేదు. ఇక అద్దె భవనాల సంగతి చెప్పనక్కర్లేదు. మొత్తానికి స్థలాలు లేవన్న కారణంగా అత్యధిక కేంద్రాలు పెరటి సాగును పక్కన పెట్టారు. కూరగాయలను బయటే కొంటున్నారు. నాణ్యత లేకపోవడం, ధరలు విపరీతంగా ఉన్నా కొనుగోలు చేయక తప్పడం లేదు. -
పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా
సూర్యాపేటటౌన్ : ఏఆర్లో హెడ్ కానిస్టేబుల్ రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ బీమా చెక్కు అందజేశారు. అదేవిధంగా నూతనకల్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సోమాని నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా.. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు చేయూత పథకం ద్వారా రూ.2లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
సూర్యాపేట: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని సోమవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో కలిసి మాజీ మంత్రి జగదీష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ రమేష్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చి న ఎంఎస్కే ప్రసాద్కు అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో సూర్యాపేట ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాలని, పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా విజయం తధ్యమన్నారు. ఈ క్రికెట్ అకాడమీ రెండో సెక్షన్ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి సూర్యాపేట పేరును జాతీయ స్థాయిలో నిలపాలని కోరారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగల్యధారణ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నిక సూర్యాపేట : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వెంకన్న, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాదెండ్ల బాలకృష్ణ, జిల్లా కార్యదర్శిగా యాదగిరి నాయుడు, జిల్లా అదనపు కార్యదర్శిగా నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్● సోషల్మీడియాలో వైరల్గా మారిన పంచాయతీ కార్యదర్శి ఆడియో పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు మంజూరు కావాలంటే తనకు కొంత డబ్బు ముట్టజెప్పాలని, లేదంటే వాటిని నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తూ స్వయంగా లబ్ధిదారులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకట్ స్పందిస్తూ గ్రామంలో తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, లబ్ధిదారులే త్వరగా బిల్లు మంజూరయ్యేలా చూడాలని, అందుకు కొంత డబ్బు ఇస్తామని తనను ట్రాప్ చేశారని పేర్కొన్నారు. ఎంపీడీఓ లక్ష్మిని సంప్రదించగా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో బిల్లు మంజూరుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా లింగయ్యసూర్యాపేటటౌన్ : డీటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని హైదరాబాద్లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన రేపాక లింగయ్య, ఆడిట్ కమిటీ సభ్యుడిగా సీహెచ్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కౌన్సిల్కు, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. -
జలదిగ్బంధంలో కోడూరు
అర్వపల్లి: కురుస్తున్న వర్షాలకు జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం–సంగెం రహదారిపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా కోడూరు గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఆదివారం కురిసిన వర్షానికి కోడూరు వద్ద వాగు వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు వాసులు అటు సంగెం మీదుగా, ఇటు కోడూరు, కొమ్మాల మీదుగా ఎటు వెళ్లాలన్నా వాగులు అడ్డంకిగా మారాయి. దీంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ను ఏర్పాటు చేసి అత్యవసర పనులు ఉన్నవారిని వాగు దాటిస్తున్నారు. సోమవారం గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. ట్రాక్టర్పై వాగు దాటించి సూర్యాపేటకు తీసుకెళ్లారు.ఫ వాగు దాటేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఏర్పాటు -
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
హుజూర్నగర్ : పేదలకు విలువైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ 3.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఓపీ బ్లాక్ నూతన విభాగం, ధోబి ఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు. రూ 1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో నిర్మించిన డయాలసిస్, రక్త నిధి కేంద్రాలను ప్రారంభించారు. రూ.3 కోట్లతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, డీసీహశ్రీచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక న్యాయం వైపు ప్రభుత్వం అడుగులు హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ ఎలక్ట్రిసిటి ఉద్యోగుల ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ ప్రాంక్లిన్, డీఈలు వెంకట కిష్ణయ్య, శ్రీనివాస్, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పారసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
యూరియాకు ఎలాంటి కొరత లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటివరకు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, ఈ నెలలో 3800 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 6, 7 రోజుల్లో స్టాక్ రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రతిరోజు 600 నుంచి 700 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించాలివీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రతిరోజు మండలాల వారీగా యూరియా, ఇతర ఎరువులకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని, అలాగే టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతులు నానో యూరియా వాడే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలి భానుపురి (సూర్యాపేట) : భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, సీపీఓ కిషన్ పాల్గొన్నారు. -
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలు కేసుల దర్యాప్తులో కీలకం ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతాపం తెలిపారు. -
ఆర్ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ వైద్యుడు కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్ఓ తెలిపారు. -
కొడుకు ప్రేమ వివాహం.. కుమార్తెల పేర ఆస్తి రాసిన తండ్రి
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కుమార్తెల పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కుమార్తెల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్గా మారింది. దుకాణం ఎదుట బైఠాయించిన నవ దంపతులు పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన కుటుంబ పంచాయితీ -
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీకాంత్గౌడ్
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు నార్కట్పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్తో గొడవ పడి హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలిసంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు. బైక్ అపహరణఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్ను లాకెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలిమిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్టౌన్ పోలీస స్టేషన్కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూజలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఫ్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ఫ్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. -
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్పై విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్ ఒకరి మృత్యువాతచందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఏడుగురు వ్యక్తులకు గాయాలు చివ్వెంల, గుండాల, చందంపేట, డిండి మండలాల పరిధిలో ఘటనలుఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. -
సిబ్బందిపై ఓవర్ లోడ్
నాగారం : విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడక్కడా సిబ్బంది సర్దుబాటు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో వినియోగదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఏటా కనెక్షన్లు పెరుగుతున్నా.. జిల్లాలో ఏటా గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించడం లేదు. జిల్లాలో సూర్యాపేట, హుజూర్నగర్ రెండు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలో ప్రతి 1,500 సర్వీసులకు ఒక జూనియర్ లైన్మెన్ పోస్టు ఉండాలి. ప్రతి 3వేల కనెక్షన్లకు అసిస్టెంట్ లైన్మెన్, ప్రతి 4,500 కనెక్షన్లకు లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ ఉండాలి. రెండు డివిజన్ల పరిధిలో క్షేత్రస్థాయిలో సిబ్బంది 534 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 405 మంది పనిచేస్తున్నారు. 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యవసాయ బావుల వద్ద ఫ్యూజులు పోతే విద్యుత్ సిబ్బంది రావడం ఆలస్యం అవుతోంది. గ్రామాల్లోనూ రాత్రిపూట ఫ్యూజులు పోతే పెట్టడానికి ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. వారు వచ్చేలోపు రైతులు, గ్రామస్తులే సరిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ ప్రమాదాల బారిన పడుతున్నారు. జేఎల్ఎం, ఏఎల్ఎంల ఖాళీలే అధికం.. జిల్లాలో జేఎల్ఎం, ఏఎల్ఎం పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 2019లో జేఎల్ఎం పోస్టులు భర్తీ కాగా, ఏడాది విధులు పూర్తిచేసుకున్న వారంతా ఏఎల్ఎంలుగా పదోన్నతులు పొందారు. దీంతో జేఎల్ఎం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిపై పనిభారం పడడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఏ రాత్రయినా విద్యుత్ పునరుద్ధరణకు క్షేత్రస్థాయి సిబ్బందే పనులు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో వెళ్లాలంటే మరో సిబ్బందికి అదనంగా పని కల్పించాల్సి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖలో పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయి సిబ్బంది ఖాళీల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – శ్రీనివాస్, ట్రాన్స్కో డీఈఈ సూర్యాపేట విద్యుత్ శాఖలో భర్తీకాని ఖాళీ పోస్టులు ఫ నాలుగేళ్లుగా నియామకాల్లేవు ఫ ఉన్నవారిపై అదనపు పనిభారం ఫ జిల్లా వ్యాప్తంగా 129 పోస్టులు ఖాళీగృహ విద్యుత్ కనెక్షన్లు 4,51,501వ్యవసాయ కనెక్షన్లు 1,54,270 ఉండాల్సిన సిబ్బంది 534 ప్రస్తుతం ఉన్నవారు 405పోస్టు మొత్తం పనిచేస్తున్నవారు ఖాళీలుజూనియర్ లైన్మెన్ 172 110 62 అసిస్టెంట్ లైన్మెన్ 130 80 50 లైన్మెన్ 170 159 11 లైన్ ఇన్స్పెక్టర్ 50 48 02 ఫోర్మెన్ 12 08 04 -
వైద్యశాల స్థలంపై పట్టింపేది..!
ఫ ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మున్సిపల్ అధికారులు ఫ అభ్యంతరం వ్యక్తం చేయని వైద్యశాఖ ఫ ప్రజల పోరాటాన్ని పట్టించుకోని పాలకులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటలు తక్కువగా ఉంది. దీనిపై మేము 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అందువల్ల వైద్యశాల స్థలంలో ఇతరుల భవనాల నిర్మాణానికి వైద్యశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయాలి. రెండు ఎకరాల స్థలం ఎక్కడ ఉందో చూపిన తరువాతే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి. –కుదరవళ్లి బసవయ్య, కోదాడ. కోదాడ: ఏళ్లుగా కొనసాగుతున్న వైద్యశాల స్థల వివాదంపై పాలకులకు, అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వైద్యశాలకు దాత ఇచ్చిన స్థలంపై ఎన్నో సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నా నేటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఆ స్థలంపై అభ్యంతరాలు ఉన్నాయిని పట్టణ ప్రజలు చెబుతున్నా దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటల స్థలం తక్కువగా ఉన్నప్పటికీ పక్కన ఉన్న రోడ్లతో సహా కొలిచి దాత వారసుడికి 500 గజాల స్థలాన్ని అక్రమంగా కేటాయించారని కోదాడ పట్టణ ప్రజలు 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ నుంచి రాష్ట్ర అధికారుల వరకు వినతులు ఇస్తూ వస్తున్నారు. దీంతో రెండుసార్లు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసిన అధికారులు.. మూడోసారి మళ్లీ కేటాయించారు. పరాధీనం ఇలా.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు నాగుబండ పద్మయ్య 1963లో రిజిస్టర్ దానపత్రం ద్వారా 2 ఎకరాల స్థలాన్ని దానం ఇచ్చారు. 1998లో దాత మనవడు తాము దానం ఇచ్చిన స్థలం కన్నా వైద్యశాలలో ఎక్కువగా ఉందని కోర్టుకు వెళ్లాడు. ఎక్కువగా ఉంటే ఇవ్వాలని కోర్టు చెప్పడంతో.. అధికారులు భూమిని సర్వే చేసి రెండు ఎకరాలకు ఎక్కువగా ఉందని తెల్చారు. 500 గజాలు దాత వారసుడికి ఇచ్చారు. ఈ సమయంలో వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డును కూడా కలిపి కొలవడంతో ఎక్కువ స్థలం వచ్చిందని, వైద్యశాల కాంపౌండ్ లోపల 2 ఎకరాలకు తక్కువగా ఉందని పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి కొలిచి వైద్యశాల లోపల 15 కుంటలు తక్కువగా ఉందని తేల్చి మొదటి కేటాయింపును రద్దు చేశారు. మరోసారి దాత వారసుడు కోర్టుకు వెళ్లడంతో సర్వే అధికారులు అతడితో కుమ్మకై ్క రోడ్డును కలిపి మరోసారి కొలిచి ఎక్కువగా ఉందని తెల్చి మరోసారి స్థలాన్ని కేటాయించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డు తనదేనని దాత వారసుడు అంతకు ముందు సూర్యాపేట సబ్కోర్టుకు వెళ్లాడు. అది పంచాయితీకి చెందిన రోడ్డు అని కోర్టు తీర్పు చెప్పడంతోపాటు దాత వారసుడికి కోర్టు ఫైన్ కూడా వేసింది. 100 పడకల వైద్యశాల నిర్మాణం.. ప్రస్తుతం 30 పడకల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 పడకల వైద్యశాల నిర్మిస్తున్నారు. కాగా దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో వైద్యశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి రాబట్టుకోవాలని పట్టణవాసులు అధికారులకు చేస్తున్న విజ్ఞప్తులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణ విషయం పట్టించుకోకుండా ఎకరం 25 కుంటల స్థలంలో 100 పడకల వైద్యశాల నిర్మాణం సరిపోతుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం. దాత వారసుడికి కేటాయించిన స్థలాన్ని అతడు వెంటనే ఇతరులకు అమ్ముకున్నాడు. కొన్నవారు ఈ స్థలంలో భవన నిర్మాణాలకు వారు దరఖాస్తు చేయగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడిచిన పది సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతున్నారు. తాజాగా వారు కోర్టుకు వెళ్లడంతో మున్సిపల్ అధికారులు 23 జూన్ 2025న వైద్యశాల అధికారులకు నోటీసు ఇచ్చారు. ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆరు వారాల్లోగా చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సమయం మించి పోతున్నా నేటి వరకు వైద్యశాఖ అధికారులు స్పందించిన దాఖాలాలు లేవు. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే వైద్యశాల స్ధలం శాశ్వతంగా పరాధీనమై 20 సంవత్సరాల పట్టణ ప్రజల పోరాటం బూడిదలో పోసిన పన్నీరవుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
పులిచింతల ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,73420 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. ఎనిమిది గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి దిగువకు 2,90,526 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వైభవంగా నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో ఉట్ల పండుగమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రెండో రోజు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉట్ల పండుగను వైభవంగా నిర్వహించారు. పెదవీడు గ్రామానికి చెందిన యాదవులు ఆలయ కల్యాణ మండపం వద్ద ఉట్లు గొట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో నవీన్కుమార్, అర్చకులు, యాదవులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక మేళ్లచెరువు: మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు రాగుల నరేష్యాదవ్ మరోసారి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అక్టోబర్ 8 నుంచి అమెరికాలో జరగనున్న పారా ఒలింపిక్ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తాను ఎంపికై నట్లు నరేష్యాదవ్ ఆదివారం తెలిపారు. గతంలో వివిధ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన నరేష్,.. 2014లో చైనాలో జరిగిన ప్రపంచ పారా బీచ్ వాలీబాల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. తన ప్రతిభను గుర్తించి అమెరికాలో జరగనున్న పోటీలకు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా తనను ఎంపిక చేసినట్లు నరేష్ వెల్లడించారు. చిన్నతనంలో కాలుకు పోలియో సోకడంతో నరేష్ దివ్యాంగుడయ్యారు. నరేష్ చిన్నతనం నుంచి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో వివిధ విభాగాల్లో ఎన్నో పతకాలు సాధించారు. -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్కు 6,191 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 5,060 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 642.50 అడుగుల(3.84 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. -
అనువైన స్థలంలోనే వ్యవసాయ కళాశాల
హుజూర్నగర్ : ప్రజలకు అన్ని రకాలుగా అనువుగా ఉన్న స్థలంలోనే వ్యవసాయ కళాశాల నిర్మిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 1041లో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల విస్తీర్ణం, వాటి స్థితిగతులను మంత్రికి, అధికారులకు ఆర్డీఓ శ్రీనివాసులు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాల నిర్మాణానికి హుజూర్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1041లో గల ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయని, రోడ్డు సౌకర్యం కూడా ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఈ భూములకు సాగు నీరు సైతం అందుతోందని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య, డీన్ ఝాన్సీరాణి, డీఎస్ఎ వేణుగోపాల్రెడ్డి, లింగయ్య, ఎస్పీ కే నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఏఓ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకుందాం
కోదాడ: ప్రభుత్వ స్కూళ్లు మూతపడకుండా కాపాడుకోవడం మన బాధ్యత అని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఆ సంస్థఽ జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి నివాసంలో జరిగిన సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, పాఠశాలలను ఇరుకై న గదుల్లో కాకుండా విశాలమైన భవనాల్లో ప్రారంభించాలని కోరారు. విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కోరారు. సమావేశంలో వీరారెడ్డి, వెంకట రమణ, వీరబాబు, ఖాజామియా,రాంమూర్తి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటనారాయణ, కరుణాకర్ పాల్గొన్నారు. ఫ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి -
పోరుబాటను జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్ : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న సీపీఎం పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన సీపీఎం సూర్యాపేట రూరల్, త్రీ టౌన్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, సీపీఎం త్రీ టౌన్ కార్యదర్శి చిట్లంకి యాదగిరి, సీపీఎం రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యులు నారాయణ వీరారెడ్డి, నల్ల మేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేయాలి
సూర్యాపేట అర్బన్ : కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని వీఎన్ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా కె.చైతన్య, ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ వర్మ, కోశాధికారిగా ఎస్.రమేష్, ఉపాధ్యక్షుడిగా ఎన్.జానయ్య, సహాయ కార్యదర్శిగా త్రివేణి, పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నెమ్మాది మాట్లాడారు. -
వీడని వరద.. తీరని వ్యథ!
