సూర్యాపేట : తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రముఖులకు అందించే ధర్మనిధి సాహితీ పురస్కారానికి సూర్యాపేట జిల్లాకు చెందిన కవి, రచయిత, సాంస్కృతిక కార్యకర్త పెద్దిరెడ్డి గణేష్ను ఎంపిక చేసింది. తెలంగాణ సాంస్కతిక వైభవానికి పాటుపడిన ప్రముఖుల పేరు మీద ఇచ్చే ఈ అవార్డును బూర్గుల రంగనాథరావు పేరున పెద్దిరెడ్డి గణేష్కు ఇస్తున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్లో అవార్డును అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


