breaking news
Suryapet District Latest News
-
యూరియా కోసం సెల్ టవరెక్కిన రైతు
కోదాడ రూరల్ : ఫర్టిలైజర్ యాప్లో తనకు యూరియా బుకింగ్ కావడం లేదంటూ ఆగ్రహించిన ఓ రైతుల సెల్టవర్ ఎక్కాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో బీఎస్ఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన రైతు ఆకుల శ్రీనుకు నడిగూడెం మండలం ఎక్లాస్గానిపేట, ఖమ్మం జిల్లా చెరువుమాదారంలో నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశాడు. అయితే యూరియా కోసం యాప్లో బుకింగ్కు ప్రయత్నిస్తున్నా బుకింగ్ కావడం లేదు. దీంతో విసుగుచెందిన రైతు సెల్టర్ఎక్కి నిరసనకు దిగాడు. యూరియా బుకింగ్ యాప్లో బుక్ కావడంలేదని, ఎరువుల దుకాణాలకు వెళితే స్టాక్ లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని కిందకు దిగమంటే తనకు యూరియా అందేవరకు దిగేదే లేదని నాకు ఐదు యూరియా కట్టలు కావాలని డిమాండ్ చేశాడు. కొద్ది సేపటికి రైతుతో మాట్లాడి యూరియా ఇప్పించే బాధ్యత తమదని నచ్చజెప్పి కిందకు దించి స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడకు వ్యవసాయాధికారులను పిలిపించి యూరియా యాప్పై అవగాహన కలిగించి యూరియా అందే విధంగా చేస్తామని పంపించారు. టవర్ ఎక్కిన రైతు శ్రీను, కిందకు దిగాలని కోరుతున్న పోలీసులు ఫ యాప్లో బుకింగ్ కావడం లేదని ఆవేదన ఫ ఐదు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ -
నేటి సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మెలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభికం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులురామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజూర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. యాదగిరీశుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేషంగా అభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన పూజలు చేశారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ఇక.. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. సూర్యాపేటలో జోరుగా నగదు, మద్యం పంపిణీసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే నగదు, మద్యం, బహుమతులు (తాయిలాలు) జోరుగా పంపిణీ చేశారు. ముందుగా తమకు అనుకూలమైన ఓటర్లకు నగదు, మద్యం పంచారు. కొంతమంది ఓటర్లకు నగదు మద్యం పంపిణీ చేయకపోవడంతో డబ్బులు ఇస్తే కానీ ఓటేయమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేదేమీ లేక అభ్యర్థులు ఉదయం పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సమీపంలోని నగదు పంపిణీ చేశారు. -
దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు
సూర్యాపేట : కాంగ్రెస్ది దద్దమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్వయంగా ఒప్పుకున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాకూడా బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా అన్న సోయి కూడా మంత్రులకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు, అధికారులకు స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అపోహ పడుతున్నారని, తమ హయాంలోనూ ట్యాపింగ్ జరుగుతుందని, చేతగాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి బీఆర్ఎస్పై దాడులు చేస్తున్నారన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నది ముఖ్య మంత్రే అని ఆరోపించారు. సీఎం ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎన్నికలలో సహకరించాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాత్రి వేళల్లో కాంగ్రెస్ గుండాలు బైక్లపై హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ రాజ్యమేనని పేర్కొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాం
హుజూర్నగర్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక పోలీస్ బందోబస్త్ నిర్వహించామని ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం హుజూర్నగర్లో మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఆయన సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 4గురు డీఎస్పీలు, 15 మంది సీఐలతో పాటు మొత్తం 1,250 మంది అధికారులు, సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా రిజర్వు పోలీస్ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రెండు ప్లటూన్ల పోలీసులను వినియోగించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం సీసీ నిఘాలో పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్రూంలో పోలింగ్ బాక్స్లను భద్రపరిచామన్నారు. ఆయన వెంట సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం సూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్లలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం ఆయన పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కల్పించామన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని, ముందస్తు ప్రణాళిక, నిఘా వ్యవస్థ, నిరంతర పర్యవేక్షణ, ఫ్లాగ్ మార్చ్లు, సున్నిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలతో ఎన్నికలు శాంతియుతంగా సాగినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ల ఏర్పాటు ద్వారా ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ ఎస్పీ నరసింహ -
పుర పోలింగ్ ప్రశాంతం
సూర్యాపేట టౌన్ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ఉదయం కాస్త మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం వరకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 1,75,759 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 79.90 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుమలగిరిలో అత్యధికం.. కోదాడలో అత్యల్పం.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అత్యధికంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కోదాడ మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. తిరుమలగిరిలో 13,656 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 88.36శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే కోదాడలో 40,881 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 77.05 శాతం నమోదైంది. మహిళా ఓటర్లే ఎక్కువ..జిల్లాలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూర్నగర్లో పురుషులు 11,287 మంది ఓటు వేయగా మహిళలు 12,633 మంది ఓటు వేశారు. అలాగే కోదాడ లో పురుషులు 21,306 మంది, మహిళలు 19,568 మంది ఓటు వేశారు. నేరేడుచర్లలో పురుషులు 5,142 మంది, మహిళలు 5,750 మంది ఓటేశారు. సూర్యాపేటలో పురుషులు 41,199 మంది, మహిళలు 45192 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో పురుషులు 6,760 మంది, మహిళలు 6,896 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 137 వార్డుల్లో 372 కేంద్రాలు.. ఐదు మున్సిపాలిటీల్లోని 137 వార్డుల్లో పోలింగ్కు 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులు, 10 ఎస్ఎన్టీ, 15 ఎఫ్ఎస్టీ, 7 వీవీటి, ఏటీ 7 బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయి. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బ్యాలెట్ బాక్సులను 46 బస్సుల్లో పోలీస్ ఎస్కార్ట్ నడుమ భారీ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్రూమ్కు తరలించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్, కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్ నేరేడుచర్ల మున్సిపాలిటీలో పరిశీలించారు. అలాగే కలెక్టర్, ఎస్పీలు వేర్వేరుగా సూర్యాపేటతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో పోలింగ్ను పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. పలువురు ప్రముఖులు తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోదాడలోని 14వ వార్డులో ఓటేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి సూర్పాపేటలోని 44వ వార్డులో ఓటేశారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ 14వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తను పోలీసులు కేంద్రం లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట మున్సిపల్ పరిధి 13 వార్డు గాంధీనగర్లో టీఆర్పీ, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీ సులు అకారణంగా తమపై దాడి చేశారని నిరసిస్తూ సూర్యాపేట–జనగామ రహదారిపై టీఆర్పీ నాయకులు రాస్తారోకో చేశారు. ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 88.36 శాతం ఫ కోదాడలో అత్యల్పంగా 77.05 శాతం ఫ ఓటుహక్కు వినియోగించుకున్న 1,75,759 మంది ఓటర్లు -
స్వల్పంగా తగ్గిన మున్సిపల్ పోలింగ్
కోదాడ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 2020లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 83.85 శాతం పోలింగ్ నమోదు కాగా 2026లో అది 81.38 శాతానికి పడిపోయింది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 2.47 ఽశాతం పోలింగ్ తగ్గింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ మున్సిపాలిటీలో పోలింగ్ శాతం తగ్గగా, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పోలింగ్ శాతం స్పల్పంగా పెరిగింది. కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలలో పోలింగ్ శాతం స్పల్పంగా తగ్గింది. ఫ 2020 ఎన్నికల్లో 83.85 శాతం నమోదు ఫ తాజాగా 81.38 శాతమే పోలింగ్ ఫ గతంలో కన్నా 2.47 శాతం తక్కువ -
ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల విధుల్లో సిబ్బంది అలసత్వం వహించవద్దని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు హుసేన్, అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీ లించి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికా రులతో మాట్లాడి సామగ్రి పంపిణీ వివరా లను తెలుసుకున్నారు. వారి వెంట డీఎస్పీ నర్సింహాచారి, తహసీల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల వ్యయ పరిశీలకులు బడేసాబ్, ఆనంద్, ఎస్ఐ వెంకట్రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు. శివరాత్రి జాతరకు మంత్రి ఉత్తమ్కు ఆహ్వానంహుజూర్నగర్ : మేళ్లచెరువు శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించండిసూర్యాపేట అర్బన్ : విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని కమర్షియల్ చీఫ్ ఇంజనీర్ రవికుమార్ అన్నారు. జిల్లా సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విద్యుత్ అధికారులతో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్ల పనుల పురోగతి, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పురోగతిపై సమీక్షించారు. అనంతరం జిల్లా స్టోర్స్ను పరిశీలించి స్టోర్స్లో అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, డీఈ టెక్నికల్ సీహెచ్ విద్యాసాగర్, డీఈలు వెంకటకృష్ణయ్య, జ్యోతికుమార్, స్వామి, స్టోర్స్ ఏడీఈ సత్యనా రాయణ కమర్షియల్ ఏఓ అశోక్ పాల్గొన్నారు. పిల్లలమర్రి శివాలయంలో సంప్రోక్షణసూర్యాపేట : పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయానికి రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి ఏకేశ్వరాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ వెంకన్న డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల జేబులకు చిల్లు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : శ్రీ దండు మైసమ్మ తల్లి ఆలయం వద్ద పూజా సామగ్రి, కొబ్బరికాయలను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో భక్తుల జేబులకు చిల్లు పడుతోంది. ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలమంది భక్తులు వస్తుంటారు. విక్రయదారులు పూజా సామగ్రి ధరల రేట్లు ఇష్టానుసారంగా పెంచి భక్తుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయమై పలుమార్లు భక్తులు, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దండు మైసమ్మ ఆలయం వద్ద వాహనాల పూజ కోసం ఉపయోగించే సామగ్రి ఐదు నిమ్మకాయలు, మూడు జీడిగింజలు, ఒక కొబ్బరికాయ, ఒక దట్టి రూ.200లకు భక్తులకు విక్రయిస్తున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా పూజ సమయంలో వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు, భక్తులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయ సమీపంలో పూజా సామగ్రి, కొబ్బరికాయల ధరలను నియంత్రించాలని, రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఫ పూజా సామగ్రి, కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయం ఫ ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్న దుకాణదారులు -
రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర
చిలుకూరు : చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం నుంచి కనకదుర్గమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జాతరను వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భాగంగా గురువారం సాయంత్రం గ్రామస్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్తారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోలాట ప్రదర్శనలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, శనివారం ఉదయం కోలాట ప్రదర్శనలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం ప్రభ బండ్లను ఆలయం వద్ద నుంచి ఇళ్లకు తీసుకెళ్తారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో.. జాతర సందర్భంగా ప్రతి ఏడాది బేతవోలు గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో కోలాటాలు, లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది విభేదాల కారణంగా అధికార కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్లో సర్పంచ్ వట్టికూటి నాగయ్య వర్గం ఆధ్వర్యంలో ఉదయం రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు, శుక్రవారం రాత్రి మ్యూజికల్ లైటింగ్ అర్కెస్ట్రాతో పాటల కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కాంగ్రెస్ వర్గం ఉదయం కోలాటాలు, రాత్రి లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ఉదయం కోలాటాలు, శుక్రవారం రాత్రి లైటింగ్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక సీపీఐ నుంచి బహ్కిరించబడిన మట్టయ్య తన వర్గంతో కోలాటాలు, లైటింగ్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 7 లైటింగ్ ప్రభల ఏర్పాటుకు పార్టీల నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. 60 మంది బైండోవర్ బేతవోలు జాతరలో రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అనుమతులు ఇవ్వడం లేదు. గతంలో జాతరలో పార్టీల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రాత్రి జరిగే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. పార్టీల నాయకులు మాత్రం స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ దగ్గర అనుమతి కోసం తిరుగుతున్నారు. అయితే పోలీసులు ముందస్తుగా గ్రామంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీల నుంచి ఇప్పటికే 60 మందికిపైగా కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో బైండోవర్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిలుకూరు ఎస్ఐ హనుమాన్నాయక్ ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్ఐలు, ప్రత్యేక పోలీస్ బలగాలు, సివిల్ పోలీసులు 70 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఫ బేతవోలు ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు ఫ రాత్రి వేళ సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వని పోలీసులు ఫ మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు -
రాజేష్ మృతికి కారకులను శిక్షించాలి
పెన్పహాడ్ : కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేష్ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని రాజేష్ను చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలను తట్టుకోలేక రాజేష్ మృతి చెందాడని ఆరోపించారు. రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతోపాటు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుచేసిన పోలీసు అధికారులను ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండేటి గోపి, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య, శివకుమార్, నరసింహ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగేంధర్, దాసరి శ్రీనివాస్, సర్పంచ్ ఒగ్గు కిరణ్, నన్నెపంగ సైదులు, లింగయ్య, కృష్ణ, శ్రావణ్కుమార్, మహేందర్, శ్యాంసన్, గోపి పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కానీ వారిని పరిసరాల్లోకి రానివ్వొద్దన్నారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్న్, ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జనార్దన్రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు, ఏఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలిఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 1250 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసుల లక్ష్యమన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దన్నారు. ఓటర్లు కానివారు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో ఉండకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరవద్దని, ఓటు వేయాలని 100 మీటర్ల పరిధిలో అభ్యర్థించవద్దన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా, డీజేలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు ఐదంచెల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు.. ● మీ పేరు తాజా ఓటరు జాబితాలో ఉన్నదా, లేదా అని నిర్ధారించుకోండి. ● పోలింగ్ సెంటర్కు సెల్ఫోన్న్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంట ప్రేరేపిత వస్తువులు తేవొద్దు, సెల్ఫీలు దిగొద్దు. ● మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి. ● ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకురండి. ● తెలియని వ్యక్తులకు ఓటర్ ఐడీ లేదా ఓటర్ స్లిప్ ఇవ్వొద్దు. ● రహస్య పద్ధతిలో ఓటు వేయాలి. ఫలానా గుర్తుకు ఓటు వేశానని బయటకు చెప్పవద్దు. ● కార్యకర్తలు, అభ్యర్థులు ఓటరు స్లిప్స్ పంచవద్దు. ● పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోండి. ● పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవద్దు. ● వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ఫ ఐదు మున్సిపాలిటీల్లో 137 వార్డులకు ఎన్నికలు ఫ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డులకుగాను నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు. 137 వార్డులు.. 612 మంది అభ్యర్థులు మున్సిపాలిటీ ఎన్నికలకు జనవరి 27న నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ, అనంతరం ఉపసంహరణ, ఈ నెల 4వ తేదీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకుగాను 141 వార్డులు ఉండగా.. అందులో కోదాడలో మూడు, హుజూర్నగర్లో ఒకటి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 612 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంది. కొన్నిచోట్ల రెబల్స్ సైతం గట్టి పోటీ ఇవ్వనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గల 137 వార్డుల్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 372 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలను నియమించారు. అదేవిధంగా 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులను నియమించారు. 10 ఎస్ఎస్టీ, 15 ఎఫ్ఎస్టీ, 7 వీవీటీ, 7 ఏటీ బృందాలను ఏర్పాటు చేశారు. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలీస్ ఎస్కార్టుతో ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు 46 బస్సులను ఏర్పాటు చేశారు. అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో.. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,17,843 మంది ఉండగా పురుషులు 1,08,763 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇతరులు 40 మంది ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులకుగాను 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు గాను 13,746 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పటిష్ట బందోబస్తు.. ఐదు మున్సిపాలిటీల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు నలుగురు, ఇన్స్పెక్టర్లు 12 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 50, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 265 మంది, కానిస్టేబుళ్లు 760, హహోంగార్డులు 152, మహిళా సిబ్బంది 90 మంది, స్పెషల్ పార్టీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ టీమ్స్, స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్లు విధులను నిర్వర్తించనున్నారు. ప్రలోభాల పర్వం.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక్కో వార్డులో రూ.1000 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మహిళలకు చీరలు, పురుషులకు ఖరీదైన మద్యం బాటిళ్లను సైతం పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించినట్టు సమాచారం. మున్సిపాలిటీల్లో ఇలా.. మున్సిపాలిటీ వార్డులు ఏకగ్రీవం ఓటర్లు కోదాడ 35 03 8601 హుజూర్నగర్ 28 01 29996 నేరేడుచర్ల 15 00 13746 తిరుమలగిరి 15 00 15455 సూర్యాపేట 48 00 108848 మొత్తం 141 04 2,26,646 -
నేరేడుచర్లను గ్రీన్ సిటీగా మారుస్తా
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీని గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నేరేడుచర్లలోని పలు వార్డుల్లో ఆయన రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ మాదిరిగా అన్నీ మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొణతం చిన వెంకట్రెడ్డి, నూకల సందీప్రెడ్డి, బచ్చలకూరి ప్రకాశ్, యారవ లక్ష్మి, ఇంజమూరి శ్రీకాంత్, వాణి, శంకర్, కొణతం మంజుల, వల్లంశెట్ల జ్యోతి, తాళ్ల లావణ్య, లక్ష్మయ్య, మొగలాబి, శ్రీను, కోటేశ్వరమ్మ, అబ్దుల్ ఖలీం తదితరులున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రాణం తిరుమలగిరి (తుంగతుర్తి) : తాటిపాముల తన సొంత గ్రామమని, తిరుమలగిరి, ఈ ప్రాంత అభివృద్ధి తన ప్రాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని స్థానిక క్రాస్ రోడ్లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ఎన్ని కోట్ల రూపాయలు అయినా మంజూరు చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో 1000 ఇళ్లు ఇస్తామని తెలిపారు. మండలంలోని 8 గ్రామాలకు దేవాదుల ఫేజ్–6 ద్వారా 18 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కార్నర్ సమావేశం సందర్భంగా పాత గ్రామం నుంచి క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, ఎన్నికల అబ్జర్వర్ రవళిరెడ్డి, వదలపాటి అధ్యక్షులు నరేష్, సంకెపల్లి కొండల్ రెడ్డి, మూల అశోక్ రెడ్డి, జమ్మిలాలు, అభ్యర్థులు పాల్గొన్నారు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బీఆర్ఎస్కు ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లే.. హుజూర్నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని, ఎవరికీ ఉపయోగపడదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 5, 6 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని జైలు నుంచి వచ్చే మురుగు నీటికి శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. అసంపూర్తి ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానన్నారు. కమ్యూనిటీ హాల్, సాయిబాబా థియేటర్ వద్ద చిల్ట్రెన్స్ పార్కు, మహిళల వాకింక్ ట్రాక్, జిమ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, సీపీఎం నాయకులు శీలం శ్రీను, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు పాల్గొన్నారు. -
మూడున్నరేళ్లుగా నిధుల్లేక!