సూర్యాపేట అర్బన్ : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో ఇళ్ల చుట్టూ, వరిపొలాల మీదుగా వరదనీరు పారుతోంది. మళ్లీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు, పిల్లలమర్రి చెరువు అలుగు పోస్తున్నారు. ఆయా చెరువుల వరదంతా పట్టణంలోని ఎస్వీ కాలేజీ వెనుక నుంచి ప్రియాంక నగర్, ఆర్కే గార్డెన్ మీదుగా ఎస్పీ ఆఫీస్ దగ్గర గల ఈదులవాగు నుంచి నల్ల చెరువులోకి చేరుతోంది. ఆయా కాలనీలను వరద వదలడం లేదు. ఫలితంగా ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరద ముప్పు తప్పేలా శాశ్వత పరిష్కారం చూడాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలగిరి, మోతె, ఇతర మండలాల్లోనూ చెరువులు అలుగు పోస్తూ వరిపొలాలను ముంచెత్తుతున్నాయి. ఫ అలుగు పోస్తున్న చెరువులు ఫ సూర్యాపేటలో పలు కాలనీలు జలమయం ఫ ఇతర మండలాల్లో నీట మునిగిన వరిపొలాలు -
భవితకు పునాది ‘బాలబడి’
ఫ కృష్ణమ్మ కాంతులునాగారం : బుడిబుడి అడుగుల దశలోనే చిన్నారులను బడిబాట పట్టించి వారి ఉజ్వల భవితకు పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్) కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఆకట్టుకునేలా బాలబడి కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందించారు. సృజనాత్మకతను పెంచేలా కొత్త సిలబస్ను అమలు చేస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య సజావుగా సాగేలా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరదీపికలు పంపిణీ చేశారు. సులువుగా అర్థమయ్యేలా.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా ‘ప్రియదర్శిని’ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. నూతన పాఠ్యాంశాలు, వినూత్న అంశాలు ఇందులో పొందుపర్చారు. గత విద్యా సంవత్సరంలో ‘తంగేడు పువ్వు’ పేరుతో నాలుగు పుస్తకాలు పంపిణీ చేయగా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా వచ్చిన ప్రియదర్శిని పుస్తకాలతో చిన్నారుల్లో విజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. పర్యవేక్షణ పెంచితే సత్ఫలితాలు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. అంగన్వాడీలపై పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి, సిలబస్ ప్రకారం బోధిస్తేనే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన సిలబస్ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో భాషపై ప్రాథమికంగా పట్టు సాధించేందుకు వీలుంటుంది. కొత్త సిలబస్ ద్వారా లోతైన విజ్ఞానం పొందవచ్చు. – దయానందరాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఫ అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు కొత్త కార్యక్రమం ఫ చిన్నారులను ఆకట్టుకునేలా కరదీపికలు ఫ ప్రియదర్శిని పేరుతో పాఠ్యపుస్తకాలు ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 అంగన్వాడీ కేంద్రాలు 1,209 3–6 ఏళ్లలోపు చిన్నారులు 18,066 -
సర్కారు కార్యాలయాలకు సౌర వెలుగులు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యుత్ ఆదా చేయడంతోపాటు ఆయా శాఖలకు భారంగా మారుతున్న విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ఊరట కలగనుంది. ఈ క్రమంలో తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సౌర విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు వివరాల సేకరణ పక్కాగా భవనాలు ఉన్న కార్యాలయాల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పక్కాగా భవనాలు ఉన్న కార్యాలయాల వివరాలను టీజీ రెడ్కో అధికారులు సేకరిస్తున్నారు. ఏ భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది..? అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయన్న వివరాలను మండల స్థాయి నుంచి సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాల భవనాలు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా.. పక్కాగా భవనాలు కలిగిన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం నెలకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది? ఎంత విద్యుత్ బిల్లు వస్తోందన్న వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. ఈ లెక్కన తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న భవనాలకు హెచ్టీ సర్వీస్ కింద సోలార్ ప్లాంట్లను బిగించనున్నారు. రూ.2 వేల నుంచి రూ.3 వేల కరెంట్ బిల్లులు వచ్చే కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద మూడు నుంచి ఐదు కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాలమైన భవనాలతో ఎక్కువ విద్యుత్ వినియోగించే వాటికి హెచ్టీ సర్వీస్ కింద 100 కిలోవాట్లకుపైగా సోలార్ ప్లాంట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కేటాయిస్తే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశముంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు ఉన్నాయి. ఈ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఎంత మేర ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న వివరాలు సేకరిస్తున్నాం. ఇంకా మండలాల నుంచి వివరాలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. – సంతోష్, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ ఫ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం ఫ ఇప్పటికే కలెక్టరేట్లో వినియోగం ఫ తప్పనున్న బిల్లుల భారం ఫ వివరాలు సేకరిస్తున్న టీజీ రెడ్కో అధికారులు -
నేడు, రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్రెడ్డి ఆది, సోమవారం రెండు రోజుల పాటు హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పాలకవీడు మండలం రాఘవాపురంలో, సాయంత్రం 4:15 గంటలకు హుజూర్నగర్ శివారులోని మగ్దుం నగర్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు స్ధల పరిశీలన చేస్తారు. అనంతరం 5 గంటలకు హుజూర్నగర్లోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 6 గంటలకు పట్టణంలోని మంత్రి తన ఇంటికి చేరుకుని రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం 8:40 గంటలకు పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్ను మంత్రి ప్రారంభించి, నూతన ఓపీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంప్లో నీటిపారుదల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి కోదాడకు వెళతారు. సీఎం, మంత్రులందరిదీ కమీషన్ పాలనే..మఠంపల్లి: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులందరిదీ కమీషన్ పాలనేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో రుణమాఫీ, రైతు భరోసా వందశాతం పూర్తిచేసినట్టు నిరూపించాలన్నారు. గతంలో ఎత్తిపోతల పథకాలను అడ్డుకున్న మంత్రి ఉత్తమ్ ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్పై ప్రజలకు ఎంత ప్రేమ ఉందో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తెలిసిపోతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మాజీ జెడ్పీటీసీ జగన్నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహరాజు, నాయకులు బీవీ రామారావు, హఫీజ్ఖాన్, పుల్లారెడ్డి, బాలాజీనీయక్, లక్ష్మీనరసింహారెడ్డి, సైదులు, కోటా నాయక్, జాలకిరణ్, నాగయ్యయాదవ్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పొదుపు సంఘాల్లోకి కిశోర బాలికలు
నాగారం : ఇందిరా మహిళా శక్తి మిషన్లో భాగంగా చిన్నప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయడం, బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు 15–18 ఏళ్ల లోపు కలిగిన కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితోపాటు దివ్యాంగ మహిళలు, 60 ఏళ్లు పైబడిన మహిళలతో కొత్తగా పొదుపు సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు రోజు వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు, సలహాలు అందజేశారు. అయితే మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఇప్పటి వరకు 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన మహిళలకు మాత్రమే సభ్యత్వం ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దివ్యాంగులు, కిశోర బాలికలతోపాటు అరవై ఏళ్లు దాటి మహిళలకు ఆర్థిక చేయూత లభించే అవకాశం కలిగింది. ఈ వారంలో సంఘాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలో ఇప్పటికే 17,976 స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ)లు ఉన్నాయి. మహిళా శక్తి కింద అర్హులైన మహిళందరితో కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సంఘాల్లో చేర్చనున్నారు. దీంతో అదనంగా మరిన్ని సంఘాలు ఏర్పాటు కానున్నాయి. దివ్యాంగులు, కిశోర బాలికలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు అవకాశం కల్పిస్తారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేసింది. ఇటీవలే జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మండల స్థాయి సదస్సులతో అర్హులను గుర్తిస్తున్నారు. ఈనెల మూడో వారంలో కొత్తగా సంఘాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటిలో అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల మూడు, నాలుగో వారంలో బ్యాంకు పొదుపు ఖాతాలు తెరిపించనున్నారు. ఈ నెల 30న సంఘాల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసి అనంతరం బ్యాంకు లింకేజీ తదితర రుణాలు మంజూరు చేయనున్నారు. ఫ కొత్తగా దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన మహిళలకూ అవకాశం ఫ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం ఫ మరింత మందికి చేయూతనిచ్చేలా కార్యాచరణ ఫ నెలాఖరులోగా ఆన్లైన్లో వివరాల నిక్షిప్తం ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో అర్హులైన వారందరినీ చేర్పించేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. ఏపీఎం, సీసీలకు అవగాహన కల్పించాం. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. – వీవీ.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట మొత్తం సభ్యుల సంఖ్య 1,84,774 స్వయం సహాయక సంఘాలు 17,976 -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
భానుపురి (సూర్యాపేట) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిన ఘనత భారత దేశానికే దక్కిందన్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3.48 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా రూ.191.78 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. రూ.500లకే గ్యాస్ పథకం కింద జిల్లాలో 4,05,898 మంది వినియోగదారులకు 5,52,043 సిలిండర్లు పంపిణీ చేసి సబ్సిడీ కింద రూ.15.26 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు ఇక నుంచి ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో కమీషన్ సొమ్మును ప్రతినెలా జమ చేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం పేదలకు ఆహార భద్రత కల్పించామని, ఇందుకోసం గత ఉగాది నుంచి సన్నబియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 3,26,057 రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీకగా నిలిచే రేషన్ కార్డులను పదేళ్ల తర్వాత అర్హులందరికీ ఇచ్చామన్నారు. కొత్తగా జిల్లాలో 36,812 కార్డులు మంజూరు చేయడమే కాకుండా 70,932 మంది సభ్యుల పేర్లను చేర్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి పరిమితులు లేకుండా ప్రతి రైతుకు సాయం చేశామని చెప్పారు. ఈ పథకంలో 2,87,234 మంది రైతుల ఖాతాల్లో రూ.366.50 కోట్లు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పధకం కింద జిల్లాలో 2024–25లో మృతిచెందిన 817 మంది రైతుల నామినీలకు రూ.35 కోట్లను చెల్లించామని తెలిపారు. సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాకు రూ.500ల చొప్పున బోనస్ చెల్లించి సన్నవడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఎత్తిపోతలకు అధిక నిధులు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా జిల్లాలో తక్కువ ఖర్చుతో లిఫ్టులు నిర్మించి ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చామన్నారు. జిల్లాలో మొత్తంగా 5,85,464 ఎకరాల ఆయకట్టు ఉందని, ఎత్తిపోతల పథకాలకు రూ.కోట్లాది నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా లైనింగ్ పనులకు రూ.29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్కు రూ.184.60, , జాన్పహాడ్ మేజర్ లైనింగ్ పనులకు రూ.52.11 కోట్ల చొప్పున మంజూరు చేశామన్నారు. ఇవేకాకుండా మూసీ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని, చెక్డ్యామ్లనిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగేలా చేస్తున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరిచ్చి రెండు సీజన్లలో పంటలు పండేలా చేసి తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో టీజీ ఎస్ఆర్డబ్ల్యూఎస్, వైష్ణవి పాఠశాల, బాల భవన్, జెడ్పీహెచ్ఎస్ చివ్వెంల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభినందించి వారితో ఫొటోలు దిగారు. అనంతరం పలువురికి బహుమతులు అందించారు. గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిస్వాతంత్య్ర సమర యోధులను సన్మానిస్తున్న మంత్రి ఉత్తమ్తొలి విడతగా జిల్లాలో 12,868 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా 1,050 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటికి రూ.22 కోట్లను లబ్దిదారులకు చెల్లించామన్నారు. విద్యాపరంగా కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయం, హుజూర్నగర్కు వ్యవసాయ కళాశాల మంజూరు చేయించినట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులైన గరిడేపల్లికి చెందిన గంట లక్ష్మారెడ్డి, నడిగూడెంకు చెందిన భిక్షమయ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఫ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి ఫ ఇక నుంచి రేషన్ డీలర్లకు నేరుగా కమీషన్ డబ్బులు ఫ 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీరు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. శుక్రవారం ఉద యం 7,200 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి 15,109 క్యూ సెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటిమట్టం 645 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఉదయం తెరిచిన ఆరు క్రస్టు గేట్లకు అదనంగా సాయంత్రం మరో మూడు క్రస్టు గేట్లను(మొత్తం 9 గేట్లు) రెండు అడుగుల మేర ఎత్తి 14,910 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల : సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదమున్నందున ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్ఓ జి.చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం ఆయన మునగాల మండలం కలకోవలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో సేవలందించాలన్నారు. డెంగీ సోకిన వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, సూపర్వైజర్ జయమ్మ, ఏఎన్ఎంలు నాగమణి, శాంతమ్మ, లలిత, నర్సమ్మ, హెల్త్ అసిస్టెంట్లు లింగం రామకృష్ణ, కొర్రా లింగయ్య సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చివ్వెంల : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళల కోసం తెచ్చిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లను ప్రారంభించారు. అనంతరం బధిరుల పాఠశాలకు చెందిన మూగ విద్యార్థి చేసిన యోగాసనాలు, బాలసదన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యాపకుల కృషితోనే అడ్మిషన్లు పెరిగాయి నేరేడుచర్ల : అధ్యాపకుల కృషితోనే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాధికారి(డీఐఈఓ), నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భానునాయక్ అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ విద్యార్థులలకు బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు. ఈ కళాశాలలో పనిచేసి రిటైరైన రామానుజాచార్యులు జ్ఞాపకార్థంగా ఆయన సతిమణీ మంగతాయారు ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు రూ.2,500 చొప్పున లయన్స్క్లబ్ ద్వారా నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గున్రెడ్డి, సైదిరెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, కార్యదర్శి యూసుఫ్, సభ్యులు విశ్వనాథం, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, అధ్యాపకులు వెంకటరమణ, మద్దిమడుగు సైదులు, ప్రణతి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, అంజయ్య, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఐదు గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 1,55,464 క్యూసెక్కుల వరద వస్తుండగా ఐదు గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి 1,67,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపా రు. అనంతరం శ్రీసామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం తంతు చేపట్టారు. ఆ తర్వాత గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
సాగర్కు స్వలంగా తగ్గిన వరద
ఫ 14గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్: ఎగువ నుంచి సాగర్కు వరద స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా 26గేట్లను ఎత్తిన అధికారులు.. శుక్రవారం 14గేట్లకు తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. వద్ద పద్నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,44,694 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి 14 గేట్ల నుంచి, విద్యుదుత్పాదనతో కలిపి 1,38,244 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.90 అడుగులు ఉంది. -
కూలిన గుండ్లసింగారం బ్రిడ్జి
నూతనకల్ : వరద ఉధృతి కారణంగా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామం వద్ద బ్రిడ్జి స్వల్పంగా కూలింది. వర్షాలకు దెబ్బతిన్న ఈ బ్రిడ్జిని తక్షణ చర్యల్లో భాగంగా గతేడాది రూ.3లక్షల నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టారు. అధికారులు కూడా పర్యవేక్షించకపోవడంతో బ్రిడ్జి మరమ్మతులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ప్రస్తుత కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి అధికంగా రావడంతో గతంలో మరమ్మతులు చేసిన ప్రాంతంలో బ్రిడ్జి కూలింది. విషయం తెలుసుకున్న ఆర్అండ్బీ డీఈ పద్మావతి సంఘటన స్థలాన్ని సందర్శించారు. వాహనాలదారులు ప్రమాదం బారిన పడకుండా బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని గుర్తు పట్టేలా మార్కింగ్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఫ మూణ్నాళ్ల ముచ్చటగా మరమ్మతులు ఫ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం -
రెండో జత యూనిఫాం ఎప్పుడో!
