పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో శనివారం సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలలో జన్మించిన భువనగిరి లక్ష్మమ్మ, గుంపుల విజయతో కేక్ కట్ చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం నేరేడుచర్ల అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. హెల్త్కార్డులు లేని వారికి ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సి న గ్రాట్యూటీ, ఏరియర్స్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, సత్యనారాయణ, వీరభద్రారావు, వెంకటేశ్వర్లు, బుద్దారెడ్డి, సుందరయ్య, వీరారెడ్డి, మంగ్య, శ్రీరామ్రెడ్డి, జయసుందర్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