రైతు వేదికల నిర్వహణకు సంబంధిచిన నిధులు పెండిగ్లో ఉన్న మాట వాస్తవమే. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అందజేస్తాం. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనంతగిరి : పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సు నిర్వహించేందుకు రెండు మూడు గ్రామాలను ఒక క్లస్టర్గా చేసి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాకు 82 రైతు వేదికలు మంజూరు చేయగా 79 క్లస్టర్లలో రైతువేధికలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట డివిజన్లోని నెమ్మికల్లు, తుంగతుర్తి డివిజన్లోని నాగారం, తుంగతుర్తి క్లస్టర్ రైతువేదికలు వివిధ కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. జిల్లాలో వ్యాప్తంగా 82 మంది ఏఈఓలు రైతులకు సేవలు అందిస్తుండగా ఇందులో 13 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. 2022లో ఏప్రిల్ నుంచి వరుసగా ఐదు నెలలకు సంబంధించిన రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.9వేల చొప్పున రూ.36.90 లక్షల నిధులను ప్రభుత్వం మూడు దఫాలుగా విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి నేటివరకు దాదాపు 42 నెలలకు (మూడున్నరేళ్లకు) సంబంధించి రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కాలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు తమ సొంత ఖర్చులతో వాటిని నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులూ కరువే..ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతు వేదికల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. రైతు వేదికల్లో నీటి సౌకర్యం కల్పించకపోవడంతో టాయిలెట్స్, మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీనికితోడు మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో శిక్షణ సమయంలో వచ్చే మహిళా రైతులతోపాటు వేదికల్లో విధులు నిర్వహించే మహిళా ఏఈఓలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏఈఓలకు ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లకు రీచార్జి చేయడంలేదని తమ సొంత ఫోన్ల ద్వార నెట్ సర్వీస్లను వినియోగించుకోవాల్సి వస్తుందంటున్నారు. ఔట్సోర్సింగ్ ఏఈఓలకు అందని జీతాలుఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 13 మంది ఏఈఓలకు 2025 జూన్ నెల నుంచి జీతాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. తమ ఆర్థిక ఇబ్బందులను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి రైతువేదికల నిర్వహణకు చేసిన ఖర్చులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఏఈఓలు విన్నవిస్తున్నారు.భారంగా రైతు వేదికల నిర్వహణ సమకూరని కనీస వసతులు సొంత ఖర్చులతో నెట్టుకొస్తున్న ఏఈఓలు బిల్లులు విడుదల చేయాలని వేడుకోలు జిల్లా వ్యాప్తంగా 79 రైతు వేదికలుఒక్కో రైతు వేదికకు నిర్వహణ ఖర్చు (రూ.లో)విద్యుత్ బిల్లు 1000 తాగునీటితో సహ నీటిబిల్లు 500 హౌస్కీపింగ్, వాచ్ అండ్ వార్డ్ చార్జీలు 3,000 జిరాక్స్, స్టేషనరీ ఖర్ఛులు 1000 శిక్షణ కార్యక్రమాలకు 2,500 ఇతర అవసరాలు 1000 మొత్తం 9,000 -
అర్వపల్లి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
అర్వపల్లి : రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ బోయలపల్లి రేఖ తెలిపారు. అర్వపల్లి ఆలయ అభివృద్ధికి సోమవారం దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.2లక్షల వ్యయంతో బోరు వేసి ట్యాంక్ నిర్మించి నీటి సమస్య తీర్చినట్లు చెప్పారు. అలాగే భక్తులకు శుద్ధ జలాలు అందించడం కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూరి యోగానందచారి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, ఆలయ ధర్మకర్తలు జె.సోమయ్య, బి.శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా
● డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా ● విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు తీసుకువస్తా ● సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదితసూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సూర్యాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 46వ వార్డు అభ్యర్థి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత అన్నారు. సోమవారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మౌలిక వసతుల కల్పనే ధ్యేయం పట్టణంలో మా వార్డుతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను, అంతర్గత రోడ్లను మెరుగుపరుస్తా. పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తా. వార్డుల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తా. పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరును అందిస్తా. దోమలు, పందుల నివారణకు కృషి చేస్తా. సూర్యాపేట మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలను అభివృద్ధి చేస్తాం. మేనిఫెస్టోను అమలు చేస్తా.. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తా. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తా. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డిల సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఈ ఎన్నికల్లో పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేస్తాం. -
కాంగ్రెస్కు ఓటేస్తే గోస పడతాం
సూర్యాపేటటౌన్ : మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మరింత గోస పడతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సోమవారం సూర్యాపేట పట్టణంలో అన్ని మున్సిపల్ వార్డుల అభ్యర్థులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో మీకేం లాభం జరిగిందో ఆలోచన చేయాలన్నారు. సీఎం, ఆయన మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం ఆధునీకరణకు రూ.25 కోట్లు, మహిళా పాలిటెక్నికల్ కళాశాల హాస్టల్ భవనానికి రూ.25కోట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కోట్లాది రూపాయలను వెనక్కి పంపారన్నారు. అరాచక కాంగ్రెస్ను నమ్మి.. అభివృద్ధి చేసే కేసీఆర్ను వదులుకున్నారన్నారు. మళ్లీ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఒరిగేదేమీ లేదని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పారన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
చివరి రోజు హోరెత్తించారు
భానుపురి, సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 4న మొదలైన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5గంటలకు తెరపడింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా పార్టీల నేతలు రోడ్షోలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను చుట్టివచ్చారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఓటర్ల ప్రసన్నానికి మంగళవారం చివరి అవకాశం ఉండడంతో ప్రలోభాలకు తెరలేపనున్నారు. రంగంలోకి కీలక నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈనెల 4వ తేదీన మొదలైంది. అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. ఖర్చులకు వెనుకాడకుండా కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ర్యాలీలు తీస్తూ భారీ జనసమూహాలతో అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు. నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకుగాను 372 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఐదు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హుజూర్నగర్ ఏఎంసీ గోదాంలో 56 పోలింగ్ కేంద్రాల సామగ్రి, కోదాడ సీసీ రెడ్డి కాన్వెంట్లో 91 సెంటర్ల సామగ్రి, నేరేడుచర్ల శ్రీరాచకొండ సీతారామనర్సయ్య ఫంక్షన్ హాల్లో 30 సెంటర్ల సామగ్రి, సూర్యాపేట శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో 165 సెంటర్ల సామగ్రి, తిరుమలగిరి ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 30 సెంటర్లకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు మంగళవారం ఉదయం నుంచే ఆయా సెంటర్లకు చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించి సామగ్రి తీసుకోనున్నారు.పోలింగ్ రోజున స్థానిక సెలవు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగానికి 11వ తేదీన (బుధవారం) స్థానిక సెలవుగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల పోలింగ్కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు అన్నింటికి ఈనెల 10వ తేదీతో పాటు 11న స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం భారీ జనసమూహాలతో అభ్యర్థుల బల ప్రదర్శన ఓటర్లను ఆకర్షించేందుకు నేడు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధం డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగియడంతో అభ్యర్ధులు ఎలాగైనా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మద్యం, డబ్బులు, ఇతర తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్ధులు ఇప్పటి వరకు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించగా.. ఇకపై వెనుకడుగు వేయకుండా ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.3000 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ నరసింహ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపల్ కేంద్రంలో జోనల్ ఆఫీసర్, ఆర్ఓల వారీగా డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారంతో పాటు మున్సిపల్ ఏరియాలో సాయంత్రం 5 గంటల నుండి 11 తారీకు పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ చేయించాలని ఎకై ్సజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను డి జి టి వాహనంలో ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్ రూములకు తరలించాలని, మిగిలిన బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా కవర్లో పెట్టి సీల్ వేయాలని, పోస్టల్ బ్యాలెట్ పేపర్లను వార్డుల వారిగా విభజించి కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్ల్లో అదనపు కలెక్టర్ సీతా రామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, బీసీ సంక్షేమ అధికారి నరసింహ, సి సెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గోదావరి జలాలు 1850 క్యూసెక్కులకు పెంపు
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబంధీ విధానంలో వస్తున్న గోదావరి జలాలను సోమవారం 1800 క్యూసెక్కుల నుంచి 1850 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. పంటలకు నీళ్లు చేరేలా రోజురోజుకు నీటిని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేసూర్యాపేటటౌన్ : వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలదేనని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత లక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిదంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. పీఆర్టీయూతోనే ఉపాధ్యాయులకు సౌకర్యాలుసూర్యాపేటటౌన్ : పీఆర్టీయూ స్థాపించిన తరువాతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు అందాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా సంఘ వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించి, పీఆర్టీయూ జెండా ఆవిష్కరించారు. అనంతరం సంఘం అభివృద్ధికి విశేష కృషి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాసర్ల వీరారెడ్డి, యగ్గడి వెంకటేశ్వర్లు, పారుపల్లి చంద్రశేఖర్, యర్ర హరికిషనన్ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు కొండేటి రవీందర్ రెడ్డి, చింతరెడ్డి రామలింగారెడ్డి, కందుకూరి శివశంకర్, చిప్పలపల్లి ధర్మయ్య, దండుగుల యల్లయ్య, కట్కూరి మధుసూదన్ రెడ్డి, మన్నెం వెంకట్ రెడ్డి, తావీర్య, శంకర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ను నమ్మితే అభివృద్ధి శూన్యం
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ పార్టీని నమ్మితే అభివృద్ధి శూన్యమని, అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాల్లోనే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500, ఆడపిల్ల లకు స్కూటీల హామీలు ఏమయ్యాయన్నారు. జాబ్ క్యాలెండర్తో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని, రూ.పదివేలు ఉన్న రైతు బంధును రూ.పదిహేను వేలకు పెంచుతామని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రెండేళ్లుగా తట్టెడు మట్టిపోయని కాంగ్రెసోళ్లు ఏం సాధించారని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడుగుతున్నారో నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే అవినీతి పెరిగింది తప్ప.. రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్నాయక్, ఆయా వార్డుల అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి -
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో కనుల పండువగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కార్పొరేట్కు అనుకూలంగా మోదీ ప్రభుత్వంఆత్మకూర్(ఎస్) : మానవ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అఖిల భా రత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, నాయకులు అలుగుబెల్లి వెంకట్రెడ్డి, డేగల వెంకటకృష్ణ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, నరసింహారావు, నల్లగొండ నాగయ్య పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బాలమురళికృష్ణ, రాజేష్, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. -
మున్సిపోల్స్కు పటిష్ట బందోబస్తు
ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధన ప్రకారం ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. ఆయుధ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు.ఫ 1,250 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఫ ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి ఫ నేటి సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగించాలి సాక్షి ఇంటర్వ్యూలో ఎస్పీ నరసింహసూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సి పాలిటీలకు ఈ నెల 11న జరగనున్న 2వ సాధారణ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ నిఘా ఉంచాం. ప్రలోభాలను నిర్మూలించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నిఘా కోసం ప్రత్యేక బృందాలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. అదనపు ఎస్పీలు, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో 1,250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ప్రతి మున్సిపాలిటీ పరిధికి అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. అలాగే ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులను నిర్వర్తిస్తాం. ప్రతి మున్సిపాలిటీకి 2 చొప్పున స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం నిఘా ఉంటుంది. 1,488 మంది బైండోవర్ అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 311 కేసుల్లో 450 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 1,488 మందిని బైండోవర్ చేశాం. ఎవరు కూడా బైండోవర్ నిబంధన ఉల్లంగించొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదును రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 71 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 47 కేసుల్లో రూ.2.80 లక్షల విలువైన 496 లీటర్ల మద్యం సీజ్ చేశాం.కేటాయించిన సిబ్బంది అదనపు ఎస్పీలు 02 డీఎస్పీలు 04 ఇన్స్పెక్టర్లు 12 సబ్ ఇన్స్పెక్టర్లు 50 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ 265 కానిస్టేబుల్స్ 760 హోంగార్డులు 152 మహిళా సిబ్బంది 90 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05నిబంధనలు పాటించాలిఈ నెల 9న సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్డే గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానీవారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు. -
మత రాజకీయాలు చేస్తున్న రేవంత్రెడ్డి
కోదాడ రూరల్ : సీఎం రేంవత్రెడ్డి ఎన్నికల సమయంలో మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కోదాడ పట్టణంలో పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బైక్ర్యాలీ చేపట్టారు. అనంతరం రంగా థియేటర్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రధాని మోదీ సహకారంతో తన సొంతగడ్డ అయిన కోదాడ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందాలతోనే పనిచేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీతలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, నరసింహారెడ్డి, మురళీధర్రెడ్డి, బండారు కవితారెడ్డి,వంగవీటి శ్రీనివాస్, అంజియాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, వెంకట్రామయ్య, నూనె సులోచన, యాదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
మిగిలింది.. ఒక్కరోజే
నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరభానుపురి, సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ఒక్కరోజు సమయం మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా నామినేషన్ వేసిన దగ్గర నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సైతం తమకే ఓటు వేయాలని సెల్ఫోన్, సోషల్ మీడియా ద్వారా, నేరుగా కలిసి అభ్యర్థిస్తున్నారు. ప్రచార రంగంలోకి ముఖ్యులు● కోదాడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మూడు రోజులుగా వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రచార నిర్వహిస్తున్నారు. ● తిరుమలగిరి మున్సిపాలిటీలో ప్రరచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మందుల సామేల్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ రంగంలోకి దిగారు. బీజేపీ.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడెం రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డిలతో ప్రచారం చేయిస్తోంది. ● సూర్యాపేట మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితను ప్రకటించగా.. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా కలిసి వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు అన్నీ తానై వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడే మకాం వేసి వార్డువార్డు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. బీజేపీ మొదటి నుంచి ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొదటగా అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వర్రావు చైర్మన్ అభ్యర్థిని సైతం ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ● నేరేడుచర్లలో 15 వార్డుల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్లను నియమించి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బాధ్యతలు తీసుకున్నారు. ● హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ స్థానిక నాయకత్వమే ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ తరఫున ఆదివారం మాజీ మంత్రి జగదీష్రెడ్డి ప్రచారం చేయగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సైతం ప్రచార రంగంలోకి దిగారు.నేడు మంత్రి ఉత్తమ్ పర్యటనజిల్లాకు చెందిన రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్షో నిర్వహించారు. ఇక సోమవారం జిల్లాలోని తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో ప్రచారం చేయనున్నారు.ఫ ఐదు మున్సిపాలిటీల్లో రంగంలోకి అగ్రనాయకులు ఫ బల ప్రదర్శనతో హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు ఫ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు4 నుంచి జోరుగా..జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు నామినేషన్ వేసిన అనంతరం ప్రచారం మొదలు పెట్టారు. ఈ నెల 4 నుంచి ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. మైకులు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, వాల్ పోస్టర్లతో తమ గెలుపు కోసం వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న బుధవారం ఎన్నికలు జరగనుండగా 9వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుంది. -
పేట అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు తీసుకురానున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంతోష్బాబు చౌరస్తా, పీఎస్ఆర్ సెంటర్ మీదుగా శంకర్ విలాస్ నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్వీప్ చేయబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలోనే 45 లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పేట అభివృద్ధికి సహకరించాలన్నారు. ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదికను చైర్మన్గా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రవిబాబు, పెద్దిరెడ్డి రాజా, చకిలం రాజేశ్వర్రావు, శ్రీనివాస్యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థులు మొరిశెట్టి నివేదిత, గునగంటి హేమ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
దావత్లకు టైమైంది!
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మందు, విందులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే ఓటర్ల వేట ప్రారంభిస్తున్నారు. అన్నా.. కలుస్తాం.. సమయం ఇస్తారా.. ? అని చెప్పి సమయం, ప్రాంతాన్ని నిర్దేశించి రాత్రివేళ సిట్టింగ్లతో ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందు పార్టీలకు ఖరీదైన బ్రాండ్లను ఎంపిక చేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర తాయిలాల పంపిణీకి సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నా.. పోలింగ్కు ఒకరోజు ముందు అందించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ఉదయం ప్రచారం.. రాత్రి మందు విందులు అన్నట్లుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టౌన్షిప్ల వారీగా.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ఆధారంగా అభ్యర్థులు ఉదయం నుంచే ఓటర్ల సమయాన్ని కోరుతున్నారు. తమకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డుల్లో ఉన్న ఉద్యోగులను రహస్య ప్రాంతాలకు తరలించి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లు, టౌన్షిప్ల వారీగా అక్కడ ఉన్న పార్టీ వ్యక్తులు, ముఖ్యులను కలుపుకుని ముందుకు పోతున్నారు. కొందరు అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఒకచోటకు చేర్చి దావత్లు ఇస్తున్నారు. ఇక రాత్రివేళ బయటకు రాలేని ఉద్యోగులు, ఇతరుల కోసం నేరుగా బాటిళ్లను తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 141 వార్డులకు గాను 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇవ్వాలని అభ్యర్థులు ఇప్పటికే గుర్తించారు. ప్రధానంగా మాస్ వార్డుల్లో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేసేందుకు వివరాలు సేకరించుకుంటున్నారు. ప్రచారానికి సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆయా వార్డుల క్యాంపుల్లో కల్పిస్తున్నారు. టిఫిన్ నుంచి భోజనం వసతి ఇక్కడే చూసుకుంటున్నారు. ఫ మున్సిపాలిటీల్లో విందులు షురూ ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు ఫ కమ్యూనిటీలు, టౌన్షిప్ల వారీగా సమావేశాలు ఫ తాయిలాలు పంపిణీకి సిద్ధం ఫ జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం -
‘దండు మైసమ్మ’కు భద్రతేదీ?
ఆత్మకూర్(ఎస్) : సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్లు గ్రామంలోని శ్రీదండు మైసమ్మ తల్లి ఆలయానికి భద్రత లోపించింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడం వల్ల ఇటీవల ఆలయ హుండీ చోరీకి గురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేసింది. అయినప్పటికీ ఆలయ నిర్వహణ, భద్రతా విషయంలో నిర్లక్ష్యం అలుముకుంది. దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండడంతోపాటు భక్తులు హుండీలలో కానుకలతోపాటు వెండి, బంగారు వస్తువులను మొక్కుబడులుగా చెల్లించుకుంటున్నారు. ప్రతినెల హుండీ కానుకల ద్వారా సుమారు రూ.1.50 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. దీంతో ఈ ఆలయం ఎండోమెంట్ విభాగం పరిధిలోకి వచ్చినప్పటి నుంచి 25 ఏళ్లుగా భక్తులు వెండి, బంగారం వస్తువులు సమర్పిస్తున్నప్పటికీ వాటి వివరాలకు సంబంధించిన రికార్డులు లేవని అధికారులే చెబుతుండడం గమనార్హం. భద్రతా లోపంతోనే చోరీ.. దండు మైసమ్మ ఆలయ దర్శన ప్రారంభం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సిబ్బంది ఎనిమిది గంటల పనిదినాల చొప్పున డ్యూటీ చేయాల్సి ఉండగా ఆలయ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎవరు ఎప్పుడు వస్తున్నారు.. వెళ్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఆలయానికి అవసరమైన సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ ఫుటేజీ స్టోరేజ్ రికార్డు లేకపోవడంపై సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి ప్రధాన గర్భగుడి వద్ద ఉన్న హుండీని ఎత్తుకెళ్లి చోరీ చేశారు. ఘటనలో దాదాపు రూ.20 వేల వరకు నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే చోరీ జరిగిన రోజు ఆలయంలో ఎవరూ విధుల్లో లేకపోవడంతో దుండగులు ఈ దశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వాహన పూజలు మొక్కుబడుల వద్ద మాత్రం సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఆలయానికి భద్రతాలోపం లేకుండా చూడాలని స్థానికు ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఫ ఆలయ నిర్వహణపై లోపించిన పర్యవేక్షణ ఫ సరిపడా సిబ్బంది ఉన్నా విధుల్లో నిర్లక్ష్యం ఫ నిఘా వైఫల్యంతో ఇటీవల హుండీ చోరీ ఫ భద్రత పెంచాలంటున్న స్థానికులు సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై నెమ్మికల్లు వద్ద గల దండు మైసమ్మ ఆలయం సుమారు ఐదు దశాబ్దాలుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 2001లో భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుంది. అప్పటినుంచి ఆలయ అభివృద్ధితోపాటు సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని ఆది, గురువారాల్లో సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం, వరంగల్, మహబూబబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. -
మంత్రి ఉత్తమ్ మాటల్లో వాస్తవం లేదు
కోదాడ : అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లయ్యయాదవ్ మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి, 30 సంవత్సరాల్లో ఉత్తమ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ పార్టీ గెలిచినట్లు ఉత్తమ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోదాడకు 100 పడకల వైద్యశాలను మంజూరు చేయించింది తానేనని, ఉత్తమ్ తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. లిప్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడమే ఉత్తమ్కు తెలిసిన విద్యఅని విమర్శించారు. కోదాడ మున్సిపాలిటీకి చెందిన శశ్మానస్థలాన్ని కూడా కబ్జా చేసిన చరిత్ర ఉత్తమ్ అనుచరులదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కె.నయీం, సురేష్నాయుడు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను నిర్మూలించాలి
చివ్వెంల (సూర్యాపేట) : గ్రామాల్లో బాల్య వివాహాలను నిర్మూలించాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్టా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని చివ్వెంల గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం వల్ల చిన్న వయస్సులోనే అమ్మాయిలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాలికల వయస్సు 18, బాలుర వయస్సు 21 నిండాకే వివాహం జరిపించరాదన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, నామినేటెడ్ సభ్యురాలు నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి -
కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితలక్షాది
స్థానిక రైతులకే యూరియా అందించాలి మునగాల : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఆయా సొసైటీల పరిధిలోని రైతులకే యూరియా అందించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ పరిధిలో రైతులకు కాకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇతర గ్రామాల రైతులకు యూరియా ఇస్తుండడంతో స్థానిక రైతులకు దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా యాప్పై అవగాహన లేక రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బచ్చలకూర స్వరాజ్యం, రైతు సంఘం మండల అధ్యక్షుడు చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, మల్లారెడ్డి పాల్గొన్నారు. మోతాదుకు మించి యూరియా వాడొద్దు పాలకవీడు : పంట పొలాల్లో యూరియాను మోతాదుకు మించి వాడొద్దని, అలా వాడితే పంటలకు అధికంగా చీడపీడలు ఆశించే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ యూరియా విక్రయాలు పారదర్శకంగా ఉండాలని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందించాలని డీలర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్కు నిరంతరం యూరియా సరఫరా కొనసాగుతందన్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 యూరియా బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరమైన రైతులు యాప్లో బుక్ చేసుకోవాలన్నారు. డీలర్లు ఎవరైనా అధిక ధరలకు యూరియా అమ్మినా, రికార్డుల్లో తేడాలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఈఓలు, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు ఉన్నారు. వైభవంగా నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు నిర్వహించి కల్యాణం చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణా చార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ అంటే కబ్జాలు, కూల్చివేతలని.. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, ప్రశాంత వాతావరణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డుతో పాటు పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే అవినీతి, దౌర్జన్యాలను పెంచి పోషించినట్లేనన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి, ప్రశాంతతకు బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్గా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులే సిగ్గులేకుండా దోచుకుంటున్నారని, ప్రజలను మోసం చేసి దోచుకోవడం వాళ్లకు కొత్తేమీ కాదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జగదీష్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
మిర్చికి తెగులు.. రైతుకు దిగులు
ఆత్మకూర్ (ఎస్) : జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగు, ఆకు ముడత తెగుళ్లు సోకడంతో మిర్చి తోటలు ఎదుగుదల లోపించి కనిపిస్తున్నాయి. పూత, కాత లేకపోవడంతో దిగుబడులు పూర్తిగా పడిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో దిగుబడులు ఉన్నా పండిన పంటకు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఈ ఏడాది దిగుబడి పూర్తిగా తగ్గి ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నామని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4 వేలకుపైగా ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ సీజన్లో 6,554 ఎకరాల్లో రైతులు మిర్చిపంట సాగు చేస్తున్నారు. గతంలో 12వేల ఎకరాల వరకు ఎకరాలకుపైగా మిర్చి సాగు చేసినప్పటికీ ధర పడిపోవడంతోపాటు కూలీల రేట్లు పెరగడంతో చాలామంది రైతులు మిర్చి సాగును వదులుకున్నారు. మిర్చి బదులు మొక్కజొన్న, మినుములు, పెసర సాగు చేస్తున్నారు. కానీ కొందరు రైతులు మిర్చినే నమ్ముకుని సాగు చేస్తున్నప్పటికీ మిర్చి పంటకు నల్లి పురుగు, ఆకు ముడత, తామర పురుగు బెడద పట్టుకుంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. ఫ గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగుల బెడద ఫ ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకిరాని తెగుళ్లు ఫ ఎదుగుదల లోపించి సరిగా కాతలేని చేలు ఫ దిగుబడిపై రైతుల్లో ఆందోళన ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆత్మకూరు (ఎస్)మండలం రామోజీతండాకు చెందిన రైతు గుగులోతు రవి. ప్రస్తుత సీజన్లో ఈయన 1.15 ఎకరాల్లో దాదాపు రూ.80వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేశాడు. ఇప్పటి వరకు ఒకేసారి పంట ఏరగా 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదే భూమిలో గతేడాది రూ.50వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేయగా మొదటిసారి కాయలు కోయగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటా మిర్చి రూ.13వేలు ఉండగా ఖర్చులు పోను లాభసాటిగానే ఉంది. కానీ ఈ సంవత్సరం క్వింటాకు రూ.19వేల ధర పలుకుతున్నప్పటికీ తెగుళ్ల బెడదతో దిగుబడి లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభుశంభులింగేశ్వర స్వామి ఆలంలో శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. మండలాల వారీగా జిల్లాలో మిర్చి సాగు ఇలా.. మండలం ఎకరాలు ఆత్మకూరు(ఎస్) 154 చివ్వెంల 21 పెన్పహాడ్ 12 సూర్యాపేట 2.39 చింతలపాలెం 3,918 మట్టంపల్లి 1,290 పాలకవీడు 2.35 అనంతగిరి 1.16 మోతె 798 మునగాల 70.20 నడిగూడెం 13 జాజిరెడ్డిగూడెం 03 మద్దిరాల 99 నూతనకల్ 111 నాగారం 44 తిరుమలగిరి 1.20 తుంగతుర్తి 14 కౌలుకు తీసుకొని రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ సంవత్సరం నల్లి పురుగు ప్రభావంతో పైరంతా ముడత వచ్చి పూత రాలిపోతుంది. ఎన్ని మందులు కొట్టిన అదుపులోకి రావడం లేదు. కాపు అసలు లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – బానోతు శ్రీను, రామోజీతండా -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
సూర్యాపేట, తిరుమలగిరి : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, లోపాలకు తావుండరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను గురువారం ఎస్పీ నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమత్రెడ్డి, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తిరుమలగిరిలో అభ్యర్థులకు ఎన్నికల నియమా వళిపై అవగాహన కల్పించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. టెన్త్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలపాలిసూర్యాపేట : టెన్త్ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమావేశమై ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని తీర్చిదిద్దాలన్నారు. ఫలితాల్లో వెనుకబడిన పాఠశాల లపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పంచాయతీ నిధులు స్వాహా!
