breaking news
Kurnool District Latest News
-
మంత్రి టీజీకి రైతుల సమస్యలు పట్టవా?
కర్నూలు (టౌన్): రైతుల సమస్యలను మంత్రి టీజీ భరత్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గానికి మాత్రమే కాదని, జిల్లాకు, రాష్ట్రానికి మంత్రి అన్నారు. కర్నూలు జిల్లా రైతుల సమస్యలపై ఏనాడైనా సమీక్షించడం, పంటల పరిస్థితిని పరిశీలించడం చేయలేదన్నారు. రెండున్నరేళ్లలో కర్నూలు, ఆదోని, కోడుమూరు తప్ప ఎక్కడా పర్యటించలేదన్నారు. కోడుమూరులో మంత్రి టీజీ పర్యటన వివాదాస్పదమైందన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతే మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నా.. ప్రయోజనం లేదన్నారు. ఇప్పటి వరకు ఎల్లెల్సీ, హెచ్చెల్సీలకు నీటి వాటా తీసుకురాలేకపోయారన్నారు. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గోరుకల్లు, ఎస్ఆర్బీసీ, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకువచ్చారా... జీడీపీ నుంచి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ, డోన్ ప్రాంతాలకు తాగునీరు ఇచ్చారా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వెలిగొండకు తరలించి సీమ గోంతు కోస్తారా? ఆయకట్టు లేని వెలిగొండ రిజర్వాయర్కు నీటిని తరలించి రాయలసీమ రైతాంగం గొంతు కోస్తారా అని ఎస్వీ ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. పోలవరంలో 75 టీఎంసీల సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల రూ. 30 వేల కోట్లు నష్టపోతున్నా.. కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబునాయుడుకు, వెన్నుపోటు పార్టీకి చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. గత జూన్ , జూలై నెలలో పంటలు వేసుకోవాలని చెప్పి ఇప్పుడు నీళ్లు లేవని రైతులను నిలువునా ముంచారన్నారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో వ్యవసాయాధికారులతో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి కనీసం సమీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. రైతాంగం కోసం రూ. 3 వేల కోట్లు రిజర్వ్ చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ పోరుబాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో రైతాంగ పరిస్థితుల గురించి మాట్లాడారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, వారికి అండగా నిలవాలని తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. సాగునీరు, తాగునీరు అందించాలని, నష్టపోయిన రైతులు పరిహారం చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. జిల్లాలో రైతుల పరిస్థితులను తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తారన్నారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
భక్తితో కొలిచి.. మురుగులో ముంచి!
పచ్చని పొలాన్ని తలపిస్తున్నా.. ఇది కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న కేసీ కెనాల్. ప్రస్తుతం నీటి ప్రవాహం లేక గుర్రపు డెక్కతో నిండిపోయింది. అడుగడుగునా మురుగు నీరు కేసీ కెనాల్లోకి చేరుతుండటంతో ప్రస్తుతం మురికి కాలువను తలపిస్తోంది. తొమ్మిది రోజుల పాటు భక్తితో కొలిచిన వినాయక నిమజ్జనానికి ఈ మురుగునీటి కాలువ వేదికవుతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కేసీ కెనాల్లోనే నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రకటించినా.. మూడు రోజుల నిమజ్జనోత్సవం చూసి వినాయకుడు కన్నీరు కారుస్తున్నాడు. కాలువలో పడేయడంతో తమ పని అయిపోయిందన్నట్లుగా భక్తులు.. మురుగునీరు నిలిపి నిమజ్జనోత్సవం కానిచ్చామని నాయకులు, అధికారులు.. వెరసి భక్తిభావం మురుగునీరులో మునిగిపోతోంది. కిలోమీటర్ల దూరం పెరిగిపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది. ఇక పైపులు ఏర్పాటు చేసి మురుగునీటిని కేసీ కెనాల్లోకి పారిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. కాలువలో కొద్ది దూరం గోడలు కట్టేసి మురుగునీటిని నిలిపేయడం చూస్తే భక్తుల మనోభావాలను ఏస్థాయిలో గౌరవిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. చివరి రోజు కొద్దిపాటి నీరు విడుదల చేసినా.. గుర్రపుడెక్కను దాటుకొని నీళ్లు రావడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుగుర్రపు డెక్కతో నిండిన కేసీ కెనాల్కేసీ కెనాల్లో పేరుకుపోయిన మురుగు నీరుఅశోక్నగర్ వద్ద కేసీలో కలుస్తున్న మురుగు నీరుకేసీలో అడుగడుగునా ఇలాంటి మురుగు ధారలే -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజురోజుకు నీటీ నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుంచి 861 అడుగులకు చేరుకుంది. దీంతో జాలాధివాసంలో ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి బయల్పడుతుంది. ఆలయ గోపుర భాగం 5 అడుగుల మేర బయటపడింది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువ పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో 5వ రోజు గాయత్రీ దేవి వరుణ జపములు వంటి ప్రత్యేక పూజలు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ నిర్వహించారు. -
వైభవం..నిమజ్జనోత్సవం
శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలుఆదోనిలో శుక్రవారం గణేశ్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తప్పెట్లు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు, డీజే సౌండ్ల మధ్య ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఆదోని పట్టణ వీధులన్నీ గణేశ్ శోభాయాత్రలతో సందడిగా మారాయి. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ రోడ్లపైకి తరలివచ్చి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. – ఆదోని -
ఎర్రకొండలో మట్టి దొంగలు
సంజామల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. రేయింబవళ్లు గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటోంది. కొందరు వ్యక్తులు రామిరెడ్డిపల్లె గ్రామంలో ఎర్రకొండను తవ్వి మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా ఎర్రమట్టి అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎర్రమట్టి అక్రమ తరలింపుపై ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేసినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులకు కమీషన్లు ఇస్తే చాలు అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఎర్రమట్టిని తరలించడానికి అధికారపార్టీ నాయకులకు టిప్పర్కు రూ.300 కమీషన్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రోజుకు 50 ట్రిప్పులుపై గానే ఎర్రమట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా స్థానిక నాయకులు, అధికారులను సంప్రదిస్తే చాలు అక్రమంగా మట్టిని తీసుకెళ్లవచ్చుని బాహాటంగా చర్చ జరుగుతోంది. -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితుగ్గలి: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. జొన్నగిరి వద్ద ఎండిన సజ్జ, కంది పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని, వాటిని తీర్చే మార్గం లేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం చాలా బాధాకరమన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయి గ్రామాల్లో తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పశుగ్రాసం, తాగునీరు కరువై పశుసంపద కబేళాలకు తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కరువు మండలాలు ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులకు రైతుకష్టాలు వినే తీరిక కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మౌనం వీడి కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలను ప్రకటించాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్, మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జగన్నాథరెడ్డి, నారాయణ నాయక్, వైస్ ఎంపీపీలు మల్లికార్జునరెడ్డి, నాగప్ప, లోకనాథరెడ్డి, అమరనాథరెడ్డి, తేరప్ప, గంగాధర, రామాంజి పాల్గొన్నారు. -
ఐపీడీ భవనం పనులు పూర్తి చేయాలి
● మాజీ ఎంపీ బుట్టా రేణుకకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ (ఐపీడీ) భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన ఐపీడీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు–నేడు కింద గత వైఎస్సార్సీపీ భుత్వం చేపట్టిన పనుల్లో దాదాపు 70 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ భవనం పూర్తయితే 600కు పైగా పడకలు, 14 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. నిర్మాణ పనులు పూర్తిగాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులో తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
యువకుడి దుర్మరణం
● రెండు బైక్లను ఢీకొన్న కారు ● ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమంహాలహర్వి: కర్ణాటక సరిహద్దు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో 167వ జాతీయ రహదారిపై చింతకుంట గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మాచనూరు గ్రామానికి చెందిన దళవాయి శివకుమార్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్పై వస్తున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మాచనూరు గ్రామానికి చెందిన మారెన్న, అంబమ్మ దంపతుల పెద్ద కుమారుడు దళవాయి శివకుమార్కు ఐదు నెలల క్రితం రాజేశ్వరితో వివాహమైంది. శివకుమార్ బళ్లారి జిల్లా కారేకల్లు గ్రామంలోని ఫ్యాక్టరీ ఏ–1 కంపెనీలో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. గురువారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తుండగా బళ్లారి నుంచి ఆదోని వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. శివకుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక మరో బైక్పై వస్తున్న బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని పీడీహళ్లి (హగరి) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు శివకుమార్ మృతిచెందడంతో బాధితా కుటుంబ సభ్యులు బోరున లపిస్తున్నారు. -
అధికారులను ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్
● ఏటా వందల టీఎంసీల వరద నీరు సముద్రం పాలవుతోందని ఆందోళన ● రిజర్వాయర్ల నిర్మాణంతోనే నీటి సమస్యకు పరిష్కారమని సూచన ● హుందాగా సాగిన జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్కు 31.99 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ఎలాంటి కేటాయింపులు లేని వెలిగొండకు ఇప్పటి వరకు 4.60 టీఎంసీల నీటిని ఎలా విడుదల చేస్తున్నారని చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం భవనంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాయలసీమ రైతులను ఎండబెట్టి వెలిగొండకు నీటిని ఎలా తరలిస్తారని ఆయన అధికారులను నిలదీశారు. ఉమ్మడి జిల్లాలోని 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయన్నారు. ఈ దిశగా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం నీటి మట్టం దిగువకు వస్తే చెరువులను ఎలా నింపుకోగలమన్నారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, చైర్మన్ పాపిరెడ్డి మధ్య కొద్ది సేపు చర్చ కొనసాగింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని చైర్మన్ గుర్తు చేశారు. రిజర్వాయర్ల నిర్మాణంతోనే నీటి సమస్యకు పరిష్కారం ప్రతి ఏడాది సముద్రం పాలవుతున్న వందల టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రిజర్వాయర్లను నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని.. ఈ అంశాన్ని కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కో రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించుకుంటే సూపర్ ఎల్నినో వంటి విపత్కర పరిస్థితుల్లో సాగు, తాగు నీటికి ఏర్పడే ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. 2020–21 నుంచి 2025–26 సంవత్సరం వరకు 8,100 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎ.సిరి, రాజకుమారి గణియా, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావుయాదవ్, జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరయ్యారు. ‘సుజల’ను ఉపయోగంలోకి తీసుకురండి కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలోని రెండు ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ను కోరారు. కోడుమూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులోనే పది పదహైదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సుజలను ఉపయోగంలోకి తీసుకురావాలని జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి కోరారు. ఎల్నినో నేపథ్యంలో రైతులకు పంటల బీమా పరిహారం అందించేందుకు నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నాం. పశుగ్రాసం సాగుతో పాటు పంటల బీమా, పీఎండీఎస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూలై వరకు వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ముంది. అందుబాటులోని నీటి వనరుల్లో తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గత ఏడాది నష్టపోయిన పంటలకే నేటికీ ఇన్సూరెన్స్ అందలేదు. – జెడ్పీటీసీలు యుగంధర్రెడ్డి, రంగనాథ్గౌడ్ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. రైతులు, కూలీలు వలస పోకుండా ఉపాధి పనులు పెంచాలి. – కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నేను బతికే ఉన్నా. రికార్డుల్లో నేను చనిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారు. ఈ కారణంగా నాలుగు విడతలుగా పీఎం కిసాన్ ఆర్థిక సాయం అందుకోలేకపోయాను. నాకు గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి, ఉల్లి, శనగ పంటలు సాగు చేస్తున్నా. ఎలాగూ నన్ను రికార్డుల్లో చంపేశారు. కనీసం నా భార్యకై నా వితంతు పింఛను ఇప్పించండి. – సమావేశంలో కలెక్టర్ను వేడుకున్న గూడూరు జెడ్పీటీసీ పి.మౌలాలితీర్మానాలు కర్నూలు, నంద్యాల జిల్లాలను తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు జిల్లాలుగా ప్రకటించాలి. తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా వీబీజీ రాంజీ పథకంలో పని దినాలు పెంచాలి. కౌలు రైతులందరికీ అన్నధాత సుఖీభవ పథకాన్ని, పంటల బీమా పథకాన్ని వర్తింపజేసి బ్యాంకులు రుణాలు అందించాలి. తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. శ్రీశైలం ప్రాజెక్టు, గోరుకల్లు తదితర ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీరు అందించే గుండ్రేవుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. -
కొలను భారతి దేవి హుండీ ఆదాయం రూ. 3.76 లక్షలు
కొత్తపల్లి: కొలనుభారతి దేవి క్షేత్ర అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,76,373 వచ్చిందని శ్రీశైలం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు తెలిపారు. గురువారం శివపురం సమీపంలోని కొలనుభారతి క్షేత్ర ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. గత 7 నెలల 15 రోజులకు సంబంధించి హుండీని లెక్కింపు చేశామన్నారు. ఇందులో రూ.3,76,373 ఆదాయం వచ్చిందన్నారు. దీంతో పాటు 300 మిల్ల్లీ గ్రాముల బంగారు, 25 గ్రాముల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారన్నారు. అయితే ఫిబ్రవరిలో హుండీ లెక్కించగా రూ. 2,17,635 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.1,58,738 అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతా లో భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు దేవిక, సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జన వేళ విషాదం ● కేసీలో శవమై కనిపించిన వ్యక్తి పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో బుధవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో ప్రమాదవశాత్తు కేసీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ టోపి చంద్రశేఖర్(55) గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు వెంబడి కేసీ కాలువకు చేరుకున్నాడు. కేసీ కాలువ వద్ద సరైన లైటింగ్ లేకపోవడం వలన ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను చీకట్లోనే కేసీ కాలువలోకి నిమజ్జనం చేశారు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కేసీలోకి పడేసిన వినాయక విగ్రహాలపై తేలియాడుతూ కనిపించిన శవాన్ని భక్తులు కేకలు వేశారు. గణేష్ విగ్రహంపై ఉన్న శవాన్ని బయటకు తీసి చూడగా మృతుడు బోయ టోపి చంద్రశేఖర్గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. విగ్రహాలతో పాటు ప్రమాదవశాత్తు కేసీలో పడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, బంధువులు అనుమానానం వ్యక్తం చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి లైటింగ్ లేదని చీకట్లోనే నిమజ్జన వేడుకలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అయితే చంద్రశేఖర్ మృతికి లైటింగ్ కారణం కాదని, ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రమాదవశాత్తు జారి పడ్డాడని ఎస్ఐ రెండు విధాలుగా చెబుతుండటం విశేషం. రంగాపురంలో యువకుడి హత్య బేతంచెర్ల: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన గంప ఎల్ల రమేష్ (24)ను కుటుంబీకులే దారుణంగా హత్య చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎల్ల రమేష్ మద్యానికి బానిసై ఇంట్లో తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసేవాడు. బుధవారం మద్యం తాగి వచ్చిన రమేష్ తండ్రి లింగన్నను, అన్న శివ నారాయణతో ఘర్షణ పడి దాడి చేశాడు. అతని వేధింపులు తాళలేక తండ్రి, అన్న ఇద్దరూ కలిసి గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో తాడుతో రమేష్ గొంతుకు బిగించి హత్య చేశారని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్నత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నీటి కుంటలో పడి వ్యక్తి మృతి డోన్ టౌన్: మండలంలోని ఓబులాపురం బుధవారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు(40) నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు. గురువారం ఉదయం కుంట వైపు వెళ్లిన వారు నీటిలో తేలాడుతున్న శవాన్ని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లో ముగ్గు వ్యాపారం చేస్తున్న మృతుడు గత మూడు నెలలుగా ఓబులాపురంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఈశ్వరమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామాంజనేయుల మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మృతుడు తిరిగి కుంట వద్దకు ఎందుకు వెళ్లాడని, ఇతర కారణాలు ఉన్నాయా.. ప్రశ్నిస్తున్నారు. -
గురువా.. ఇదేమి బరువు
చదువు కావాలంటే బరువు మోయాల్సిందే అన్నట్టు ఉంది.. హొళగుంద జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి. గురువారం పాఠశాలకు చెందిన కొంత మంది విద్యార్థులు మంచినీటి క్యాన్ను అష్టకష్టాలు పడ్తూ మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అయ్యో.. పాపమన్నారు. పాఠశాలలో ఎవరు పంపించారో తెలియదు గాని.. పాఠశాలకు దాదాపు అర కిలోమీటర్కు పైగా దూరంలో ఉన్న వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు విద్యార్థులు వచ్చారు. అయితే నీటితో నింపిన క్యాన్ను విద్యార్థులు పాఠశాలకు చేర్చేందుకు నానా అవస్థలు పడ్డారు. కొద్దిసేపు మోస్తూ.. దించుతూ అతి కష్టం మీద పాఠశాలకు తీసుకెళ్లారు. ఇది విద్యార్థుల నీళ్లు మోయిస్తారా.. అంటూ తిట్టుకుంటూ విద్యా హక్కు చట్టం అంటే ఇదేనా.. అని ప్రశ్నిస్తున్నారు. – హొళగుంద -
గోనెగండ్ల.. కన్నీటి చెమ్మ!
● నీరు లేక ఎండిన ఏడు చెరువులు ● చెరువుల కింద బీడైన ఆయకట్టు ● పొలాల్లో అడుగంటిన వేలాది బోర్లుగోనెగండ్ల: వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. వాటి చుట్టూ ఉన్న పంట పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయ బోర్లలో చుక్కనీరు రావడం లేదు. గోనెగండ్ల మండలంలో ప్రతి ఇంటా కన్నీటి చెమ్మ కనిపిస్తోంది. మండలంలో ఏడు చెరువులు ఉండగా గంజిహళ్లి ప్రధానమైంది. ఎర్రబాడులో రెండు, ఒంటెడుదిన్నెలో రెండు, చిన్న నేలటూర్లో ఒకటి, కున్నూరులో ఒకటి చొప్పున చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చివరికి మూగజీవాలు తాగేందుకు కూడా నీరు లేకపోయింది. మండలంలో ఉన్న ఏడు చెరువుల కింద రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. గంజిహళ్లి చెరువు కింద 160 ఎకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. నీళ్లు లేక పత్తివేసినా పూర్తిగా ఎండిపోయింది. ఎర్రబాడులో పాత చెరువు, కొత్త చెరువు కింద 200 ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఒంటెడుదిన్నె గ్రామంలో కానాల చెరువు, ఎర్ర చెరువు కింద పంటల సాగే లేదు. కన్నూరు(మాచాపురం) చెరువు కింద 800 ఎకరాలు ఎడారిని తలపిస్తున్నాయి. చెరువుల చుట్టూ ఉన్న దాదాపు 2వేల బోర్లు, బావులు ఎండిపోయాయి. దీంతో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంత వరకు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ఎండిపోయిన పంటలకు, దెబ్బతిన్న పంటలకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా ఊరి చెరువుకు వర్షం నీటితో పాటు హంద్రీ–నీవా నీరు కూడా వస్తుంది. వర్షాలు లేకపోవడంతో వర్షం నీరు రాలేదు. హంద్రీ–నీవా నుంచి నీరు రాక చెరువు ఎండిపోయింది. చెరువు కింద సాగు భూములన్నీ బీళ్లుగా మారాయి. – రాముడు, రైతు, ఎర్రబాడు గ్రామం వర్షాలు రాక, చెరువుల్లో నీరు లేక బోర్లు ఎండిపోతున్నాయి. మా ఊరి చెరువు చుట్టు పక్కల ఉన్న బోర్లు, బావులు అన్నీ అడుగంటిపోయాయి. కొంతమంది అడపదడపా కురిసిన వర్షానికి పత్తి పంటను సాగుచేసుకున్నారు. అవికూడా ఎండిపోయాయి. రైతులకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. – తోలు రాముడు, రైతు, గంజిహళ్లి గ్రామం -
అదనపు కోర్టులతో కేసుల సత్వర పరిష్కారం
ఎమ్మిగనూరు రూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి పి.వాసు అన్నారు. గురువారం పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాలను జిల్లా జడ్జి పి.వాసు, స్థానిక మేజిస్ట్రేట్ పి.హేమ బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వాసు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు కాగా.. ఎమ్మిగనూరు కోర్టుతో పాటు అదనపు కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టును సిద్ధం చేశామన్నారు. రెండవ విడత కింద 11 కోర్టులను ప్రారంభిస్తామన్నారు. పది రోజుల్లో ఎమ్మిగనూరులో రెండు కోర్టులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరితో పాటు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలా వెంకటశేషాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా సైబర్ మోసగాళ్ల అరెస్ట్
కోవెలకుంట్ల: స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయ పరిధిలో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం పట్టణానికి చెందిన కొలుసు శ్రీకాంత్, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాష్నాయుడును సైబర్ నేరస్తులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు, నాలుగు మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షోరాణ్ నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలను వెల్లడించారు. బాధితులు ఇలా మోసపోయారు.. ● సంజామల మండలం కానాలకు చెందిన దన్నాడ మల్లికార్జున సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2024 డిసెంబర్ 2వ తేదీన ఇన్స్ట్రాగామ్లో స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి దానిని ఓపెన్ చేయగా ఆర్యప్రాజెక్ట్ పల్స్ ఎక్స్బీ అనే వాట్సాప్ గ్రూపులో చేరితే స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందవచ్చని సైబర్ మోసగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించారు. ఒక పెట్టుబడి ఖాతాను సృష్టించి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. బాధితుడు రూ. 22.80 లక్షలు పెట్టుబడుల నిమిత్తం ఆయా ఖాతాలకు జమ చేశాడు. తర్వాత అతని పెట్టుబడి ఖాతాలోరూ. 1.44 కోట్లు ఉన్నట్లు తప్పుడు వివరాలు చూపించారు. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే మరో రూ. 25 లక్షలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్క్రైమ్ హెల్ప్లైన్ 1930కి కాల్ చేసి సమాచారమందించాడు. అనంతరం సంజామల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2025 జనవరి నెలలో పోలీసులు కేసు నమోదు చేశారు. ● కోవెలకుంట్ల మండలం రేవనూరుకు చెందిన చరణ్రాజ్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆ ఉద్యోగాన్ని కుమారుడికి ఇవ్వాలంటే ఆర్టీసీ సంస్థ పేరుతో తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించాలని ఆర్టీసీ అధికారులు కోరగా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన కోవెలకుంట్ల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 5.24 లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే సైబర్ నేరగాళ్లు చరణ్రాజ్ వాట్సాప్కు ఏపీకే ఫైల్ పంపించారు. అది ఓపెన్ చేయగానే సెల్ఫోన్ హ్యాక్ కావడంతో నేరగాళ్లు ఆ మొత్తాన్ని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవనూరు స్టేషన్లో కేసు నమోదైంది. రెండు సైబర్ నేరాలను చేధించిన పోలీసులు రూ. 25 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్ల కొరత
● బ్లాక్లో విక్రయాలు ● ప్రజలకు తప్పనితిప్పలు నంద్యాల(అర్బన్): జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల కొరత వేధిస్తోంది. ఇదే అదనుగా మూడు రెట్లు అదనపు ధరలతో కొందరు బ్లాక్లో విక్రయిస్తున్నారు. మరి కొందరు పెద్ద సంఖ్యలో నిల్వచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు నెలలుగా స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఈ నెల 1వ తేదీ నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అరొకరగా వస్తున్న వాటిని తమకు అనుకూలంగా ఉన్నవారికి పెద్ద మొత్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారు బ్లాక్లో కొనుగోలు చేయాల్సివస్తోంది. స్టాంపుల బ్లాక్ మార్కెట్ను అధికారులు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా ధరలు జిల్లాలోని బండిఆత్మకూరు, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, ప్యాపిలి, బగానపల్లె, బేతంచెర్ల, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపులు దొరకకపోవడంతో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో వారు వాటిని కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్లో స్టాంపులు కొనుగోలు చేయాల్సిరావడం భారంగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతతో ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ఇదే పరిస్థితి కొనసాగితే అఫిడవిట్లు, ఒప్పందాలు, లీజుపత్రాలకు స్టాంపులు దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని క్రయవిక్రయ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని స్టాంప్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్రిజిస్టార్ కార్యాలయాలకు త్వరలో సంపూర్ణంగా స్టాంప్లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొరత ఉంది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం. బ్లాక్లో అదనపు ధరలకు స్టాంప్లు విక్రయిస్తే చర్యలు తప్పవు. –అశోక్, జిల్లా రిజిస్ట్రార్, నంద్యాల -
‘స్థానిక’ ఎన్నికలను బ్యాలెట్తోనే నిర్వహించాలి
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డికర్నూలు (టౌన్): కొన్నేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిన నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఈవీఎంలతో గెలవాలనే కుట్రలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కొత్త ఓటర్లను పక్కన పెట్టి స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈవీఎంలతో గెలుస్తామన్న ధీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.? ఈ రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వారిని దగా చేసిందన్నారు. డీఎస్సీలో నిరుద్యోగులను మోసం చేయడంపై మండిపడుతున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే కుట్రలు చేస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. -
‘అనారోగ్య’ మిషన్!