సూర్యాపేటటౌన్ : విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటికీ ఒక్క జత యూనిఫాం మాత్రమే అందజేశారు. రెండో జత యూనిఫామ్ కోసం జిల్లాల వారీగా వస్త్రాన్ని జూలైలో ఉన్నతాధికారులు అందించారు. 15 ఆగస్టు వరకు రెండో జత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా నేటికీ అతిగతీ లేదు. ఒక్క జతతోనే విద్యార్థులు రోజూ పాఠశాలలకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు చేరని చొక్కా వస్త్రం.. అయితే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రెండో జతకు సంబంధించి వస్త్రం వచ్చి కుట్టుపని సైతం పూర్తి కావచ్చినట్టు సమాచారం. అయితే మన జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు రెండో జత కోసం బాలబాలికలకు పైజామా, నిక్కర్లు, ఫ్యాంట్ వస్త్రాలు మాత్రమే వచ్చాయి. చొక్కా వస్త్రం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు రెండో జత అందే అవకాశం లేకుండా పోయింది. రోజు ఒక్క జతే వాష్ చేసుకొని అదే వేసుకొని స్కూల్కు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో ఒకే జత ఉతికితే మళ్లీ అది ఆరకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు సివిల్ డ్రెస్లోనే వస్తున్నారు. కొత్తవారికీ అందని యూనిఫామ్ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 23,547 మంది బాలురు, 25,827 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక్కో జత చొప్పున 49,374 జతలు కుట్టించి పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు అందజేశారు. అయితే జూన్లో ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో 5,500 మంది విద్యార్థుల వరకు అడ్మిషన్లు వచ్చాయి. వీరికి కూడా అదనంగా యూనిఫామ్స్ అందించాల్సి ఉంది. ప్రస్తుతం రెండో జతకు సంబంధించి నిక్కర్, పైజామా, ఫ్యాంట్లకు సంబంధించి వస్త్రం వచ్చింది. ఆయా మండలాల ఎంఈఓలకు పంపించాం. చొక్కా సంబంధించి కూడా త్వరలోనే వస్తుంది. రెండో జత యూనిఫాం కూడా సకాలంలోనే అందిస్తాం. – రాంబాబు, జిల్లా సెక్టోరియల్ అధికారిఫ ఇప్పటి వరకు ఒక్క జతే పంపిణీ ఫ ఈనెలలో రెండో జత అందించాలని ప్రభుత్వం ఆదేశం ఫ వస్త్రం రాకపోవడంతో ఆగిన ప్రక్రియ ఫ జిల్లా వ్యాప్తంగా 950 స్కూళ్లు.. 49,374 మంది విద్యార్థులు -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
భానుపురి : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిఒ క్కరూ సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కోరారు. సూర్యాపేటలో రూ.1.5 కోట్ల వ్యయంతో చేపడుత్ను గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. భావితరాలకు మంచి విద్యను అందజేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలో మౌలిక వసతుల కల్పనకు మరో కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి అదనంగా మరో రూ.కోటి మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, గ్రంథాలయాల సెక్రటరీ బాలమ్మ పాల్గొన్నారు. -
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు. -
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది. అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో అమలు చేశా ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం. – సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్ -
సేంద్రియ సాగులో మేటి ‘వాసికర్ల’
నడిగూడెం : ఎకరంన్నర విస్తీర్ణం కలిగిన భూమిలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడాదంతా రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా వివిధ రకాల పంటల(సమీకృత)ను సాగు చేస్తున్నాడు నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వాసికర్ల శేషు కుమార్. ఒక ప్రత్యేక షెడ్డులో పైన గొర్రెలు, కింద నాటుకోళ్లు పెంచుతున్నాడు. రెండు గుంటల భూమిలో చేపల పెంపకం చేపట్టాడు. ఇక మిగతా స్థలంలో ఉద్యానవన పంటలైన కొబ్బరి, నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ, దానిమ్మ, సపోట, అరటి, డ్రాగన్ ఫ్రూట్, లీచి, అంజీర, చింత, బంతి, కూరగాయల పంటలైన సొర, బీర, కాకర, బొంతు కాకర, వంగ, గోరుచిక్కుడు, పొట్ల, కీర, మిర్చి, టమాట, దోస, ప్రస్తుత సీజన్లో పెసర పంటను సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగుతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఈ పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పశువుల పేడ, నీమాస్త్రం, వేప నూనె తదితర వాటిని వాడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనతో పాటు, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వరికి బదులుగా సమీకృత వ్యవసాయ చేయాలి. తక్కువ స్థలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాను. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధ పద్ధతులు పాటిస్తున్నాను. – వాసికర్ల శేషు కుమార్, రైతు, సిరిపురం -
వరద జోరు..
సూర్యాపేట : రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్నిచోట్ల వరద లోలెవల్ బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాలుగు రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన ఉండగా మూడోరోజు కాస్త విరామం ఇచ్చింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కోదాడలోని షిరిడీసాయినగర్ కాలనీలోకి.. సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం వద్ద కల్వర్టుపై ప్రవహిస్తున్న నీళ్లలోంచి ఓ వ్యక్తి బైక్పై వెళ్లగా.. అదుపు తప్పడంతో బైక్ను అక్కడే వదిలి వచ్చాడు. మఠంపల్లి మండలం యాతావాకిళ్ల – హనుమంతులగూడెం ప్రధాన రహదారిపై వేములూరు వాగు బ్రిడ్డి పైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు అలుగు కారణంగా గోపాలపురం – బూరుగడ్డ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. కోదాడ మండలం నల్లబండగూడెం – మంగల్తండా మధ్యలో వంతెనపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూర్ (ఎస్) నుంచి నెమ్మికల్ వెళ్లే దారిలో లోలెవల్ బ్రిడ్జిపై బుధవారం రాకపోకలు నిలిచిపోగా గురువారం సాగాయి. మేళ్లచెర్వు – కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. కోదాడ పెద్దచెరువు అలుగు పోయడంతో తమ్మర వాగునుంచి షిరిడీ సాయినగర్ కాలనీలోకి వరద చేరింది. పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. కాలనీలోని పలు ఇళ్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడారు. -
స్వాతంత్య్ర వేడులకు ముస్తాబు
భానుపురి (సూర్యాపేట) : స్వాత్రంత్య దినోత్సవానికి సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముస్తాబయింది. శుక్రవారం ఉదయం 9గంటలకు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9:40కి ప్రసంగిస్తారు. 10 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులు, అతిథుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. 10.05కి విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 10.20కి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 11.15కు స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ .. హుజూర్నగర్కు వెళ్లి వ్యవసాయ కళాశాల స్థలం విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. సాయంత్రం హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భరద్రత పాటించడంలో నిర్లక్ష్యం వద్దుభానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ప్రమాదకర పరిశ్రమలపై వివిధ విభాగాల ఉన్నత స్థాయి అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూర్యాపేటలోని సువెన్ ఫార్మా, నామవారంలోని పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, చివ్వెంలలోని రావూస్ ఫార్మా, నల్లబండగూడెంలోని ఫోరస్ ఫార్మా, కోదాడలోని మేఘ గ్యాస్లకు సంబంధించిన తనిఖీ వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం సీతారాం నాయక్, లేబర్ డిప్యూటీ కమిషనర్ అరుణ, బాయిలర్ ఇన్స్పెక్టర్ భీమారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలిసూర్యాపేటటౌన్ : బంగారం షాపుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. బ్యాంకులు, బంగారం దుకాణాల భద్రతపై అధికారులు, బంగారం షాప్ యజమానులతో గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వ్యాపారులు స్వీయ భద్రత చర్యలు పాటించాలన్నారు. బలమైన లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలోజిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, నాగేశ్వరరావు, శివ శంకర్, నర్సింహారావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, బ్యాంకర్స్, యజమానులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలురాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు. బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకంమీడియాకులవివక్ష6చట్టసభలు అధికార యంత్రాంగం21 న్యాయ వ్యవస్థ3924కొద్దిగాలేదుఅవును78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. 1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ? ఫ అవినీతి, పేదరికమే అసలు సమస్య ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే.. ‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం 3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ? -
అవినీతి లేని దేశంగా మారాలి
స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లు అవుతున్నా దేశంలో అవినీతి తగ్గడం లేదు. పొలిటికల్ పార్టీలు అధికారంలోకి రాగానే వారి అండదండలతో అధికారులు అవినీతిపరులుగా మారుతున్నారు. అవినీతి రహితంగా మారినప్పుడే భారతదేశం ప్రపంచంలో ఇంకా ముందంజలో ఉంటుంది. అలాంటి వ్యవస్థ ఏర్పడాలి. – ఎం.కల్యాణి, ఇంజనీరింగ్ విద్యార్థిని మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం చేయాలి దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు అత్యాచారాలు, కిడ్నాప్లకు గురవుతున్నారు. దీంతో ఆడపిల్ల బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. దేశంలో మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలి. – లలిత, ఇంజనీరింగ్ విద్యార్థినిదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం ఐటీ హబ్లను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేము భవిష్యత్లో ఈ దిశగా కృషి చేస్తాం. – వినూత్న, ఇంజనీరింగ్ విద్యార్థిని వందేళ్లకు చేరువలో ఉన్న భారతదేశంలో మరింతగా పోలీస్ సంస్కరణల అమలు జరగాలి. పోలీస్ శాఖను రాజకీయ ఒత్తిడుల నుంచి దూరంగా ఉంచాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. నాణ్యమైన విద్య, వైద్యం వీలైనంత తక్కువ ధరకు ప్రభుత్వమే అందించాలి. ఉచిత వైద్యం, విద్య పేరిట నాసిరకంగా సేవలు వెంటనే ఆపేయాలి. – సాయితేజ, ఇంజనీరింగ్ విద్యార్థి -
జిల్లా మంత్రులు దద్దమ్మలు
ఫ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ పరిధిలో నీరిచ్చే సోయి లేదు ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శనల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఏపీకి నీరు వదిలేంత ఆతృత జిల్లాలో రైతులకు ఇవ్వడంలో లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏఎమ్మార్పీ కింద కనగల్, నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 70 వేల ఎకరాలకు నీరందించిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డికి పట్టింపు లేదని మండిపడ్డారు. కృష్ణానది జలకళ సంతరించుకున్నా.. జిల్లాలోని చెరువులు ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మోటార్లు మరమ్మతుకు గురైతే సమీక్షించే బాధ్యత జిల్లా మంత్రి కోమటిరెడ్డికి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ నడిబొడ్డున ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రి సొంత క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు. నిజాం కాలం నాటి అతిథి గృహాన్ని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అంతకు ముందు పానగల్ ఉదయసముద్రాన్ని నాయకులతో పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, సింగం రామ్మోహన్, చీర పంకజ్యాదవ్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, బోనగిరి దేవేందర్, కంచనపల్లి రవీందర్రావు, రావుల శ్రీనివాస్రెడ్డి, పల్రెడ్డి రవీందర్రెడ్డి, ఐతగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, తండు సైదులుగౌడ్, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో మంత్రులు సిద్ధం చేసిన జాబితాలను రాష్ట్ర పార్టీకి పంపించారు. అందులో కొందరికి త్వరలోనే డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు వందవరకు ఉండగా, ఒక్కో దాంట్లో నాలుగైదు డైరెక్టర్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు జాబితాలు ఇవ్వాలని గతంలోనే మంత్రులకు రాష్ట్ర పార్టీ సూచించింది. అందుకు అనుగుణంగా ఆయా పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున పేర్లను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. అందులో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశంలభించనుంది. స్థానిక ఎన్నికలకు ముందే భర్తీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. పార్టీలో పనిచేసే వారికే పదవులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. అంతకంటే ముందుగానే కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బాగా పని చేస్తుందనే అంచనాల్లో ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడి పని చేస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అందుకే ముందుగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. చైర్మన్ పదవులు ఎప్పుడు...? ప్రస్తుతం కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆశావహులు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో చైర్మన్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తామన్నది ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది. ఫ రాష్ట్ర పార్టీకి జాబితాలను పంపించిన జిల్లా మంత్రులు ఫ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి దక్కనున్న డైరెక్టర్ పదవులు ఫ వీరి నియామకం తర్వాతే స్థానిక ఎన్నికలు ఫ చైర్మన్ పదవులపై వీడని సందిగ్దం -
చట్టవ్యతిరేక పనులు చేయవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : చట్ట వ్యతిరేక పనులు చేయకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సబ్ జైలును ఆమె తనిఖి చేశారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైలు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఖైదీల తరఫున వాదించడానికి న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. లేకుంటే లీగల్ ఎయిడ్ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి, న్యాయసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
గణేశ్ ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించడం అవసరం