ఆత్మకూర్.ఎస్ : ఎలాంటి తీర్మానాలు లేకుండా పంచాయతీ నిధులను కాజేశారు.. పలువురు కార్యదర్శులు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు మాయమాటలు చెప్పి చెక్కులపై వారి సంతకాలు తీసుకొని దొడ్డిదారిన స్వాహా చేశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పంచాయతీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. కాగా రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిలిచిపోయాయి. దీంతో పలు మౌలిక వసతుల కల్పన కోసం తమ చేతిలోనుంచి డబ్బులు ఖర్చు చేశామని, ఇప్పుడు నిధులు వచ్చినందున డ్రా చేసుకునే వెసులుబాటు అధికారులు కల్పించారని కార్యదర్శులు నమ్మబలికారు. వారి మాటలు నమ్మి చెక్కులపై సంతకాలు చేసినట్లు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వాపోయారు. గుట్టు రట్టయ్యిందిలా.. దుబ్బతండా, ఆత్మకూర్.ఎస్, హాస్లాతండా, పాతర్లపహాడ్, తుమ్మలపెన్పహాడ్, నసీంపేట, కోటినాయక్తండా పంచాయతీల్లో నిధులు పక్కదారి పట్టాయి. అయితే చెక్కులపై సంతకాలు పెట్టిన విషయాన్ని తుమ్మలపెన్పహాడ్ సర్పంచ్, ఉప సర్పంచ్ తమ కుటుంబీకులతో పాటు వార్డు సభ్యులు, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని తెలుసుకొని వెంటనే పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కార్యదర్శిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. పైగా నిధులు డ్రా చేయడం నా ఇష్టం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ దబా యించడంతో సర్పంచ్, వార్డు సభ్యులు ఎంపీడీఓ ను కలిసి ఫిర్యాదు చేశారు. రికవరీ చేస్తారా, వదిలేస్తారా?గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి నిండా రెండు నెలలు కాలేదు. తీర్మానాలు లేకుండా పంచాయతీ కార్యదర్శులు దొడ్డిదారిన నిధులు కాజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే నిధులు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నిలిచిపోయింది. తాజాగా వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కార్య దర్శులు స్వాహా చేయడంతో ప్రజలు అవసరాలు ఎలా తీర్చలంటూ సర్పంచ్లు వాపోతున్నారు. వచ్చే ఆర్థిక సంఘం నిధుల వరకు మళ్లీ ఇబ్బందులు తప్పవేమోనని, అధికారులు తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నాయి. పాలకవర్గాల తీర్మానం లేకుండానే డ్రా చేసిన కార్యదర్శులు ఏడు గ్రామ పంచాయతీల్లో రూ.15 లక్షల వరకు పక్కదారి? ఎంపీడీఓకు ఫిర్యాదునిధులు స్వాహా జరిగిన గ్రామ పంచాయతీలు ఇవే..కోటినాయక్తండా రూ.1,20,500, దుబ్బ తండా రూ.64,500, ఆత్మకూరు.ఎస్ రూ.2,85,492, హాస్లాతండా రూ.1,17,000, పాతర్లపహాడ్ రూ.3,38,497, తుమ్మలపెన్పహాడ్ రూ.4,35,141, నసీంపేట పంచాయతీలో రూ.1,39,000 దొడ్డిదారిన కార్యదర్శులు డ్రా చేశారని ఆయా గ్రామాల సర్పంచ్లు ఆరోపించారు.పాలకవర్గాల తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ ఖాతాల నుంచి నిధులు డ్రా చేసిన విషయమై విచారణ జరిపి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం. రుజువైతే డ్రా చేసిన నిధులను రికవరీ చేస్తాం. ఏడు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు దొడ్డిదారిన నిధులు డ్రా చేసినట్లు మా దృష్టికి వచ్చింది. – హసీం, ఎంపీడీఓ -
నిర్వహణకు నీళ్లొదిలారు
పాలారం వద్ద మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నా. నెల రోజులుగా కాలువ నీళ్లు అందడంలేదు. సాగునీరు అందకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. ఇప్పటికై నా అధికారులు చివరి భూములకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి. – మట్టపల్లి రామకోటయ్య, రైతు, పాలారం పాలారం మేజర్ చివరి భూములకు సాగు నీరు అందకపోవడంపై రైతులు సమస్యను మా దృష్టికి తీసువచ్చారు. కాలువ పూర్తిగా లైనింగ్ చేయాలంటే ఆయకట్టు 10 వేల ఎకరాలకు పైగా ఉంటేనే సాధ్యపడుతుంది. పాలారం మేజర్ కాలువ 4820 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్నందున చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్లడం జరిగింది. – తుమ్మల శ్రీనివాస్గౌడ్, ఇరిగేషన్ ఏఈ కాలువపై ఉన్న యూటీలు పగిలిపోయి నీరు వృథాగా పోతుంది. కాలువకు పూర్తిగా లైనింగ్ చేస్తే చివరి భూములకు నీరు అందుతుంది. అధికారులకు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా కాలువను మరోసారి పరిశీలించి రివిజన్ చేయాలని కోరుతున్నాం. – గుర్రం వెంకట్రెడ్డి, రైతు, త్రిపురవరం అనంతగిరి: పాలారం మేజర్–14బి కాలువలో నీరు ముందుకు కదలడం లేదు. కాలువ నిండా కంపచెట్లు, జమ్ము ఏపుగా పెరగడంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. కాలువ ప్రారంభంలో నీటి సరఫరా బాగానే ఉన్నా చివరి వరకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి సమస్య విన్నవించినా పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు. 4,820 ఎకరాల ఆయకట్టు పాలారం మేజర్–14బి కాలువ నడిగూడెం మండలం సిరిపురం నుంచి అనంతగిరి మండలం పాలారం గ్రామం వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర విస్తరించి 4,820 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. నడిగూడెం మండలం వల్లాపురం వరకు పొలాలకు నీరు సక్రమంగానే అందుతున్నప్పటికీ అనంతగిరి మండలంలోని చివరి ఆయకట్టు గ్రామం త్రిపురవరం చేరుకునే వరకు నీటి ప్రవాహం మందగించి పోతుంది. సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టుకు సరిగా నీరందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. యూటీలకు మరమ్మతులేవీ? పాలారం మేజర్–14బి.. కాంటూరి కాలువ (నీరు ప్రవాహం నెమ్మదిగా వెళ్లేందుకు చేసిన కాలువ నిర్మాణం). కాలువలో పూడిక, నాచు, జమ్ము, గుర్రపుడెక్కతో నిండింది. అంతేకాకుండా కాలువ 8 యూటీ(అండర్ టన్నెల్)లను కలిగి ఉంది. యూటీలు పగిలిపోవడంతో పంటలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతుంది. ఇవి మరమ్మతులకు నోచుకోక రైతులకు మరో సమస్యగా మారింది. త్రి పురవరం, చనుపల్లి, పాలారం గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు నీరందక రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. ‘పాలారం మేజర్–14బి’ చివరి భూములకు చేరని నీరు ఫ కాలువ నిండా కంపచెట్లు, జమ్మి ఫ ముందుకు సాగని నీటి ప్రవాహం ఫ పగిలిపోయిన అండర్ టన్నెల్స్..వృథాగా పోతున్న నీరు ఫ దాదాపు 2 వేల ఎకరాలకు ఇబ్బందులు ఫ మరమ్మతులు చేపట్టి, లైనింగ్ ఏర్పాటు చేయాలని రైతుల వేడుకోలు -
అభివృద్ధిని ప్రతి ఓటరుకూ వివరించండి
నేరెడుచర్ల : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థులకు సూచించారు. గురువారం నేరేడుచర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరేడుచర్లలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన చెత్త డంపింగ్యార్డును మరో చోటకు తరలించనున్నట్లు తెలిపా రు. మున్సిపాలిటీలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేశామన్నారు. హుజూర్నగర్లో వ్యవసాయ కళాశాల, కోదాడలో జవహర్ నవోదయ పాఠశాలకు ఇటీవల గవర్నర్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీస్కాన్, డయాలసిస్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. నేరేడుచర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించానని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. అలాగే షాదీఖాన కోసం రూ.75లక్షలు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పాలకీడు మండలంలో 10 వేల ఎకరాల గిరిజన భూములను సస్యశ్యామలం చేయించేందుకు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తాను 1994 నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజాసేవకే అంకితం అయ్యానన్నారు. 2023 డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసు కోకుండా పని చేశానన్నారు. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులు వంద శాతం గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్రెడ్డి, నూకల సందీప్రెడ్డి, నాయకులు బచ్చలకూరి ప్రకాశ్, భూక్యాగోపాల్, దనుంజయ నాయుడు, సురేష్రెడ్డి, జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన సమన్వయం సాధించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోఆర్డినేటర్లను నియమించింది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియమించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా ఎంఆర్జీ వినోద్రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్రెడ్డి, పొట్ల నాగేశ్వర్రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్రెడ్డి, హుజూర్నగర్కు నూతి శ్రీకాంత్గౌడ్, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్రెడ్డి, చౌటుప్పల్కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్యాదవ్, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణ గౌడ్, చిట్యా లకు గౌరిసతీష్ను నియమించారు. నర్సరీల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరిమునగాల: నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని జెడ్పీ సీఈఓ శిరీష నిర్వాహకులకు సూచించారు. మునగాల మండలం నరసింహులగూడెంలో నర్సరీని గురువారం ఆమె సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్రాంతాల్లో నాటేందుకు నర్సరీల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. వేసవిలో మొక్కల ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ రమేష్దీనదయాళ్, ఎంపీఓ నరేష్, ఏపీఓ శైలజ, టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి ఉదయ్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కల్యాణి ఉన్నారు. పోలీసు స్టేషన్ తనిఖీ అర్వపల్లి: మండలంలోని నాగారం పోలీస్స్టేషన్ను గురువారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్తో కలిసి ఎస్సీ నరసింహ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. స్టేషన్డైరీ, రిషెప్షన్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. నమోదైన కేసులు, వాటి స్థితిగతులపై ఆరా తీశారు. బాధితుల ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు. వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలి సూర్యాపేటటౌన్ : పోలీస్ వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వాహనాల డ్రైవర్లకు సఫారీ యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులను సంఘటన స్థలాలకు, బాధితుల వద్దకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వాహనాలను కండీషన్లో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్కుమార్, పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురేష్, పోలీస్ సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు. నృసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. మూలవిరాట్ను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం నిత్యహోమం, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులు పూర్తి చేయండి
భానుపురి (సూర్యాపేట) : ఉపాధిహామీ పనుల్లో వేగం పెంచి గడువులోపు లక్ష్యం చేరాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీడీలు, ఈసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. జల్ శక్తి, జన్ భాగిదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని గుర్తించి, నీటి సంరక్షణకు సంబంధించిన 20 రకాల పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత పెంపొందించడం, భూగ ర్భ జల మట్టాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనులు ఉండాలన్నారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద ఆరు రకాల పనులు గుర్తించాలని, వనమహోత్సవం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ డీఆర్డీఓ, ఏపీడీ శిరీష, తుంగతుర్తి ఎంపీడీఓ శేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించాలి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కే జీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, టీజీఎంఎస్ ప్రిన్సి పాళ్లతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 70 శాతం మా ర్కులు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. పెండింగ్ భవిత సివిల్ వర్క్స్ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రావణ్, కో ఆర్డినేటర్లు పూలమ్మ, రాంబాబు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సామాజిక న్యాయ దినోత్సవం
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారన్నీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యా యం సాధించడానికి మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలే మార్గదర్శకాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో ఉపయుక్తమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ శిరీష, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నరసింహ, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీటీడీఓ శంకర్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డితో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు -
ఆరు దశాబ్దాల అపూర్వ సమ్మేళనం
హుజూర్నగర్ : అవును.. వాళ్లంతా కలిసి చదువుకున్నారు. వారికి ప్రస్తుతం దాదాపు 75–76 ఏళ్లు ఉంటాయి. ఆరు దశాబ్దాల తరువాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకకు హుజూర్నగర్లోని కోట లక్ష్మీనరసింహరావు తోట వైదికయ్యింది. హుజూర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు (1963–64 హెచ్ఎస్సీ) కలిసి చదువుకుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా 60 ఏళ్ల తరువాత బుధవారం ఒకే చోట కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు, కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. ఆనాటి మధురస్మృతులు గుర్తుచేసుకుని ఉల్లాసంగా గడిపారు. అనంతరం పరస్పరం జ్ఞాపికలు బహూకరించుకొని సన్మానించుకున్నారు. అమెరికాలో స్థిరపడి ఇటీవల మాతృదేశానికి వచ్చిన పూర్వ విద్యార్థి కన్నెగుండ్ల రామ నర్సయ్య ప్రత్యేకంగా వచ్చి తోటి విద్యార్థులను కలుసుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముత్తినేని వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, వక్కవంతుల కోటేశ్వర్రావు, కన్నగుండ్ల రామనర్సయ్య, ఎంబీ దేవదానం, డేవిడ్ రాజ, అలుగుబెల్లి లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి కృష్ణారెడ్డి, కోట సూర్యప్రకాశరావు, ఆకుమడుపుల హనుమంతు, కుక్కడపు కాశయ్య, కర్నాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
నేరేడుచర్ల : మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, సజావుగా జరిగేలా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం ఆయన నేరేడుచర్ల పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరి శీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలు, వాటి పరిసరాలను క్షేత్రస్థాయిలో పరి శీలించాలన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణా, ఆసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. పట్టణాల్లోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలేని స్పష్టం చేశారు. ఎన్నికల నియమనిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై కఠిన వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ చేసే కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ రవీందర్నాయక్, సిబ్బంది ఉన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
అభివృద్ధే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుంది
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 6, 5, 31, 3, 22, 39 వార్డుల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు ఆయుధంతో కాంగ్రెస్కు వేటుపడాలన్నారు. రెండేళ్ల పాలనలో ఏ సాధించారో చెప్పాలని కాంగ్రెసోళ్లను నిలదీయాలన్నారు. అధ్వాన రోడ్లు, మురుగు, దోమల బెడద, చెత్త, కరెంటు కోతలు.. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇద్దరు మంత్రులు అరాచక శక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు, సిండికేట్ దందాలు మళ్లీ మొదలయ్యాయని, వాటిని ఆదిలోనే అంతమొందించాలన్నారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్కు కనపడకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్లో చేరారు. -
మిర్యాలగూడకు అధిక నిధులు ఇవ్వాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు
మేళ్లచెరువు,హుజూర్నగర్ : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా, మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించే జాతరకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చొరవతో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరైనట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈనెల 14నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధులు మంజూరు పట్ల ఆలయ అధికారులు, జాతర కమిటీ సభ్యులు, నాయకులు మత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్య జాగ్రత్తలుతప్పనిసరి సూర్యాపేటటౌన్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించారు. పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఉచిత వైద్యసేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమూల్య, వెంకన్న, సంజీవరెడ్డి, సంభాషివరావు, రవి, జ్యోతి, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నృసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్య కల్యాణం వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లు నిర్వహించి కల్యాణ తంతు పూర్తి చేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. మూలవిరాట్ను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం నిత్యహోమం, మహా నివేదన తదితర పర్వాలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
– జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఎల్కేజీ నుంచి ఉన్నత స్థాయి విద్య అన్ని వర్గాల పిల్లలకు అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు. -
సంక్షేమానికే మీ ఓటు
మిర్యాలగూడ : కాంగ్రెస్ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్ఎల్బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు జానారెడ్డి నమ్మి భాస్కర్రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వాపస్ తీసుకోవాలని భాస్కర్రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరూ మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం ఫ సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం ఫ ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండబెట్టింది ఫ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
వర్థెల్లి బుచ్చిరాములు జీవితం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : తన జీవితాంతం పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన గొప్ప వ్యక్తి వర్థెల్లి బుచ్చి రాములు అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కొనియాడారు. సీపీఎం సీనియర్ నేత వర్థెల్లి బుచ్చిరాములు వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో ఆయన చిత్ర పటానికి పలువురు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన బుచ్చిరాములు చిన్నతనంలోనే ఎర్రజెండా చేతబట్టి ప్రజా పోరాటాలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బుచ్చిరాములు తుంగతుర్తి, సూర్యాపేట ఉమ్మడి డివిజన్ వ్యాప్తంగా భూ పోరాటాలు చేశారని, కార్మికులు, కర్షకులు, పేద వర్గాలకు అండగా నిలిచి ఉద్యమాలు నిర్మించారని పేర్కొన్నారు. సూర్యాపేట సీపీఎం ఆఫీస్ కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. సూర్యాపేట తాలూకాలో జరిగిన నిర్బంధాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో బుచ్చిరాములు పాత్ర మరువలేనిదన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్యకర్తలను నాయకులుగా తయారు చేసిన ఘనత బుచ్చిరాములుకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ధని యాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, అబ్బగాని భిక్షం, బత్తుల వెంకన్న పాల్గొన్నారు. సీపీఎం వాణిజ్య భవన్ ఆధ్వర్యంలో.. సూర్యాపేటలోని సీపీఎం వాణిజ్య భవన్ ఆధ్వర్యంలో వర్థెల్లి బుచ్చిరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వాణిజ్య భవన్ కార్యదర్శి బొ మ్మిడి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. ప్రజల కోసం బుచ్చి రాములు నిర్మించిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. దురాజ్పల్లిలో వివేకానంద వృద్ధాశ్రమంలో బొమ్మిడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, భద్రమ్మ, బొమ్మిడి అశోక్, వేల్పుల వెంకన్న, సాయికుమార్, ఆసిఫ్, ప్రసాద్ పాల్గొన్నారు నివాళర్పిస్తున్న సీపీఎం వాణిజ్య భవన్ కార్యదర్శి లక్ష్మీనారాయణ వర్థెల్లి బుచ్చిరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి -
కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం సాగర్ ఆయకట్టు కింద ఉందని, 90శాతం రైతులు ఇక్కడ వరి పండిస్తారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు అందిస్తున్నామన్నారు. -
సాగునీటి కొరత తీర్చేలా..
రాజీవ్ లిఫ్ట్ పూర్తయి నీటిని ఎత్తిపోస్తే నేరుగా కాలువల ద్వారా సాగునీటిని పొలాల్లోకి మళ్లించుకోవచ్చు. తద్వారా ఎటువంటి ఖర్చు ఉండదు. నీరు సమృద్ధిగా అందితే పంటల దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం కూడా భారీగా పెరుతుంది. – షేక్ బాషా, శాంతినగర్ గ్రామస్తుడు రాజీవ్ లిఫ్ట్ పనులు పూర్తికి సెప్టెంబర్ నాటికి గడువు ఉన్నప్పటికీ జూన్ వరకు పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు అందించే దిశగా పనులు జరుగుతున్నాయి. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ఈ ప్రాజెక్టును సాంకేతికంగా బలంగా నిర్మిస్తున్నాం. – సత్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ రాజీవ్ లిఫ్ట్ పూర్తయితే కొత్తగూడెం మేజర్ 14–ఏ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందనుంది. ఆయకట్టు పరిధిలోని 5వేల ఎకరాలు సాగులోకి రానుంది. యాసంగి, వానాకాలంలోనూ నీరు సమృద్ధిగా అంది మా భూములు సస్యశ్యామలమవుతాయి. – తేజావత్ వెంకటేశ్వర్లు, రైతు, కొత్తగూడెం పాలేరు వాగులో వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి కొత్తగూడెం మేజర్ ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించే రాజీవ్ లిఫ్ట్కు రూపకల్పన చేయడం సంతోషకరం. ఈ లిఫ్ట్తో ఈ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి చెందనుంది. – నెల్లూరి వినయ్కుమార్, రైతు, గోండ్రియాల అనంతగిరి : కోదాడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతగిరి మండలం కొత్తగూడెం మేజర్ 14–ఏ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందిచడమే లక్ష్యంగా శాంతినగర్ శివారులోని పాలేరు వాగుపై రూ.54.03కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించి రైతుల నుంచి మొత్తం 8 ఎకరాల భూమిని సేకరించి పరిహారం కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈలిఫ్ట్ నిర్మాణం పూర్తయితే అనంతగిరి మండంలోని మొగలాయికోట, శాంతినగర్, లకారం, బొజ్జగూడెంతండా, గోండ్రియాల, కొత్తగూడెం గ్రామాలతోపాటు కోదాడ మండంలోని తమ్మర, చిమిర్యాల, మంగలితండా గ్రామాలకు రైతులకు సాగునీరు అందనుంది. రెండు పంటలకు సాగునీరందించాలని.. కొత్తగూడెం మేజర్ 14–ఏ పరిధిలోని చివరి ఆయకట్టులో రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాలేరు వాగు నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 5వేల ఎకరాలకుపైగా భూములకు సాగునీరందించనున్నారు. దీంతో వేసవి, వర్షాకాలాల్లోనూ రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరందనుంది. ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఈ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఇందులో ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూన్లో పూర్తిచేసేలా.. రాజీవ్ లిఫ్ట్ పనుల పూర్తికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. అయితే జూన్ వరకు పూర్తిచేసి వానాకాలం సీజన్కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన భారీ ఇనుప పైపులను అధికారులు చేరవేయగా, ఇతర పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు కూడా పెరగనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ శాంతినగర్లో పాలేరు వాగుపై రాజీవ్ లిఫ్ట్ పనులు ప్రారంభం ఫ కొత్తగూడెం మేజర్ చివరి ఆయకట్టును సస్యశ్యామలం చేయడానికే ప్రాజెక్టు ఫ రూ.54.03 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ పనులు పూర్తయితే అనంతగిరి, కోదాడ మండలాల రైతులకు లబ్ధి -
బాలల వికాసానికి కృషిచేయాలి
సూర్యాపేట టౌన్ : వెట్టిచాకిరీ చేస్తూ నిరాదరణకు గురైన, అలాగే తప్పిపోయి వచ్చిన బాలబాలికలను గుర్తించి వారి వికాసానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. ఆపరేషన్ స్మైల్ పూర్తయిన సందర్భంగా సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి విజయంతంగా పూర్తిచేసిన సిబ్బందిని అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 176 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు క్షేమంగా అప్పగించామన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56 మంది బాలలు ఉండగా 49 మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది బాలలు ఉండగా వీరిలో 80 మంది బాలురు, 40 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పోలీస్ ఐటీ ఆర్ఎస్ఐ రాజశేఖర్, చైల్డ్ సంరక్షణ అధికారులు రవి, నాగుల మీరా, సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి ఫిర్యాదుదారుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పలువురు ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఫోన్ ద్వారా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపొదన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారుఉ. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
కర్ల రాజేష్ మృతికి కారకులను శిక్షించాలి
ఆత్మకూర్ (ఎస్), నూతనకల్ : దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీస్ అధికారులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆత్మకూర్ (ఎస్) మండల నెమికల్, నూతనకల్ మండల కేంద్రంలో సోమవారం సంతాప సభలు నిర్వహించారు. నూతకల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. రాజేష్ మృతి చెంది రెండు నెలలు కావస్తున్నప్పటికీ రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నోరు విప్పకపోవడం విచారకరమన్నారు. దళితులపై జరిగే అన్యాయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 5న సూర్యాపేటలో జరిగే రాజేష్ సంతాప సభకు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి పరశురాములు, ఆత్మకూర్ (ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, నాయకులు చిన్న శ్రీరాములు మాదిగ, ఎడవల్లి ముత్తయ్య, ఎర్ర వీరస్వామి, బత్తుల ప్రసాద్, యాతాకుల వెంకన్న, యాతకుల రాజయ్య, బోల్లపాక సైదులు, శేఖర్, చిన్ని, జగన్, గరిగంటి ప్రకాష్, పాల్వాయి బాలయ్య, గంగాధరి లక్ష్మికాంత్, కాసర్ల మధు, నకిరేకంటి వెంకన్న, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫ మంద కృష్ణమాదిగ -
ఎగిరేది గులాబీ జెండానే..
ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అర్థమైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పటికీ మరువలేరన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డీపీఆర్ఓగా బాధ్యతల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట) : జిల్లా పౌర సంబంధాల నూతన అధికారి (డీపీఆర్ఓ)గా వి.శ్రీనివాసరావు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ కె.సీతారామారావులను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభంసూర్యాపేట టౌన్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషల్లో జనరల్ విద్యార్థులు 879 మందికి గాను 838 మంది హాజరు కాగా 41 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 985 మందికి 837మంది హాజరు కాగా 148 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషల్లో జనరల్ విద్యార్థులు 730 మందికి గాను 700 హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 940 మందికి గాను 851 మంది విద్యార్థులు హాజరై 89 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బీజేపీతోనే పారదర్శక పాలన నేరేడుచర్ల : బీజేపీతోనే పారదర్శక పాలన సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు సోమవారం నేరేడుచర్లలోని ఆ పార్టీ కార్యాలయంలో బి–ఫారాలను అందించి మాట్లాడారు. నేరేడుచర్ల పట్టణాభివృద్ధే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే ఈ సారి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ప్రబారీ పోతుగంటి భరత్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి, జిల్లా కోశాధికారి తాళ్ల నరేందర్రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడిగా వేముల సైదులునడిగూడెం : జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడిగా నడిగూడెం మండలం తెల్లబల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సోషల్ టీచర్ వేముల సైదులు ఎన్నికయ్యారు. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన ఆ సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం ప్రధాన కార్యదర్శిగా కొప్పుల కిరణ్, కోశాధికారిగా సుదర్శనరావు, ఉపాధ్యక్షులుగా సైదులు, వీరారెడ్డి, నాగమణి, సోమయ్య, కార్యదర్శులుగా ఎండి.హమీద్, సత్యనారాయణ, జ్యోతి, మరికొందరు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సైదులును తెల్లబల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు అభినందించారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధచూపాలిచివ్వెంల (సూర్యాపేట) : నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల అధికారులు, ఫీల్ట్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని డీఆర్డీఓ శిరీష అన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన వన నర్సరీని పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీహెచ్.సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర్, ఏపీఓ ఇరుగు నాగయ్య, టీఏ వినోద్కుమార్, సర్పంచ్ ఏర్పుల కళ్యాణి, ఫీల్ట్ అసిస్టెంట్ తుర్క మల్లేష్, కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీచక్ర స్నానం
యాదగిరిగుట్ట : పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే చతుర్వేద పారాయణం, యాజ్ఞీకులచే నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు నిర్వహించారు. ఉదయం 9గంటలకు పూర్ణాహుతి మహోత్సవం వైభవంగా జరిపించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో శ్రీచక్రాన్ని, స్వామి వారిని ఊరేగించి పుష్కరిణిలో చక్రతీర్ధ స్నానం చేయించారు. అంతకుముందు శ్రీచక్ర ఆళ్వారుడిని అలంకరించి, ప్రత్యేక పల్లకీపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుష్కరిణిలో శ్రీచక్ర స్నానం అనంతరం ఆ నీటిని తీసుకెళ్లడానికి భక్తులు పోటీ పడ్డారు. పలువురు భక్తులు పుష్కరిణిలోనే స్నానాలు చేశారు. రాత్రి నిత్యారాధనల అనంతరం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలారోహణం జరిపించారు. నేటితో ఉత్సవాలు ముగింపు..పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉదయం 10గంటలకు స్వామి వారి శతఘటాభిషేకం, మధ్యాహ్నం 1గంటలకు మహాదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలను పరిసమాప్తం చేయనున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఉదయం పూర్ణాహుతి.. రాత్రి దేవతోద్వాసన నేడు శతఘటాభిషేకంతో ఉత్సవాల ముగింపు -
ప్రజా సేవలోకి
కుమారుడి యాదిలో..కల్నల్ సంతోష్బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల2020లో గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నా కుమారుడు కల్నల్ సంతోష్బాబు వీర మరణం పొందాడు. అలాంటి మహానుభావుడి తల్లినైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుమారుడు మృతిచెందిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డి మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. కేసీఆర్పై ఉన్న మమకారం, ఆయన చేసిన గొప్ప అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్ నుంచి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. గెలుస్తాననే నమ్మకం ఉంది..ప్రస్తుతం ప్రచారం సైతం నిర్వహిస్తున్నాను. వార్డులో నాకు మంచి స్పందన వస్తుంది. నేను తప్పకుండా గెలుస్తానని వార్డు ప్రజలు చెబుతున్నారు. నాకు బీఆర్ఎస్ నుంచి పూర్తి సహకారం ఉంది. అదేవిధంగా నా భర్త ఉపేందర్తో పాటు కుటుంబ సభ్యులు సైతం పోటీ చేసేందుకు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కౌన్సిలర్గా గెలిపిస్తే 44వ వార్డులో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తా.కల్నల్ సంతోష్బాబు చిత్రపటం -
నీలగిరి
నల్లని గిరుల నగరినల్లగొండ టూటౌన్ : రాజపుత్రుల పాలనలో దక్షిణ తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాంతంగా విరాజిల్లింది నల్లగొండ. చుట్టూ నల్ల ని కొండలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని మొదట నల్ల కొండ అని, రాజపుత్ర రాజులు నీలగిరి (నీలిరంగు కొండ) అని పిలిచేవారు. బహమనీ రాజు అల్లావుద్దీన్ బహమాన్షా కాలంలో నల్లగొండగా మారింది. 1951లో 8 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. క్రమంగా పట్టణం విస్తరిస్తూ 48 వార్డులతో గ్రేడ్–1 మున్సిపాలిటీగా మారగా ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటైంది. కాంగ్రెస్దే ఆధిపత్యంనల్లగొండ రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే సాగింది. ఒకప్పుడు నల్లగొండ అంటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి యోధులు ఈ ప్రాంతం వారే. ఆ తరువాత క్రమంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వచ్చింది. నీలగిరి మున్సిపాలిటీ ఏర్పడి 75 ఏళ్లయ్యింది. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో చైర్మన్ స్థానం 8 సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీ, బీజేపీలు ఎస్లు ఒకసారి గెలుచుకున్నాయి. 2005లో పుల్లెంల వెంకట్నారాయణగౌడ్ రెండోసారి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై మున్సిపల్ చైర్మన్ల చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. కార్పొరేషన్ తొలి మేయర్ మహిళే నల్లగొండ మున్సిపాలిటీ 2026లో కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారి మేయర్ జనరల్ మహిళకు రిజర్వు అయింది. గతంలో 2014లో మున్సిపాలిటీ చరిత్రలో మొదటిసారి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఈ ఎన్నికల్లో బీసీ మహిళ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.ముఖచిత్రంక్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ 1. వెంకట నర్సింహారావు 1953–1961 కాంగ్రెస్ 2. టి.వెంకటనారాయణ 1961–1967 కాంగ్రెస్ 3. పెరిక రాజారత్నం 1967–1971 కాంగ్రెస్ 4. చింత సాంబమూర్తి 1981–1983 బీజేపీ 5. బొర్ర సుధాకర్ 1983–1984 కాంగ్రెస్ 6. కత్తుల పరుశయ్య 1984–1986 టీడీపీ 7. మద్ది విద్యాసాగర్రెడ్డి 1987– 1992 టీడీపీ 8. బోయినపల్లి కృష్ణారెడ్డి 1995–2000 బీజేపీ 9. పి.వెంకట్నారాయణగౌడ్ 2000–2005 కాంగ్రెస్ 10. పి.వెంకట్నారాయణగౌడ్ 2005–2010 కాంగ్రెస్ 11. బొడ్డుపల్లి లక్ష్మి 2014–2019 కాంగ్రెస్ 12. మందడి సైదిరెడ్డి 2020–2024 బీఆర్ఎస్ 13. బుర్రి శ్రీనివాస్రెడ్డి 2024–2025 కాంగ్రెస్నల్లగొండ కార్పొరేషన్ ఓటర్ల వివరాలుఫ రాజపుత్రుల కాలంలో వెలుగొందిన ప్రాంతం ఫ నిజాం కాలంలో 1902లోనే జిల్లాగా ఏర్పాటు ఫ 1951లో 8 వార్డులతో మున్సిపాలిటీ ఫ ప్రస్తుతం 48 డివిజన్లతో కార్పొరేషన్పురుషులు : 68,874స్త్రీలు : 73,507ఇతరులు : 56 మొత్తం : 1,42,437తొలి జిల్లాగా నల్లగొండఈ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయులు, నిజాం రాజులు పాలించారు. ఆ సమయంలోనే ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరొందింది. 1902లో నల్లగొండ సుభా(జిల్లా)గా ఏర్పడింది. నిజాం కాలంలో 1941లోనే నల్లగొండను ప్రధాన పట్టణంగా గుర్తించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1953లో తొలిసారి 8 వార్డులతో ఉన్న మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ క్రమంగా అభివృద్ధి చెందుతూ 12 వార్డులకు, తర్వాత 24, 2011లో 36 వార్డులకు చేరింది. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వ నల్లగొండ పట్టణ శివారులో ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేసి వార్డుల సంఖ్యను 48కి పెంచారు. ఇటీవల 48 డివిజన్లతో కార్పొరేషన్గా ఏర్పడింది. -
మేడారం వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం
నార్కట్పల్లి : మేడారం జాతరకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన బోడ శేఖర్(32), మేడి స్వామి, పాల మురళి, అమనగంటి వెంకన్న, జిల్లా చిన్నా, దైద అనిల్, కొత్తూరు వెంకన్న కలిసి బుర్ర శివకు చెందిన టాటా ఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకొని మేడారం జాతరకు వెళ్లారు. అక్కడ సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని సోమవారం తిరిగి వస్తుండగా.. డ్రైవర్ బుర్ర శివ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బోడ శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మేడి స్వామి, పాల మురళికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నార్కట్పల్లికి చెందిన ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు హనుమకొండ జిల్లా పరకాల పరిధిలో ఘటన -
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి
నాంపల్లి : మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగిన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతిచెందిన మమత, ఆమె చిన్ని కుమారుడు అద్విక్ అంత్యక్రియలు ఎట్టకేలకు సోమవారం రార్రి పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేలు నగేష్తో అదే గ్రామానికి చెందిన సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నగేష్ భార్య మమతకు ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పెద్దమనుషుల సమక్షంలో నగేష్, సుజాతను పిలిపించి పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అప్పటి నుంచి నగేష్ సుజాతతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఎలాగైనా నగేస్ భార్య మమతను చంపాలని సూజాత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సుజాత జనవరి 31న గ్రామంలోని కిరాణ దుకాణంలో ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని ఇంటి వద్దకు వెళ్లింది. పెట్రోల్తో పాటు ఒక సంచిలో కత్తి, కారంపొడి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు చిన్న కుమారుడు అద్విక్ పాలు పడుతున్న మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో మమత, ఆమె చిన్న కుమారుడు అద్విక్ మృతిచెందారు. నిందితురాలు సుజాత సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి చేసిన నేరం అంగీకరించి లొంగిపోగా.. ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన.. మమత తరఫు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మమత వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. భూమి రిజిస్ట్రేషన్..నగేష్ తల్లిదండ్రుల వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని మృతురాలు మమత పెద్ద కుమారుడు సాత్విక్ పేరిట ఆమె తరఫు బంధులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించారు. గార్డియన్గా మమత తండ్రి, తల్లిని పెట్టారు. అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారంను మమత పెద్ద కుమారుడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం రాత్రి మమత, ఆమె చిన్న కుమారు అద్విక్ మృతదేహాలను బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేతేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
కారులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగింత
తుర్కపల్లి: లిఫ్ట్ అడిగిన వ్యక్తులు కారులో మర్చిపోయిన బంగారు ఆభరణాలు తిరిగి వారికి అప్పగించాడు తుర్కపల్లి మండలానికి చెందిన మడోత్ సుధాకర్నాయక్. వివరాలు.. సుధాకర్నాయక్ ఆదివారం సాయంత్రం కారులో తుర్కపల్లి నుంచి వరంగల్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన సముద్రాల వెంకటయ్య కుటుంబ సభ్యులు లిఫ్ట్ అడిగారు. సుధాకర్నాయక్ వారిని తన కారులో ఎక్కించుకొని స్టేషన్ ఘన్పూర్ వద్ద దింపాడు. అయితే వెంకటయ్య కుటుంబ సభ్యులు తమ కుమార్తె వివాహం కోసం తీసుకెళ్తున్న 5 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండిని కారులోనే మర్చిపోయారు. ఆభరణాలను గుర్తించిన సుధాకర్నాయక్ స్టేషన్ ఘన్పూర్కు వెళ్లి వెంకటయ్య కుటుంబ సభ్యులకు అప్పంగించాడు. -
నాలుగేళ్లలో అప్రతిష్టపాలు చేశారు
హయత్నగర్ : రైతులకు బిల్లులు చెల్లించడం, బ్యాంకు రుణాలు తీర్చడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో పాలకమండలి విఫలమైందని నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్) మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి అన్నారు. పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి పాలక వర్గాన్ని రద్దు చేసేందుకు అనుగుణంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆయన ఆధ్వరంలో గ్రామస్థాయి చైర్మన్లు మదర్ డెయిరీ ఎండీ అబ్దుల్ గఫార్కు నోటీసు అందించారు. అనంతరం జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లలో డెయిరీని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 19 ప్రకారం నోటీసు అందుకున్న నెల రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని, లేకుంటే పాలక మండలి రద్దవుతుందన్నారు. తాను చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చిన లాభాలతో స్థిరాస్తులు కొన్నామని, కేవలం రూ.13 కోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకున్నామని చెప్పారు. ఆదాయం అధికంగా చూపి ఆదాయ పన్ను చెల్లించామనడం అసత్యమని, స్థిరంగా వచ్చే ఆదాయానికి మాత్రమే పన్ను చెల్లించామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో మార్కెటింగ్ సరిగ్గా లేక బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వేతనాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులుమూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని మదర్ డెయిరీ ఉద్యోగులు సోమవారం పాలకమండలి భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఏడాదిగా సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదని, ఈపీఎఫ్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవరమైతే మార్కెటింగ్ చేసేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని, అనవసర ఖర్చులు తగ్గించి ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైర్మన్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఎంతకీ ఆయన రాకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందించారు. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి -
రామన్నపేట.. మారిందిట్టా..
