breaking news
Kurnool District Latest News
-
అంబేడ్కర్ వర్ధంతిని విస్మరించడం అవమానించడమే!
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడం అవమానించడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ 69 వ వర్థంతిని పురస్కరించుకొని శనివారం పాతబస్టాండ్లోని విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ కొట్టి పూలమాలు వేసి నివాళ్లు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, పౌర హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి అపారమైందన్నారు. ఆయన చూపిన మార్గమే తూచ తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అమలు చేసిందన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని అని తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం అంబేడ్కర్ విగ్రహం చుట్టూ శుభ్రం చేయించడంలో విఫలం చెందిందన్నారు. చెత్తాచెదారం నిండి ఉన్నా మున్సిపల్ అధికారులకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ఆశించిన సమానత్వం, సమాజ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేలంపాడు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కమతం పరుశరామ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైల్వే ప్రసాద్, ఆర్టీఐ నగర అధ్యక్షుడు గద్ద రాజశేఖర్, నవీన్, ప్రభుదాస్, చందు, లాయర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, చెన్న, సత్యరాజు, పార్టీ దళిత నాయకులు పాల్గొన్నారు. -
పైపులు ధ్వంసం చేసి.. స్టార్టర్ అపహరించి..
● వైఎస్సార్సీపీ మద్దతుదారుడి పొలంలో దుండగుల దాష్టికంఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామంలో ఓ రైతు పొలంలో గుర్తు తెలియని అగంతకులు పైపులు ధ్వంసం చేసి స్టార్టర్ను ఎత్తుకు పోయారు. వెలుగోడుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు జనార్దన్ నల్లకాల్వలో కొంత పొలం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు. కాగా ఈ పొలం విషయంలో కొందరితో ఆయనకు కోర్టులో సివిల్ వాజ్యం ఉంది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జనార్దన్ను కోర్టుతో సంబంధం లేకుండా తమ వద్దకు వచ్చి పంచాయితీ చేసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ట్రాక్టర్తో జనార్దన్ పొలం దున్నించే యత్నం కూడా చేశారు. ఈ అంశం అప్పట్లో పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. కాగా మరో మారు పంచాయితీకి రమ్మని టీడీపీకి చెందిన కొందరు జనార్దన్ను పిలిచారు. అయితే కోర్టులో వచ్చే తీర్పును బట్టే తాను నడుచుకుంటానని జనార్దన్ వారితో చెప్పాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి జనార్దన్ పొలంలో ఉన్న మోటార్కు చెందిన పైపులు ధ్వంసం అయ్యాయి. అంతే కాకుండా విద్యుత్ స్తంభానికి కట్టిన స్టార్టర్ కూడా మాయమైంది. ఉదయం పొలంలో నీరు పెట్టడానికి వెళ్లిన కూలీ జనార్దన్కు జరిగిన విషయం తెలిపాడు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు ప్రతిష్ట పెంచేలా పనిచేయండి
కర్నూలు: పోలీసు ప్రతిష్టను పెంచేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో శనివారం హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవం(రైజింగ్ డే) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి పరేడ్ పరిశీలన వాహనంపై మైదానం కలియతిరుగుతూ ప్లటూన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందించడం అభినందనీయమన్నారు. సాధారణ డ్యూటీలు మొదలుకొని క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. నలుగురికి సత్కారం సుదీర్ఘకాలం హోంగార్డు విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీనివాస శెట్టి, శేషమ్మ, వీరమ్మ, హసీనా బేగం తదితరులను ఎస్పీ శాలువ, పూలమాలలతో సత్కరించి ఒక్కొక్కరికి రూ.2 లక్షల కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, ఉపేంద్ర బాబు, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సీఐలు మధుసూదన్రావు, చంద్రబా బు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఆర్ఐలు పోతల రాజు, జావేద్, నారాయణ, ఆర్ఎస్ఐలు మహేశ్వర రెడ్డి,హుసేన్, ప్రదీప్, కల్పన, మహాలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థుల భోజనం నాణ్యతలో రాజీపడం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ, సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందించే భోఽజనం నాణ్యత విషయంలో రాజీపడమని వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య వెంకట బసవరావు అన్నారు. శనివారం ఆ కాలేజీ తుంగభద్ర హాస్టల్లో నూతన డైనింగ్ హాలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తే ఆరోగ్యవంతులై చదువుపై దృష్టి సారిస్తారన్నారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు అందరు కూడా కలిసిమెలిసి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల వసతులు, మెనూ విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వార్డెన్లు అందుబాటులో ఉంటారన్నారు. నిరంతరం సీసీ టీవీ నిఘా ఉంటుందన్నారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్లు హాస్టల్లోనే భోజనం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్లు డాక్టర్ నాగరాజు శెట్టి, డాక్టర్ అక్తర్ భాను, డాక్టర్ మహమ్మద్ వాహిజ్, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ ఎం పార్వతి, డాక్టర్ స్వప్నశ్రీ, డాక్టర్ షానవాజ్ బేగం, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
దా‘ఉడుమూ’తలు..
కనుక్కోండి చూద్దాం ఆటకు సరిగ్గా సరిపోతుంది ఈ చిత్రం. ఈ చిత్రంతో కంటి చూపును పరీక్షించుకోవచ్చు. ఇందులో ఓ జీవి దాగి ఉంది. ఆహారన్వేషణలో దాగుడుమూతలు ఆడుతూ ఆకలి తీర్చుకుంటోంది. ఇంకా గుర్తు పట్టలేదా.. బాగా చూడండి.. చెట్టు మొదలులో తొర్ర సమీపంలో ఉడుము ఉంది. చెట్టు రంగులో కలసిపోయి పురుగులు, కీటకాలను వేటాడుతోంది. ఈ దృశ్యం శనివారం బ్రహ్మగుండం క్షేత్రంలో కనిపించింది. – వెల్దుర్తి -
మొక్కజొన్న రూ.2,400లతో కొనుగోలు చేయాలి
కర్నూలు(సెంట్రల్): మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 వర్తింపజేయాలని ట్రేడర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ పంటలకు సంబంధించి ట్రేడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవన్నారు. రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖాధికారులను ఆదేశించారు. తూకాల్లో రైతులను మోసం చేస్తే ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేయాలన్నారు. లారీ అసోసియేషన్ రవాణా ధరలను పెంచడంతో కొంత సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని ట్రేడర్లు కోరారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, డీఏఓ పీఎల్ వరలక్ష్మీ, ఎల్డీఎం రామచంద్రరావు, ఉద్యాన అధికారి రాజకృష్ణారెడ్డి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి -
వెటర్నేరియన్ పదాన్ని ఇతరులు వాడరాదు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో వెటర్నేరియన్ అనే పదాన్ని బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్ కోర్సు చదవిన వారు మాత్రమే వాడుకునేందుకు అర్హత ఉందని ఉమ్మడి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్ అసోషియేషన్ నేతలు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో ఇతరులు వెటర్నేరియన్ అనే పదాన్ని వాడుతున్నారని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ అనే పదాన్ని వాడుకోవచ్చని, ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, వెటర్నేరియన్ అనే పదాన్ని వాడరాదన్నారు. ఇతరులు ఈ పదాన్ని వాడితే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) సెక్షన్ 56, 1984 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. పారా వెటర్నరీ సంఘాలు, నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ పెడరేషన్లో వెటర్నేరియన్ అనే పదాన్ని తొలగించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఆర్.నాగరాజు, కార్యవర్గసభ్యుడు వెంకటసుబ్బయ్య, పశువైద్యుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి మనోజ్ అరుణ్కుమార్, ఉపాధ్యక్షుడు మదన్మోహన్ తదిర తులు ఉన్నారు. -
ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మబడును
● అడ్వాన్స్ ఇవ్వండి.. జాబ్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఇవ్వండి ● నిరుద్యోగులను బురిడీ కొటిస్తున్న ఓ ఉద్యోగి ఆత్మకూరురూరల్: భలే మంచి చౌకబేరం.. అంటూ ఆత్మకూరులో ఓ ఘనుడు ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నిరుద్యోగులను మభ్యపెట్టి అందినకాడికి దోచుకుంటున్నాడు. అందులోనూ అతను ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో కొందరు సులువుగా న మ్మి మోసపోతున్నారు. అర్హతను బట్టి రెవెన్యూ, అటవీ వాఖ, ఎండోమెంట్.. ఇలా ఏ శాఖ కావాలో కోరుకో.. అంటూ చెబుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన నిరుద్యోగులు ఇతని బుట్టలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అడ్వాన్స్గా కొంత ఇచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత మొత్తం ఇచ్చేలా ఒప్పందం అంటూ.. నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడు. పాములపాడు, బానకచర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు అటవీ శాఖలో ఉద్యోగం కోసం రూ. లక్ష చొప్పున అతనికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల పేరుతో వ్యాపారం మొదలు పెట్టడంతో బాధితులు ఇంకా రోడ్డున పడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తుంటే ఆత్మకూరులో ఓ ఉద్యోగి మాత్రం జాబ్కు ఇంతా.. అంటూ బేరం పెట్టడంపై ఆత్మకూరు లో తీవ్ర చర్చ సాగుతోంది. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిరుద్యోగులను దోచుకుంటున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పైళ్లెన నెల రోజులకే..
● యువకుడి బలవన్మరణం కొలిమిగుండ్ల: వివాహ బంధంతో ఆనందంగా గడపాల్సిన యువకుడికి ఏమైందో ఏమో కానీ పైళ్లెన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన శనివారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన బట్ట జయరాముడు కుమారుడు శరత్కుమార్(25)కు కర్ణాటక రాష్ట్రం సుగ్నీల్ కొట్టాలకు చెందిన సుస్మితతో గత నెల 4వ తేదీన వివాహమైంది. శరత్కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్తూ భార్యను పుట్టింటిలో వదిలిపెట్టాడు. శుక్రవారం బుగ్గకు చేరుకుని కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఉంటున్న స్నేహితుడు హరీష్కు ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. హరీష్ పెట్నికోట సమీపంలో నిర్మాణంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. ఆతర్వాత శరత్ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. శనగ మాత్రలు మింగి డ్యూటీలో ఉన్న స్నేహితుడికి వాయిస్ మెసేజ్ చేశాడు. దీంతో అక్కడి నుంచి రూంకు చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మిత్రుడిని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు అనంతపురం చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైల్వే డబుల్ లేన్ పనుల పరిశీలనపాణ్యం: నంద్యాల–గుంతకల్లు మధ్య రైల్వే శాఖ చేపట్టిన డబుల్ లేన్ పనులను గుంతకల్లు ఏడీఆర్ఎం సుధాకర్ శనివారం పరిశీలించారు. ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి సేఫ్టి అధికారులు పర్యవేక్షణకు వస్తున్న క్రమంలో ముందుస్తుగా ఏడీఆర్ఎం, ఇంజినీర్ల బృందం పనులను పరిశీలించేందుకు ప్రత్యేక రైలులో మార్గంలో తనిఖీలు చేపట్టారు. వారికి ఆయా స్టేషన్ మాస్టర్లు, సిబ్బంది స్వాగతం పలికారు. నూతనంగా చేపట్టిన డబుల్ లేన్, విద్యుత్ సరఫరా, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర పనులపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ల వారీగా ఇంజినీర్లును అడిగి తెలుసుకున్నారు. పాణ్యం రైల్వే స్టేషన్లో చేట్టిన డబుల్ ట్రాక్ పనులకు సంబంధించి సమీక్ష చేపట్టారు. -
పదిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి
కోడుమూరు రూరల్: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శామ్యూల్పాల్ సూచించారు. శనివారం ఆయన కోడుమూరులోని బాలురు, బాలికల హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. డీఈఓ ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి స్వయంగా సమాధానాలు రాబట్టారు. డీఈఓ మాట్లాడు తూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా హైస్కూళ్లలో ఉపాధ్యాయులంతా పదవ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సైన్స్, మ్యా థ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహా రం అందివ్వాలన్నారు. కార్యక్రమంలో బాలురు, బాలికల హైస్కూళ్ల హెచ్ఎంలు రామచంద్రుడు, ఇంద్రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో ఐదుగురికి పార్టీ పదవులు కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో ఒకరికి, నియోజకవర్గ స్థాయిల్లో నలుగురికి పార్టీ పదవులు దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళాకారుల విభాగం జిల్లా అధ్యక్షులుగా కనికె మల్లిఖార్జున (ఎమ్మిగనూరు) నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షులుగా బి.పి.శోభలతా(ఆదోని), వి.సురేష్ బాబు(ఆలూరు), సురేంద్ర రెడ్డి(కోడుమూరు), ఎల్. నెట్టికల్(పత్తికొడ) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు 93 శాతం హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం జరిగిన పరీక్షలకు 6,677 మందికి 6,232 మంది హాజరు కాగా 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల, పత్తికొండ విజయసాయి డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చూచిరాతకు పాల్పడటంతో డిబార్ చేశామన్నారు. వారం రోజులైనా అందని వేతనాలు కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల మొదలై ఏడు రోజులు గడిచినా ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని ప్రకటిస్తోంది. అయితే వాస్తవానికి ఆ ప్రకటనల్లో నిజం లేదని ఉద్యోగులే వాపోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశిమి సందర్భంగా కూడా 1వ తేదీ వేతనాలు చెల్లించలేదు. ఆ నెలలో 7–9 తేదీల్లో వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. నవంబర్ నెలలో 9వ తేదీ నాటికి వేతనాలు చెల్లించారు. డిసెంబర్ నెలలో కూడా వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానశాఖ, జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యాలయం, కార్మికశాఖ, ఆర్అండ్బి, నీటిపారుదల తదితర శాఖల ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. కొన్ని శాఖల ఉద్యోగులకు 2, 3 తేదీల్లో వేతనాలు పడ్డాయి. అత్యధిక శాఖల ఉద్యోగులు ఇప్పటికీ వేతనాల కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం. -
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఉద్యోగులను కార్యాలయాల్లో ఉంచకుండా సర్వేల పేరిట ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ కారణంగా ఉద్యోగులు మానసిక ఒత
గ్రామ/వార్డు సచివాలయల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం 41 రకాల సర్వేలను చేయిస్తోంది. ఇందులో కొన్ని.. హౌస్ హోల్డ్ జీయో కోఆర్డినేట్ మ్యాపింగ్, చిన్నారుల ఆధార్, జనన సర్టిఫికెట్ డేటా కలెక్షన్, పెండింగ్ సిటీజన్ ఈకేవైసీ, మైగ్రేటెడ్ విత్ ఇన్ ఏపీ–జియో కోఆర్డినేట్స్ క్యాప్చరింగ్, మనమిత్ర క్యాంపెయిన్, ఆధార్ సీడింగ్ ఫర్ వాహన్ డాటా, బయోమెట్రిక్ అప్డేషన్ ఫర్ చిల్డ్రన్స్, రైస్ కార్డుల పంపిణీ, వాట్సాప్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, రీ వెరిఫికేషన్ హౌస్ హోల్డ్స్ జియో కోఆర్డినేషన్, నాన్ ఏపీ రెసిడెంట్ సర్వే, పీఎంఏవై 2.0 హౌసింగ్ సర్వే, జీయో కోఆర్డినేట్స్ ఆఫ్ షాప్స్, రైతన్నా మీ కోసం, టీఎంఎఫ్ స్కూల్ ఇన్స్పెక్షన్ అండ్ టాయిలెట్స్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ 5 స్టెప్ వెరిఫికేషన్, రబీ సీజన్ ఈ–క్రాప్ బుకింగ్, ఐపీఎం ఫర్ చిల్లీ ప్లాంట్స్, రీ సర్వే ఆఫ్ ల్యాండ్స్ ఏపీ రీసర్వే ప్రాజెక్ట్–2025, పట్టా, ఆన్లైన్ సబ్ డివిజన్, బీఎల్ఓ డ్యూటీస్ రిగార్డింగ్ ఎస్ఐఆర్ మ్యాపింగ్ తదితర సర్వేలను చేయాల్సి ఉంది. ఏ రోజుకు ఆ రోజు నిర్దేశించిన సర్వేలను పూర్తి చేసి అప్లోడ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి సచివాలయాల్లోని తీవ్ర పని ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11న ఓర్వకల్ మండలం నన్నూరు–3 సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ముకుందప్రియ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ● ఎమ్మిగనూరులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజా రత్నంకు బీఎల్ఓ, వార్డు అడ్మిన్ సెక్రెటరీ తదితర అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారినపడి ఈ నెల 4న మృతి చెందారు. రాజా రత్నం (ఫైల్)ముకుందప్రియ (ఫైల్) సర్వేల పేరిట క్షేత్రస్థాయిలోనే ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యాలతో సతమతం కార్యాలయంలో కనిపించని సిబ్బంది సమయపాలన పాటించక అందని సేవలు ప్రజలు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
‘స్క్రబ్ టైఫస్’ అంటువ్యాధి కాదు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కర్నూలు (సెంట్రల్): స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు. నవంబర్ నెల నుంచి ఈనెల 6వ తేదీ వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని 39 మంది రోగులు డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం ఐదుగురు ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు, కాటు దగ్గర నల్ల రంగు పట్టు (ఎస్కార్) లక్షణాలు ఉంటాయని, వెంటనే సమీప పీహెచ్సీ/యూపీహెచ్సీని సంప్రదించాలని సూచించారు. జీజీహెచ్ కర్నూలులో పరీక్ష చేసి నిర్ధారణ అనంతరం చికిత్స చేస్తార తెలిపారు. రైతులు పొలాల్లో, పొదల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా ఒంటిని కప్పి ఫుల్ షర్టులు, ప్యాంట్లు ధరించాలని సూచించారు. సమావేశంలో జీ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ శ్రీరాములు, చిన్నపిల్లల విభాగపు హెచ్ఓడీ డాక్టర్ విజయానంద్ బాబు, పల్మనాలజీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి(22) రోడ్డు ప్రమాదంలో శనివారం మృతిచెందింది. ఇస్వీ ఎస్ఐ మహేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి, భర్త గిరిస్వామి కూలీ పని కోసం, మామ ఉరుకుందప్ప పొలం పని కోసం ఆదోనికి బైక్పై వెళ్తుండగా మండలంలోని కపటి గ్రామ సమీపంలో గరుసుతోలే ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త గిరిస్వామి, మామ ఉరుకుందప్పకు గాయాలయ్యాయి. సరస్వతికి కుమారుడు, కుమార్తె సంతానం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎకై ్సజ్ సిబ్బంది రక్తదానం కర్నూలు: తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఎకై ్సజ్ సిబ్బంది రక్తదానం చేశారు. కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో జెమ్కేర్ కామినేని హాస్పిటల్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఎకై ్సజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 160 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్థులకు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిబాబుతో పాటు ప్రతినిధి బృందం కూడా కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. క్వార్ట్జ్ మైన్స్పై వ్యతిరేకత వెల్దుర్తి: బుక్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 214లో నాలుగు ఎకరాల్లో ఎంఎస్ ఇన్ఫినిటి మినరల్స్ కంపెనీ ఏర్పాటు చేయనున్న క్వార్ట్జ్ అండ్ సిలికా శ్యాండ్ మైనింగ్ ఏర్పాటుకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్డీఓ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొనగా కంపెనీ ఏర్పాటు తమ పంట పొలాలు దెబ్బతింటాయని, కాలుష్యం పెరుగుతుందని గ్రామ నాయకుడు శంకర్ రెడ్డి, రైతులు అధికారుల ఎదుట తమ వాదన వినిపించారు. అంతే కాకుండా గ్రామానికి 4కి.మీల దూరంలో సభ నిర్వహించడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీఓ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
● అలేబాదు వద్ద ఆటో బోల్తా ● ఇద్దరు మహిళలు మృతి ప్యాపిలి: దైవదర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తున్న భక్త బృందంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అలేబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు ఈ నెల 4వ తేదీన ఆటో అద్దెకు మాట్లాడుకుని వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి జ్యోతి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అదే ఆటోలో 5వ తేదీన తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ప్యాపిలి మండల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో దైవదర్శనం చేసుకుని రాత్రి అక్కడే భోజనం చేసి కాసేపు సంతోషంగా గడిపారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. అలేబాదు నుంచి బయలుదేరిన వారి ఆటో వినాయక గుడి మలుపు వద్ద అదుపు తప్పి రక్షణగోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కళావతి, నాగేంద్రమ్మ (58), బోయ దూది హనుమక్క (66), అయ్యమ్మ, సోమక్క, మద్దమ్మ, లక్ష్మమ్మకు గామాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే రాచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బోయ హనుమక్క ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందగా, నాగేంద్రమ్మ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతి చెందిన లింగుట్ల నాగేంద్రమ్మ అవివాహిత కాగా.. హనుమక్క భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఆమె పుట్టినిల్లు రామకృష్ణాపురంలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం. తీవ్రంగా గాయపడిన సోమక్క, అయ్యమ్మలను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ దూది హనుమక్క, నాగేంద్రమ్మ (ఫైల్) -
డిజిటల్ అసిస్టెంట్ లేక వెల్దుర్తికి వెళ్తున్నాం
నా భర్త సత్యానంద్(70) నెల క్రితం చనిపోయాడు. ఆయనకు పింఛన్ వచ్చేది. మా గ్రామంలోని సచివాలయానికి వెళ్లి డెత్ సర్టిఫికెట్, నాకు పింఛన్ సౌకర్యం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ నాకు వచ్చేలా చేస్తానన్నారు. వారంగా తిరుగుతూ శనివారం వెళ్లి ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి అడిగితే డిజిటల్ అసిస్టెంట్ లేడన్నారు. ఇతను ఎల్.నగరం సచివాలయంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న డీఏ స్థానంలో డిప్యూటేషన్ చేస్తున్నాడంట. ఆయన అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీ సోమవారం రమ్మన్నారు. ఇక ఎదురు చూడలేక సచివాలయంలో దరఖాస్తు చేసుకునే బదులు వెల్దుర్తి మీ సేవలో అప్లయ్ చేసుకునేందుకు వెళ్తున్నాం. పొలం పనులు మానుకుని కాళ్లీడ్చుకుంటూ తిరుగుతున్నాం. – సుశీలమ్మ, స్వాములు (తల్లీ, కొడుకులు), నర్సాపురం గ్రామం -
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కర్నూలు: కోర్టులలో పెండింగ్లోని మోటర్ యాక్సిడెంట్లు, సివిల్ కేసులు, భూసేకరణ, బ్యాంకు, చిట్ఫండ్, చెక్బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. జిల్లాస్థాయిలో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్ష నిర్వహించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు డిపో మేనేజర్, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ఫండ్స్, భూసేకరణ సంబంధిత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా ప్రత్యేక దృష్టి సారించి విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ సుధారాణి, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఇన్సురెన్స్ అధికారులు, బ్యాంకుల లీడ్ డివిజినల్ మేనేజర్ రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మీ కాల్ .. చేరుకోలేక పోతుంది!
