అర్వపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తయినట్లు అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ వెల్లడించారు. మంగళవారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో సర్ ప్రక్రియపై న్విహించిన పునఃపరిశీలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ పునఃపరిశీలన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ సమ్మెట అశ్వని, గిర్ధావర్ వెంకట్రెడ్డి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పెరుమాళ్ల ప్రసన్న, మల్లేశ్వరి, జీపీఓలు అజయ్, షరీఫ్, బీఎల్ఓలు పాల్గొన్నారు.