నాడు మున్సిపాలిటీ.. నేడు గ్రామ పంచాయతీ చిట్యాల : సాధారణంగా గ్రామ పంచాయతీలు కాలక్రమేణా జనాభా, ఓటర్లు, ప్రాంత అభివృద్ధికి అనుగుణంగా మున్సిపాలిటీలుగా మారుతుంటాయి. కానీ ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో ఉన్న ఓ గ్రామం ఇందుకు భిన్నంగా చరిత్రలో నిలిచింది. ఒకప్పుడు మున్సిపాలిటీగా, తాలుకా కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన ఆ గ్రామం ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట గతంలో మున్సిపాలిటీగా ఉండి డిగ్రేడ్ అయి ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉంది. ఈ గ్రామం 1971 సంవత్సరం వరకు మున్సిపాలిటిగా ఉండేది. అనంతరం ఆ గ్రామాన్ని ప్రభుత్వం డిగ్రేడ్ చేస్తూ గ్రామ పంచాయతీగా మార్చింది. రామన్నపేట గతంలో తాలుకా కేంద్రంగా కూడా ఉండేది. 1985లో తాలుకాలను రద్దు చేసి మండల కేంద్రాలను ఏర్పాటు చేయటంతో రామన్నపేట మండల కేంద్రంగా మారింది. అంతేకాకుండా రామన్నపేట గతంలో శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 2009లో జరిగిన శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో రామన్నపేట నియోజకవర్గం రద్దు చేయబడింది. దీంతో రామన్నపేటను నకిరేకల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి చేర్చారు. ఎంతో ప్రాధాన్యత గల రామన్నపేట మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీగా మారిన తీరు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారంది. -
మున్సిపల్ ఖజానా కళకళ
సూర్యాపేటటౌన్ : ఎన్నికల వేళ మున్సిపాలిటీల ఖజానా ఒక్కసారిగా కళకళలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులిచ్చినా, జరిమానాలు విధించినా ససేమిరా అన్న బకాయిదారులు.. ఇప్పుడు నామినేషన్ల కోసం క్యూ కట్టి పన్నులు చెల్లించారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు ఉండగా మూడు రోజుల్లో నల్లా, ఆస్తి పన్ను రూపంలో రూ.37.75లక్షల ఆదాయం సమకూరింది. నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో.. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలంటే నల్లా, ఆస్తి పన్ను బకాయిలు ఉండరాదు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా నోడ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క రూపాయి బకాయి ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది అభ్యర్థులు ముందుకొచ్చి నల్లా బిల్లు, ఆస్తి పన్ను చెల్లించారు. అభ్యర్థులను ప్రతిపాదించే వారు సైతం వందల మంది ఉండటంతో మున్సిపాలిటీలకు భారీగా పన్నులు వసూలయ్యాయి. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు కూడా ఎన్నికల నిబంధనలకు దారికొచ్చారు. ఈనెల 28న నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా 30వ తేదీన ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోయాయి. పన్నుల వసూళ్లకు మున్సిపాలిటీ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ● సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా రూ.23.50 లక్షలు వసూలయ్యాయి. ● కోదాడలో 35 వార్డుల్లో రూ.2.43,500 ● హుజూర్నగర్లో 28 వార్డులకు గాను రూ.6.60 లక్షలు ● నేరేడుచర్లలో 15 వార్డులకు రూ. 2,30,482 ● తిరుమలగిరిలో 15 వార్డులు ఉండగా రూ.2,69,260 వసూలయ్యాయి. మొత్తం ఐదు మున్సిపాలిటీలకు రూ.37.75 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫ నల్లా బిల్లు, ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం ఫ మూడు రోజుల్లో రూ.37.75 లక్షలు ఫ ఏళ్ల తరబడి పేరుకుపోయినబకాయిలు సైతం వసూలు -
రాజేష్ మృతిపై మంత్రి మౌనం వీడాలి
అనంతగిరి, మేళ్లచెరువు: కర్ల రాజేష్ లాకప్డెత్పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పటికై నా మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతగిరి, మేళ్ల చెరువులో నిర్వహించిన కర్ల రాజేష్ సంతాప సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజేష్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ 70 రోజులుగా పోరాటం చేస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఎందుకు స్పందించడం లేదన్నారు. సామాన్య పౌరులకు శిక్షలు ఉన్నప్పుడు రాజేష్ మృతికి కారకులైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేకపోతే ఉత్తమ్దంపతులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 4న నిర్వహించే చలో సూర్యాపేట కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి మాదిగలు భారీగా తరలిరావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు బొడ్డు కుటుంబరావు, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజియాదవ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్లా భూపాల్రెడ్డి, సీసీపీ మండల కార్యదర్శి రవి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్నాయక్, మహిళా నాయకురాలు వెంపటి నాగమణి, బీఎస్పీ నాయకులు నూకల గోపాల్యాదవ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండపల్లి సూరి మాదిగ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు ఆకారపు కొండలు, సీపీఐ నాయకులు ఉస్తేల నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సృజన, బీజేపీ మండల అధ్యక్షుడు పత్తిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
నామినేషన్లు 1,617
సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో 28నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. మూడు రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాల ఆవరణలు సందడిగా, కోలాహలంగా మారాయి. ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులు జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో మొత్తం 141 వార్డులకు గాను 1,617 నామినేషన్లు వచ్చాయి. ఒక్కో వా ర్డుకు ఒక్కో పార్టీ నుంచి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు 24 నామినేషన్లు రాగా రెండో రోజు 455, చివరి రోజు 1,138 మంది నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ల పరిశీలన నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు.నామినేషన్లకు జత చేసిన వవిధ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురించనున్నారు. ఖరారు కాని అభ్యర్థుల ఎంపిక నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 3వ తేదీ వరకు బీఫాం ఇచ్చే అవకాశం ఉండటంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు టికెట్పై ఎవరికి వారే ఆశలు పెంచుకున్నారు. ప్రధాన పార్టీల తరఫున ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఆఖరి రోజు భారీగా దాఖలు ఫ అత్యధికంగా సూర్యాపేటలో 741 మంది నామినేషన్ ఫ పలు చోట్ల రాత్రి 7 గంటల వరకు కొనసాగిన ప్రక్రియ ఫ మున్సిపాలిటీల్లో ముగిసిన తొలి ఘట్టం నామినేషన్లు ఇలా..మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు సూర్యాపేట 48 741 నేరేడుచర్ల 15 90 కోదాడ 35 333 తిరుమలగిరి 15 160 హుజూర్నగర్ 28 293 -
పేట వాసికి గద్దర్ స్ఫూర్తి పురస్కారం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట పట్టణానికి చెందిన తెలంగాణ దళిత విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లేపల్లి నరేష్కు గద్దర్ స్ఫూర్తి పురస్కారం లభించింది. గద్దర్ జయంతిని పురస్కరించుకొని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో గురువారం రాత్రి ఫాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్, పుడమి సాహితీ వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, వెన్నెల గద్దర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించారు. అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో, పుడమి సాహితీ వేదిక చైర్మన్ చిలుముల బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, పురస్కారాల ప్రధాత, గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్, ఇండో కెనెడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపకులు రొయ్యూరు శేష సాయి, టీటీడీ బోర్డు పూర్వ సభ్యులు ధరావత్ బాల్ సన్ నాయక్, పారిశ్రామిక వేత్త డాక్టర్ యామినేని ఉప్పల్ రావు, సామాజికవేత్త గొల్లమందల దానయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత.. మనందరి బాధ్యత
మేళ్లచెరువు : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి రోడ్డు భద్రతా నిబంధనలపై చైతన్యం తీసుకువచ్చారు. శుక్రవారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్టు డిప్యూటీ కమిషనర్ వాణి, ఉమ్మడి జిల్లా ఆర్టీఓలు జయప్రకాశ్రెడ్డి, లావణ్య, జిలానీ, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక నిధులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి అధిక నిధులు కేటాయిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శాలిగౌరారం నుంచి జనగామ వెళ్తుండగా తిరుమలగిరి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సంకెపల్లి కొండల్రెడ్డి, 6వ వార్డు అభ్యర్థి కేశిడి కవితావెంకట్రెడ్డి, బోయపల్లి కిషన్ , ఎన్.శాతవాహనరావు, రజనీకాంత్రెడ్డి, రాంరెడ్డి, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
హస్తం.. గెలుపు వ్యూహం
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాల్లో తలమునకలైంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అధికార పార్టీ కావడంతో సులువుగా గెలుపొందవచ్చనే కాంక్షతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అందుకే ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ).. వడపోతకు తెరతీసింది. సర్వేల నివేదికల ఆధారంగా బీఫాం ఇవ్వనుంది. మూడు బృందాలతో.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సర్వేలే కీలకం కానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు ప్రైవేట్ సంస్థలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సర్వే బృందాల నివేదికలు వచ్చినట్లు సమాచారం. ఇవే కాకుండా పార్టీ అంతర్గతంగా మరో సర్వే, ఇంటెలిజెన్స్ సర్వేలు చేయిస్తోంది. వీటి ఆధారంగా గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ బీఫాం ఇవ్వనున్నారు. జనంతో మమేకమై.. సర్వే బృందాలకు కేటాయించిన వార్డుల్లోని జనంతో ఈ బృందాలు మమేకమవుతున్నాయి. ముందే రూపొందించుకున్న ప్రశ్నావళి ఆధారంగా ఆశావహుల గురించి వాకబు చేస్తున్నాయి. అభ్యర్థి తెలుసా.. అంటూ మొదలు పెట్టి నేపథ్యం, పార్టీకి విధేయులుగా ఉంటారా ? ప్రజల్లో తిరుగుతున్నారా.. లేదా? సేవాదృక్పథం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉందా? గెలిస్తే స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల దృష్టికి ప్రజాసమస్యలు తీసుకెళ్లి నిధులు రప్పిస్తారా? సభకు జనాన్ని తరలించే సామర్థ్యాలు ఉన్నాయా? స్వలాభం, ధనార్జన కోసం పనిచేస్తారా.. జనం కోసం సమయం కేటాయిస్తారా?. ఆర్థిక పరిస్థితులేంటి? తదితర వివరాలను సర్వే సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి. బీఫాం ఇచ్చేందుకు సమయం ఉండడంతో.. టికెట్ ఆశిస్తున్న వారిలో పార్టీకి విధేయులే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నారా.. లేరా? అన్న విషయాన్ని సర్వేలో సేకరిస్తున్నారు. ఎక్కువ మందిపై సానుకూలత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కొందరు ఆర్థికంగా స్థితిమంతులైనా పార్టీకి సమయం కేటాయించడం, తదితర కారణాలతో సర్వేలో వ్యతిరేకత వస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా పార్టీలే అభ్యర్థులను నిలబెడతాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు కచ్చితంగా బీఫాం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ అభ్యర్థికై తే బీఫాం వస్తుందో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసినా.. ఈనెల 3వ తేదీ వరకు బీఫాం ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో పార్టీ ఆచితూచి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని చూస్తోంది. మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తే రేసులో ప్రతిపక్షాల కంటే ముందుంటామని, గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమాతో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఫ ఐదు మున్సిపాలిటీల్లో విజయమేలక్ష్యంగా ప్రణాళికలు ఫ మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వే ఫ నివేదిక ఆధారంగా అభ్యర్థులకు బీఫాం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ గడువు శుక్రవారంతో ముగియగా ఇంకా అన్ని చోట్లా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ పలువురు నామినేషన్ వేశారు. కొన్ని వార్డుల నుంచి ఇద్దరుముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు బీఫాం ఇచ్చే అవకాశం ఉండటంతో ఉండటంతో టికెట్ వస్తుందా లేదోనని వారిలో టెన్షన్ నెలకొంది. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో పలువురు టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. టికెట్ రాకపోతే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉన్నారు. -
ఎమ్మార్సీ భవనమా.. వైకుంఠధామమా?
