మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, పంచామృభిషేకం చేపట్టారు. నిత్య కల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల సంవాదం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ జరిపించి, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఈఓ చలపతి రావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


