హుజూర్నగర్ : మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ తదితర అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్ ఎస్.రాధాదుర్గా అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరగాలన్నారు. మహిళల పట్ల అక్కడక్కడ చూపుతున్న వివక్షను రూపుమాపాలని కోరారు. మహిళల సాధికారతకు పురుషులు సహకరించాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే వివక్ష రూపుమాపబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత మహిళా పెన్షనర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. నకార విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహిళా పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మహిళా పెన్షనర్లు ఎస్.లలిత, టి.విజయ మేరీ, చెన్న సౌభాగ్య, ఏ.సుధారాణి, బి.రామలక్ష్మి, థెరిసా, శ్రీలత, అంకతి అప్పయ్య, రఘునాథ్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, ఎంఎస్ఎన్ రాజు, సైదులు, లక్ష్మయ్య, చంద్రయ్య, దేవదానం పాల్గొన్నారు.