శ్రీశైలం: భక్తుల రద్దీ పెరిగితే శ్రీశైల క్షేత్రంలో సెల్ సేవలు మూగబోతాయి. ఎప్పుడు ఏ కంపెనీ నెట్వర్క్ పని చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బాగా పని చేస్తుండగా ఇటీవల సిగ్నల్ హెచ్చుతగ్గులతో వినియోగదారులు హలో.. హలో..హలో అంటూ గొంతు చించుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్తో పాటు జియో, ఎయిర్టెల్ మొదలైన సెల్ టవర్లు ఉన్నా అవి కూడా సరిగా పని చేయడం లేదు. ఓ రోజు జియో సిగ్నల్స్ బాగుంటే మరో రోజు ఎయిర్టెల్ సిగ్నల్ ఎత్తిపోతుంది. ఇక బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ బాగా కనిపిస్తున్నా నెట్ సేవలు పూర్తిగా మందగించాయి. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు, ఫొటోలు డౌన్లోడ్ కావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఫోన్పే, గూగుల్పే పేటీఎం మొదలైన ఆన్లైన్ లావాదేవీలకు భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్లోని తమ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని ధీమాతో కొద్దిపాటి మొత్తంతో వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. స్వామివార్ల దర్శన టికెట్లకు, లడ్డు ప్రసాదాలను కొనుగోలుకు, వసతి సౌకర్యం పొందడానికి క్యాష్ రూపేనా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులు అయిపోతే అకౌంట్లోని డబ్బును క్యాష్ రూపంలో మార్చుకోవడానికి స్థానిక వ్యాపారస్తులను బతిమిలాడుకోవాల్సి వస్తోంది. శ్రీశైలంకు వచ్చే యాత్రికులు భక్తులు సెల్ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడం, ఒకవేళ ఉన్న క్యాష్ ట్రాన్స్ఫర్ జరగకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఏటా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి టెక్నికల్ మేనేజర్లు భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని సెల్ టవర్ బూస్టర్లను ఏర్పాటు చేస్తారు. శివరాత్రి ముగిశాక తిరిగి యథాస్థితి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికై నా ఆయా సంస్థల ప్రతినిధులు నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీశైలంలో భక్తులను వేధిస్తున్న సెల్ నెట్వర్క్ ఆన్లైన్ లావాదేవీలకు అంతరాయం శని, ఆది, సోమవారాల్లో కాల్ కలిసిందంటే అదృష్టమే -
టూవీలర్ ర్యాపిడో వ్యవస్థను రద్దు చేయండి
కర్నూలు: ర్యాపిడో సంస్థలో టూ వీలర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ అనుబంధ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నగర కార్యద ర్శి రాధాకృష్ణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమార్ను తన కార్యాలయంలో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఓలా, ఉబేర్, ర్యాపిడో సంస్థలతో ఆటో కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలైన టూ వీలర్లలో ప్రయాణికులను చేరవేస్తూ ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకున్నట్లు లేదని, ర్యాపిడో యాజమాన్యాన్ని పిలిపించి చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఎస్.హుసేన్ వలి, మాలిక్ బాషా, ఖలీల్ అహ్మద్ డీటీసీని కలసిన వారిలో ఉన్నారు. -
రెండు నెలలుగా తిరుగుతున్నా
కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నా. నాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కొత్త రేషన్ కార్డు కోసం సచివాలయం–1 చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నా. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది సచివాలయం–4కు వెళ్లమన్నారు. ఇక్కడ ఎంట్రీ చేసిన 21 రోజుల తర్వాత రమ్మన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగున్నా ఫలితం లేకపోతోంది. పనులు మానుకుని కార్డు కోసం తిరగాల్సి వస్తోంది. – గోపాల్, కోసిగి సచివాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా పనులు జరగడం లేదు. గతంలో వలంటీర్లు ఉండడంతో ఇంటికి వచ్చి సేవలు అందించేవారు. ఇప్పుడు ఏ పనికై నా సచివాలయానికి వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. సర్వేల పేరుతో బయటకు వెళ్తున్నారు. సచివాలయం ఉద్యోగులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. – కుమార స్వామి, గూళ్యం గ్రామం, హాలహర్వి మండలం సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదు. కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా సిబ్బంది ఉండరు. ఒకరో ఇద్దరో ఉంటారు. వారిని అడిగితే సరైన సమాధానం కూడా రాదు. ఫీల్డ్కు వెళ్తుతున్నారని చెబుతారు తప్ప పనులు జరగడం లేదు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – వీరేష్, చిన్నమరివీడు గ్రామం● -
ఐక్యతతోనే ఆదోని జిల్లా సాధ్యం
ఆదోని టౌన్: అందరూ ఐక్యంగా ఉంటేనే ఆదోని జిల్లా సాధ్యం అవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్రెడ్డి అన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి శుక్రవారం ఆదోనికి వచ్చారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదోని జిల్లా సాధనకు కలసికట్టుగా పోరాడుదామన్నారు. ఆదోని జిల్లా కేంద్రం అయితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, అన్ని కార్యాలయాలు ఏర్పడుతాయన్నారు. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఆదోని ప్రాంతం జిల్లా అయితే 60 శాతం అభివృద్ధి జరిగినట్లేనని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
కర్నూలు : ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హోంగార్డులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. డిసెంబర్ 6వ తేదీ హోంగార్డ్స్ 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని (రైజింగ్ డే) పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 10 మంది డాక్టర్లు శిబిరంలో పాల్గొని హోంగార్డు కుటుంబాలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జబ్బులు బయటపడిన వారు ఆరోగ్య భద్రత పథకం కింద మరోసారి వైద్యపరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని హోంగార్డు కుటుంబాలకు ఎస్పీ సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతితో పాటు హోంగార్డు ఆర్ఐలు పోతల రాజు, జావిద్, నారాయణ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
యువకుడి బలవన్మరణం
ఓర్వకల్లు: ప్రేమ వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బల వన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుమ్మితం తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల గ్రామానికి చెందిన జైకుమార్(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల క్రితం శకునాల గ్రామానికి వచ్చాడు. గుమ్మితం తండా సమీపాన ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టులో దినసరి కూ లీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని తీవ్రమనస్తాపానికి గురైన జైకుమార్ ఈ నెల 4న పని ముగించుకొని తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి, గుమ్మితం తండా, బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్యన ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. అటుగా వెళ్లుతున్న వ్యక్తులు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించారు. ఎస్ఐ సునీల్కుమార్ తన పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలుపలికి తీశారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
వెల్దుర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆ వేదిక చైర్ పర్సన్, రిటైర్ట్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కర్నూలు డివిజన్ పరిధిలోని వినియోగదారులకు డీఈ/ఈఈ శేషాద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు టౌన్, కర్నూలు, కల్లూరు రూరల్, వెల్దుర్తి, కృష్ణగిరి, ఓర్వకల్లు మండలాల వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమంలో ఇనుప విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ వినియోగదారులు విన్నవించారు. వెల్దుర్తి పట్టణంలో శాశ్వత విద్యుత్ బిల్లుల చెల్లింపు సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. వెల్దుర్తి నుంచి నాలుగు, ఇతర మండలాల నుంచి నాలుగు సమస్యలు వేదిక, అధికారుల ముందుకు రాగా కార్యక్రమానికి హాజరైన కర్నూలు ఎస్ఈ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తెలిపిన సమస్యలు, అందించిన నివేదికలపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బిల్ కలెక్టర్ నియమిస్తామన్న హామీనిచ్చారు. వినియోగదారులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ప్రతినిధులు మధుసూదన్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్ఏఓ చిన్నరాఘవులు, ఏడీఏ సుబ్బన్న, ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు, కర్నూలు, కల్లూరు సబ్డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హాస్టళ్లలో నాల్గవ తరగతి ఉద్యోగాల పేర్లు మార్చండి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది హోదాలకు సంబంధించిన పేర్లను మార్చాలని ఆయా సంక్షేమ శాఖల నాల్గవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు దిబ్బలమ్మ, అధ్యక్షులు శ్రీరాములు కోరారు. ఈ పేర్లతో సమాజంలో తాము వివక్షతకు గురవుతున్నామన్నారు. తమకు ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు కూడా యజమానులు ఆలోచిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నాగేశ్వరితో కలిసి ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను అందించినట్లు చెప్పారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వంట మనిషిని హాస్టల్ ఫుడ్ మేనేజర్, కమాటీని హాస్టల్ కేర్ టేకర్, వాచ్మెన్ను హాస్టల్ ప్రొటెక్షన్గా పిలిచే విధంగా మార్పు చేయాలని కోరామన్నారు. ఉన్నతాధికారులను కలిసిన వారిలో రాష్ట్ర కోశాధికారి కే పరమేశ్వరరావు, జిల్లా నేతలు మాధవ, మల్లీశ్వరి, సోమిబాయి తదితరులు ఉన్నారు. -
టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు పూజలు
కర్నూలు సిటీ: టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు శుక్రవారం టీబీ బోర్డు సెక్రటరీ ఓ.రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్ పూజలు నిర్వహించారు. గతేడాది ఆగష్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో తాత్కలికంగా స్టాప్లాక్ గేటును ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఇచ్చిన సూచనలు ఆధారంగా కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డ్యాం 33 గేట్లు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్యాంలో 1621.98 అడుగులు, 67.05 టీఎంసీ నీరు ఉంది. ఈ నీటి మట్టం 1613 అడుగులకు చేరిన తరువాత సిద్ధంగా ఉంచిన 15 గేట్లను మార్చనున్నారు. ప్రస్తుతం గేట్లను 1621.98 అడుగుల వరకు ఎలిమెంట్స్ను తొలగించే పనులు ఒకటి, రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టనున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఆదోని అర్బన్: కంటైనర్ ఢీకొనడంతో ఆస్పరి మండలం తురువగల్ గ్రామానికి చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందారు. తాలూకా ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ తల్లి బజారమ్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆదోని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం భార్యను అమ్మ దగ్గర వదిలి తిరిగి తురువగల్లు గ్రామానికి వెంటకేష్ వెళ్తుండగా ఆస్పరి రోడ్డులో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పవిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆయుష్మాన్ కళాశాల వద్ద ఆందోళన
కర్నూలు(హాస్పిటల్):కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల వద్ద శుక్రవారం కొందరు విద్యార్థులు తమకు హాల్టికెట్లు ఇవ్వలేదని ఆందోళన చేశారు. తాము జూలై నెలలోనే పరీక్ష ఫీజు చెల్లించినా ఇప్పటి వరకు హాల్టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘ నాయకులు భాస్కర్ నాయుడు, కటారుకొండ సాయికుమార్, కడుమూరు గిరీష్లు మద్దతు పలికారు. కళాశాల యాజ మాన్యంతో మాట్లాడేందు కు ప్రయత్నించగా ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుని వాగ్వాదాని కి దిగారు. కళాశాల యాజమాన్యం అవినీతి, అక్రమా లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకు లు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు ఖా జాహుసేన్,కురువ రంగన్న, పవన్,హరి పాల్గొన్నారు. -
బాలింత మృతితో బంధువుల ఆందోళన
కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్లో బాలింత మృతితో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ (23)ని సి.బెళగల్ మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి రెండేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. కాన్పు కోసం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్కు వెంకటలక్ష్మి రెండు రోజుల కిందట వెళ్లారు. గురువారం వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటలక్ష్మి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి మృతిచెందిదంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తాలూకా సీఐ చంద్రబాబు, కె.నాగలాపురం ఎస్ఐ శరత్కుమార్రెడ్డి పోలీస్ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల ఆందోళనను విరమింపజేశారు. -
పదకొండు నెలల్లో 8 వేల కేసులు...
జిల్లాలో రోజుకు సగటున చిన్నా, పెద్దవి కలసి ఐదు రహదారి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ప్రతి పది ప్రమాదాల్లో మూడింటికి మద్యం మత్తే కారణమని గణాంకాలను బట్టి తెలుస్తోంది. మద్యం మత్తు వల్ల ప్రమాదాలకు గురైతే బీమా పథకాలు వర్తించవని పోలీసులు సూచిస్తున్నారు. ఒకరు చేసే తప్పునకు వారి కుటుంబం మొత్తం బాధ పడటమే కాకుండా ఇతర వాహనదారులు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. రోడ్డు భద్రత, పోలీసు సూచనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణాలు సాధ్యం. ఈ ఏడాది జిల్లాలో పదకొండు నెలల్లో ఎనిమిది వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య తీవ్రత అర్థమవుతోంది. కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. మత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా చాలామంది దానిని పట్టించుకోవడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి జరిమానాల కొరఢా విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఎంతో మంది మృతి చెందుతున్నారు. జిల్లాలో గత మూడేళ్లలో 1,650 రోడ్డు ప్రమాదాలు జరగ్గా దాదాపు 870 మంది మృత్యువాత పడ్డారు. 1,861 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయి కుటుంబాలకు భారంగా జీవనం సాగిస్తున్నారు. అక్టోబర్ 24న చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటన మొదలు జిల్లాలో వరుసగా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 40 రోజుల వ్యవధిలో సుమారు 50 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందటం వాటి తీవ్రతకు అద్దం పడుతోంది. మద్యం కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న కోర్టులు... మద్యం తాగి వాహనాలు నడపటం నేరం. ఇలాంటి కేసులను కోర్టులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గతంలో బ్రీత్ ఎనలైజర్లో చూపించే లెక్క ఆధారంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలు జరిమానా పడేది. మోతాదుకు మించి ఉంటే జైలు శిక్ష విధించేవారు. అయినా మందుబాబుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో న్యాయ స్థానాలు భారీగా జరిమానా విధిస్తున్నాయి. కొంతకాలంగా కోర్టు మెట్లు ఎక్కిన ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. 30 శాతం మత్తే కారణం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారు. 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారు ఉంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం తాగి స్పృహ లేకుండా వాహనాలు నడిపి ఇతరులను ప్రమాదాల్లో పడేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు డివైడర్లకు తగిలి పడిపోయినా... ఎదురెదురు వాహనాలు ఢీకొట్టుకున్నా... ఆగిన వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినా, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి పడిపోయినా, పాదచారులపై దూసుకెళ్లినా... ఇలా చాలా ప్రమాదాల్లో మద్యం మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతి నెలా పాతికమందికి పైగానే చనిపోతున్నారు. 80 పాయింట్లు దాటితే కేసే... జాతీయ రహదారులతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు నడిపిన వ్యక్తికి భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లో 80 పాయింట్ల కంటే ఎక్కువ చూపితే వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారుల్లో తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య వాహనచోదకులకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవడం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తనిఖీల సందర్భంగా సూచిస్తున్నా మార్పు కనిపించటం లేదు. – మన్సూరుద్దీన్, ట్రాఫిక్ సీఐ సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2023 509 298 568 2024 520 281 614 2025 621 291 679 అక్టోబర్ వరకు -
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఈ నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతి భావంతుల (దివ్యాంగుల) దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు అవకాశాలను కల్పించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందిస్తున్న విధంగానే దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆయా విద్యా సంస్థల్లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. రూ. 22 లక్షల విలువ చేసే విత్తనాలు సీజ్ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని రెండు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసి రూ. 22.22 లక్షల విలువ చేసే విత్తనాలను పట్టుకున్నట్లు ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏవో శివశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న శివకిరణ్ ట్రేడర్స్, గంజల్లరోడ్డులోని క్రాంతి ఆగ్రో ట్రేడర్స్లో అనధికారికంగా వరి, మొక్క జొన్న విత్తనాలు ఉన్నాయని సమాచారం రావటంతో ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏవో శివశంకర్లు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు దుకాణాల్లో మూడు రకాల పెన్నా సీడ్, కోర్ సీడ్ (మొక్కజొన్న), వరి (టీ స్టెయిన్స్) విత్తనాలు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారని చెప్పారు. అనధికారికంగా ఉన్న విత్తనాలు సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వీటి విలువ రూ. 22,22, 2500 ఉంటుందని, 6ఏ కేసు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టరకు పంపనున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో ఏఈవోలు నరసింహులు తదితరులు ఉన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో అప్పులా? ఆలూరు: అమరావతిని అభివృద్ధి పేరుతో అప్పు చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు గఫూర్ అన్నారు. ఆలూరులో శుక్రవారం ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల ముగింపు మహాసభ నిర్వహించారు. సభలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి ఒక్కటే కనిపిస్తోందని, రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీటి సమస్యలు కనిపించడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగన్న, సీపీఎం నాయకులు హనుమంతు, నారాయణస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్ కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 384 గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఒక్కో వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1110 బీసీ వసతి గృహాల్లో 743 బాలురు, 367 బాలికల వసతి గృహాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ హాస్టళ్లలో 50 శాతానికి మించి రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రేడ్ –2 వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడితే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. వక్ఫ్ ఆస్తుల నమోదుకు నేడు ఆఖరు కర్నూలు(అర్బన్): వక్ఫ్ భూములు, ఇతరత్రా ఆస్తుల వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమీద్ పోర్టల్ను ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్ సబీహా పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్లో ఈ నెల 5వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. పని ఒత్తిడితో సచివాలయ ఉద్యోగి మృతి ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని ఇందిరానగర్ వార్డు సచివాలయ ఉద్యోగి రాజారత్నం(41) పని ఒత్తిడితో అనారోగ్యం పాలై గురువారం మృతి చెందాడు. వార్డు సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనకు అదనంగా వార్డ్ అడ్మిన్ సెక్రటరీగాను, బీఎల్ఓగా బాధ్యతలు అప్పగించారు. ఆయా పనుల ఒత్తిడితో ఐదురోజుల క్రితం అనారోగ్యం పాలైయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయనకు మెరుగైన చికిత్స కోసం స్థానిక వార్డు సచివాలయ సిబ్బంది ఆర్థిక సాయం చేశారు. కర్నూలులోని ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లి ఉసేనమ్మ, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం పాణ్యం: కర్నూలు నుంచి తిరుపతికి 24 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం 6గంటలకు బయలుదేరిన కర్నూల్–2 డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు వెనక చక్రం ఊడిపోయింది. దాదాపుగా 100మీటర్లు దూరం వెళ్లి ఓ హోటల్గోడను ఢీకొని కిందపడింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. చక్రం ఊడిపోయి వెళ్తున్న క్రమంలో బస్సు ఒక కూరగాయ బండిని, నాగరాజు అనే వ్యక్తిని ఢీకొనింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
లక్ష గృహాలకు ‘పీఎం సూర్యఘర్’
