సూర్యాపేట (చివ్వెంల) : మండలంలోని ఐలాపురం గ్రామ శివారులో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం ఆర్అండ్బీ అధికారులు, బిల్డింగ్ డిజైనింగ్, ప్లానింగ్ ప్రైవేట్ కన్సల్టెన్సీ సభ్యులు, న్యాయవాదులు సందర్శించారు. స్థలాన్ని పరిశీలించి భవన డిజైన్పై చర్చించారు. సందర్శించిన వారిలో ఆర్అండ్బీ ఏఈ యుగంధర్, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సెన్, కోర్టు నాజర్ సంజయ్, న్యాయవాదులు ఉన్నారు.