● భర్తీకాని వైద్యుల పోస్టులు ● అరకొరగా ఎంఎల్హెచ్పీలు ● అందని స్టాఫ్నర్సుల సేవలు కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం)లో చాలా వరకు పోస్టులు ఖాళీగా మారాయి. ఫలితంగా ఆయా విభాగాల్లో వైద్యసేవలు అందకపోవడంతో ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను కొన్నేళ్లుగా జాతీయ ఆరోగ్య మిషన్గా మార్చి ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇందులో నియమితులైన వైద్యులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. కొంత కాలంగా ఈ విభాగంలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉన్న వారికి సైతం అరకొరగా జీతాలు వస్తుండటంతో వారు ఇతర అవకాశాలు రాగానే ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఈ కారణంగా ప్రజలు, రోగులు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. స్టాఫ్నర్సు పోస్టులు ఖాళీ జాతీయ ఆరోగ్య మిషన్లో 428 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. ప్రతి క్లినిక్లో ఒక ఎంఎల్హెచ్పీ విధులు నిర్వహిస్తున్నారు. వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ సేవలందిస్తున్నారు. ఈ మేరకు వారికి నెలకు రూ.25వేలు జీతం ఇస్తున్నారు. అయితే గత కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా 33 చోట్ల ఖాళీలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. ఈ కారణంగా వారు వ్యయ ప్రయాసలకు ఓర్చి పక్క గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందుకోవాల్సి వస్తోంది. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీ), ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, ఎన్ఐసీయూ, ఎన్సీడీలలో ఏకంగా 48 స్టాఫ్నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు కొండెక్కాయి. సాధారణంగా చాలా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులతో సమానంగా స్టాఫ్నర్సులు వైద్యసేవలు అందిస్తూ ఉంటారు. పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో గర్భిణులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా తక్కువగా నాల్గవ తరగతి ఉద్యోగులు జిల్లాలో ఐదు సీహెచ్సీలు ఉండగా వాటిలో ఎనిమిది డాక్టర్ల పోస్టులు ఖాళీగా మారడంతో వైద్యసేవలు అంతంత మాత్రంగా రోగులకు అందే పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పలు ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫీల్డ్ ఇన్విస్టిగేటర్, డెంటల్ టెక్నీషియన్, నాల్గవ తరగతి ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు. రోగులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మాస్ మీడియా విభాగంలో లీగల్ కన్సల్టెంట్ పోస్టు సైతం ఖాళీ ఉంది. ఫలితంగా న్యాయ సలహాలు, పరిష్కారాలు ఆలస్యం అవుతున్నాయి. ఉద్యోగులపై పనిభారం జాతీయ ఆరోగ్య మిషన్లో భారీగా ఖాళీలు ఏర్పడటంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది. దీంతో వారు అదనపు పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ కారణంగా వారు నిత్యం పనిలోనే నిమగ్నమై ఉండటంతో త్వరగా దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే చాలా మంది బీపీ, షుగర్, థైరాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారు. తమ జీతాలు పెంచాలని జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేసే ఉద్యోగులు పలు మార్లు ఆందోళనలు చేసినా ఫలితం ఉండటం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనా జీతాలు పెంచమని రాష్ట్రం కోరితే ఆ భారం రాష్ట్ర ఖజానాపై కూడా భారం పడుతుంది. ఎందుకంటే వీరి జీతాలు 60ః40 రేషియోలో ఇస్తారు కాబట్టి కేంద్రం జీతం పెంచితే రాష్ట్రం కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మంచి అవకాశం వస్తే రాజీనామా జాతీయ ఆరోగ్య మిషన్లో వెట్టి చాకిరి చేసే దానికన్నా మంచి అవకాశం వస్తే రాజీనామా చేసేందుకు సైతం కొందరు ఉద్యోగులు వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఖాళీ అయిన ఉద్యోగాలన్నీ ఇలా మంచి అవకాశాలు రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోయినవేనని సహ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్కు రూ.61,960, స్టాఫ్నర్సుకు రూ.27,835, ఎంఎల్హెచ్పీలకు రూ.25వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని కోరినా వినేవారు కరువవడంతో ఇతర రంగాల్లో మంచి అవకాశాలు వస్తే రాజీనామా చేయడానికి చాలా మంది వెనుకాడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
స్కూలు ఆటో చక్రం కింద నలిగి చిన్నారి మృతి
పెద్దకడబూరు: స్కూలు వాహనం చక్రాల కింద నలిగి యస్విత (4) అనే చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన నందవరం మండలం బాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు.. బాపురం గ్రామానికి చెందిన చిన్నరంగన్న, ఉర్మిళ దంపతుల ఒక్కగానొక్క కూతురు యస్విత పెద్దకడబూరు మండలం హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ఉన్న అక్షరభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నర్సరీలో చేరింది. స్కూలు యాజమాన్యం వారు ఆయా గ్రామాల నుంచి పిల్లలను ప్రైవేటు వాహనాలైన టాటా ఏసీ (టెంపో)లలో బడికి తీసుకొచ్చి సాయంత్రం ఇంటికి చేరుస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టెంపోలో పిల్లలను ఎక్కించుకొని బాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారి టెంపో నుంచి దిగి ఇంటికి వెళ్లిపోతుంది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా టెంపోను వెనుకకు పోనివ్వడంతో చిన్నారికి తగిలి కింద పడిపోయింది. పాప తలపై టెంపో టైరు ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటో డ్రైవర్ పాపను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. యస్విత మృతికి కారణమైన స్కూల్ను సీజ్ చేయాలి చిన్నారి యస్విత మృతికి కారణమైన అక్షర భారతి స్కూల్ను సీజ్చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్నాయుడు, పీడీఎస్యూజిల్లా నాయకులు నరసింహారెడ్డి పీడీఎస్ఓ జిల్లా నాయకుడు సురేంద్రబాబు, యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సందీప్ బుధవారం పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థుల రవాణాకు స్కూలు బస్సులను ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ఆటోలను ఏర్పాటు చేసి చిన్నారిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు చర్యలు చేపట్టి పాఠశాలను సీజ్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
గోడలు నిర్మించి నీటిని నిల్వ చేసి నిమజ్జనమా!
● తుంగభద్ర నుంచి నీటిని తెప్పించలేరా? ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): కేసీ కెనాల్లో గోడలు నిర్మించి నీటిని నిల్వ చేసి నిమజ్జనం చేయడం ఏమిటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులోని వినాయకఘాట్ వద్ద కెసీ కెనాల్లో గోడ కట్టిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న నీరు, భారీగా డంప్ అయిన గుర్రపు డెక్కను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లపై మండి పడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు ఉందన్నారు. తుంగభద్ర నుంచి నీటిని తెప్పించకుండా హడావుడి పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు క్షమించరు వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కర్నూలులోని కేసీ కెనాల్ వద్ద లక్షలాది మంది భక్తులు కనిపిస్తారని, తూతూ మంత్రంగా పనులు చేస్తే వారు క్షమించబోరని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. సంస్కృతిని గౌరవిస్తూ వినాయక నిమజ్జనం జురుపుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తుంగభద్ర నుంచి కర్నూలుకు రావాల్సిన 4.4 టీఎంసీల నీటి వాటాను తెప్పించాలన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యే చొరవ తీసుకోవాలన్నారు. కర్నూలు కేసీలో కాకుండా ఉల్లిందకొండ, తడకనపల్లె, నన్నూరు టోల్ ప్లాజా అంటూ చెప్పడం మంత్రి బాధ్యతారాహిత్యమన్నారు. ఇప్పటికయిన మంత్రి, అధికార యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పిల్లల చదువు కోసం అడ్డదారి
అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్టు ● సీసీ ఫుటేజీ ద్వారా కేసులను ఛేదించిన పోలీసులు కర్నూలు: పిల్లల చదువుల దృష్ట్యా తల్లి దొంగగా మారి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నంద్యాల జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన అంతర్ రాష్ట్ర మహిళా దొంగ వాణిశ్రీ అలియాస్ వాణిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ కేవీ రాఘవేంద్ర, సీఐలు శేషయ్య, విక్రమసింహ తదితరులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. మంత్రాలయం ఆరాధనోత్సవాల సందర్భంగా.. పది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఓ మహిళ అనంతపురంలో వివాహ కార్యక్రమానికి హాజరై అనంతరం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి దర్శనం కోసం వెళ్లారు. ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని మహిళ బ్యాగు జిప్ను తెరి చి అందులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు లు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా వాణిశ్రీని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. బస్సుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులకు తెలియకుండా ఆభరణాలు అపహరించిన మరో మూడు చోరీ కేసులు త్రీటౌన్, ఫోర్త్టౌన్, పాణ్యం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం చోరీ కేసుల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు విచారణలో బయ టపడింది. నిందితురాలి వద్ద నుంచి మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకాయపల్లెలో నివాసం 10వ తరగతి వరకు చదువుకున్న వాణిశ్రీ పిల్లల చదువు కోసం కర్నూలు శివారులోని వెంకాయపల్లె వద్ద అద్దె ఇంట్లో నివాసముంటోంది. తరచూ సొంతూరు సిద్ధాపురానికి వెళ్లి వస్తూ బంధువుల సహకారంతో దొంగగా మారింది. ఈమె భర్త గోపి గౌడ్ ప్రస్తుతం వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఈమె తల్లి కూడా నందికొట్కూరు రోడ్డులోని ఓ కాలనీలో సొంతిల్లు నిర్మించుకుని అక్కడే నివాసముంటోంది. ఈమె తమ్ముడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు ఏడో తరగతి, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. భర్త జీతంపై వచ్చే ఆదాయం చాలక దొంగగా మారింది. ఈమైపె ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం యాచారం ప్రాంతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈడిగ రాజేష్, నంద్యాల జిల్లా దొర్నిపాడు గ్రామానికి చెందిన జక్కుల శారదా దేవికి సంబంధించిన నగలు కూడా తస్కరించినట్లు నిందితురాలు అంగీకరించింది. అతి తక్కువ సమయంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించి ఆమె వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినందుకు క్రైం పార్టీ పోలీసులు ఎస్పీ అభినందించారు. -
అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహం
శ్రీశైలంటెంపుల్: సనాతన ధర్మం, హిందూ సమాజం, దేవదాయశాఖ నిబంధనలపై అవగాహన లేని శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారి అనాలోచిత నిర్ణయాలు సాధువులు, సన్యాసులకు శాపంగా మారాయని శ్రీశైలం సాధు భవన్ ట్రస్ట్ విమర్శించింది. ఈ మేరకు బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ శ్రీనివాసరావును ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ, ప్రధాన కార్యదర్శి అరవింద స్వామిజీ, స్థానిక అశ్రమాల పీఠాధిపతులు, నిర్వాహకులు, సాధువులు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి సాధుసంతులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, భిక్షువులు, అవధూతలు, సిద్దులు, గురువులు, అశ్రమ పీఠాధిపతులు శ్రీశైల మహాక్షేత్రానికి అనునిత్యం తరలివస్తుంటారని, వారి వలన క్షేత్రానికి ఎలాంటి నష్టం జరదన్నారు. శ్రీశైలంలో ఉంటున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి 250 కి.మీ దూరంలో వదిలిపెట్టాలని గత నెల 19న ప్రకటించిన నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం తీసుకున్న అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం, శ్రీశైలక్షేత్ర మహిమ గురించి తెలియకుండా ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 23వ తేదీలోపు ఈఓ శ్రీనివాసరావు తగు నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా వెల్లడించాలని లేని పక్షంలో ఈ నెల 23న ట్రస్ట్బోర్డు మీటింగ్ పురస్కరించుకుని ఆంధ్ర–తెలంగాణ సాధు సంతులు, ఆశ్రమాల స్వామిజీలతో కలిసి శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అప్పటికి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకుముందు వీరంతా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది
కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అదనపు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షిపై నమోదైన కేసులో న్యాయపరమైన విచారణ ప్రక్రియకు సంబంధించి బుధవారం ఆయన కోర్టులో వాదనలు సమర్పించారు. విచారణ అనంతరం న్యాయ స్థానం ప్రాంగణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి.స్వాములు, ఇతర న్యాయవాదులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తోందని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై పెట్టిన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు బనాయించినప్పటికీ తమకు న్యాయస్థానాలపైన, రాజ్యాంగంపైన పూర్తి విశ్వాసముందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ఉందని, న్యాయపరంగా పూర్తి అండగా నిలుస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చట్టం ముందే తేల్చుకుంటామని, న్యాయ పోరాటం ద్వారా నిజాలను బయట పెట్టి ఎమ్మెల్యే విరుపాక్షికి న్యాయం జరిగేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పి.సువర్ణ రెడ్డి, న్యాయవాదులు హనుమంతు రెడ్డి, జలందర్, వెంకటేశ్వర రెడ్డి, నరేంద్ర రెడ్డి, జీవన్ సింగ్, స్థానిక న్యాయవాదులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించవా?
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: చేతికందే సమయంలో చెరకు పంట దగ్ధం కావడం.. నీరందక మరోవైపు పంటలు ఎండిపోవడం.. రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించవా? అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంతో కాలిపోయిన కేతవరం మాజీ సర్పంచ్ బోయ గోవర్ధన్ చెరకు తోటను బుధవారం కాటసాని పరిశీలించారు. బాధిత రైతును పరామర్శించారు. మొత్తం ఐదు ఎకరాల్లో రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా విచారించి రైతుకు న్యాయం చేయాలన్నారు. కేతవరం గ్రామానికి చెందిన మరో రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను కాటసాని పరిశీలించారు. ఎండిపోయిన బోర్ల పరిస్థితిపై రైతులతో మాట్లాడారు. నీరందక ఉల్లి పంటలో తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం ఇవ్వాలి రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమగ్ర సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతును గుర్తించాలన్నారు. బాధిత రైతులకు వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ గోవర్ధన్, రైతులు కృష్ణారెడ్డి, ఘనాపురం మద్దిలేటి, బోయ కృష్ణ, గూడూరు శ్రీనివాసులు, అహ్మద్ ఉశేన్, కలాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న ఆచార్యులు మృతి
కౌతాళం: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ అప్పన్న ఆచార్యులు (83) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. కౌతాళంకు చెందిన ఈయన 40 సంవత్సరాల పాటు తిరుమలలో మంత్రాలయం దాస సాహిత్య ప్రాజెక్టులో సేవలందించారు. హరే శ్రీనివాస అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరి నోట పలికేలా చేశారు. హరిదాస సాహిత్యాన్ని ప్రతి ఊరు, జిల్లా దేశ నలుమూలలకు చేర్చిన ఘనత ఈయనది. ఈయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి, కౌతాళం సింగల్ విండో అధ్యక్షుడు వెంకటపతిరాజు, ఉరుకుంద మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ చెన్నబసప్ప పలువురు సంతాపం తెలిపారు. ఎమ్మిగనూరు బీజేపీ నాయకులు గురురాజరావు, ప్రహ్లాదచారి తదితరులు సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
● సీఐ కారులోని మద్యం బాటిళ్లను పోలీసులు తీసేశారంటూ ఆరోపణలు ● దెబ్బతిన్న రెండు వాహనాలు
భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ఎకై ్సజ్ సీఐ కారు గోనెగండ్ల: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్ రెడ్డి నడుపుతున్న కారు కర్ణాటక భక్తులు ప్రయాణిస్తున్న తుపాన్ వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. వివరాలు.. కర్ణాటకలోని సిరుగుప్ప ప్రాంతానికి చెందిన భక్తులు తుపాన్ (ఏకే 36 ఎన్ 5715) వాహనంలో రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం కర్ణాటకకు తిరుగుప్రయాణమయ్యారు. అలాగే ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్ రెడ్డి రాత్రి ఎమ్మిగనూరు నుంచి ఏపీ 39 కేఈ 2647 నంబరుగల కారులో కర్నూలుకు బయలుదేరారు. గోనెగండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే సీఐ ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా తుపాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో సీఐ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తుపాన్ వాహనంలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోనెగండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎకై ్సజ్ సీఐ అతివేగంగా కారు డ్రైవ్ చేస్తూ వచ్చి ఢీకొట్టినట్లు తుపాన్లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. సీఐ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సీఐను గోనెగండ్ల పోలీసులు విచారణ చేసి పంపినట్లు తెలిసింది. సీఐ కారులో కవర్లో ఉన్న మద్యం సీసాలను పోలీసులు వేరే వాహనంలోకి మార్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై గోనెగండ్ల సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. కొవ్వొత్తుల తయారీలో 12 రోజులు, జూట్ బ్యాగుల తయారీలో 14 రోజులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులని, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలని, శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నాలుగు ఫొటోలు, రేషన్కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కర్నూలు శివారు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరా బ్యాంకు– గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్డీఏ–టీటీడీసీ పక్కన)లో సంప్రదించవచ్చన్నారు. అలాగే 08518–273710, 85002 72720, 90007 10508, 94409 05477 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. వైద్య విద్యార్థినుల గదుల వద్దకు ఆగంతకులు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మహిళా హౌస్ సర్జన్ల వసతి గదుల వద్దకు మంగళవారం రాత్రి ఆగంతకు లు రావడంతో కలకలం రేగింది. ఆసుపత్రి లో ని పేయింగ్ బ్లాక్ పై అంతస్తులో ఉన్న హౌస్ సర్జన్ల గది వద్దకు అర్ధరాత్రి దాటాక ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తలుపులు కొట్టారు. తలుపులు తెరిచి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు కనిపించే సరికి వైద్య విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు మీరని ప్రశ్నించగా గతంలో ఇక్కడ క్యాన్సర్ వార్డు ఉంది కదా అందుకే వచ్చామని మద్యం మత్తులోపొంతనలేని సమాధానాలు చెప్పారు. దీనిపై వైద్య విద్యార్థినులు ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వసతి గృహం వద్దకు చేరుకున్న పోలీసులు ఇద్దరు ఆగంతకులను అదుపులోకి తీసుకుని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో ఒకరు న్యాయవాది, మరికరు విలేకరి అని చెప్పినట్లు సమాచారం. వైద్య విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కర్నూలు(సెంట్రల్): నూతన పింఛన్ కోసంవచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 21వ తేదీలోపు పరిశీలన చేసి ఎంపీడీఓ లాగిన్లకు పంపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. అర్హత కలిగిన వాటినే మాత్రమే ఆమోదించాలని, అర్హత లేని వాటని తిరస్కరించాలన్నారు. బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆమె సమీక్షించారు. పింఛన్ల కోసం జిల్లాలో ఇప్పటివరకు 41,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్ల తెలిపారు. పింఛన్ల దరఖాస్తులను 21 నుంచి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు పరిశీలించి నేరుగా సెర్ప్ సీఈఓకు పంపించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో డీఆర్డీఏ పీడీశ్రీధర్ రావు, స్వర్ణ గ్రామ స్వర్ణ అవార్డు జిల్లా అధికారి భాస్కర్ నాయుడు, సోషల్ వెల్ఫేర్ డీడీ రాధిక, హ్యాండ్లూమ్స్ ఏడీ నాగరాజు నాయుడు, మత్స్యశాఖ డీడీ రంగనాథ్ బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు పాల్గొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్లను ఆర్డీఓలు, ఇతర అధికారులు తరచూ తనిఖీ చేయాలన్నారు. ఏప్రిల్ 2026 నుంచి ఇప్పటివరకు 80 వాహనాలను సీజ్ చేసి రూ.18,45,360 జరిమానా విధించినట్లు గనుల శాఖ డీడీనాగిని చెప్పారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, కర్నూలు, ఆదోని, పత్తికొండ ఆర్డీవోలు కె. సందీప్ కుమార్, అరుణ దేవి, ఓబులేసు, డీటీసీ శాంతకుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: బీఈడీ నాల్గో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను https:// rayalseemauniversity.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 430 మంది విద్యార్థులు 526 పేపర్స్కు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 312 మంది 367 పేపర్లలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. -
యువకుడి దుర్మరణం
శ్రీశైలం: మితిమీరిన వేగం ఓ యు వకుడి పాణాన్ని బలిగొంది. వివరా ల్లోకి వెళితే.. శ్రీశైలానికి చెందిన దేశ రమేష్ శంకర్ (19) సోమవారం అర్ధరాత్రి దాటాక 1.42 నిమిషాలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి కమ్మ సత్రం ఎదురుగా తన బైక్ (ఏపీ 40 బీఎల్ 0169)పై అతివేగంగా దూసుకొచ్చి గౌడ సత్రం ఎదురుగా ఉన్న స్టాప్ గేట్ను గుద్దుకొని కింద పడిపోయాడు. అతని గొంతు వద్ద తీవ్ర రక్త గాయం కావడంతో స్థానికులు దేవస్థానం హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు పరీక్షించి అతడు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాజెక్ట్ కాలనీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
స్నేహితుడిని కాపాడబోయి విద్యార్థి మృతి
● ఈత సరదాతో ప్రాణాలమీదకు.. ● కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, బంధువులు జూపాడుబంగ్లా: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురిలో ఒకరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందగా మిగతా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటన మంగళవారం కనకయ్యకొట్టాల గ్రామంలో చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేకల శివలింగేశ్వరుడు, పార్వతి దంపతుల చిన్న కుమారుడు మేకల లింగస్వామి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి గ్రామంలోని వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఉన్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింగస్వామిని స్నేహితులు అదే గ్రామానికి చెందిన శివకృష్ణ, సాయి, జశ్వంత్ లేపి కేసీ కాల్వలో ఈతకు తీసుకెళ్లారు. వీరెవరికీ సక్రమంగా ఈత రాకపోయినప్పటికీ సరదాగా కాల్వలో దిగారు. సాయి కాలుజారి ప్రవాహంలో చిక్కుకోగా అతన్ని రక్షించేందుకు లింగస్వామి (15) కాస్త ముందుకెళ్లటంతో కొట్టుకుపోయాడు.. సాయి ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగాడు. లింగస్వామిని కాపాడేందుకు సాయి, శివకృష్ణ, జశ్వంత్ యత్నించినా ప్రయోజనం లేకపోవటంతో గ్రామస్తులకు విషయం తెలియజేయగా వారు కాల్వ వెంట గాలింపు చేపట్టారు. కాల్వ 114 తూము వద్ద లింగస్వామి మృతదేహం లభ్యమైంది. అతని మృతదేహాన్ని ఇంటికి చేర్చగా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. విషయం తెలుసుకుని హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థి లింగమయ్య పార్థివ దేహాన్ని చూసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
విద్యుదాఘాతంతో హమాలీ మృతి
తుగ్గలి:విద్యుదాఘాతంతో హమా లీ మృతి చెందిన ఘటన మండలంలోని ఉప్పర్లపల్లిలో మంగళవా రం చోటు చేసుకుంది. జొన్నగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎరుకల మురార్జీ కుమారుడు విక్రమ్ (18) రోజూ మాదిరిగానే ట్రాక్టర్ పనికి వెళ్లారు. ట్రాక్టర్లో రాళ్లు లోడ్ చేసుకుని గ్రామంలో ఓ ఇంటి వద్ద అన్లోడ్ చేస్తున్నారు. కొన్ని రాళ్లు కింద పడకపోవడంతో ట్రాక్టర్ ఎక్కి తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి తండ్రి, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందండంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
నవోదయను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంను మంగళవారం ముగ్గురు ట్రైనీ ఐఏఎస్లు ప్రియాంక వధా, భరత్, హుసేన్ సందర్శించారు. విద్యాలయంలో తరగతి గదులు, కిచెన్ గార్డెన్, హాస్టల్ గదులు పరిశీలించి విద్యార్థుల తో మాట్లాడారు. విద్యాబోధన, వసతుల గురి ంచి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ప్రి న్సిపాల్ ఇ.పద్మావతి, అధ్యాపకులు ఉన్నారు. మిర్యాలగూడలో ప్రత్యక్షమైన జేఈ కొలిమిగుండ్ల: విద్యుత్ శాఖలో జేఈగా పనిచేస్తున్న చింత లక్ష్మణస్వామి తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఈ నెల 8వ తేదీ రాత్రి కారు తీసుకొని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. తర్వాత సెల్ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఆందోళన చెందారు. భార్య లీలావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మణస్వామి ఫోన్ ద్వారా సీఐ రమేష్బాబుకు అందుబాటులోకి వచ్చారు. తన వ్యక్తిగత కారణాలతోనే మిర్యాలగూడకు వెళ్లినట్లు వెల్లడించారు. ఎట్టకేలకు ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సాయంతో మిర్యాలగూడ నుంచి కొలిమిగుండ్లకు సాయంత్రానికి చేరుకున్నాడు. బావిలో మృతదేహం లభ్యం బండిఆత్మకూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్ద దేవళాపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం ఆలయం సమీపంలోని బావిలో మృతదేహం తేలియాడుతున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించగా శిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య (56)గా తేలిందన్నారు. పుల్లయ్య రెండు రోజుల క్రితం మద్యం సేవించి మండలంలోని సంతజూటూరు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వారితో పెద్ద దేవళాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఆలయానికి వెళ్లే క్రమంలో బావికి ప్రహరీ లేకపోవడంతో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నల్లమల ఘాట్లో రోడ్డు ప్రమాదంమహానంది: వినాయకచవితి పర్వదినం కావడంతో అహోబిలం ఆలయానికి బైక్పై వెళుతుండగా కారు ఢీకొనడంతో ఇద్దరు భక్తులకు గాయాలైన సంఘటన సోమవారం నల్లమల ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా పొదిలికి చెందిన శ్రీనివాసరావు, మల్లికార్జున బైక్పై నంద్యాల వైపు వస్తున్నారు. సర్వ నరసింహస్వామి సమీపం వద్దకు రాగానే గిద్దలూరు వైపు వెళ్తున్న కారు వారి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పరిధిలోకి రావడంతో శిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కుక్కను తప్పించబోయి వ్యక్తి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో ప్యాలకుర్తి – కొత్తూరు గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్ అదుపుతప్పడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్నూలులోని రోజా వీధికి చెందిన షేక్ దౌలత్బాషా (56) మంత్రాలయంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ కర్నూలుకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం రాత్రి కుటుంబాన్ని చూసుకునేందుకు మంత్రాలయం నుంచి కర్నూలుకు బైక్పై బయలుదేరాడు. ప్యాలకుర్తి –కొత్తూరు గ్రామాల మధ్య రోడ్డుపై కుక్క అకస్మాత్తుగా అడ్డం రావడంతో తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో దౌలత్ బాషా తలకు తీవ్రగాయలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ దౌలత్బాషాను స్థానికులు పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్కు తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు దౌలత్బాషాకు భార్య షాహిన్తో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వీఆర్వోపై హత్యాయత్నం
సి.బెళగల్: ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల గ్రామ రెవెన్యూ అధికారి గోపాల్పై హత్యాయత్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మారందొడ్డి గ్రామానికి చెందిన బోయ గోపాల్ ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల గ్రామ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మారందొడ్డి గ్రామంలో నివాసముంటూ రోజూ విధులకు వెళ్లి వస్తుంటారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మిద్దైపె నిద్రించగా గుర్తు తెలియని దుండగుడు పదునైన మరణాయుధంతో వీఆర్వో గోపాల్పై దాడి చేశాడు. ఉలికిపాటుతో వీఆర్వో అరవగా, కుటుంబ సభ్యులు మేలుకుని కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వీఆర్ఓను కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆగంతకుడి దాడిలో వీఆర్వో మెడపై రెండు తీవ్ర రక్తగాయాలు కాగా, కుడి దవడ పూర్తిగా ఛిద్రమైంది. అదేవిధంగా ఎడమ చెయ్యి, ఛాతిపై ఇలా మరో ఐదు చోట్ల రక్తపు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వేణుగోపాల్రాజు సోమవారం అర్ధరాత్రి కర్నూలు ఆసుపత్రిలో క్షతగాత్రుడిని పరిశీలించి, బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ.. వీఆర్వోపై దాడికి గల కారణాలు తెలియరాలేదని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారణ చేపడతామన్నారు. కాగా మంగళవారం కర్నూలు క్లూస్ టీం సభ్యులు స్థానిక పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని, బాధితుడి ఇంటి పరిసరాలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. మరణాయుధంతో దాడి -
ప్రాణం తీసిన అతివేగం
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ● బైక్ కారును ఢీకొట్టడంతో ప్రమాదం ఎమ్మిగనూరు రూరల్: బైక్పై అతి వేగంతో వెళుతూ ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలైన సంఘటన సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గుడేకల్కు చెందిన ఎం.ఆరోగ్య (35), అదే గ్రామానికి చెందిన హరిజన మణికుమార్, బంధువైన కోటేకల్ గ్రామానికి చెందిన హరిజన మాణిక్యరాజు స్నేహితులు. సోమవారం ఎమ్మిగనూరులో కలుసుకున్నారు. స్థానిక హోటల్లో భోజనం చేసుకొని హరిజన మాణిక్యరాజును అతని ఊర్లో వదలడానికి బైక్పై బయలుదేదారు. ఆదోని రోడ్డు వెంకటాపురం కాలనీ మలుపు వద్ద వేగంగా వెళ్తున్న బైక్ ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బైక్, కారు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఎం.ఆరోగ్య, మణికుమార్, మాణిక్యరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ముంబైకి వెళ్లాల్సిన వ్యక్తి మృత్యుఒడికి.. గుడేకల్కు చెందిన ఎం.ఆరోగ్య (35), భార్య మరియమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముంబైకి వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి ముంబైకి తిరిగి వెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. స్నేహితులు కలవడంతో వారితో సరదాగా గడుపుదామని వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఎం.ఆరోగ్యను కర్నూలుకు తరలించగా అంబులెన్స్ ఆసుపత్రి ఆవరణలోకి చేరుకోగానే ఊపిరి ఆగినట్లు చెబుతూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. భర్త చనిపోయిన విషయాన్ని ముంబైలో ఉన్నా భార్యకు తెలియజేయడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్ మంగళవారం సాయంత్రం తెలిపారు. మృతి చెందిన ఆరోగ్య (ఫైల్) తీవ్రంగా గాయపడిన మణికుమార్, మాణిక్యరాజు -
వెల్లివిరిసిన మత సామరస్యం
కోడుమూరు రూరల్: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని కోడుమూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్కిల్ కార్యాలయంలో సీఐ తబ్రేజ్ గణనాథుడిని కొలువుదీర్చగా వినాయక మండపాల సభ్యులతో పాటు కోడుమూరులోని మసీ దు కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని గణనాథుడికి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. వినాయక చవితి భారతీయులందరి పండుగ అని, నాడు బ్రిటిష్ పాలనలో భారతీయలంతా కలిసికట్టుగా ఉండాలన్న సంకల్పంతో స్వాతంత్య్ర సరమయోధుడు బాలగంగాధర్ తిలక్ గణేషుడి ఉత్సవాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశా రు. ప్రజలంతా కలిసికట్టుగా కులమతాలకతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సీఐ సూచించారు. -
స్వర్ణ గణపతి.. నమోస్తుతే!