అనంతగిరి: ఇక్కడ కనిపిస్తున్నది అనంతగిరి మండల కేంద్రంలోని వైకుంఠధామం ఆర్చి. ఎమార్సీ (మండల విద్యా వనరుల కేంద్రం) భవనం ఎదుటే ఆర్చిని నిర్మించడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇది ఎమ్మార్సీ భవనమా, లేక వైకుంఠధామమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలనే సంకల్పించిన గత ప్రభుత్వం.. అనంతగిరిలోని ఎన్టీఆర్ చౌరస్తాకు సమీపంలో సర్వే నంబర్ 1470లో వైకుంఠధామం నిర్మించింది. దీనికి ఆర్చి నిర్మించి, గేట్ కూడా ఏర్పాటు చేశారు. మండల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎమ్మార్సీకి భవనం మంజూరు చేసింది. కాగా భవనాన్ని అదే సర్వే నంబర్లోని కొంత స్థలంలో నిర్మించారు. అయితే భవనంలోకి వైకుంఠధామం ఆర్చి నుంచి వెళ్లాల్సి వస్తుంది. మరోమార్గం లేకపోవడంతో ఎమ్మార్సీ ఉద్యోగులు ఆర్చి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. లోపించిన ప్రణాళిక, సమన్వయం ఆర్చి బోర్డు మార్చి మార్చి వైకుంఠధామానికి వేరే మార్గంలో ఆర్చి ఏర్పాటు చేయాలని ఉద్యోగులు పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ప్రణాళిక లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్సీ భవనానికి ఎదురుగా ఉన్న వైకుంఠధామం ఆర్చి ఉండటం, అక్కడి నుంచి రాకపోకలు సాగించాలంటే ఉద్యోగులు సెంటిమెంట్గా భావించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మార్సీకి, వైకుంఠధామానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని కోరుతాం. –తల్లాడ శ్రీనివాస్, ఎంఈఓ, అనంతగిరిఉపాధ్యాయుల శిక్షణ, విద్యకు సంబంధించిన విధి విధానాలు, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ తదితర వాటి అమలుకు ఎమ్మార్సీ మండల స్థాయిలో కేంద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పదుల సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించడంతో పాటు నిరంతరం అధికారులు, ఉపాధ్యాయులు వచ్చిపోతుంటారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన కార్యాలయానికి ఆర్చి గుండా వెళ్లాల్సి రావడంతో ఉద్యోగులు సంకుచితభావనకు లోనవుతున్నారు. ఫ గందరగోళానికి గురవుతున్న ప్రజలు ఫ వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని వేడుకోలు -
తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు
కోదాడ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అభాసుపాలు చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రయత్నిస్తున్నారని, పోలీసులను ఉపయోగించుకొని చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తాటాకు చప్పులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం కోదాడ బస్టాండ్ సెంటర్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అటువంటి గొప్ప వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వానికి తగదన్నారు. కాంగ్రెస్ సర్కార్ దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తుందని, తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ను విచారణకు పిలిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే నయీం, సుంకర అజయ్కుమార్, సురేష్నాయుడు, నూనె నాగన్న, పిట్టల బాగ్యమ్మ, కర్ల సుందర్బాబు, చింతల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఉద్రిక్తత... ఈ నెల 24న పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉండగా ప్రదర్శన నిర్వహించడంతో బొల్లం మల్లయ్యపై కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గురువారం సాయంత్రం మల్లయ్య తన అనుచరులతో స్టేషన్కు రాగా పోలీసులుఅడ్డుకున్నారు. దీంతో లోనికి చొచ్చుకొని వచ్చిన మల్లయ్య సీఐతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. డీఎస్పీ వచ్చి సర్దిచెప్పి మల్లయ్యయాదవ్ను బయటకి పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రదర్శన నిర్వహించడంతో పాటు అనుచరులతో స్టేషన్ రావడాన్ని పోలీసులు సీరి యస్గా పరిగణిస్తున్నారని, మరోసారి కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
గ్రామసభలు నిర్వహించండి
భానుపురి (సూర్యాపేట) : భూములను రీ సర్వే చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, జాజిరెడ్డిగూడెం, హుజూర్గర్ మండలం లక్కవరం గ్రామాల్లో ఈ నెల 31న, అనంతగిరి మండలం గొండ్రియాల, గరిడేపల్లి మండలం లక్కవరం, సూర్యాపేట మండలం యండ్లపల్లిలో ఫిబ్రవరి 3న గ్రామ సభలు నిర్వహించి భూము రీసర్వేపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భూములు ఉన్న రైతులు తప్పక పాల్గొనాలని కోరారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను, ప్రజావాణి ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని, కోర్టుకేసులకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ పీడీ శిరీష, ఏడీఎస్ ఎల్ఆర్ శ్రీనివాసరెడ్డి, ఏఓ సుదర్శన్రెడ్డి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గన్నా ఉపేందర్ చిలుకూరు: కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ప్రియాంకాగాంధీ సంగతమ్ ఆలిండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చిలుకూరు మండలం సీతారాంపురానికి చెందిన గన్నా ఉపేందర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ సంగతమ్ ఆలిండియా జాతీయ అధ్యక్షుడు మాస్ పాషా గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నా ఉపేందర్కు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఆత్మకూర్(ఎస్)లో ఒడిశా, జార్ఖండ్ బృందం ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం గురువారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులతో సమావేశం అయ్యారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంవీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఫౌండేషన్కు సీఆర్పీఎఫ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం, మదర్స్ కమిటీ, యూత్, కేవీఎస్ కమిటీలు సహకారం అందించిన తీరుపై అధ్యయనం చేశారు. ఎంవీ ఫౌండేషన్ కార్యక్రమాలు బాగున్నాయని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ములకలపల్లి కాటయ్య, డేగల వెంకటకృష్ణయ్య, నాగయ్య, జానయ్య, సైదులు, అంజయ్య, రిటైర్డ్ టీచర్లు వీరారెడ్డి, రంగాచారి, మదర్స్ కమిటీ నాగలక్ష్మి, కళావతి, నాగమ్మ, కేవీఎస్ కమిటీ సభ్యురాలు శ్రీజ, ఎంవీ ఫౌండేషన్ మండల ఇంచార్జ్ వత్సవాయి లలిత, నాయిని సైదులు, జయలలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగలు సరిచేయాలని నిరసన చిలుకూరు: మండల కేంద్రంలోని తేర్లబండ వద్ద పొలాల్లో చేతికందే ఎత్తులో వేలాడుతున్న కరెంట్ తీగలతో ప్రమాదం పొంచి ఉంది. సరి చేయాలని రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గురువారం తీగల వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు రెండేళ్లుగా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతీసారి అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప.. సమస్య పరిష్కరించడం లేదన్నారు. వర్షాకాలం, ఈదురుగాలులు సంభవిస్తే ప్రమా దాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తీగలను సరి చేయాలని రైతులు కోరారు. -
పోలింగ్ నిర్వహణ బాధ్యత పీఓలదే
భానుపురి (సూర్యాపేట) : పోలింగ్ సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులేదనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు గురువారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పీఓలకు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఓడీ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. తన చాంబర్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడ్ ముగిసే వరకు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, నాయకులు చకిలం రాజేశ్వర్రావు, హబీద్, స్టాలిన్, గోపి, రమేష్, కరుణాకర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో సమావేశం మీడియా ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్ల, సూర్యపేట, తిరుమలగిరి మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,26,586 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్ -
బాధితుని వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్ పోలీసులు బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలిలా.. ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటకు చెందిన తండు మహేష్ కల్లుగీత కార్మికుడు. వృత్తిలో భాగంగా మహేష్ ఇటీవల కల్లు గీసుకొని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. పాత సూర్యాపేట స్టేజీ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అతన్ని ఆపి పేరు అడిగాడు. అంతేకాకుండా మహేష్పై అకారణంగా దాడి చేశారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ సమాచారం మేరకు ఆత్మకూర్ ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ అక్కడికి వెళ్లి విచారణ చేశారు. బాధితుని నుంచి దరఖాస్తు తీసుకొని అక్కడే కేసు నమోదు చేయడంతో పాటు మహేష్కు ఎఫ్ఐఆర్ కాపీ అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కోతులను పట్టించారు
కొలువుదీరిన వనదేవతలు రాజాపేట మండలం చిన్నమేడారం, చల్లూరులో సమ్మక–సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు. మాట ఇచ్చారు..- 8లోకాసర్లపహాడ్కు చెందిన మంచాల లలిత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా ఏ వీధికి వెళ్లినా.. ప్రజలు కోతుల సమస్యను ఏకరువు పెట్టారు. మీ సమస్య తీరుస్తానంటూ వారికి హామీ ఇచ్చాడు. ఆమెను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించి సర్పంచ్ పగ్గాలు అప్పగించారు. ఇచ్చిన మాట ప్రకారం కోతులను పట్టించి తరలించారు. సమస్య తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్వపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు పలువురు సర్పంచ్లు నడుం బిగించారు. ఏది నెరవేర్చినా నెరవేర్చకపోయినా కోతుల బెడద నుంచి తప్పించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కోతుల పట్టివేత పూర్తి కాగా మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. పట్టిన కోతులను అడవుల్లో వదులుతున్నారు. ● జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూ రి యోగానందచారి ఆర్థిక సహకారంతో సర్పంచ్ కుంటిగొర్ల శ్రీనివాస్ కోతులను పట్టిస్తున్నాడు. ఇప్పటికే సుమారు 3,800 కోతులను పట్టించి శ్రీశైలం అడవులకు తీసుకెళ్లి వదిలేశారు. ఏటా జూన్లో కోతులు పట్టించాలని నిర్ణయించారు. ● జాజిరెడ్డిగూడెంలో సర్పంచ్ బింగి కృష్ణమూర్తి సొంత ఖర్చులతో కోతులను పట్టించి ఇల్లందు అడవులకు తరలిస్తున్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు 500 వరకు కోతులను పట్టి తరలించారు. ● కాసర్లపహాడ్లో సర్పంచ్ మంచాల లలితరాంమ్మూర్తి గ్రామస్తుల సహకారంతో వానరాల పని పడుతున్నారు. ఇప్పటి వరకు 300కు పైగా కోతులను పట్టి ఇల్లందు అడవులకు తరలించారు. ● అర్వపల్లిలో గ్రామస్తుల సహకారంతో కోతుల పట్టివేతకు సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్ సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక బృందాలు ప్రస్తుతం జిల్లాలోని వివిధ పంచాయతీల్లో కోతుల పట్టివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. వీరికి ఒక్కో కోతిని పట్టినందుకు గాను రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ బృందాలు ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేసి వానరాలను బందిస్తున్నాయి. -
జోనల్ అధికారుల పాత్ర కీలకం
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జోనల్ అధికారులు, ఎఫ్ఎస్టిటీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వ్యయ పరిశీలకులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఓటర్లకు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లావాదేవీలపై నిఘా ఉంచండి ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు పరిమితిని తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించడం వ్యయ పరిశీలకుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డబ్బు, బహుమతులు, మద్యం వంటి వాటి అక్రమ పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచాలని, నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభక వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ఎఫ్ఎస్టీ బృందాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా తిరుగుతూ ఫిర్యాదులపై తక్షణమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెళ్లిళ్లకు సంబంధించి, ఆస్పత్రికి వెళ్లే వారి విషయంలో ఉదాసీనతతో వ్యవహరించాలని తెలిపారు. నీటి సమస్య తలెత్తరాదు భానుపురి (సూర్యాపేట) : గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూ ఎస్, మిషన్ భగీరథ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా బోర్లు, చేతిపంపులు, ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్లు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. నీళ్ల ట్యాంకులను శుభ్రపరచి తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలన్నారు. అంగన్వాడీ భవనాలను నిర్మించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు రాని వివరాలు సమర్పించాలని, వన మహోత్సవం 2025–26లో భాగంగా లక్ష్యం చేరుకోని శాఖలు ప్లాంటేషన్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓలు, డీఈలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు. -
రాజేష్ది ముమ్మాటికీ పోలీసుల హత్యే
మునగాల: కోదాడకు చెందిన కర్ల రాజేష్ది ము మ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని ఎమ్మార్పీనెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా అన్నారు. రాజేష్ లాకప్డెత్ కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య అధ్యక్షతన జరిగిన రాజేష్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగా మాట్లాడుతూ రాజేష్ను పోలీసులు అకారణంగా నిర్భందించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులకు ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అండదండలు ఉన్నాయన్నారు. రాజేష్ మృతిచెంది 72 రోజులు గడిచిందని, తాను 62 రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసు అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుతుందన్నారు. ఉత్తమ్ దంపతులు ఇకనైనా మౌనం వీడి వాస్తవాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల ఓట్లతో గెలుపొందిన ఉత్తమ్ దంపతులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలన్నారు. రాజేష్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్ర తినిధి బొర్ర భిక్షపతి మాదిగ, ఎంఎస్పీ జాతీయ, రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న, కొండపల్లి ఆంజనేయులు మాదిగ, యలమర్తి రాము మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, మాల మహా నాడు జిల్లా అధ్యక్షురాలు రాణి, మాదిగ మహిళా మండల ఇన్చార్జి వెంపటి ప్రమీల, ఎంఎస్పీ, ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి అంజయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
మొదటి రోజు 24
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ పోరులో తొలి అంకానికి తెరలేసింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తరువాత వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. రెండు రోజులే గడువు నామినేషన్లకు ఎన్నికల సంఘం ఎక్కువ సమయం ఇవ్వలేదు. మూడు రోజులు మాత్రమే కేటాయించింది. 30వ తేదీ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. అయితే షెడ్యూల్ తర్వాత నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేస్తారని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ, వెంటనే నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సర్దుకునే సమయం లేకుండాపోయింది. ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అయితే కొన్ని వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ధ్రువపత్రాల కోసం అభ్యర్థుల హడావుడి నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు మందకొడిగా సాగింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆశావహులు అంతగా ఆసక్తి చూపలేదు. ఇంకా రెండు రోజులు గడువుండటంతో పాటు నామినేషన్ దాఖలుకు కావాల్సిన డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం తదితర అంశాలపైనే అభ్యర్థులు దృష్టి పెట్టారు. దీంతో బ్యాంకులు, మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. హెల్ప్డెస్క్లు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు, వాటిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సందేహాలను హెల్స్ డెస్క్ల్లో నివృత్తి చేస్తున్నారు. అభ్యర్ధి వెంట మరో ఇద్దరి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మొదలైన నామినేషన్ల పర్వం ఫ బీఆర్ఎస్ నుంచి నలుగురు దాఖలు ఫ నేడు, రేపు భారీగా నామినేషన్లు వస్తాయని అధికారుల అంచనా ఫ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ట బందోబస్తు సూర్యాపేటలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ 4, బీఎస్పీ2 ,కాంగ్రెస్ తరఫున 5, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. తిరుమలగిరిలో 9, కోదాడలో 1, నేరేడుచర్లలో ఒకటి చొప్పున నామినేషన్ వచ్చింది. హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఒక్క నామినేషన్ కూడా దాఖ లు కాలేదు. కాగా టిక్కెట్లు ఇంకా ఖరారు కాకపోవడంతో సాదాసీదాగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గురు, శుక్రవారాల్లో భారీగా నామి నేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. -
హెల్త్ సబ్సెంటర్కు తాళం
తుంగతుర్తి : మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్కు తాళం పడింది. దీంతో వారం రోజులుగా సేవలు నిలిచిపోయాయి. తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.2వేలు చెల్లించాల్సి ఉంది. సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యాజమాని తాళం వేశాడు. సంబంధిత అధికా రులను అడిగితే దాటవేస్తూ వస్తున్నారని యజమాని వాపోయాడు. నెలకు రూ.2వేల చొప్పున రెండేళ్లకు రూ.48 వేలు రావాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని, లేదా కార్యాలయాన్ని ఖాళీ చేయాలని వాపోయాడు. నిరీక్షించి వెళ్తున్న ఆరోగ్య సిబ్బంది అక్కడ పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది రోజూ యథావిధిగా విధులకు వచ్చి, నిరీక్షించి వెళ్తున్నారు. హెల్త్ సెంటర్కు వచ్చిన రోగులు సైతం తాళం వేసి ఉండటంతో వెనుదిరిగి పోతున్నారు. ఫ 48 నెలలుగా అద్దె పెండింగ్ ఫ తాళం వేసిన యజమాని -
సమన్వయంతో విజయం సాధించండి
కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. వార్డుల వారీగా సమీకరణలు చూసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి బుధవారం కోదాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ అన్ని విధాలా ఆలోచించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు. సమష్టిగా పని చేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్రావుతో పాటు చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించండి: బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణ అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. బుధవారం తన నివాసంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. అదే విధంగా ఆశావాహులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తుందన్నారు. విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధం: సీపీఐ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సీపీఐ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం కోదాడలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు జిల్లా నాయకులు తీర్మానం చేశారు. తమ పార్టీ ఆరు వార్డుల్లో పోటీ చేస్తుందని నాయకులు మేకల శ్రీనివాసరావు, బత్తినేని హనుమంతరావు, లతీఫ్ తెలిపారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ ఆశావహులతో భేటీ -
పంట నిల్వకు.. ఉండదిక చింత
భానుపురి (సూర్యాపేట) : ‘సూర్యాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు ఎకరాల్లో పండించిన కందులను మార్కెట్కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక నామమాత్రపు ధరనే పలికింది. పంటను నిల్వ చేసేందుకు ఇంటి దగ్గర స్థలం లేకపోవడంతో అరకొర ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’. జిల్లాలో చాలా మంది రైతులదీ ఇదే వ్యథ. ఇటువంటి సమస్య తలెత్తకుండా పంట ఉత్పత్తుల నిల్వకు ప్రతి గ్రామంలో గోదాములు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీబీ జీరాంజీ (ఉపాధిహామీ) పథకం నిధులతో వీటిని నిర్మించనున్నారు. పైగా వీటిని అద్దెకు ఇవ్వడం వల్ల గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరగనుంది. గోదాముల నిర్మాణ బాధ్యతలకు సంబంధించి మహిళా సమాఖ్యలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒక్కో గోదాముకు రూ.30 లక్షలు సూర్యాపేట జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.30 లక్షల చొప్పున జిల్లా మొత్తానికి రూ.14.58 కోట్లు కేటాయించారు. గోదాము నిర్మించాలంటే వంద టన్నుల పంట ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం ఉండేలా గ్రామంలో 444 చదరపు గజాల స్థలం ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్థలాల గుర్తింపు కొనసాగతోంది. రెండు, మూడు నెలల్లో స్థలాను గుర్తించి గ్రామ సభల్లో తీర్మానాలు చేయనున్నారు. మొత్తం నిధుల్లో 40 శాతం నిర్మాణ సామగ్రి, 60 శాతం కూలీల వేతనం కింద పనులు పూర్తి చేయాల్సి ఉంది. ధర వచ్చినప్పుడే అమ్ముకునేలా.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట దిగుబడులను అయినకాడికి అమ్ముకునే దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేక రైతన్న నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తం పంట ఉత్పత్తులు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో గోదాములు నిర్మించడం వల్ల రైతులకు ఆ కష్టాలు తొలగనున్నాయి. గోదాములను అద్దెకు తీసుకొని పంటను నిల్వ చేసుకునే వీలుంటుంది. ధర వచ్చినప్పుడే అమ్ముకో వచ్చు. సీజన్ లేని సమయంలో ఇతరులకు అద్దెకు ఇవ్వడంతో గ్రామ పంచాయతీలకు సైతం ఆదా యం పెరగనుందని అధికారులు అంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ గోదాముల నిర్మాణం ఫ జిల్లాకు రూ.14.58 కోట్లు మంజూరు ఫ స్థలాలు గుర్తిస్తున్న అధికారులు -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మున్సిపాలిటీల్లో బుధవారం నుంచే నామినేషన్ ప్రక్రియ ఉన్నందున సంబంధిత కార్యాలయాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల విధుల నిర్వహణపై మంగళవారం ఆయన మున్సిపల్ కేంద్రాలలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా పోలీసు అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని ముందస్తుగా బైండోవర్ చేయాలని, వారిపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలన్నారు. ముందస్తుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనేది తనిఖీ చేసుకోవాలన్నారు. పోలింగ్ సామగ్రిని సంభందిత అధికారుల పర్యవేక్షణలో గుర్తించిన వాహనాల్లో తరలించాలన్నారు. వాటికి పూర్తి భద్రత కల్పించాలన్నారు. మున్సిపాలిటీ పౌరులు నమ్మకం కలిగేలా ఫ్లాగ్ మార్చ్ చేపట్టాలని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల రవాణా జరగకుండా చూడాలని సూచించారు. ఫ ఎస్పీ నరసింహ -
31న ఉద్యోగ మేళా
భానుపురి (సూర్యాపేట) : ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 31న కలెక్టర్, డీఐఈఓ, హెచ్సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు హెచ్సీఎల్ ప్రతినిధి సెల్ : 8341405102, 7981834205 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవల్లీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లంకు పోలీసుల నోటీస్కోదాడ : ఈ నెల 24న కోదాడలో పోలీస్యాక్ట్ అమలులో ఉండగా పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై ర్యాలీ, మీటింగ్ ఏర్పాటు చేయడంతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నోటీస్ను మంగళవారం పట్టణ పోలీసులు మల్లయ్య నివాసానికి వెళ్లి అందించారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలని నోటీస్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ తాము సమావేశం ఏర్పాటు చేసిన రోజు ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదని, నోటీస్కు చట్టపరిధిలో సమాధానం ఇస్తానని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు నిధులు కేటాయించాలిసూర్యాపేట : వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమ పోస్టర్ను మంగళవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు మహేశ్చారి, జిల్లా కన్వీనర్ రాజేశ్, సాయి, మధుసూదన్, ప్రవీణ్ పాల్గొన్నారు. పారా మెడికల్ కౌన్సిలింగ్కు మరో అవకాశంసూర్యాపేటటౌన్ : రెండు సంవత్సరాల పారా మెడికల్ కోర్సులో 2025–26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించి కౌన్సిలింగ్కు హాజరు కాని విద్యార్థులకు మరో సారి అవకాశం కల్పించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 30న సూర్యాపేట జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అన్ని ఒరిజిల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. -
మోగిన పట్టణ నగారా..
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చేనెల 11న ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. బుధవారం రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. దాంతో మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది. అధికార యంత్రాంగం సిద్ధం సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులు ఉన్నాయి. వాటిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన అధికారులు 372 పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రిని ఆయా మున్సిపల్ కేంద్రాలకు చేర్చారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తుండగా అందుకు 817 బ్యాలెట్ బాక్స్లు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి అదనంగా మరో 372 బాక్స్లను సమకూర్చారు. ఎన్నికల నిర్వహణకు 1,116 మంది సిబ్బంది కావాల్సి ఉండగా ఇప్పటికే 180 మంది ఆర్వో, ఏఆర్వో, ఇతర సిబ్బందికి శిక్షణ సైతం పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడు వార్డులకు ఒక అధికారి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా అదేరోజు నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు, మూడు వార్డులకు కలిపి ఒకేచోట రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1న నామినేషన్లపై ఫిర్యాదు, 2న అప్పీలు పరిష్కారం, 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం పోటీ చేసే వారి జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. 2,26,646 మంది ఓటర్లు ఎన్నికలు జరగనున్న ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఇటీవల ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఇందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 1,08,848 మంది ఉండగా, అత్యల్పంగా నేరేడుచర్లలో 13,746 మంది ఓటర్లు నమోదయ్యారు. కోదాడలో 58,601 మంది, హుజూర్నగర్లో 29,996 మంది, తిరుమలగిరిలో 15,455 మంది ఓటర్లు ఉన్నారు. వేడెక్కిన రాజకీయం మున్సిపల్ పోరుకు షెడ్యూల్ వెలువడడంతో అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఆశావహులు టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల వద్ద క్యూ కట్టారు. రిజర్వేషన్లు తేలిన నాటి నుంచే తమకు అవకాశం కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే ప్రచారం ప్రారంభించారు. ప్రధాన పార్టీలు సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. నేటినుంచే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు ఫ షెడ్యూల్ విడుదల, నేడు నోటిఫికేషన్ ఫ వెంటనే నామినేషన్ల స్వీకరణ ఫ ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాల వెల్లడి ఫ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సూర్యాపేట 52170 56664 14 108848 కోదాడ 28069 30520 12 58601 హుజూర్నగర్ 14257 15731 08 29996 నేరేడుచర్ల 6629 7116 01 13746 తిరుమలగిరి 7638 7817 00 15455 మొత్తం 1,08,763 1,17,848 35 2,26,646 -
మరమ్మతు పనులు అంతంతే
జాన్పహాడ్ రోడ్డుపై గుంతలు పడిన చోట రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతోనే చేపడుతున్నాం. జాన్పహాడ్ దర్గా, శూన్యపహాడ్ రోడ్డులో గుంతలు పూడ్చేందుకు సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా నామమాత్రపు పనులు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. –ప్రీతి, ఆర్అండ్బీ, ఏఈ, పాలకవీడు పాలకవీడు : మండలంలోని జాన్పహాడ్ దర్గా రోడ్డు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉర్సు ఉత్సవాలకు వేలాది భక్తులు రాగా రోడ్డు సరిగా లేక పోవడంతో ఈ నెల 17న శ్రీదారిచూపు సైదన్నాశ్రీ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టినా అందులో నాణ్యత పాటించడం లేదు. దాంతో ప్రజాధనం వృథా అవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. మట్టిపైనే తారు రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా గుంతల్లో ఉన్న మట్టిని తొలగించి తారు పోయాల్సి ఉండగా అవేమీ లేకుండానే గుంతల్లో తారు కుమ్మరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా జాన్పహాడ్ రైల్వే ఫ్లైవర్ పైనుంచి నేరేడుచర్ల, మఠంపల్లి, దామరచర్ల మార్గాలకు వెళ్లే ప్రధాన కూడలి వద్ద పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కేవలం గుంతల్లో తారు పోసి పనులు ముగించారు. మిగిలిన రోడ్డు మొత్తం దుమ్ము మయంగానే ఉంది. శూన్యపహాడ్ వద్ద కూడా ౖపైపెనే పనులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జిని వదిలేశారు మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై మర్మతులు చేపట్టడం లేదు. బ్రిడ్జిపై అడుగుకో గంత ఉండగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భక్తులకూ తప్పని ఇబ్బంది ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు చేయాల్సి ఉండగా అధికారులు మాత్రం ఉర్సు ముగిసిన తరువాత పనులు చేపడుతున్నారు. దాంతో ఉర్సుకు వచ్చిన వేలాది మంది రోడ్డుపై గుంతలతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా తాత్కాలిక పనులతో ప్రజా ధనం వృథా అవుతున్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతో చేసేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఫ జాన్పహాడ్ రోడ్డు మరమ్మతు పనుల్లో నాణ్యత కరువు ఫ గుంతలు పూడ్చి వదిలేస్తున్న వైనం ఫ ప్రజాధనం వృథా అవుతుందంటూ స్థానికుల ఆగ్రహం ఫ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని వేడుకోలు -
రాజేష్ మృతిపై విచారణ జరిపించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి), మద్దిరాల : కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై పూర్తిస్థాయి వాస్తవాలు బయటికి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దీనికి బాధ్యులైన పోలీస్, ఇతర శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిరుమలగిరి, మద్దిరాల మండల కేంద్రాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ల రాజేష్ లాకప్ డెత్కు కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించి, అతడిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కోదాడ ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపడాని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజేష్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అతని కుటుంబానికి కోటి రూపాయాల నష్టపరిహారంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సోమన్న, ఏపూరి సోమన్న, మాజీ ఎంపీపీలు జె.శోభారాణి, కొమ్మినేని సతీశ్, నాయకులు వై.దీన్దయాళ్, కడెం లింగయ్య, రాంప్రభు, కొత్తగట్టు మల్లయ్య, సోమన్న, రమేశ్, రామ్మూర్తి, వెంకన్న, బ్రహ్మం, భిక్షం, యాదగిరి పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
మున్సిపల్ చట్టానికి 61 ఏళ్లు మున్సిపాలిటీ చట్టం ఏర్పడి 61 ఏళ్లు పూర్తయింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం చట్టానికి పలు మార్పులు చేసింది. బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026- 8లోసూర్యాపేట అర్బన్ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారంలో ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని ఎస్బీఐ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేశ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేశ్ మాట్లాడుతూ ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పదేళ్ల క్రితమే బ్యాంక్ మేనేజ్మెంట్లు అంగీకరించాయని, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా నేటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ సెక్రటరీ సీహెచ్. భాస్కర్, యూనియన్ బ్యాంక్ సెక్రటరీ నరేశ్, కెనరా బ్యాంక్ సెక్రటరీ సట్టు రామకృష్ణ, ఎస్బీఐ కుడకుడ బ్యాంక్ సెక్రటరీ హేమలత, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉత్తమ్ దంపతులపై కేసు నమోదు చేయాలి
కోదాడ : దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారణమైన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్య బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాళీ సూట్కేస్తో కోదాడకు వచ్చిన మంత్రి వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించాడో అందిరికి తెలుసన్నారు. పౌరసరఫరాలశాఖను అడ్డుపెట్టుకొని మిల్లర్లను బెదిరించి డబ్బులు వసూలూ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని పనులను అప్పగిస్తున్నారని ఆరోపించారు. గడిచిన 20 ఏళ్లుగా తనను వేధిస్తున్నా భయపడకుండా ఎదురు నిలిచి పోరాటం చేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులు ఎస్కార్ట్ కల్పిస్తే ఎగతాళి చేసిన ఉత్తమ్ ఇప్పుడు షేర్ ఆటోవలె హెలీకాఫ్టర్ ఉపయోగించడంతో పాటు ఆయన సతీమణి కోదాడలో రెండు ఎస్కార్ట్ వాహనాలు పెట్టుకొని తిరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే. నయీం, రమేశ్బాబు, సురేశ్ పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ -
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పీఓలు, ఓపీఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్ కేంద్రాలు, స్టేషనరీ, సంబంధిత ఫారాలు, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లు, వీడియోగ్రఫీ, బ్యాలెట్ బాక్స్ల తరలింపు వంటి ఏర్పాట్లు అధికారులు చూసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు పటిష్ట భద్రత చేపట్టాలని, సిబ్బందికి మరోసారి శిక్షణ ఇప్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి, రమాదేవి, బి. శ్రీనివాస్, నాగరాజు, రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కలుషిత నీరుతాగి పలువురికి అస్వస్థత
మోతె : కలుషిత నీరు తాగి మోతె మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం సోమవారం వెలుగు చూడడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సిరికొండ గ్రామంలోని గుట్ట పక్కన నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులకు తాగునీరు సరఫరా అవుతున్నది. అయితే బోరు నీటిని పైప్లైన్ ద్వారా ట్యాంక్లోకి పంప్చేసి వాటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. అయితే పైప్లైన్లు సరిగా లేక పోవడంతో తాగునీరు కలుషితమవుతున్నది. కలుషిత నీటిని తాగడంతో మూడు రోజులుగా గ్రామానికి చెందిన సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రస్తుతం వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భవాణి, సిరికొండ పల్లె దవాఖాన డాక్టర్ బిందు తమ సిబ్బందితో కలిసి సోమవారం గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి సాంపుల్స్ను పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపినట్లు వైద్యధికారులు తెలిపారు. -
పూర్వగిరిలో తిరుమంజనం, పురప్పాట్టు సేవ
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మూడో రోజు ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం పురప్పాట్టు సేవ, తిరుమంజన మహోత్సవం, దివ్య ప్రబంధ సేవాకాలం జరిపించారు. పురప్పాట్టు సేవను ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన సేవపై స్వామి, అమ్మవార్ల అధిష్ఠించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు దివ్య ప్రబంధ సేవాకాలంలో నమ్మాళ్వార్ పరమపద ఉత్సవాన్ని జరిపించారు. ఈ వేడుకల్లో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఆలయాధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. అధ్యయనోత్సవాలు మంగళవారం ఉదయం ముగియనున్నట్లు అర్చకులు వెల్లడించారు. నేటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు -
యాదగిరి క్షేత్రంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల కోలాహలం నెలకొంది. గణతంత్ర వేడుకలతోపాటు మేడారం జాతరకు వెళ్లి తిరుగ పయనంలో హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల వాసులు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా మారాయి. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలకుపైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 40వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని, స్వామి వారికి నిత్యాదాయం రూ.50,60,181 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్లి..
