ప్రభుత్వం కోట్ల రూపాయతో మార్కెట్ నిర్మించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్డుపైనే బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ నిరుపయోగంగా మారగా మున్సిపల్ అధికారులు దానికి తాళం వేశారు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ఎక్కువైన సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత మార్కెట్లో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలకు అవసరమైన సదుపాయాలను కల్పించి వ్యాపారులను అక్కడికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.