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ.. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా’.. అంటూ విఘ్న నాయకుడిని జిల్లా ప్రజలు పూజించారు. వినాయక చవితి సదర్భంగా సోమవారం వాడవాడలా ఏకదంతుడి విగ్రహాలను ప్రతిష్టించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆకట్టుకునే బొజ్జ గణపయ్య విగ్రహాలు, విద్యుత్ దీప కాంతుల మండపాలు.. హోరెత్తిన భక్తిగీతాలు.. భక్తుల భజనలతో ఊరూరా సందడి నెలకొంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్డులో శక్తి వినాయక మండలి వారు ఈ ఏడాది దాదాపు 90 తులాల బంగా రు ఆభరణాలు వేసి పంచలోహ నాణెలతో తయారు చేసిన విగ్రహన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు. ఈ విగ్రహనికి సీసీ కెమెరాల నిఘాతో పాటు 15 మందికి పైగా కాపలా వుండటం విశేషం. – ఎమ్మిగనూరు టౌన్ -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.31కోట్లు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో 14రోజులకు సంబంధించి హుండీని మంగళవారం లెక్కించారు. ఆలయ డప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. భక్తులు స్వామి వారికి నగదు రూపంలో రూ.1,31,49,565 సమర్పించగా.. వెండి 14.500 కేజీలు, బంగారం 31.770 గ్రాములు వచ్చినట్లు ఈఓ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణాధికారి సుధాకర్రెడ్డి, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి తదితరులు పాల్గొన్నారు. కేసీ కెనాల్లోనే వినాయక నిమజ్జనం కర్నూలు(సెంట్రల్): భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేసీ కెనాల్లోనే వినాయక నిమజ్జనం నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీ కెనాల్లోనే నిమజ్జనోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అదే విధంగా 600 మీటర్ల పరిధికి అనుగుణంగా అవసరమైన క్రేన్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.8,910 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.8,910 పలికింది. మార్కెట్కు 440 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.4,730, మధ్యస్థ ధర రూ.7,300 ప్రకారం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మామూలుగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33–34 డిగ్రీల వరకే నమోదవుతాయి. కానీ నేడు ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. పగిడ్యాలలో 39.4 డిగ్రీలు, ఉయ్యాలవాడలో 39.1, సంజామలలో 39.1, అవుకు 39, బనగానపల్లి 38.9, రుద్రవరం 38.8, ఆళ్లగడ్డ 38.8, కల్లూరు 38.6, కర్నూలు 38.5, ప్యాపిలి 38.4, మంత్రాలయం 38.3, శ్రీశైలం 38.3, నంద్యాల 38, వెల్దుర్తి 37.8, డోన్లో 37.8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం వరకు పెరగడం గమనార్హం. పింఛన్ల దరఖాస్తుకు నేడు ఆఖరు కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం కల్పించింది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు గడువు విధించింది. ఇందులో ఏడు పని దినాలు మాత్రమే ఉండగా.. ఇప్పటికే ఆరు పని దినాలు పూర్తయ్యాయి. పింఛన్లకు సచివాయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి ఉమ్మడి జిల్లాలో పింఛన్లకు 70,226 దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. కర్నూలు జిల్లాలో 672 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా 37,461 దరఖాస్తులు.. నంద్యాల జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా 32,765 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 786 దరఖాస్తులను.. నంద్యాల జిల్లాలో 620 దరఖాస్తులను ఆమోదించారు. -
సంగమేశ్వర ఆలయ శిఖరానికి పూజలు
కొత్తపల్లి: రోజు రోజుకు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. దీంతో శ్రీశైలం వెనుకజలాల నుంచి మండలంలోని సంగమేశ్వరం సమీపంలో ప్రాచీన సంగమేశ్వరాలయం బయల్పడుతోంది. మంగళవారం ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిఖరభాగం వద్ద శివపార్వతుల విగ్రహాలు ఉంచి వినాయకుడి పూజలతో 43 రోజుల పాటు నిర్వహించే వరుణ పూజలు ప్రారంభించారు. శిఖరభాగానికి కుంకుమార్చన, పుష్పార్చ న, కాయ కర్పూరం సమర్పించారు. -
ఎకై ్సజ్ బకాయిలు లేనివాళ్లే రెన్యూవల్కు అర్హులు
● ఎకై ్సజ్ బకాయిలు లేనివారు రెన్యువల్కు అర్హులు ● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చ సుధీర్ బాబు కర్నూలు(అర్బన్): ఎకై ్సజ్ బకాయిలు లేని వాళ్లు మాత్రమే రెన్యువల్ దరఖాస్తుకు అర్హులని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చ సుధీర్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల లైసెన్స్దారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 2026–27 సంవత్సరానికి మద్యం షాపుల రెన్యువల్కు సంబంధించిన విధి విధానాలను వివరించారు. రెన్యువల్ ప్రాసెస్కు పాటించాల్సిన విధానాలను పీపీటీ రూపంలో లైసెన్స్దారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లైసెన్స్దారులు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో కర్నూలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ చంద్రహాస్, టాస్క్ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుదాం
మంత్రాలయం: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుదామని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాంపురం గ్రామంలో మంగళవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలు, నాయకులకు తమ కుటుంబం అండ గా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పోలీసులు, అధికారులు స్థానిక ఎన్నికల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం సూపర్–6ను గాలికి వదిలేసిందన్నారు. ఏదీ కూడా పూర్తి స్థాయిలో అమలు నూచుకోలేదన్నారు. వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు కనిపించదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా చేయించి రైతులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారన్నారు. ఊరూరా కనిపించే సచివాలయం, ఆర్బీకె, హెల్త్ సెంటర్లు నిర్మించింది జగనన్ననే అన్నారు. తుంగ భద్ర నది అడుగంటి తీర ప్రాంత గ్రామాల ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం .. స్థానిక ఎన్నికల్లో ఊరూరా అందరి ఆమోదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టి అత్యధిక మెజార్జీటతో గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా అందిద్దామని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్కుమార్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ బెదిరింపులతో ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే ప్రతి నాయకుడు అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు మురళీమోహన్రెడ్డి, విశ్వనాథరెడ్డి, మండల కన్వీనర్లు ప్రహ్లాదచారి, బెట్టనగౌడు, రాంమోహన్రెడ్డి, ఎల్ఎల్సీ డిస్టిబ్యూటర్ మాజీ అధ్యక్షులు ఐరన్గల్ శ్రీనివాసరెడ్డి, లీగల్ సెల్ కార్యదర్శి గురురాజరావు, ఎంపీపీ ఈరన్న, నాయకులు మాబుసాబ్, ఏకాంబర్రెడ్డి, మాజీ సర్పంచులు తెల్లబండ్ల భీమ, రామాంజినేయులు, రోగెప్ప, నాగరాజు, ముకరన్న, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిడీఎస్సీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి... డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వెంటనే సీబీఐతో దర్యాప్తు చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 6 నుంచి 10 మంది అనర్హులు డీఎస్సీలో పోస్టులు పొందారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. పోస్టులు పొందిన వారి ధ్రువీకరణ పత్రాలు చూపించవద్దని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. డీఎస్సీలో తప్పులను కప్పి పుచ్చడానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీఎస్సీపై పూర్తి స్థాయిలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమన్నారు. 2027లో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనడం హాస్యాస్పదమన్నారు. జగనన్న అగుడు బయటపెడితే జనసునామి వెంట నడుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులు మీదుగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఐడీ కార్డులను అందజేశారు. -
తొంగి చూస్తే కన్నీళ్లు!
ప్రస్తుతం చుక్క నీరు లేని బావిఎండిన పంటలు.. అడుగంటిన బావులు.. నెర్రెలిచ్చిన చెరువులు.. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంట పొలాలను రైతులు ఇక లాభం లేదని దున్నేస్తున్నారు. టీడీపీ పాలనలో కరువు ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఈ బావిని చూస్తే అర్థమవుతోంది. 2022 అక్టోబర్ నెలలో కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి పక్కనున్న పూడిచెర్ల పొలాల్లో ఓ బావి నిండు కుండను తలపించింది. ఇప్పుడు ఆ బావిలో చుక్క నీరు లేని పరిస్థితి. కరువు తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పడుతుండగా.. ఈ దారిన వెళ్లే స్థానికులు ఎండిన బావిని చూసి రానున్న రోజులు ఇంకెంతటి దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు
● 22న కర్నూలులో నిమజ్జనోత్సవంకర్నూలు కల్చరల్: వినాయక చవితి ఉత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల రమణ, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగఫణిశాస్త్రి తెలిపారు. శుక్రవారం వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను స్వాతంత్య్ర సమరయోధులకు అంకింత చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ప్రజలను సంఘటితం చేసేందుకు బాల గంగాధర్ తిలక్ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. పూర్తి సంప్రదాయబద్ధంగా హిందువుల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. మట్టివినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదిరోజుల పాటు ప్రతి రోజు రెండు పూటలా పూజ, హారతి, వందేమాతరం పూర్తి గేయాలాపన చేయాలన్నారు. ఈనెల 22న కర్నూలు నగరంలో వినాయక ఘాట్లోనే సామూహిక వినాయక నిమజ్జనం చేపడతామన్నారు. సమావేశంలో ఉత్సవ సమితి నగర అధ్యక్షులు రంగస్వామి, కార్యదర్శి గిరిరాజవర్మ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో వినాయక నిమజ్జన నిర్వహణపై ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీ కెనాల్కు అవసరమైన నీటిని తీసుకురావడానికి అన్ని అవకాశాలను మరోసారి పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా నన్నూరు, తడకనపల్లె, ఉల్లిందకొండ సమీపంలో పారుతున్న హంద్రీనీవా కాలువల వద్ద ఘాట్లను ఏర్పాటు చే యాలన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిమజ్జన ఊరేగింపుల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం తలెత్తకుండా బస్సు రూట్లను అవసరమైన మేరకు మళ్లించాలని సూచించారు. సమావేశంలో కర్నూల్ మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, కర్నూల్ ఆర్డీఓ సందీప్ కుమార్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజన్ బాబు, డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో..
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహబాషణ చేశారు. -
రానున్న ఐదు రోజుల్లో వర్షాలు లేనట్లే!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా కేంద్రం ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు వ్యవసాయ వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. ఐదు రోజుల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అతి తక్కువ లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉంది. ఈ నెలలో 11 రోజులు గడచిపోగా.. కేవలం 4.7 మి.మీ వర్షం కురిసింది. ఈ నెలకు సంబంధించి 96 శాతం లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 3.65 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి వర్షాలే లేకపోవడంతో దాదాపు 50వేల హెక్టార్లలో పంటలను పూర్తిగా దున్నేశారు. మరో లక్ష హెక్టార్లలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన పంటలు కూడ ఎండలకు మాడిపోతున్నాయి. ఏ పంటలో కూడా దిగుబడులు 10 శాతం కూడా వచ్చే అవకాశం లేదని వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు కర్నూలు కల్చరల్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు ఆదేశించారు. శుక్రవారం కర్నూలు డీసీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ఇన్స్పెనక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోర్టుల్లోని కేసుల పరిష్కారానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలన్నారు. సీజీఎఫ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి పెండింగ్లోని ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● 19న పోలింగ్ కేంద్రాల తుది జాబితాకర్నూలు(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ ఓటర్ల జాబి తాలను శుక్రవారం జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన 53 జెడ్పీటీసీ స్థానాలకు చెందిన ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను కూడా ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించారని పేర్కొన్నారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 19న ప్రచురించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఈఓ వెల్లడించారు. ఈ నెల 14న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ ప్రిపరేషన్, 15న ముసాయిదా జాబితాలను ప్రకటించామన్నారు. అలాగే 15, 16వ తేదిల్లో అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తారన్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు గుర్తించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. 18వ తేదిన జిల్లా కలెక్టర్ అనుమతితో 19వ తేదిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించడం జరుగుతుందన్నారు. ఎస్సార్బీసీ ఈఈ బాధ్యతల స్వీకరణ కొలిమిగుండ్ల(అవుకు): అవుకు ఎస్సార్బీసీ ఈఈగా భవాని ప్రసాద్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గోరుకల్లు ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉన్నతాధికారులు అవుకు ఎస్సార్బీసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరగానే డీఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్, ఇతర స్లూయిస్ల మరమ్మతులకు కృషి చేస్తామన్నారు. -
ఐదు రోజుల పని విధానం తక్షణం అమలు చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకింగ్లో ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. యుఎఫ్బీయూ పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన బ్యాంకుల సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా కార్పొరేట్ బ్యాంకులు మినహా పబ్లిక్, ప్రైవేటు సెక్టారు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల మూతతో లావాదేవీలు స్తంభించిపోయాయి. యుఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ ఇ.నాగరాజు నాయకత్వంలో బ్యాంకు ఉద్యోగులు జిల్లా పరిషత్ నుంచి రాజ్విహార్ మీదుగా ఐదు రోడ్ల కూడలి, రాజ్ థియేటర్ మీదుగా కేఇ ప్లాజా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ ముఖ్య నేతలు మాట్లాడుతూ గత వేతన ఒప్పందంలో బ్యాంకుల యాజమాన్య సంస్థ ఐబీఏ ఐదు రోజుల బ్యాంకింగ్కు అంగీకరించి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. బ్యాంకు లాభాల్లో ప్రతి ఉద్యోగి పాత్రను గుర్తించి అందరికీ ఆమోదయోగ్యమైన పీఎల్ఐ విధానం తీసుకురావాలని కోరారు. ఇప్పటికై నా స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు శివకృష్ణ, అనిల్ రెడ్డి, ఏఐబీవోసీ నాయకులు రాజు, పుష్పక్కుమార్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ నాయకులు హనుమంతు, ఐబో నాయకులు మంజునాథ్, విజయ్, హనుమంతురెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ని పత్రాలు ఎందుకు?
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ప్రజలందరికీ తెలిసిన విషయమే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానించడం తాజా ఉదాహరణగా నిలిచింది. రెండున్నర ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం అవ్వాతాతలు, వితంతు మహిళలు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలలో పింఛన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సెలవులు ఉన్నాయి. దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవడానికి కేవలం 15న మంగళవారం, 16న బుధవారం రెండు రోజులే గడువు ఉంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అప్లోడ్ అయిన దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శుక్రవారం నాటికి కర్నూలు జిల్లాలో 32,186, నంద్యాల జిల్లాలో 28,462 దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. అస్తవ్యస్తం.. గందరగోళం కోసిగి: కొత్త పింఛన్ దరఖాస్తు ప్రక్రియ గందరగోళంగా మారింది. అన్ని సర్టిఫికెట్లు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే మరొకటి కావాలని వెనక్కి పంపుతున్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. కోసిగి మండలంలో 19 సచివాలయాలు ఉండగా ఆరుగురు మాత్రమే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారు. సిబ్బంది కొరత ఉండగా సర్వర్ సమస్య వేధిస్తుండటంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కరెంట్ కోతలు.. సర్వర్ సమస్యలు! కోడుమూరు రూరల్: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన వారికి కరెంట్ కోతలు ఎదురవుతున్నాయి. ప్రతి రోజూ ఒక్కో సచివాలయంలో 30 నుంచి 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. కోడుమూరులో ఐదు వార్డు సచివాలయాలు ఉండగా శుక్రవారం కరెంట్ కోతతో దరఖాస్తులు అప్లోడ్ చేయడంలో సమస్యలు వచ్చాయి. సర్వర్ వేధిస్తుండటంతో దరఖాస్తు చేసుకుంటున్న వారికి రెండుసార్లు ఓటీపీ ఆలస్యంగా వస్తోంది. దీంతో గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సి పరిస్థితి నెలకొంది. కరెంట్ కేవలం ఒక గంట ఉండి.. రెండు గంటల పాటు పోతుంది.. మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోంది. పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 16వతేదీ వరకే సమయాన్ని ఇవ్వడంతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వృద్ధాప్య పింఛన్లకు ఆధార్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారు. ఆధార్ చరిత్ర, ఓటరు ఐడీ/ బ్యాంకు పాస్ బుక్/ పాస్పోర్టు/పాన్కార్డుల్లో ఏదో ఒకటి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు అవసరమని పేర్కొంటున్నారు. వితంతువు పింఛన్ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే 8 రకాల ధ్రువపత్రాలు అవసరమంటూ మహిళలకు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగా వితంతు పింఛన్లకు 18 ఏళ్లు నిండిన మహిళలు అర్హులై. భర్త మరణించిట్లు ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డు సరిపోతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ చరిత్ర, భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఓటరు ఐడీ/ బ్యాంకు పాస్ బుక్/ పాస్పోర్టు/పాన్కార్డుల్లో ఏదో ఒకటి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు అవసమని చెబుతున్నారు. ఆధార్ లేక ముందు(2010కి ముందు) భర్త మరణించిన మహిళలకు ఇప్పటి వరకు పింఛన్లు లేవు. అటువంటి వారిని భర్త ఆధార్ అడుగుతుండటం తీవ్ర అందోళన కలిగించే విషయం. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
● విద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం మంత్రాలయం రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ రాష్ట్రవిద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం అన్నారు. మాధవరం, విద్యానగర్లోని ఎస్ఎంకెవీ జిల్లా ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మాధవరం జిల్లా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. విద్యానగర్లోని ఎస్కేవీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందితో మట్లాడుతూ.. 750 పైగా ఉన్న విద్యార్థులు ఉన్న హైస్కూల్ ప్రహారిగోడ లేక పోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. మంత్రాలయం ఆర్సీఎన్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. ఎంఈఓలు నాగభూషణం, రాఘన్న, హెచ్ఎంలు బోజరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు. వానల్లేక జొన్నపంట తొలగింపు మద్దికెర: వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న జొన్న పంటను రైతు మిడుతూరు ప్రతాప్ గురువారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మద్దికెర సమీపంలో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జూన్లో జొన్న సాగు చేశానన్నారు. అడపాదడపా వర్షాలతో పైరు పెరిగా ఆగస్టు నుంచి వానల్లేక ఎండిపోయిందన్నారు. పెట్టుబడి కింద రూ.75,000 ఖర్చు వచ్చిందని, పంట ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వస్తుందని తొలగించినట్లు చెప్పారు. అంతర పంటగా వేసిన కంది కూడా ఎండిపోతోందని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. డోన్ ఏఎస్ఐ మృతి డోన్ టౌన్/ కర్నూలు (టౌన్): డోన్ పట్టణ పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తు న్న మద్దిలేటి (56) అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకొలేక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్బాషా కర్నూలుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏఎస్ఐ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్ వెల్దుర్తి: తల్లిని రక్షించే ప్రయత్నంలో తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్షావలి వివాహేతర సంబంధం విషయంపై అతని భార్య మస్తాన్బి శనివారం రాత్రి ప్రశ్నించింది. దీంతో షేక్షావలి తన భార్యను గొంతు పట్టుకోగా ఆమె అరుస్తూనే స్పృహ తప్పింది. తల్లి అరుపులు విన్న అతని పెద్ద కుమారుడు మస్తాన్ వలి క్షణికావేశంలో తండ్రి తలపై రోకలి బండతో బాదాడు. గాయపడ్డ తండ్రిని తనే ఆటోలో ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ షేక్షావలి కోలుకోలేక 6వ తేదీ ఆదివారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇదురుబాషా 7వ తేదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు నిందితుడు మస్తాన్వలిని గురువారం అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. డోన్ కోర్టులో హాజరు పరిచి, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఉయ్యాలవాడ: కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు లాక్కపోయిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ దూదేకుల జమాల్ బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో కాకరవాడ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్, రవి దాడి చేసి కొట్టి, బెదిరించి రూ. 5 వేలు నగదు దోచుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఉయ్యాలవాడ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బైక్, రూ. 5 వేలు నగదు, రెండు బైక్ స్టీల్ స్టంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారన్నారు. -
నమ్మ కన్నడ నాడు!
ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంత వాసుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం అరుదైన విద్యుత్ కాంతులతో జిగేల్మంది. గురువారం టీబీ బోర్డు అధికారులు కొత్త రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ చేశారు. జలాశయానికి సంబంధించి 33 క్రస్టుగేట్లు కలిగిన ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్ర జెండా (రాష్ట్రీయ జెండా) రంగుల లైట్లను ఏర్పాటు చేసి రాత్రి వాటిని పరీక్షించారు. ఇటివల స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా రంగుల లైట్లు ఏర్పాటు చెసిన అధికారులు నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవను దృష్టిలో ఉంచుకుని ఈ దీపాలను ఏర్పాటు చేసి పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ దీపాలు వెలిగిన వేళ టీబీ డ్యాం ఈ కొత్త విద్యుత్ కాంతులతో ప్రకాశించింది. – హొళగుంద -
19న కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) జిల్లా నాలుగవ, ఏపీ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ మొదటి జిల్లా మహాసభలను ఈనెల 19న కర్నూలులో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.గోరంట్లప్ప తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలను కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలతోపాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టు ల హక్కుల పరిరక్షణకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. జిల్లా మహాసభలకు అన్ని నియోజకవర్గాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివశంకర్, జిల్లా సీనియర్ నాయకులు పి.చంద్రయ్య, టిజి ప్రసాద్, డి.చంద్రమోహన్, వినయ్ కుమార్, శివన్న, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు డి.హుస్సేన్, వడ్డే శ్రీనివాసులు, విజయ్ కరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జుమ్మాలదిన్నెలో హెల్త్ క్యాంప్
కోసిగి: ‘విజృంభిస్తున్న విషజ్వరాల’ అనే శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. కోసిగి ప్రాథమిక వైద్యాధికారి ఇబ్ర హీం, ఆదోని మలేరియా సబ్యూనియట్ ఆఫీసర్ మంజునాథ్ తమ సిబ్బందితో కలిసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో వైద్య బృంద సభ్యులు ఇంటింటా తిరిగారు. జ్వరాలు ప్రబలిన వారిని పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో మురుగు కాల్వలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ను పంచాయతీ కార్యదర్శి అయ్యస్వామి చల్లించారు. దోమలు రాకుండా దోమ తెరలను వాడాలని సూచించారు. గ్రామంలో మూడు రోజుల పాటు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అధికారులు గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. -
మట్టి వినాయకుడిని పూజిద్దాం
కర్నూలు(సెంట్రల్): మట్టితో చేసిన వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికా పీవీ కిషోర్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు జి.నరసింహులు, లయన్స్ క్లబ్ కార్యదర్శి రాయపాటి శ్రీనివాస్ సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పీసీబీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏక్యాంపు మాంటిస్సోరి స్కూల్, కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేశవరెడ్డి స్కూల్, శ్రీజ స్కూల్, దుపాడులోని అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులను పర్యావరణహిత పద్ధతులను అవలంబించేలా మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం పీసీబీ కార్యాలయంలో బహుమతులను అందజేస్తామని అధికారులు తెలిపారు. -
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్షిప్తో పాటు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. గురువారం వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్లేస్మెంట్స్కు ఎంపికై న 48 మంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్న్షిప్ – ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, ఇంటర్వ్యూ నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థులకు మరిన్ని ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో సమన్వయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.విజయకుమార్ నాయుడు, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ, వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అధికారులు డాక్టర్ జి. సురేంద్ర పాల్గొన్నారు. -
శ్లోక పారాయణం.. ప్రతిభా పాటవం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థిని నుస్త్రత్ భగవద్గీత శ్లోకాల పారాయణ పొటీల్లో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని ముస్లిం కుటుంబానికి చెందిన గడ్డం మహబూబ్బాషా, దిల్షాద్బేగం దంపతుల కుమార్తె నుస్త్రత్ స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పారాయణంపై శిక్షణ పొందారు. ఈ పాఠశాలలోని మొత్తం 22 మంది విద్యార్థినులు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో గత ఎప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సుమారు గంట పాటు భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ తీసుకున్నారు. వీరంతా జూలై 19న వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి భగవద్గీత పోటీల్లో పొల్గొన్నారు. మొదటి విడత పోటీలకు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో పాటు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశలో 113 మంది విద్యార్థులను, రెండవ విడత భగవద్గీత పోటీలకు ఎంపిక చేయగా ఇందులో జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల నుంచి ముస్లిం విద్యార్థిని నుస్త్రత్ పాటు మొత్తం 22 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. రెండవ దశ పోటీలు ఆగస్టు 2వ తేదీన జరిగాయి. భగవద్గీతలోని 108 శ్లోకాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే మొదటి 54 శ్లోకాలను తీసుకొని రెండవ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో బనగానపల్లె జెడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులు నుస్త్రత్, శృతి ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు అడిగిన శ్లోకాలను దోషరహితంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా, శ్రావ్యంగా వినిపించారు. మొదటి బహుమతి రూ.లక్షను నుస్త్రత్ దక్కించుకోగా రెండవ బహుమతిని విద్యార్థిని శృతి గెలుచుకున్నారు. విద్యార్థిని నుస్త్రత్ ముస్లిం మతానికి చెందిన వారైనా భగవద్గీత శ్లోకాల పారాయణంలో ఎలాంటి భయం బెరుకు లేకుండా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో బనగానపల్లె ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. అలాగే విద్యార్థిని నుస్త్రత్ గతేడాది నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లోనూ ప్రతిభ చాటి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాటు అందించే ఉపకార వేతనానికి ఎంపికై నట్లు హెచ్ఎం ప్రసాదరావు తెలిపారు. అలాగే 2024లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బనగానపల్లె లాల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త చరిత్రకు సంబంధించిన క్విజ్ పోటీల్లోనూ పాల్గొని బహుమతి సాధించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్శ్రీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతేశ్రీశ్రీ భావం: ఓ అర్జునా! చంచలమైన మనస్సును నియంత్రించడం కష్టమనేది నిజమే. కానీ, ‘అభ్యాసం’ అంటే పట్టుదలతో కూడిన నిరంతర సాధన ద్వారా దీనిని కచ్చితంగా సాధించవచ్చు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో రోజువారీ పట్టుదలే అభ్యాసం. భగవద్గీతలోని ఈ శ్లోకం బనగానపల్లెకు చెందిన ఓ విద్యార్థిని ప్రతిభకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల పారాయణ పొటీల్లో ముస్లిం మతానికి చెందిన విద్యార్థిని రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీల్లో రాణిస్తున్న ముస్లిం విద్యార్థిని నుస్త్రత్ దక్షిణ భారతదేశ స్థాయిలో ఇస్కాన్ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ మొదటి బహుమతి రూ.లక్ష కై వసం చదువుల్లోనూ ముందంజ -
జియారత్తో ముగిసిన ఎల్లార్తి ఉరుసు
హొళగుంద: ఎల్లార్తిలో షేక్షావలి, షాషావలి తాతల ఉరుసు గురువారం జియారత్ కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళునాడు నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దర్గాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో భాగంగా 8న గంధం, 9న ఉరుసు, 10న జియారత్ కార్యక్రమాలు జరిగాయి. దర్గాల సయాద్ నసీన్ ముతవలి, పీఠాధిపతి నూర్బాబా ఖాద్రి భక్తులకు ధర్మసందేశాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఏపీ వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఈఓ ఇమ్రాన్, ఇన్స్పెక్టర్ సోహెల్ పర్యవేక్షణలో జరిగిన ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం ● ఎస్ఈ ప్రదీప్ కుమార్ కర్నూలు (అగ్రికల్చర్): వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఏమాత్రం అలసత్వం వహించినా తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. గురువారం వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న కమిటీల ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు. వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలని తెలిపారు. అక్రమంగా విద్యుత్ వాడకం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మండపాలలో తక్కువ నాణ్యత కలిగిన వైర్లు వాడకూడదని, వైర్లకు జాయింట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు, డీజేలు, మైక్ సెట్ల ఎత్తును గమనించాలని సూచించారు. విద్యుత్ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912, 9440813332, 9491067203, 9440813334 నంబర్లకు కాల్ చేయడంతో పాటు సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. -
ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక..