సూర్యాపేటటౌన్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, భద్రతా పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలు పాటించాలని కోరారు. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. పరిసరాలు అపరిశుభ్రంగా చేయవద్దని, డీజేలు పెట్టొదని, బాణసంచా పెల్చొద్దని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని కోరారు. ప్రయాణికులు, సామాన్యులతో పాటు ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.అన్ని శాఖలు టార్గెట్ పూర్తి చేయాలిమోతె: వనమహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు మొక్కలు నాటి లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి(డీఆర్డీఓ) వి.వి. అప్పారావు సూచించారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో ఫీల్డ్అసిస్టెంట్లతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ సైట్లో నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు.‘కళ్యాణ లక్ష్మి’ కుంభకోణంలో షోకాజ్ నోటీసులు జారీకోదాడ: అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల కుంభకోణంలో మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు కోదాడ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ మండల పరిధిలోని కొత్తగూడెంలో కూడా భారీ ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కులు పక్కదారి పట్టిన విషయంలో అధికారులు విచారణ చేయకుండా మండలానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.14న వాలీబాల్ చాంపియన్షిప్ సెలక్షన్స్సూర్యాపేట : చైనాలో జరిగే అండర్–15 వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్ షిప్ కోసం తెలంగాణ టీం సెలక్షన్ ట్రయల్లో భాగంగా సూర్యాపేట జిల్లా సెలక్షన్లను ఈనెల 14న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం.కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రిపోర్ట్ చేయాలని కోరారు. వివరాలకు సెల్ నంబర్ 9848804353లో సంప్రదించాలని సూచించారు.కానిస్టేబుల్ సస్పెన్షన్సూర్యాపేటటౌన్ : నిత్యపెళ్లికొడుకుగా అవతారమెత్తిన కానిస్టేబుల్ కృష్ణంరాజును ఎస్పీ కె.నరసింహ మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజుకు 2012లో కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. మొదట సూర్యాపేటకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల కాపురం అనంతరం దంపతుల మధ్య వివాదం నెలకొంది. ఆమెతో విడిపోయేందుకు కృష్ణంరాజు రాజీ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఆరు నెలలు కాపురం చేసి విడాకులు ఇవ్వకుండానే పరిష్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలల క్రితం సూర్యాపేటకు చెందిన బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా విడిపోయేందుకు ప్రయత్నాలు చేసి నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కానిస్టేబుల్ బాగోతం వైరల్గా మారడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కృష్ణంరాజు కలెక్టరేట్లో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నాడు. -
కరువు తీరేలా వర్షం
జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం ఫ అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ ఫ పొంగిపొర్లిన వాగులు ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం సూర్యాపేట : కరువుతీరేలా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో సరాసరి 43.1 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగారం మండలంలో 187.9 మి.మీ, తిరుమలగిరిలో 180.4 మి.మీ, తుంగతుర్తిలో 132.3 మి.మీ, జాజిరెడ్డిగూడెంలో 121.3 మి.మీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగిపొర్లి చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. పలుచోట్ల లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతంగా ప్రవహించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ పి.రాంబాబులు సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రజలకు ధైర్యం చెప్పారు. ● నాగారం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఫణిగిరి, పసునూర్, పస్తాల, లక్ష్మాపురం, వర్థమానుకోట, నాగారం, డి.కొత్తపల్లి, ఈటూరు గ్రామాల్లోని చెరువులు అలుగులు పోస్తున్నాయి. వర్థమానుకోటలోని బిక్కేవారు అలుగుపోస్తోంది. పస్తాల, లక్ష్మాపురం, డి.కొత్తపల్లి గ్రామాల్లో ఉన్న బంధంల వద్ద(కల్వర్టులు) ప్రమాదకంగా నీరు ప్రవహిస్తోంది. నాగారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వరద తాకిడికి నాగారం–తుంగతుర్తి ప్రధాన రహదారి వెంట ఉన్న 11 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ● అర్వపల్లి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సూర్యాపేట – జనగాం హైవేలో పోలీస్స్టేషన్ రోడ్డు జలమయంగా మారింది. సుమారు 50 ఇళ్లు నీటమునిగాయి. కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ ఆవరణలు చెరువును తలపించాయి. కేజీబీవీ నుంచి 60మంది బాలికలను ట్రాక్టర్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కోడూరు – తిమ్మాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. అర్వపల్లిలో కలెక్టర్ పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ● తిరుమలగిరి మండలవ్యాప్తంగా అతిభారీ వర్షం పడింది. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు జలమయం కాగా.. వలిగొండ – తొర్రూర్ రూట్లో తొండ గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం సాగుతుండడంతో భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. తొండ గ్రామంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలోకి నీళ్లు చేరాయి. అంగన్వాడీ కేంద్రంలో బియ్యం, కోడిగుడ్లు తడిసిముద్దయ్యాయి. పలు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ● మద్దిరాల మండలంలో భారీ వర్షం పడడంతో కుక్కడం, గుమ్మడవెల్లి, పోలుమళ్ల, చిననెమిల, కుంటపెల్లి గ్రామాల్లోని చెరువులు మత్తడి దూ కాయి. పలు కాలనీల్లో ఇళ్లు చుట్టూ నీళ్లు చేరాయి. ● సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, ప్రియాంక కాలనీ, ఆర్కే గార్డెన్స్, శ్రీరాంనగర్, తిరుమలనగర్ కాలనీల్లోకి వరద చేరింది. ఆయా ప్రాంతాలను అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ హనుమంతరెడ్డి పరిశీంచారు. ● ఆత్మకూర్ మండలం చివ్వెంల – ముకుందాపురం రోడ్డులో ఏపూరు బ్రిడ్జిపై నుంచి బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో రాకపోకలు నిలిచిపోయాయి. ● తుంగతుర్తి మండలంలో చాలా గ్రామాల్లో చెరువు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. సంగెం – కోడూరు రహదారిపై వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.)మండలం వర్షపాతం నాగారం 187.9 తిరుమలగిరి 180.4 తుంగతుర్తి 132.3 జాజిరెడ్డిగూడెం 121.3 నూతనకల్ 80.9 మద్దిరాల 69.7 సూర్యాపేట 49.2 చిలుకూరు 28.3 ఆత్మకూర్ (ఎస్) 23.8 గరిడేపల్లి 22.2 నేరేడుచర్ల 16.8 కోదాడ 6.9 మునగాల 9.8 హుజూర్నగర్ 11.2 పెన్పహాడ్ 7.8 మోతె 7.2 మేళ్లచెర్వు 7.3 చింతలపాలెం 5.5 చివ్వెంల 12.0 పాలకీడు 2.9 అనంతగిరి 1.9 మఠంపల్లి 1.9 నడిగూడెం 2.3 -
ప్రథమ సంవత్సరంలో 450మంది చేరిక
కోదాడ: కొన్నేళ్లుగా అడ్మిషన్లులేక వెలవెలబోతున్న కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం వచ్చింది. కళాశాల స్వయంప్రతిపత్తిగా మారడం.. కోదాడలోని నాలుగు ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్లు తీసుకోకపోవడం ఈ కాలేజీకి కలిసి వచ్చింది. కొంతకాలంగా 200 మంది చేరడమే గగనమవుతున్న తరుణంలో ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్లో వివిధగ్రూపుల్లో కలిపి ఇప్పటి వరకు 450 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషం. బీఏ గ్రూప్లో 189 మంది, బీకాంలో 95 మంది, బీఎస్సీ పిజికల్ సైన్స్లో 101 మంది, లైఫ్ సైన్స్లో 48 మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరినప్పటికీ కళాశాలలో సరైన సౌకర్యాలు లేవనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్లు పాతవి కావడంతో తరచూ మొరాయిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వర్షానికి షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కొందరు విద్యార్థులు తెలిపారు. వసతులను మెరుగు పర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఫ కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం -
మూసీకి స్వల్పంగా తగ్గిన ఇన్ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి 4,365 క్యూసెక్కుల వదరనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండడంతో అధికారులు శనివారం ఐదు గేట్లు తెరవగా రెండింటిని ఆదివారం మూసి వేశారు. మిగతా మూడు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 3,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 643.50 అడుగుల వద్ద ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఫ మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల -
పింఛన్ల సభను జయప్రదం చేయాలి
నాగారం : చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే దివ్యాంగుల ఆసరా పింఛన్ల సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ కోరారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సైదులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మంద కృష్ణమాదిగ ఈ సభకు హాజరవుతారని, వృద్ధులు, దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బొజ్జ అశోక్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, రుద్రపంగు సురేష్, వీహెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ మాదిగ, పాల్వాయి బాలయ్య, చెడపక గంగరాజు, కొండగట్టు శ్రీనివాస్, బొంకూరి కృష్ణ, కండే అనిల్, చింతకుంట్ల నరేంద్ర, బొజ్జ సతీష్, మిరియాల చింటూ, బొజ్జ రవి, బొజ్జ వెంకన్న, బొజ్జ బజార్, పోగుల లింగమ్మ, నాతి వెంకన్న, సైదమ్మ, సత్తయ్య, సత్తయ్య చిత్తలూరు సత్తమ్మ, వడ్డకొండ్ల సోమయ్య, మేడే మాణిక్యం, మంగమ్మ, భాగ్యమ్మ, నర్సయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. నేడు మంద కృష్ణమాదిగ రాక తిరుమలగిరి( తుంగతుర్తి ) : చేయూత పెన్షన్దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తిలో జరిగే సభకు మంద కృష్ణమాదిగ హాజరవుతారని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న తెలిపారు. ఆదివారం తొండ, మామిడాల, వెలిశాల తిరుమలగిరి, మాలిపురం గ్రామాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న అధ్యక్షతన జరిగిన గ్రామసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో సీహెచ్ వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, రాధ, ఎల్లయ్య యాదవ్, రావుల మల్లేష్ మతి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంత.. తీర్చును చింత
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ ఏడాది వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రజలకు నీటి కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమస్య అధిగమించాలంటే నీటిని భూమిలోకి ఇంకించడం ఒక్కటే మార్గం. వాన నీటిని ఒడిసి పట్టడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు తవ్వినట్లయితే నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసేలోపు విస్తృతంగా ఇంకుడు గుంతలు తవ్వితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.. వార్డుకు పది చొప్పున తవ్వితే.. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులు ఉన్నాయి. వార్డుకు 10 చొప్పున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములై విస్త్రత ప్రచారం చేపడితే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ సీసీరోడ్లు నిర్మించడంతో వర్షం కురిసినా కూడా నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. సీసీ రోడ్ల పక్కన భారీ గుంతలు తవ్వి వాన నీళ్లు ఇంకేలా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గుంతలపై ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మించే ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించకుంటే అనుమతి నిరాకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత నిర్మాణాల్లోనూ అ వకాశం ఉన్నచోట ఇంకుడు గుంతల ఏర్పాటుకు నో టీసులు జారీ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో బో రు ఉన్న ప్రతివారు ఇంకుడు గుంత తవ్వించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. ఫ గత వేసవిలో అడుగంటిన భూగర్భ జలాలు ఫ ఇబ్బంది పడిన ప్రజలు ఫ నీటి సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించాలంటున్న నిపుణులు ఫ వర్షపు నీటిని ఒడిసి పడితే తీరనున్న నీటి కష్టాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని చెబుతున్నాం. అలాగే అవసరం ఉన్నచోట ఇంకుడు గుంతలు నిర్మించాలని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. –మున్వర్ అలీ, మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి మున్సిపాలిటీ వార్డులసంఖ్య జనాభా సూర్యాపేట 48 1,33,339 కోదాడ 35 75,093 హుజూర్నగర్ 28 35,850 తిరుమలగిరి 15 18,474 నేరేడుచర్ల 15 14,853 -
ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం అర్ధరాత్రి చివ్వెంల మండల పరిధిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర్ణమి నిద్ర రాత్రులు కార్యక్రమంలో వేణారెడ్డి పాల్గొని మాట్లాడారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర.. పౌర్ణమి రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ పౌర్ణమి నిద్ర రాత్రుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గోపురానికి తీసుకువచ్చిన పసిడి కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ, కెక్కిరేణి శ్రీనివాస్, తంగెళ్ల కరుణాకర్రెడ్డి, రుద్రంగి రవి, పందిరి మల్లేశ్గౌడ్, రావుల రాంబాబు, మద్దెబోయిన శ్రీనివాస్, మద్దెబోయిన తిరుమలేష్, నబీఖాన్, జావేద్, సాగర్, లింగమంతులు, సంజయ్, కుర్ర సైదులు, లింగస్వామి, చిన్న మల్లయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.పూజలు చేసి హారతి ఇస్తున్న అర్చకుడు -
యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలి
హుజూర్నగర్ : యోగా విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురికంటి వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హుజూర్నగర్లోని టౌన్హాల్లో మహాయోగా సేవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా యోగా విద్య కరపత్రాన్ని స్థానికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు యోగాను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్నారు. యోగా మంత్రిత్వ శాఖ, యోగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. యోగా జీవన శాస్త్రవేత్తలను నామినేటెడ్ ద్వారా చట్ట సభల్లోకి తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన 50 వేల మంది యోగా సాధకులను నియమించి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ తలంబ్రాలతో వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలిమేళ్లచెరువు : పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హామీలను ఈ నెల 15 వరకు అమలు చేయని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. వైభవంగా సౌర హోమంఅర్వపల్లి : తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, కె.సత్యనారాయణ, మణికంఠ, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, మోనూపాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
బడిలోనే ఆధార్ నమోదు..