హాలియా : ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమైన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన ఆమెను.. అప్పు తీసుకున్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేయగా.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణంలోని రెడ్డికాలనీలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు సుంకిరెడ్డి అనసూయమ్మ(65) ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆమె బంధువులు హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా.. అయితే అనసూయమ్మ కూలీ పనులు చేయగా వచ్చిన డబ్బులను హాలియా పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ధనలక్ష్మి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్న చినపాక రాములుకు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగేందుకు అనసూయమ్మ ఈ నెల 24న ధనలక్ష్మి ఫాస్ట్ఫుడ్ సెంటర్లోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాకుండా ఆమె ఫాస్ట్పుడ్ సెంటర్లోకి వెళ్లి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన పోలీసులు ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు చినపాక రాములును అదుపులోకి తీసుకొని విచారించగా.. తన భార్య ధనలక్ష్మి, పెంపుడు కొడుకు గౌరీ కలిసి అనుసూయమ్మను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. అనసూయమ్మ మెడలోని బంగారు ఆభరణాల కోసం తలపై కొట్టి కత్తిపీటతో ఆమె గొంతుకోసి హత్య చేసి ఫాస్ట్ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో మృతదేహాన్ని పూడ్చినట్లు పోలీసులకు వివరించారు. మృతదేహానికి పంచనామా..వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించి తహసీల్దార్ రఘు సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతదేహాం కుళ్లిపోవడంతో డాక్టర్ల సహాయంతో పూడ్చి పెట్టిన చోటే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. హత్యకు గురైన వృద్ధురాలు ముగ్గురు నిందితుల అరెస్టు -
కానిస్టేబుల్కు ఉత్తమ సేవా పురస్కారం
మోతె : వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన గురిజాల స్టాలిన్ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడాడు. అతడి సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డును అందించింది. సోమవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్యాదవ్ చేతుల మీదుగా స్టాలిన్ ప్రశంసా పత్రం అందుకున్నారు. -
మురిసిన మామిడాల
నల్లగొండ, తిప్పర్తి : తిప్పర్తి మండలం మామిడాల గ్రామం మురిసింది. గ్రామానికి చెందిన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. తమ గ్రామవాసికి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కడంతో గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్కుమార్కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రొపెసర్గా బిజీగా ఉన్నప్పటికీ ఆయన గ్రామంతో విడదీయరాని బంధం ఉంది. ప్రతి సంవత్సరం గ్రామానికి వస్తుంటారని, స్వయకృషితో ఉన్నత స్థాయికి ఎదిగారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జగదీష్కుమార్ తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వచ్చే జీతం సరిపోకపోయినా ముగ్గురు పిల్లలను చదివించారు. ఇంట్లో పెద్దవాడైన జగదీశ్కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. చదువుతో.. గౌరవం, పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆయన నమ్మకం. కష్టపడి చదవడం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఢిల్లీ జేఎన్యూ వైస్ ఛాన్స్లర్గా, యూజీసీ చైర్మన్గా పని చేశారు. ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు సాధించుకోగలిగారు. ఆయన ఉన్నత చదువుకు తన బంధువులు ఎంతో సాయపడ్డారని ఆయన పలుమార్లు చెప్పారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ పాఠవాలు ఉంటాయని.. వాటిని సానబడితేనే వారు మెరికల్లా ఎదుగుతారని చెబుతుంటారు. ఫ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మామిడాల జగదీశ్కుమార్ ఫ కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో అంతా హర్షం -
సమ్మర్.. సాఫీగా పవర్
నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ పంపిణీకి ప్రణాళికవేసవి కార్యాచరణలో భాగంగా జిల్లాలో నూతనంగా పది 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. మూడు చోట్ల పనులు పూర్తి కాగా, నాలుగు చోట్ల పురోగతిలో ఉన్నాయి. మార్చి నాటికి అన్నీ అందుబాటులోకి తెస్తాం. నిరంతరం నాణ్యమైన, అంతరాయం లేని కరెంట్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. – శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ సూర్యాపేట అర్బన్ : జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) వేసవికి ముందే ఏర్పాట్లు చేస్తోంది. మార్చి నాటికి పది సబ్స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. బక్కమంతులగూడెం, బాలాజీనగర్, ముకుందాపురంలో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతా చోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి నాటికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులన్నీ పూర్తి చేస్తామని ఆ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం సబ్స్టేషన్లుజిల్లాలో ప్రస్తుతం 79 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 33/11 కేవీ సబ్స్టేషన్లు 65, 132/32, 220/ 132 కేవీ సబ్స్టేషన్లు 10 ఉండగా, కూసుమంచి, నల్ల గొండ, వరంగల్ నుంచి మూడు ఫీడర్లు కలుస్తున్నాయి. చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహాడ్లో 400 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ ఒకటి ఉంది. విద్యుత్ కనెక్షన్లు డొమెస్టిక్ 3,33,849, వ్యవసాయం 1,52,603, పరిశ్రమలకు సంబంధించి 40,072 కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 10,05 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. వేస విలో 5నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. లోడ్ పెరిగినా వినియోగదారులకు అంతరాయం లేని కరెంట్ సరఫరా చేయడమే లక్ష్యంగా పది 33/11 కేవీ సబ్స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.26.68 కోట్లు మంజూరు చేసింది. పాత లైన్లపై భారం పడకుండా..అదనంగా పది 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యం పెంచనున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పాత లైన్లపై భారం పడకుండా కొత్తగా ఇంటర్ లింకింగ్ లైన్లు వేస్తున్నారు. అదనంగా పది 33/11 కేవీ సబ్స్టేషన్లు, ఇంటర్ లింకింగ్ లైన్లు పీటీఆర్ల సామర్థ్యం పెంపు రూ.26.68 కోట్లతో పనులు మార్చి నాటికి పూర్తివేసవి వచ్చిందంటే విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతుంది. గృహ అవసరాలతో పాటు పంటలకు అధికంగా వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కమ్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. డిమాండ్, సరఫరాకు గ్యాప్ లేకుండా నూతన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో పాటు ఇంటర్లింకింగ్ పనులు చేపట్టింది.విద్యుత్ కనెక్షన్లు గృహ 3,33,849వ్యవసాయం 1,52,603పరిశ్రమలు 40,072 -
పనుల పురోగతి ఇలా..
● మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో రూ.2.45 కోట్లు, కోదాడ మండలం బాలాజీనగర్లో రూ.2.33 కోట్లు, మునగాల మండలం ముకుందాపురంలో రూ.2.43 కోట్లతో సబ్స్టేషన్ల పనులు ప్రారంభించారు. కాగా ఈ మూడు చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ● సూర్యాపేట మండలం తిరుమలనగర్లో రూ.2.53 కోట్లు, మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో రూ.3.17 కోట్లు, పాలకీడు మండలం ఎల్లాపురంలో రూ.3.20 కోట్లు, చిలుకూరు మండలం కొండాపురంలో రూ.2.80 కోట్ల తో చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి. కూచిపూడి, చెన్నయ్యపాలెంలో ఆలస్యంకోదాడ మండలం కూచిపూడిలో రూ.2.59 కోట్లు, మఠంపల్లి మండలం చిన్నాయపాలెంలో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2.58 కోట్లు కేటాయించారు. స్థలం కేటాయింపు జరిగినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుంది. సాంకేతిక లోపం వల్ల పనులు ముందుకు కదలడం లేదు. పిల్లలమర్రిలో మొదలుకాని పనులుసూర్యాపేట మండలం పిల్లలమర్రిలో రూ.2.58 కోట్లతో సబ్స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించడం లేదు. ఇక్కడ పలు సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నా య మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. -
180 మందికి విధులు
కోదాడ: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు మరింత వేగం పెంచారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చారు. మూడు వార్డులకు ఒక ఆర్వోనామినేషన్ పత్రాలు స్వీకరించడానికి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ)ని, అతనికి సాయంగా మరో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ)ని నియమించారు. ఇద్దరు లేదా ముగ్గురు ఆర్ఓలపై పర్వవేక్షణకు ఒక జోనల్ అధికారిని నియామకం చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కలిపి 180 మంది అధికారులను నియమించారు. వీరిలో ఆర్ఓలు 59, ఏఆర్ఓలు 59, జోనల్ అధికారులు 46, మరో 16 మంది అధికారులను రిజర్వులో ఉంచారు. వీరికి శనివారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వీరంతా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మున్సిపాలిటీలకు వెళ్లి తమకు కేటాయించిన వార్డుల్లో విధులు నిర్వహించాలి. వీరికోసం ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన ఆర్వో వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలకు చేరిన ఎన్నికల సామగ్రిఎన్నికల నిర్వహణకు అవసరమైన నామినేషన్ పత్రాలతో పాటు అన్ని రకాల పత్రాలు శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో మున్సిపాలిటీలకు చేరాయి. పత్రాలను అధికారులు వార్డుల వారీగా వేరు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకం ఆర్వోలు, ఏఆర్వోలు, జోనల్ ఆఫీసర్లకు ముగిసిన శిక్షణ మున్సిపాలిటీలకు చేరిన సామగ్రి372 పోలింగ్ కేంద్రాలు ఐదు మున్సిపాలిటీల్లో 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్కు ముగ్గురు చొప్పున 1,116 మంది సిబ్బందిని నియమించనున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నందున బ్యాలెట్ బాక్స్లను కూడా సిద్ధం చేస్తున్నారు. 817 బ్యాలెట్ బ్యాక్సుల అవసరమవుతాయని, అదనంగా మరో 372 బ్యాలెట్ బాక్స్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.నియమించిన అధికారులు ఇలా..మున్సిపాలిటీ ఆర్వోలు ఏఆర్వోలు జోనల్ రిజర్వుకోదాడ 16 16 09 04 సూర్యాపేట 16 17 17 05 హుజూర్నగర్ 12 12 07 03 నేరేడుచర్ల 07 08 07 01 తిరుమలగిరి 08 08 06 03మొత్తం 59 59 46 16 -
నేడు మాంసం విక్రయాలు నిషేధం
హుజూర్నగర్ : గణతంత్ర వేడుకల దృష్ట్యా సోమవారం మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు నిషేధించినట్లు హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమాన విధించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బార్ కౌన్సిల్ ఎన్నికల అధికారిగా లింగయ్యచివ్వెంల(సూర్యాపేట) : రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30న జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్ని కల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కోర్టు ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ దగ్గుబాటి యతి రాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనల్లో భాగంగా శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. ఉత్సవమూర్తులను వధూవరులుగా దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ఎదుర్కోళ్లు, వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, మూలవిరాట్కు అభిషేకం, సహస్రనామార్చన తదితర పూజలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు. పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. చదువుతోనే ఉన్నత శిఖరాలకుతిరుమలగిరి (తుంగతుర్తి ): ప్రస్తుత సమాజంలో చదువుతోనే అన్నీ సాధ్యమని, బాలికలు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సాంస్కతిక సలహా మండలి సభ్యుడు ఏపూరి సోమన్న అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుమలగిరిలోని కస్తూరిబాగాంధీ పాఠశాలలో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమ్మాయిలు విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సా గాలన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సుష్మిత, మార్పు సొసైటీ అధ్యక్షుడు పోరెళ్ల విప్లవకుమార్, లయన్న్స్క్లబ్ అధ్యక్షుడు గుండాల మురళీధర్, సామాజిక కార్యకర్త పోరెళ్ల లక్ష్మయ్య, ఉపాధ్యాయులు టి.కవిత , బి.కవిత, వాణి, కళావతి ఇందిర, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతోన్న నీటి విడుదలఅర్వపల్లి: ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ద్వారా జిల్లాకు గోదావరి జలాల విడుదల కొనసాగుతోంది. రెండో విడత కింద 1,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జలవనరులశాఖ ఈఈ, బయ్యన్నవాగు ఏఈ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయొద్దని సూచించారు. -
అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతూ!
అర్వపల్లి : వేతనాలు అందక ఇ–పంచాయతీ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ ఖర్చులు, చిట్టీలు, బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాలకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేటర్ల విధులు ఇవీ..ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువపత్రాలు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తుంటారు. అలాగే ప్రభుత్వ సర్వేలకు సంబంధించిన వివిధ రిపోర్టులు చేయడం, స్థానిక ఎన్నికలు.. ఇలా ప్రతి అంశంలో ఈ–పంచాయతీ ఆపరేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అవసరాన్ని బట్టి అదనపు గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ, వారికి వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. 63 మంది నిరీక్షణజిల్లాలో 63 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి గతంలో నెలకు రూ.22,750 వేతనం ఇస్తుండగా.. అందులో కోత విధించి ప్రస్తుతం రూ.19,500 చెల్లిస్తున్నారు. అది కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నుంచి వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని వాపోతున్నారు. కాగా వేతన బకాయిలు విడుదల చేయకపోతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఇ–పంచాయతీ ఆపరేటర్లకు నెలనెలా అందని వేతనాలు నాలుగు మాసాలుగా పెండింగ్ కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నామని ఆవేదనకుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది చాలీచాలని వేతనాలతో ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా నెలనెలా ఇవ్వడం లేదు. నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది. ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. – చింతల సురేష్, ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం తుంగతుర్తి అధ్యక్షుడు -
బీఆర్ఎస్ హయాంలోనే కోదాడ అభివృద్ధి
కోదాడ: బీఆర్ఎస్ హయాంలోనే కోదాడ పట్టణం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి రామిరెడ్డి పాలెం వరకు 8 వార్డుల మీదుగా ఉన్న 33 కేవీ లైన్ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్పించానని, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మీ ఓట్లతో గెలిచి హైదరాబాద్లో సేదదీరుతారని, తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటా నన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మాదిరిగా కోదాడ పట్టణం అభివృద్ధి సాధించాలంటే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీం, పి.సత్యబాబు, 12వ వార్డు ఇంచార్జ్ గొర్రె రాజేష్, సంగిశెట్టి గోపాల్, సంపెట ఉపేందర్, కర్ల సుందర్బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
గణతంత్ర వేడుకలకు వేళాయే..
భానుపురి (సూర్యాపేట) : గణతంత్ర వేడుకలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సూర్యాపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వేడుకలకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.అనంతరం జిల్లా ప్రగతి నివేదికపై ప్రసంగించనున్నారు. ఆ తరువాత స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంస పత్రాల ప్రదానం, స్టాళ్ల సందర్శన ఉంటుంది. పోలీసుల రిహార్సల్సూర్యాపేటటౌన్ : పోలీసు పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లతో పాటు పోలీసుల రిహార్సల్ను ఎస్పీ నరసింహ పరిశీలించారు. వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, పరేడ్ కమాండర్గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. -
ఇంటర్లోనూ ‘డిజిటల్’
సూర్యాపేటటౌన్ : పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యంగా ప్రభుత్వం విద్యావ్యవస్థల్లో మార్పులు తీసుకువస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన బోధన అందించాలన్నదే లక్ష్యం. ప్రస్తుతం సర్కారు స్కూళ్లలో డిజిటల్ విద్యనందిస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా డిజిటల్ బోధన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా వాటికి డిజిటల్ బోర్డులు పంపిణీ చేసింది. ప్రతి కళాశాలకు నాలుగు డిజిటల్ బోర్డులు ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్సీ) బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధిస్తున్నారు. జిల్లాలోని ప్రతి కళాశాలకు నా లుగు చొప్పున ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మొత్తం 32 బోర్డులను ఇంటర్ బోర్డు అందజేసింది. అయితే ఆయా కళాశాలల్లో డిజిటల్ బోర్డుల బిగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అందుబాటులోకి వచ్చిన చోట డిజిటల్ బోర్డుపైనే బోధిస్తున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇప్పటికే డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 32 డిజిటల్ బోర్డులను ఇంటర్బోర్డు అందజేసింది. ఒక్కో కళాశాలకు నాలుగు చొప్పున వచ్చాయి. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో బోర్డుల బిగింపు పూర్తికావడంతో బోధన సైతం ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇవి వినియోగిస్తారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించాలి. – భానునాయక్, డీఐఈఓకార్పొరేట్కు దీటుగా పాఠాలు జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు అంతటా డిజిటల్ బోర్డులు ఏర్పాటు, మొదలైన బోధన -
విద్యార్థి దశలోనే లక్ష్యం ఎంచుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పరచుకుని సాధనకోసం కృషి చేస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేటలోని నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థానాలకు చేరాలన్నారు. తల్లిందండ్రుల కలలను సాకారం చేయాలని, చదివిన పాఠశాలకు పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎల్ఎస్ఎ నామినేషన్ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు కీలకం
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు, ఏఆర్వోల పాత్ర కీలకమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమించిన ఆర్వోలు, ఏఆర్ఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ లో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం హ్యాండ్బుక్ ఆధారంగా తప్పులకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదల మొదులుకొని ఫలితాలు వెల్లడించే వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు, ట్రైనర్లు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో వేగం పెంచండిఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. భవిత కేంద్రాలు, కేజీబీవీలను ఫిబ్రవరిలో పూర్తి చేయాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హుజూర్నగర్లో ఐటీఐ కళా శాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఫిట్గా ఉన్నప్పుడే మెరుగైన సేవలు
సూర్యాపేటటౌన్ : పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీ సులు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తుంటారని పేర్కొన్నారు. రోజూ కనీసం అరగంట అయినా వ్యాయామం చేయాలని సూచించారు. పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం : ఎస్పీపోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. పోలీసులు విధులు నిర్వహిస్తూనే వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. వైద్యశిబిరం ఏర్పాటుకు సహకరించిన సూర్యాపేటకు చెందిన హెల్తీఫై హాస్పిటల్, సూర్యాపేట జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపా రు. 600 మందికి పరీక్షలు నిర్వ హించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, జిల్లా ఆస్పత్రి డాక్టర్ గీతాలక్ష్మి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహచారి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ -
ఉత్తమ్ ఇలాఖాలో పోలీసు రాజ్యం
కోదాడ: కోదాడ నియోజకవర్గంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ఖాకీ చొక్కాలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులుగా పెట్టుకొని అకారణంగా దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతి ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఛలో కోదాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాజేష్ మరణానికి కారణమైన పోలీసులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో మంత్రి, ఎమ్మెల్యే వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ దీనిపై ఇంత వరకు నోరు విప్పలేదని, దీనికి కారణమైన అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డిని మంత్రి తన శాఖలో నియమించుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కోదాడలో మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే పెత్తనం చేస్తున్నాడని పేర్కొన్నారు. పోలీ సులు బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్ర తినిధి పైడి రాకేష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అవినీతి మయంగా మారిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజేష్ తల్లి లలితమ్మ, మాజీ ఎంపీపీ చింతా కవిత, కోదాడ పట్టణ బీఆర్ఎస్ అద్యక్షుడు ఎస్.కె. నయీం, పి.సత్యబాబు, సుంకర అజయ్కుమార్, తుమ్మలపల్లి భాస్కర్, కర్ల సుంధర్బాబు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్స్తంభించిన కోదాడ పట్టణం ఛలో కోదాడ పిలుపునకు వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోదాడలో పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉందని సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు భారీగా మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా జాతీయ రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్కు మల్లయ్యయాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి వచ్చారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మల్లయ్య మాట్లాడారు. రాజేష్ తల్లి లలితమ్మను వేదిక మీదకు పిలిచి ఆమెతో మాట్లాడించారు. మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలను టార్గెట్గా చేసుకొని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమం జరగడంతో ట్రాపిక్ స్తంభించింది. -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
సూర్యాపేటటౌన్ : అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల భద్రత, రక్షణే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తుందని జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు రామచందర్గౌడ్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేష్ మృతి విషయంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎలాంటి తారతమ్యం లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కావని, పోలీసు శాఖ ప్రతిష్ట, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. మునగాల ఎంఈఓకు ప్రశంసలుమునగాల: మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లుకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ శాటిలైట్ (టి–శాట్) ఫౌండేషన్ లిటరసీ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) ప్యానల్ డిస్కస్ లైవ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని జిల్లాలో ఎఫ్ఎల్ఎస్ ప్రోగ్రాం అమలు జరుగుతున్న తీరుపై వివరించారు. తమ మండలాల్లో ఫౌండేషన్ లిటరసీ ప్రోగ్రాం (ఎఫ్ఎల్ఎస్) సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంఈఓలు ఎంపికవగా అందులో పిడతల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోస్ల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమొంటో అందుకున్నారు. వెంకటేశ్వర్లును ఉపాధ్యాయులు అభినందించారు. బాలికా విద్యతోనే నవ సమాజ స్థాపనపెన్పహాడ్: బాలికా విద్య, సాధికారతతోనే నవ సమాజ స్థాపన సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి నర్సింహరావు అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం పెన్పహాడ్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి అమ్మాయి తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీడీబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, మహిళా సాధికారత కేంద్రం కో–ఆర్డినేటర్ చైతన్య, సఖి కేంద్రం సీఏ హేమలత, పాఠశాల ఎస్ఓ ఆసియాజబిన్, ఎయిడ్ ఎన్జీఓ సోమన్న, వైద్యాధికారి రాజేష్, సీడబ్ల్యూసీ సభ్యులు, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి జలాల పెంపుఅర్వపల్లి: ఎస్ఆర్ఎస్పీ రెండో దశ ద్వారా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను పెంచారు. రెండో విడత కింద తొలిరోజు 1,337 క్యూసెక్కుల నీటిని వదలగా, శనివారం 1,700 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69,70,71 డీబీఎంలకు వదులుతున్నట్లు జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. రైతులు కాలువలకు అడ్డుకట్ట వేయకుండా నీటిని వాడుకోవాలని సూచించారు. -
చేప చర్మంతో కుక్కకు చికిత్స
