దేశంలో ఆధునిక గణాంక వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ అని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం భారతదేశ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ ప్రసాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకొని 20వ జాతీయ గణాంక దినోత్సవం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీ మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.ప్రేమరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్.కిషన్, డీటీడబ్లూఓ శంకర్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, గణాంక అధికారులు పి.రమేష్, వి.రామారావు, ఉపగణాంక అధికారులు రాజేష్, కోటేశ్వరరావు, నరేందర్, లింగయ్య, అశోక్, పర్యవేక్షకులు దున్న శ్యామ్, మండల ప్రణాళికా, గణాంక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