నాగారం : ఆధార్ కార్డు గుర్తింపు కోసమే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ధ్రువపత్రాల జారీకి అత్యంత కీలకంగా మారింది. ఏ విద్యార్థి, ఏ పాఠశాలలో చదువుతున్నాడు, విద్యార్థుల సంఖ్య వివరాలను ఒక్క క్లిక్తో తెలుసుకోవడానికి ప్రభుత్వం యూడైస్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరి. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలో చాలామందికి ఆధార్ లేకపోవడం సమస్యగా మారింది. ఆధార్కార్డు లేనివారి సంఖ్య వేలాదిగా ఉన్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పాఠశాలల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు, అప్డేట్ కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అన్నింటికీ ప్రామాణికం... పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నుంచి బడ్జెట్ కేటాయింపులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనం, యూ నిఫాం వంటివి అందుతాయి. జాతీయ ఉపకార వేతనాలకు బ్యాంకు ఖాతా అవసరం కావడం దా నికోసం ఆధార్ వివరాలు అత్యంత ప్రామాణికం. 31,203 మంది గుర్తింపు.. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 21,531 మంది విద్యార్థులకు పేరు సవరణ, 10,846 మందికి పుట్టిన తేదీ సవరణ, మరో 138 మందికి జెండర్ మార్పు ఇలా మొత్తం 31,203 మందికి ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉన్నట్లు తేలింది. వీరిలో 1, 2, 3 తరగతుల వారే అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎమ్మార్సీ కార్యాలయాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కిట్లను కూడా మంజూరు చేశారు. పర్యవేక్షణ లోపం, సిబ్బంది పట్టింపు లేమితో చాలాచోట్ల ఇవి కనుమరుగయ్యాయి. ప్రభుత్వ పరిధిలో కిట్లు అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. మండలానికి ఒకరు, అవసరం ఉన్నచోట ఇద్దరు సిబ్బందిని ఏజెన్సీవారు నియమించుకుంటున్నారు. ప్రస్తుతం నియామకమైన 23 మంది ఆయా మండలాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రత్యేక సిబ్బంది నేరుగా పాఠశాలకే వచ్చి కొత్త ఆధార్ నమోదుతోపాటు అవసరమైన విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. మార్పు, చేర్పులు, తప్పుల సవరణ, బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నారు. ఫ 31,203 మందికి ఆధార్ నమోదు, అప్డేట్ చేయాల్సి ఉందని గుర్తింపు ఫ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం ఫ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రక్రియ అప్డేట్ ప్రక్రియ కొనసాగుతోంది విద్యార్థుల ఆధార్ అప్డేట్ ప్రక్రియ జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతోంది. విద్యార్థులకు నూతన ఆధార్కార్డు నమోదు, పేర్లు, పుట్టిన తేదీల్లో మార్పులు, చేర్పులు వంటి వారిని ఏజెన్సీ సిబ్బంది పాఠశాలల్లోనే సవరిస్తున్నారు. –అశోక్, డీఈఓ, సూర్యాపేట -
నకిలీ హాజరుకు చెక్!
నాగారం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరుకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇ–కేవైసీ విధానం అమలు చేయనుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమాలు ఇలా.. జిల్లాలో 23 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 2.63 లక్షల జాబ్ కార్డులు ఉన్నారు. అందులో 5.70 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో ప్రస్తుతం పనులుచేస్తున్న వారు 2.15 లక్షల మంది ఉన్నారు. ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు క్షేత్ర సహాయకులు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు, ఒకరి పేరుమీది మరొకరు పనులకు వెళ్తున్నట్లు గుర్తించారు. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడడం, నగదు రికవరీలు చేయడం జరుగుతున్నా సిబ్బందిలో మార్పు కన్పించడం లేదు. వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్)ను తీసుకొచ్చింది. దీనిని సైతం క్షేత్రస్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతర ఫొటోలతోపాటు ఉపాధి హామీ పని చేయకపోయినా చేసినట్లు అప్లోడ్ చేస్తున్నారని తేలింది. దీంతో కూలీలకు ఆశించిన స్థాయిలో వేతనాలు రావడం లేదు. రోజుకు రెండుసార్లు ఫొటోలు అప్లోడ్.. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టడానికి ఇ–కేవైసీ విధానం ద్వారా హాజరు తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ అధికారులు ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీని సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ప్రకారం పనులకు వచ్చిన వెంటనే కూలీల ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు. తిరిగి నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి ఈ రెండు ఫొటోల్లో ఉంటే వేతనాలు మంజూరవుతాయి. లేదంటే వేతనాలు నిలిపివేస్తారు. ఈ విధానంపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇది అమలైతే నకిలీ హాజరుకు అవకాశం ఉండదు. అక్రమాలకు అవకాశం ఉండదు ఉపాఽధి హామీ కూలీలకు ప్రభుత్వం ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కూలీల ఇ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలు సేకరించడం పూర్తయిన తరువాత ఇ–కేవైసీ హాజరు విధానం అమలు చేస్తాం. ఇ–కేవైసీ హాజరుతో అక్రమాలకు అవకాశం ఉండదు. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట ఫ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఫ త్వరలో ఇ–కేవైసీ విధానం ఫ కూలీల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఉపాధిహామీ పథకం వివరాలు జాబ్ కార్డులు 2.63 లక్షలు నమోదైన కూలీలు మొత్తం 5.7లక్షలు పనులకు వెళుతున్న కూలీలు 2.15లక్షలు -
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ కె.నరసింహతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖ పరేడ్కు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జాబితా తయారు చేయాలని సూచించారు. డ్రగ్స్ను నిర్మూలించాలి అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్ కార్డ్, నషా ముక్త్ భారత్ అభియాన్పై ఎస్పీ నరసింహతో కలిసి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఈనెల 13న యాంటీ డ్రగ్స్పై పాఠశాలలు, కళాశాలలు యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం అనంతరం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. వానాకాలం ప్రారంభమైనందున ఇసుక సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ముందుగా ఇసుక బజారుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు. నాగారం మండలం పేరబోయినగూడెం అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జానపహాడ్, బెట్టెతండా, ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు, మున్నేరు వాగు రక్షణ గోడకు ఇరిగేషన్ శాఖకు ఇసుక అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ఎస్పీ కె.నర్సింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్, డీపీఓ యాదగిరి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, అబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మానాయక్, ట్రాన్స్ పోర్ట్ అధికారి జయప్రకాశ్రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కోదాడలో మళ్లీ వరద
కోదాడ: కోదాడ పట్టణంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కోదాడ పెద్దచెరువుకు భారీగా వరద రావడంతో అలుగు పోస్తోంది. దీంతో కోదాడ –అనంతగిరి రోడ్డుపై వరద పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి కోదాడ పెద్ద చెరువు అలుగునీటితో పూర్తిగా మునిగిపోయిన కోదాడ –ఖమ్మం రోడ్డులోని షిర్డీసాయినగర్ కాలనీ గురువారం రాత్రి కురిసిన వర్షానికి మరోసారి ముంపునకు గురైంది. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. పెద్దచెరువు అలుగు వాగులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వారం రోజుల క్రితం కాలనీ వాసులు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దచెరువు అలుగుపోసి వరద కాలనీ మీదకు మళ్లిందని, దీంతో మళ్లీ ముంపుబారిన పడ్డామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే భవానీనగర్ కూడా గతేడాది మాదిరిగానే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైంది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సాయంతో కాలనీ మధ్యలో ఉన్న నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న డివైడర్లను పగులగొట్టి వరదనీటిని కిందివైపు మళ్లించారు. అయితే గతేడాది ఈ రెండు కాలనీలను పరిశీలించిన కలెక్టర్ ఆక్రమణలు తొలగించి నాలా వంతెనను వెడల్పు చేయాలని ఆదేశించినా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే కోదాడ–అనంతగిరి రోడ్డులో పెట్రోల్బంక్ వద్ద ఉన్న ఎర్రకుంట అలుగు కాలువపై మజీద్ వద్ద పెద్ద గూనలతో కల్వర్టు నిర్మించి, కాల్వను వెడల్పు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఫ నీట మునిగిన షిర్డీసాయినగర్, భవానినగర్ కాలనీలు ఫ గతేడాది వరద ముంచెత్తినా ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు ఫ పెద్ద చెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలకు ఆటంకం -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
చివ్వెంల : సీజనల్ వ్యాధులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం చివ్వెంల పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది వివరాల గురించి వైద్యాధికారి భవానిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలకు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట హెల్త్ సూపర్వైజర్లు, సిబ్బంది ఉన్నారు. కేజీబీవీ సమస్యను కలెక్టర్కు వివరిస్తాం అర్వపల్లి: భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి అర్వపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం జలమయమై బాలికలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ అశోక్ అన్నారు. భారీ వర్షానికి జలమయమైన అర్వపల్లి కేజీబీవీని శుక్రవారం డీఈఓ అశోక్, జీసీడీఓ పూలన్ సందర్శించారు. కేజీబీవీలో ఉన్న బాలికలను తాత్కాలికంగా ఇళ్లకు పంపించారు. నీళ్లు తగ్గే వరకు బాలికలు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వారి వెంట ఎస్ఓ నాగరాణి, అధ్యాపకులు, సీఆర్టీలు, సిబ్బంది ఉన్నారు. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలిమునగాల: గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చి పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన మునగాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుంటల రమేష్దీనదయాళ్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతటా మోస్తరు వర్షం
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఐదారు రోజులుగా తీవ్ర ఉక్కపోత, ఎండ తీవ్రత ఉంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం కురిసింది. చాలాచోట్ల రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరగా.. పలు మండలాల్లో చెరువులు, కుంటల్లోకి వాగులు సాగాయి. జిల్లాలో అత్యధికంగా నడిగూడెం మండలంలో 101.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 16.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం వివరాలుమండలం వర్షపాతం నాగారం 65.2 తిరుమలగిరి 36.1 తుంగతుర్తి 36.4 మద్దిరాల 45.0 నూతనకల్ 59.9 జాజిరెడ్డిగూడెం 83.9 సూర్యాపేట 40.3 ఆత్మకూర్(ఎస్) 62.5 మోతె 58.6 చివ్వెంల 69.1 పెన్పహాడ్ 31.5 మునగాల 58.7 నడిగూడెం 01.0 అనంతగిరి 56.4 కోదాడ 88.5 చిలుకూరు 72.0 గరిడేపల్లి 48.0 నేరేడుచర్ల 34.6 పాలకవీడు 32.8 మఠంపల్లి 40.7 హుజూర్నగర్ 42.4 మేళ్లచెరువు 16.7 చింతలపాలెం 42.7 -
వరద పాఠం నేర్వలే..!