కర్నూలు(హాస్పిటల్): ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. బాధితుని కథనం మేరకు.. దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు బి.బ్రహ్మయ్య(32) ఊళ్లో తండ్రికి చెందిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో కోడుమూరులో ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆయన మూడున్నర ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ.18వేలు కంతు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలలుగా అతను కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై బ్రహ్మయ్య కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్లోగా బకాయిలు చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు కొందరు నెలరోజులుగా బ్రహ్మయ్య వద్దకు వచ్చి బకాయిలు తీర్చాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో బాధపడుతూ బ్రహ్మయ్య బుధవారం రాత్రి కోడుమూరులోని తన హోటల్ ఎదుట క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం వెంటనే అతన్ని కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. రైలు ఢీకొని వ్యక్తి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వేస్టేషన్లో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో గుండప్ప అనే వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
అప్పుల ఉరికి అన్నదాత బలి
కోడుమూరు రూరల్: వానలు లేక, పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రైతు బోయ లక్ష్మన్న (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బోయ లక్ష్మన్న తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంట సాగు చేశాడు. వానల్లేక పంటలన్నీ మొలక దశలోనే ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. గురువారం భార్య శారదమ్మ అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రైతు బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం కుమారుడు సోమేష్ హైస్కూల్ నుంచి ఇంటికి రాగా తండ్రి బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ చుట్టుపక్కల వారిని పిలుచుకువచ్చాడు. అప్పటికే రైతు బోయ లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. రైతుకు భార్య శారదమ్మతో పాటు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అప్రకటిత కోతలు ఎత్తేయండి
ఆదోని: మండలంలోని గణేకల్లు సబ్స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు వీరారెడ్డి, డి.రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విషయం తెలుసుకుందామంటే అధికారుల ఫోన్లు కూడా పనిచేయడం లేదన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజులుగా కోతలు కోవెలకుంట్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోడ్ రిలీఫ్(ఎల్ఆర్) పేరిట రెండు రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం రాత్రి 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోత విధించగా.. గురువారం సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. రెండు రోజుల నుంచి ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు గంటల తరబడి చీకట్లో మగ్గుతున్నారు. ఉక్కపోతతో పాటు దోమల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
సబ్స్టేషన్ ముట్టడి
కౌతాళం: విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని కోరుతూ హాల్వి సబ్స్టేషన్ను ముట్టడించిన ఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. హాల్వి, గొతులదొడ్డి, వల్లూరు గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి హాల్వి విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. విద్యుత్ కోతలు సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు విధించడం పట్ల ఆయా గ్రామస్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి సబ్స్టేషన్కు తాళం వేశారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిపేస్తే ఎలా బతికేదని వాపోయారు. ఏఈ, డీఈని పిలిపించండని రెండు గంటల పాటు సిబ్బందిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. రాత్రి 11గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో శాంతించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
అడుగంటిన ‘ప్రథమ’ ఆశలు!
కర్నూలు సిటీ: కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో 89 టీఎంసీల నీరు ఉన్నా..ఔట్ ఫ్లో 9,819 క్యూసెక్కులు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిలో చుక్కనీరు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నది తడారి ఎడారిగా కనిపిస్తోంది. నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీలో నీరు అడుగంటిపోయింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని సైతం బుధవారం ఉదయం బంద్ చేశారు. ప్రథమ పూజ్యుడైన వినాయక నిమజ్జనానికి నీరు ఇవ్వలేమని మంత్రి టీజీ భరత్ చెప్పారు. దీంతో ముందస్తుగా డబ్బులు ఇచ్చి పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ దుస్థితి.. తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం డ్యాంకు 89 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీరుతో కనీసం ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. టీబీ డ్యాంలో నీటి లభ్యతలో దమాషా ప్రకారం కేసీ కెనాల్కు ఐదు టీఎంసీల నీటి వాటా వస్తుంది. ఆ నీటిని నది ద్వారా విడుదల చేస్తే 20 శాతం కూడా రాదని ఇంజినీర్లు అంటున్నారు. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీటిని జీడీపీ (గాజులదిన్నెప్రాజెక్టు)కు మళ్లించి..అక్కడి నుంచి కేబీసీ కాలువ ద్వారా జి.శింగవరం సమీపంలో కేసీ కాలువకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఈ విషయం ఇంజినీర్లకు సైతం తెలిసినా ఎందుకు ఆ వైపుగా మంత్రిని, కలెక్టర్ను ఒప్పించలేకపోతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసీలోనే నిమజ్ఞనం చేసుకోవచ్చు గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి హంద్రీ–నీవా కాలువ 110 కి.మీ దగ్గర వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన స్లూయిజ్ నుంచి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు తుంగభద్ర దిగువకాలువ పరిధిలోని తాగునీటి ట్యాంకులు నింపిన తరువాత ఆ నీటిని జీడీపీలోకి మళ్లించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ నీటిని విడుదల చేసి 6 కి.మీ. దగ్గర క్రాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేస్తే ఆ నీరు కర్నూలు బ్రాంచ్ కెనాల్ 7.78 కి.మీ దగ్గర నుంచి 42 కి.మీ. వరకు ప్రవహిస్తుంది. ఆ నీటిని ఉల్చాల దగ్గర ఓ వాగులోకి వదిలేస్తే జి.శింగవరం దగ్గర కేసీ కాలువలోకి చేరుతుంది. ఆ నీటితో కర్నూలు తాగునీటి అవసరాలు, ఆ నీటిలోనే కర్నూలు నగరంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ టీడీపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయలేదు. విగ్రహాలు చిన్నవి ఏర్పాటు చేసుకోండి అంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగభద్ర నదిలో కనిపించని నీరు వెలవెలబోతున్న సుంకేసుల జలాశయం వినాయక నిమజ్జనానికి తప్పని తిప్పలు జీడీపీ నుంచి నీరిచ్చేందుకు అవకాశమున్నా పట్టించుకోని ప్రభుత్వం గుండ్రేవుల నిర్మిస్తే..! కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 31.9 టీఎంసీల నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేవు. సుంకేసుల లో 1.2, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. ఏటేటా నీటి ప్రవాహ రోజులు తగ్గిపోవడంతో కేసీ కెనాల్ కింద సాగుకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న గుండ్రేవులు ప్రాజెక్టును(20 టీఎంసీల నిల్వ సామర్థ్యం) నిర్మిస్తే నీటి కష్టాలు తొలుగుతాయి. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే పల్లెల్లో వినాయక నిమజ్ఞనానికి ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ఉంటాయి. -
రికార్డుల నిర్వహణ లేదు.. కార్మికులకు భద్రత లేదు!
● ఆధ్య అగ్రిక్రాప్ సైన్స్ కంపెనీలో అధికారుల తనిఖీలు ● లోపాలను గుర్తించి హెచ్చరించిన వైనం జూపాడుబంగ్లా: తంగడంచ రెవెన్యూ పరిధిలోని ఆధ్య అగ్రిక్రాప్సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో నిర్వహణ లోపాలు అధికారుల తనిఖీలో వెలుగు చూశాయి. గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గంగాధర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు టెక్నికల్ ఏఓ ఆయూబ్బాషా, ఏడీఏ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి కంపెనీని తనిఖీ చేశారు. తనిఖీ నిమిత్తం అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కంపెనీ నిర్వాహకులు ఉత్పత్తి నిలిపేసి లేబర్ను బయటకు పంపించేశారు. కంపెనీలో నిల్వ చేసిన డబ్బాలు, ప్రొడక్ట్ కవరింగ్ లేబుల్స్, ల్యాబ్లను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తయారు చేస్తున్న 24 రసాయనిక మందులకు సంబంధించి యాంటీ డోస్ ఇంజెక్షన్లు కంపెనీలో అందుబాటులో లేకపోవటంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 80 మంది లేబర్ పనిచేస్తుండగా ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ప్రాణాపాయం సంభవిస్తే యాంటీడోస్ లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రథమ చికిత్స గది, చికిత్స నిర్వహించేందుకు డాక్టర్ను నియమించకపోవటంతో నిర్వాహకులపై మండిపడ్డారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఆధ్య కంపెనీలో 124 రకాల ప్రొడెక్టుల తయారీకి అనుమతి ఉన్నప్పటికీ ప్రస్తుతం 24 రకాల మందులు తయారుచేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహణలో లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని కంపెనీ యాజమాన్యానికి సూచించామన్నారు. తనిఖీ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్కు అందజేస్తామన్నారు. -
ఘనంగా ఎల్లార్తి ఉరుసు
● శేక్షావలి, షాషావలి దర్గాలను దర్శించుకున్న భక్తులు ● గంధం మోసిన పీఠాధిపతి నూర్బాబాహొళగుంద: రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన దర్గాల్లో ఒకటైన ఎల్లార్తి శేక్షావలి, షాషావలి తాతల దర్గా ఉరుసులో భాగంగా బుధవారం ఉరుసుతో పాటు తెల్లవారుజామున దర్గాలకు చేరిన గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతాకగా నిలిచే ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాకా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. పురవీధుల్లో ఊరేగిన గంధం తెల్లవారుజామున దర్గా పీఠాధిపతి నూర్బాబా దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చదివి అక్కడి నుంచి గంధం మోసుకుని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తిరిగి దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు, పకీరులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు, నృత్యాలు, పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరడంతో భక్తులు ఆయా దర్గాల్లో సమాధులను దర్శించుకుని నైవేద్యాలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహాలు చేశారు. బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉరుసులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో పాటు 60 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవంలో భక్తులకు ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
మానసిక వైద్యులను సంప్రదించాలి
ఇటీవల కాలంలో ఆత్మహత్యకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స అందేలా చేయాలి. అక్కడి వైద్యులు మందులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేస్తారు. –డాక్టర్ చైతన్యకుమార్ నేరెళ్ల, మానసిక వైద్యులు, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆత్మహత్యలపై మాట్లాడకూడదని ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. కానీ దీని గురించి చర్చిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఇటీవల కాలంలో బెట్టింగ్కు అలవాటు పడి ఎక్కువ మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్దలు ఈ విషయమై చర్చించి పరిష్కారం కనుగొనాలి. –డాక్టర్ కె.నాగిరెడ్డి, సైకియాట్రిస్ట్, కర్నూలు -
తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేసింది. బుధవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో గాయత్రీ ఎస్టేట్ నుంచి బిర్లాగేటు వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, రంగప్ప మాట్లాడుతూ పోలీసు పోస్టుల సంఖ్యను పెంచాలని కాకినాడలో నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అన్యాయమన్నారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయమని చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తమ ప్రభుత్వం వస్తే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉంటుందని పదేపదే చెప్పారని.. మరి ఇప్పుడు అహంకారం పెరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ 11,639 పోస్టులతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి
కర్నూలు (టౌన్): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు భంగం కలుగకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. వాట్సప్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాద్యమాల్లో వచ్చే నిర్ధారణ లేని సందేశాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అలాగే బాధ్యతారహితంగా ఇతరులకు షేర్ చేయవద్దన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్ట ప్రకారం డీజేల శబ్ధం 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని సీజ్ చేస్తామన్నారు. వినాయక ఘాట్లో తగినంత నీటి లభ్యత లేని పక్షంలో నగర శివారులోని నన్నూరు టోల్ప్లాజా, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు తగిన చర్యలు ఉంటాయన్నారు. కర్నూలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 9వ రోజు నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతాయని సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మత పెద్దలు హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వపై దాడులు హొళగుంద: మండల కేంద్రంలోని ఈబీసీ, సినిమా రోడ్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం సాయంత్రం డీఎస్ఓ (డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసర్) రాజారఘువీర్ దాడులు చేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు నుంచి వచ్చిన ఆయన సీఎస్డీటీ దీప, తహసీల్దార్ లక్ష్మిరాజు, ఎస్ఐ దిలీప్కుమార్తో కలిసి దాడులు చేపట్టారు. ఈబీసీ కాలనిలోని ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల (6.25 క్వీంటాళ్లు) రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే సినిమా రోడ్డులోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 77 క్వింటాళ్లు (189 బస్తాలు) బియ్యాన్ని దాడులు చేసి పట్టుకోగా ఆ ఇంటి వారితో పాటు స్థానికులు డీఎస్ఓ, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. అవి రేషన్ బియ్యం కాదని, రైతులు పండించిన బియ్యమని వాదించారు. అయితే బియ్యం నిల్వలో పీడీఎస్ బియ్యం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటిని టెస్టింగ్ కోసం కర్నూలు ల్యాబ్కు పంపుతున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజు తెలిపారు. రేషన్ బియ్యం కలిసి ఉంటే బాధ్యులపై కేసులు నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేస్తామన్నారు. టెస్టింగ్ రిపోర్ట్ గురువారం సాయంత్రం వస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. డీటీ నిజాముద్దీన్ తదితరులు వెంట ఉన్నారు. -
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే
● ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కల్లూరు: ప్రజల తరఫున నిలబడి వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. కల్లూరు అర్బన్ ముజఫర్నగర్ ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన నిలబడి నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు ఏం మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాస్పద అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రైతుల భూములు తీసుకుంటే ఆకుటుంబాల పిల్లలకు, ఆ గ్రామంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ గుండం సూర్య ప్రకాష్రెడ్డి, జెడ్పీటీసీ చంద్రశేఖర్రెడ్డి, నియోజకవర్గంలోని నాయకులు గాజుల శ్వేతారెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, మీదివేముల ప్రభాకర్రెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నరసింహులు, నారాయణరెడ్డి, శివశంకర్రెడ్డి, సూర్యానారాయణరెడ్డి, శ్రీథర్రెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, సుమంత్, శ్రీకాంత్రెడ్డి, తిరుపాల్, రామలక్ష్మణుడు, కరుణాకర్రెడ్డి, యువరాజ్, సత్యంరెడ్డి, , ఎంపీటీసలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. -
మొక్క మొక్కకు నీటి తడి!
కౌతాళం: వరుణదేవా.. కరుణుంచు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. వర్షాలు లేక రైతన్నలు సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతన్నారు. కొందరు రైతులు ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఖర్చుతో కూడుకున్నా సరే వెనుకుంజ వేయకుండా ముందుకు సాగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. సాగు చేసిన మిరప పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మగ్గుతో చెట్లకు పోస్తున్న దృశ్యం బుధవారం మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో కనిపించింది. రైతు ముత్తమ్మ గారి నాగరాజు మిరప పైరు ఎండకుండా భార్య లక్ష్మితో పాటు కూలీల ద్వారా మొక్కలకు మగ్గుతో నీరు పోస్తున్నారు. తాను రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ముందస్తుగా ఎకరాకు రూ.35 వేలు చొప్పున చెల్లించి పొలం సాగు చేసినట్లు రైతు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల లేత దశలోనే పంట ఎండిపోతోందని ఇప్పడు కాపాడకపోతే పూర్తి నష్టం జరుగుతుందని చెప్పారు. పంటను కాపాడుకునేందుకు నీళ్ల ట్యాంకర్కు బాడుగకు తెచ్చుకుని మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌలుతో పాటు రూ.60 వేల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మొక్కలకు నీళ్లు పోస్తే పెట్టిన పెట్టుబడైన వస్తుందన్న నమ్మకంతో పని చేస్తున్నట్లు రైతు నాగరాజు చెప్పారు. పంట చేతికొచ్చేటప్పటికి ఎంత ఖర్చవుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
కోసిగి: మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా జ్వరం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన రాగయ్య అనే వ్యక్తి ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోగా రూ.60 వేలు ఖర్చయినట్లు వాపోయారు. అలాగే తిక్కయ్య, కృష్ణ, మల్లేశ్వరితో పాటు మరో ముగ్గురు జ్వరంతో ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ప్రసాద్, సునీత దంపతుల కుమారుడు వైభవ్ తేజ్ అనే బాలుడికి మూడు రోజులుగా కోసిగిలో వైద్య సేవలు అందించినా జ్వరం తగ్గడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. రాజు, సువర్ణమ్మ దంపతుల పిల్లలు జస్వన్, మహిమాలీ, ఈషా జ్వరంతో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపారు. గ్రామం చుట్టూ మట్టి దిబ్బలు, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడంతో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమలు నివారణ చర్యలు, పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరుతున్నారు. కుమారుడికి మూడు రోజులుగా జ్వరం తగ్గలేదని చూపుతున్న తండ్రి ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన రాగయ్యఆదోనిలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిక్కయ్య -
మద్యం షాపుల లైసెన్సు మరో ఏడాది పునరుద్ధరించండి
కర్నూలు (టౌన్): మద్యం షాపుల లైసెన్సుల గడువు ఈ నెల 30న ముగుస్తున్నందున మరో ఏడాది పాటు రెన్యూవల్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని వారందరినీ సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో, గ్రేవ్ క్రైం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి అరెస్టు చేయకుండా ఉన్న పెండింగ్ కేసుల ముద్దాయిలను సత్వరమే అరెస్టు చేయాలని దర్యాప్తు అనంతరం చార్జ్షీటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు (కర్నూలు), రవికుమార్ (నంద్యాల), ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, విజయకుమార్, కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అయ్యో‘పాప’ం
● ఆడబిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు ఆలూరు: ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామ సమీపంలోని బ్రహ్మయ్య దేవాలయం వద్ద అప్పడప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిన సంఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. దేవాలయం ముందు కళ్లు తెరవని, అప్పుడప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన విషయాన్ని దేవాలయం సమీపంలోని కొందరు గుర్తించారు. ఈ విషయాన్ని కమ్మరచేడు గ్రామస్తులకు దేవాలయ నిర్వాహకులు సమాచారం చేరవేశారు. కమ్మరచేడు గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తి పసికందును ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసుల సమక్షంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసిబిడ్డకు ఆసుపత్రిలో చికిత్సలు చేస్తున్నారు. -
పైళ్లెన నాలుగు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్లోని పర్వతాపురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్పై బాబాయి కొడుకు ఆకాష్తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్లోని పర్వతాపురం క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.7,630 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,630 ధర పలికింది. మార్కెట్కు 39 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. కనిష్ట ధర రూ.7,410 ప్రకారం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారుల ప్రతిభ కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్షిప్గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తల్లిని కాపాడే ప్రయత్నంలో.. ● తండ్రిపై కుమారుడి దాడి ● తీవ్ర గాయాలై తండ్రి మృతి వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తాం
పత్తికొండ: మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో రోజుకో అక్రమం బయటకొస్తున్నా స్పందించేందుకు ఆ పార్టీ పెద్దలు జంకుతున్నారన్నారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ప్రభాకర్ కౌతాళం మండలం వల్లూరులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఇతను టెట్లో అర్హత సాధించలేదని, ఎక్కడా పోటీల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవన్నారు. మరి ఆయనకు డీఎస్సీలో ఎలా ఉద్యోగం వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. కమతం రమ్యశ్రీ, బంగారు మౌనిక 2018లో డీఎస్సీ రాసినప్పుడు బీసీ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2025 మెగా డీఎస్సీలో మరో కేటగిరిలో దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందారన్నారు. అది కూడా వారికి 75లోపు మార్కులు వచ్చాయని, ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో కులాలు మార్చుకుని ఉద్యోగాలు పొందుతున్న వింత ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. కూటమి పెద్దల సహకారంతో నకలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో ఇలాంటి వారు ఎందరో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. అది కూడా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చురుకుగా పొల్గొన్న వారికి అక్రమ దారిలో ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. అక్రమాలపై విచారణ పారదర్శకంగా చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎంపీపీ నారాయణ్దాస్ పాల్గొన్నారు. -
జాప్యమెందుకు
ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను పెండింగ్లో పెట్టడమేంటి? ఈ విషయంపై సహచర జెడ్పీటీసీలతో కలిసి సీఈఓ దృష్టికి తీసుకుపోయాం. నేటి వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. – డీ దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, ఆస్పరి గౌరవ వేతనాలను అందించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే సహచర జెడ్పీటీసీలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీ సాధారణ నిధుల నుంచి పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. – ఈ రంగనాథ్గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు, ఓర్వకల్లు సర్పంచ్ కాలం గడువు ముగిసినా మేం ఇంకా పదవిలోనే కొనసాగుతున్నాం. అయినా పాలన అంతా ఎలాంటి పదవులు లేని టీడీపీ నేతలతోనే కొనసాగిస్తున్నారు. అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించడం లేదు. గౌరవం ఇవ్వక పోయినా వేతనమైనా ఇస్తుందనుకుంటే అదీలేదు. గడువు ముగిసే లోపైనా ఇస్తారో లేదో? – ఎద్దుల రాజేశ్వరి, ఎఎంపీటీసీ సభ్యురాలు, చింతలచెరువు, చాగలమర్రి మండలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం ఇవ్వలేదు. నాకు రూ. 78 వేల వేతనం రావాలి? ఎప్పుడు ఇస్తారో తెలియదు. సొంత ఖర్చులతో ప్రతి మండల సమావేవానికి హాజరయ్యా. పదవీ కాలం ముగిసేలోపైనా బకాయిలు చెల్లిస్తారో లేదో? – పెద్ద పేరయ్య, ఎంపీటీసీ సభ్యుడు, హరివరం, ఉయ్యాలవాడ మండలం -
కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం
● తుంభద్రమ్మ ఒడిలో ఓలలాలిడిన స్వామి వారు ● బ్రహ్మరథం పట్టిన భక్తులు కోసిగి/మంత్రాలయం: ఏటి గట్టున భక్తజనం వీక్షిస్తుండగా.. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈరన్న స్వామి తుంగభద్రమ్మ ఒడిలో ఓలలాడారు. నృసింహుని పుణ్యస్నానంతో ఆధ్యాత్మిక తరంగాలతో తుంగభద్రమ్మ పరవశించింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీనరసింహ స్వామి) పల్లకోత్సవం చివరి సోమవారం కడు వైభవంగా సాగింది. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామి వారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా ఉరుకుంద నుంచి కోసిగి మండలం కందుకూరు గ్రామం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్రనది చెంతకు చేరారు. ముందుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కె. వాణి ఆధ్వర్యంలో తుంగభద్రమ్మకు హారతులు పట్టి సారె సమర్పించారు. అనంతరం నరసింహా స్వామికి జై.. అంటూ .. స్వామి వారికి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నది ఒడ్డున దింపుడు కట్టపై స్వామి వారిని కొలువుంచి అభిషేకాలు గావించి మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామి వారికి నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరిగి యథావిధిగా పల్లకీలో ఊరేగింపుగా బయలు దేరారు. కందుకూరు గ్రామంలో స్వామి వారికి మేళతాళాలతో డప్పువాయిద్యాలతో గ్రామ ప్రజలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కామన్దొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, గ్రామాల మీదుగా ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు, రామ్మోహన్, ఉపప్రధాన అర్చకులు మహాదేవప్ప, సీనియర్ అసిస్టెంట్ వీరేష్లు ఉన్నారు. పల్లకోత్సవం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోసిగి, కౌతాళం సీఐలు మంజునాథ్, యుగంధర్, కోసిగి, ఎమ్మిగనూరు రూరల్, పెద్దకడబూరు ఎస్ఐలు రమేష్ రెడ్డి, శ్రీనివాసులు, మారుతి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరూరా జాతర ఈరన్న స్వామి పల్లకీ చేరుకున్న గ్రామాల్లో జాతరను తలపించింది. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పల్లకీ చేరుకోగా స్వామి పాదాల చెంత భక్తులు నీటితో పాదాభిషేకం చేయగా, అడుగడునా కోక పాన్పులు పరుచగా పల్లకీ ముందుకు సాగింది. భక్తులు అడుగడునా నారికేళాలు సమర్పించి పూజలు చేపట్టారు. స్వామి పల్లకీ ముందుకు సాగిన గ్రామాల్లో గాజులు, మిఠాయి అంగళ్లు, చిన్నారుల రంగుల రాట్నాలు, బొమ్మలు అంగళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. -
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జెడ్పీటీసీ సభ్యులు
తమకు అందించాల్సిన గౌరవ వేతనాలను పూర్తి స్థాయిలో పెండింగ్లో పెట్టడంతో జెడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పలుమార్లు జెడ్పీ సీఈఓ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి వేతనాలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తమకు కూడా వేతనాలను అందించాలని ఉమ్మ డి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు కోరుతున్నారు. మరో ఇరవై రోజుల్లో తమ పదవీ కాలం పూర్తి అవుతున్న దృష్ట్యా పెండింగ్లో ఉంచిన గౌరవ వేతనాలను చెల్లించాలని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. కర్నూలు(అర్బన్): ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారంతా.. పాలనా పరమైన అంశాల్లో వారి ఆమోదం (కోరం) తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని చంద్రబాబు ప్రభుత్వం కరివేపాకులా తీసి పారేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ చిన్న చూపు చూస్తోంది. మరో ఇరవై రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం వేతనాల రూపంలో వీరికి కోట్ల రూపాయలను బకాయి పెట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందించే గౌరవ వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే తంతు! ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచుతాం.. స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెస్తాం’.. అని టీడీపీ అధినే చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వేతనం పెంచడం దేవుడెరుగు పదవీకాలం ముగుస్తున్నా గౌరవ వేతనాన్ని ఇవ్వకుండా ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా వేధించారు. హోదాలో జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా పరిషత్ చైర్మన్కు ప్రభుత్వం నెలకు రూ.40 వేలు, జెడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేలు, మండల పరిషత్ అధ్యక్షులకు రూ.6 వేలు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు (ఎంపీటీసీలకు) రూ.3 వేలను గౌరవ వేతనంగా అందించాల్సి ఉంది. ఈ మొత్తం కేవలం వారి హోదాను గౌరవించి ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనాలపై పెదవి విప్పడం లేదు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతూ వచ్చాయి. 2024 ఎన్నికల కంటే ముందు మూడు, నాలుగు నెలలు మినహా మిగిలిన ఐదు సంవత్సరాల్లో గౌరవ వేతనాలను రెగ్యులర్గా విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 27 నెలలుగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. పలు సమావేశాల్లో అడుగుతున్నా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో జరుగతున్న మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తమ వేతనాలకు సంబంధించి పలు మార్లు ప్రశ్నిస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, నేటి వరకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కూడా పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పలుమార్లు పీఆర్అండ్ఆర్డీ కార్యాలయానికి కరస్పాండెన్స్ జరుగుతున్నా, వేతనాలు విడుదల చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది. జెడ్పీటీసీలకు అందించాల్సిన గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాం. గతంలో జెడ్పీటీసీలు అందించిన వినతి పత్రాలను కూడా ప్రభుత్వానికి పంపించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. – ఆర్.సుధాకర్రెడ్డి, జెడ్పీ సీఈఓ అధికారిక లెక్కల ప్రకారం జెడ్పీ చైర్మన్తో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు నెల వరకు రూ.10,38,11,463లను బకాయి పడింది. జెడ్పీ చైర్మన్కు నెలకు రూ.40 వేల ప్రకారం 27 నెలలకు రూ.10.80 లక్షలు 52 మంది జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులకు నెలకు రూ.6 వేల ప్రకారం 27 నెలలకు రూ. 87.48లక్షలు 53 మంది ఎంపీపీ, 778 మంది ఎంపీటీసీలకు రూ.7,16,04,000 స్థానిక ప్రజాప్రతినిధులపై చంద్రబాబు ప్రభుత్వం ‘చిన్న చూపు’ జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులకు 27 నెలలుగా అందని గౌరవ వేతనం ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులదీ ఇదే పరిస్థితి వీరికి ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.8.95 కోట్లు మొత్తంగా రూ. 10.38 కోట్లు పెండింగ్ మరో 20 రోజుల్లో ముగియనున్న స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం -
హత్యాయత్నం కేసు ఛేదన
● మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితుల అరెస్ట్ఆదోని అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై జరిగిన హత్యాయత్నం కేసును ఆదోని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ వెంకటరమణ, టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నరసమ్మ భర్త శీను ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం మున్సిపాలిటీలో శీను ఉద్యోగం నరసమ్మకు లభించగా, అక్కడే పనిచేస్తున్న చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈరన్న స్థానిక అమరావతినగర్కు చెందిన శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నరసమ్మతో ఉన్న సంబంధాన్ని ఈరన్న కొనసాగించడానికి ప్రయత్నించడంతో అతని కుటుంబీకులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో నరసమ్మపై గతంలో శిరీష తన కుటుంబీకులతో కలసి దాడి చేసింది. వారిపై నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసులయ్యాయి. దీంతో పెద్దలతో పంచాయతీ జరిపిన అనంతరం ఈరన్న, శిరీష సాయిబాబానగర్లో ఉంటున్నారు. నరసమ్మతో దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులతో మనస్తాపానికి గురైన ఈరన్న ఈ ఏడాది జూలై 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరన్న మృతికి నరసమ్మనే కారణమని భావించిన శిరీష కక్ష పెంచుకుని హత్య చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై శిరీష, ఆమె తల్లి సుజాత, అత్తామామలు రాములమ్మ, ఈరన్న, ఆడబిడ్డ హేమ, చిన్నమ్మ అంజినమ్మలు దాడి చేశారు. కంట్లో కారం చల్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నరసమ్మ కేకలు వేయడంతో సహ ఉద్యోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 70 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కదలికలను గమనించి, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అమరావతినగర్ రోడ్డు, బసాపురం జంక్షన్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసును 24 గంటల్లోపు చేధించిన టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, సిబ్బందిని అభినందించామన్నారు. -
రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలి
గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు. సోమవారం కేవీకే బనవాసి ఆధ్వర్యంలో తాడిపత్రి జేసి దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం 10 మంది విద్యార్థులతో కలసి పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాల్లో పీఆర్ఏ పద్ధతులపై గ్రామీణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి గ్రామ పటం, రిసోర్స్ మ్యాపింగ్, ప్రాబ్లమ్ ట్రీ వంటి పీఆర్ఏ పద్ధతులను వివరించారు. మిరప, పత్తి, ఉల్లి తదితర పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు పసుపు నీలం జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్తిలో 13–0–45, మెగ్నీషి యం సల్ఫెట్ పిచికారి, వీఏఎం వినియోగం ద్వారా మొక్కల ఒత్తిడి తట్టుకునే శక్తి, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఉల్లిలో తామర పురుగు, ఆకు మాడు సమస్యలకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఆధారిత జీవ నియంత్రణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా ఏకాదశి ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేల్కొల్పి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ధూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీపై కొలువుదీరి తిరువీధిలో విహరించారు. -
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్గౌడ్(26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. వివాహానికి వెళ్తుండగా విషాదం మృతుడు హరీశ్గౌడ్ హైదరాబాద్లో కారు మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య కల్యాణితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో పాల్గొనండి
కర్నూలు(హాస్పిటల్): జాతీయ యువజన దినోత్సవం(స్వామి వివేకానంద జయంతి)ని పురస్కరించుకుని వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులైన యువత ముందుకు రావాలని జిల్లా యువజన అధికారి(మై భారత్ కేంద్ర) కర్నూలు అధికారి పి.ఐజయ్య కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువత అర్హులన్నారు. ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారన్నారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ ట్రాక్, సాంస్కృతిక విభాగం(జానపద గీతం/నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం), డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్, యూత్ ఎంట్రపెన్యూర్ ఛాలెంజ్, యూత్ పార్లమెంట్ విభాగాలు ఉంటాయన్నారు. ఈ విభాగాల్లో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచిన వారు జనవరి 12 నుంచి న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. పై ఆరు విభాగాల్లో సాంస్కృతిక విభాగం మినహా ఇతర ఐదు విభాగాల పోటీలు ఆన్లైన్లో నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు అధికారిక పోర్టల్ mybharat.gov.inను సందర్శించాలన్నారు. -
ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా?
● శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ధ్వజం వెలుగోడు: ఎల్నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పొలానికి మాత్రం సాగునీరు ఎలా అందుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను వివరిస్తూ, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ సోమవారం బుడ్డా శేషారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఒకవైపు ఎల్నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటికి మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు చెరువులు, కుంటలు నింపి పశువులకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కృష్ణా జలాలను, కాలువల ద్వారా వస్తున్న నీటిని చెరువులకు మళ్లించకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పొలానికి మాత్రం నేరుగా నీరు ఎలా పారుతోంది?’’ అని బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. మిగతా రైతుల పరిస్థితి ఏంటి? ‘‘కాలువల వెంట ఇరిగేషన్ అధికారులు, లస్కర్లను, సిబ్బందిని కాపలాగా పెట్టి తూముల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిఘా అంతా ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు సక్రమంగా చేరేందుకేనా? మేడం కలెక్టర్ గారు, ఎస్పీ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతుల పొలాలను పరిశీలించండి. పక్కనే ఉన్న పొలాలు నెర్రెలు వారి ఎండిపోతుంటే ఎమ్మెల్యే పొలంలో మాత్రం మనుషులను పెట్టి నీళ్లు పారిస్తున్నారు. మొన్ననే ఒక రైతు కొత్తగా బోరు వేసినా భూగర్భ జలాలు అందక కొద్దిసేపు నీరు వచ్చి మళ్లీ ఆగిపోతున్నాయి. నారుమడులు పూర్తిగా ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. సొంత పొలాలకు మాత్రమే నీరు మళ్లించుకుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ‘‘తెలుగుగంగ, కేసీ కెనాల్, ఇతర కాలువలకు నీళ్లు బ్రహ్మాండంగా పారినప్పుడు తాను రైతునని చెప్పుకోవడం సులభమే. పక్క రైతులు ప్రశ్నిస్తే అహంకారంతో సమాధానం చెప్పకుండా, ప్రజల కడుపుకొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్టుగా వ్యవహరించకండి. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించండి.’’ అని బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. గత నెల 31 పాత కక్షల నేపథ్యంలో మినుగ విజయ్, అతని అనుచరులు హసన్, విక్రమ్లు షేక్ హుస్సేన్బీ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడిని చూపించాలంటూ ఆమెతో గొడవపడి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం కర్నూలు రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అనంతరం డోన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండు విధించినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పాములపాడు: కర్నూలు – ఆత్మకూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లి గ్రామా నికి చెందిన గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం పంచర్ కావడంతో రహదారిపై పక్కకు నిలిపారు. పాములపాడు వైపు నుంచి బైక్పై జయ కృష్ణ స్వగ్రామానికి వెళ్తుండగా కంబాలిపల్లి వద్ద అదుపుతప్పి నిలిచి వున్న ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్ఐ తిరుపాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మెట్లపై నుంచి పడి..ఆదోని అర్బన్: పెద్దతుంబలం గ్రామానికి చెందిన రజాక్(35) సోమవారం ఇంట్లో మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందరన్నారు. మృతుడి భార్య గౌసియా, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుకుందలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కౌతాళం: ఉరుకుంద గ్రామం ఈరన్నస్వామి దేవాలయ పరిసర ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం కౌతాళంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిస్తే కౌతాళం పోలీసులను ఆశ్రయించాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులో గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు ప్రమాదకరమని రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీనేజ్ గర్భంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు బాల్యవివాహాల నివారణ, టీనేజీ గర్భదారణ దుష్పరిణామాలు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలకు బలవంతం చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ నిల్వ చేసిన జంక్ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. టార్చ్ లైట్లతో నిరసన ఆదోని రూరల్: రాత్రి వేళ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మండలంలోని పాండవగల్లులో సోమవారం రాత్రి సీపీఎం నాయకులు టార్చ్లైట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శివర్గ సభ్యులు జె.రామాంజనేయులు మాట్లా డుతూ.. రాత్రి సమయాల్లో అధికారులు విద్యుత్ కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలు, ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాండురంగ, అనీఫ్బాషా, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంతరెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు పాల్గొన్నారు. -
ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!
● వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్ ● నిందితుడి నుంచి బంగారు నగలు, బైక్ రికవరీ సి.బెళగల్: ఐదు రోజుల క్రితం సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మండల కేంద్రం సి.బెళగల్కు చెందిన బోయ గుంటి రంగన్నగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సి.బెళగల్ పోలీసు స్టేషన్లో కోడుమూరు సీఐ త్రబేజ్, ఎస్ఐ వేణుగోపాల్రాజుతో కలిసి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. సీఐ వివరాల మేరకు.. సి.బెళగల్కు చెందిన బోయ గుంటి రంగన్న ఇంటి వద్ద వ్యవసాయ పనులు, జీవాలను పోషిస్తున్నాడు. ఇతను సమీపంలోని సంగాల గ్రామంలో ధ్యాన పిరమిడ్ కేంద్రానికి వెళ్లేవాడు. కాగా ధ్యాన కేంద్రం పక్కనే ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు ఇల్లూరి సంజీవమ్మ ధ్యాన పిరమిడ్లో నిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉండేది. ఈ క్రమంలో వృద్ధురాలిని రంగన్న పరిచయం చేసుకుని ఆమె ఇంటిపై నిఘా ఉంచాడు. రోజూ ఆమె కదలికలను గమనిస్తూ ఆమె వద్ద ఉన్న నగలను దోచుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ ఉదయం హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్తో చంపుతా అంటూ వృద్ధురాలిని బెదిరించి, తర్వాత దాడి చేసి బంగారు గొలుసు, రెండు బంగారు గాజులను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి.బెళగల్ పోలీసులు విచారణ చేపట్టి దొంగతనానికి పాల్పడిన రంగన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.9 తులాల బరువున్న రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు చోరీకి ఉపయోగించిన బైకు, హెల్మెట్, ఇనుపరాడ్, ఇతర వస్తువులను నిందితుడిని నుంచి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ వేణుగోపాల్రాజు, కానిస్టేబుల్ శ్రీనివాసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కేసు ఛేదనలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, జానకిరాముడులను సీఐ, ఎస్ఐలు రివార్డుతో అభినందించారు. -
12న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(టౌన్): జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లోనివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ఫ్యామిలీ కేసులు, చెక్బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు, 10 సంవత్సరాలు పైబడిన సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సహకారం అందించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాదర్శి లీలా వెంకట శేషాద్రి, ఉమ్మడి కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు(టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 104 ఫిర్యాదులు అందాయన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలీలు పాల్గొన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16వ తేదీ ఆఖరు కర్నూలు(సెంట్రల్): కొత్త పింఛన్లకు అర్హులు ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై అధికారులకు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ని ర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్మెంట్ అందజేస్తారన్నారు. క్వింటా ఉల్లి రూ.4,739 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 1,224 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.1,843, గరిష్ట ధర రూ.4,739 లభించింది. మార్కెట్ యార్డులో 33 లాట్ల ఉల్లి ఉండగా.. ఎక్కువ లాట్లకు రూ.4వేల పైనే ధర దక్కింది. రైతుబజార్లలో అంతంతమాత్రం నాణ్యత ఉన్న ఉల్లినే రూ. 46–56 ప్రకారం విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిగడ్డలను నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. ఉల్లి ధరలు పెరిగి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేరుశనగ ధర కూడా పెరుగుతోంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగ గరిష్ట ధర రూ.9,426, ఆదోని మార్కెట్లో రూ.9,688, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.7,630 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్కు పత్తి 6,578 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,011, గరిష్ట ధర రూ.9,959 లభించగా.. సగటు ధర రూ.9,789 పలికింది. జవాబుదారీతనంతో సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పుడే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈఈలు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను సోమవారం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రచురించారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల గుర్తింపు ప్రక్రియ గత 18వ తేదిన ప్రారంభించి 24వ తేది వరకు కొనసాగించారు. అనంతరం గుర్తించిన ఓటరు జాబితాలను అదే నెల 25న డ్రాఫ్డ్ పబ్లికేషన్ చేశారు. 26 నుంచి 28వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సభలను నిర్వహించి ఈ నెల 6న తుది జాబితాలను సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయిలోని పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(సెంట్రల్): ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జేసీ నూరుల్ ఖమర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులకు అందించే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే ఉండాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, అనురాధ, శివప్రసాద్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియంవద పాల్గొన్నారు. -
‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ
కర్నూలు కల్చరల్: అఖిల ప్రపంచ ప్రధాన కేంద్రం మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఆదివారం వీఆర్ కాలనీలోని ఏపీ టూరిజం హరిత హోటల్లో దేశీయ సమైక్యతా సమావేశం జరిగింది. దేవాశీర్ రచించిన ‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రియల్టర్ కె.విక్రమ్ సేనా రెడ్డి, ఏపీటీడీసీ డివిజినల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, ప్రముఖ నేపథ్య గాయకులు రాగ్సాగర్, తెలుగు బాషా నిర్దేశకులు డాక్టర్ బోలుగద్దె అనిల్కుమార్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అనేక భాషల్లో ముద్రితమైనన ఈ పుస్తకం తేలికగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందన్నారు. ఒకే దేవుడు – ఒకే దేశం అనే సిద్ధాంతంతో అనేక ఆధ్యాత్మిక విషయాలు యువతరం చదివి అర్థం చేసుకునేలా ఉందన్నారు. అధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా అమూల్య జ్ఙానం పొందవచ్చన్నారు. అనంతరం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. -
పేద బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా), గుంటూరుకు చెందిన శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను పేద బలిజ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు (స్కాలర్షిప్)లు పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రోపా అధ్యక్ష, కార్యదర్శులు చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ, కత్వా రాష్ట్ర రాష్ట్ర నాయకులు పెద్ది లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఆయా సంఘాల కార్యవర్గ సమావేశం కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, బీ ఫార్మసి, ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో 2026–27 అకడమిక్ సంవత్సరంలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు నూతనంగా ఫార్మ్–ఎ, గత యేడాది ఉపకార వేతనాలు పొందిన వారు, రెన్యువల్ కోసం ఫార్మ్–బి దరఖాస్తులు సమర్పించాలన్నారు. పదవ తరగతిలో, తదనంతర కోర్సుల్లో ప్రతి సంవత్సరం కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంసెట్లో 30వేల లోపు ర్యాంకు పొంది ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్, ఈ యేడాది ఫీజు రశీదు, తెల్ల రేషన్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), విద్యార్థి ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచాలని తెలిపారు. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్, ఆత్మకూరు, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లోని రోపా నియోజకవర్గ సమన్వయకర్తల వద్ద అప్లికేషన్లు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అందించాలన్నారు. అనంతరం వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించి పదవీ విరమణ పొందిన రోపా సభ్యులను కార్యవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బీఏ శ్రీనివాసరావు, రోపా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్, సంఘం పెద్దలు ఐ.వెంకటేష్, సుబ్రహ్మణ్యం, కామిని వెంకటేశ్వర్లు, యక్కంటి శ్రీనివాసులు, జానకి శ్రీనివాసులు, మధుసూదనరావు, గద్వాల ఈరన్న, చింతల జ్యోతిర్మయి, బ్రాహ్మణి పాల్గొన్నారు. -
నేడు ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం
కోసిగి/మంత్రాలయం: శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం నేడు అత్యంత వైభవంగా జరుగనుంది. వేకువజామన ఉరుకుంద క్షేత్రంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా బయలుదేరి తిప్పలదొడ్డి, కామన్దొడ్డి, కందుకూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ దింపుడు కట్టపై స్వామి వారు ఆశీనులు కానున్నారు. తుంగభద్ర నదిలో చక్రస్నానం నిర్వహించి వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు, కామన్దొడ్డి, తిప్పలదొడ్డి మీదుగా ఉరుకుంద ఈరన్న క్షేత్రానికి సాయంకాలానికి పల్లకోత్సవం పాదయాత్ర చేరుకుంటుంది. పల్లకోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వే లాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కోసిగి, కౌతాళం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయించారు. నదితీరంలో గ్రావెల్తో ర్యాంపు ఏర్పాటు పల్లకోత్సవం యాత్ర సందర్భంగా కందుకూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి.మురళీమోహన్ రెడ్డి సహకారంతో గ్రావెల్ ర్యాంపు, రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టినట్లు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బెట్టన గౌడ, గ్రామస్తులు తాయన్న, రామన్న, శివరాం, శేఖర్ గౌడ తెలిపారు. రామలింగేశ్వర ఆలయం నుంచి నది ఒడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను జేసీబీతో తొలగించారు.అలాగే నదిలో నీరు తక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతానికి వెళ్లేందుకు కంకర రాళ్లు, గ్రావెల్ వేసి మార్గం ఏర్పాటు చేయించారు. ఊరూరా సంబరాలు ఈరన్న స్వామి రాకతో ఆయా గ్రామాల్లో పండగ జరుపుకుంటారు. పిండి వంటలతో స్వామికి నైవేద్యాలు, నారీ కేళాలు సమర్పిస్తారు. కందుకూరు గ్రామంలో జాతర చేసుకుని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉరుకుంద గ్రామంలోనూ ఇదే విధంగా వేడుక చేసుకుంటారు. ఊరూరా భక్తులు పల్లకీ ముందు బోర్లాపడి తమ శరీరాలపై పల్లకీ దాటుకుని వెళ్లేలా చూసుకుంటారు. ఈ వేడుక శ్రావణ మాసోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి
● ఖాతాలోని రూ.62 వేలను కాజేసిన దుండగుడుఆదోని అర్బన్: ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మహిళను గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో పెట్టి కార్డును తీసుకుని, తన వద్దనున్న నకిలీ కార్డును ఇచ్చి ఆమె ఖాతాలోని రూ.62 వేలను కాజేసిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదోని, ఇందిరానగర్కు చెందిన అంగన్వాడీ టీచర్ తిమ్మక్క తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మహిళకు డబ్బు అవసరం ఉండడంతో గత నెల 28న ఆస్పరి రోడ్డులో ఉన్న ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. ఏటీఎంలో నగదు విత్ డ్రా చేయడం తెలియకపోవడంతో పక్కనున్న గుర్తు తెలియని వ్యక్తిని సాయం కోరింది. అతడు నగదు డ్రా చేస్తున్నట్లు నటించి, మిషన్లో డబ్బు రావడం లేదని చెప్పి ఆమె కార్డును తీసుకొని బదులుగా తన వద్దనున్న మరో కార్డును ఆమెకు ఇచ్చాడు. తనకు రూ.9 వేలు డబ్బు అత్యవసరం ఉందని ఆమె చెప్పడంతో ఆ వ్యక్తి తన వద్ద నగదు ఉందని రూ.30 కమీషన్తో కలిపి మొత్తం ఫోన్పే చేయించుకుని నగదు ఇచ్చాడు. తర్వాత ఎవరి దిక్కు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మక్క మరోసారి డబ్బు అవసరమై ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్లగా కార్డు తనది కాదని తెలుసుకుంది. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చూసుకోవడంతో రూ.62 వేలు డ్రా చేసినట్లు తెలుసుకుని ఆదివారం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
కృష్ణగిరి: మండల పరిధిలోని కోయిలకొండ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 18 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు గోపాల్, ఈశ్వర్, గంగాధర్, శ్రీను, రంగనాథ్ తెలిపారు. పోటీలను దాతలు, గ్రామపెద్దలు ఆంజనేయులు, గంగన్న, దస్తగిరి, లక్ష్మి ఈశ్వరయ్య, శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడాకారులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ప్రైవేటు నుంచి వచ్చిన వారి వల్లే !
కర్నూలులోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చివరి నిమిషంలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో డబ్బులు అయిపోయాక గత్యంతరం లేని పరిస్థితిలో పెద్దాసుపత్రికి వస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో అవసరమైన వైద్యం అందించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మరణాల సంఖ్య ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. కీలక విభాగాల్లో రోగులకు చికిత్స అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యసేవల విషయంలో ఎలాంటి లోపమూ ఉండదు. –డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
క‘రుణ’ లేక.. కష్టాలు తొలగక!