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు(సెంట్రల్): పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో లక్ష గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జెడ్పీ సీఈఓ, డీఆర్డీఏ, మెప్మా పీడీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గినట్లు వివరించాలని సూచించారు. గురువారం కలెక్టర్ తన చాంబరులో పీఎం సూర్య ఘర్కి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో పీఎం సూర్య ఘర్ కింద ఇప్పటి వరకు 92,469 మంది రిజిస్టర్ అయ్యారని, ఇందులో ఎస్సీ, ఎస్టీలు 81,591 మంది, ఇతరులు 10,878 మంది ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 23,077 గృహాలకు మార్చిలోపు రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పెద్దహరివాణం గ్రామంలో ఐదు రూఫ్టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఎల్డీఓం రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి.. కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో పాలనా సౌలభ్యంలో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు డివిజినల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన నూతన డీఎల్డీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఓ జీ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు తదితర అనేక సమస్యలు ఉంటాయన్నారు. వాటి పరిష్కారం కోసం డీఎల్డీఓ కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఆదోని డీఎల్డీఓ కార్యాలయాల్లో అధికారులు సమస్యలు పరిష్కరించాలన్నారు. డీఎల్డీఓ రమణారెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డితో పాటు ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రగతి.. వెనుక‘బడి’
కర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. సమీక్షలు, నివేదికలు అంటూ విద్యాశాఖ అధికారులపై జిల్లా స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. నేడు(శుక్రవారం)మూడోసారి మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించనున్నారు. విద్య సంస్కరణలు అంటూ సీబీఎస్ఈ విద్యను, ట్యాబ్ల పంపిణీ రద్దు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదిలో రూ.2 వేలు కట్ చేసి రూ.13 వేలు జమ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 1వ తరగతిలో చేరిన పిల్లలకు ఇంత వరకు జమ కాలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్లు నెల రోజులకే పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్తవి ఇస్తామని వెనక్కి తీసకొని ఇంత వరకు ఇవ్వలేదు. కొలతలు లేకుండా బూట్లు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు చెప్పులతోనే స్కూళ్లకు వెళ్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోఽజనం పేరుతో విద్యార్థులకు సన్న బియ్యంతో పెడుతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నాడు– నాడు’తో 60 స్కూళ్ల రూపు రేఖలు మార్చింది. అయితే చంద్రబాబు న్రభుత్వం వచ్చి ఏడాదిన్నర్ర అయినా చివరి దశలో మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. ఉపాధ్యాయులపై వేధింపులు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలు 2250 ఉన్నాయి. వీటిలో 4.50 లక్షల మంది విద్యార్థులు, 15,066 మంది టీచర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లలోను మోగా పేరెంట్స్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి జూన్ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో రోజు గంటల తరబడి వెబెక్స్లు..టెలీకాన్ఫరెన్స్లు..యోగాంధ్రక రిజిస్ట్రేషన్స్ అంటూ గడిపేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియతో మరి కొంత సమయం పోయింది. జూలైలో వారం రోజుల పాటు, ఇప్పుడు వారం రోజుల పాటు మోగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలను రెండు సార్లు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సర్కార్లో చతికిలబడిన చదువులు అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణాలు నేడు మోగా పేరెంట్స్ 3.0 సమావేశం -
ప్రభుత్వ సాయం సున్నా
నేను నాలుగు ఎకరాల్లో రూ.3లక్షలకు పైన పెట్టుబడి పెట్టి ఉల్లిపంట సాగు చేశా. వర్షానికి పంట దెబ్బతినింది. మిగిలిన పంట అమ్ముకొనేందుకు వెళదామంటే రూ.200 క్వింటం అన్నారు. అవి అమ్ముకొనేందుకు తీసుకెళితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా రావు అని గొర్రెలకు వదిలేశా. నష్టపోయిన ఉల్లికి హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నిస్తామనుకుంటే సమాధానం చెప్పే అధికారే లేరు.ఇప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక రూపొందించుకొని ఏమి ఆదుకొంటుంది? – హకీంబాషా ,రాళ్ల దొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం -
ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
● జేసీ కారును అడ్డుకున్న రైతులుగోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తాము సాగుచేసుకున్న పంటలు మునిగిపోతున్నాయని, సమస్య పరిష్కరించాలని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఐరన్బండ, ఎన్నెకండ్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?’ అంటూ జేసీ నూరుల్ ఖమర్ కారును అడ్డుకున్నారు. కారు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు కారును వెళ్లనీయబోమని జేసీతో వాదనకు దిగారు. జీడీపీలో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచడంతో 200 ఎకరాల వరకు ఆయకట్టు భూమి నీట మునుగుతుందని చెప్పారు. ఈ ఏడాది వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, మొక్కజొన్న పంటలు 160 ఎకరాలలో నీటి మునిగి రూ.2కోట్ల మేర పంట నష్టం వచ్చిందన్నారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ సామర్థ్యం పెంచడం కోసం భూములిచ్చి తాము ఎలా బతకాలని, సమస్యను పరిష్కరించకపోతే అత్మహత్యలే చేసుకుంటామని పలువురు రైతులు అన్నారు. భూమి నష్టపోయిన రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కొందరు కోరారు. ఇందుకు జేసీ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పైసా పరిహారం అందించలేదు
ఈ ఏడాది వర్షాధారంగా 20 ఎకరాల్లో రూ.15లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చే సరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. చేసేది లేక 20 ఎకరాల ఉల్లి పంటను పశువులకు, గొర్రెలకు మేతగా వదిలేశాను. పరిహారం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా అందించలేదు. రైతన్న మీకోసం కార్యక్రమంతో రైతులకు ఏమి ఉపయోగమో ప్రభుత్వమే చెప్పాలి. –పాలగిరి, వెంకటగిరి, కోడుమూరు మండలం రెండేళ్లుగా నష్టపోయిన పంటలకు పరిహారం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంట సాగు చేసినా నష్టాలే తప్ప లాభాలు లేవు. సకాలంలో మార్కెట్లో ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు. పదెకరాల్లో సాగు చేసిన పత్తి పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రైతుల నడ్డి విరిచి రైతన్న మీకోసం అంటూ కార్యక్రమాలు నిర్వహించడం సీఎం చంద్రబాబుకే చెల్లుబాటవుతుంది. – మహేశ్వరరెడ్డి, చనుగొండ్ల గ్రామం, గూడూరు మండలం -
రూ.52 వేలు నష్టాపోయాం
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు సగటున రూ.25వేల వరకు పెట్టుబడి వచ్చింది. అధిక వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతినింది. మామూలుగా అయితే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఎకరాకు దిగుబడులు 16 క్వింటాళ్ల వరకే వచ్చింది. దళారులు క్వింటా రూ.1600 ధరతో కొన్నారు. మద్దతు ధర రూ.2400 ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రూ.52 వేలు నష్టపోయాం. – రాఘవేంద్ర, ఆలూరు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. రైతులు పండించిన ఏ పంటకు కూడా ధరలు లేవు. మాకు 17 ఎకరాల భూములు ఉన్నాయి. మిర్చి, పత్తి, వరి పంటలు సాగు చేశాం. అధిక వర్షాలతో వరి, పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, పత్తిలో దిగుబడులు పడిపోయాయి. 18 నెలల పాలనలోని వైఫల్యాలను దాచిపెట్టేందుకే రైతన్నా.. మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధరలు పడిపోయిన విషయమై ప్రశ్నించాం. స్పందన లేకుండా పోయింది.– నాగభూషణం రెడ్డి, హెబ్బటం గ్రామం, హొళగుంద మండలం -
బ్రెయిన్ ట్యూమర్తో పీహెచ్డీ విద్యార్థి మృతి
తుగ్గలి : బ్రెయిన్ ట్యూమర్తో తుగ్గలి మండలం మిద్దెతండాకు చెందిన పీహెచ్డీ విద్యార్థి ఆర్ జయప్రకాష్నాయక్(30) మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..తండాకు చెందిన చిన్న హేమ్లా నాయక్, లక్ష్మిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. కండక్టర్ ఉద్యోగం రీత్యా కొన్నేళ్ల క్రితమే హేమ్లానాయక్ తండా వదిలాడు. ప్రస్తుతం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు. పెద్ద కుమారుడైన జయప్రకాష్ నవోదయ విద్యార్థి, ఇంటర్ విజయవాడ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగించారు. జియాలజీలో రెండో సంవత్సరం పీహెచ్డీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన జయప్రకాష్కు తల్లిదండ్రులు విశాఖపట్నం, చైన్నె, హైదరాబాద్లో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందినట్లు తండ్రి తెలిపారు. కాగా జయరాంనాయక్ పై చదువుల కోసం జర్మనీ వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
కోసిగి: కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్న వృద్ధ దంపతులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. డి.బెళగల్ గ్రామానికి చెందిన వై. వీరారెడ్డి (80). వై. పార్వతమ్మ(75) దాదాపు 60 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించారు. ఆ దంపతులకు ఒక కుమారుడు జనార్దన్ రెడ్డి, కుమార్తెలు మహాదేవి, గంగమ్మ ఉన్నారు. అందరికీ వివాహం చేసి మనవళ్లు, మనవరాళ్లుతో అన్యోన్యంగా జీవితం కాలం గడిపారు. వృద్ధాప్య వయస్సులో వై. వీరారెడ్డి మంగళవారం రాత్రి 9.30గంటలకు మృతి చెందగా, వై. పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున 4.25 గంటలకు కన్నుముశారు. ఇద్దరు ఒకే సారి మృతి చెందడంతో ఆ గ్రామ ప్రజలందరూ మంచి జీవితం అనుభవించి తనువు చాలించారంటూ కొనియాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే తరపున వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఆ దంపతులకు పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
కర్నూలు: పెళ్లి కాలేదన్న మనస్తాపంతో కర్నూలు ఎస్.నాగప్ప వీధిలో నివాసముంటున్న వరప్రసాదరావు (36) ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న వితంతువుతో ఐదేళ్లుగా సహజీవనంలో ఉన్నాడు. గత నెల 30వ తేదీన డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగి మనస్తాపానికి గురయ్యాడు. తన చావుకు కారణం ఆమెనే అని సూసైడ్ లేఖ రాసి జేబులో పెట్టుకుని మంగళవారం రాత్రి గదిలో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండో పట్టణ ఎస్ఐ తిమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోసిగి: తల్లిదండ్రులతో కలసి వలస వెళ్లిన విద్యార్థి హాల్వి నరేంద్ర (13) పాము కాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వందగల్లు గ్రామానికి చెందిన హాల్వి మహానంది, నరసమ్మ దంపతులు పనుల కోసం రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా బిణిగంపాల గ్రామానికి వలస వెళ్లారు. గ్రామంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు నరేంద్రతో పాటు రెండో కుమారుడు జనార్దన్ (4వ తరగతి), మూడో కుమారుడు మోహన్ (2వ తరగతి) కూడా తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ పత్తి పనులు చేసుకుని కాలం గడుపుతున్నారు. మంగళవారం పత్తి పనులు ముగించుకుని రాత్రి పొలం సమీపంలోనే వేసుకున్న గుడిసెలో నిద్రిస్తుండగా పెద్ద కుమారుడు నరేంద్రను పాముకాటు వేసింది. స్థానిక వైద్యులకు చూపించినా కోలుకోలేక మృతి చెందాడు. మృతి చెందిన కుమారుడిని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నేతలు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంఘాల నేతలు కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్లోని సాయి వసంత్ కాంప్లెక్స్లో బీసీ సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల ఆనంద్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీ య కార్యదర్శి బత్తుల లక్ష్మికాంతయ్య, యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అయ్యన్నయాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు సింధు నాగేశ్వరరావు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభాలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల జనాభా మేరకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే శా సీ్త్రయ పద్ధతిలో కులగణనను చేపట్టి బీసీల నిజ మై న జనాభా సంఖ్యను ప్రకటించాలన్నారు. వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలన్నారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు చంద్రి క, నాగేశ్వరినాయుడు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ టీజీ శ్రీనివాసులు, శ్రీరామ్యాదవ్, వెంకటేశ్వర్లు, రవి,రాము యాదవ్, భరత్భూషణ్, లక్ష్మన్న, ప్రి యాంకయాదవ్, రాము, సవారన్న హాజరయ్యారు. -
పత్తి రైతుకు ని‘బంధనాలు’
ఆదోని అర్బన్: మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా నెమ్ము అనే పేరుతో సీసీఐ అధికారులు ధరలో కోతలు వేస్తున్నారు. ఆదోని పట్టణంలో పది సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవీ ఇబ్బందులు.. ● సీసీఐ కేంద్రంలో పత్తి దిగుబడులు అమ్ముకోవడానికి రైతు సేవా కేంద్రంలో, యాప్లో నమోదు చేసుకోవాలి. సర్వర్ డౌన్తో యాప్ కూడా ఓపెన్ కాకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ● రైతుల్లో 90 శాతం మందికి సాంకేతికతపై అవగాహన లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ● యాప్ ద్వారా స్లాట్ బుక్ అయితే అమ్ముకోవడానికి ఒక తేదీని ప్రకటిస్తారు. ఆరోజునే రైతులు పత్తి దిగుబడులను తీసుకెళ్లి అమ్ముకోవాలి. ● స్లాట్ బుక్ అయిన రోజున వెళ్లాలంటే రైతులు ఒకరోజు ముందుగానే సీసీఐ కేంద్రం దగ్గరకు పత్తిని తీసుకెళ్లాలి. వాహనాన్ని నిలబెట్టుకుని పడిగాపులు కాయాల్సిందే. ● తేమను తనిఖీ చేసి అన్లోడ్ చేసేందుకు పంపుతారు. అన్లోడ్ అయిన వెంటనే వేలి ముద్ర వేయాలంటే సాయంత్రం వరకు రైతు వేచి ఉండాల్సిందే. ● వాహనానికి రెండు రోజుల బాడుగ ఇవ్వాల్సి వస్తోంది. ● వేలి ముద్ర వేసిన వెంటనే ధర ప్రకటన, బిల్లు కో సం మరుసటి రోజు రావాలని సీసీఐ అధికారులు ఆ దేశిస్తారు. దీంతో రైతులు మరుసటి రోజు వస్తే కూ డా సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిందే. ● మూడు రోజులపాటు రోడ్డుపైన, సీసీఐ కేంద్రం వద్ద రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. తేమ చూపుతూ మోసం! ఈ ఏడాది ఖరీఫ్లో 2,49,316 మంది రైతులు 6,93,635 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మద్దతు ధరతో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయానికి 60 శాతం మంది రైతులు మొదట తీసిన పత్తిని తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. మిగిలిన పత్తినైనా మద్దతు ధరతో అమ్ముకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే మిషన్తో తేమను చూపుతూ మోసం చేస్తున్నారు. రైతు పత్తి దిగుబడుల వాహనాన్ని సీసీఐ కేంద్రాల వద్ద రోడ్డుపై నిలబెడితే సీసీఐ అధికారులు తేమ శాతం కోసం మిషన్ను ఉపయోగిస్తారు. తేమ లేకున్నా అది 9.5 శాతం నుంచి 11.5 శాతం వరకు చూపుతుంది. జిల్లాలో పండించిన పత్తి పొడుగు పింజ రకానిదే. దీనికి మద్దతు ధర రూ.8,110. తేమ 8 శాతం లోపు ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. తేమ 9 శాతం ఉంటే మద్దతులో ధరలో ఒక్క శాతం తగ్గుతుంది. ఇలా 12 శాతం వరకు అనుమతిస్తారు. 12 శాతం వరకు ఉంటే మద్దతు ధరలో రూ.324.40 తగ్గుతుంది. ఇదీ రైతుల అభిప్రాయం.. ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో గరిష్ట ధర రూ.7500 ధర పలుకుతోంది. తేమ శాతం, రెండు రోజుల బాడుగతో కలిపితే యార్డులోనే అమ్ముకోవడం మంచిది కదా అని రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్రం రైతులకు రూ.8110 గిట్టుబాటు ధర కల్పించింది. అయితే సీసీఐ అధికారులు తేమ మిషన్ పెట్టడంతో చాలామందికి ఈ ధర లభించడం లేదు. సీసీఐ అధికారులు తేమ శాతం తనిఖీ చేసినా అన్లోడింగ్ వద్ద హమాలీలు తడి ఉందని, నాణ్యత సరిగా లేదని చెబుతున్నారు. మళ్లీ తేమ శాతాన్ని తగ్గించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తేమ, నాణ్యత అంటూ ధరల్లో కోతలు విధిస్తున్నారు. మళ్లీ పత్తిని ఇంటికి తీసుకెళ్లి మద్దతు ధర కోసం రైతులు చాలా పడిగాపులు కాస్తున్నారు. చేతివాటం రైతులు తెచ్చిన పత్తి దిగుబడుల వాహనాల్లో కొంచెం తేడా వచ్చినా సీసీఐ అధికారులు ఆ వాహనాన్ని వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిరి రైతులను వెనక్కి పంపరాదని సీసీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ అధికారులు తేమ శాతం, క్వాలిటీ సరిగా లేదంటూ కోతలు వేస్తున్నారు. అంతేగాకుండా కొన్ని ఫ్యాక్టరీలలో పత్తి క్వాలిటీ ఎలాగున్నా హమాలీలకు చేతివాటం ఇస్తే చాలు, అన్లోడ్ అయిపోయినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పత్తి దిగుబడులను వెనక్కి పంపించొద్దు
ఆదోని రూరల్: పత్తిలో తేమ శాతం సీసీఐ వారు కొనుగోలు చేసే దాని కంటే ఎక్కువ శాం ఉన్నట్లయితే రైతులను వెనక్కి పంపించకుండా మిల్లుల ద్వారా కొనుగోలు చేయించాలని మార్కెటింగ్ ఏడీని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి ఆదేశించారు. బుధవారం ఆదోనిలో బత్తిన అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్లలో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొంచెం రంగు మారినట్లయితే కొనుగోలు చేయడం లేదని, స్లాట్ బుకింగ్లో సమస్యలు ఎదురవుతున్నాయని కలెక్టర్కు రైతులు తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్లాట్ బుకింగ్ సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు. అనంతరం తూకపు యంత్రాలు, మాయిశ్చరైజర్ మెసీన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని సీసీఐ అధికారులను ఆదేశించారు. ఆదోని ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, ఏడీఏ బాలవర్ధిరాజు, తహసీల్దార్ రమేష్, సిబ్బంది ఉన్నారు. -
వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా సీవీ రంగారెడ్డి
అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా పీఆర్ విభాగం గుత్తికి చెందిన సీవీ రంగారెడ్డి (పీఆర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి బుధవారం వెల్లడించారు. గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఒకే సమయంలో మూడు కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్ధ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేరి, బైక్మెకానిక్ సర్వీసింగ్లలో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి 30 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మరిన్ని వివరాలకు 08518– 273710, 9000710508, 63044 91236 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు. రేపు ధ్రువ పత్రాల పరిశీలనకర్నూలు కల్చరల్: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటి షిప్ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఐటీఐ పాస్ అయిన విద్యార్థుల ఒరిజినల్ ధ్రుపత్రాల పరిశీలన చేయనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు తెలిపారు. ఈనెల 5వ తేదీ ఉదయం 9 గంటలకు కర్నూలు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్, కులం, ఆదాయ సర్టిఫికెట్లు తీసుకొని రావాలని తెలిపారు. డిటోనేటర్ల దొంగల అరెస్ట్ ● 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్ప్రైజెర్స్లో సోమవారం రాత్రి డిటోనేటర్లను అపహరించుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోపే కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దవడుగూరు పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వెల్లడించారు. పట్టుబడిన వారిలో యాడికి మండల చందన గ్రామానికి చెందిన రవికుమార్, పామిడిలోని నాగిరెడ్డి కాలనీ నివాసి చిట్టావుల రాము, కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఉప్పర వీరేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రవికుమార్ గతంలో కార్తికేయ ఎంటర్ప్రైజెర్స్లో ఎక్స్ప్లోజివ్ మ్యాగజైన్ విభాగం డ్రైవర్గా పనిచేశాడు. అయితే జీతం ఇవ్వకపోవడంతో పని మానేసిన అతను ఎలాగైనా స్టాక్ పాయింట్లో నిల్వ ఉన్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను తీసుకెళ్లి విక్రయించి తన డబ్బు తీసుకోవాలని భావించాడు. ఇందుకు తన స్నేహితులు చిట్టావుల రాము, ఉప్పర వీరేష్తో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కారులో కార్తికేయ ఎంటర్ప్రైజెర్స్ గోదాము వద్దకు చేరుకుని గోడకు కన్నం వేసి లోపలకు ప్రవేశించి రూ.2 లక్షల విలువైన డిటోనేటర్లు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చందన గ్రామ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
చెరువులో మట్టి తవ్వకాల నిలిపివేత
బేతంచెర్ల: మండలపరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామ పంచాయతీలోని వెంకటగిరి– మర్రికుంట గ్రామాల మధ్యన ఉన్న చెర్వులో జరుపుతున్న మట్టి తవ్వకాలు ఎట్టకేలకు నిలిపివేశారు. చెరువులోని నల మట్టిని జేసీబీ ద్వారా తవ్వి టిప్పర్లతో కల్లూ మండలం ఉలింద కొండ ఇటుకల బట్టీలకు అక్రమంగా తరలిస్తుండగా సోమవారం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తర్వాత మట్టి తవ్వకం విషయం నంద్యాలకు వెళ్లి జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చెరువులో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మండల అధికారులు బుధవారం చెరువు వద్దకెళ్లి తవ్వకాలు ఆపివేశారు. -
జిల్లాలో 49 స్క్రబ్ టైఫస్ కేసులు
● వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 49 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ చెప్పారు. బుధవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్తో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధి అంత తీవ్రమైనది కాదని, తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందన్నారు. ఒరియంటియా సుట్సుగముశి అనే బ్యాక్టీరియా పొలాలు, దట్టమైన పొదలలో ఉండే చిగ్గర్ మైట్లార్వా కాటుతో వ్యాపిస్తుందని తెలిపారు. మూడు రోజులకు పైగా జ్వరం ఉంటే సమీప హెచ్సీ/యుపీహెచ్సీలో సంప్రదించాలని సూచించారు. ప్రజలు పొదల ప్రాంతాలకు వెళ్లకుండా నివారించడం, రక్షణ దుస్తులు ధరించడం, కీటకనాశిని రెపెలెంట్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదల్లో బయట నిద్రించకూడదని, పొలాల్లో చెప్పులు లేకుండా పనిచేయవద్దని తెలిపారు. -
విద్యార్థుల సంరక్షణే లక్ష్యం
● సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణే లక్ష్యంగా వసతి గృహ సంక్షేమాధికారితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అన్నారు. స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో జిల్లాలోని వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కుక్, కమాటీలతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంట మనుషులు ప్రతి రోజు ఉదయం 6 గంటలకంతా వచ్చి రాత్రి 7 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్లోనే ఉండాలన్నారు. వండిన ఆహారాన్ని వృథా చేయరాదని, విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని పెట్టాలన్నారు. కమాటీలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్లో ఉండాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలన్నారు. ఇతర నాల్గవ తరగతి సిబ్బంది సెలవులో ఉన్న సమయంలో వారి పనులను కూడా కమాటీ పంచుకోవాలన్నారు. ఆయా సందర్భాల్లో విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్లి జాగ్రత్తగా హాస్టల్కు తీసుకురావాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జబ్బుతో ఉన్న విద్యార్థులకు హాస్పిటల్కు తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు ఎస్ లీలావతి, వెంకటరాముడు, కార్యాలయ పర్యవేక్షకులు ఆలీబాషా తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ టీచర్ను తొలగించాలి
కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఎ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్ టీచర్ను వెంటనే విధులనుంచి తప్పించాలని ఐసీడీఎస్ పీడీ విజయ్ను అదేశించారు. రికార్డులు, విదార్థుల హాజరు, నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బంది పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై ఎంపీడీఓ రాముడు, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పొలాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా రైతులకు రుణాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కోడుమూరు తహసీల్దార్ నాగరాజు, ఐసీడీఎస్ సీడీపీఓ వరలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ మంజుల తదితరులున్నారు. నిరవధిక దీక్షలు ఎమ్మిగనూరుటౌన్: లెదర్ సొసైటీ ఆస్తులను కాపాడిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ వద్ద షేర్హోల్డర్లు నిరధిక దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా షేర్ హోల్డర్లతో న్యూలైఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సామెల్, డీవైఎఫ్ఐ నాయకులు అజిత్కుమార్, జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు ముత్తుసుమాల తదితరులు మాట్లాడారు. సొసైటీలో చనిపోయిన షేర్ హోల్డర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు స్థానం కల్పించాలన్నారు. అసలైన షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని, సొసైటీకి సంబంధం లేని వారి పేర్లను సొసైటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. లెదర్ సొసైటీని అడ్డు పెట్టుకొని బడాబాబులు చీకటి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఐదుగురు ఈఓలకు పదోన్నతి కర్నూలు కల్చరల్: దేవాదాయ శాఖలో గ్రేడ్–2 ఈఓలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి గ్రేడ్–1 ఈఓలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా వేంపల్లె మండలం వృషభ చలమేశ్వర స్వామి ఆలయం ఈఓగా విధులు నిర్వహిస్తున్న టి.హనుమంతరావు, పలమనేరు గ్రూప్ టెంపుల్స్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న కె.కమలాకర్, ఓర్వకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.చంద్రశేఖర్ రెడ్డి, కాల్వబుగ్గ ఈఓగా విధులు నిర్వహిస్తున్న టి.మద్దిలేటి, వెంకాయపల్లె రేణుక ఎల్లమ్మ, నాగలాపురం సుంకులా పరమేశ్వరి దేవాలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్న పీఎన్ రాధాకృష్ణలకు గ్రేడ్–1 ఈఓలుగా పదోన్నతి లభించింది. త్వరలోనే వీరికి నూతన దేవాలయాలను కేటాయించనున్నారు. దివ్యాంగుల్లో ప్రతిభను వెలికి తీయాలి వెల్దుర్తి: దివ్యాంగుల్లో ప్రతిభను వెలికి తీయాలని ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ పద్మాకర్ అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో బుధవారం 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ఇటీవలి కర్నూలులో జరిగిన పారా స్పోర్ట్స్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహకాలందించారు. ఎంఈఓ ఇందిర, హెచ్ఎంలు జాన్పాల్, సరస్వతి పాల్గొన్నారు. చిరుతపులి గోర్ల మాయంపై విచారణ ● ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు మహానంది: ఎంసీ ఫారం గ్రామం సమీపంలో గతంలో చిరుతపులి గోర్లను మాయం చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ము మ్మరం చేశారు. గోపవరం, ఎంసీ ఫారం, నంద్యాల, మహానంది గ్రామాలకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు బుధవారం రాత్రి తెలిసింది. వీరిలో అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న తాత్కాలిక చిరుద్యోగి ఉండటం చర్చనీయాంశమైంది. చిరుతపులి గోర్లను సేకరించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
టీడీపీ నాయకుడి దౌర్జన్యం
ఆలూరు రూరల్/హాలహర్వి: కస్తూర్బా గాంధీ పాఠశాలలో తన వర్గానికి చెందిన మహిళకే వాచ్మెన్ పోస్టు ఇవ్వాలని టీడీపీ నాయకుడు మారుతి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కేజీబీవీ ప్రినిపాల్పై దాడికి యత్నించారు. ప్రినిపాల్ తెలిపిన వివరాలు.. గత మూడు నెలల క్రితం పనిచేస్తున్న వాచ్మెన్ గౌరమ్మ రిటైర్డ్ అయ్యింది. ఆ పోస్టును తాము చెప్పిన వారికే ఇవ్వాలని టీడీపీ నాయకుడు మారుతి గత 15 రోజులుగా బెదిరిస్తున్నాడు. వాచ్మెన్ పోస్టు నియామకం పై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామని వారి ఉత్తర్వుల మేరకు నియామకం చేపడతామని ప్రిన్సిపాల్ చెప్పారు. బుధవారం రాత్రి కేజీబీవీ పాఠశాలలో చొరబడిన టీడీపీ నాయకుడు మారుతి తాము చెప్పిన వారికే వాచ్మెన్ పోస్టు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసి ప్రిన్సిపాల్పై దాడికి యత్నించారు. అతని అరాచకపర్వాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తుండగా సెల్ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బాలికల పాఠశాలలో చొరబడి టీడీపీ నాయకుడు మారుతి భయభ్రాంతులకు గురిచేసినట్లు హాలహర్వి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. కస్తూర్బా ప్రిన్సిపాల్పై దాడికి యత్నం వాచ్మెన్ పోస్టు తమ వారికే ఇవ్వాలంటూ బెదిరింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ పద్మావతి -
నామమాత్రంగా ‘రైతన్నా.. మీ కోసం’
కర్నూలు(అగ్రికల్చర్): రైతన్నా... మీ కోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్క్షాపులు నామమాత్రానికే పరిమితం అయ్యాయి. నవంబరు 24 నుంచి 29 వరకు రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన సూచనలు, డిమాండ్ ఆధారంగా జిల్లాలోని 410 రైతు భరోసా కేంద్రాల్లో వర్క్షాపులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఎమ్మిగనూరు మండలంలో జరిగిన వర్క్షాప్లో పాల్గొనగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీఎల్ వరలక్ష్మి, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024–25 రబీ ముగింపు దశకు చేరింది. ఈ సమయంలో రబీ ప్రణాళికలు అంటూ హడావుడి చేస్తుండటంపై రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొక్కజొన్న, ఉల్లి, వేరుశనగ, జొన్న, సజ్జ పంటలకు ధరలు పడిపోయినా పట్టించుకోని చంద్రబాబు సర్కార్ జీవీఏ పేరుతో అంకెల గారడీకి పాల్పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్క్షాప్లలో రైతులు నామమాత్రంగా పాల్గొన్నప్పటికీ వేల మంది రైతులు పాల్గొన్నట్లు వ్యవసాయాధికారులు లెక్కలు తయారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కల్లాల్లో ధాన్యం... కళ్లల్లో దైన్యం!
ఈయన పాములపాడుకు చెందిన రైతు పక్కీరయ్య. సొంతంగా మూడు ఎకరాలతో పాటు మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. కౌలుకు తీసుకున్న భూమికి రూ.40 వేలు అదనం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంట దెబ్బతిని ఎకరాకు 19 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. నెల రోజుల క్రితం కోతలు పూర్తయ్యాయి. మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందేమోనని ఆశతో ఎదురుచూశాడు. సర్కారు స్పందించకపోవడంతో క్వింటాల్ రూ.1800 చొప్పున 95 క్వింటాళ్లు విక్రయించాడు. మరో 110 క్వింటాళ్లను గోదాముల్లో భద్రపరుచుకున్నాడు. సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు ఆచరణకు పొంతనే కుదరడం లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని 10 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉత్తుత్తి ఆదేశాలు కాదు పేపరు మీద ఆర్డర్స్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు ప్రకృతి సహకరించక దిగుబడులు తగ్గితే మరోవైపు సర్కారు నుంచి మద్దతు ధర లభించని పరిస్థితి. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోకపోగా వేడుక చూస్తుండటంతో మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో 55 వేల హెక్టార్లలో సాగు జిల్లాలోని 29 మండలాల పరిధిలో 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 28,460 హెక్టార్లలో పంట పండించారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం అనుకూలిస్తే 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది అతివృష్టితో విపరీతంగా వర్షాలు పడడంతో ఎకరాకు 18 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పంట కోసిన తర్వాత కూడా మోంథా తుపాను విజృంభించడంతో తీవ్రంగా నష్టపోయారు. గింజలు ఆరేసుకోవడానికి గోదాములు లేక రోడ్లమీదే వేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా పట్టలు కప్పుకుని నీరు ఎత్తుపోసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. ఇథనాల్ రేటు పెరిగినా.. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. లీటర్ పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ ఉండేలా కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీంతో ఇథనాల్ తయారీ పెరిగింది. మొక్కజొన్న ఆధారంగా తయారుచేసే ఇథనాల్ ధర 2021–22లో లీటర్ రూ.53 ఉండగా అది ఇప్పటికి రూ.72కి పెరిగింది. అయినా, రైతులకు ఇచ్చే మద్దతు ధర పెరగడం లేదు. క్వింటాల్కి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 2,400 ఉంటే ప్రస్తుతం ధర రూ.1500 నుంచి 1800 మధ్య పలుకుతోంది. క్వింటాల్కు రూ.800 వరకు నష్టం గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. కానీ ధరలు మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు వడ్డీల భయంతో ఉన్న ధరకే విక్రయించేస్తున్నారు. రైతుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు వారిని నిలువునా ముంచేస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కో రైతు ఒక్కో క్వింటాల్ మీద రూ.800 వరకు నష్టపోతున్నారు. ఇంత భారీగా రైతుల నడ్డివిరుస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. 10 రోజుల క్రితం సీఎం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పినా క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు నిరసన సెగ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై నెల రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ బత్తుల కార్తీక్ మార్క్ఫెడ్తో పాటు వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు. కానీ, ఇప్పటివరకు కేంద్రాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో విసుగెత్తిపోయిన రైతులు కలెక్టర్ రాజకుమారి ఎదుటే తమ నిరసన వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నంద్యాల రూరల్ మండలం భీమవరం గ్రామానికి వెళ్లిన కలెక్టర్ను అడ్డుకుని నిలదీశా రు. పంటనంతా వ్యాపారులకు విక్రయించిన తర్వాత కేంద్రాలు ప్రారంభిస్తే తమకు ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రైతులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కలెక్టర్ అక్కడి నుంచి వెనుదిరగడం గమనార్హం. మొక్కజొన్న రైతు గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం పదిరోజుల క్రితం కొనుగోల ప్రకటన నేటికీ ఆచరణకు నోచుకోని వైనం కలెక్టర్ను నిలదీసిన రైతులు -
అత్యాధునిక వైద్యపరికరాలతో సేవలు
● ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు రేడియేషన్ ఇచ్చే లీనియర్ ఆక్సిలేటర్ మిషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపి, అన్ని రకాల క్యాన్సర్లకు ఎస్ఆర్టీ, ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ఇమేజ్గైడెడ్ రేడియోథెరపీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియోథెరపి ట్రీట్మెంట్, అడాప్టివ్ రేడియోథెరపితో చికిత్స అందిస్తున్నారు. ● సీటీ సిమ్యులేటర్, 3డీ, 4డీ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా చికిత్స. ● హెచ్డీఆర్ బ్రేకీథెరపి, 3డీ ల్యాప్రోస్కోపిక్, ఎక్విప్మెంట్, హార్మోనిక్ సార్కిల్పెల్, ఫ్రోజెన్ సెక్షన్ బయాప్సీ. ● ఇంట్రాప్రాటివ్ అల్ట్రాసౌండ్, లేటెస్ట్ అనెస్తీషియా వర్క్స్టేషన్, సెంట్రలైజ్డ్ ఆక్సీజన్, గ్యాస్ సరఫరా. ● మ్యానిక్ ఫోల్డ్, సెంట్రలైజ్డ్ సక్షన్ ఫెసిలిటీ. ● ఆరు పడకల పోస్టు ఆపరేటివ్ ఐసీయూ. ● అత్యాధునిక వైద్యపరికరాలతో బయోకెమిస్ట్రీ. ● పెథాలజీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, గ్యాస్ట్రోస్కోపిక్ పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యసేవలు. -
జరిమానాలు ఉండవు కేసులే!
హొళగుంద: మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఇక జరిమానాలు ఉండబోవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా హొళగుంద పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ మేరకు నేరాలు, కేసులు, పెండింగ్ కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరు, సమస్యలు ఇలా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగ ఉండాలని, హెల్మెట్లపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్ఐలు దిలీప్కుమార్, మారుతి, ట్రైనీ ఎస్ఐ రాజకుళ్లాయప్ప ఉన్నారు. -
సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): ప్రజల ఆరోగ్యం, సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు 12వ వార్డు పరిధిలోని వడ్డగేరి, బాపూజీ నగర్లో బుధవారం ఇళ్ల వద్దకు, వ్యాపారుల వద్దకు వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వివరించారు. స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రభుత్వ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభు త్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొని రూ.8,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటుకు ఇచ్చేందుకు ఎన్నో కుట్రలు చేస్తోందన్నారు. వివిధ దశల్లో ఉన్న 12 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి దక్కుతాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్తులను కొట్టేసేందుకు ప్రైవేటుకు అప్పగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు, మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎంత వరకై నా పోరాటం చేస్తుందన్నారు. పార్టీ నాయకులు షరీఫ్, నవీన్, వన్నేష్, కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డి ,కిషన్, పత్తాబాషా, కంటూ, ప్రకాష్, విల్సన్, వైఎస్సార్సీసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
45 మంది వైద్యులు.. 74 మంది సిబ్బందితో సేవలు
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఒక సీఎస్ఆర్ఎంఓ, ఒక డిప్యూటీ ఆర్ఎంఓ, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిలో రేడియేషన్, సర్జికల్, మెడికల్ ఆంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, పెథాలజి, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అనెస్తీషియా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, 40 మంది స్టాఫ్నర్సులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది, ఆరుగురు నాల్గవ తరగతి సిబ్బంది పనిచేస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి 2012–2019 పంచ వర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం రూ.120కోట్లను మంజూరు చేసింది. ఇందులో 60శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా ఒప్పందం కుదిరింది. ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సాంకేతిక సహకారం కోసం టాటా ట్రస్ట్తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ పలుమార్లు పరిశీలనలు, చర్చలు చేపట్టాక టాటా ట్రస్ట్ 2018 నవంబర్లో తుదిరూపునిచ్చారు. ఈ ఆసుపత్రిలో రెండు లీనియర్ యాక్సిలరేటరిలు, ఒక సీటీ సిమ్యులేటర్, ఒక హైడోస్ రేట్ బ్రాకోథెరపి మిషన్ల ఏర్పాటుకు అవసరమైన నాలుగు బంకర్ల నిర్మాణానికి అప్పట్లో టాటా అటానమిక్ ఎనర్జీ అనుమతులు మంజూరు చేశారు. అన్ని అనుమతులు లభించాక 2019 జనవరిలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కోవిడ్ రావడం, ఇతరత్రా కారణాలతో భవన నిర్మాణం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో 2022లో క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపి ఎండీ పీజీ సీటును నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఆగిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది. 2024 మార్చి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ‘కె’ ఆకారంలో భవన నిర్మాణం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను కర్నూలులోని ‘కె’ అక్షరం స్ఫూరించేలా నిర్మించారు. ఇందులో సివిల్ పనులు పూర్తి కావడం, ముఖ్యమైన లీనియర్ యాక్సిలరేటరి, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు రావడంతో 2024 మార్చి 7న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఓపీ సేవలకు సైతం శ్రీకారం చుట్టారు. అయితే ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రారంభించాలంటే అవసరమైన వైద్యపరికరాలు, వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. వైద్యపరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు, ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు, అవసరమైన 120 పడకలు, ఐసీయూ బెడ్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పద్ధతుల్లో అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ ఓపీ 20 నుంచి 25, ఐపీ 120 పడకల్లో రోగులకు చికిత్స అందుతోంది. రోజూ డే కేర్ కీమోథెరపీ 10 మందికి అందిస్తున్నాం. పది మంది రోగులు రోజూ అడ్మిషన్ పొందుతున్నారు. ఐసీయూలో ఆరు పడకలు ఉండగా నిత్యం నలుగురైదుగురికి చికిత్స అందుతోంది. అర్హులైన రోగులందరికీ ఉచితంగా చికిత్స చేస్తున్నాం. – డాక్టర్ సీఎస్కే ప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలను కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలతో రాయలసీమ ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. 45 మంది నిష్ణాతులైన వైద్యులు, 70 మందికి పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు ప్రాణం పోస్తున్నారు. ఆసుపత్రికి వెళితే కార్పొరేట్ స్థాయి అనుభూతి కలిగేలా నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పరికరాలు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులు అన్ని రకాల క్యాన్సర్లకు ఆధునిక చికిత్స నిత్యం 120 పడకలు ఫుల్ ఆసుపత్రి నిర్మాణంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ ప్రస్తుతం ఒక ఆపరేషన్ థియేటర్లోనే చికిత్స మరో రెండు థియేటర్లు వస్తే మెరుగైన వైద్యం కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన 70 ఏళ్ల ధర్మరాజుకు రెండు నెలల క్రితం కడుపునొప్పి, ఉబ్బరం తదితర సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు నిర్వహించగా డియోడినం మూడో భాగంలో 7 సెంటిమీటర్ల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ను గుర్తించారు. లిమిటెడ్ రిసెప్షన్ ఆఫ్ డియోడినం అనే ఆపరేషన్ నిర్వహించి అతనికి ఊపిరి పోశారు. కర్నూలుకు చెందిన 69 ఏళ్ల ఎం.రాజశేఖర్ బీపీకి నాలుగు రకాల మందులు వాడేవాడు. ఇది ఎందుకు అని పరీక్షించగా అతనికి కుడి పక్క కిడ్నీపైన జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే అరుదైన బీపీని పెంచే గడ్డ ఉందని గుర్తించారు. ఆపరేషన్ చేసి 12 సెంటిమీటర్ల జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే కణితిని తొలగించారు. ఆ తర్వాత ఎలాంటి మందుల అవసరం లేకుండానే బీపీ నియంత్రణలోకి వచ్చింది. -
వామ్మో చిరుతలు
డోన్ టౌన్: చనుగొండ్ల గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు వాటి పిల్లలతో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా చిరుత పులులు గ్రామస్తులకు కనిపించడంతో పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నా రు. ఈ క్రమంలో సోమవారం గేదె దూడ, మంగళవారం కూడా మరో రైతుకు చెందిన ఆవు దూడపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. విషయం తెలుసుకున్న డోన్ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అఫీసర్ రవీంద్రనాయక్, బీట్ అఫీసర్ భారతి గ్రామానికి వెళ్లి చిరుతలు సంచరిస్తున్న కొండల్లో తిరిగి వాటి ఆనవాళ్లు గురించారు. మృతి చెందిన బర్రె దూడ కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కొండపైన ఉన్న చిరుత పులి -
పత్తి రైతు అవస్థలు