కోదాడరూరల్ : కుక్కకు అయిన గాయం మానకపోవడంతో కోదాడ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి. పెంటయ్య చేప చర్మంతో దానికి చికిత్స చేశారు. వివరాలు.. కోదాడ మండల పరిధిలోని గుడిబండకు చెందిన ఓ జంతు ప్రేమికుడి కుక్క కాలి తోడకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయమైంది. గాయం పరిమాణం పెద్దగా ఉండటం, వారం రోజులవుతున్నా మానకపోవడంతో శుక్రవారం కుక్కను స్థానిక పశువైద్యశాలకు తీసుకొచ్చాడు. గాయాన్ని పరిశీలించిన డాక్టర్ పెంటయ్య దీర్ఘకాలిక గాయాలు, పుండ్ల చికిత్సకు చేప చర్మంతో చేసే వైద్యం గురించి వివరించారు. కుక్క యజమాని ఒప్పుకోవడంతో మార్కెట్లో చేప చర్మాన్ని తీసుకొచ్చి దానిని 8 గంటలు సాధారణ సైలెన్లో, మరో 8 గంటలు జెంటామైసిన్ యాంటిబయాటిక్ ద్రావణంలో ఉంచి ఆ తర్వాత చర్మాన్ని శుభ్రపరిచి చికిత్స పూర్తి చేశారు. ఈ విధానంతో గాయం త్వరగా మానుతుందని డాక్టర్ పెంటయ్య తెలిపారు. ఈ చికిత్సలో అనంతగిరి మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేంద్ర, సిబ్బంది కర్ణ పాల్గొన్నారు. -
‘మన సీ్త్రనిధి’తో సులువుగా రుణాలు
ఆలేరురూరల్ : స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తుంది. ఇంటి వద్దనే ఉండి వివిధ వ్యాపారాలు నిర్వహించేలా సభ్యులకు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ అతివలకు అండగా నిలుస్తోంది. కాగా స్త్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా మన సీ్త్రనిధి యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రుణాల పంపిణీ, చెల్లింపుల విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టడంతో పాటు రుణాలు పొందిన మహిళలు నేరుగా యాప్ ద్వారానే ఆన్లైన్లో కిస్తీలు చెల్లించవచ్చు. అదేవిధంగా సభ్యులు చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయ్యిందా లేదా అనే సరిచూసుకోవచ్చు. ఈ యాప్ గురించి అధికారులు, సీ్త్రనిధి బ్యాంక్ సిబ్బంది మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు సులభం..గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీఓఏలు తీర్మానం చేసి రుణాలు కేటాయించేవారు. దీంతో వారిని బతిమాలడంతో పాటు ఎంతో కొంత సమర్పించాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వ కొత్తగా తీసుకొచ్చిన మన సీ్త్రనిధి యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు వీఓఏలు, సీసీల చుట్టూ తిరగకుండా.. స్మార్ట్ఫోన్లో మన సీ్త్రనిధి యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు రుణాల కోసం చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఆన్లైన్లో వీఓఏకు వెళ్తుంది. 24 గంటల్లో దానిని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే సంబంధిత ఏపీఎంకు వెళ్తుంది. ఆయన పరిశీలించి అసిస్టెంట్ మేనేజర్ సీ్త్ర నిధికి పంపిస్తారు. వారు ఆమోదం తెలిపితే రీజినల్ మేనేజర్ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అక్కడ నుంచి ఆమోదం లభిస్తే రుణం నేరుగా సభ్యుల ఖాతాల్లోకి చేరుతుంది. అక్రమాలకు చెక్ఇదివరకు రుణాలు పొందిన సభ్యులు తిరిగి కడుతున్నారో లేదో తెలిసేది కాదు. కానీ ఈ యాప్లో సభ్యులు తీసుకున్న రుణాల సమగ్ర సమాచారం ఉంటుంది. ఏ సభ్యురాలు ఎంత రుణం తీసుకుంది, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది వంటి వివరాలు యాప్లో ఉంటాయి. అలాగే రుణం చెల్లించేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్ ద్వారా కిస్తీలు చెల్లించవచ్చు. యాప్ డౌన్లోడ్ ఇలా..స్మార్ట్ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్లో మన సీ్త్రనిధి తెలంగాణ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసే సమయంలో వచ్చే పర్మిషన్స్ అన్నింటిని అలో చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సంఘం అకౌంటింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సంఘం సభ్యురాలి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేయమని చూపించినట్లయితే మండల సీ్త్ర నిధి మేనేజర్ను సంప్రదించి సంఘం సభ్యురాలి మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్న వివరాలకు సీ్త్రనిధి పేద మహిళల పెన్నిధి– తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో చూపించే వీడియోల ఆధారంగా కూడా మన సీ్త్ర నిధి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలకు అందుబాటులోకి ప్రత్యేక యాప్ అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం రుణ కిస్తీలు చెల్లించడానికి ఇక సులభతరం సంఘాలకు అవగాహన కల్పిస్తున్న అధికారులుసభ్యులకు ఎంతో ప్రయోజనం సీ్త్రనిధి రుణాలు పొందాలనుకునే వారు, ఇది వరకు రుణాలు తీసుకున్న వారు స్మార్ట్ఫోన్లలో మన సీ్త్రనిధి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రుణాల కోసం నేరుగా యాప్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. చెల్లించాల్సిన వాయిదాల వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోచ్చు. దీంతో సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. – గోకినేపల్లి రామకృష్ణ, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ -
కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇతర ఏ పార్టీలతో పోటీనే లేదని, ఐక్యమత్యంగా ఉండి సూర్యాపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను కై వసం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందని, ప్రజల్లో ఇదే విశ్వాసం ఉందని, అంతే నమ్మకంతో రాష్ట్రంలో పాలన సాగిస్తుందని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో పెట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా ప్రకటించొద్దని, పార్టీ వేదికపై చర్చించుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తండు శ్రీనివాస్, పెద్దిరెడ్డి రాజా, చకిలం రాజేశ్వర్ రావు, వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి లక్ష్మణ్కుమార్ -
టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు
భువనగిరి : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్లాగా కొనసాగుతోందని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఇందులో ఏ ఒక్క నాయకుడ్ని బాధ్యులను చేసి అరెస్టు చేయలేదన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంత మంది రాజకీయ నాయకులు అధికారులను బలిపశువులుగా చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగల్లా నాటకం ఆడుతున్నాయన్నారు. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు అన్నింటిపై విచారణ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పూటకో మాట రోజుకో నాటకం ఆడుతున్నారని అన్నారు. అసలు సూత్రధారులను పట్టుకోవాలే తప్ప అధికారులను బలిపశువులను చేయడం సరికాదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్, మనోహర్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శ -
చెర్వుగట్టులో భక్తుల విరాళాలు పక్కదారి
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిత్య అన్నదానం చేసేందుకు భక్తులు ఇస్తున్న విరాళాలు పక్కదారి పట్టిన విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ అఽధికారులు నిత్య అన్నదానం చేస్తున్నారు. అన్నదానానికి భక్తులు ఇచ్చే విరాళాలు సేకరించి వారికి రశీదులు ఇచ్చేందుకు గాను సమాచార కేంద్రంలో పనిచేసే వ్యక్తిని నియమించారు. అయితే గతేడాది డిసెంబర్ 18న చెర్వుగట్టు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.5000 విరాళం అందజేయగా.. విరాళం సేకరించిన వ్యక్తి మరో రశీదుపై కేవలం రూ.1000 అందజేసినట్లు రాసి దేవాలయ అధికారులకు అందజేశాడు. అదేవిధంగా డిసెంబర్ 29న కేతేపల్లికి చెందిన భక్తుడు రూ.2500 విరాళం అందజేస్తే అతడు కూడా రూ.1000 ఇచ్చినట్లు మరో రశీదుపై రాసి దేవాలయ సిబ్బందికి అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఈఓ మోహన్బాబును వివరణ కోరగా.. పూర్తి విచారణ చేపట్టి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రౌడీ షీటర్ హత్యయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మైలార్గూడెం గ్రామ పరిధిలోని హారిహార కాటేజీలో శుక్రవారం రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడి బజార్కు చెందిన రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్(32) బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మైలార్గూడెం పరిధిలోని హారిహార కాటేజీకి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అక్కడకు మరొక వ్యక్తి రావడంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్ని కత్తితో పొడిచి ఇద్దరు నిందితులు పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిశాంత్ ఠాకూర్పై గతంలో 11 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్నదానానికి ఇచ్చిన డబ్బులను తక్కువగా అప్పగించిన సిబ్బంది -
జనసంద్రమైన జాన్పహాడ్
పాలకవీడు : జాన్పహాడ్ సైదన్న ఉర్సులో భాగంగా శుక్రవారం గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్తో కలిసి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ ముజావర్ జానీ ఇంటి వద్ద హైదరాబాద్ నుంచి నుంచి తీసుకొచ్చిన గంధం కలశాన్ని ఎత్తుకొని సమీపంలోని చందల్ఖానాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం గంధాన్ని ప్రత్యేకంగా అలంకరించిన గుర్రం పైకి చేర్చి ఊరేగించారు. గంధోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్గా పరిసరాలు కిక్కిరిసాయి. జాన్పహాడ్, కల్మేట్తండా, చెరువుతండా గ్రామాల గుండా గంధాన్ని ఊరేగించుకుంటూ దర్గాకు చేర్చారు. గంధం దర్గాలోకి చేరే సమయంలో 30 నిమిషాల పాటు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. గంధాన్ని బాబా సమాధులకు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులను దర్శనానికి పంపించారు. గంధాన్ని తాకేందుకు భక్తులు పోటీపడడంతో స్వల్ప తోపులాట జరగగా.. పోలీసులు నిలువరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో సుమారు 65 మంది కార్మికులను నియమించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ముందస్తు చర్యులు చేపట్టారు. పోలీసులు కంట్రోల్రూం ఏర్పాటు చేసి భక్తులను అప్రమత్తం చేశారు. మిర్యాలగూడ, కోదాడ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును దర్గాకు నడిపారు. ఎక్సైజ్, అగ్నిమాపక, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు 450 మంది పోలీసులు విధులు నిర్వహించినట్లు సీఐ చరమందరాజు పేర్కొన్నారు. భక్తుల ఇక్కట్లు.. గంధోత్సవానికి ఒక రోజు ముందుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బస చేయడానికి షెల్టర్లు లేక అవస్థలు పడ్డారు. స్నానాలు చేసే చోట దస్తులు మార్చుకునేందుకు గదులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎప్పటికప్పుడు దర్గా పరిసరాల్లో చెత్తాచెదారాన్ని తొలగించలేదని, తాగునీటి ట్యాకులు శుభ్రంగా లేవని భక్తులు ఆరోపించారు. దర్గాకు కిలోమీటరు దూరంలో వాహనాల పార్కింగ్కు స్థలాలు కేటాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘనంగా గంధోత్సవం హాజరైన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సైదన్న ఆశీస్సులతో అభివృద్ధి చేస్తున్నా : మంత్రి ఉత్తమ్జాన్పహాడ్ దర్గా వద్ద కోటిన్నర ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ప్రారంభించి సైదన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాన్పహాడ్ దర్గాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట ఎస్పీ నరింహ, ఏఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ చరమందరాజు, అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏవీ సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాలోతు మోతీలాల్, బైరెడ్డి జితేందర్రెడ్డి, బెల్లంకొండ నరసింమారావు, గుత్తికొండ భూపాల్రెడ్డి, రమావత్ నీమానాయక్, భూక్యా చరణ్సింగ్, కెలావత్ కవిత, కిరణ్, సైదానాయక్, నాగరాజు తదితరులు ఉన్నారు. -
మున్సిపల్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ నూతన కమిషనర్గా ఎం.రాంచందర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై తిరుమలగిరి వచ్చారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న మున్వర్ అలీ ఎదులాపురం బదిలీ అయ్యారు. అర్వపల్లి పీహెచ్సీ తనిఖీఅర్వపల్లి: అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్యశాఖ జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, డీపీఎంఓ ఆనంద్, సీహెచ్ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, ఆశ కో–ఆర్డినేటర్ ఉపేందర్, నర్సింగ్ ఆఫీసర్లు సునిత, మాధవి, వీరయ్య, అనూష పాల్గొన్నారు. విద్యార్థుల చదువుపై దృష్టి సారించండి సూర్యాపేటటౌన్ : పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని డీఐఈఓ భానునాయక్, ప్రత్యేకాధికారి భీమ్సింగ్ సూచించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అధ్యాపకులు చదువు బోధించడంతో పాటు క్రమశిక్షణను నేర్పాలని, పిల్లల మానసిక ప్రవర్తనను పరిశీలించిడంతో పాటు అధిక మార్కులు సాధించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. గత ఏడాది కంటే ఈసంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు ప్రసాద్ వాసు, బసురున్నిస, గురవయ్య, కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగాలకు నిధులొచ్చాయ్..
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని ఎనిమిది కళాశాలలకు గాను ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటిని ఖర్చు చేయడానికి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. టెండర్లు పిలిచి అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేస్తాం. – భానునాయక్, డీఐఈఓసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇబ్బందులు తొలిగా యి. ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తుండటం.. నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. ఇంటర్బోర్డు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది.ఒక్కో కళాశాలకు రూ.50 వేల చొప్పున విడుదల చేసింది. ఈ నిధులతో ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో కళాశాలలు ఇలా..జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు ప్రైవేట్ కళాశాలలు 30 ఉన్నాయి. ఇక మోడల్ స్కూల్స్ 9, సోషల్ వెల్ఫేర్ 8, బీసీ వెల్ఫేర్ 8, కేజీబీవీలు 15, మైనార్టీ వెల్ఫేర్ 4, ట్రైబల్ వెల్ఫేర్ 3, రెసిడెన్షియల్ ఒకటి చొప్పున ఉన్నాయి. వీటిలో మొదటి సంవత్సరం 8,500, ద్వితీయ సంవత్సరంలో 7,900 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈసారి సొంత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాసే అవకాశం లేదు. నిర్దేశిత సెంటర్లలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలు సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించుకోవచ్చు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 41కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రతి ల్యాబ్లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వాయిస్, వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంటుంది. కెమెరాలు నేరుగా ఇంటర్బోర్డు కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి.ఒక్కో కళాశాలకు రూ.50 వేలు విడుదల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఖర్చు ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు -
రాజేష్ మృతిపై మంత్రి మౌనం వీడాలి : మందకృష్ణ
సూర్యాపేట : కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజేష్ మృతిపై 58 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి స్పందించడం లేదన్నారు. పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే రాజేష్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ కేసులో చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి ఏ1గా, కోదాడ రూరల్ సీఐ ప్రతాప్లింగం ఏ2గా ఉన్నారని.. కానీ, సీఐని సస్పెండ్ చేసిన అధికారులు.. ఎస్ఐపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే చర్యలు తీసుకువడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఫిబ్రవరి 5న నిర్వహించే చలో సూర్యాపేట కలెక్టరేట్ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యాతాకుల రాజన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డేవిడ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు వైవితో పాటు జీడి భిక్షం, వెంకటేశ్వర్లు, ఆవుల నాగరాజు, నెమ్మది వెంకటేశ్వర్లు, కోటా గోపి, కుంట్ల ధర్మార్జున్, రామశంకర్, నల్లేడ మాధవరెడ్డి, కుంబం నాగరాజు, మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పూర్వగిరీశుడి అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఉదయం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగనుండగా.. మరుసటి రోజు నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ వరకు భక్తులచే జరిపించే కల్యాణోత్సవం, జోడు సేవలతో పాటు 2వ తేదీన నిజాభిషేకం, అర్చనలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యయనోత్సవాలు ఇలా..శనివారం ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుడతారు. సాయంత్రం తొళక్కం నిర్వహిస్తారు. 25న ఉదయం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం, సాయంత్రం పురప్పాట్టు సేవ, దివ్య ప్రబంధ సేవాకాలం, 26న ఉదయం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం, సాయంత్రం పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవా కాలం, నమ్మాళ్వార్ పరమపదోత్సవం, 27న ఉదయం పురప్పాట్టు సేవ, రామానుజాచార్య తిరుమంజనం, ఇరామానుజ నూత్తందారి శాత్తుమరై నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. 28న బ్రహ్మోత్సవాలు షురూ..పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 28న ఉదయం 10గంటలకు స్వస్తీ వాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వచ్చే నెల 3న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని 30న రాత్రి 7.30గంటలకు, తిరు కల్యాణోత్సవాన్ని 31న రాత్రి 7.30గంటలకు, వచ్చే నెల 1న రాత్రి దివ్య విమాన రథోత్సవం, 2న ఉదయం 10.30గంటలకు చక్రతీర్థం కార్యక్రమాలు జరిపించనున్నారు. తిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా కల్యాణ టిక్కెట్ను రూ.600గా నిర్వహించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమంజనంతో శ్రీకారం నాలుగు రోజుల పాటు విశేష కార్యక్రమాలు 28 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు -
యువత రాణిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం
తిరుమలగిరి (తుంగతుర్తి) : యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలో క్రికెట్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 60 శాతం యువత ఉన్నప్పటికీ క్రీడల్లో అనుకున్న స్థాయిలో రాణించడం లేదన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యం వెలికితీసేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల కోసం కేంద్రం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్నారు. మద్యం, డ్రగ్స్కు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నాయకులు గంగిడి మనోహర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మన్మథరెడ్డి, పాండురంగాచారి, వై.ధీన్దయాళ్, శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, సాయిబాబా, బంగారి, సోమయ్య పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ -
మట్టపల్లి క్షేత్రం అద్భుతం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రం అద్భుతంగా ఉందని, కృష్ణా నది తీరంలో ఎంతో ఆహ్లాదాన్నిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శుక్రవారం ఆయన మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తన సతీమణితో కలిసి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. వసంత పంచమి రోజున మట్టపల్లి క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు వ్యవసాయ కళాశాల, నవోదయ పాఠశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా కృష్ణానది తీరంలో ఆలయం ఉండటం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. భారతదేశం వ్యవసాయయోగ్యంగా ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్, జై అనుసందాన్.. నినాదంతో రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని పైలట్, ఫైటర్గా గవర్నర్ అభివర్ణించారు. అంతకుముందు గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయిల్పామ్పై దృష్టి సారించండి : తుమ్మలరాష్ట్రంలో వరి అధికంగా పండిస్తున్నారని, ఆయిల్పామ్పైనా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు సూచించారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగదు 10 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. నల్లగొండ, రంగారెడ్డి, నిజామాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడు వ్యవసాయ కళాశాలలను సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో మంజూరు చేశామన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి : అడ్లూరి లక్ష్మణ్ ఇంచార్జ్ మంత్రిగా సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గవర్నర్ పర్యటనతో మట్టపల్లి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ వందన సమర్పణచేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, రైతులకు యాంత్రీకరణ పరికరాల మంజూరు చెక్కులు పంపిణీ చేశారు. స్టాళ్ల పరిశీలనవ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పౌరసరఫరాలు, వైద్య, విద్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. గవర్నర్ దంపతులకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జానయ్య స్వాగతం పలికారు. గిరిజన నాయకులు గవర్నర్కు తలపాగాలు ధరింపజేశారు. సమావేశంలో ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఐఏఎస్ సురేంద్రమోహన్, అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ శిరీష, ఎస్పీ నరసింహ, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఏఎంసీ చైర్మన్ రాధికాదేశ్ముఖ్, సర్పంచ్ విజయశాంతి, శివారెడ్డి, మంజీనాయక్, వెంకటేశ్వర్లు, నాగన్న గౌడ్, మల్లికార్జున్రావు, కిషోర్రెడ్డి, లక్ష్మీవెంకటనారాయణ, అప్పారావు, ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మట్టపల్లి క్షేత్రాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు వ్యవసాయ కళాశాల, నవోదయ పాఠశాలకు శంకుస్థాపనచుక్క నీటిని కూడా వదులుకోం : ఉత్తమ్కృష్ణ, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా సాధిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కృష్ణమ్మ సాక్షిగా చెబుతున్నా.. చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిందన్నారు. వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కోట్ల మంది రైతుల నుంచి రూ.19వేల కోట్ల విలువ చేసే 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి హుజూర్నగర్ వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, రూ.200 కోట్లతో వ్యవసాయ కళాశాల, నవోదయ పాఠశాల మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. -
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
నల్లగొండ : క్రీడలతో పోలీసు సిబ్బందిలో ఆత్మవిశాసం పెరుగుతుందని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని పోలీస్ క్రీడా మైదానంలో యాదాద్రి జోన్–5 పోలీస్ క్రీడలు, రాష్ట్రస్థాయి జోనల్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఫిబ్రవరి 2న హైదరాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొంటారని తెలిపారు. దాదాపు 140 మంది పోలీస్ క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి.. యాదాద్రి జోన్–5కు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, అదనపు ఎస్పీ వినోద్, ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ రాము, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల్లేక ఆటోల్లో..
తిరుమలగిరి (తుంగతుర్తి ): తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంలో గల మోడల్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ తిరుమలగిరి క్రాస్ రోడ్డుకు వచ్చి బస్సుల్లో వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోరోజు బస్సుల ఆగకుండా వెళ్లడం, సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్కు ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆటోల్లో పరిమితికి మించి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి పాఠశాల సమయానికి ఎక్స్ రోడ్డు నుంచి మోడల్ స్కూల్కు బస్సులు నడిచేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రోజూ కష్టాలే..
అర్వపల్లి : అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోల్లో వచ్చి చదువుకుని వెళుతున్నారు. అయితే కొత్తగూడెం నుంచి ఈ పాఠశాలకు 10 మంది ఆటోలో వచ్చిపోతారు. ఈ గ్రామానికి ఇంతవరకు బస్సు సౌకర్యం లేదు. అలాగే బొల్లంపల్లి నుంచి 10 మంది, అడివెంల నుంచి 22 మంది, వేల్పుచర్ల నుంచి 13 మంది విద్యార్థులు అర్వపల్లి వచ్చి వెళ్తున్నారు. వీరంతా ఆటోలు ఇతర వాహనాల్లో వచ్చి పోతుంటారు. ఆయా గ్రామాలన్నిటికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు ప్రతిరోజూ ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. -
ప్రైవేటు వాహనాలే దిక్కు!
ఆత్మకూరు (ఎస్) : ఆత్మకూర్(ఎస్) మండల వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతి గ్రామం నుంచి పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ఆత్మకూర్(ఎస్)మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్కు వచ్చేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రం, వివిధ గ్రామాల నుంచి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. కొన్ని గ్రామాల లో ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు పక్క గ్రామాల విద్యార్థులు సైకిళ్లు, కాలినడకన వెళుతున్నారు. వివిధ గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు సైతం ప్రైవేట్ వాహనాల్లోనే విధులకు హాజరవుతున్నారు. -
నేడు అఖిలపక్ష సమావేశం
సూర్యాపేట : కర్ల రాజేష్ మృతికి కారకులైన వారిపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్తో శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ కోరారు. గురువారం సూర్యాపేటలోని ఖమ్మం రోడ్లోని అమ్మ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ హాజరుకానున్నఈ సమావేశానికి అఖిలపక్షల నాయకులంతా రావాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు సొట్ట నరేందర్ మాదిగ, బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజయ్య మాదిగ, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
బడి వేళకు బస్సేది..!
