ట్రాఫిక్ను నియంత్రించాలి..
సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలి
● సమస్యలపై అవగాహన ఉన్నవారికే ఓటు
● ‘సాక్షి’ చర్చా వేదికలో నగర సమస్యలపై ప్రజల ఏకరువు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో నెలకొన్న సమస్యలపై వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఏకరువు పెట్టారు. జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ట్రాఫిక్ను నియంత్రించాలని, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, యూజీడీ ఏర్పాటు చేయాలని, పార్కులను ఆహ్లాదకరంగా ఉంచాలని, ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆటోవాలాల ఆగడాలను అరికట్టాలని ముక్తకంఠంతో కోరారు. వచ్చే ఎన్నికల్లో సమస్యలపై అవగాహనతో పాటు నిజాయితీ, నిబద్ధత ఉన్నవారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ను నియంత్రించాలి..
ట్రాఫిక్ను నియంత్రించాలి..