కర్నూలు (అగ్రికల్చర్): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు రైతులకు పంట రుణాలు పంపిణీ చేస్తాయి. దాదాపు ఆరు నెలలు అవుతున్నా.. పంట రుణాల పంపిణీ అంతంతమాత్రానికే పరిమితం అయ్యింది. ఐదు నెలల వ్యవధిలో 61.17 శాతం మాత్రమే పంట రుణాలు పంపిణీ చేశారు. ఖరీఫ్ సీజన్ ఈ నెల చివరితో ముగియనుండగా బ్యాంకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. పంపిణీ చేసింది రూ.2,543 కోట్లు ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు 4.34 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3,48,390 హెక్టార్లలో పంటలు వేశా రు. ప్రధానంగా పత్తి 2,33,984 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్లో 3,98,647 మంది రైతులకు రూ.4,157.40 కోట్లు పంట రుణాల పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,42,770 మంది రైతులకు రూ.2,542.24 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. జిల్లా లో కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తోంది. మొత్తం 85,617 మంది రైతులకు రూ.1490 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే 31 వేల మందికి రూ.702 కోట్లు మాత్రమే పంటరుణాలు పంపిణీ చేశారు. బ్యాంకుల నిర్లక్ష్యం! రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెల చివరిలో ముగియనుంది. అక్టోబరు 1 నుంచే పంపిణీ చేసే రుణాలు రబీ కిందకు వస్తాయి. ఖరీఫ్ ముగింపు దశకు చేరినప్పటికీ 61.17 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. పలు బ్యాంకులు పాత రుణాలను రెన్యువల్ చేసి చేతులు దులుపుకున్నాయి. కొత్తగా ఒక శాతం మందికి కూడా పంట రుణాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వివిధ బ్యాంకుల్లో దళారీల హవా నడుస్తోంది. మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు దళారీలను పెట్టుకుని పంట రుణాల పంపిణీలో మా మూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి మండలాల్లోని ఎస్బీఐ, ఏపీజీబీ, యూనియన్ బ్యాంకులో దళారీలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు బ్యాంకులు సహకరించకపోవడంతో ప్రయివేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 23 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతంతమాత్రమే! వ్యవసాయ రంగం, ప్రాధాన్యత రంగం, ప్రాధాన్యేతర రంగాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.22,323 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. ఆర్థిక సంవత్పరం మొదలై దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.8,368 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే 37.49 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో రు ణాల పంపిణీ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది పంట రుణాలు, అగ్రికల్చర్ టర్మ్లోను, వ్యవసాయ మౌలిక సాదుపాయాలు తదితర వాటికి రూ.10,630 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే ఆగస్టు చివరి నాటికి రూ.3857.19 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో 36.29 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఫ్రాధాన్య రంగంలోకి వచ్చే డీఆర్డీఏ, మెప్మాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ నామమాత్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎంఎస్ఎంఈ కింద ఈ ఏడాది 27933 మందికి పరిశ్రమల ఏర్పాటుకు రూ.4585 కోట్లు రుణాలుగా పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 7900 మందికి రూ.1922 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి.కౌలురైతులను పట్టించుకుంటే ఒట్టు!అన్నదాత సుఖీభవ పథకం రెండేళ్లుగా ఒక్క కౌలు రైతుకు కూడా అమలు కాలేదు. ఈ ఏడాది 14,000 సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. అత్యధికంగా ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు, గూడూరు, హొళగుంద, మద్దికెర, తుగ్గలి, నందవరం మండలాల్లో సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. సీసీకార్డులను బ్యాంకర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో కౌలుదారులకు రూ.45 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులు జేఎల్జీ గ్రూపులుగా ఏర్పాటు కావడంతో రూ.65 లక్షలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఏ పంటలో కూడా క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో రైతులు వాతావరణ ఆదారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై దృష్టి సారించారు. బ్యాంకుల్లో పంట రుణం ఉన్న రైతులు బ్యాంకుల ద్వారానే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అయితే బ్యాంకులు సహకరించకపోవడంతో రైతులు నాన్ లోని కింద ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 1,92,884 దరఖాస్తుల ద్వారా రైతులు ప్రీమియం చెల్లించారు. రుణాల పంపిణీలో కనిపించని పురోగతి ఖరీఫ్ లక్ష్యం రూ.4,157 కోట్లు ఆగస్టు వరకు పంపిణీ చేసింది రూ.2,543 కోట్లు అప్పులబాధతో 23 మంది రైతుల ఆత్మహత్య -
కారు ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం జాతీయ రహదారిలో చెట్నేహళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం బెస్త తేజ (12)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. బెస్త తేజ మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో మంత్రాలయంలో పూలు అమ్ముతున్న అమ్మ (భీమేశ్వరి)కి మధ్యాహ్నం క్యారియర్ ఇచ్చి 2 గంటల సమయంలో తిరిగి వస్తున్నాడు. చెట్నేహళ్లి పంచాయతి కార్యాలయం వద్ద ఆటో దిగిన తేజ రోడ్డు దాటుతుండగా రాయచూరు వైపు నుంచి వస్తున్న కారు (జీజే 16 సీఏ 8320) వేగంగా ఢీకొట్టింది. రాయచూరుకు చెందిన దర్శన్ రాజ్ (19) కారు నడుపుతున్నాడు. ప్రమాదంలో బాలుడి దవడ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. తల్లి, బంధువులు వచ్చి బాలుడికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. బాలుడి చిన్నమ్మ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సర్క్యూట్ బెంచ్ వద్దు.. శాశ్వత హైకోర్టు బెంచ్ కావాలి
● నినాదాలతో హోరెత్తించిన న్యాయవాదులు కర్నూలు: ‘సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ కావాలి’ అంటూ నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 14వ రోజు ఆదివారం కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని న్యాయవాదులు ప్లకార్డులను ప్రదర్శించారు. హైకోర్టు బెంచ్ కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో న్యాయవాదులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకు అన్ని పక్షాల రాజకీయ నేతలు, ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు స్పష్టం చేశారు. న్యాయవాదుల దీక్షలో సాద్విక, నిస్సీ, జి.మురళీకృష్ణ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈదుల బాలాజీ రెడ్డితో పాటు న్యాయ విద్యార్థి హేమంతేశ్వర మునిరాజు పాల్గొన్నారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున తమ విధులు బహిష్కరించి దీక్షా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, లైబ్రేరియన్ ఎండి మహేష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, కపిలేశ్వరయ్య, ఓంకార్, నాగేంద్రనాథ్, నాగలక్ష్మి దేవి, వై.జయరాజు, గోపాల్, రాజేంద్ర, శ్రీరాముడు, జూనియర్ న్యాయవాదులు గోతం శేఖర్, షేక్ అఫ్రోచ్ బాషా, మధుకుమార్ నాయుడు తదితరులు దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు తెలిపారు. -
ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు
మద్దికెర: ఎల్నినో ప్రభావంతో వర్షాల్లేక ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇంట్లో ఫ్యాన్ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గంటల తరబడి ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. దీంతో సామాన్యులు నిద్ర లేక అల్లాడిపోతున్నారు. విద్యుత్ అధికారులను అడిగితే తమకు షెడ్యూల్ ఇవ్వకుండా మొయిన్ సప్లై పోయిందంటున్నారు. గాలిమరలు, సోలార్ పవర్ ఉంది కదా అని ప్రశ్న వేస్తే ఏమీ సమాధానం ఇవ్వడం లేదు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వానాకాలంలో భగ్గుమంటున్న ఎండలు కర్నూలు (అగ్రికల్చర్): వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఏప్రిల్, మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు సెప్టెంబర్లో నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంది. కానీ ఆదివారం కర్నూలులో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 38, 39 డిగ్రీలు కూడా నమోదయినట్లు తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే లక్ష హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చింది. తాజా ఉష్ణోగ్రతల తీవ్రతకు పంటలపై రైతులు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వింటా వేరుశనగ రూ.9,040 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.9,040 ధర లభించింది. మార్కెట్కు 861 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.6,100, మధ్యస్థంగా రూ.7,669 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
నిమజ్జనానికి నీళ్లు ఇవ్వకుంటే పోరాటం చేస్తాం
● మంత్రి టీజీ ప్రత్యామ్నాయం ఆలోచించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు (టౌన్): భక్తిశ్రద్ధలతో కర్నూలులో ఎంతో వైభవంగా నిర్వహించుకునే వినాయక నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకుంటే పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. కర్నూలు ప్రజల విశ్వాసాలతో ఆటలాడవద్దని, అధికారులతో మంత్రి టీజీ భరత్ చర్చించి ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ కర్నూలులో పెద్ద ఎత్తున వేల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రూ.10 కోట్ల వరకు అడ్వాన్సులు ఇచ్చారని, కొన్ని మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఈ దశలో మంత్రి టీజీ భరత్ ఒక అడుగు ఎత్తు ఉన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లో నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే వాటిని నిమజ్జనం చేయకుండా వచ్చే ఏడాది చేసుకోవాలని అవసరమైతే వాటిని భద్రపరుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీళ్లు లేవని తెలిసినప్పుడు నెల రోజుల ముందే ఎందుకు చెప్పలేదని, ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని ఏడాది వరకు పక్కన ఉంచితే, వచ్చే ఏడాది కూడా వర్షాలు లేకపోతే ఏం చేస్తారని మంత్రిని ప్రశ్నించారు? ప్రజల ఆధ్యాత్మి క మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. వినాయక నిమజ్జనాన్ని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారని, కర్నూలులో ముస్లింలు సైతం మసీదుల వద్ద హిందువులకు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు అందించి మతసామరస్యాన్ని కాపాడుతారన్నారు. -
వ్యక్తి అదృశ్యం
ఆదోని రూరల్: మండలంలోని గణేకల్లు గ్రామానికి చెందిన మేసీ్త్ర నాగరాజు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించకుండా పోయాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్టాండు వద్ద అదృశ్యమయ్యాడని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 90591 26816, 97010 97287 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ ఎమ్మిగనూరురూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బ్యాగ్ను తిరిగి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ లక్ష్మన్న. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాగలదిన్నెకు వెళ్లిన నైట్ సర్వీస్ బస్సులో ప్రయాణికుడు బజారప్ప హ్యాండ్ బ్యాగ్ మరచిపోయాడు. రాత్రి డ్యూటీలో ఉన్న కండెక్టర్ బ్యాగ్ను గుర్తించి, చెక్ చేయగా అందులో రూ.5,500 నగదు, రేషన్ కార్డు ఉంది. రేషన్కార్డులోని వివరాల ఆధారంగా ప్రయాణికుడిని గుర్తించి ఆదివారం ఆర్టీసీ డిపోకు రప్పించి నగదు, బ్యాగ్ అప్పగించారు. ఇందుకు సదరు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ డీఎం మద్దిలేటినాయుడుతో పాటు తోటి ఉద్యోగులు కండెక్టర లక్ష్మన్నను అభినందించారు. బైక్ ఢీకొని మహిళ దుర్మరణం ఆళ్లగడ్డ: మండల పరిధిలోని నల్లగట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయలక్ష్మమ్మ (60) మృతి చెందారు. జయలక్ష్మమ్మ హైవే రోడ్డు దాటుతుండగా నంద్యాలకు చెందిన సమీర్ ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు బైక్పై వెళ్తూ ఢీ కొట్టా డు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడిక్కడే మృతి చెందగా గాయపడ్డ సమీర్ను నంద్యాల వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణానదిలో మునిగి యువకుడి మృతి శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని కృష్ణానదిలో మునిగి ముంబైకి చెందిన సచిన్రాజ్పుత్(22) మృతి చెందాడు. ముంబైకి చెందిన అభిషేక్ చతుర్వేది(29) అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విప్రో ఉద్యోగి సచిన్, ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి అభిషేక్ తెలంగాణ వైపు ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ఎగ్జిట్ టన్నెల్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణానదిలో స్నానం చేస్తు మునిగిపోయారు. గమనించిన స్థానిక మత్స్యకారులు ఇద్దరిని బయటకు తీసుకురాగా సచిన్ అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అభిషేక్ను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అదృశ్యమైన మహిళల ఆచూకీ తేల్చాలి నంద్యాల(న్యూటౌన్): అదృశ్యమైన మహిళల ఆచూకీ తక్షణమే తేల్చాలని నంద్యాల జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా అదృశ్యమై మిస్టరీగా మారిన నంద్యాలకు చెందిన నజియా, రాయపాడుకు చెందిన వివాహిత ఆదిలక్ష్మి ఆచూకీని తక్షణమే తేల్చాలన్నారు. గత నెల 18వ తేదీన అదృశ్యమైన ఈ ఇద్దరు మహిళలు ఎక్కడికి వెళ్లారు, వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయాలపై రోజులు గడుస్తున్నా స్పష్టత రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందనన్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నజియా అదృశ్యం వెనుక ఆదిలక్ష్మి ప్రమేయం ఉందనే అనుమానాలతో గత రాత్రి రాయపాడులోని ఆదిలక్ష్మి ఇంటి వద్ద నజియా బంధువులు ప్రశ్నించడం, ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని, బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చామంతి తోట తొలగింపు బేతంచెర్ల: చామంతి తోటను ట్రాక్టర్తో దున్నేస్తున్న ఈ రైతు పేరు పిళ్లి సూర్యనారాయణ. బేతంచెర్ల మండలం సీతారామాపురానికి చెందిన ఈయన జూలైలో రెండెకరాల్లో 50 వేల సెంటు చామంతి రకం మొక్కలు నాటాడు. వర్షాలు లేక పంటలో ఎదుగుదల లోపించింది. ఎండుకొమ్మ తెగులు సోకడంతో ఆదివారం పంటను ట్రాక్టర్తో ఇలా దున్నించేశాడు. సాగు కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరాడు. -
ఏటా పెరుగుతున్న మరణాలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగుల్లో మరణించే వారి శాతం ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి అత్యవసర వైద్యపరిస్థితులైన ఆత్మహత్యాయత్నాలు, హత్యాయత్నాలు, దాడులు, వివిధ రకాల ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం, ఆయాసం, మూత్రపిండాల వ్యాధులతో చికిత్స కోసం వస్తుంటారు. ఇలాంటి వారిలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే క్యాజువాలిటీ, ఏఎంసీ విభాగాల నుంచి బయట పడి డిశ్చార్జ్ అవుతున్నారు. మొత్తంగా ఆసుపత్రిలో గత యేడాది రోజూ మరణాల సంఖ్య 15 నుంచి 18 దాకా ఉండగా ఈ యేడాది అది 18 నుంచి 22కు పెరిగింది. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగర నడిబొడ్డున ఉన్న పెద్దాసుపత్రికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే గాక అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధికంగా చికిత్స కోసం వస్తారు. ఈ మేరకు ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో ఇతర ప్రాంతాల మాదిరిగా డబ్బు రొటేషన్ ఉండదు. అందుకే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకే రోగులు చికిత్స కోసం వెళతారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోతే సమీపంలోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తారు. వ్యాధి తగ్గకపోతే ఎక్కువ శాతం కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే వస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యపరీక్షలు, వైద్యులు, సిబ్బంది చికిత్స అంతా ఉచితం కాబట్టి. ఇవే పరీక్షలు, చికిత్సలు బయట చేయించుకునే స్థోమత లేక వారు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ మేరకు ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 3 వేల నుంచి 3,500ల దాకా, ఇన్పేషంట్ల సంఖ్య నిత్యం 1300 నుంచి 1500ల దాకా ఉంటోంది. క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్ వంటి విభాగాల్లో అయితే ఒక్కో పడకపై ఇద్దరు రోగులు చికిత్స తీసుకునే పరిస్థితి ఉంటుంది. అత్యవసరమైతే అంతే గతి! ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దగా రద్దీ ఉండదు. ఆ తర్వాత ఓపీ చికిత్స దాదాపుగా ముగిసిపోతుంది. దీంతో ఓపీ చికిత్సకు వచ్చిన రోగులు ఇక్కడికే వస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. అందుకే ఏదైనా అత్యవసర చికిత్స వస్తే రోగులు నేరుగా ఇక్కడికే వస్తారు. ఇలా వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ఆ సమయంలో ఇక్కడ జూనియర్ వైద్యులు మినహా పెద్ద డాక్టర్లు ఎవ్వరూ కనిపించరు. జూనియర్ వైద్యుల్లోనూ కొందరు వారి జూనియర్లపై భారం వేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విభాగంలో నర్సింగ్ సిబ్బందే ఎక్కువగా రోగుల పక్కన సేవలందిస్తూ కనిపిస్తారు. ఇక రాత్రివేళల్లో ఇక్కడి సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు అనే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన డ్యూటీ డాక్టర్ సాయంత్రం వస్తారు. వచ్చిన కొన్ని గంటలు మాత్రమే ఉండి, రాత్రి భోజనానికి అంటూ వెళ్లిపోయి మళ్లీ రారన్న విమర్శలు ఉన్నాయి. రోగులకు అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే డ్యూటీ డాక్టర్లకు జూనియర్ వైద్యులు ఫోన్ చేసి వివరాలు చెప్పి చికిత్స అందించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మరునాడు ఉదయం వచ్చే డ్యూటీ డాక్టర్లు రాత్రి ఉండే ఓపీ టికెట్లను పరిశీలించి వార్డుల్లో అడ్మిట్ చేసే కేసులు అధికంగా ఉంటున్నాయి. అప్పటి వరకు రోగులు ఇక్కడే ఉండి చికిత్స అందుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)కు రోగి వెళితే అలాగే పైకి వెళతారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలోనూ ఎక్కువగా జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపైనే వైద్యసేవలు ఆధారపడి ఉంది. వీరిలో కొందరికి రోగులకు అమర్చిన మానిటర్లు, వెంటిలేటర్లు సైతం సరిగ్గా చూడటం రాదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్లు మొక్కుబడిగా వైద్యం చేసి వెళ్లిపోతూ జూనియర్లపై భారం వేస్తున్నారు. దీనికితో ఈ విభాగంలో వైద్యపరికరాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, వాటిలో రోగికి అవసరమైన ఆక్సిజన్ ఎంత మేరకు వెళ్తుందన్న పర్యవేక్షణ కూడా కరువైంది. ఇన్ఫెక్షన్ రేటు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు పెద్దాసుపత్రి... పెద్ద డాక్టర్లుంటారని, ఇక్కడికి వెళ్తే రోగాలు నయం అవుతాయని, బతికి బయటపడొచ్చని రోగుల నమ్మకం. ఇది ఒకప్పటి మాట. నేడు ఈ ఆసుపత్రికి వెళితే తిరిగి ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆసుపత్రిలోని పై అంతస్తులో ఉన్న ఏఎంసీ విభాగంలో చేరిన వారు 80 శాతానికి పైగా మరణిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పెద్దాసుపత్రిలో మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోంది. గతేడాది నెలకు 500కు పైగా మరణాలు ఈ యేడాది 600లకు చేరువగా! క్యాజువాలిటీ, ఏఎంసీల్లోనే ఎక్కువ అందుబాటులో ఉండని డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం మరీ దారుణంపేరుకే ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఆసుపత్రిలోని క్యాజువాలిగా(అత్యవసర చికిత్స విభాగం)ని గత ప్రభుత్వంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంగా మార్చారు. ఈ మేరకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. క్యాజువాలిటీకి బోర్డులో ఎమర్జెన్సీ మెడిసిన్ అని పేరు మాత్రమే మార్చారు. సేవలన్నీ పాత క్యాజువాలిటీ మాదిరిగానే కొనసాగుతున్నాయి. అత్యవసర వైద్యసేవలు ఇక్కడ మొక్కుబడిగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వారికి అందే వైద్యం దైవాధీనం అన్న చందంగా సాగుతోంది. సీనియర్ వైద్యులు, నర్సులు సీట్లను వదిలి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం వైద్యసేవలను జూనియర్లపై వదిలేసి రికార్డులు రాసుకోవడానికే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ విభాగంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. నెల 2025 2026జనవరి 539 631 ఫిబ్రవరి 552 626 మార్చి 466 661 ఏప్రిల్ 544 550 మే 561 655 జూన్ 547 608 జులై 582 549 ఆగస్టు 519 590 -
పూజారి ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్ట్
గోస్పాడు: నిరాధార ఆరోపణలతో వేధించి పూజారి ఆత్మహత్యకు కారణమైన నలుగురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరాముడు గ్రామంలోని గంగమ్మ ఆలయ కార్యకలాపాలను వంశపారంపర్యంగా వచ్చిన బాధ్యతల ప్రకారం నిర్వహిస్తున్నాడు. ఏడుగురు వ్యక్తులు అతనిపై ఆలయ నిధులను దుర్వినియోగం చేశాడని నిరాధార నిందలు మోపి, గ్రామంలో బహిరంగంగా పలుమార్లు అవమానించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ నెల 1న సూసైడ్ నోట్ రాసి అర్ధరాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి కుమారుడు తెలుగు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోస్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులు గోటికె మల్లికార్జున రెడ్డి, మునగబోయిన నాగరాజు, నాగ మద్దిలేటి, అన్నలదాసు ఓబులేసు నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. మిగతా ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ చెప్పారు. -
ఎఫ్బీటీ యాప్ పేరుతో భారీ మోసం
● సుమారు రూ.కోటి కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు!బండిఆత్మకూరు: అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఎఫ్బీటీ యాప్ పేరుతో బండిఆత్మకూరు మండలం ఎరగ్రుంట్ల గ్రామస్తులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి దాదాపు రూ.కోటి వరకు నగదు సేకరించి మోసానికి పాల్పడినట్లు సమాచారం. తొలుత యాప్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. కొంతకాలం పాటు లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుల్లో విశ్వాసం కల్పించారు. అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. నగదును వివిధ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. యాప్లో చూపించిన నగదును విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. పంటలు లేవు కదా అని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి కొంత డబ్బును తీసుకున్నా. ఐదు రూపాయల వడ్డీ ద్వారా కొంత డబ్బును తీసుకున్నా. ఎఫ్బీటీ యాప్ పేరుతో రూ. 3 లక్షలను ఫోన్ పే ద్వారా చెల్లించా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. – కుమారి , బాధితురాలు -
హైకోర్టు బెంచ్ సాధనకు ఉద్యమం ఉధృతం
● రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాదులు, రాజకీయ పక్షాల నిర్ణయంకర్నూలు: శాశ్వత హైకోర్టు బెంచ్ సాధన కోసం ఉద్యమం మరింత ఉధృతం చేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు నిర్ణయించాయి. న్యాయవాదుల సంఘం భవనంలో శనివారం నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ, విద్యార్థి, రైతు, కార్మిక, సామాజిక సేవా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు సమావేశంలో పాల్గొని న్యాయవాదుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు సహకారం అందిస్తామని ఆయా రాజకీయ పక్షాలు, సంఘాల ప్రతినిధులు స్పష్టంగా హామీ ఇచ్చారు. న్యాయవాదుల దీక్షకు మద్దతుగా రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని హామీ ఇచ్చారు. 13వ రోజు కొనసాగిన న్యాయవాదుల దీక్షలు... శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్తో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహారదీక్షలు 13వ రోజు కూడా కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. అనిశెట్టి నీరజ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈడిగ బుద్దిరాజు గౌడ్, గైక్వాడ్ భరత్ కుమార్, షేక్ మాసూం వలి, పీఎస్ హరీష్ రెడ్డి తదితరులు శనివారం నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. సోమవారం జనరల్ బాడీ సమావేశం శాశ్వత హైకోర్టు బెంచ్ సాధన కోసం తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు సోమవారం న్యాయవాదుల జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, జయరాజు, బి.మురళీమోహన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు
● సచివాలయాల సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక కర్నూలు(సెంట్రల్): స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది తప్పనిసరిగా నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ నుంచి మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది హాజరు 62 శాతం మాత్రమే నమోదైనట్లు గుర్తించామన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందించేందుకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. హాజరులో నిర్లక్ష్యం కనిపిస్తే సంబంధిత మండల స్థాయి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాల్లో వివిధ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.a p.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్యూ నుంచి విద్యార్థి బహిష్కరణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ మూడవ సెమిస్టర్ చదువుతున్న సుగాలి కృష్ణ నాయక్ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఈనెల 2న వర్సిటీలో అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, అభ్యంతరకర భాషను ఉపయోగించడం లాంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసీ కెనాల్కు కృష్ణా జలాలు పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ నుంచి రెండు మోటర్ల ద్వారా కేసీ కెనాల్కు కృష్ణా జలాలను విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ వీరమ్మ శనివారం తెలిపారు. కేసీ కాలువ పరివాహక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడానికి పది రోజుల పాటు నీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క మోటార్ నుంచి 240 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అలాగే మల్యాల లిఫ్ట్ నుంచి 330 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అయితే కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ఉరితాళ్లతో నిరసన చేసిన ఐదు రోజుల వ్యవధిలోనే అధికారులు నీటి విడుదల చేయడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాకిన్స్లా వద్ద లాకులు జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి 480, మల్యాల నుంచి 325 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 120 కిలోమీటరు వద్ద నుంచి నిప్పులవాగు, తూడిచెర్ల సబ్ఛానల్ కాల్వకు వెళ్లకుండా అధికారులు లాకిన్స్లా వద్ద లాకులు మూసివేశారు. ఈ విషయమై కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలు వెలువడిన తర్వాత దిగువ కాల్వలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. -
‘ఉమ్మడి’ పాలనకు తెర.. ఇక వేర్వేరు జెడ్పీలు!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను పునర్విభజన చేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం జీఓఎంఎస్ నెం.115 జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా పరిషత్ ఆవిర్భవించనుంది. ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదితో ముగియనుంది. ఆ మేరకు కొత్త జిల్లా పరిధులకు అనుగుణంగా జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఏర్పా టు కానున్న నంద్యాల జిల్లా పరిషత్కు సీఈఓ, డిప్యూటీ సీఈఓలను ప్రభుత్వం త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలులో మొత్తం 53 మండలాలు ఉండగా.. కర్నూలు జిల్లా పరిషత్ పరిధిలోకి 25 మండలాలు, కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా పరిషత్ పరిధిలోకి 28 మండల పరిషత్తులు ఉండనున్నాయి. ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగిసిన అనంతరం రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా పాలనా వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ● 1959లో కర్నూలు జిల్లా పరిషత్ ఏర్పాటు కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా పాలన సాగించగా, ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి చైర్మన్గా యర్రబోతుల పాపిరెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారు. కోట్ల విజయభాస్కర్రెడ్డితో పాటు యర్రబోతుల పాపిరెడ్డి వరకు మొత్తం 16 మంది చైర్మన్లు కర్నూలు జిల్లా పరిషత్ పాలనలో భాగస్వామ్యులయ్యారు. ఈ నెల 24తో ముగియనున్న జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీల పదవీ కాలం నంద్యాలలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు చర్యలు -
తూతూ మంత్రంగా గురుపూజోత్సవం
● స్థానికంగానే ఉన్నా కన్నెత్తి చూడని మంత్రి టీజీ భరత్ ● గ్రూప్ ఫొటోకు మాత్రమే హాజరైన కలెక్టర్డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులుఆకట్టుకున్న నృత్య ప్రదర్శనకర్నూలు(సెంట్రల్): జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శనివారం తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కలెక్టరేట్లోనే అందుబాటులో ఉన్నా మిగతా పనులతో బిజీగా ఉండి రాలేకపోయారు. దీంతో డీఈఓ ఎల్.సుధాకర్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆర్ఐఓ లాలెప్ప, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ లోకరాజు హాజరై జ్యోతిప్రజ్వలన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే మధ్యలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు రావడంతో మరోసారి సర్వేపల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ రెండు నిమిషాలు మాట్లాడి ఇతర పనులు ఉన్నాయంటూ వెళ్లిపోయారు. చివరగా కలెక్టర్ గ్రూప్ ఫొటో దిగడానికి మాత్రమే వచ్చి మమ అనిపించడం గమనార్హం. కార్యక్రమంలో మొత్తం 48 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటోతో సన్మానించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు లెక్చరర్గా పనిచేశానని, ఉపాధ్యాయులే సమాజ మార్గనిర్దేశకులని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్యక్రమంలో బీక్యాంపు గర్ల్స్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వందేమాతరం గేయాన్ని, శారద నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, డీవైఈఓ శ్రీధర్ పాల్గొన్నారు. -
బోధన సృజనాత్మకం
విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. అందులో తుగ్గలి మండలం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అద్దంకి చంద్రమోహన్ ఒకరు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆయన ప్రస్తుతం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. 2008లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పలు పాఠశాలల్లో పని చేశారు. టీఎల్ఎం (టీచింగ్, లెర్నింగ్, మీటీరియల్) రూపొందించారు. స్వతహాగా చేసిన టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సాంకేతికత సాయం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్నంగా పాఠాలు బోధించడం ఆయన ప్రత్యేకత. వంద శాతం ఎన్రోల్ మెంట్, నో బ్యాగ్ డే, యోగా, క్విజ్, చిత్ర లేఖనం తదితర వాటిని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండే విధంగా సబ్జెక్టుల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. జీ.ఎర్రగుడి పాఠశాలలో పనిచేసిన సమయంలో రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం, 2024లో ఉపాధ్యాయ రత్న, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చంద్రమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని, భవిష్యత్లో మరింత మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. – తుగ్గలి -
బాబు, పవన్, లోకేష్.. జాబ్లు మీకేనా, మాకివ్వరా?
● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల మూడు రోజుల రిలే నిరాహారదీక్షలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
చెంచు విద్యార్థుల చదువులకు ‘ఆధార’మై..