60 ఫీట్ల రోడ్డు జలమయంగా.. గతేడాది సెప్టెంబర్లో భారీ వర్షం వచ్చినప్పుడు 60 ఫీట్ల రోడ్డు వద్ద నాలా పొంగడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నాలాలో మట్టి తీసి శుభ్రం చేయడంతో సమస్య కొద్దివరకు పరిష్కారమైంది. నాలాలను పెద్దగా చేసి ఎప్పటికప్పుడు అడ్డంకులను తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని స్థానికులు అంటున్నారు. సూర్యాపేట అర్బన్ : భారీ వర్షం వస్తేచాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. అయితే గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు సుందరయ్య నగర్ కాలనీతోపాటు ఆర్కే గార్డెన్ సమీపంలోని వివిధ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సద్దుల చెరువు అలుగు పోయడంతో సుందరయ్య నగర్ కాలనీలోకి నీరు వచ్చి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. సద్దుల చెరువు అలుగు నీరు పారే కాలువ చెత్తాచెదారం మట్టితో కూరుకుపోవడంతో వరదనీరు సరిగా పారక ఇళ్లలోకి వస్తుంది. కాలువపై ఉన్న బ్రిడ్జిల దగ్గర చిన్నచిన్న గూనలకు బదులు పెద్ద గూనలు వేస్తే వరదనీరు సాఫీగా ముందుకెళ్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం.. భారీ వర్షం పడితే వరద నీరు తమ ఇళ్లలోకి వస్తుందని, వెంటనే అధికారులు స్పందించి ముందస్తుగా వరద ముంపు ముప్పు తప్పేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నాలా అస్తవ్యస్తం ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్కు వెళ్లే రోడ్డు వద్ద గల నాలా ప్రమాదకరంగా తయారైంది. బ్రిడ్జి కింద చిన్న చిన్న గూనలు వేయడంతో వాటిలో వరదనీరు సాఫీగా పోవడంలేదు. భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు వరదనీరు పైకివచ్చి బ్రిడ్జి కోతకు గురవుతోంది. పైగా ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ చిన్నపాటి చెరువులా తయారవుతుంది. గతంలో చిన్నగా ఉన్న కాలువని పెద్దగా చేయడంతో ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగిందని స్థానికులు అంటున్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్ ముందు గల ఈదులవాగు మీద చిన్నచిన్న గూనలు వేసి నిర్మించడంతో ఇరుకుగా మారింది. దీంతో ఎస్వీ కాలేజ్ వెనుక ప్రాంతమైన ఆర్కే నగర్ జలమయంగా మారుతుంది. బ్రిడ్జి మీద నుంచి వెళ్లే మామిళ్లగడ్డ, సీతారాంపురం, ఇందిరమ్మ కాలనీ రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈదులవాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ‘పేట’కు ముంపు ముప్పు తప్పేదెలా..? ఫ భారీ వర్షాలకు మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు ఫ గతేడాది ఇచ్చిన హామీలు నెరవేర్చని మున్సిపల్ యంత్రాంగం ఫ నామమాత్రపు పనులతోనే సరిపెడుతున్న వైనం ఫ వర్షాలు కురుస్తుండడంతో ఆందోళనలో ముంపు కాలనీల ప్రజలు -
ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వంతెనల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండల పరిధిలోని మూసీనది ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే భీమారం గ్రామం వద్ద వంతెనను పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టులు, వంతెల వద్ద పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు మూసీనదిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. యువత సెల్ఫీలు అంటూ విషాదం కొనితెచ్చుకోవద్దని సూచించారు. సూర్యాపేట, పెనపహాడ్, నేరేడుచర్ల, పాలకవీడు పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్ల కృష్ణానదిలో నీటి ఉధృతి అధికంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, డయల్ 100, జిల్లా స్పెషల్ బ్రాంచ్ 87126 86026 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఎస్పీ వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తసూర్యాపేటటౌన్ : బ్యాంకులకు వరుసగా పండగ సెలవులు ఉన్నందున సైబర్ మోసగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగ బహుమతులు అంటూ, స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమైనా బ్లూ లింక్స్, మెసేజ్లు వచ్చినా వాటిని అనుసరించవద్దని, అపరిచితులు డబ్బులు అడిగితే స్పందించవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ మోసగాళ్ల వల్ల ఆర్థిక నష్టానికి గురైతే వెంటనే 1,930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫ ఎస్పీ నరసింహ -
క్రీడలతో స్నేహభావం
చివ్వెంల(సూర్యాపేట) : క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, ప్రశాంత వాతావరణంలో క్రీడలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమికి అదనపు బస్సులురామగిరి(నల్లగొండ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆ సంస్థ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) కె.జానిరెడ్డి తెలిపారు. పండుగ రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 150 నుంచి 170 వరకు అదనంగా బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ స్పెషల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోలర్స్, సూపర్వైజర్లను నియమించామని పేర్కొన్నారు. ప్రయాణికులు అదనపు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూ చట్టాలపై అవగాహన అవసరంకోదాడ రూరల్: భూ చట్టాలపై రైతులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికతో పాటు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో గురువారం సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని రైతులతో కలిసి ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించినప్పుడే సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, హరి వెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ఏఓ రజిని, పీఏసీస్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 15న హర్ ఘర్ తిరంగాసూర్యాపేట అర్బన్ : ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతా రెడ్డి కోరారు. విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యశాలకు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డితో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నారు. తిరంగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని దేశభక్తిని ప్రదర్శించాలన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో పేరు గాంచిన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మాల్సూర్ గౌడ్, కో కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ మన్మథరెడ్డి, సీనియర్ నాయకులు కర్నాటి కిషన్, చలమల నరసింహ, కృష్ణయ్య, సులోచన, అనూష, శకుంతల, శోభా, సీత పాల్గొన్నారు. -
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆహార భద్రత చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల, పెన్పహాడ్ మండలాల్లో గురువారం ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు పర్యటించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఫుడ్కమిషన్ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం, స్కూల్స్, హాస్టల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఇక్కడ ఆహార భద్రత చట్టాన్ని బాగా అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో అమలు చేస్తే తెలంగాణ ఆహార భద్రత చట్టం పూర్తిగా అమలు చేసిన వారమవుతామన్నారు. రేషన్ షాపుల్లో వేయింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్స్, పాలు, బాలామృతం, ఆట వస్తువులు సక్రమంగా సరఫరా చేయాలని తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామన్నారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డీఆర్డీఓ వీవీ అప్పారావు, సంక్షేమ శాఖల అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి -
ఇన్నోవేషన్ హబ్.. మనకేనా?
దక్షిణ తెలంగాణలో రీజనల్ హబ్ ఏర్పాటు దిశగా కేంద్రం స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా.. రీజనల్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్లకు సహకారం అందించడం, ఫండింగ్, మార్కెట్ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్ ఇన్నోవేషన్ హబ్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ హబ్ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహంవివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్ ఇన్నోవేషన్ హబ్లను/సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్ హబ్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు.ఫ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం ఫ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు ఫ పార్లమెంటు ప్రశ్నత్తరాల్లో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం -
ప్రయోగ ఫలం రైతు దరిచేరేలా..
భానుపురి (సూర్యాపేట) : రైతులకు ఆధునిక సాగుపై మరింత అవగాహన కల్పించేలా రైతు విజ్ఞాన కేంద్రం రానుంది. జిల్లాకో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో రోజురోజుకూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు రైతులకు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో గడ్డిపల్లిలోని కేవీకే ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందుతుండగా.. రైతు విజ్ఞాన కేంద్రంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,70,853 మంది ప్రయోజనం కలగనుంది. రైతన్నలకు మేలు కొత్తగా ఏర్పాటు కానున్న రైతు విజ్ఞాన కేంద్రంతో రైతులకు ఎంతో మేలు కలగనుంది. ప్రధానంగా ఈ కేంద్రం ఏర్పాటుతో ఐదారుగురు శాస్త్రవేత్తలు, వారి సహాయక సిబ్బంది రైతులకు అందుబాటులోకి రానున్నారు. ప్రయోగశాల ఏర్పాటు చేయడమే కాకుండా విత్తనాభివృద్ధి, సాగు క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాల్లో రైతులకు డ్రోన్లు, ఇతర యంత్రాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నిత్యం ఏదో ఒక పంటపై పరిశోధనలు, ప్రయోగాలు, రైతు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రైతులకు శాస్త్రవేత్తలు, ఇతర వ్యవసాయ అధికారులు సైతం అందుబాటులోకి ఉండి సాగులో సమస్యలు తొలగనున్నాయి. అలాగే ఈ రైతు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ప్రయోగాలు సైతం పొలాల వరకు చేరుతాయి.సాగులో కొత్త పుంతలు.. జిల్లాలో వ్యవసాయం కొంత మూసపద్దతిలోనే సాగుతోంది. ప్రధానంగా జిల్లాలో వరిని అత్యధికంగా పండిస్తారు. తదనంతరం పత్తి సాగు చేపడుతారు. ఏ నేలల్లో ఏ పంట వేస్తే మేలు జరుగుతుందన్న ఆలోచన లేకుండా మూస పద్ధతిలో వెళుతుండగా.. ఇందులోనూ ఇప్పుడిప్పుడే రైతులు యాంత్రీకరణ వైపు మళ్లుతున్నారు. అన్నదాతలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి పద్ధతిని అవలంబించడంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా విత్తనాల సాగు నుంచి అన్నింట్లోనూ డ్రోన్ల వాడకం పెంచనున్నారు. యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అందించనున్నారు.ప్రధాన పంటలు : వరి, పత్తి నేలలు : ఎర్రనేలలు, నల్లరేగడి, ఎర్ర చెల్క, ఇసుక నేలలు వ్యవసాయ భూమి : 8,95,680 ఎకరాలు మండలాలు 23 రైతులు : 2,70,853 మంది గైడ్లైన్స్ రావాల్సి ఉంది జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆదేశాలు, గైడ్లైన్స్ రావాల్సి ఉంది. అయితే రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రం మొత్తం మారిపోతుంది. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
తుంగతుర్తి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ఎక్స్రే మిషన్, ల్యాబ్ ను పరిశీలించారు. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంటగది, వాటర్ ప్లాంట్, సరుకుల గదిని అధికారులతో కలియ తిరుగుతూ పరిశీలించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్లి విద్యార్థులు ఏవిధంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమార్, మండల విద్యాధికారి బోయిని లింగయ్య, డీసీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ రమేష్ బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, డాక్టర్లు వీణ, రాజు, ఆరోగ్య సిబ్బంది, ఎస్ఓ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిక్షరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. కేజీబీవీ ఎస్ఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి తుంగతుర్తి కేజీబీవీ ఎస్ఓ కల్పనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో రికార్డులను చూపాలని కోరగా నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దు
మునగాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయమనోహరి సూచించారు. మునగాల మండల కేంద్రంలో ఇటీవల వైద్యం వికటించి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నేపథ్యంలో చికిత్స చేసిన చంద్రమౌళి క్లినిక్ను ఆమె తనిఖీ చేశారు. క్లినిక్తో పాటు ల్యాబ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో చంద్రమౌళి అందుబాటులో లేకపోవడంతో ల్యాబ్ నిర్వాహకుడు గోపగాని రమేష్ను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం వికటించి మృత్యువాత పడిన యువకుడు వెంకటేశ్వర్లుకు ఏ విధమైన వైద్యం అందించారని అడిగారు. దీంతో రమేష్ సమాధానం ఇస్తూ .. జ్వరంతో బాధపడుతూ నీరసంగా క్లినిక్కు వచ్చిన వెంకటేశ్వర్లుకు రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. రక్త కణాలు తక్కువగా ఉండడంతో సైలెన్ పెట్టి యాంటీబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చామన్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కోదాడకు తీసుకెళ్లాలని తాము అతని కుటుంబ సభ్యులకు సూచించామని తెలిపారు. ల్యాబ్కు పరిమితి ఉందా ? అని ల్యాబ్ నిర్వాహకుడిని డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి అడిగారు. దీంతో అనుమతి పత్రం తీసుకురాగా గడువు నెల రోజుల క్రితమే ముగిసినట్లు గుర్తించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు . మూడు నెలలకు ముందే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తాను విచారణ చేపట్టానని ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా అధికారికి అందచేజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాఽధికారి డాక్టర్ పి.రవీందర్, సూపర్వైజర్ శ్రీను, హెల్త్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. -
అందుబాటులో ఎనిమిది వేల టన్నుల యూరియా
మేళ్లచెరువు : జిల్లాలో ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) గోగుల శ్రీధర్రెడ్డి వెల్లడించారు. గురువారం చింతలపాలెం మండల కేంద్రంతో పాటు దొండపాడులోని ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల నానో యూనియా వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. డీఏఓ వెంట మండల వ్యవసాయాధికారి శశాంక్, ఎరువుల డీలర్లు తదితరులు ఉన్నారు. -
తెలంగాణ సాధనలో జయశంకర్ కీలక పాత్ర
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు. సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంతో పాటు, దేశంలోనే ముందంజలో ఉంచడానికి ఉద్యోగులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వి.వి. అప్పారావు, డీటీడీఓ శంకర్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, సంతోష్ కిరణ్, శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వక్ఫ్ భూముల వేలంపై హైకోర్టు స్టే
పాలకవీడు: పాలకవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని జాన్పహాడ్ దర్గా భూముల కౌలు వేలంపాటను తాత్కాలికంగా రద్దు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ కమలాకర్ తెలిపారు. బుధవారం పాలకవీడులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాన్పహాడ్ దర్గాకు సంబంధించి వక్ఫ్కు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 57 ఎకరాల 38 గుంటల భూములపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం వేలం నిర్వహించాల్సి ఉందని అయితే ఈ భూములు తమకే చెందుతాయని హక్కుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించినట్లు చెప్పారు. ఇప్పటికే దర్గాపై తమకు పూర్తి హక్కులు కల్పిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిందని హక్కుదారులు తెలిపారు. మెప్మా పీడీగా బాధ్యతల స్వీకరణసూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డి బుధవారం మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించారు. హన్మంతరెడ్డికి మెప్మాపీడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి పోరుబాట మునగాల: ప్రజాసమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ సభ్యుడు చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, షేక్ సైదా, బచ్చలకూరి స్వరాజ్యం, దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, వి.వెంకన్న,బోళ్ల కృష్ణారెడ్డి, గోపయ్య, నాగయ్య, వెంకటాద్రి, నరసయ్య, వెంకటకోటమ్మ, జ్యోతి, సతీష్ పాల్గొన్నారు. -
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రభస
రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దు ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): రేషన్కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని, ఎప్పుడైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చిని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్లో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ రావు, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, డీఎస్ఓ మోహన్ బాబు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ ,తహసీల్దార్ అమీన్సింగ్, ఎంపీడీఓ హాసీం పాల్గొన్నారు. ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్లో బుధవారం జరిగిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మాట్లాడుతుండగా.. జై జగదీష్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాదనకు దిగారు. జై దామన్న అంటూ పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జగదీష్రెడ్డి కేసీఆర్ను పొగుడుతూ బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందిందని చెబుతుండగా ఆయన ఉపన్యాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో వందల మంది ప్రాణాలు బలిగొన్నదని, కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు కుంభకోణం చేసిందని విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టిన భిక్షతో అధికారం చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళాతీయించాడని ఆవేశంగా వేదికపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాటకుదిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు పంపారు. కలెక్టర్ కలగజేసుకొని ఇది రాజకీయ వేదిక కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వేదికని సర్దిచెప్పారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, రేషన్ కార్డులను ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఫ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట -
వర్షం 15% తక్కువే..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రైతన్నల ఆశలు ఇక ఆగస్టు మాసంపైనే ఆధారపడి ఉన్నాయి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా సరైన వర్షాలు లేవు. ఈ సీజన్లో జిల్లాలో సరాసరి 15శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని కారణంగా వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2,65,332 ఎకరాల్లో సాగైన వివిధ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈనెలలో కురిసే వానలపైనే ఆధారపడి ఉంది. సాధారణానికి మించి వర్షాలు కురవకపోతే బోరుబావులుసైతం వట్టిపోయే పరిస్థితి నెలకొంది. అంచనాలు తలకిందులు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రైతాంగం సంబురపడగా.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవనేలేదు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అసలు వాగులు, వంకలు సాగిన దాఖలాలు సైతం లేవు. కేవలం మోస్తరు వర్షాలే.. అదీ నెలలో 7, 8 రోజులకు మించి పడలేదు. జిల్లా గణాంక శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జూన్లో 95.5 మి.మీలు కురవాల్సి ఉండగా 44 శాతం లోటుగా 53.2 మి.మీ వర్షపాతం కురిసింది. జూలై చివరి వారంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలకు సాధారణం 162.7 మి.మీలకుగాను 2శాతం మించి 166.6 మి.మీల వర్షపాతం నమోదైంది. అయినా ఈ సీజన్ మొత్తంగా చూసుకుంటే జిల్లాలో సరాసరి 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రైతుల్లో ఆందోళన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈనెలలో వర్షాలు కురిసి.. చెరువులు నిండితే సరి లేదంటే సాగైన పంటలు సైతం చేతికొచ్చుడు కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి లోటు వర్షపాతం కారణంగా జిల్లాలో ఉన్న 1200 చెరువులు, కుంటలకు గాను కేవలం పది నుంచి 15 చెరువుల్లోకి మాత్రమే నీళ్లు వచ్చాయి. ఇక సాగర్, మూసీ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువుల్లోకి నీళ్లు వచ్చినా.. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని చెరువులు నీటి జాడకోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే పరిస్థితి నెలకొంటే ఆయా ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి నీటి ఆధారిత పంట వరి సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో జిల్లా రైతాంగం ఈనెలలో కురిసే వర్షాలపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. బోర్లుపోయడం కష్టమే వాతావరణం ఇలాగే ఉంటే బోర్లు పోయడం కష్టమే. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తేనే చివరి వరకు పొలాలు పారుతాయి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. రెండెకరాలు నాటు పెడుతున్నాం. చేతికొచ్చినప్పుడు లెక్క. – గడ్డం కేశయ్య, రైతు పంట అంచనా(ఎకరాల్లో..) సాగైంది(ఎకరాల్లో) వరి 4,85,125 2,11,096పత్తి 91,000 50,236 ఇతర పంటలు 5,000 4,000ఈ రైతు పేరు బట్టిపెట్టి శ్రీను. సొంతూరు ఆత్మకూర్(ఎస్). ఏటా జూన్, జూలైలో కురిసే వర్షాలకు గ్రామంలోని మర్రికుంటలోకి నీరు వచ్చేది. దీని కిందనే ఉన్న ఎకరం పొలం నాటుపెట్టేవాడు. ఈ వానాకాలం ఏ మాత్రం నీళ్లు కుంటలోకి రాలేదు. ఎకరం పొలం అలాగే ఉంది. వారం, పదిరోజుల్లో నీళ్లు రాకుంటే ఈ సారి వరి సాగుబంద్ చేయడమే.ఫ వానాకాలంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదు ఫ ఈ నెలపైనే రైతుల ఆశలు ఫ 2,65,332 ఎకరాల్లో వివిధ పంటలు సాగు ఫ వరుణుడు కరుణించకపోతే సాగైన పంటలు చేతికి అందడం కష్టమే -
ఎస్జీఎఫ్ క్రీడలకు వేళాయే..