● నాణ్యత లేదని తిరస్కరిస్తున్న సీసీఐ ● చోద్యం చూస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు నందవరం: ఆరు గాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు అధికారులు పట్టించుకోక..మరోవైపు ప్రభుత్వం స్పందించకపోవడంతో వారికి దిక్కుతోచడం లేదు. కనీసం సీసీఐకి పత్తి అమ్ముకుందామని తీసుకెళ్లితే నాణ్యత లేదని తిరస్కరిస్తున్నారు. మరి ఎందుకోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని ముగతి గ్రామంలోని మురహరి జిన్నింగ్ మిల్లును సీసీఐ కొనుగోలు కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం ఇబ్రహీంపురం, నందవరం, ఎమ్మిగనూరు మండలాల చుట్టూ పక్కల గ్రామాల రైతులు వ్యయప్రయాసలుకూర్చి పత్తిని సీసీఐకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక పత్తి నాణ్యత లేదని 8 లోడ్లను తిరస్కరించారు. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందారు. తేమశాతం 9 వచ్చిన పత్తి నాణ్యతగా లేదని తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ మంత్రి పత్తిలో 18 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలంటే సీసీఐ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా మార్కెటింగ్ అధికారులు స్పందించి పత్తి కొనుగోలు జరిగేలా చూడాలని వారు కోరతున్నారు. -
గంజాయి రవాణా ముఠా అరెస్టు
డోన్ టౌన్ : పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని కటకటాలకు పంపారు. మంగళవారం పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరతకుమార్రెడ్డి రైల్వేస్టేషన్ వద్ద గస్తీ చేపట్టారు. డోన్ ఇందిరానగర్ శ్రీనివాస టాకీస్ సమీపంలో నివాసం ఉండే ఈడిగ ఈశ్వర్గౌడ్ అలియాస్ గాలిగాడు, పాతపేటకు చెందిన షేక్ హుస్సేన్ అలియాస్ హసన్వలి, కొండపేట సుంకాల వసూళ్ల ఆఫీసు సమీపంలో నివాసం ఉండే చాకలి హరికృష్ణ అలియాస్ గుండు స్టేషన్ ఆవరణలో అనుమానంగా కనిపించారు.వెంటనే వారిని అదుపులోకి తనిఖీ చేయగా వారి వద్ద 1250 గ్రాముల గంజాయి లభించడంతో అరెస్టు చేశారు. ఎక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చారు, ఎవరికి విక్రయిస్తున్నారు తదితర వివరాలు విచారణలో తెలుస్తాయని సీఐ తెలిపారు. -
జాతీయ సైన్స్ ఫెస్టివల్కు ఎంపిక
బనగానపల్లె : మండలంలోని నందవరం జెడ్పీ ఉన్నత పాఠశా ల ఉపాధ్యాయుడు వీరబోయిన కుమార్బాబు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్)–2025కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ఉపాధ్యాయుడు కుమార్బాబు తెలిపారు. రాయలసీమ రీజియన్ పర్యావరణ సమన్వయకర్తగా, రాష్ట్ర కౌశల్ కో–ఆర్డినేటర్గా జిల్లా సైన్స్ ఆఫీసర్గా పని చేయడంతో పాటు సామన్య ప్రజలు, విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఞానాన్ని చేరువ చేయడంలో చేసిన కృషికి గాను తనకు ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేది వరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో ఐఐఎస్ఎఫ్ జరుగుతుందని వెల్లడించారు. బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ ఏడీగా మాధవి కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ సహాయ సంచాలకులుగా డాక్టర్ జి.మాధవి నియమితులయ్యారు. ఈమె డిప్యుటేషన్పై డోన్ నియోజకవర్గం కొమ్మెమర్రిలోని అనిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్స్పల్గా ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. డిప్యుటేషన్ గడువు ముగియడంతో డిపార్టు మెంటులో రిపోర్టు చేసుకున్నారు. బేతంచెర్ల ఏరియా హాస్పిటల్ ఏడీ పోస్టు ఖాలీగా ఉండటంతో ఈ పోస్టులో నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఈ పోస్టులో ఉన్న వసంతలక్ష్మి పదోన్నతిపై కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ నియమితులైన విషయం తెలిసిందే. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 93 శాతం హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 93 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మంగళవారం 6,8628 మందికి 6,365 మంది హాజరు కాగా 497 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏపీసీఎస్ఏ అసోసియేట్ అధ్యక్షుడిగా నాగరమణయ్య కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సహా అధ్యక్షుడి (అసోసియేట్ ప్రెసిడెంటు)గా కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంటు రిజిస్ట్రార్గా పనిచేస్తున్న టి.నాగరమణయ్య నియమితులయ్యారు. ఈ నెల 1వ తేదీన విజయవాడలో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు నుంచి ఈయనకు రాష్ట్ర కార్యవర్గంలో కీలకమైన స్థానం లభించింది. ఈయన జిల్లా కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవలనే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంటుగా ఎన్నిక కావడం పట్ల హర్షం ప్రకటించారు. సహకార ఉద్యోగు లు ఎదుర్కొంటున్న సర్వీస్ సమస్యలు, పదోన్నతులు తదితర వాటిని సత్వరం పరిష్కరించే అవకాశం లభించిందని తెలిపారు. రాష్ట్ర ఆసోసియేట్ ప్రసిడెంట్గా ఎన్నికై న నాగరమణయ్యను సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు సత్కరించి అభినందించారు. -
నంద్యాలలో దారుణం
● ఇద్దరు యువకుల హత్యకు దారి తీసిన దంపతుల మధ్య గొడవనంద్యాల: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. నంద్యాల పట్టణంలోని హరిజనవాడలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నంద్యాల వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... నాగలక్ష్మీదేవికి ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు కుమారులకు పెళ్లి అయ్యింది. సోమవారం రాత్రి రెండో కుమారుడు మధు, కోడలు మహాలక్ష్మి ఇంట్లో ఘర్షణ పడుతున్నారు. గమనించిన తల్లి ఇరువురిని సర్దిచెప్పడానికి వెళ్లింది. ఈ సమయంలో కోడలు మహాలక్ష్మి నాగలక్ష్మీదేవిని తోసివేయడంతో కిందపడి స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అదే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నాగలక్ష్మీదేవి మూడో కుమారుడు కొమ్ము పెద్దన్న ఇంటికి వచ్చి తమ అమ్మను కొట్టి ఎందుకు తోసివేశారంటూ వదినను నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న వదిన తమ్ముడు రాజ్కుమార్ కత్తి తీసుకొని విచక్షణా రహితంగా కొమ్ము పెద్దన్నపై దాడి చేశాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గొడవను ఆపడానికి వెళ్లిన పెద్దన్న స్నేహితుడు సురేష్పై కూడా రాజ్కుమార్ కత్తితో దాడి చేయడంతో అతనికీ తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతులు పెద్దన్న, సురేష్లు ఇద్దరు అవివాహితులు. ఇదిలా ఉండగా మృతుల బంధువులు నిందితుల ఇళ్లపై దాడికి వెళ్లి అక్కడ ఉన్న బైక్ను కాల్చివేశారు. మృతదేహాలను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి రాజ్కుమార్, అతని అక్క మహాలక్ష్మి, తల్లిదండ్రులు సరస్వతి, లక్ష్మయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ అస్రార్బాషా తెలిపారు. -
మా చెరువులోని మట్టిని మీరెందుకు తరలిస్తారు
బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పెండేకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రికుంట, వెంకటగిరి గ్రామాల మధ్యన ఉన్న చెరువులో నుంచి మట్టి తవ్వి ఉలిందకొండలోని ఎన్వీర్ బ్రిక్స్కు తరలిస్తున్నారు. ఎవరి అనుమతి తీసుకొని తమ ఊరి చెరువులోని మట్టిని తవ్వి అక్కడికి తరలిస్తున్నారని ఎం.పేండేకల్లు పంచాయతీ ప్రజలు మంగళవారం తవ్వకాలను అడ్డుకున్నారు. తమ పొలాలకు మట్టిని తీసుకెళ్లాలంటే సవాలక్ష కారణాలు చెప్పి అడ్డుకునే అధికారులు బయటి వ్యక్తులు జేసీబీ పెట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.అప్పటి వరకు మట్టి తవ్వకం జరగనివ్వమని ఎం.పెండేకల్లు, మర్రికుంట, వెంకటగిరి, రేపల్లె రైతులు పేర్కొన్నారు. దీనిపై భూగర్భ గనుల శాఖ ఏడీ రాజగోపాల్ వివరణ కోరగా మైనర్ ఇరిగేషన్ అధికారులు అనుమతి తీసుకొని రావడంతో కల్లూరు మండలం, ఉలింద కొండ గ్రామానికి చెందిన పి. నాగ భూషణంకు చెందిన ఎన్వీర్ బ్రిక్స్కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, తవ్వకాల సమయంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఏ ఒక్కరూ లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీ ప్రజలు -
టిప్పర్ కింద పడి ఇరువురి మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని లోకాయుక్త కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన చంద్రబాబు అలియాస్ చంద్రమోహన్(30), సుమన్(28) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలకు గురైన సమీప బంధువు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నవీన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నవీన్ ఎమ్మిగనూరు నుంచి మూడు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై గూడూరుకు వచ్చాడు. మంగళవారం ఉదయం చంద్రమోహన్తో కలసి ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వచ్చారు. అమీలియో హాస్పిటల్లో వాచ్మెన్గా పనిచేస్తూ కర్నూలు ఇందిరాగాంధీ నగర్లో ఉంటున్న సుమన్తో కలసి అలంపూరుకు వెళ్లి విందు చేసుకుని ముగ్గురూ కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లోకాయుక్త కార్యాలయం సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో టిప్పర్ వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలిసిన వెంటనే కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన నవీన్ను ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మృతిచెందిన వారి బంధువులు ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ వాహనాన్ని నడుపగా చంద్రమోహన్, నవీన్లు వెనుక కూర్చున్నారు. హెల్మెట్ ధరించి వుంటే ప్రమాద తీవ్రత తగ్గి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. -
కుమ్మర శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అర్బన్): కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి నూతనంగా జిల్లా, నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం స్థానిక బీసీ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి. పుల్లయ్య ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షులుగా జి. పుల్లయ్య, గౌరవ సలహాదారులుగా కె. సోమేసు, కె. నాగేశ్వరరావు, కె. బజారప్ప, జిల్లా అధ్యక్షులుగా కేసీ నాగన్న, ప్రధాన కార్యదర్శిగా కె. వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కె. కృష్ణమూర్తి, కె. నరసింహబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కె. పాండురంగస్వామి, కె. శ్రీనివాసులు ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే నగర సంఘానికి గౌరవాధ్యక్షుడిగా కె. లింగన్న, అధ్యక్షుడిగా కె. మధు, ప్రధాన కార్యదర్శిగా కె. గుమ్మకొండ రమేష్, కోశాధికారిగా కె. చిట్టిబాబును సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు జి. పుల్లయ్య మాట్లాడుతూ కుమ్మర్లు విద్యా పరంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కేసీ నాగన్న మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మర్లు అత్యధిక స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలన్నారు. -
పత్తి దగ్ధం
హొళగుంద: మండల పరిఽధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా పత్తి దగ్ధమైంది. గ్రామానికి చెందిన మాల సిద్దప్ప అనే రైతు 30 క్వింటాళ్ల పత్తిని మంగళవారం ఇంటి బయట ఆరబెట్టాడు. మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా మంటలురేగి కాలిపోయింది. ఎవరైనా పత్తికి నిప్పు పెట్టారా లేక బీడీ తాగి అందులో పారవేశారా తెలియదు.ఈ ఘటనతో తనకు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు విచారించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. మహిళా దొంగ అరెస్టు కర్నూలు: కర్నూలు శివారులోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్న దేవమ్మ మెడలో గొలుసు చోరీకి పాల్పడిన (చైన్ స్నాచింగ్) మహిళా దొంగ యాస్మిన్ను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. దేవమ్మ సోమవారం సమీప కాలనీలోని చౌక దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా బుర్ఖా ధరించిన ఓ మహిళ ఆమె మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించింది. ఆమె అప్రమత్తమై ప్రతిఘటించడంతో దుండగురాలు దాడి చేసి కత్తితో బెదిరించి మెడలోని గొలుసును తెంచుకుని పారిపోయింది. ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జొహరాపురానికి చెందిన యాస్మిన్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద తులం బంగారు గొలుసు, ఒక కత్తి, కత్తెర, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. యాస్మిన్ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. కుటుంబ పోషణ భారమై చోరీకి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్కు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు: మహిళపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కర్నూలు ఎకై ్సజ్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గణేష్ నగర్కు చెందిన ఉప్పర లక్ష్మీదేవికి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని అదే కాలనీకి చెందిన పిడతల లక్ష్మీదేవి, వెంకటస్వామి దంపతులు రూ.70 వేలు తీసుకున్నారు. లోన్ రాకపోవడంతో 2018 మే 23న ఉప్పర లక్ష్మిదేవి నిందితులను నిలదీసింది. వారు ఆగ్రహంతో దాడి చేసి దుర్భాషలాడారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో మొదటి నిందితురాలికి ఏడాది కారాగార శిక్ష, రూ.13 వేలు జరిమానా, రెండో నిందితునికి ఏడాది కారాగార శిక్ష, రూ.11 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు మరో మృతదేహం లభ్యం బండి ఆత్మకూరు : మండల పరిధిలోని సంతజూటూరు పికప్ ఆనకట్ట మంగళవారం మరో మృతదేహం (పురుషుడు )లభించింది. ఎస్ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు... మంగళవారం ఉదయం ఆనకట్ట వద్ద మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి చూడగా గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సోమవారం ఇదే ఆనకట్ట వద్ద నుంచి బయటకు తీసిన మృతదేహం వెలుగోడు మండలంలోని రేగడగూడూరు గ్రామానికి చెందిన వడ్డే పెద్ద రామాయ్య (65)గా ఆయన బంధువులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృత దేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
లోపాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ఎదిగి
● సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన డాక్టర్ గ్రేస్ సెలస్టియల్ ● అంగ వైకల్యాన్ని జయించి ఆదర్శంగా నిలిచిన వైనం డోన్: మనలోని లోపాన్ని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే నలుగురికి స్ఫూర్తినివ్వగలుగుతాం. ఇందుకు నంద్యాల జిల్లా డోన్ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు గ్రేస్ సెలస్టియల్ ఓ ఉదాహరణ. పుట్టిన ఆరునెలలకే పోలియో సోకి కాళ్లు సచ్చుబడిపోయినా సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హేళన, వివక్ష ఇవన్నీ ఆమె ఎదుగుదలను ఆపలేకపోయాయి. పేద కుటుంబంలో పుట్టి.. సంకల్పం బలంతో రాణించి కర్నూలు నగరానికి చెందిన జయరాజు, యేసు దైయమ్మ దంపతుల కుమార్తె డాక్టర్ గ్రేస్ సెలస్టియల్. వీరిది పేద కుటుంబమే. పుట్టిన ఆరునెలలకే సెలస్టియల్ పోలియో సోకితే తల్లిదండ్రులు కృంగిపోలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మంలో ఆస్ట్రేలియన్ మిషనరీ నేతృత్వంలో నిర్వహించబడుతున్న సెయింట్ మేరిస్ పోలియో హోమ్లో గ్రేస్ను చేర్పించారు. హోమ్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న క్లారా హింటన్ అనే ఆస్ట్రేలియన్ మహిళ నేర్పించిన మెళకువలు, కల్పించిన మనోధైర్యం, ఆత్మస్థైర్యం గ్రేస్ భవిష్యత్తుకు బాటలు వేశాయి. ఆ తర్వాత పదవ తరగతి కర్నూలు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో, ఇంటర్ మీడియట్ కోల్స్ కళాశాలలో పూర్తిచేసింది. తర్వాత ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్ ఎర్రగడ్డలోని బి.ఆర్.కె.ఆర్. మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించింది. రెండో ఏడాది చదువుతున్న దశలో ప్రాక్టికల్ కోసం ఎర్రగడ్డ నుంచి చార్మినార్ దగ్గర ఉన్న ఆసుపత్రి వరకు 15 కిలోమీటర్లు మూడుచక్రాల వాహనంపై ప్రయాణించి వైద్య విద్యను పూర్తిచేసింది. 2002వ సంవత్సరంలో మొట్టమొదట సాంఘిక సంక్షేమ శాఖలో ఆయుర్వేద వైద్యురాలిగా కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించింది. 2004లో ఆయుష్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో విజయనగరం జిల్లా అన్నంరాజు పేటలో విధులు నిర్వర్తించింది. 2006లో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్గా పదోన్నతి సాధించిన గ్రేస్ ఆయుష్ ఆసుపత్రిలో వైద్యురాలిగా నియమించబడి పాణ్యం, డోన్లో విధులు నిర్వర్తించారు. ఉత్తమ వైద్యురాలిగా .. కోవిడ్ వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లా ఆయుష్ ఉన్నతాధికారిగా ఆమె రోగులకు అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు అందజేసింది. ప్రస్తుతం గ్రేస్ ఏపీ రాష్ట్ర దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం మహిళ విభాగం అధ్యక్షురాలిగానూ, జిల్లా అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గ్రేస్ సెలస్టియల్ను సాక్షి పలకరించగా ‘కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. జీవితం దేవుడు ఇచ్చిన వరం దీనిని ఆస్వాదించాలి. లోపాలు, వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించాల’ని అభిప్రాయపడ్డారు. -
బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని రుద్రవరం గ్రామ సమీపాన ట్రాలీ బొలెరో వాహనం బోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయ శ్రీకాంత్ (29) యంబాయి గ్రామం నుంచి చామంతి పూల లోడుతో ఒక తోట నుంచి మరో తోటకు వెళ్తున్నాడు. రుద్రవరం గ్రామంలో కుక్క ఎదురు రావడంతో దానిని తప్పించబోయి బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో బోయ శ్రీకాంత్, మంటి సురేష్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బోయ శ్రీకాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. యువకుడి ఆత్మహత్య కర్నూలు(సెంట్రల్): కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న మస్తాన్రావు కుమారుడు సాయి రోహన్ (20) ఇంటర్ పాసయ్యాడు. బీఎస్సీ నరింగ్స్ కోర్సులో చేసేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. అతనికి మొదటి ఫేజ్లో నంద్యాల శాంతిరామ్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే కర్నూలులో సీటు కోసం రెండో ఫేజ్లో మళ్లీ కౌన్సెలింగ్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫలితాలు సోమవారం రావడం.. కర్నూలులో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లోని బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయాడు. తండ్రి మస్తాన్రావు ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామ క్రాస్ సమీపంలో కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా మహానంది మండలం అబిపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు కారులో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో జరిగే బంధువుల ఫంక్షన్కు వెళ్తున్నారు. సిరాలదొడ్డి క్రాస్ సమీపంలో రోడ్డు మధ్య గోతిపడటం, కుక్క అడ్డుగా రావటంతో తప్పించబోయి కారు బోల్తా పడింది. సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.తర్వాత వారు కారు రిపేర్ చేయించుకొని సిరుగుప్పకు వెళ్లిపోయారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం
స్థానిక సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరు అయిన ఈ నిధులను జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు తోడు స్టాంప్ డ్యూటీ నిధులు వస్తే గ్రామాలకు ఊపిరి అందుతుంది. – బి.రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ, కోడుమూరు ఎలాంటి ఇతర ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్కు ప్రధాన ఆదాయ వనరు అయిన స్టాంప్ డ్యూటీ నిధులు జమ కాకుంటే ఎలా? రాష్ట్రంలోని ఇతర జిల్లా పరిషత్లతో పోలిస్తే మన జిల్లా పరిషత్కు ఎలాంటి అదనపు ఆదాయాలు లేవు. స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే జెడ్పీటీసీలుగా మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థలకు మరింత ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయ్యేలా చూడాలి. – షేక్ కరీమున్నీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరు ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల స్థానిక సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి. – వి.రామకృష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ -
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మోసం
కర్నూలు: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి అబ్దుల్ గఫార్ ఖాన్ రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు కృష్ణా నగర్కు చెందిన నాయుడు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 102 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పొలం తగాదాలు, ఉద్యోగాల పేరుతో మోసం, సైబర్ నేరాలు, నకిలీ సర్టిఫికెట్ల మోసాలు తదితర వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, రమేష్, జయలక్ష్మి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
● డిసెంబర్ 10న జిల్లా వ్యాప్తంగా నిరసనలుకర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమలు చేయనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు. సోమవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తేమ, ఇతరాత్ర కారణాలు చెప్పకుండా క్వింటాల్ పత్తిని సీసీఐ ద్వారా రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధిక వర్షాలు, తుపానులతో రైతులు పండించిన ఉల్లి, టమాట, పత్తి, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. రైతులకు మద్దతుగా ఈనెల 12వ తేదీన అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆలూరులో జరిగే కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మునెప్ప, కె. జగన్నాథం, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, పి.శ్రావణి, భారతి పాల్గొన్నారు. -
