శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చూపింది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాక్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్లో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు.
అసలేం జరిగిందంటే?
ఉరి సెక్టార్లోని బుచ్చార్ ప్రాంతం గుండా ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం, మార్చి 14-15 మధ్య రాత్రి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో పొదల్లో నక్కిన ఉగ్రవాదుల కదలికలను గమనించిన జవాన్లు వారిని హెచ్చరించారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఏకే రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
#𝗪𝗵𝗶𝘁𝗲𝗞𝗻𝗶𝗴𝗵𝘁𝗖𝗼𝗿𝗽𝘀 | #𝗢𝗽𝗦𝗛𝗘𝗥𝗜𝗞𝗔𝗟𝗔𝗡 | #𝗦𝘂𝗽𝗿𝗲𝗺𝗲𝗦𝗮𝗰𝗿𝗶𝗳𝗶𝗰𝗲
While operating in the challenging and rugged terrain during prolonged operations in the general area of Poonch, as part of Operation Sheri Kalan, today at about 2.30 pm, Subedar… pic.twitter.com/qG2fPiBhro— White Knight Corps (@Whiteknight_IA) March 14, 2026
విధి నిర్వహణలో జేసీవో వీరమరణం
మరోవైపు పూంచ్ జిల్లాలో చేపట్టిన ‘ఆపరేషన్ షేరీ కలాన్’లో ఒక విషాదం చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ సందీప్ కుమార్ ధాకా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. వెంటనే ఆయనను పోతాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ ధీర జవానుకు వైట్ నైట్ కోర్ప్స్ ఘన నివాళులు అర్పించింది.
ఇది కూడా చదవండి: ‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’