అణిచివేయడం సరికాదు ప్రశ్నించే వారిని అణిచివేయడం సరికాదని అరుణోదయ సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. శిక్షపడే వరకు ఉద్యమం కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులకు శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని మంద కృష్ణమాదిగ అన్నారు. - 8లోమాది చాకిరాల గ్రామం. మా ఊరుకు చెందిన 20 మంది విద్యార్థులు రామాపురం జెడ్పీ హైస్కూల్లో టెన్త్ చదువుతున్నాం. రోజూ ఆరు కిలోమీటర్లు వెళ్లొస్తున్నాం. మాకు బస్సు సౌకర్యం కల్పించాలి. – పెదపంగు నాని, టెన్త్ విద్యార్థి, చాకిరాల నడిగూడెం : మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు వేరే ఊర్లలో చదువుకునేందుకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. చాకిరాల గ్రామం నుంచి పలువురు విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం నడిచి వెళ్తున్నారు. అలాగే చెన్నకేశ్వాపురం, వేణుగోపాలపురం, బృందావనపురం, కాగితరామచంద్రాపురం నుంచి పలువురు విద్యార్థుల రెండున్నర కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి కరివిరాల మోడల్ స్కూల్కు నడిచి వెళ్తున్నారు. ఇంకా పలువురు విద్యార్థులకు సైకిళ్లపై వివిధ పాఠశాలలకు వెళ్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
నేడు గవర్నర్ రాక
హుజూర్నగర్, మఠంపల్లి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీసమేతంగా శుక్రవారం మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్బందోబస్తు నిర్వహించనున్నారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు : కలెక్టర్ మఠంపల్లి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం కలెక్టర్ మఠంపల్లి మండలం మట్టపల్లిలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించనున్న యాత్రి కాసదన్, వంటశాల, సీసీజీఐ షెడ్డు, సీసీరోడ్లకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అదేవిధంగా వేదిక, ఎల్ఈడీల ఏర్పాటు, వ్యవసాయ, ఉద్యానవన, గృహనిర్మాణ, నీటిపారుదల, డీఆర్డీఏ, విద్యా శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ను గవర్నర్ పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వారి వెంట ఆలయ అనువంశిక ధర్మకర్తలు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు ఉన్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఫ ఉదయం 10.45 గంటలకు హైదబాద్లోని బేగంపేట నుంచి బయలుదేరుతారు. ఫ 11.45కు మట్టపల్లికి చేరుకుంటారు. ఫ 12 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు ఫ 12.30 నుంచి 12.40 వరకు స్టాళ్ల సందర్శన ఫ 1.40 నుంచి 2.30 వరకు మధ్యాహ్న భోజనం ఫ 2.40గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనం. ఫ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజలు చేయనున్న జిష్ణుదేవ్ వర్మ ఫ వివిధ శాఖల స్టాళ్ల సందర్శన ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దు
సూర్యాపేట టౌన్ : దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపై నడపొద్దని, తద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రైతులు, ట్రాక్టర్ యజమానులు దీనిని గమనించాలని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల దృష్ట్యా ఎవరైనా రోడ్లను తవ్వితే సంబంధిత శాఖ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. నిబందనలు అతిక్రమిస్తే రూ.5వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంసూర్యాపేట : సూర్యాపేట జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సద్దలచెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద రూ.5 కోట్ల నిధులతో ట్యాంక్ బండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, వుర రామ్మూర్తి యాదవ్, వెలుగు వెంకన్న, ముదిరెడ్డి రమణారెడ్డి, ఫరూక్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, యాట వెంకన్న, పాలగాని కృష్ణ, కొండగడుపుల సూరయ్య, సైదిరెడ్డి, టూరిజం శాఖ ఏఈ మణికంఠ పాల్గొన్నారు. పెండింగ్ డీఏలు చెల్లించాలిపెన్పహాడ్ : ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, ఏరియల్స్ వెంటనే చెల్లించాలని టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్, జిల్లా కోశాధికారి గుయ్యని ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేశ్వర్, విజయలక్ష్మి, సంపత్కుమార్, సంపత్, మౌనిష్, వెంకటేశ్వర్లు, సతీష్, శివ, జానీ, సంజయ్, సందీప్, ఉదయ్, మోక్షిత్ పాల్గొన్నారు. ఆర్టీఓ కార్యాలయ పనులు పూర్తిచేస్తాంకోదాడ రూరల్ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర నుంచి మండల పరిధిలోని గుడిబండ శివారులోకి మారుస్తున్న కోదాడ ఆర్టీఓ (రవాణా శాఖ) కార్యాలయం పనులు ఫిబ్రవరి 1 నాటికి పూర్తిచేస్తామని జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారి జయప్రకాశ్రెడ్డి అన్నారు. కార్యాలయం ఏర్పాటుకు గుడిబండ శివారులోని సర్వేనంబర్ 408 బై2బైబీలో గల రెండెకరాల ప్రభుత్వ భూమిలో యూనిట్ ఎంవీఐ షేక్.జిలానీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యాలయంలో భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట కోదాడ యూనిట్ ఎంవీఐ షేక్.జిలానీ, ఎంవీఐలు రాజ్మహ్మద్, కె.శ్రీనివాసులు, ఏఎంవీఐలు సంపత్గౌడ్, జీఆర్.చరణ్ సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ.. అందరి బాధ్యత
సూర్యాపేట టౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత మహాద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 2వేల మంది విద్యార్థులు, వివిధ వాహనాల డ్రైవర్స్, స్థానిక యువత, ప్రజలతో కలిసి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. స్థానిక 60 ఫీట్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ నల్లాలబావి సెంటర్ మీదుగా ఏవీఎం పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారణకే రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్– అలైవ్ పేరుతో రోడ్డు భద్రత మహోద్యమం ప్రారంభించిందన్నారు. పోలీస్ సేవల్లో వేగం పెంచడంలో భాగంగా రాష్ట్ర డీజీపీ బాధితుల ఇంటివద్దకే పోలీస్, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ అనే ప్రణాళికను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, ఎంవీఐ ఆదిత్య, ఎస్ఐలు, ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు హుజూర్నగర్ : వాహనదారుల నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత మహోద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం హుజూర్నగర్లోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐలు చరమందరాజు, రామారావు, ఎస్ఐ మోహన్బాబు, పాఠశాల చైర్మన్ మర్రెడ్డి, ప్రిన్సిపాల్ రాజారెడ్డి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ ఫ సూర్యాపేటలో అరైవ్–అలైవ్ ర్యాలీ, హుజూర్నగర్లో అవగాహన కార్యక్రమం -
పార్టీల సన్నాహకం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు వేగవంతం చేశాయి. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ మున్సిపాలిటీల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వడబోత చేపట్టగా, బీఆర్ఎస్, బీజేపీ కూడా అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరికొందరు ఆశావహులు టికెట్లపై హామీల కోసం ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కసరత్తు వేగవంతం సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీశ్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్.. మాజీ మంత్రి దామోదర్రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వర్రావు సమావేశాలు నిర్వహించారు. గెలిచే అభ్యర్థుల కోసం వార్డుల వారీగా సర్వే చేయిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని సీపీఎం ప్రకటించింది. భారీగా దరఖాస్తులు కోదాడలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. 35 వార్డులకు 350 మంది దరఖాస్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మూడు వార్డులకు ఒక సమావేశం చొప్పున నిర్వహించింది. హుజూర్నగర్, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తిరుమలగిరి, మోత్కూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ఆయా పార్టీల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫ మున్సిపాలిటీల వారీగా సమావేశాల నిర్వహణ ఫ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఫ అవసరమైన చోట సర్వేలు, వాటి ఆధారంగానే టికెట్లు ఫ ఎన్నికలకు సిద్ధమైన పార్టీలు -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయని, విద్యార్థులు వాటికి అనుగుణంగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించాలన్నారు. రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇంగ్లిష్ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. రీసెంట్ టెక్నాలజీస్ గురించి అవగాహనా పెంచుకోవాలని, విద్యార్థులు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. టీచర్స్ కూడా రీసెంట్ టెక్నాలజీపై ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు ముత్యాల, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలి అనంతరం కళాశాల బయట రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. నేటి యువత చదువుతోపాటు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, మరో పదేళ్లలో ఇంకా మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు, యువత ముందుకెళ్లాలన్నారు. మనదేశానికి నేనేం చేయాలనే ఆలోచన చేసి స్పేస్ లాలో ఒక చట్టం కావాలని చెప్పి స్పేస్ లా చట్టం తీసుకొచ్చి పార్లమెంట్కు ఇచ్చానన్నారు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తుందని, మన దేశ అతిపెద్ద సంపద యూత్ అన్నారు. డిగ్రీతో పాటు నాలెడ్జ్ ఉంటే విద్యార్థి ఎక్కడైనా రాణించగలుతాడన్నారు. అనేక రంగాలల్లో ఉద్యోగవకాశాలు ఉన్నాయనిన్నారు. టీజీసీహెచ్ఈ వెబ్సైట్లో మొదటి సారి విద్యను కేవలం సిలబస్గా మార్చడం కాకుండా లెర్నింగ్ మెటీరియల్ను తయారు చేసి పెట్టామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వాటిని వెబ్సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి -
విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం
డిండి : డిండి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఏపీలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఏపీలోని రాజమండ్రి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్కు గాయాలయ్యాయి. వివరాలు.. డిండి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 110 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఈ నెల 17న రెండు బస్సుల్లో విహారయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. అక్కడ అరకు, బొర్రా గుహలు, వైజాగ్ బీచ్తో పాటు సింహచలం, అన్నవర పుణ్యక్షేతాలను దర్శించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైపు వస్తుండగా.. దివాన్ చెరువు సమీపంలోకి రాగానే బాలురతో వస్తున్న బస్సుకు ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాని వెనుకనే వస్తున్న రెండు ట్రావెల్స్ బస్సులు, బాలికల బస్సు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. దీంతో బాలికల బస్సులో ఉన్న దాదాపు 20 మంది విద్యార్థినులకు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ నారాయణరెడ్డికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను దివాన్చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. నల్లగొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు.. రాత్రంతా దివాన్ చెరువు సమీపంలోని బాలవికాస్ మందిరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకున్నారు. వీరు వెళ్లిన రెండు బస్సుల్లో ఒకటి ధ్వంసం కాగా.. ఇంకొక బస్సుతో పాటు మరో బస్సును మాట్లాడుకొని బుధవారం ఉదయం డిండికి బయల్దేరారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు 24 మంది విద్యార్థులను నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో డీఈఓ భిక్షపతికి అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహారావు నేత చెప్పారు. దేవరకొండ ఎమ్మెల్యే పరామర్శ విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, డీఈఓ భిక్షపతి ప్రిన్సిపాల్తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరాతీసి ఆందోళనకు గురైన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు ధైర్యం చెప్పారు.బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలుర బస్సు, 11.15 గంటలకు బా లికల బస్సు డిండి ఆదర్శ పాఠశాలకు చేరుకోగా.. వారిని చూసి తల్లిదండ్రులు రోదించారు. తమ పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు ప్రైవేట్ బస్సులు ఫ డిండి ఆదర్శ పాఠశాలకు చెందిన 20మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్కు గాయాలు ఫ ఏపీలోని రాజమండ్రి వద్ద ఘటన ఫ డిండికి తిరిగి వచ్చిన విద్యార్థులు -
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
వలిగొండ : మండలంలోని రెడ్లరేపాక గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. రెడ్లరేపాకకు చెందిన పంతంగి వెంకటేశం అతని కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసి అమ్ముతున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసి రూ.61,473 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని..ఫ తండ్రికి కోర్టు నోటీసు పంపిన కొడుకు నడిగూడెం : ఇల్లు ఖాళీ చేయాలని తండ్రికి కొడుకు కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. ఈ సంఘటన నడిగూడెం మండలం చాకిరాలలో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన గుంజ లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఎంతో కష్టపడి తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లును చదివించి ప్రయోజకుడిని చేశాడు. లక్ష్మయ్య చిన్న కుమారుడు రాంబాబు కులాంతర వివాహం చేసుకున్నాడు. లక్ష్మయ్య ఇంటిని 2025లో రాంబాబు తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన వెంకటేశ్వర్లు.. లక్ష్మయ్య ఉంటున్న ఇల్లును ఖాళీ చేయాలంటూ కోర్టు ద్వారా నోటీసు పంపించాడు. గత ఏడాదిగా తన ఆరోగ్యం బాగోలేదని, తనను చిన్న కుమారుడు రాంబాబు పోషిస్తున్నాడని లక్ష్మయ్య తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
తల్లిదండ్రుల మృతితో అనాథలుగా బాలికలు
యాదగిరిగుట్ట రూరల్ : గతంలో తండ్రి, ఇప్పడు తల్లి మృతిచెందడంతో యాదగిరిగుట్ట మండలంలోని చిన్న గౌరాయపల్లి గ్రామంలో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరాయపల్లి గ్రామానికి చెందిన గుజ్జ రాధ (30), రాజుకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాజు అంధుడు కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె సంకీర్తన 7వ తరగతి, చిన్న కుమార్తె వర్షిణి 5వ తరగతి చదువుతోంది. రాజుకు వచ్చే పెన్షన్తో పాటు, రాధ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. మూడేళ్ల రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి రాధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆరోగ్యం బాగోలేక రాధ కూడా బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. రాజుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం, రాధ తల్లి వృద్ధురాలు కావడంతో పిల్లల జీవతం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిరుపేద కుటుంబం కావడంతో రాధ అంత్యక్రియలను గ్రామస్తులు తలా ఓ చేయి వేసి జరిపించారు. చిన్న కుమార్తె వర్షిణి తలకొరివి పెట్టింది. అనాథలుగా మారిన చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
దళితుడిని చంపిన వారిని కాపాడడం దారుణం
కోదాడ: అకారణంగా దళిత యువకుడు కర్ల రాజేష్ను పొట్టన పెట్టుకున్న వారిని కాపాడాలనుకోవడం దారుణమని, గడిచిన 55 రోజులుగా తాము శాంతియుతంగా ఽనిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి కనీసం స్పందించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారణమైన కేసులో ఏ–1గా చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి, ఏ–2గా కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగం ఉన్నారని.. కానీ సీఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేసిన అధికారులు ఎస్ఐ సురేష్రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు కాబట్టే చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో సూర్యాపేట ఎస్పీ నరసింహను ఏ–4గా, అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డిని ఏ–3గా చేర్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అఖిలపక్ష నాయకులు కర్ల రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మేకల శ్రీనివాసరావు, ములకలపల్లి రాములు, ముత్యాలు, వంగవేటి శ్రీనివాసరావు, ఓరుగంటి ప్రభాకర్, ఎస్కే రఫీ, సంజీవ్నాయక్, మామిడి అంజయ్య, గోపాల్ యాదవ్, కాంపాటి వీరస్వామి, గొడ్డలి నరసయ్య, వక్కంతుల నరసింహారావు, ఉదయగిరి, పిట్టల బాగ్యమ్మ, యలమర్తి రాము, ఆంజనేయులు, సత్యరాజు, వెంకట్రావ్, శ్రీను, గోపి, నాగరాజు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
నేటి నుంచి జాన్పహాడ్ దర్గా ఉర్సు
పాలకవీడు: మతసామరస్యానికి ప్రతీకై న పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు గురువారం ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు వక్ఫ్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శించుకుని అనంతరం సమీపంలోని నాగుల పుట్ట వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సూర్యోదయానికి ముందే గుసుల్.. గురువారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే గుసుల్ కార్యక్రమంతో ఉర్సు ప్రారంభంకానుంది. ముజావర్ జానీ ఇంటి నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని బాబా సమాధులపై సమర్పించి నూతన చాదర్, దట్టీలు, రకరకాల పూలతో బాబాను అలంకరిస్తారు. బాబా సమాధుల వద్ద ఖవ్వాలీ, డప్పు వాయిద్యాల నడుమ ఉల్సా ఈ సిరత్ అల్లా నమాజ్ నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రేపు గంధోత్సవం.. ఈ ఉర్సులో ప్రధాన ఘట్టం శుక్రవారం పవిత్ర గంధోత్సవం. వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నడుమ తయారుచేసిన పవిత్ర గంధాన్ని దర్గా పూజారి ఇంటికి చేరుస్తారు. ఉదయాన్నే గంధాన్ని దర్గా సమీపంలోని సందల్ఖానాకు తరలించి మతపెద్దల సమక్షంలో ఈద్ జుమా నిర్వహిస్తారు. అనంతరం అశ్వంపై జాన్పహాడ్, కల్మేట్తండా, చెరువుతండా గ్రామాల పుర వీధుల్లో గంధాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత గంధాన్ని సైదులు బాబా సమాధులపై సమర్పిస్తారు. గంధం ఊరేగింపు కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతున్నట్లు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ తెలిపారు. దీపారాధనతో ఉత్సవాలకు ముగింపు శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధ కార్యక్రమం నిర్వహించి ఉర్సు ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఫ గంధోత్సవానికి హాజరుకారున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో రికార్డు అసిస్టెంట్ మృతి
మద్దిరాల : మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి మృతిచెందాడు. బుధవారం స్థానిక ఎస్ఐ ఎం. వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న మచ్కురి రాజేష్( 22) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారి మీదుగా కుంటపల్లి నుంచి మద్దిరాల వైపు వస్తుండగా.. మద్దిరాల శివారులో ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ ఎడమ కాలుకు, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రాజేష్ భౌతికకాయానికి ఆర్డీఓ వేణుమాధవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబానికి రూ.30వేల ఆర్థికసాయం అందజేశారు. -
విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలి
నల్లగొండ టూటౌన్: డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు హాజరు 75శాతం ఉండేలా ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ -
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెలకు వద్దకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. గుండెపోటుతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. వివరాలు.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన చీర్క నర్సిరెడ్డి(65)కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కుమారుడు గతంలోనే మృతిచెందగా.. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నర్సిరెడ్డి ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. నర్సిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలు వస్తుండడంతో ఆస్పత్రిలో చూపించుకునేందుకు కుమార్తె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం భార్య లక్ష్మమ్మతో కలిసి ఆటోలో చౌటుప్పల్కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆర్టీసీ బస్స్టేషన్లో బస్సు ఎక్కారు. బస్సు బస్టాండ్ నుంచి బయల్దేరి కొద్దిగా ముందుకు వెళ్లగానే తనకు దమ్ము వస్తుందంటూ నర్సిరెడ్డి భార్యకు చెప్పాడు. అంతలోనే సీట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ల ఎదుటే భర్త చనిపోవడంతో నర్సిరెడ్డి భార్య లక్ష్మమ్మ బోరున విలపించింది. ఫ హైదరాబాద్లో కుమార్తె వద్దకు వెళ్తుండగా భార్య కళ్లెదుటే ప్రాణాలొదిలిన వృద్ధుడు -
బంగారం చోరీ కేసులో ముగ్గురు మహిళల అరెస్టు
సూర్యాపేటటౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి మెడలోని బంగారు నల్లపూసల గొలుసును అపహరించిన ముగ్గురు మహిళలను సూర్యాపేట రూరల్ పోలీస్లు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెంతమైన బుచ్చమ్మ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ నెల 19న బుచ్చమ్మ ఇంట్లో ఉండగా.. ముగ్గురు మహిళలు వచ్చి ఆమె మెడలోని బంగారు నల్లపూసల గొలుసును లాక్కోని వెళ్లారు. బాధితురాలి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట మండలం రామ్లతండాకు చెందిన వాంకుడోతు పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ చోరీ చేసినట్లు గుర్తించి వారిని పట్టుకుని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జాన్పహాడ్ ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ఫ్బోర్డు, ప్రభుత్వ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్పీ రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన దర్గా వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. 60 మంది కార్మికులతో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు. మిర్యాలగూడ, కోదాడ ఆర్టీసీ డిపోల నుంచి 18 బస్సులను దర్గాకు నడుపుతున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు పేర్కొన్నారు. దర్గా పరిసరాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతామని వైద్యారోగ్యశాఖ అధికారి నాగిని వివరించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సీలు, 27మంది ఎస్ఐలు, రోప్పార్టీ బలాలు, మొత్తం 450 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు, ఎస్ఐ కోటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హాస్టల్కు వెళ్లడం ఇష్టంలేక..
ఫ ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య డిండి : సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన 10వ తరగతి విద్యార్థి తిరిగి హాస్టల్కు వెళ్లడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలోని కామేపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామానికి చెందిన జఠమోని ఆంజనేయులు, విజయ దంపతుల కుమారుడు శివ(14) హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగకు కామేపల్లికి వచ్చిన శివ తిరిగి హాస్టల్కు వెళ్లడానికి నిరాకరించడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శివ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంజాయి పట్టివేతఫ ఐదుగురిపై కేసు నమోదు నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలో గంజాయి పంచుకుంటున్న ఐదుగురిని బుధవారం స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఇంజమూరి యశ్వంత్, ఇంజమూరి సాయివర్మ, మచ్చ పవన్, కొల్లోజు రోహిత్, ఒగ్గు నాగరాజు ముఠాగా ఏర్పడి ఈ నెల 18న రెండు కేజీల గంజాయిని రూ.20వేలకు బిహార్ రాష్ట్రానికి చెందిన హుస్సేన్ వద్ద కొనుగోలు చేశారు. ఆ గంజాయిని నేరేడుచర్లలోని హుజూర్నగర్ రోడ్డులో గల పాత అట్టాల ఫ్యాక్టరీ వద్ద అందరూ కలిసి పంచుకుంటుండగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి గంజాయితో పాటు ఐదు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సాఫ్ట్ బాల్ పోటీలకు పరిశీలకుడిగా వీరేశంబొమ్మలరామారం: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో బాలుర విభాగం పరిశీలకుడిగా బొమ్మలరామారం మండలం జలాల్పూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆర్.వీరేశం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఉషారాణి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లాలోని కుమ్మరపల్లి జెడ్పీహెచ్ఎస్లో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలబాలికల విభాగాల్లో 69వ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. వీరేశానికి సాఫ్ట్బాల్ క్రీడలో 15 ఏళ్ల అనుభవం ఉంది. జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టుకు కోచ్గా సేవలందించారు. వీరేశం నియమాకంపై జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ కందాడి దశరథరెడ్డి, టీజీ పేటా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు మల్లేశం, పేటా టీఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, పాఠశాల హెచ్ఎం రాజు, ఉపాధ్యాయురాలు శ్రీలత హర్షం వ్యక్తం చేశారు. -
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
సూర్యాపేట టౌన్ : ఉపాధ్యాయులు శిక్షణ ద్వారా నూతన సాంకేతికత నైపుణ్యం పెంపొందించుకుని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎంపవరింగ్ కేజీబీవీ వార్డెన్స్ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభత్వ రెసిడెన్షియల్ స్కూల్స్.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, నోడల్ ఆఫీసర్ పూలన్, మాస్టర్ ట్రైనర్స్ నిర్మల జ్యోతి, తవిటి నాయుడు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలు పక్కాగా పరిష్కరించాలి భానుపురి (సూర్యాపేట) : లైసైన్స్డ్ సర్వేయర్లు భూ సమస్యలను పక్కాగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గ్రామాల్లో భూమి కొలతల సమస్య తీర్చేందుకు రాత పరీక్ష ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన మొదటి బ్యాచ్ లైసెన్స్డ్ సర్వేయర్ల 45 రోజుల శిక్షణకాలం పూర్తయిన సందర్భంగా బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లు నూతన నైపుణ్యంతో భూభారతి, ధరణి, ఎల్ఆర్పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలన్నారు. తహసీల్దార్లు, జీపీఓల సహాయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన
విహారయాత్రకు వెళ్లొస్తుండగా.. డిండి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఏపీలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నేటి నుంచి జాన్పహాడ్ ఉర్సు జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు గురువారం ప్రారంభంకానుంది. మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.- 8లోహుజూర్నగర్, మఠంపల్లి : హుజూర్నగర్ నియోజకవర్గంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట నుంచి గవర్నర్ దంపతులు హెలికాప్టర్లో బయలుదేరి 11.45 గంటలకు మఠంపల్లి మండలం మట్టపల్లి చేరుకుంటారు. అక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు హుజూర్నగర్ చేరుకుని మగ్దూంనగర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు, కోదాడలో నిర్మించే జవహర్ నవోదయ విద్యాలయం శిలాఫలకాన్ని గవర్నర్ ఇక్కడే ఆవిష్కరించనున్నారు. అనంతరం 1.35 గంటలకు మఠంపల్లి మండలంలోని ఎన్సీఎల్ గెస్ట్హౌజ్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2.40 గంటలకు మట్టపల్లి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : కలెక్టర్ మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వివిధ శాఖల అదికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి మట్టపల్లిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గవర్నర్ కేవలం కొద్ది నిమిషాల పాటే ఆలయంలో గడుపుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, వేణుమాదవ్, తహసీల్దార్ మంగా రాథోడ్, ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు, ఆలయ ఈఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఫ మట్టపల్లి క్షేత్రంలో పూజలు చేయనున్న గవర్నర్ దంపతులు ఫ హుజూర్నగర్లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శుంకుస్థాపన ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
ఇంటి వదే్ద ఎఫ్ఐఆర్
సూర్యాపేట టౌన్ : ప్రజలకు ఏరకమైనా ఇబ్బందులు ఎదురైనా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వినూత్నంగా ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) నమోదు కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టింది. ఫోన్ చేస్తే చాలు బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో అమల్లోకి తీసుకొచ్చారు. తొలి ఫిర్యాదు తెల్లబెల్లి నుంచి.. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన భూమా రమాదేవి అనే దివ్యాంగురాలు తన భర్త కొడుతున్నాడని డయల్ 100కు ఫోన్ చేసి తొలి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితురాలికి అందించారు. ఈ విధానం వల్ల జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఫిర్యాదు చేయొచ్చు.. పోలీస్ శాఖ అమలు చేస్తున్న కొత్త విధానంతో పోలీస్ స్టేషన్కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న బాధితులు ఇక నుంచి ఇంటి వద్ద నుంచే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి బాధితులకు భరోసా కల్పించనున్నారు. ఈ కొత్త విధానం శారీరక దాడులు గురయ్యే వారికి, ఎస్టీ, ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు ఎంతో సహాయపడనుంది. దీని ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ చేసి చెప్పినా చాలు.. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు ఫోన్ కాల్, ఆన్లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారు. దీంతో శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, మైనర్ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఉపయుక్తంగా మారనుంది. ఫ ఫోన్ చేస్తే చాలు బాధితుల ఇంటికే పోలీసులు ఫ డీజీపీ ఆదేశాలతో కార్యాచరణ ఫ ప్రారంభం రోజే తొలి ఫిర్యాదు చేసిన తెల్లబెల్లికి చెందిన దివ్యాంగురాలు ఫ సమాచారంతో బాధితురాలి ఇంటికి వెళ్లి కేసు నమోదు ఫ సత్వర న్యాయం అందించేందుకు కొత్త విధానం అమలులోకి.. పోలీస్ శాఖ తీసుకొచ్చిన కొత్త విధానంతో బాధితులు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసి భరోసా కల్పిస్తారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పోలీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – నరసింహ, జిల్లా ఎస్పీ -
ఆ ముగ్గరూ పోటీకి దూరం
కోదాడ : కోదాడ మున్సిపాలిటీకి చైర్పర్సన్లుగా పని చేసిన ముగ్గురు మహిళా నేతలు ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ ప్రకటించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వంటిపులి అనిత, 2019లో బీఆర్ఎస్ నుంచి వనపర్తి శిరీష చైర్పర్సన్లుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో చైర్పర్సన్గా ఎన్నికై న సామినేని ప్రమీల కూడా ఈ సారి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి చైర్పర్సన్ అభ్యర్థులుగా కొత్తవారి పేర్లు వినవస్తున్నాయి. తెరపైకి కొత్తవారి పేర్లుకోదాడ మున్సిపాలిటీకి చైర్పర్సన్లుగా పని చేసిన వంటిపులి అనిత, వనపర్తి శిరీష తమ పదవీకాలం ముగిసిన తర్వాత హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఒక సంవత్సరం పాటు చైర్పర్సన్గా పని చేసిన సామినేని ప్రమీల వార్డు ప్రస్తుతం ఎస్టీకి రిజర్వుకావడంతో ఆమె పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్పర్సన్ రేస్లో నలుగురు కొత్తవారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వారు తమను ముందుగా చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తేనే పోటీలో ఉంటామని చెబుతున్నట్లు సమాచారం. పార్టీ పెద్దలు మాత్రం ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. ముందుగా ప్రకటించాలని కండీషన్కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో పలువురు నేతలు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 12వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్, 14వ వార్డు నయానగర్కు చెందిన నాయకురాలితో పాటు ఇద్దరు కోదాడ మాజీ సర్పంచ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో 12వ వార్డు కౌన్సిలర్కు మాత్రమే వార్డు రిజర్వేషన్ కలిసి వచ్చింది. మిగతా వారు తమకు అనుకూల వార్డు కోసం వెతుకులాట సాగిస్తున్నారు. అయితే ఇతర వార్డుకు వెళ్లి పోటీ చేసి గెలువడం అంత సులభం కాదు కాబట్టి చైర్పర్సన్ అభ్యర్థిగా తమ పేరును ముందుగా ప్రకటిస్తేనే ముందుకు వెళతామని వారు చెబుతున్నట్లు సమాచారం. గెలిచిన తరువాతే అంటున్న బీఆర్ఎస్బీఆర్ఎస్లోనూ ఆశావహులు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాతే చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మూడు రోజులుగా వార్డుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 35 వార్డులలో పోటీలో ఉంటామని, ఇప్పటికే 20 వార్డుల అభ్యర్థుల పేర్లు ఖాయమైనట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికారపార్టీ నుంచి టికెట్ రాక తమ వైపు వచ్చే బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సారీ పోటీ చేయబోమని మాజీ చైర్పర్సన్ల ప్రకటన తెరపైకి కొత్తవారి పేర్లు ముందస్తుగా హామీ ఇస్తేనే పోటీ చేస్తా మంటున్న నేతలు -
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
సూర్యాపేటటౌన్ : రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృ త అవగాహన కల్పించాలని, అరైవ్– అలైవ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. కేసు దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేరారు. నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలని, ఫిర్యాదులపై త్వరగా స్పందించి ఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పకడ్బందీగా చేపట్టాలని, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని సూచించారు. పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి కోర్టులతో సమన్వయం చేసుకుంటూ నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులు, ప్రజలను రోడ్డు భద్రతపై అప్రమత్తం చేయాలని సూచించారు. నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలు, వ్యాపారులను ప్రోత్సహించాలని ఆదేశించారు. సమావేశంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీ ఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
ప్రపంచానికే ఆదర్శంగా యంగ్ ఇండియా విద్యాసంస్థలు
గరిడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రపంచానికే ఆదర్శంగా నిలువనున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. రూ.200కోట్లతో చేపట్టిన పాఠశాల భవనాన్ని ఈ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 5.36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2500 మంది విద్యార్థులకు విద్య, వసతి అందించేలా అన్ని హంగులతో పాఠశాల, హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్ ఒకే చోట ఉండేలా భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంగ్లిష్ మీడియంతో పాటు సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్య మౌళిక సదుపాయాల కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 79 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, పాఠశాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐ చరమందరాజు, తహసీల్దార్ స్రవంతి, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్గౌడ్, నాయకులు, సర్పంచులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ఫిబ్రవరి 5న కలెక్టరేట్ ముట్టడి
సూర్యాపేట : దళిత యువకుడు రాజేశ్ లాకప్ డెత్కు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజుమాదిగ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ల రాజేశ్ లాకప్ డెత్కు నిరసనగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా రేపు కోదాడలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న అన్ని మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న మండల కేంద్రాల్లో మానవహారాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్ల రాజేశ్ లాకప్ డెత్ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షుడు వినయ్ బాబు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాజన్న, నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, కొమ్ము శేఖర్, ఎర్ర వీరస్వామి, బొజ్జ సైదులు, వెంకన్న, చింత సతీశ్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కళాశాలకు భూమి అప్పగింత
హుజూర్నగర్ : హుజూర్నగర్లో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు అవసరమైన భూమిని మంగళవారం తహసీల్దార్ బి.కవిత వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బి.అనిల్కుమార్కు అప్పగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలకు మొత్తం 100 ఎకరాలు అవసరమై ఉండగా ప్రస్తుతం 97.24 ఎకరాలు స్వాధీనం చేసినట్లు తెలిపారు. మిగిలిన భూమిని త్వరలోనే జిల్లా కలెక్టర్ అందిస్తారని పేర్కొన్నారు. లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవల్లీదళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. లౌకిక పార్టీలతో కలిసి ముందుకెళతాంసూర్యాపేట అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే లౌకిక వాద పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో సీపీఎం పోటీ చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వారిని గెలిపిస్తే వారు ప్రజా సమస్యలపై గళమెత్తి వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్సూర్యాపేటటౌన్ : ఈ నెల 21, 22 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 8,500 మంది, ద్వితీయ సంవత్సరంలో 7,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తం 20 మార్కులకు గానూ కనీసం ఏడు మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్కు తప్పని సరిగా హాజరు కావాలని, లేకపోతే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ తెలిపారు. గడువు పొడిగింపుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం ఎస్సీ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గానూ 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశానికి విద్యారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.