మెడికల్ పీజీ పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు
కర్నూలు(హాస్పిటల్): మెడికల్ పీజీ పరీక్ష ఫలితాల్లో ఫిజియాలజి, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజి విద్యార్థులకు స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంకులు వచ్చినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె తన ఛాంబర్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఆయా విభాగాల వైద్యులతో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ఫైనలియర్ పరీక్షల్లో కమ్యూనిటీ మెడిసిన్ నుంచి కొప్పోలు కీర్తన స్టేట్ సెకండ్ ర్యాంక్(592), థియరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఫిజియాలజి విభాగం నుంచి డాక్టర్ డి.మౌనిక స్టేట్ సెకండ్ ర్యాంక్, డాక్టర్ పి.యశ్వంత్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఫార్మకాలజి విభాగం నుంచి డాక్టర్ ఆర్, ధారణి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించారన్నారు. తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద, ఫిజియాలజి హెచ్ఓడీ డాక్టర్ సుధారాణి, ఫార్మకాలజి హెచ్ఓడీ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు. -
శ్రీగిరిలో వసతి పేరుతో ‘సైబర్’ దోపిడీ
● శ్రీశైలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుశ్రీశైలంటెంపుల్: దేవస్థాన వసతి గృహ సముదాయాల పేరుతో సైబర్ నేరగాళ్లు పలు నకిలీ వెబ్సైట్లను సృష్టించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, గౌరీసదన్, పాతాళేశ్వరసదన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. వసతి గదులు బుక్ చేశామని, తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేసుకుంటూ భక్తులను మోసగిస్తున్నారు. అలాగే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరితా రిసార్ట్ పేరుతో సైతం నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. సైబర్ నేరగాళ్ల ఐపీ అడ్రస్ ఒకసారి ఒకచోట, మరికొన్ని నిమిషాలకు మరోచోట చూపిస్తోంది. శ్రీశైలం పీఎస్లో ఫిర్యాదు ఇటీవల బెంగళూరుకు చెందిన భక్తుడు ఏపీ టూరిజం హరితా రిసార్ట్ పేరుతో వసతి గదిని బుక్ చేసుకుని మోసపోయిన ఘటనపై స్పంధించిన టూరిజం శాఖ, టూరిజం శాఖ శ్రీశైలం మేనేజర్తో శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నకిలీ వెబ్సైట్ల ముఠా దొరుకుతారో లేదో వేచిచూడాలి? అందుబాటులోకి ఫోన్ నంబర్లు నకిలీ వెబ్సైట్లను నమ్మి శ్రీశైల దేవస్థానంలో వసతి, ఆర్జితసేవా, దర్శనం టికెట్లను పొందవద్దని శ్రీశైల దేవస్థాన అధికారులు ప్రకటనలు చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి దేవస్థాన సమాచార కేంద్రం ఫోన్ నెంబర్లు 8333901351, 52, 53లను సంప్రదించవచ్చునని సూచిస్తున్నారు. -
గాయపడిన వృద్ధురాలి మృతి
ఎమ్మిగనూరురూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంగమ్మ (68) అనే వృద్ధురాలు సోమవారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలలిపారు. కోటేకట్ గ్రామ మలుపు దగ్గర రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసహళ్లి, బంగరుపేటకు చెందిన ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో గాయపడ్డ గంగమ్మ(68) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. ఇదే ప్రమాదంలో ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మృతుల సంఖ్య ఆరుగురికి చేరుకుంది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ చేతన్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం
● వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులుఎమ్మిగనూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడిమెట్ల రాజీవ్రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో సోమవారం ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన టీడీపీకి చెందిన చిన్న బడేసాబ్ కుమారులైన బజ్జి ఖాజ, కుమ్మరి లక్ష్మన్న, కుమ్మరి సోమేష్, బోయ రైతన్న, హరిజన బాబు, కుమ్మరి చెన్నప్ప, గొల్ల చిరంజీవి, పి.దస్తగిరి, మౌళాలి, అల్లిపీర, ఖాజ, గొల్ల మధులకు నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు పార్టీ యూత్ నాయకుడు ఎర్రకోట పవన్కళ్యాణ్ రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా అన్ని వర్గాల ప్రజలను మోసగించారన్నారు. త్వరలోనే ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాళ్లదొడ్డి చాంద్బాషా, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగి దుర్మరణం
పాములపాడు: ట్రాక్టర్ ఢీకొని విద్యుత్ శాఖ ఉద్యోగి దుర్మరణం చెందాడు. విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు ట్రాన్స్కో కార్యాలయం ఏడీఎం సెక్షన్లో వసీం అక్రమ్ (35) జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు ముగించుకొని సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై అతను కర్నూలుకు బయలుదేరాడు. మార్గమధ్యలో పాములపాడు మండలం కృష్ణరావుపేట గ్రామం వద్ద ఎన్హెచ్340సీ రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ● కొత్త వ్యక్తులను నమ్మొద్దు.. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు ● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య (65) హత్యకేసును పోలీసులు ఛేదించారు. నమ్మకంగా మెలిగిన వ్యక్తే మరో ముగ్గురితో కలిసి డబ్బు కోసం దారుణంగా హత్య చేసి కుందూలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీలో రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈయనకు పట్టణంలోని దేవనగర్లో ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఏడాదిన్నర క్రితం నంద్యాల వైఎస్సార్నగర్కు చెందిన బి.ధనుంజయ ఇతరులకు అమ్మించారు. ఈ క్రమంలో పుల్లయ్యతో ఏర్పడిన పరిచయాన్ని కొనసాగిస్తూ ఆయన వ్యక్తిగత విషయాలు, ఆస్తుల వివరాలు తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉంటున్న అతడిని మట్టుబెట్టి ఆస్తులు కాజేయాలని ధనుంజయ భావించాడు. ప్లాన్ ప్రకారం గత నెల 14వ తేది గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన గంగాధర రాఘవ, గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన బెస్త శ్రీకాంత్, గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన కె. సంతోష్తో కలిసి పుల్లయ్యను ఆటోనగర్కు పిలిపించుకొని బొలెరో వాహనంలో ఎక్కించుకొని గడివేముల మండలం భోగేశ్వరం దారి వైపు వెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి రూ.25 లక్షలు డిమాండ్ చేయగా పుల్లయ్య ఇవ్వకపోవడంతో మెడకు తాడు బిగించి కత్తితో నుదిటి పైభాగంలో బలంగా గుద్ది హత్య చేశారు. అనంతరం శవాన్ని అనుమానం రాకుండా మద్దూరు గ్రామ సమీంలోని కుందూనదిలో వేశారు. మృతుడి సెల్ఫోన్, హెల్మెట్, కత్తి కూడా అందులోనే వేసి పుల్లయ్య ఇంటికి వెళ్లి డీవీఆర్ బాక్స్, డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ తీసుకెళ్లారు. గతనెల 19వ తేదీన పుల్లయ్య కుమారుడు ఆదిత్య ప్రసాద్ తన తండ్రి కనిపించడం లేదని నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అదే నెల 29వ తేదీన గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామం వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ధనుంజయ, బెస్త శ్రీకాంత్,గంగాధర రాఘవ, కె. సంతోష్ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేసి వారి నుంచి కత్తి, రెండు డీవీఆర్లు, ల్యాప్టాప్, దస్తావేజు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలని, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోరాదని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మందాజావళి పాల్గొన్నారు. -
ఈ పురుగు కుడితే అంతే!
ఈ వ్యాధి పేరు పలకడానికి ఇబ్బంది ఉంటుంది. సోకితే మాత్రం మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకూ తెస్తుంది. వివిధ రకాల విష జ్వరాల మాదిరిగా ఇది కూడా ఓ రకం జ్వరం. పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధినే వైద్య పరిభాషలో ‘స్క్రబ్టైఫస్’ అంటారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాధి కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లార్వల్ మైట్స్ పురుగు కుట్టడంతో ఏర్పడిన దద్దుర్లు కర్నూలు(హాస్పిటల్): కొంత కాలంగా కోస్తా ప్రాంతానికే పరిమితమైన స్క్రబ్టైఫస్ వ్యాధి గత కొన్ని రోజులుగా జిల్లాలో వ్యాపిస్తోంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు ఉండే ప్రాంతాల్లో నివసించే వారిని ఈ వ్యాధి లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్ విభాగంలో 203 మంది చేరారు. వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో ఎలీసా విధానంలో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించగా 38 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ మేరకు అందరికీ అవసరమైన యాంటిబయాటిక్స్, మందులు ఇచ్చి వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటివరకు అందరూ కోలుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్క్రబ్టైఫస్ ఇలా వ్యాపిస్తుంది... లార్వల్ మైట్స్ అనే పురుగు వల్ల స్క్రబ్టైఫస్ వ్యాధి వస్తుంది. ఈ పురుగు స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివాసం ఉండేవారికి, ఆయా వ్యవసాయ పనుల్లో ఎక్కువసేపు ఉండేవారికి ఇది సోకుతుంది. చెట్లు, పొలాల్లో సంచరించే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంత మందికి దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూమోనిటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతారు. కొన్నిసార్లు కిడ్నీలు విఫలం కావడం, హృదయకండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్లరక్తకణాలు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంత మందిలో కాలేయం, మూత్రపిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వీరు జాగ్రత్తగా ఉండాలి మధుమేహం, బీపీ, హెచ్ఐవీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి స్క్రబ్టైఫస్ సోకితే ఇబ్బందులు మరింత పెరుగుతాయి. చిన్నపిల్లలు, వ్యాధినిరోధికశక్తి తక్కువగా ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చాలా అరుదైన స్క్రబ్టైఫస్ వ్యాధి కేసులు ఇటీవల కాలంలో వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటి వరకు 203 మంది రాగా వారికి మైక్రోబయాలజి ల్యాబ్లో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించాము. అందులో 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరందరికీ జనరల్ మెడిసిన్ విభాగంలో ఉంచి వైద్యం అందించాము. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్టైఫస్ కేసులు పెద్దాసుపత్రిలో 203 మందికి లక్షణాలు 38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యం చెట్లు, పొలాల్లో పనిచేసే వారికి ప్రమాదం -
జేసీబీలను విక్రయించే మోసగాళ్ల అరెస్టు
● రూ. 63.10లక్షల మోసం ● ఎనిమిది జేసీబీలు స్వాధీనం పెద్దకడబూరు: ఒకరి జేసీబీలను మరొకరికి విక్రయించే ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్.భార్గవి మర్రివాడ తెలిపారు. ఎనిమిది జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెద్దకడబూరు పోలీస్స్టేషన్ ఆవరణలో సోమవారం డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరుకు చెందిన నీలయ్య, జింక నాగరాజు, తుగ్గలి మండలం, రాతన గ్రామానికి చెందిన భార్గవరాముడు ఫైనాన్స్ కింద హిందూపురం పట్టణానికి చెందిన నిర్మలబాయ్ నుంచి జేసీబీని తీసుకున్నారు. కంతులు చెల్లించకుండా, జేసీబీని తిరిగి ఇవ్వకుండా వేరేవారికి అమ్ముకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐలు ఆనంద్, శివరాములు, హెడ్కానిస్టేబుల్ లక్ష్మన్న, కానిస్టేబుల్ మల్లికార్జున, హనుమంతు, బాస్కర్లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఎల్లెల్సీ సమీపంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా జేసీబీలు ఫైనాన్స్ కింద తీసుకొని కంతులు కట్టకపోవడమే కాక తక్కువ ధరలకు ఇతరులకు అమ్ముతూ రూ.63.10లక్షలు మోసం చేసినట్లు గుర్తించామన్నారు. మొత్తం ఎనిమిది జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా పంపిస్తామన్నారు. ఇంకా వేరే ఎవ్వరినైనా మోసం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. -
హెచ్ఐవీ బాధితులు అధైర్యపడవద్దు
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడకుండా ఏఆర్టి మందులు సక్రమంగా వాడి జీవితకాలం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆద్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7వేల మంది హెచ్ఐవితో బాధపడుతూ ఏఆర్టి మందులు వాడుతున్నారని తెలిపారు. బాధితుల పట్ల సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ మానవీయతతో వ్యవహరించాలన్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారు కచ్చితంగా టెస్ట్లు చేయించుకోవలని, ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్, డీసీహెచ్ఎస్ జఫ్రుల్లా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పత్తి రైతులతో సీసీఐ చెలగాటం
కర్నూలు (అగ్రికల్చర్): పత్తి రైతుల పట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గూడూరు సమీపంలోని పెంచికలపాడు జిన్నింగ్ మిల్కు తెచ్చిన పత్తిని తేమ శాతం ఎక్కువగా ఉందని, రంగు మారిందనే కారణాలతో తిరస్కరించారు. ఏకంగా 17 లోడులను తిరస్కరించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇందులో పర్ల గ్రామానికి చెందిన రైతులవే 5 లోడ్లు ఉండటం గమనార్హం. ఒకవైపు కలెక్టర్, మరోవైపు వ్యవసాయ మంత్రి పత్తిలో 18 శాతం వరకు తేమను అనుమతిస్తామని, రంగు మారినా కొంటామని చెబుతున్నారు. అయితే సీసీఐ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పత్తి నాణ్యత బాగున్నా ఏకపక్షంగా తిరస్కరిస్తున్నప్పటికీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఐ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు సోమవారం రాత్రి జిన్నింగ్ మిల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పెంచికలపాడు పత్తి కొనుగోలు కేంద్రంలో దళారులకు గేట్లు ఎత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
● బిషప్ సంతోష్ ప్రసన్నరావునంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతులు, ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు(బిషప్) అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ క్రీడా మైదానంలో సీడబ్ల్యూఎస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. బిషప్తో పాటు డీఈఓ జనార్ధన్రెడ్డి అతిథులుగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరంగా భావించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాల్లో నిర్వహించే వైద్య సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి జగన్మోహన్రెడ్డి, ఎంఈఓలు శివరాంప్రసాద్, ప్రసన్నకుమార్, మాధవి, పీడీలు విశ్వనాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
● కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్ఈలకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశంకర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులు నుంచి వస్తున్న వివిధ సమస్యల పరిష్కారానికి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన రెండు జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమానికి 62 మంది వినియోగదారులు పోన్ ద్వారా తమ సమస్యలను వివరించారని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాఫ్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని సూచించారు. -
అరకొర అర్టీసీ బస్సులు
పాణ్యం: ఆర్టీసీ బస్సులు అరకొర ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నాయి. బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రావడం లేదు. పాణ్యం ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ప్రయాణికులు రద్దీ కనిపించింది. కొన్ని ఆర్టీనరీ, ఎక్స్ప్రెస్లు వచ్చినా కాలు పెట్టేందుకు వీలు లేనంతగా నిండిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు కోరారు. -
జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు
వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్బ్యాంకులో ఎక్కువ రక్తసేకరణ చేసినందుకు బ్లడ్బ్యాంకుకు, పాజిటివ్ వచ్చిన వారికి ఏఆర్టీ కేంద్రానికి అనుసంధానం చేయడంలో భాగంగా ఐసీటీసీ కేంద్రాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వచ్చాయి. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని డిసెంబర్ ఒకటో తేదీన విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో హెచ్ఓడీలు, సిబ్బంది ఈ అవార్డులు అందుకుంటారు. అలాగే ఒకటిన కర్నూలులో జిల్లా పరిపాలన, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థినీ విద్యార్థుల భాగస్వామ్యంతో కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు భారీ ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. –డాక్టర్ ఎల్. భాస్కర్, డీఎంహెచ్వో, కర్నూలు -
కొండలపై ‘పచ్చ’ గద్దలు!
● ఎర్రమట్టిని కొల్లగొడుతున్న టీడీపీ నాయకులు ● అనుమతులు లేకున్నా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు ఆదోని రూరల్: టీడీపీ నాయకులు బరితెగించారు. అధికారంలో ఉన్నాం.. తమను ఎవరూ ఏమీ చేయలేరని ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నారు. ఆదోని మండలంలోని ఇస్వీ గ్రామ వద్ద ఉన్న కొండల్లో ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తరలించి అమ్ముకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎర్రమట్టి వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఇటీవల ఇస్వీ గ్రామంలో సర్పంచ్ శ్యామలమ్మ నేతృత్వంలో మట్టి పనులు జరుగుతుండగా ఇదే నాయకుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు కొండల్లో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. ఒక్కో ట్రాక్టర్కు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ తవ్వకాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొండలు మాయం అయ్యే పరిస్థితికి రావడంతో గ్రామస్తులు ఇటీవల సబ్కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి వచ్చే సమయానికి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారు వెళ్లిపోయారు. ఇస్వీ సమీపంలోని బసవేశ్వర ఆలయం వద్ద కొండలు మాయం అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
ఉచితమని రూ.500 వసూలు చేస్తారా?
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి ● వేదావతి నదిని పరిశీలించిన ఎమ్మెల్యే హొళగుంద: ‘ చంద్రబాబు, ఆయన సర్కార్ ఉచిత ఇసుక అని చెబుతుంటే టీడీపీ నాయకులు మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్కు రూ.500 ఇవ్వాలని బెదిరిస్తున్నారు. దీనికి చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి’ అని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్లమడికి వద్ద ఉన్న వేదావతి నదిని ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఉచిత ఇసుక విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ట్రాక్టర్ డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ఇసుక కోసం వెళ్తే టీడీపీ నాయకులు ట్రాక్టర్కు రూ.500ఇవ్వాలంటున్నారని, ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని చెప్పగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఇసుక, కల్తీ మద్యం దందా చెలరేగిపోతోందన్నారు. ప్రతి ఊరిలో బెల్ట్షాపులు వెలిశాయని ఆరోపించారు. ఉచిత ఇసుక అంటూ టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తుండటాన్ని జిల్లా కలెక్టర్, ఏఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. స్థానిక ఎస్ఐ ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం విషయంలో రాజకీయం చేయకుండా శాంతి భద్రతలను కాపాడాలని, లేదంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఉచిత ఇసుకకు ఎవరైనా రూ.500 ఇవ్వాలని బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంటే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, చంద్ర, సిద్దలింగ, మరిమల్ల, శేక్షావలి, సిద్దయ్య, కాకి ఫక్కీరప్ప, లక్ష్మన్న, వీరేష్, గర్జప్ప తదితరులు ఉన్నారు. -
ఉచిత లడ్డూ ప్రసాదం
స్పర్శ, అతిశీఘ్ర దర్శన భక్తులకు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అతిశీఘ్ర దర్శనం టికెట్టుదారులకు (రూ.300) ఉచితంగా ఒక లడ్డూ, స్వామివారి స్పర్శదర్శనం టికెట్టుదారులకు ఉచితంగా రెండు లడ్డూ ప్రసాదాలు అందజేస్తారు. అలాగే పలు కార్యక్రమాలను ప్రారభించనున్నారు. సోమవా రం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం అధునికీకరణ పనులకు భూమిపూజ, 10.40 గంటలకు గంగాధర మండపం వద్ద నూతనంగా నిర్మించబడిన విరాళాల సేకరణ కేంద్రం ప్రారంభించనున్నారు. అలాగే దేవస్థాన పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుల ఛాంబర్ ప్రాంరభిస్తారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుకభాగంలో కై లాస కంకణాల విక్రయకేంద్రం ప్రారంభించనున్నారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తులు శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. -
రైతు కష్టం మట్టిపాలు
● గిట్టుబాటు ధరలేక ఉల్లిపంటను దున్నేసిన రైతు కోసిగి: మార్కెట్లో గిట్టుబాటు ధరలేక వందగల్లు గ్రామానికి చెందిన కాల్వ ఈరన్న తన ఉల్లి పంటను ఆదివారం మట్టిలోనే కలిపేశాడు. తాను మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, ఇప్పటి వరకు రూ.1.50లక్షలు ఖర్చు వచ్చిందని చెప్పారు. ఉల్లి పంట చేతికొచ్చిందని, కోత కోసి మార్కెట్లో అమ్ముకుందామనుకున్నా క్వింటా మార్కెట్లో రూ.400కు మించి పలకడం లేదన్నారు. చేసేది ఏమీలేక ట్రాక్టర్తో దున్నేసినట్లు తెలిపారు. గత వర్షకాలంలో అధిక వర్షాలకు పంటలు పూర్తి దెబ్బతినినష్టం వాటిల్లిందని, ఈ సారైనా ఉల్లిపంటతో గిట్టుబాటు ధర వస్తుందనుకున్నా మరలా అప్పులే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
వామ్మో.. వానరాలు!