నిరుపేద కుటుంబంనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అతను పేద విద్యార్థులకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆత్మకూరు మండలం బాపునంతపు రం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 16 ఏళ్ల క్రితం 2010 నవంబర్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం కొట్టాలచెరువు చెంచుగూడెంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వ హిస్తున్నారు. చెంచుగిరిజన పిల్లలు చదువుకు దూరంగా ఉండడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సొంత ఖర్చులతో రంగులు వేయించారు. పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డులు అందజేశారు. వెదురుబొంగులతో అదనపు తరగతి గదిని ఏర్పాటు చేయించారు. ఆర్డీటీ సహకారంతో విద్యా వలంటరీ నియమించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ఏర్పాటు చేయించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చెంచు గిరిజన గూడెం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. – ఆత్మకూరు -
చదువుల వనంలో సాహితీ సేద్యం
డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ దేవేంద్రప్ప రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఈయన 2002 డీఎస్సీలో ఎంపికై తెలుగు ఉపాధ్యాయునిగా అవుకు మండలం కునుకుంట్ల పాఠశాలలో చేరారు. ఈయన తెలుగు భాషపై పట్టు సాధించి సాహిత్యంపై అడుగులు వేశారు. విధులు నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు భాషాభివృద్ధి, బాల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడంతో పాటు నైతిక విలువలు, సృజనాత్మక, క్రమశిక్షణ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు. సాహిత్యం పట్ల మక్కువతో ఆయన ఆశావాది, ఆభ్యుదయ భావకుడు, అంబేడ్కకర్ శతకం అనే గ్రంథాలు రచించారు. అలాగే సృజనా స్రవంతి, చదువు ఎదుగు, అనిత అనే కథానికలకు సంపాదకత్వం వహించారు. రాష్ట్రంలో అనేక సాహితి సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలను పొందారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. – డోన్ రూరల్ -
శాశ్వత బెంచ్ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు
కర్నూలు (టౌన్): హైకోర్టు శాశ్వత బెంచ్పై ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టీ.మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో కోర్టు విధులకు హాజరయ్యే సమయంలో ధరించే నల్లకోటుకు బదులుగా సివిల్ డ్రెస్లో కూర్చొని న్యాయవాదులు 12వ రోజు దీక్షలను కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైకోర్టు శాశ్వత బెంచ్పై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై న్యాయవాదులుగా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 12వ రోజు దీక్షల్లో ఈదుల బాలాజీ రెడ్డి, మురళీక్రిష్ణ, నేతన్యా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షలకు పలువురు మద్దతు సర్క్యూట్ బెంచ్ కాకుండా కర్నూలులో శాశ్వతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత 11 రోజలుగా న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలకు పలువురు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ ఆలీఖాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ నరసింహా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసీహెచ్ సమావేశానికి హాజరవ్వాలి కర్నూలు(సెంట్రల్): ఈసీహెచ్ పాలీక్లినిక్ నెల వారీ సమావేశానికి ప్రతి మాజీ సైనికుడు హాజ రై విజయవంతం చేయాలని కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసుమెన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు యు.సుధాకర్, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మలికార్జున శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులకు సంబంధించి అధునాతన వైద్యం అందించడంలో ఈసీహెచ్ ఆఫీసర్ ఇన్చార్జ్ విఫలమైన నేపథ్యంలో అందరూ హాజరై హక్కుల కోసం నిలదీయా ల్సి ఉందన్నారు. ఆసుపత్రి ఎంప్యానెల్మెంట్, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు, మందుల సరఫరా, రెఫరల్స్, వైద్య సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్న నేపథ్యంలో మాజీ సైనికులు హాజరు కావాలని కోరారు. ఇంటింటి సర్వేపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు తెలపాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గత నెల 18 నుంచి 24వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఆ మేరకు గుర్తించిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు గ్రామ సభలను నిర్వహించి తుది ఓటరు జాబితాలను రూపొందిస్తామన్నారు. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో 7వ తేదీన తుది జాబితాలను ప్రచురిస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీడీఓ ఎల్.భరత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్ పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల యాత్రకు విచ్చేసే భక్తులందరూ సంతృప్తి చెందేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలనాంశాలపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశానికి డీఈవో చంద్రశేఖర్, అన్ని యూనిట్ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఏఈలు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కూడా అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకి అనుగుణగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు శాసీ్త్రయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. -
ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు
తరగతి బోధనతో పాటు ఉపాధ్యాయ శిక్షణ, సైన్స్ ప్రాజెక్టులు, క్విజ్లు, డిజిటల్ బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆదోని మండలం విరుపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మైత్రి ఆదిమూర్తికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఆదోనికి చెందిన ఈయన 2003లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా గత 12 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్, ఆర్.ఎం.ఎస్.ఏ. శిక్షణలు, కాంప్లెక్స్ సమావేశాలు, పదో తరగతి ఓరియంటేషన్ తరగతులు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్గా సేవలందించారు. అలాగే ఇన్స్పైర్, ఎన్సీఎస్సీ, కౌశల్ క్విజ్ వంటి కార్యక్రమాల కోసం అనేక మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఆదిమూర్తి మార్గదర్శకత్వంలో 2023లో ఒక విద్యార్థి జిల్లా స్థాయి ఎన్సీఎస్సీకి ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. అలాగే పదో తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ‘మార్గదర్శి’ స్టడీ మెటీరియల్ రచయితగా కూడా ఆయన సేవలందించారు. గత నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న కౌషల్ జిల్లా స్థాయి క్విజ్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ క్విజ్ మాస్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిజికల్ సైన్స్కు సంబంధించిన యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనా వనరులను అందిస్తున్నారు. ఆయన రూపొందించిన వీడియోలను 2.5 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించి ప్రయోజనం పొందారు. అంతే కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే పలు మూల్యాంకన పత్రాలను రూపొందించారు. – ఆదోని -
విలువలతో కూడిన విద్యతో గుర్తింపు
బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 2012లో జూనియర్ లెక్చరర్ల నియామకంలో స్టేట్ టాపర్గా నిలిచారు. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2021లో కర్నూలు నగరంలోని కెవిఆర్ బాలికల జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అత్యుత్తమ ఫలితాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా బోధన సాగిస్తున్నారు. కేవీఆర్ కాలేజీలో పని చేస్తున్న ఓ చిరుద్యోగి కిడ్నీలు పాడై చికిత్సకు ఇబ్బంది పడుతుండటంతో కొంత సొమ్ము వసూలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. – కర్నూలు సిటీ -
రాష్ట్ర స్థాయి అవార్డులు
పాఠశాల విభాగం ఉపాధ్యాయుని పేరు పనిచేస్తున్న ప్రాంతం అద్దంకి చంద్రమోహన్, ఎస్జీటీ లక్ష్మీతండా, తుగ్గలి శీలం జయమ్మ, హెచ్ఎం కరివేముల, దేవనకొండ మండలం ఎం.ఆదిమూర్తి, ఎస్ఏ విరుపాపురం, ఆదోని మండలం జూనియర్ కాలేజీ విభాగం జి.శ్రీనివాసులు కేవీఆర్ కళాశాల, కర్నూలు డిగ్రీ కాలేజీ విభాగం డాక్టర్ ఎం.బుచ్చయ్య సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు డాక్టర్ నాగ్ అరుణ్ మల్రెడ్డి సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు ● విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు ● వృత్తిలో రాణిస్తూనే సేవా కార్యక్రమాలకు పెద్దపీట ● ఉత్తమ సేవలతో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు ● జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులకు 43 మంది ఎంపిక -
వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
● వ్రతంలో పాల్గొన్న 1,233 మంది చెంచు, 500 మంది ఇతర భక్తులుశ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శుక్రవారం ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడేలకు చెందిన 1,233 మంది చెంచు మహిళా భక్తులు, 500 మంది ఇతర మహిళా భక్తులు పాల్గొని వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాలకు కావలసిన పూజాద్య్రాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు, అమ్మవారి శేవస్త్రాలను కూడా అందజేశారు. సంప్రదాయబద్ధంగా జరిపిన వ్రతంలో మహాగణపతిపూజ, వేదికపై ఆశీనులను చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా అవాహన చేశారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరిగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. -
అంకిత భావంతో వి‘జయం’..
అందరి ఉపాధ్యాయుల్లా ఆమె పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి తిరిగి వచ్చామా అనుకోలేదు. దాదాపు 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చూపిన అంకితభావానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. దేవనకొండ మండలం కరివేముల ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న శీలం జయమ్మ సొంతూరు వెలుగోడు మండలం వేగులగూడూరు. 1998 ఆగస్టు 21న హాలహర్వి మండలం హాలహర్వి ఆదిఆంధ్ర పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విధుల్లో చేరారు. తర్వాత దేవనకొండ మండలం కరివేముల, జూపాడుబంగ్లా మండలం మండ్లెం, నందికొట్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పేట)లో విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్లో కరివేముల ఎంపీపీ పాఠశాలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయడం, విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంపికయ్యేలా ప్రోత్సహించడం, చదువుకు దూరంగా విద్యార్థుల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దారు. కరివేముల పాఠశాలకు హెచ్ఎంగా వచ్చినప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేశారు. అలాగే గ్రామంలో జానకి వావిలాల కృష్ణమూర్తి ట్రస్టు హాస్టల్ కూడా వచ్చింది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. – దేవనకొండ -
మహిళ దారుణ హత్య
● పొలంలో మృతదేహం లభ్యం ● విచారణ చేస్తున్న పోలీసులు పత్తికొండ రూరల్: పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామ పొలాల్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోతిరాళ్లకు చెందిన హరిజన శాంతమ్మ (65) ఉదయం పొలం పనులకు వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆమె కోసం వెతికారు. శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి వివాదం కారణంగా బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానంతో మృతురాలి కుమారుడు హరిజన కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో అనుమానితుల మీద విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్, ఎస్ఐ రాందాస్ గ్రామానికి వెళ్లి హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతిపై విచారణ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
సతీష్కు సరిలేరెవ్వరు!
విధులు నిర్వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, అక్కడ చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి పాటుపడటంలో బనగానపల్లె పట్టణం కొండపేట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్కుమార్ ముందంజలో ఉన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన ఈయన 2002 అక్టోబరులో బనగానపల్లె మండలంలోని గిరిజన ప్రాంతమైన గులాం అలిబాద్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన బాలికలు చాలా మంది 6వ తరగతి చదివే అవకాశం లేక ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఆ సమస్యను సతీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి యూపీ పాఠశాల మంజూరైంది. 2009లో వెంకటాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ గణితం, ఇంగ్లిషులో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక బోధనతో విద్యార్థులను తీర్చిద్దారు. ఎన్ఆర్ఐలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2017లో టంగుటూరు ఎంపీపీఎస్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆయన విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. తన సేవలను గుర్తించిన ప్రభు త్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. – బనగానపల్లె -
ఓటరు జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు (టౌన్): ఓటరు జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకుని ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, ఓటీపీలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
నందికొట్కూరు: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్లో అర్హత లేకపోయినా 2025 డీఎస్సీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో బయటపడిందని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లను వైఎస్సార్సీపీ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలను బయటకు తీసేందుకు సీబీఐకు అప్పగించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి నెలకు రూ.3 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సతీష్రెడ్డి, శశాంక్, బన్నీ, చరణ్, మన్సూర్, రంగ, తదితరులు పాల్గొన్నారు. – డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన ఓ వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇటిక్యాల నాగరాజుకు అనంతపురం జిల్లా సద్దలదిన్నెకు చెందిన వరలక్ష్మికి (38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. భర్త రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. వరలక్ష్మి క్రిమి సంహారక మందు తాగిందని తన బావమరిది దేవేంద్రకు ఫోన్ చేయడంతో తాడిపత్రికి తీసుకురావాలని సూచించాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఎలాంటి మందు తాగలేదని సమాధానం ఇచ్చాడు. తెల్లవారాక వరలక్ష్మి మృతి చెందిందని బావమరిదికి విషయం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, క్రిమిసంహారక మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ వెల్లడించారు. మోటార్ల చోరీ : నిందితుల అరెస్టు పాములపాడు: వ్యవసాయ బావుల వద్ద విద్యు త్ మోటార్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణరావుపేట, కోల్స్ ఆనందాపురం గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు బాధిత రైతుల నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్కు చెందిన చంటి, నర్సమ్మ అనే ఇద్దరి నుంచి 5 మోటార్లు రికవరి చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృతి ఓర్వకల్లు: రేకుల షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నమడకల గ్రామ శివారులోని ఓ సిలికాన్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్నమడకల గ్రామ సమీపంలో కేఈ సోదరుల స్థలంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నూతన షెడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్కుమార్ (27) పైపులకు వెల్డింగ్ చేస్తుండగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు షెడ్కు నిర్మించిన ఇనుప పైపు ఊడి కిరణ్కుమార్పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ పాండురంగస్వామి తెలిపారు. -
పైర్లు ‘బావు’రుమంటున్నాయి !
ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా నోళ్లు తెరిచిన బీళ్లే. ఇక లాభం లేదని ఎండిపోయిన పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానవు. అప్పులు చేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇంతటితో అయిపోలేదని, ముందుంది తీవ్రమైన కరువని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లోకి తొంగి చూస్తే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వీటి కింద సాగుచేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
సీమ కల్పతరువు అవుకు రిజర్వాయర్
కోవెలకుంట్ల: మహానేత జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు ఆయా జిల్లాల రైతాంగానికి ఊపిరిలూదా యి. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు.దీని ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30 వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మే ర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల వరదజలాలను రిజర్వాయర్లో నింపు తున్నారు. వైఎస్సార్ కలల సాకారమైన అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. -
వ్యక్తి దారుణహత్య
ఆళ్లగడ్డ: పట్టణ శివారు పాలసాగరం వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆంజనేయులు (27)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు ఐదేళ్ల క్రితం రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయ్యింది. అతడు సోమవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న తోటలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి చూడగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య సుబ్బులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. మృతదేహం పడిఉన్న చోట మద్యం బాటిల్లు ఉండటంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం కారణమా? ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు -
రాజన్నకు పుష్పాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు. పెద్దనేలటూరు వాసికి డాక్టరేట్ కర్నూలు సిటీ: గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు కు చెందిన వెంకటేశ్వర్లు గౌడ్, సువర్ణమ్మ దంపతుల కుమారుడు డాక్టర్ ఈ.నిరంజన్గౌడ్కు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ మేరకు నిరంజన్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘క్యాన్సర్తో బాధపడతున్న పిల్లల తల్లిదండ్రుల్లో సంరక్షకుల ఒత్తిడి’ అనే అంశంపై ప్రొఫెసర్ డి.సాయి సుజాత పర్యవేక్షణ,మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పూర్తి చేశానని గ్రహీత వెల్లడించారు. పెద్దనేటూరులో పీహెచ్డీ సాధించిన మొదటి వ్యక్తిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్యులా.. భూత వైద్యులా? ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు. క్లినిక్ ఎదుట నల్లటి కవర్ క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్కు గురయ్యారు. పోలీసుస్టేషన్కు చేరిన వివాదం తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం. -
దేవతతో రాజకీయం
● గ్రామాల్లో టీడీపీ నాయకుల చిచ్చు ● ఏళ్లనాటి సాంప్రదాయానికి స్వస్తి ● ఎవరికి వారే అన్నట్లుగా రెండు గ్రామాల ప్రజలు దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది. గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు. ఆ కమిటీలో చైర్మన్ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల సంవత్సరాల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మవారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
కేజీబీవీ సీటు ఇప్పించండి మేడం
నందవరం: ‘చదువుకోవాలని ఉంది. కేజీబీవీలో సీటు ఇప్పించండి.. మేడం’ అంటూ పెద్దకడబూరు మండలం, కమ్మలదిన్నెకు చెందిన కురవ కావేరి జిల్లా కలెక్టర్ ఏ.సిరిని వేడుకుంది. మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్కు కేజీబీవీలో సీటు కేటాయించాలని కోరుతూ కావేరి వినతి పత్రం అందజేసింది. 7వ తరగతి వరకు చదివానని, తర్వాత తల్లిదండ్రులు చదివించలేకపోవడంతో మధ్యలోనే వదిలేశానని తెలిపింది. కేజీబీవీలో దరఖాస్తు చేసుకున్నా సీటు రాకపోవడంతో చదువుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నందవరం మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటున్నానని, తనకు కస్తూర్బాలో సీటు ఇప్పించి చదివించాలని జిల్లా కలెక్టర్ను ఆ బాలిక వేడుకుంది. కలెక్టర్ స్పందిస్తూ కేజీబీవీలో సీటు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో కావేరి సంతోషం వ్యక్తం చేసింది. -
వరద బాధితులకు అండగా..
నంద్యాల(అర్బన్): వరద ప్రభావంతో నంద్యాలలో సర్వం కోల్పోయి ని రాశ్రయులుగా మారిన వారికి డాక్టర్ వైఎస్సార్ అండగా నిలిచారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపునకు గురై అధికంగా నష్టపోయింది. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో జూన్ 24న వైఎస్సార్ స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శి ంచారు. ప్రజల కష్టాన్ని కళ్లారా చూసి న వైఎస్సార్ వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్యామ కాలువ, కుందూ నది,మద్దిలేరును వెడల్పు చేసి వరద ముప్పు తప్పించడానికి రూ.92 కోట్లను మంజూరు చేశారు. వైఎస్ నగర్, పీవీ నగర్లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రె యిన్లకు రూ.3.62 కోట్లను మంజూరు చేశారు. ఆయ న హయాంలో నంద్యాల నియోజకవర్గంలో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. -
సబ్సిడీ వేరుశనగ స్వాహా!
డోన్ టౌన్ (ప్యాపిలి)/డోన్: తమది రైతు ప్రభుత్వం అంటూ టీడీపీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి పొంతన లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మరువకముందే సబ్సిడీ వేరుశనగను బ్లాక్ మార్కెట్కు తరలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29న డోన్ నియోజకవర్గంలోని ఎనుగుమర్రి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి మంజూరైన విత్తనాలను అర్హులైన రైతులకు అందించకుండా గ్రామ టీడీపీ నాయకుల సిఫార్సుతో కొద్దిమంది ఆ పార్టీ వారికి అందించి మిగతా విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సచివాలయంలో ఉంచిన స్టాకును అదే గ్రామానికి చెందిన వ్యాపారికి విక్రయించగా సదరు వ్యక్తి వాటిని రెండు వాహనాల్లో బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్
● బస్సు టైర్ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి పత్తికొండ: గమ్యస్థానాలకు చేరకుండా మార్గం మధ్యలోనే మరమ్మతులకు గురై ఆగిపోతూ ఆర్టీసీ బస్సులు హడలెత్తిస్తున్న సంఘటనలతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి ఆదోనికి బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఏపీ 39 యూఎస్ 5609 నంబరు గల బస్సు దేవనబండ–ఆటికెలగుండు గ్రామాల మధ్య టైర్ పేలడంతో ఆగిపోయింది. పేలుడు తీవ్రతకు టైర్ ఉన్న చోట సీట్లో కూర్చున్న హోసూరు, పత్తికొండ, ఆదోనికి చెందిన వెంకటేష్, కార్తీక్, గిరి అనే ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఉన్నఫళంగా పెద్ద శబ్దంతో టైరు పేలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనం సిబ్బంది గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఘటన జరగడంతో ముప్పు తప్పిందని, రక్షణ గోడలు లేని వంతెన వద్ద టైరు పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. డిపో మేనేజర్పై మండిపాటు ఆదోని, పత్తికొండ రెండు డిపోలకు మేనేజర్గా వ్యవహరిస్తున్న రెహమాన్పై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పత్తికొండ డిపోలో కాలం చెల్లిన బస్సులలో ప్రతిరోజు ప్రయాణం నరకప్రాయంగా మారింది. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా అనునిత్యం మార్గం మధ్యలో నిలిచిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనికితోడు పత్తికొండ బస్టాండ్కు వచ్చే ఇతర డిపోల సిబ్బంది ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా నడపడం వల్ల అందుబాటులో ఉన్న బస్సులపై రద్దీ తీవ్రత పడుతుంది. దీంతో బస్సులో ప్రయాణం చేసేవారు అవస్థల నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. అదే విదంగా రద్దీ వల్ల సోమవారం సాయంత్రం పత్తికొండ బస్డాండ్లో గుంతకల్కు చెందిన హసీనా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వైద్య చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయింది. పత్తికొండ డిపో మేనేజర్గా ఉన్న రెహమాన్ సంక్రమంగా విధులకు రాకపోవడం పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది విధులపై కూడా సంక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే సమస్యలపై నేరుగా గతంలో చాలా మంది రీజనల్ మేనేజర్ శ్రీనువాసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తోపులాటలో అస్వస్థతకు గురైన మహిళ మృతి కర్నూలు నుంచి గుంతకల్కు బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్కు చెందిన హసీనా (55) అనే మహిళ సోమవారం సాయంత్రం పత్తికొండ బస్టాండ్లో వాష్రూమ్కు దిగింది. తిరిగి బస్సు ఎక్కే క్రమంలో రద్దీ వల్ల జరిగిన తోపులాటలో ఊపిరి అందక స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి మణిదీప్ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. బస్సులో రద్దీ వల్లనే తన అమ్మ అకారణంగా చనిపోయిందని కుమారుడు దాదాపీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. -
పారే నీటిలో నీవే.. చిరునవ్వులో నీవే !
నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కరువు నేలలో జలసిరులు కృష్ణగిరి: జిల్లాలో నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీ – నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్ పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55 కోట్లతో తాగునీరు అందించారు. వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ ద్వారా ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీరు అందించారు. అలాగే పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాటుచేశారు. దీంతోపాటు లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరో 5,100 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందింది కూడా వైఎస్సార్ పాలనలోనే అనేది జగమేరిగిన సత్యం. అందుకే ఇక్కడి ప్రజలు అయనను అనుదినం స్మరించుకుంటున్నారు. రైతు బాంధవుడు తుగ్గలి: వరుస కరువులతో 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులవి. భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణమాఫీ చేయడంతో పాటు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కానీ రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితి తెచ్చారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండటం ఆయన చలువే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి, పందికోన వద్ద రిజర్వాయర్లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారు. -
అశ్వవాహనంపై విశ్వమోహనుడు
● వైభవంగా 6వ రోజు ఆరాధన వేడుకలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం: మంగళకర వాయిద్య నాదాలు.. భక్తజనుల జయజయ పఠనాలు.. పండితుల వేద ఘోషల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కొలువుదీరారు. పండితుల ఉయ్యాల జంపాలతో ఉత్సవమూర్తి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రహ్లాదరాయలకు అశ్వవాహన సేవ గావించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి చతుర్వేద పారాయణం గావిస్తూ ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ప్రాంగణ వీధుల్లో అశ్వ వాహనంపై కనుల పండువగా ఊరేగింపు సాగింది. ఆనవాయితీలో భాగంగా చెక్క, వెండి, అంభారి, స్వర్ణ, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. 6వ రోజు వేడుకల్లో రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ చేపట్టారు. ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు ఆరాధన ఆఖరిరోజు సందర్భంగా సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఉత్సవం సందర్భంగా ఏకకాలంలో పంచవాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. -
ఉద్యాన పంటలతో ఎగుమతులు సాధ్యమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే సాగులో తగిన జాగ్రత్తలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త విజయ్ అవినాష్ లింగం సూచించారు. కర్నూలులోని ఉద్యాన భవన్లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచ విజయం దిశగా సాధికారత సాధించడం, ఎగుమతుల సన్నాహకాలపై సమగ్ర శిక్షణలో భాగంగా జిల్లాలోని ఎఫ్పీఓల ప్రతినిధులకు ఎగుమతులపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై అవగాహన కల్పించారు. ఏఏ పంటలకు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర తదితర వాటిని వివరించారు. కర్నూలు జిల్లా ఉద్యాన పంటల సాగుకు నిలయంగా మారుతోందని, ఎగుమతులకు అవకాశం ఉన్నప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ, నాబార్డు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బాగా పని చేస్తున్నాయని, ఎగుమతులకు అవకాశం కల్పించడం ద్వారా సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎగుమతులకు నాబార్డు, ఎపిడా సంపూర్ణంగా సహకరిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆప్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నబిరసుల్, నాబార్డు డీడీఏం సుబ్బారెడ్డి, ఎపిడా మేనేజర్ పెద్దస్వామి, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3.20 లక్షల పెట్టుబడి నష్టం
16 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అంతరపంటగా కంది వేసుకున్నా. రెండున్నర నెలలుగా చినుకు జాడ లేదు. పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నా యి. ఎకరాకు సగటున రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా రూ.3.20 లక్షల వరకు పెట్టుబడిని కోల్పోయాం. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. – శ్రీనివాసరెడ్డి, రైతు, వెల్దుర్తి సొంత పొలం ఆరు ఎకరాలు ఉంటే, 34 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటి వరకు మిర్చి 10 ఎకరాలు, కంది 15 ఎకరాలు, సద్దలు 8 ఎకరాల ప్రకారం 33 ఎకరాల్లో పంటలు వేశాం. వర్షాలు లేకపోవడం వల్ల ఏడు ఎకరాలు ఖాళీగా ఉంది. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.15వేల ప్రకారం రూ.4.95 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. పంటలు పండకపోయినప్పటి కౌలు మాత్రం రూ.3.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.8.35 లక్షలు నష్టం వాటిళ్లుతోంది. కరువు మా జీవితాన్ని పూర్తిగా కాటేసింది. – లింగరాజు, రైతు, మద్దికెర -
వృద్ధురాలిపై దాడిచేసి దోపిడీ
● ఇంట్లోకి ప్రవేశించి దుండగుడి చర్య ● 8 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలి ఫిర్యాదు సి.బెళగల్: మండల పరిధిలోని సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడిచేసి ఒంటిపై ఉన్న బంగారు నగలను గుర్తు తెలియని దుండగుడు దోచుకెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామంలోని ప్రధాన దారిలో పిరమిడ్ కేంద్రం దగ్గరున్న ఇంట్లో వృద్ధురాలు సంజీవమ్మ భర్త మల్లికార్జున శెట్టి 8 నెలల కింద అనారోగ్యంతో మృతి చెందటంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సంజీవమ్మ ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా, అప్పటికే పథకంతో ఉన్న దుండగుడు ఇంట్లోకి చొరబడి, వృద్ధురాలిపై దుప్పటి కప్పి మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న 3 మూడు తులాల బంగారు గాజులను లాక్కొని వృద్ధురాలిని బాత్రూంలోకి తోసి బయట గడియతోపాటు, ఇంటి గడియ పెట్టి పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ బయటివారికి వినిపించలేదు. తరచూ వృద్ధురాలితో మాట్లాడే అదే ప్రాంతంలోని యువకుడు సాయంత్రం ఇంటి వద్దకు వెళ్లి చూడగా గదిలో తలుపు కొడుతున్న శబ్దం రావడంతో తలుపు తీయగా నీరసంగా బాధిత మహిళ సంజీవమ్మ కనిపించింది. విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో వెంటనే సి.బెళగల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. 6 రోజుల క్రితమే విఫలయత్నం? బాధితురాలు జరిగిన సంఘటనను తెలియజేస్తూ.. గత శనివారం (ఆగస్టు 29న) రాత్రి ఇంట్లో పడుకుని ఉండగా బయటి నుంచి తలుపు కొట్టిన శబ్దం వచ్చిందని, తాను భయంతో తలుపు తీయలేదని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఇంటి పరిసరాల్లో సంచిలో వేట కొడవలి, మాస్క్, హెల్మెట్, గ్లౌజ్లు, రెయిన్కోట్, సాక్సులు కనిపించాయని బాధితురాలు తెలిపింది. రాత్రి వేళ తలుపు కొట్టడంతో పాటు, ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లభించిన విశయాన్ని సంజీవమ్మ బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో, వారి సూచన మేరకు ఇంటికి సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. కాగా ఆరు రోజుల క్రితమే దుండగుడు చోరీకి విఫలయత్నం చేసినట్లు స్థానికులు చర్చించుకున్నారు. భయాందోళనలో గ్రామస్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారం దోపిడీ చేయడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మారుమూల పల్లెటూరు అయిన సంగాల గ్రామంలో దుండగుడు ఆయుధాలు, రక్షణ సామగ్రితో దోపిడీకి పాల్పడటంతో పల్లె ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు సమగ్రంగా విచారించి, నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో పొలీసు నిఘా పెంచాలని కోరుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె
మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బండారు శేఖర్ (45) ఎండుతున్న పొలాన్ని చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై గురువారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన శేఖర్ తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.50 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల వర్షాలు లేక వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందాడు. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి పొలం ఎండిపోతోందని కుటుంబ సభ్యులతో చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. పొలం ఎండిపోతే పోయింది.. అప్పులు ఎలాగైనా తీర్చుకుందామని కుటుంబ సభ్యులు ఓదార్చుతూ వచ్చారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన శేఖర్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అంతా శివయ్యే చూసుకోవాలి!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగం అత్యంత కీలకం. ఈ విభాగం ద్వారా క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీగిరిలో త్వరలో సుమారు రూ.800 కోట్లతో మూడు విడతలుగా మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించాలని ట్రస్ట్బోర్డు ఆశిస్తోంది. అయితే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) రిటైర్ కావడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీఈఈ హోదాలో ఇద్దరు ఏఈఈలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రంలో ఇంజినీర్ల కొరతతో అభివృద్ధి పనులకు అటంకం కలగనుంది. దేవస్థానంలో ఇంజినీర్ల కొరత రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ఈఈలు ఇద్దరు ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సఫ్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఈఈలు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–ఒకరు, డ్రాఫ్ట్స్మెన్–ఇద్దరు ఉండాలి. ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేగాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. దేవస్థానంలోని ఇద్దరు ఈఈల్లో ఒకరు జూన్లో, మరొకరు ఆగస్టులో రిటైర్ అయ్యారు. దీంతో రెండు ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు డీఈఈలకు గాను ఎవరు లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరికొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. అంతేగాకుండా ఇద్దరు ఏఈఈలు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అనుభవం ఉన్న అధికారి అయితే.. సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో చేపట్టనున్న మాస్టర్ప్లాన్ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే గతంలో దేవస్థానంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని ఈఈగా నియమించాలనే వాదన వినిపిస్తోంది. రూ.800కోట్ల అభివృద్ధి పనులు ఎటువంటి అంతరాయం లేకుండా వేగంగా, క్షేత్రంలో మౌలిక వసతులు, దేవస్థాన ఇంజినీరింగ్ పనులపై అవగాహన ఉండి గతంలో క్షేత్రంలో పనిచేసిన ఈఈను శ్రీశైలానికి డెప్యూటేషన్ లేదా బదిలీపై నియమించాలని కొన్ని నెలల క్రితం ఈఓ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు లేఖ సైతం రాశారు. అయితే టీడీపీ ముఖ్యనేత అనుచరుడు ఆర్అండ్బీ శాఖలో ఈఈగా ఉన్న ఓ అధికారిని దేవస్థాన ఈఈగా డెప్యూటేషన్పై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించి అనుభవం, అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, మాస్టర్ప్లాన్ పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమిస్తారో లేక టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడి సూచించిన ఆర్అండ్బీ శాఖ ఈఈని డెప్యూటేషన్పై నియమిస్తారో చూడాలి. శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధి పనులకు ఇంజినీర్లు కరువు దేవస్థానంలోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రిటైర్డ్ శ్రీగిరిలో త్వరలో మూడు విడతల్లో రూ.800 కోట్లతో మాస్టర్ప్లాన్ పనులు రూ.800 కోట్ల మాస్టర్ప్లాన్కు ఆటంకం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రీశైల దేవస్థానంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. దేవస్థాన ట్రస్ట్బోర్డు సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో మాస్టర్ప్లాన్లో భాగంగా క్యూకాంప్లెక్స్, పబ్లిక్ ఎనిమిటీస్, టాయిలెట్స్, సాలు మండపాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దేవస్థానంలో ఈఈలు లేకపోవడంతో మాస్టర్ప్లాన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మాస్టర్ప్లాన్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, నాణ్యతతో నిర్మాణ పనులు, పర్యవేక్షణ చేపట్టేందుకు దేవస్థానంలో ఈఈలు లేరు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో మాస్టర్ప్లాన్ అమలుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. -
5, 6 తేదీల్లో సర్ ప్రత్యేక క్యాంపులు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా డ్రాఫ్ట్ రోల్పై వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఈనెల 5, 6 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ల్లో బీఎల్ఓలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి ఫాం 6, 7, 8, 8ఏలను స్వీకరిస్తారని చెప్పారు. ఫాం–6 ద్వారా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫాం–7 ద్వారా ఓటరు తొలగింపునకు అర్జీలు ఇవ్వడం, ఫాం–8 ద్వారా పేర్లు, ఫొటోలు, ఇతర వివరాల సవరణ చేసుకోవచ్చన్నారు. ఫాం 8ఏ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. క్వింటా ఉల్లి రూ.4,340 కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉల్లి సాగులో పురోగతి కరువైంది. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్కు 4,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్కు వచ్చింది. నేడు 1,182 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.2,569 లభించగా.. గరిష్ట ధర రూ.4,340, సగటు ధర రూ.4,190 నమోదైంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగకు గరిష్ట ధర రూ.9,419, ఆదోని మార్కెట్లో రూ.9,504, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.7,909 లభించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరంలో స్టేట్ కోటా కింద అడ్మిషన్లు పొందిన 34 మంది విద్యార్థులు మొదటి రోజు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ అడ్మిషన్లు ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తామని, సెలవు రోజుల్లో కూడా ఈ ప్రక్రియ నిరంతరాయంగా చేపడతామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ తెలిపారు. అడ్మిషన్ల కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, ఫార్మకాలజి హెచ్ఓడీ డాక్టర్ రాజేష్ పర్యవేక్షించారు. -
ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే..
ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 28వేల హెక్టార్లలో... నంద్యాల జిల్లాలో 30వేల హెక్టార్లలో పంటలను దున్నేశారు. ప్రత్యామ్నాయంగా జొన్న, కొర్ర, స్వల్పకాలిక రకాలైన కంది, పెసర, అలసంద, ఉలువలు, వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా వర్షాల అవసరం ఉంది. కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వర్షాలే లేకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్నినో తీవ్రతను పరిశీలిస్తే ఈ సారి రబీ సీజన్పైనా ఆశలు వదులు కోవాల్సిందేనని తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 1,55,648 హెక్టార్లలో పంటలు వేశారు. దాదాపు అన్ని పంటలు నెల నుంచి 90 రోజుల దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పత్తి 2,32,671 హెక్టార్లలో సాగయింది. మామూలుగా పత్తిలో ఈ పాటికి ఒకసారి పత్తి తీస్తారు. మొదటి సారి పత్తి తీయడంలోనే ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అలాంటిది పత్తి వేసి 90 రోజులు గడుస్తున్నా కిలో దిగుబడి కూడా తీయలేని పరిస్థితి. పత్తి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు పెరగాలి. ఈ సారి ఏర్పడిన అనావృష్టి వల్ల ఒక్క అడుగు ఎత్తు కూడా పెరగకపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క పత్తిలోనే కాదు.. వేరుశనగ, కంది, ఆముదం తదితర అన్ని పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, కంది, మినుము, వరి, పత్తి ప్రధాన పంటలు. ఒక్క డోన్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం ఉంది. కానీ మొదటిసారి నీటిపారుదల స్తంభించింది. సాగైన పంటల్లో దిగుబడులు దాదాపు జీరో కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. దెబ్బతీసిన ఎల్నినో.. వరుసగా 21 రోజులు వర్షం లేకపోతే ఒక డ్రై స్పెల్గా పరిగణిస్తారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో జూన్ 14న ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా ఎక్కడా భారీ వర్షం లేదు. అంటే దాదాపు రెండున్నర నెలలుగా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో మూడు డ్రై స్పెల్లు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 428.3 మి.మీ ఉండగా.. 243.8 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి ఆగస్టు వరకు 286.4 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా.. 164.5 మి.మీకే పరిమితమైంది. గత 50 ఏళ్లలో అనేక సార్లు ఎల్నినో ప్రభావం ఏర్పడింది. అయితే వర్షాలు కాస్త మెరుగ్గానే కురిశాయి. ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్నినోను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు. -
ఆర్యూలో విద్యార్థి సంఘం నేత హల్చల్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అనుచరుడు బుధవారం రాత్రి వర్సిటీలో వీరంగం సృష్టించాడు. వీసీని కలవడానికి అనుమతివ్వలేదనే కారణంతో వీసీ పీఏతో మొదలైన దూషణల పర్వం, వీసీ డ్రైవర్, ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అసభ్య పదజాలంతో విరుచుపడ్డాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.విజయ్కుమార్ నాయుడు ఎదుటే దూషణల పర్వం కొనసాగింది. రిజిస్ట్రార్ను ఉద్దేశించి ‘‘కడపలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. వీసీకి, రిజిస్ట్రార్కు నేను ఎంత సపోర్ట్ చేశానో తెలుసా’’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మా ఆడబిడ్డపై దాడి చేస్తారా.. మా గవర్నమెంట్ ఇది, ఎవరు నన్ను ఆపేది, అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ అందరి జాతకాలు తెలుసు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు, రూ.లక్ష తీసుకొని డ్రామాలు చేస్తారా’’ అంటూ వీరంగం సృష్టించాడు. బైరెడ్డి శబరి అక్కకు ఒక్క ఫోన్ చేస్తే.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయనతో పాటు మాట్లాడటానికి రిజిస్ట్రార్ ఛాంబర్కు వెళ్లాడు. విద్యార్థులు గొడవ పడితేనే సస్పెండ్, వర్సిటీని బహిష్కరించే వర్సిటీ అధికారులు, మరి వర్సిటీ పరిపాలనాధికారి ఎదుటే, పరిపాలనా భవనంలోనే ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డ విద్యార్థి సంఘం నాయకునిపై ఏమి చర్యలు తీసుకుంటారోననే చర్చ వర్సిటీలో సాగుతోంది. -
కరువు ఉరుముతోంది
● రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలు ● దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరో ● ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ● కర్నూలు జిల్లాలో 43 శాతం, నంద్యాల జిల్లాలో 43.1 శాతం లోటు వర్షపాతం ● ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే.. పాణ్యం మండలం కొణిదేడులో నీరు లేక నెర్రలిచ్చిన వరి పొలంకర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. హెక్టారుకు రూ.50 వేల ప్రకారం రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. కేవలం పెట్టుబడి రూపంలోనే రూ.773 కోట్లు మట్టిపాలయింది. -
దరఖాస్తుల ఆహ్వానం
డోన్ రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జింకా శ్రీకాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగకేశాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా అనోటేటర్ అసిస్టెంట్ (3) ఓసీ, డేటా క్యూరెటర్ అసిస్టెంట్ (3) ఓసీ–1, బీసీ–1, ఎస్సీ–1, పోస్టులు డోన్ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఎంపికకు సంబంధించి 22 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల్లోపు వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఐటీఐ ప్రధానాధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. నియామక ప్రకియ డిప్యూటీ డైరెక్టర్ రీజినల్ ఆఫీస్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్, పద్మావతిపురం, తిరుచానూర్ రోడ్డు, తిరుపతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య డోన్ టౌన్: మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కుమ్మరి వెంకటస్వామి (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 28న తండ్రి మందలించడంతో వెంకటస్వామి ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామ సమీపంలో గోసానిపల్లె నుంచి ధర్మారం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుండా పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామికి నాలుగు సంవత్సరాల క్రితం హరిప్రియ అనే యువతితో వివాహం జరిగింది. ఉడుములపాడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అతని కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో గురువారం అటు వైపు పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఇ.తాండ్రపాడు గ్రామంలో ఆటో ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. అదే గ్రామంలోని టీజీ నగర్కు చెందిన ఎం.రాజేంద్ర బాబు (56) బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాత్రి షాప్కు మూత వేసి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇ.తాండ్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో రాజేంద్రబాబుకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆటోడ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య ఎన్.శంకరమ్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. వారి రిలే నిరాహారదీక్షలు 11వ రోజు గురువారం కొనసాగాయి. న్యాయవాదులు నిస్సీ, గౌతమ్ శేఖర్, తులసి ఈశ్వర్ రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. సర్క్యూట్ బెంచ్ వద్దు. శాశ్వత హైకోర్టు బెంచ్ మాత్రమే కావాలంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. 11వ తేదీ వరకు విధుల బహిష్కరణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించాలని తీర్మానించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల భవన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పత్తి పంట దున్నివేత ఆలూరు రూరల్: మండలంలోని కాత్రికి గ్రామానికి చెందిన రైతు విఠల్ 17 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట వర్షాభావంతో పూర్తిగా ఎండిపోవడంతో పంటను దున్నేశాడు. వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు ఎదుగుదల లేక వాడిపోయాయి. పంటకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కే అవకాశం లేదని భావించిన విఠల్..గురువారం ట్రాక్టర్తో పంటను దున్నేశాడు. -
రాజకీయ ముద్రతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగ సంఘాల నాయకులపై ప్రభుత్వం రాజకీయ ముద్ర వేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు కలుసుకొని మద్దతు కోరారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ తీరు పట్ల కార్యాలయాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నల్లబ్యాడ్జీలతోనే విధులకు హాజరుకావాలన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు పెద్త ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి.గిరికుమార్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్సీని తొలగించడం అన్యాయమని, ఉద్యోగులకు సంబంధించి ఇస్తామన్న ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలను కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లోని రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. రూ.1.35 కోట్లతో షెడ్ల నిర్మాణాలు కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.1.35 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డుల్లో రూ.50 లక్షల ప్రకారం, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.35 లక్షలతో కవర్డ్ షెడ్లు నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. కర్నూలు మార్కెట్కు మంజూరైన కవర్డ్ షెడ్ను ఈ నెల 5న మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేయనున్నారని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 100‘‘60 అడుగుల విస్తీర్ణంలో షెడ్ నిర్మిస్తామన్నారు. -
దిశ, వన్స్టాప్ సెంటర్ తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని దిశ, వన్స్టాప్ సెంటర్ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్లో చేరే వారి వివరాలను, వారి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సంబంధిత సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు విక్టిమ్ కాంపెన్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ యాక్ట్ – 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని తెలిపారు. వారి భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
మొసళ్ల కలకలం
కౌతాళం: తుంగభద్ర నది పరివా హకంలో వేర్వేరు చోట్ల రెండు భా రీ మొసళ్లను స్థా నికులు బంధించారు. కౌతాళం మండలం మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక భాగంలో గుంతలో ఉన్న భారీ మొసలి ఉండటంతో గ్రామస్తులు కొన్ని రోజులుగా భయాందోళన చెందుతున్నారు. కాగా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం గుంతలో ఉన్న మొసలిని పెద్ద పెద్ద తాళ్లతో బంధించారు. ఈ విషయాన్ని అదోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ తేజశ్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక వాహనంలో మొసలిని తీసుకెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వదిలేస్తామని చెప్పారు. నాగలదిన్నె బ్రిడ్జి వద్ద.. నందవరం: నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద గుంతలో ఉన్న మొసలిని బుధవారం రైతులు బంధించారు. నదిలో నీరు లేకపోవడంతో మోటర్ ద్వారా గుంతలోని నీటి పంపు చేయడానికి వెళ్లారు. వరదల్లో కోట్టుపోయిన పాత బ్రిడ్జి పిల్లర్ వద్ద గుంతలో నీటి తోడేందుకు రైతులు విద్యుత్ మోటర్ వేశారు. నీటి తోడే సమయంలో గుంతలో మొసలి బయటపడింది. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి తెలంగాణపైపు తుంగభద్ర నది గుంతల్లో వదిలేశారు. -
పంప్హౌస్ దుకాణంలో చోరీ
ఆదోని అర్బన్: పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి కింద మెయిన్ బ్రాంచి పోస్టాఫీసు సమీపంలో పంప్హౌస్ దుకాణంలో చోరీ జరిగింది. పంప్హౌస్ దుకాణదారుడు నిజాం తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి పైకప్పులో కన్నం వేసి దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగలను అపహరించారు. బుధవారం ఉదయం దుకాణం తలుపులు తీయగా పైకప్పులో కన్నం ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకున్నారు. దుకాణాన్ని పరిశీలించగా దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగల సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి అదృశ్యం కొత్తపల్లి: శివపురం చెంచుగూడెంకు చెందిన ఓ యు వతి మూడు రోజులుగా కనిపించడం లేదు. గూడెంకు చెందిన ఐలేని కోటయ్య రెండవ కూతురైన ఐలేని ఇందు (17) గత నెల 30వ తేదీన రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి కుటుంబీకులు బుధవారం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. మొక్కజొన్న పంటపై పందుల దాడి గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. -
లోకేషూ.. మీరిచ్చిన బ్యాగుల నాణ్యత ఇదిగో!
వెల్దుర్తి: ‘మీ ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్లు ఎంతటి నాణ్యతగా ఉన్నాయో చూడండి. రెండు నెలలకే మొత్తం చినిగిపోయి తిరిగి కుట్టించుకునేందుకు కూడా వీలులేకుండా పోయాయి. ఇదేనా మీ పథకాల నాణ్యత’ అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ను సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆమె వెల్దుర్తి మండలంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాతబస్టాండులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి నాణ్యతలేని పథకాలు అమలు చేస్తోందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇదే సందర్భంలో సమావేశం జరుగుతున్న ప్రాంతంలో తిరుగాడుతున్న కృష్ణగిరి మండలం ఎరుకులచెరువుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని కె.రాణి, ఆమె తల్లి స్కూల్ బ్యాగుల ప్రస్తావన విని సమావేశం వద్దకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం విద్యార్థిని తన స్కూల్ బ్యాగ్ రెన్నెల్లకే చినిగిపోయిందని మాజీ ఎమ్మెల్యేకు చూపుతూ, కొత్తది కొనివ్వమని నాన్నను అడిగితే తిడుతున్నాడని.. అమ్మ కొనిస్తా, లేకపోతే కుట్టిస్తా పద అంటూ వెల్దుర్తికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న విద్యా కానుక బ్యాగులు ఇప్పటికీ నాణ్యతతో చెక్కుచెదరలేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇచ్చిన బ్యాగులు నాణ్యత ఎలా ఉన్నాయో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, చివరికి టీడీపీ నాయకులకే తెలుసన్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
భక్తుల మొర ఆలకించేదెవరు?
● గతంలో ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు ఉపయోగంలేని ఫిర్యాదుల బాక్స్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురైన కష్టాలను చెప్పుకునేందుకు దేవస్థానం అవకాశం ఇవ్వడం లేదు. శ్రీశైల క్షేత్రంలో కొలువైన భ్రమరాంబా సమేతా మల్లికార్జున స్వామి కటాక్షం పొందేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శన సౌకర్యాలు, పలు ఆర్జితసేవలు, లడ్డూప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, వైద్యసౌకర్యాలు, వసతి, టికెట్ల కౌంటర్లు, డోనేషన్ కౌంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యానవనాల నిర్వహణ, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి, ఆర్జితసేవల నిర్వహణ ఎలా ఉంది, స్వామిఅమ్మవార్ల అలంకార దర్శన సౌకర్యాలు, స్పర్శదర్శనం, దర్శన సమయ వేళలు, ఇంకా పలు విషయాలపై భక్తుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, క్షేత్రాభివృద్ధికి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడం, భక్తుల అసౌకర్యాలపై ఫిర్యాదులు స్వీకరించడం వాటిని పరిష్కరించడం, తదుపరి పునరావృతం కాకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ తరహాలో ఏర్పాటు చేశారు. మోగని ‘డయల్ యువర్ ఈఓ’ ఫోన్ భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర దేవదాయశాఖకమిషనర్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న అట్టహాసంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 08524–287111నెంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల అధికారులతో, సిబ్బందితో ఈఓ సమీక్షించి భక్తుల నుంచి వచ్చిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారానికి ఒకరోజు కాకుండా నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ముఖ్య పర్వదినాలు, ముఖ్యమైన రోజులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాల నిర్వహణ సాకుతో కార్యక్రమానికి మొత్తానికి ఎగనామం పెట్టారు. దేవస్థానం డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలన భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద తదితర ప్రదదేశాలలో ఫిర్యాదుల బాక్స్లు ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల బాక్స్లపై అవగాహన లేని భక్తులు వాటిని వినియోగించడం లేదు. అసలు ఫిర్యాదు బాక్స్లు ఉన్నాయో లేదో భక్తులకు అవగాహన లేదు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆ కార్యక్రమం ద్వారా భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించి క్షేత్రాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సి.బెళగల్: మండలంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో మండలంలో నది తీర గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తుండగా తిమ్మందొడ్డి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఈ మేరకు ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణ చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన నలుగురికి జైలు డోన్ టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జడ్జి నూరుల్లా జైలు శిక్ష లు విధించినట్లు సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. పట్టణంలోని కొండపేటకు చెందిన చాక లి తిరుమలేసుకు నాలుగు రోజులు, కోట్ల విజయభాస్కర్రెడ్డి నగర్కు చెందిన నీలకంఠ, కొండపేటకు చెందిన ఈడిగ వెంకటేశ్వర్లు, డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన దస్తగిరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన ట్లు సీఐ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ చిప్పగిరి: ఖాజీపురం కొట్టాల శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సీవీ నరసిహులు తెలిపిన వివరాల మేరకు.. గుట్టుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ బుధవారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పేకాట రాయుళ్లలో ఆరుగురు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 32,250 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వేలాడుతున్న తీగలను సరి చేసేందుకు వెళ్లి.. ● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఎమ్మిగనూరురూరల్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందా డు. కలుగొట్ల గ్రామానికి చెందిన ఎం.కృష్ణ (28) ప్రైవేట్ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు. కె. నాగలాపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నరసింహులకు చెందిన పొలం విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటంతో మరమ్మతుల కోసం కృష్ణను తీసుకెళ్లాడు. విద్యుత్ స్తంభంపై ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు పక్కన ఉన్న మరో తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు జయకుమార్ (8), దేవాన్ష్ (2) ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ప్రియుడి మోజులో పడి..
● భర్తను కడతేర్చిన భార్య ● 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు ● ముగ్గురు నిందితుల అరెస్ట్ ఆళ్లగడ్డ:వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను కడతేర్చిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసముండే ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విష యం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్తో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు. -
‘బండారం’ బయటపడేదెన్నడు!
మంత్రాలయం: శ్రీమఠం బ్రాండ్తో భక్తులను మోసగిస్తున్నా అడిగే వారు లేరు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చర్యలు చేపట్టరు. దోపిడీపై భక్తులు మొత్తుకుంటున్నా వినేవారు కరువయ్యారు. ఎవరి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు.. అనుమతులు ఎవరిచ్చారో బయటకు చెప్పరు.. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠంలోపల ఓ వ్యాపారి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణాల్లో ఎటువంటి వ్యాపార దుకాణాలు ఉండరాదు. బయట వ్యక్తుల ఆధీనంలో ఎలాంటి వ్యాపారాలు చేపట్టరాదు. ఒకవేళ ఉంటే ఆలయ ఆధీనంలో రసీదులతో కూడిన లావాదేవీలు చేపట్టాలి. అంతేగాక దేవాదాయ శాఖ నియమం ప్రకారం అందులో అర్చన కుంకుమ, పరిమళ విభూతి, నియమ నిబంధన పూజా పదార్థాలు మాత్రమే విక్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులు ఆలయ ప్రాంగణాల్లో వ్యాపారాలకు తావు ఉండదు. మఠంలో ఓ ప్రైవేటు వ్యక్తి దోపిడీకి అనుమతి ఎవరిచ్చారో అంతు చిక్కడం లేదు. ప్రాంగణంలోని గ్రామ దేవత మంచాలమ్మ గర్భాలయానికి వెనుక భాగంలో రాఘవేంద్రుల గర్భమఠానికి ఈశాన్య దిక్కున పెద్ద దుకాణం కేటాయించి ‘న్యూ శ్రీ రాఘవేంద్రస్వామి పూజా బండార్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కర్ణాటకలోని ఉడిపీ ప్రాంతానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం శ్రీమఠం ప్రధాన ముఖద్వారం కుడివైపు చిన్న క్యాసెట్ల అంగడి పెట్టుకున్నాడు. భక్తి గేయాల క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు అమ్ముకుంటూ కాలం వెల్లదీశాడు. ఇప్పటికీ ఆయనను స్థానికులు క్యాసెట్ల పరమేష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కొన్నేళ్ల తర్వాత శ్రీమఠంలోనే దుకాణం తెరిచాడు. చేతి దారాలు మొదలు తపంబు పీఠాల వరకు వ్యాపారం నడుస్తోంది. అక్కడ ఏ వస్తువు కొన్నా బయట దుకాణాల్లో ధరల కంటే ఐదోవంతు ఎక్కువ. ఉదాహరణకు రాగి చెంబు బయట దుకాణంలో రూ.200కు లభిస్తే అదే చెంబు ఇక్కడ మాత్రం రూ.1000కి అంటగడతారు. ఇలా ప్రతి వస్తువుపై అంతే. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే ఇదీ శ్రీమఠం బ్రాండ్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీమఠంలో ప్రైవేటు పూజా బండార్ లేనప్పుడు క్షేత్రంలో 20 దాకా పూజా సామగ్రి దుకాణాలు ఉండేవి. కొందరు బండ్లపైనే పెట్టుకుని జీవనం సాగించే వారు. అయితే మఠంలో బండార్ పెట్టడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడి వ్యాపారాలు వదులుకున్నారు. భక్తులను దోచుకుంటున్న వ్యాపారిపై శ్రీమఠం అధికారులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదు. అది దేహ రహస్యంగానే మిగిలింది. -
● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని స్మరించుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ● వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకాలు చేసిన వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు
సంక్షేమ ప్రదాత.. రైతు బాంధవుడు..పేదల దేవుడు.. ఆర్యోగ‘సిరి’ కల్పించిన మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు గడిచినా రాజన్నా..నిన్ను మరువలేం అంటూ బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. మహానేత విగ్రహాలకు వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జలాభిషేకాలు చేసి అప్పటి పాలనను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలను హోరెత్తించారు. పేదలకు దుస్తులు అందించి, అన్నదానం చేసి, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి, రక్తదానం నిర్వహించి అభిమానం చాటుకున్నారు. ● కర్నూలులో మహానేత విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో అభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య పాల్గొన్నారు. ● కల్లూరు శరీన్నగర్లో వైఎస్సార్ విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి జలాభిషేకం చేశారు. రాయలసీమకు కృష్ణాజలాలు తీసుకొచ్చిన మహానేతను రైతులు ఎప్పటికీ మరువబోరన్నారు. ● ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ● వెల్దుర్తిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బనగానపల్లిలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వారి పురోగతికి వైఎస్సార్ దోహదపడ్డారన్నారు. ● ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. నల్లకాల్వ వద్ద ఉన్న స్పృతివనంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. –కర్నూలు (టౌన్)/ బొమ్మలసత్రం -
రాయలసీమపై చంద్రబాబు వివక్ష
కర్నూలు: రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వివక్ష చూపుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల,కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాట సాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూ లు పార్లమెంటు ఇన్చార్జి బుట్టా రేణుక, మాజీ మేయర్ బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైసీపీ నేతలు బుధవారం సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కర్నూలు న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటుకు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి ప్రకటన చేస్తే సుప్రీం కోర్టులో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైసీపీ కురువ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం రామకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సువర్ణా రెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. హామీని నెరవేర్చాలని కోరుతూ.. రాయలసీమ ప్రాంతం కోసం ఏపీ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ జిల్లా కోర్టు బయట 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు బుధవారం రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది వై.జయరాజు వారికి పూలమాలలు అందించి అభినందించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాది నాగలక్ష్మి దేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
ఉద్యోగులూ.. ఉద్యమంలో పాల్గొనాలి
కర్నూలు(సెంట్రల్): ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొనాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఉద్యమంలో భాగంగా మూడో రోజు ఏపీజేఏసీ అమరావతి నాయ కులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఉద్యోగులను కోరారు. కలెక్టరేట్, జెడ్పీలో ఉద్యమానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ కరపత్రాలు, నల్లబ్యాడ్జీలను అందజేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే ప్రభుత్వం మెడలు వచ్చి డిమాండ్ల సాధనకు మార్గం సుగమనం అవుతుందన్నారు. ఇదిలా ఉండగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 27 నెలలు గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదు ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వి.గిరికుమార్రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్సీ కమిషనర్ను తొలగించడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై రాజకీయ ముద్రలు వేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ను మాత్రమే అంగీకరిస్తామని, జీపీఎస్ను కూడా ఒప్పుకునేది లేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగులరైజేషన్ చేయాలని, వారికి సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.


