ఖోఖో సంబురం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటి తెలంగాణకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో కోచ్లు పాల్గొన్నారు.