● ప్రభుత్వ పాఠశాలల్లో కుప్పి గంతులు ● భయపడుతున్న విద్యార్థులు గోనెగండ్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్కు కోతుల బెడద ఎక్కువైంది. దీంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణంలో 40 పైగా కోతులు ఉంటాయి. అవి పాఠశాల తరగతి గదులు, ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ రూమ్లలో వెలుతుండడంతో విద్యార్థులు భయపడుతున్నారు. విద్యార్థులు ఉదయం ప్రార్థనకి వెళ్లినప్పుడు, మధ్యాహ్నం సమయంలో భోజనానికి వెళ్లినప్పుడు కోతులు కిటీకీల నుంచి తరగతి గదులలోకి వెళ్లి బ్యాగులను తీయడం(చించడం) అందులో ఉన్న పుస్తకాలు బయటకు పారవేయడం, చించివేయడం, విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారెర్ బ్యాక్సులను తినడంతో పాటు చల్లడం లాంటి పనులు చేస్తున్నాయి. విద్యార్థులను కరిచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నారు. ప్రతి రోజు కోతులు తరగతి గదిలోకి వెళ్లి బ్యాగులు తీయడం, క్యారెర్ బాక్సులను తీనడం జరుగుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల ఆవరణంలో ఉన్న కోతులను పట్టుకొని గ్రామాలకు దూరంగా వదిలివేయాలని కోరుతున్నారు. -
వేప చెట్టుకు విపత్తు
వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఆశించే వివిధ చీడపీడల నివారణకు వేపతో తయారయ్యే ఉత్పత్తులు సమర్థవంతంగా పనిచే స్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేపాకు, వేపకాయలు, వేపపిండి, వేప చెక్క, వేపనూనెతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్టుకు మళ్లీ కష్టమొచ్చింది. వింత తెగులుతో చాలా చోట్ల చెట్లు ఎండిపోతున్నాయి. ఆకులు, రెమ్మలు, కొమ్మలు సహా ఎర్రబారిపోతున్నాయి. కరోనా సమయంలోనూ ఇదే మాదిరిగా వేప చెట్లు ఎండిపోయి తిరిగి చిగురించాయి. మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. వేపచెట్లను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. – గడివేముల/తుగ్గలి -
రైలు కింద పడి వివాహిత ఆత్మహత్య
కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో శనివారం అర్ధరాత్రి ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నంద్యాల రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు.. కోవెలకుంట్ల రైల్వే స్టేషన్కు మూడు కి.మీ దూరంలో రైలు పట్టాలపై అడ్డంగా పడుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు ఆరా తీస్తున్నారు. మహిళ వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, నలుపు, ఎరుపు, గోల్డ్కలర్ చెక్స్ కలిగిన చీర, అదే రంగు జాకెట్ ధరించినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ ఖలీల్ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే 9908889696, 8367037525కు సమాచారం ఇవ్వాలని కోరారు. ‘సంతజూటూరు’లో గుర్తుతెలియని మృతదేహం బండి ఆత్మకూరు: సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహంలో కొట్టుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చిందని స్థానికులు తెలిపారన్నారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మృతదేహాన్ని బయటకు తీయడం వీలుకాలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాముల కలకలం ఎమ్మిగనూరురూరల్: స్థానిక వందపడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ప్రసవాల వార్డు కిటిటీ దగ్గర రెండు పాములు కనిపించాయి. దీంతో బాలింతలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న బాలింతల బంధవులు కర్రలతో కిటికీ దగ్గర ఉన్న పాములను బయటకు పంపి, వాటిని చంపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వస్తున్నాయని రోగులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కొత్తూరులో జడ్జి పూజలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి అభిషేకాలు, అర్చనలు చేశారు. శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈఓ రామకృష్ణ, అర్చకులు, సిబ్బంది తీర్థఽప్రసాదాలు అందించారు. నంద్యాల ఆడ్వొకేట్ రాజగోపాల్రెడ్డి, సుబ్బారెడ్డి, అర్చకులు సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. యాగంటీశ్వరుడి సేవలో జేసీ బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. జాయింట్ కలెక్టర్ దంపతులకు ఆలయ ఈఓ పాండురంగారెడ్డి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వెలసిన ఉమామహేశ్వరస్వామికి అర్చన అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జేసీ దంపతులను ఆలయ ఈఓ, అర్చకులు సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. జేసీ వెంట మండల ఇన్చార్జ్ తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి, యాగంటిపల్లె గ్రామ ఉప సర్పంచ్బండి మౌలీశ్వరరెడ్డి, వీఆర్వో గోవిందప్ప తదితరులు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి అవుకు(కొలిమిగుండ్ల): మండలంలోని మంగంపేటకు చెందిన బుర్రపెద్ద వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు పుల్లయ్య(36) ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుల్లయ్య మద్యానికి బానిసై రోజు ఇంటికి తాగి వస్తుండేవాడు. పనులకు పోకుండా ఖాళీగా తిరుగుతూ వచ్చాడు. ఈ విషయంలో పుల్లయ్య, భార్య హరిత మధ్య తరచూ గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ కోవలోనే భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో భర్త మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరరెడ్డి. వెల్దుర్తి మండలం మల్లెపల్లె గ్రామానికి చెందిన ఈయన 20 గేదెలతో డెయిరీ నిర్వహిస్తున్నారు. ఇంతవరకు లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టే విధంగా కృత్రిమ గర్భధారణనే వినియోగించుకోలేదు. దీంతో డెయిరీ అభివృద్ధి చెందలేదు. పాల ఉత్పత్తి తగ్గింది. 2024లో ఇదే సమయానికి రోజకు 70 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. నేడు 45 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. -
ఆన్లైన్ సేవలు పునరుద్ధరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో సాంకేతిక కారణాలతో వారం క్రితం నిలిచిన ఆన్లైన్ సేవలు పునరుద్ధరించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ.. మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. భక్తులందరూ దేవస్థానం అందిస్తున్న ఆన్లైన్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని ఈఓ సూచించారు. ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చుననానరు. మల్లికార్జున స్వామివారి గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షకరాభాస్యం మొదలైన 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లనుఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చున్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్సైట్ www. srisailadevasthanam.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. -
నిశ్శబ్దాన్ని దాచేస్తున్నారా?
నంద్యాల జిల్లాలో పరిస్థితి ఇలా.. కర్నూలు(హాస్పిటల్)/గోస్పాడు: సమాజంలో నాగరికత పెరిగే కొద్దీ అనైతిక చర్యలు అధికమవుతున్నాయి. తప్పు చేసినా దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చనే ధీమా అధికమైంది. తప్పు చేస్తే వచ్చే వ్యాధైన ఎయిడ్స్ దీనికి ఉదాహరణ. మొదట్లో ఈ వ్యాధి అంటే బాగా భయపడేవారు. ఆ తర్వాత ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడొచ్చో తెలిసాక నెమ్మదిగా ఈ వ్యాధంటే భయం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇదంటే పూర్తిగా భయం పోయింది. ఈ కారణంగా మళ్లీ విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యభిచారం, అనైతిక సంబంధాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులూ పెరుగుతున్నాయి. అయితే ఇందులో కొన్ని మాత్రమే రికార్డులకెక్కుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం, ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎదుర్కొనేందుకు అందరినీ దగ్గర చేసేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదిన ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏడు సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాలు(ఐసీటీసీలు), 74 ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్ ఐసీటీసీలు, మూడు సుఖవ్యాధుల చికిత్సా కేంద్రాలు, రెండు ఏఆర్టీ కేంద్రం(కర్నూలు, ఆదోని), మూడు లింక్ ఏఆర్టీ కేంద్రాలు, మరో మూడు డిసిగ్నేటెడ్ ఎస్టీఐ/ఆర్టీఐ కేంద్రాలు, 14 రక్తనిధి కేంద్రాలు(ప్రభుత్వ, ప్రైవేటు), ఆరు రక్తనిల్వ కేంద్రాలు, ఐదు ప్రివెన్షన్ యూనిట్లు(టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు), ఒక లింక్ వర్కర్ ప్రాజెక్టు(చైల్డ్ ఫండ్ ఇండియా–44 గ్రామాల్లో), ఒక నేస్తం పాజిటివ్ నెట్వర్క్ ఉన్నాయి. 40 ఏళ్లలోపు వారే ఎక్కువ జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల్లో 26 నుంచి 40 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బాధితుల్లో 14 ఏళ్లలోపు వారు 324 మంది, 15 నుంచి 25 ఏళ్లలోపు వారు 1,341 మంది, 26 నుంచి 40 ఏళ్లలోపు వారు 3,681 మంది, 41ఏళ్లపైబడిన వారు 2,252 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లలో 15 నుంచి 25ఏళ్లలోపు వారు 19 మంది, 26 నుంచి 40 ఏళ్లలోపు వారు 26 మంది, 41ఏళ్లు పైబడిన వారు 9 మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనైతిక సంబంధాలతో పెరుగుతున్న కేసులు సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఇటీవల కాలంలో వ్యభిచారం విచ్చలవిడిగా మారింది. హోటళ్లు, లాడ్జిల గదులే గాకుండా నివాసిత ప్రాంతాల మధ్యలోనే యథేచ్ఛగా గుట్టుచప్పుడు గాకుండా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని వెబ్సైట్లు, వాట్సాప్ల ద్వారా కూడా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని దళారులు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు అనైతిక సంబంధాలు అధికమయ్యాయి. సోషల్ మీడియా ప్రభావంతో కోరికలు తీర్చుకోవడానికి పరిచయాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా పరిచయాలు పెంచుకుని మరీ ఒక్కటవుతున్నారు. ఇలాంటి వారు కండోమ్లు వాడటం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరి ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు చాపకింద నీరులా పాకుతున్నాయి. వీరు ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. వీరి వివరాలు ప్రభుత్వ రికార్డులకు ఎక్కడం లేదు. మరోవైపు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించే రెడ్ రిబ్బన్ క్లబ్లు అంత చైతన్యవంతంగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా యువత ఎక్కువగా విచ్చలవిడి శృంగారం వైపు మళ్లి హెచ్ఐవీ బారిన పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సాధారణ గర్భిణిలు హెచ్ఐవీ హెచ్ఐవీ బాధితులు బాధితులు 2018-19 1,383 69 2019-20 1,223 54 2020-21 576 47 2021-22 885 54 2022-23 620 36 2023-24 477 18 2024-25 450 10 2025 154 22 నంద్యాల జిల్లా ఏర్పాటు అయ్యాక 2022 ఏప్రిల్ నుండి 2025 అక్టోబర్ వరకు 2,44,640 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేయగా 1502 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. అలాగే గర్భిణీ సీ్త్రలకు 1,61,113మందికి పరీక్షలు చేయగా 58 మందికి హెచ్ఐవీ పాజిటివ్ కేసులు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తగ్గాయంటున్న ఎయిడ్స్ కేసులు ఎయిడ్స్ కేసుల నమోదుపై అనుమానాలు విచ్చలవిడిగా వ్యభిచారం అక్రమ సంబంధాలు అదే స్థాయిలో... బాధితుల్లో 26 నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువ నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం -
5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 5న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(మెగా పీటీఎం) కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పీటీఎం విజయవంతానికి 13 కమిటీలను నియమించామన్నారు. సమావేశాల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై చర్చ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ శ్యామూల్పాల్ పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతుకు నిధులు జిల్లాలో పాడైన రహదారుల మరమ్మతుకు రూ.105.66 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 222.18 కిలోమీటర్ల పొడవుకు సంబంధించి 30 రోడ్లలో మరమ్మతులు చేపడతారని పేర్కొన్నారు. -
భూములు కొట్టేసేందుకే హైకోర్టు బెంచ్ డ్రామా
కర్నూలు(టౌన్): ఎకరా రూ.70 కోట్లు విలువ చేసే నగర నడిబొడ్డున ఉన్న ఏబీసీ క్వార్టర్స్ భూములపై టీడీపీ నేతల కన్ను పడింది.. వాటిని కొట్టేసేందుకే హైకోర్టు బెంచ్ను తెరపైకి తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఏ, బీ, సీ క్వార్టర్లలో నివసిస్తున్న రిటైర్డు ఉద్యోగులు, చిరుద్యోగులను ఈ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. రాత్రికి రాత్రి ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్కు సంబంధించి ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ హైకోర్టు బెంచ్ వస్తే ఏ, బీ, సీ, క్వార్టర్ల సందుల్లో ఎలా పెడతారన్నారు. ఊరి బయట పెడితే అభివృద్ధికి అస్కారం ఉంటుందన్నారు. హైకోర్టు నిర్మాణం విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాజధాని పేరుతో రూ.77 వేల కోట్లు అప్పు చేసి లక్ష ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడం అవసరమా? అన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేసే అప్పులకు ఏడాదికి వడ్డీ రూ.20 వేల కోట్లు ప్రజలపై భారం వేయడమేనన్నారు. సొంత వాళ్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా దిశగా అడుగులు వేయిస్తున్నాడన్నారు. విజయవాడలో, విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూ ములను కార్పొరేట్ వ్యక్తులకు పప్పులు బెల్లాలుగా కట్టబెడుతున్నారన్నారు. వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడంలో చంద్రబాబు సర్కార్ వెనుకడుగు వేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేటర్లు జుబేర్, క్రిష్ణకాంత్ రెడ్డి, పార్టీ నేతలు షరీఫ్, రాఘవేంద్ర నాయుడు, ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, నాగేష్ నాయుడు, కిషన్, ఫిరోజ్ పాల్గొన్నారు. -
ప్రాణం పోసిన ప్రభుత్వాసుపత్రి
కర్నూలు(హాస్పిటల్): అతను మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. తమిళనాడులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి 11 సార్లు వెళ్లివచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ సూచనతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. వైద్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్చుకుని అన్ని రకాల పరీక్షలు చేసి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన ఓబులపతి(44) పాస్టర్గా జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆసుపత్రులతో పాటు తెలిసిన వారు చెప్పడంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి సైతం 11 సార్లు వెళ్లివచ్చాడు. అక్కడి వైద్యులు సైతం అతనికి అన్ని రకాల పరీక్షలు చేసి సమస్యను పరిష్కరించలేకపోయారు. దీంతో అతనికి సన్నిహితుడైన కర్నూలు జిల్లా డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి సూచన మేరకు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. మూడు నెలల క్రితం జనరల్ సర్జరీ వార్డులో అడ్మిట్ అయ్యాడు. ఆరవ యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ అతన్ని పరీక్షించి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేశాడు. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించి లాపరెక్టమి ఆపరేషన్ చేశారు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఓబులపతి ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పది కిలోల బరువు పెరిగాడు. ఈ ఆనందాన్ని తనకు ప్రాణభిక్ష పెట్టిన వైద్యులతో పంచుకోవాలని శనివారం జనరల్ సర్జరీ ఓపీకి వచ్చాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ జయరామ్తో పాటు డాక్టర్ దీప్తి, డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ మహబూబ్బాషా, డాక్టర్ అరుణ్, డాక్టర్ శ్రీధర్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపాడు. -
కొండ చరియల ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం ప్రాంతంలో వర్షాకాల సీజన్లో తరచూ కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వర్షాలకు కొండకు ఉన్న మట్టి కొట్టుకుపోయి, పటుత్వం లేక పెద్దపెద్ద కొండరాళ్లు రోడ్లపై పడుతున్నా యి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. కాని రోడ్లపై రాళ్లు పడడం వలన ట్రాఫిక్కు తరచూ తీవ్ర అంతరాయాలు ఏర్ప డుతున్నాయి. కొండచరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు శనివారం పరిశీలన చేశారు. కొండలకు షార్ట్క్రీటింగ్ చేసి ఇనుప మెస్ను ఏర్పాటు చేయాలని అధి కారులు నిర్ధారణకు వచ్చారు. డ్యాం పైభాగం నుంచి లింగాలగట్టు వరకు కొండప్రాంతాలను పరిశీలించారు. పరిశీలనలో ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ చంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరమేశు ఉన్నారు. బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 29 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 94 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం పరీక్షలకు 519 మందికి గాను 490 మంది హాజరు కాగా 29 విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. పన్ను చెల్లించని రెండు స్కూల్ బస్సులు సీజ్ 116 బస్సులకు నోటీసులు కర్నూలు: విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరఢా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా బడి బస్సులు తిప్పుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంత కుమారి ఆదేశాల మేరకు జిల్లాలో రవాణా శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి విద్యాసంస్థల బస్సులను తనిఖీ నిర్వహిస్తున్నారు. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్స్, విద్యార్థులు ఎక్కి దిగేందుకు అనుగుణంగా ద్వారాలు ఉన్నాయా లేదా పరిశీలించారు. అలాగే బస్సుల సామర్థ్యత (ఫిట్నెస్), హెడ్ లైట్స్, సైడ్ మిర్రర్స్, కిటికీల్లో నుంచి చేతులు బయట పెట్టకుండా ఉండేందుకు గ్రిల్ ఏర్పాటు చేశారా లేదా తదితరాలను తనిఖీ చేశారు. జిల్లాలో 350కి పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు రోజులుగా 190 బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 116 బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అలాగే పన్ను చెల్లించకుండా (ట్యాక్స్) తిప్పుతున్న రెండు బస్సులను సీజ్ చేశారు. డిసెంబర్ 4వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయని డీటీసీ శాంత కుమారి తెలిపారు. -
కప్పం కట్టాల్సిందే!