త్వరలో పోటీలను ప్రారంభిస్తాం ఎస్జీఎఫ్ పోటీలను జిల్లాలో త్వరలో ప్రారంభిస్తాం. జిల్లాలో నాలుగు జోన్ల పరిధిలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశాం. రెండు రోజుల్లో ఆయా జోన్ల క్రీడా కార్యదర్శులను ఎన్నుకుంటాం. అనంతరం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయికి క్రీడాకారులను ఎంపిక చేస్తాం. –ఎం కిరణ్ కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి క్రీడల నిర్వహణకు ప్రభుత్వం సహకారం ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తోంది. ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం మండలాని రూ .10 వేల చొప్పన కేటాయిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ నిధులు వెంటనే విడుదల చేస్తే క్రీడల నిర్వహణ మరింత సులువు అవుతుంది. పాఠశాల స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడా కారులుగా తీర్చి దిద్దడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం. –అయితగాని శ్రీనివాస్, పీఈటీఏ టీఎస్ జిల్లా అధ్యక్షుడుహుజూర్నగర్ : పాఠశాల స్థాయి విద్యార్థి దశ నుంచే బాలబాలికలు వారికి ఇష్టమైన క్రీడలపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలను ఈనెలలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. మండల స్థాయి పోటీలు ఈనెల రెండో వారంలో, జోనల్ స్థాయి పోటీలు ఈనెల మూడో వారంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు రెండో వారంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా పోటీలు ఒక్కో స్థాయిలో రెండు రోజుల పాటు కొనసాగుతాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల పోటీలు నిర్వహించి ఆయా క్రీడల్లో ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. మూడంచెల పద్ధతిలో.. ఆటల పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహిస్తారు. అండర్–14, అండర్–17 విభాగంలో పాఠశాల విద్యార్థులు, అండర్–19 విభాగంలో ఇంటర్ విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లాను హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుండతుర్తి జోన్లుగా విభజించారు. ఒక్కో జోనుకు ఒక క్రీడా కార్యదర్శి చొప్పున నలుగురు క్రీడా కార్యదర్శులను నియమించారు. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో క్రీడాంశంలో ఒక జట్టును ఎంపిక చేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందిస్తారు. వీటితో విద్య, ఉద్యోగాలకు క్రీడాకోటా కింద 2 శాతం రిజర్వేషన్ల సదుపాయం కూడా ఉంటుంది. అన్ని పాఠశాలల విద్యార్థులకు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. జిల్లాలోని 1వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు 979 ఉండగా వాటిలో విద్యార్థులు 45,918 మంది ఉన్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 690 ఉండగా విద్యార్థులు 18,062 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 78 ఉండగా విద్యార్థులు 3,079 మంది ఉన్నారు. ఉన్నత పాఠశాలలు 211 ఉండగా విద్యార్థులు 24,777 మంది ఉన్నారు. కేజీబీవీలు 18, ఆదర్శ పాఠశాలు 9, ఎంజీపీటీబీసీ 8, గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. వాటిలో దాదాపు 15 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. క్రీడాంశాలు ఇవే.. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, కరాటే, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, నెట్ బాల్, సాఫ్ట్బాల్, బేస్బాల్, బాల్ బ్యాట్మెంటన్, షటిల్, టేబుల్ టెన్నిస్, చదరంగం, అథ్లెటిక్స్లలో అండర్– 14, 17, 19 బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలాని రూ.10 వేలు కేటాయిస్తుంది. ఈనెల చివరి వరకు మండలస్థాయి పోటీలను పూర్తి చేయాలి. సెప్టెంబరులో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం అవుతాయి. ఫ ఈ నెల రెండో వారంలో మండలస్థాయి, మూడో వారంలో జనల్స్థాయి పోటీలు ఫ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఫ విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం -
పంద్రాగస్టు నాటికి పరిష్కారమయ్యేనా!
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలిఫ అదనపు కలెక్టర్ రాంబాబు సూర్యాపేట : భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. మంగళవారం సూర్యాపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. అధికారుల బృందాలకు క్షేత్రస్థాయి వెళ్లాలని కోరారు. అర్హులకు నూతన రేషన్ కార్డును కూడా త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ సి.హెచ్.కృష్ణయ్య, డీటీ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కపిల్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.సూర్యాపేట : భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. శతశాతం దరఖాస్తులకు మోక్షం కలిగించాలని ప్రభుత్వం విధించిన డెడ్లైన్ తొమ్మిది రోజుల్లో ముగియనుంది. వీటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది కుస్తీలు పడుతున్నారు. అయినా ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యలో ప్రభుత్వం చెబుతున్న పంద్రాగస్టు నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి సుమారు 47వేలకు పైగా దరఖాస్తులు రాగా కేవలం 807కు మాత్రమే మోక్షం కలిగింది. గడువులోగా అనుమానమే.. భూ సమస్యలతో చాలామంది యజమానులు ఏళ్ల తరబడి కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు ఈ దిశగా చర్యలను ముమ్మరం చేసినా.. వేలల్లో దరఖాస్తులు ఉండడం, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. ప్రధానంగా దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా గతంలో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏల వ్యవస్థ లేకపోవడంతో ఈ పని అంత సులువుగా కావడం లేదు. మోకాపై భూమి ఉన్నప్పటికీ అమ్మిన వ్యక్తి రికార్డుల్లో లేకపోవడం, సర్వే నంబర్లోని విస్తీర్ణం పూర్తిగా నిండి ఉండడం, అన్నదమ్ముల్లో ఒకరిపై పట్టా చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం.. ఇలా పలు కారణాలతో దరఖాస్తులు అనర్హతకు గురవుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 1.70శాతమే పరిష్కారం ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 47,462 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 47,290 దరఖాస్తులను ఆన్లైన్ చేసి రైతులకు నోటీసులను అందించారు. ఇప్పటి వరకు కేవలం 807 దరఖాస్తులకు మోక్షం లభించింది. అంటే 1.70శాతం దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిష్కరించగలిగారు. చాలావరకు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వెల్లడించడం లేదు. సాదాబైనామాతో పాటు పీఓటీ దరఖాస్తులు 17వేల వరకు ఉన్నాయి. ఈ సాదాబైనామాలు, పీఓటీ కేసులు కోర్టు పరిధిలో ఉండడంతో పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం సాదాబైనామా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వాస్తవంగా రికార్డుల్లో పట్టాదారు ఉన్నాడా..? కాస్తుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చే లోపు సమగ్రంగా పరిశీలించి జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారుభూ భారతి దరఖాస్తుల మోక్షానికి తొమ్మిది రోజులే గడువు ఫ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 47,462 ఫ ఇప్పటి వరకు 807 పరిష్కారం ఫ సిబ్బంది కొరత, అధికంగా అర్జీలు రావడంతో తీవ్ర జాప్యం ఫ కుస్తీలు పడుతున్న రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 47,462 ఆన్లైన్ చేసినవి : 47,290 నోటీసులు ఇచ్చినవి : 47,290 పరిష్కారం అయినవి : 807 -
విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జున్ రెడ్డి సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన ముస్లిం మైనారిటీ యోధుల ఫొటో ఎగ్జిబిషన్ను మంగళవారం చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులోని ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిని నాగార్జున్రెడ్డి పరిశీలించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర సాధనలో ముస్లింలు చేసిన సేవలు మరువు లేనివి అని అన్నారు. దేశభక్తుల జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేయడం అభినందనీయం అన్నారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, అబ్దుల్లా, ప్రిన్సిపల్ వినోద, ఖాలెద్అహ్మద్, అస్గర్ సాహబ్, సీఐటీయూ జిల్లా మాజీ కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టపల్లి సైదులు, నర్సింహారావు, వేల్పుల వెంకన్న, సయ్యద్ ఫకీర్ హుస్సేన్, జహీర్, రహీం, అజీజ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెస్తాం
హుజూర్నగర్ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోగల గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్లతో కలిసి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను నిర్లక్ష్యం చేసిందన్నారు. 2026 జూలై నాటికి పనులు పూర్తి చేయాలి పులిచింతలలోని తెలంగాణ జెన్కో విద్యుత్ తయారు చేసిన తర్వాత వచ్చే నీటిని రూ.320కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి తద్వారా మేళ్లచెరువు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాల్లో 14,100 ఎకరాలకు అందిస్తామన్నారు. రూ. 1450 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53 వేల ఎకరాలకు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 188.32 ఎకరాలకు భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించామన్నారు. 2026 జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాలేరు వాగుపై రూ. 47.64 కోట్లతో రెడ్లకుంట లిఫ్ట్ నిర్మించి దాని ద్వారా 4,460 ఎకరాలకు, రూ. 54.03 కోట్లతో రాజీవ్ శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్ల వివరించారు. ఆర్–9 కాలువపై రూ. 8.45 కోట్లతో లిఫ్ట్ నిర్మించి మునగాల, నడిగూడెం మండలాల్లో 3,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాన్నారు. రూ. 244 కోట్లతో మోతె లిఫ్ట్ నిర్మించి తద్వారా 45,736 ఎకరాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. పాలకవీడు మండలంలో రూ. 302.20 కోట్లతో జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మించి దీని ద్వారా 10 వేల ఎకరాలకు నీరందించే పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రూ 26.02 కోట్లతో నిరించే బెట్టెతండా లిఫ్ట్ ద్వారా 2041 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. రూ. 31 కోట్లతో నిర్మించే నక్కగూడెం లిఫ్ట్ ద్వారా 3,200 ఎకరాలకు నీరు అందుతుందని దానిని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ రమేష్ బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ సీతారామయ్య, ఎస్ఈ బీవీ ప్రసాద్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఈఓ ఆశోక్, జిల్లా సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, ఆర్డీఓ శ్రీనివాసులు ఆర్టీసీ సీఈ కవిత, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, నాయకులు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జున్, గెల్లి రవి, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, దొంతగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై హైదరాబాద్లో సమీక్ష -
కాళేశ్వరంపై వాస్తవాలను రైతుల ముందుంచాలి
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్రావు చెప్పిన వాస్తవాలను రైతుల ముందుంచాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కార్యకర్తలను కోరారు. మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్క్రీన్పై బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం పాల్గొన్నారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించాలిసూర్యాపేటటౌన్: పూణేలో జరిగే జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లోనూ పతకాలు సాధించాలని ఎస్పీ నరసింహ ఆకాంక్షించారు. మమునూరు లో నిర్వహించిన రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది, పోలీస్ డాగ్ రోలెక్స్ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక దర్యాప్తు పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్ చక్రవర్తి తృతీయ స్థానం, నార్కోటిక్ డాగ్ రోలెక్స్లో డాగ్ ట్రైనర్ సతీష్ ద్వితీయ స్థానం పొందారని వివరించారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ల రికవరీలో సిబ్బంది కృషి ప్రశంసనీయం
సూర్యాపేటటౌన్ : పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో పోలీస్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. వివిధ చోట్ల పోగొట్టుకున్న 101 సెల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేసి మాట్లాడారు. పోయిన ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి కూడా రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్లు పోగొట్టుకుంటే అందులో ఉన్న విలువైన సమాచారం పోతుందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకిగురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉండాలిసూర్యాపేటటౌన్ : బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి అండగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ నరసింహ -
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
సూర్యాపేట : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు కోరారు. ఈనెల 7వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అఖిల భారత పదవ జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం సూర్యాపేటలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివ్య, కవిత, నవ్య, అలేఖ్య, సురేష్, నరేష్, సందీప్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ
భానుపురి (సూర్యాపేట) : ఆల్బెండ జోల్ మాత్రలతో పిల్లల్లో నులిపురుగులను నివారించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ సంవత్సరం ఆగస్టు 11 న జాతీయ డీవార్మింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ సమాచారాన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువత తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా అధికారులు తమశాఖ అభివృద్ధి పనులపై, తమకు కేటాయించిన హాస్టళ్లు, పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఇళ్ల నమూనాలు ముమ్మరం
ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం జిల్లాలో 19 ఇందిరమ్మ ఇంటి నమూనాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ఇప్పటికే 15 నమూనాలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని ఈనెల 15లోగా పూర్తిచేసేలా పనులు చేస్తున్నాం. లబ్ధిదారులు ఈ ఇంటి నమూనాలను అనుసరించి నిర్మాణాలు చేసుకోవాలి. – సిద్ధార్థ, హౌసింగ్ పీడీభానుపురి (సూర్యాపేట) : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ఓ నమూనాను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఇంటి నమూనాపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు జిల్లాలో చకచకా పూర్తవుతున్నాయి. 14 నమూనా నిర్మాణాలు పూర్తవగా మరో ఐదు నమూనాలు వివిధ దశలో ఉన్నాయి. పంద్రాగస్టు నాటికి అన్నింటినీ పూర్తిచేసేందుకు గృహ నిర్మాణ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోంది. 19 మండలాల్లో నిర్మాణాలు..సూర్యాపేట జిల్లాలోని 19 మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇంటి నమూనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయాలు, రైతు వేదికలు, ఇలా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 14 మండలాల్లో ఇంటి నమూనాలు పూర్తయ్యాయి. మరో అయిదు చోట్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. స్థలం కొరత కారణంగా జిల్లాలోని ఆత్మకూర్ ఎస్, నాగారం, మద్దిరాల, చింతలపాలెం మండలాల్లో ఆలస్యంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్మాణాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కల్పించేందుకు..ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రాయితీతో రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. సొంత స్థలం ఉండి డబ్బులు లేక ఇంటి నిర్మాణం చేసుకోలేని వారికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో తక్కువ వ్యయంతో ఇంటి నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చో ప్రభుత్వమే వాటి వివరాలను, గణాంకాలతో ప్రకటించింది. 400 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణం లోపు నిర్మాణం పూర్తిచేసే నమూనా రూపొందించింది. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా లబ్ధిదారుడు వచ్చి చూసి ఇంటి నిర్మాణాలు చేపట్టేలా వీటిని ప్రారంభించారు. దాదాపు జిల్లాలో మంజూరైన 19 నిర్మాణాలకు 14 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. లబ్ధిదారులు ఈ ఇంటి నిర్మాణాలను చూసి తాము ఇళ్లను నిర్మించుకోనున్నారు. జిల్లాలో 19 ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా నిర్మిస్తున్న గృహనిర్మాణశాఖ ఇప్పటికే 14 నమూనాలు పూర్తి 15వతేదీ నాటికి మిగతావి పూర్తిచేసేలా చర్యలు -
తొలగించారు.. నిర్మాణం మరిచారు!
కోదాడ: పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యం కోదాడ పట్టణ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మున్సిపాలిటీలో అత్యవసరంగా చేయాల్సిన పనులను సంవత్సరం కావొస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన డివైడర్లను మున్సిపాలిటీ అధికారులు హడావుడిగా పగులగొట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డివైడర్లను కూలగొట్టిన అధికారులు.. ఆ తరువాత వాటిని పునర్నిర్మించడం మరిచారు. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అయ్యాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 చోట్ల డివైడర్ల తొలగింపు..గత సంవత్సరం సెప్టెంబర్ 1న కోదాడలో రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, రెడ్ చిల్లి ఏరియా, భవానీ నగర్, శ్రీరంగాపురం పరిధిలో పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లకుండా సూర్యాపేట రోడ్డు, హుజూర్నగర్ రోడ్డు, మేళ్లచెరువు రోడ్డు, విజయవాడ రోడ్డులో 12 చోట్ల అడ్డుగా ఉన్న డివైడర్లను జేసీబీ సాయంతో తొలగించారు. ఆ తరువాత వాటిని పునర్నిర్మించాల్సి ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో డివైడర్లు పగులగొట్టిన ప్రాంతం నుంచి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్టాపర్లు అడ్డుపెట్టగా మరికొన్ని చోట్ల కంపను తాత్కాలికంగా అడ్డుగా ఏర్పాటు చేశారు.మీరంటే.. మీరే చేయాలంటూ.. కోదాడ పట్టణంలో రూ.34 కోట్ల నిధులతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల విస్తరణ పనులను గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేశారు. గత సంవత్సరం వర్షాలకు పలు కాలనీలు ముంపునకు గురవుతుండడంతో మున్సిపాలిటీ అధికారులు డివైడర్లను పగులగొట్టారు. కాబట్టి మున్సిపాలిటీ అధికారులే వీటిని పునర్నిర్మించాలని ప్రజారోగ్యశాఖ అధికారులు అంటుండగా.. తమ వద్ద నిధులు లేవని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో కోదాడ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం వరదలకు కోదాడలో డివైడర్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది నేటికీ మరమ్మతులు చేయని అధికారులు ప్రమాదాల బారిన పడుతున్న పాదచారులుప్రమాదాలు జరగకుండా చూడాలి కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లకు గతంలో పెట్టిన గాడులను వెంటనే మూసివేయాలి. వీటివల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మున్సిపాలిటీలో నిధులు లేవని అధికారులు చెప్పడం సరైంది కాదు. యుద్ధప్రాతిపదికన గాడులను మూసి వేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. – ఈదుల కృష్ణయ్య, న్యాయవాది, కోదాడ -
కొత్త కారు్డలకూ పథకాలు
భానుపురి(సూర్యాపేట) : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అందనున్నాయి. గృహ జ్యోతి, మహాలక్ష్మితో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కలెక్టరేట్తో పాటు మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నూతనంగా రేషన్ కార్డులు పొందిన 24వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 24వేలకు పైగా మందికి లబ్ధి..పదేళ్లుగా రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో వేలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను దూరమయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా మొదటగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో పదేళ్లుగా రేషన్ కార్డులు లేకపోవడంతో నూతనంగా వివాహాలు చేసుకున్న వేలాది మందికి ఈ పథకాలు అందలేదు. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటికి రేషన్ కార్డులు కావాల్సి ఉంది. గత నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 24వేలకు పైగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందించారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు వీరందరికీ అందనున్నాయి. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలెక్టరేట్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు నూతనంగా 24వేల కుటుంబాలకు ప్రయోజనంగృహజ్యోతి లబ్ధిదారులు 1,80,607ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు 3,26,057నూతన రేషన్ కార్డులు 24,082మహాలక్ష్మి లబ్ధిదారులు 1,62,718 -
కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షణకు ఏర్పాట్లు
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఉదయం 12గంటలకు తెలంగాణ భవన్నుంచి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రత్యేక స్క్రీన్ ల ద్వారా వీక్షించడానికి సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డిలు హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గంగరిడేపల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. బాల సైదిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, కిషోర్బాబు, వీరస్వామి పాల్గొన్నారు. గొల్లకురుమల సమస్యలు పరిష్కరించాలి తుంగతుర్తి : గొల్లకురుమల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత గొర్రెల పంపిణీ కింద నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినేటికీ నెరవేర్చలేదన్నారు. యాదవ విద్యార్థులందరికీ వెటర్నరీ పోస్టులు కేటాయించి, 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలన్నారు. సమావేశంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు వీరబోయిన రాములు, కొమ్మ లింగయ్య, ఉప్పుల లింగయ్య, మట్టిపెల్లి శ్రీను, నర్సయ్య, గంగరాజు, మధు, వెంకన్న, భిక్షం, శ్రీశైలం, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు. -
రాకున్నా.. వచ్చినట్టు
నాగారం : గ్రామ పంచాయతీల్లో పాలన గాడి తప్పుతోంది. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు రాకున్నా వచ్చినట్లుగా రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్లో తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదును పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లాలో 48 మంది కార్యదర్శులు తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో వారికి ఉన్నతాధికారులు చార్జ్మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవనాలు, కుర్చీల ఫొటోలు అప్లోడ్.. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 11 గంటలలోపు గ్రామానికి వెళ్లి యాప్లో తమ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ లోకేషన్కు వచ్చి సెల్ఫీ ఫొటో తీసుకుని డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) యాప్లో అప్లోడ్ చేయాలి. తదుపరి పారిశుద్ధ్య పనులను చేయిస్తూ ఆ ఫొటోలను కూడా యాప్లో అప్లోడ్ చేయాలి. అదే వారి ముఖ గుర్తింపు హాజరు కూడా. కానీ కొందరు యాప్లో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకొని విధులకు గైర్హాజరవుతున్నారు. యాప్లో సెల్పీతోపాటు ఏ ఫొటో అప్లోడ్ చేసినా ఓకే అని చూపిస్తుండడం వారికి కలిసి వస్తోంది. పంచాయతీ కార్మికుల సెల్ఫోన్లలో ఈ యాప్ను కొందరు పంచాయతీ కార్యదర్శులు ఇన్స్టాల్ చేస్తున్నారు. కార్మికులే తమ ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఓపెన్చేసి కార్యదర్శి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పంచాయతీ భవనాలు, కుర్చీలు, ఇతర వస్తువులను అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు సెల్ఫోన్లో ఉన్న కార్యదర్శి సెల్ఫీ ఫొటోను మరోఫోన్ ద్వారా ఫొటో తీసి యాప్లో నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల పంచాయతీ అధికారులదే. కార్యదర్శుల హాజరు నమోదు ఎంపీఓ లాగిన్లో ఉంటుంది. డీఎల్పీఓ, డీపీఓలు సైతం తనిఖీ చేయవచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యదర్శులు తప్పుడు వివరాలను నమోదు చేస్తున్నారు. ఫ తప్పుడు హాజరు నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శులుఫ పంచాయతీ కార్మికుల సెల్ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ ఇన్స్టాల్ ఫ విధులకు రాకుండానే ఫొటోలు అప్లోడ్ ఫ జిల్లాలో 48 మంది కార్యదర్శులకు నోటీసులునోటీసులు జారీ చేశాం డీఎస్ఆర్ యాప్లో తప్పుడు ఫొటోలు నమోదు చేసిన 48 మంది కార్యదర్శులను గుర్తించి చార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరయ్యే కార్యదర్శులపై చర్యలు తప్పవు. –కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట -
పొగ కష్టాలకు చెక్..!
గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తాం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో 871 ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నట్లు గుర్తించాం. అన్ని పాఠశాలలకు త్వరలోనే గ్యాస్ సిలిండర్లు సమకూర్చుతాం. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి నాగారం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఇక నుంచి కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. కట్టెల పొయ్యితో వంట చేస్తున్న పాఠశాలలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సిలిండర్ల వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి పొయ్యి మండక ఉడికీ ఉడకని భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తరగతి గదుల్లోకి పొగ చూరుతోంది. పాఠశాలలకు వంట గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుతో వంట చేయడంలో ఆలస్యం, పొగ సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. 871 కనెక్షన్లు.. జిల్లాలోని 23 మండలాలు ఉండగా వీటి పరిఽధిలో మొత్తం 871 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా 42,634 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఈ పాఠశాలల్లో 1,435 మంది వంట ఏజెన్సీలున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలో కూడా ఎల్పీజీ కనెక్షన్ లేకపోవడంతో వంట కార్మికులు అన్ని బడుల్లో ఆరుబయట వంట చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని పాఠశాలల్లో వంట పాత్రలు కూడా సరిగా లేకపోవంతో కొన్ని నెలల క్రితం అందజేశారు. తప్పనున్న ఇబ్బందులు.. ఇటీవల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నాణ్యమైన వంటపాత్రలు అందించింది. అలాగే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనుంది. తద్వారా విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మండలాల పరిధిలో స్థానిక ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మధ్యాహ్న భోజన వండే కార్మికులకు గ్యాస్ సిలిండర్, స్టౌ ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ మాత్రం కార్మికులే నింపుకోవాలి. జిల్లాలో 871 పాఠశాలల్లో కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లుగా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేసింది. ఫ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సిలిండర్లు అందించేలా ప్రణాళిక ఫ ఇప్పటికే 871 స్కూళ్లకు అవసరమని గుర్తించిన అధికారులుప్రభుత్వ పాఠశాలలు 871 విద్యార్థులు 42,634వంట కార్మికులు 1435 -
గుట్టకు పవిత్రోత్సవ శోభ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణా లతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాలను సిద్ధం చేశారు. విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సర్వదోషాలు తొలగిపోవడానికి.. ఏటా శ్రావణమాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగే నిత్యారాధనలు, వివిధ రకాల ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చితార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. ఫ నేటి నుంచి మూడు రోజులు ఉత్సవాలు -
రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
చిలుకూరు: కుల ధ్రువీకరణ పత్రాన్ని రెండు నిమిషాల్లో పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మీ సేవ కేంద్రాల్లో ఆధార్ నంబర్ ద్వారా రెండు నిమిషాల్లో తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కులం మారదు కాబట్టి అవసరం ఉన్న వారు నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి రూ. 45 రుసుం చెల్లించి ఆధార్ నంబరు ద్వారా తీసుకోవచ్చు. మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు ప్రజల సౌకర్యార్థం మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ సేవలు ప్రైవేట్ సైట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వీటిని మీ సేవ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ , అటవీ , సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు ఉన్నాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్ సర్టిఫికెట్ , పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ , క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ , సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్, మానిటరింగ్, వన్య ప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ విలువ ధ్రువపత్రం , పాన్ కార్డు సవరణ , ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాల పరిధిలో 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీలలో కలిపి 93 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఫ గతంలో తీసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయకుండా వెసులుబాటు ఫ రూ.45 చెల్లించి మీసేవ ద్వారా పొందే అవకాశం