సాక్షి టాస్క్ఫోర్స్: ఆంగ్లేయుల పాలనలో ప్రజలతో కప్పం కట్టించుకునే ఆచారం నేడు చంద్రబాబు సర్కార్ పాలనలో సాగుతోంది. ఇసుక ఉచితం అని చెప్పినా టీడీపీ నాయకులకు కప్పం కట్టి తీసుకెళ్లాల్సి వస్తోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న హొళగుంద మండలంలో వేదావతి నదిని టీడీపీ నాయకులు లూటీ చేస్తున్నారు. ‘ఇసుక ఉచితం’ అనే చంద్రబాబు ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరులు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు, మండల స్థాయి నాయకులు, పోలీసుల అండదండలతో నది పరిసరాల్లో వసూళ్ల పర్వాన్ని మొదలెట్టారు. నిర్మాణాలు, ఇతర పనులకు ఇసుకు కావాలంటే ఎలాంటి చలానా ఇవ్వకుండా ప్రతి ట్రిప్పుకు రూ.500 చెల్లించాల్సిందే. కాదు కూడదు అంటే పోలీసులు వచ్చి ట్రాక్టరును స్టేషన్కి తరలిస్తారు. ఇలా రోజుకు వందకు పైగా ట్రిప్పులు నది నుంచి బయటకెళ్తున్నాయి. ఈ లెక్కన ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే రోజుకు రూ.50 వేలకు పైగానే జేబులు నింపుకుంటున్నారు. దీన్ని తలా ఇంత పంచుకుంటున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. నదిలో వరద నీరు ప్రవహిస్తున్నా అందులోనే ఇసుకను తవ్విస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా ట్రిప్పుకు రూ.500 ఇస్తూ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నదిలో నీరు పారుతున్నా అందులోనే ఇసుకను తోడి ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. మైన్స్ అండ్ జియాలజిస్ట్, స్థానిక రెవెన్యు అధికారుల అనుమతి లేకుండా భారీ ఎత్తున ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దందాను అరికట్టాల్సిన స్థానిక పోలీసులు, అధికారులు మామూళ్లతో మిన్నకుండి పోతున్నట్లు ఆ ప్రాంత ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలోని ఇసుకను చుట్టు పక్కల గ్రామాల వారు తీసుకెళ్తే ఎలాంటి కొరత ఉండదు. అయితే వ్యాపారం చేసుకునేందుకు భారీ ఎత్తున ట్రాక్టర్లతో పట్టణాలకు తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్లో టీడీపీ నాయకులు మద్యం, ఇసుక దేన్నీ వదలడం లేదు. మార్లమడికి వద్ద ఉన్న వేదావతి నది నుంచి టీడీపీ ఇన్చార్జ్ వర్గీయులు ట్రాక్టర్కు రూ.500 తీసుకుని ఇసుక దందా నడిపిస్తున్నారు. అది ఇవ్వని వారి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకు ముందు పోలీసులు టీడీపీ వాళ్ల ట్రాక్టర్లకు మాత్రమే ఇసుకు దొచుకునేందుకు అవకాశమిచ్చి ఇతరుల ట్రాక్టర్లను సీజ్ చేసే వారు. ఇప్పుడు ఏకంగా డబ్బులు వసూలు చేసుకుని తలా ఇంత పంచుకుంటున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు అడగంటాయి. రోడ్లు దెబ్బతింటాయి. ఈ దందాను అడ్డుకుంటాం. జిల్లా కలెక్టర్, మైన్స్, సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలి. – బుసినె విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే టీడీపీ నాయకుల ఇసుక దందా డబ్బులు ఇస్తే రైట్.. లేదంటే నో! ఉచితం పేరిట వేదావతిని ఖాళీ చేస్తున్న ఇసుక మాఫియా పట్టించుకోని అధికారులు -
మంత్రి ఇలాఖాలోనే అధ్వానంగా రోడ్ల నిర్మాణం
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): సాక్షాత్తు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలో రోడ్ల నిర్మా ణ పనులు చాలా అధ్వానంగా సాగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల నుంచి పెట్ని కోట వరకు (5 కిలోమీటర్లు) రూ.2 కోట్ల వ్యయంతో వేసిన రోడ్డు నెల రోజులకే పాడై పోయిందని, తిరిగి వెంటనే ఈ రోడ్డుపై ప్యాచ్ వర్కులు చేశారంటే, ఎంత నాణ్యతతో ఈ రోడ్డు వేశారో అర్థమవుతోందన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆర్అండ్బీ శాఖపై జరిగిన సమీక్షలో జిల్లాలోని పలు రోడ్ల పరిస్థితిపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నందికొట్కూరు–పగిడ్యాల, గార్గేయపురం–మిడ్తూరు రోడ్లు చాలా అధ్వానంగా తయ్యారయ్యాయని జూపాడుబంగ్లా, మిడ్తూరు జెడ్పీటీసీలు పి.జగదీశ్వరరెడ్డి, పి.యుగంధర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు పెరిగిపోయాయయని, కనీసం ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదన్నారు. జిల్లా పరిషత్కు బకాయిపడిన స్టాంప్ డ్యూటీని వెంటనే వసూలు చేస్తే జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి సీఈఓను ఆదేశించారు. టీడీపీ కార్యాలయంగా మారుతున్న టీబీపీ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం కోడుమూరులోని తుంగభద్ర ప్రాజెక్టు సబ్ డివిజన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని కోడుమూరు జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి టీబీపీ కార్యాలయాన్ని లీజుకు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ కార్యాలయానికి పచ్చ రంగులు వేస్తున్నారన్నారు. అయితే సమాధానం ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడం పట్ల జెడ్పీటీసీ అసహనం వ్యక్తం చేశారు. అక్రమంగా తరలుతున్న మట్టి నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల పరిధిలోని కుందూ నది విస్తరణ పనుల్లో తీసివేసిన మట్టిని కొందరు అక్రమంగా 167కే జాతీయ రహదారి (జమ్మలమడుగు – నంద్యాల ) పనులకు తరలిస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. నదిలో తీసిన మట్టిని జాతీయ రహదారులకు వినియోగిస్తే ఆయా రహదారులు ఎంత మాత్రం నాణ్యతగా ఉంటాయో అధికారులే సమాధానం చెప్పాలన్నారు. ఎవరు తరలిస్తున్నారు ? ఎంత తరలించారనే సమాచారం మీ వద్ద ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు జలమార్గంపై ఆలోచించండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు జలమార్గం ఏర్పాటు చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు ఆలోచించాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కోరారు. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఒక్కో సందర్భంలో తీవ్ర ట్రాఫిక్ వల్ల దోర్నాల నుంచి శ్రీశైలం చేరేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంన్నారు. ఈ నేపథ్యంలో జలమార్గాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలన్నారు. సమావేశాల్లో ఎవరేమన్నారంటే.. ● వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చారు కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి బీమా సౌకర్యం కల్పించారు. – ఎస్.సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ కొత్తపల్లి ● కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారో చెప్పండి, అలాగే వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపరచండి. – డి.సుంకన్న జెడ్పీటీసీ, వెల్దుర్తి ● కుంకనూరు గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. సోలార్ కనెక్షన్లు తీసుకునేందుకు బ్యాంకర్ల సహకారం లేదు. – వి.రామక్రిష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ ● హోమియోపతి ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. – షేక్ కరీమున్పీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరుప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు తీర్మానం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా వైద్య సేవలు అందాలని, అలాగే ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా, ప్రైవేటు పరం చేయాలని చూడడం దారుణమని జల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దళితులమని రైతులుగా గుర్తించరా?
● ఏఓ, టీడీపీ నాయకులను నిలదీసిన మహిళా రైతులు వెల్దుర్తి: ‘ల్యాండ్ సీలింగ్ ద్వారా డీ పట్టాలు పొంది పొలాలు సాగు చేసుకుంటున్నాం.. తాము దళితులమని రైతులుగా గుర్తించరా.. అన్నదాత సుఖీభవ పథకం ఎందుకు వర్తింపజేయరు’ అంటూ వెల్దుర్తి 7వ వార్డు దళిత మహిళలు మూకుమ్మడిగా వ్యవసాయాధికారులు, టీడీపీ నాయకులను నిలదీశారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వెల్దుర్తి ముల్లగేరిలో శనివారం నిర్వహించారు. వ్యవసాయాధికారి (ఏఓ) అక్బర్బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు బలరాంగౌడ్, వీఆర్ఓలు హాజరుకాగా వీరిని దళిత మహిళా రైతులు సోమక్క, లక్ష్మీదేవి, ఎల్లమ్మ, సుంకులమ్మ, ఈశ్వరమ్మ తదితరులు నిలదీశారు. తాము వందల ఏళ్ల నుంచి పొలం సాగు చేసుకుంటున్నామని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలంటూ వీఆర్ఓలను ఏఓ అక్బర్బాషా ఆదేశించారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. పట్టణంలోని ఎంఎస్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి స్కూల్, గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17, 19 గట్కా పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, ఎంఈఓ ఆంజినేయులు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగమణి, కృష్ణ, విశ్వనాథ్, ఆశాజ్యోతి, పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు పాతబస్తీలోని ఛత్రీబాగ్ వీధిలో నివాసముంటున్న శాలిబాషా (39) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. ఈయన బీరువాల తయారీ పని చేస్తుంటాడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు సంతానం. శుక్రవారం ఉదయం పనికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్డుపై అపస్మారక స్థితిలో పడివుండగా తెలిసిన వ్యక్తులు గుర్తించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల తలకు, కుడి కాలికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక రాత్రి మృతి చెందాడు. భార్య జహీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా
● ఇద్దరికి స్వల్ప గాయాలు ● వేగం తక్కువగా ఉండటంతో అందరూ క్షేమం తుగ్గలి: అదుపుతప్పి కర్ణాటక ఆర్టీసీ బస్సు తుగ్గలి సమీపంలో బోల్తా పడింది. శనివారం కర్ణాటక ఆర్టీసీ బస్సు(కెఎ 40ఎఫ్ 0834) బెంగళూరు నుంచి మంత్రాలయం బయలుదేరింది. తుగ్గలిలో రైల్వే బ్రిడ్జి కింద ఓ లారీ మరమ్మత్తులకు గురి కావడంతో రైల్వే స్టేషన్ రోడ్డు గుండా వెళ్లింది. మార్గమధ్యలో అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తాపడింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సింగిల్ రోడ్డు కావడంతో బస్సు వేగం తక్కువగా ఉండటం, బోల్తా పడిన ప్రదేశంలో రోడ్డు పక్కన చెట్లు ఉండడంతో పెద్ద ముప్పు తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టీరింగ్ ఉన్న పైపు విడిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్ఐ బాలనరసింహులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై సీఐ ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
విధిరాత.. మృత్యుగీత
(ఇన్సెట్) ఎయిర్ బెలూన్ తెరుచుకోకపోవడంతో మృతి చెందిన సతీష్కుమార్, చిన్నారి బనిత్గౌడ్ మరో గంటలో దేవుడి సన్నిధి చేరి వివాహ వేడుకను నిర్వహించుకోవాల్సిన దంపతులతోపాటు వారి కుమారుడు, మరో ఇద్దరి కుటుంబీకులను మృత్యువు పొట్టన పెట్టుకుంది. పెళ్లి రోజే ఆ దంపతులకు చివరి రోజయ్యింది. పొగ మంచు మాటున మృత్యువు మాటు వేసి ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటేకల్ గ్రామం కొండ మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. రెండు కార్లు ఢీకొన్న సంఘటన స్థలంలో దృశ్యాలు ప్రజలను కలిచివేశాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటంతో చూసిన వారందరూ అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కారు ముందు సీట్లో ఉన్న సతీ్ష్ కుమార్, అతని ఒడిలో ఉన్న బావ కుమారుడు బనీత్ విగతజీవులుగా ప్రాణాలు విడిచారు. వెనుక సీటులో ఉన్న సతీష్ కుమార్ భార్య మీనాక్షి, నాలుగేళ్ల కుమారుడు రుత్విక్, మీనాక్షి తండ్రి వెంకటేషప్ప తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆసుపత్రిలోని మార్చురీ వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. – ఎమ్మిగనూరు రూరల్ -
భూ వివాదంలో వ్యక్తిపై దాడి
కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ఆవరణలో భూ వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని భూపాల్ నగర్కు చెందిన రవి శంకర్ గౌడు, మిలటరీ కాలనీకి చెందిన గోపాల్, మరో ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా రుద్రవరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 608హెచ్ అసైన్డ్ భూమి వివాదం నెలకొంది. ఈ వివాదంలో పరస్పర ఫిర్యాదులతో ఇరువురుకి తహసీల్దార్ రమేష్ బాబు నోటీసులు ఇచ్చి శుక్రవారం తుది విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు వారు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో గురునాథ్, గోపాల్, మరి కొంత మంది తనపై రాడ్లతో దాడి చేశారని రవి శంకర్ గౌడు తలకు తీవ్ర గాయంతోనే తహసీల్దార్ ఆఫీస్లోకి వచ్చాడు. గమనించిన తహసీల్దారు 2వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రవి శంకర్ గౌడును చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో విచారణ 608హెచ్ అనే సర్వే నెంబరులో సుమారు 360 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు, మరి కొంత మందికి 2002లో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. ఇందులో భాగంగా గోపాల్కు 2.50 ఎకరాలు, రవిశంకర్ గౌడుకు 3.50 ఎకరాలకు డీ పట్టాలు ఇచ్చారు. ఈ భూములకు సమీపంలోనే చైన్నె–సూరత్ హైవే రావడంతో డిమాండ్ పెరిగింది. గోపాల్, రవిశంకర్ గౌడుల భూములు పక్కపక్కనే ఉన్నాయి. తన భూమిలో నుంచి 87 సెంట్ల భూమి ఆక్రమించారని గోపాల్, పౌలన్న, హూసేనమ్మలపై రవి శంకర్ గౌడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దారు విచారణ చేపట్టగా గోపాల్.. రవిశంకర్ గౌడుపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఫిర్యా దులు ఫైనల్ హియరింగ్ శుక్రవారం ఉండగా.. ఈ దాడి చోటు చేసుకుంది. ఆ తరువాత తహసీల్దారు రమేష్ బాబు ఘటనకు కారణమైన భూవివాదం, పరస్పర ఫిర్యాదులపై మీడియాకు వివరించారు. -
శ్రీమఠం పీఠాధిపతికి డాక్టరేట్
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువైన శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులకు మైలేస్ లీడర్షిప్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. శనివారం శ్రీమఠం ప్రాంగణంలోని యోగీంద్ర కళామండపంలో ఆఫ్రికా దేశానికి చెందిన మైలేస్ లీడర్షిప్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.రవి ఆచార్య పీఠాధిపతికి గౌరవ డాక్టరేట్ను అందజేశారు. పీఠాధిపతి గతంలో గుల్బార్గా యూనివర్సిటీ, బళ్లారి యూనివర్సిటీల నుంచి కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి శ్రీమఠం అధికారులు పూలమాలు సమర్పించి పుష్పవృష్టి కురిపించారు. కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.శ్రీధర్ రావు, ఫార్మర్ వైస్ చాన్సలర్ వీఆర్ పంచముఖి, మహోపాధ్యాయ డాక్టర్ హరిదాస భహత్, హాసన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ టిసి తార్నత్, లీడర్షిప్ యూనివర్సిటీ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ ఎంపీడీఓలుగా 25 మందికి పోస్టింగ్స్ కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, గ్రేడ్ –1 పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించిందని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పదోన్నతి లభించిన వారిని జిల్లాలోని 25 మండలాలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వారిని ఆయా మండలాలకు కేటాయిస్తూ పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పోస్టింగ్స్ కీలకపాత్ర పోషిస్తాయన్నారు. డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారందరూ ప్రభుత్వ సేవలను సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని సీఈఓ కోరారు. జీజీహెచ్ బ్లడ్బ్యాంకుకు రాష్ట్రంలో మొదటి స్థానం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్బ్యాంకు అందించిన సేవలకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. ఈ బ్లడ్బ్యాంకు రాష్ట్రంలోనే అత్యధికంగా 11,531 యూనిట్ల రక్తసేకరణ చేసినందుకు ఉత్తమ సేవ అవార్డుకు ఎంపికై ంది. డిసెంబర్ ఒకటో తేదిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవా ర్డు అందించనున్నారు. పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, బ్లడ్బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రంగస్వామిలను కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ కె.చిట్టినరసమ్మ, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. -
13న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కా రం అయ్యేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూ చించారు.ఆ సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా న్యాయమూర్తులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్పై సమీక్షించారు. కోర్టులలో పెండింగ్ ఉన్న సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రతి రోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
30 ఎకరాలకు 600 బస్తాలే
4 ఎకరాలు సొంతంగా, 26 ఎకరాల భూమిని ఎకరాకు 14 బస్తాల ప్రకారం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాం. దాదాపు రూ.9 లక్షలకు పెట్టుబడులకే అయ్యింది. ఎకరాకు 40 లేదా కనిష్టంగా 35 బస్తాలు పండినా 30 ఎకరాలకు వెయ్యి నుంచి 1,200 బస్తాల దిగుబడి రావాలి. అయితే 600 బస్తాలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన 500 బస్తాల వరకు నష్టపోయినట్లయింది. ఎల్లెల్సీ కింద ఈ ఏడాది ఒక్క కారుకు మాత్రమే సాగు నీరిచ్చారు. అప్పులు ఎలా తీర్చాలో పాలుపోవడం లేదు. – పింజరి ఆలంబాషా, రైతు రైతులు పండించిన ధాన్యానికి రూ.3 వేల మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎల్లెల్సీ కింద ఈ ఏడాది ఒక్క కారుకు మాత్రమే సాగు నీరిచ్చారు. చాలా మంది రైతులకు దిగుబడి అంతంతమాత్రమే ఉంది. తెగుళ్లతో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 25 బస్తాల దిగుబడి కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – సిందువాళ కృష్ణయ్య, రైతు, హొళగుంద -
కొల్మాన్ పేటలో అంటరానితనం!
● దళిత డీలర్ రేషన్ షాపునకు తాళం ● టీడీపీ నాయకుల దురాచారంకోసిగి: వివిధ హోదాల్లో ఉన్న దళితులను టీడీపీ నాయకులు దూరంగా ఉంచుతున్నారు. కోసిగి మండలం కొల్మాన్పేట గ్రామంలో దళిత డీలర్ రేషన్ షాపునకు తాళం వేసి అంటరానితనం అనే దురాచారాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఈనెల 26 నుంచి 30 వతేదీ లోగా గ్రామంలో 20 మంది వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషషన్ బియ్య పంపిణీ చేయాలి. డీలర్ మారెప్ప రెండు రోజులుగా గ్రామంలోని ఏడుగురుకి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యం అందించాడు. గురువారం సాయంత్రం రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మదిరి లక్ష్మయ్య, కామలదొడ్డి ఉసేని అనే వ్యక్తులు షాపుకు తాళం వేశారు. దీంతో వృద్ధులకు బియ్యం పంపిణీ నిలిచిపోయింది. చిన్నచూపు చూస్తున్నారు... డీలర్ మారెప్ప మాట్లాడుతూ.. తాను 17 ఏళ్లుగా డీలర్గా ఉన్నానని, దళితుడని టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. తనను డీలర్ పోస్టు నుంచి తొలగించాలని నానా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. అధికారులతో కుమ్మకై మూడు సార్లు తనను సస్పెండ్ చేయించానన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యం వేయమని తనకు అనుమతి ఇచ్చారన్నారు. తనను డీలర్ పోస్టు నుంచి తప్పించాలని కుట్ర పన్నుతూ రేషన్ షాపునకు తాళం వేశారన్నారు. ఈవిషయంపై తహసీల్దార్ వేణుగోపాల్ను వివరణ కోరగా.. రెగ్యులర్ డీలర్గా మారెప్పకు అనుమతులు ఉన్నాయన్నారు. గ్రామ వీఆర్వోతో తాళం తీయించి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
అల్లుడి వేధింపులే కారణం
● అనంతరంపురం ఘటనలో అమూల్య తల్లిదండ్రుల ఆవేదన వెల్దుర్తి: తమ కుమార్తె మరణానికి అల్లుడి వేధింపులే కారణమని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతపురం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తూ గురువారం ఇంట్లోనే మూడేళ్ల కుమారుడిని గొంతుకోసి, మహిళ ఉరేసుకున్న ఘటన తెలిసిందే. కలకలం రేపిన ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన అమూల్య(30) తండ్రి రామలక్ష్మయ్య నంద్యాల జిల్లా డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి కర్నూలు జిల్లా వెల్దుర్తి వాసి కాగా.. రిటైర్ట్ టీచర్ కేశన్న కుమార్తె. అమూల్య తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కర్నూలులో నివాసముంటూ వెల్దుర్తిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దీంతో అమూల్య, ఆమె మూడున్నరేళ్ల కుమారుడు సహర్స్ల మృతదేహాలను అనంతపురంలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం రాత్రి వెల్దుర్తి పట్టణంలోని బోయ వీధికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమూల్య తల్లిదండ్రులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారానికి చెందిన బండమీది రవితో ఐదేళ్ల క్రితం కర్నూలు పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసుకున్న తమ కుమార్తె అమూల్యను ఇచ్చి వివాహం చేశామన్నారు. అల్లుడు సత్యసాయి జిల్లా రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్ కాగా.. ప్రస్తుతం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. తమ కుమార్తె ఆత్మహత్య పట్ల అల్లుడు వరకట్నం తేవాలంటూ, ఇతరత్రా వేధింపులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయం అనంతపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. తమ కుమారుడు, అమూల్య సోదరుడు ప్రశాంత్ యూఎస్ చికాగోలో ఉంటున్నాడని, విషయం తెలిసి బయలుదేరాడన్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. -
రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మార్కెట్ కమిటీ అధికారులను ఆదేశించారు. రైతులు మార్కెట్కు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించే విధంగా చూడాలన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని డైనింగ్ హాల్, వాష్రూమ్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సదర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తితో మార్కెట్ యార్డు స్థితిగతులపై చర్చించారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రోజు వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను, ఇతర చెత్త చెదారాన్ని తొలగించాలన్నారు. -
టీడీపీ నాయకుల ‘పైసా’చికం
● రైతులు భూములు ఇచ్చినా డబ్బు ఇవ్వాలని బెదిరింపులు ఆలూరు: సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రైతులు భూములు ఇచ్చినా డబ్బులు ఇస్తేకాని రిజిస్ట్రేషన్ చేయించబోమని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. భూసేకరణ చేసిన వారిపై దాడికి యత్నించారు. ఆలూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నాయకులు హల్చల్ చేశారు. ఆలూరు నియోజకవర్గంలో విండ్పవర్, సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడానికి కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వారి అనుచరులు, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుని రైతుల వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కొనుగోలు చేశారు. ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామానికి చెందిన 280 ఎకరాలను భూసేకరణ చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఆలూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నాయకలు రాజశేఖర్, షేక్షావలి, ఈరన్న, గౌడు తదితరులు అక్కడి వచ్చి మామూళ్లు ఇచ్చేవరకు రైతులు ఇచ్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయనిచ్చేది లేదని బెదిరించారు. కాంట్రాక్టు ఉద్యోగులనుపై దాడికి యత్నించారు. టీడీపీ నాయకుల దూషణలను చూసి పలువురు నెవ్వరుపోయారు. ఈ విషయంపై సబ్రిజిస్టార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. కార్యాలయ ఆవరణలో జరిగిన విషయం గురించి తనకు తెలియదన్నారు. -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ఎమ్మిగనూరురూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన రామకృష్ణ (57) పత్తిని విక్రయించేందుకు ఎమ్మిగనూరు వచ్చాడు. యార్డు సమీపంలో రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లారీ దగ్ధం పెద్దకడబూరు: హులికనుమ గ్రామ బస్టాండ్ సమీపంలో లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం తాండూరు నుంచి కేరళకు నాపరాతి లారీ లోడ్ పెద్దకడబూరు మండలంలోని హులికనుమ గ్రామ బస్టాండ్ సమీపంలో వెళ్తుండగా లారీ ఇంజన్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని నిలిపి కిందకు దిగిపోయాడు. మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. లారీ డ్రైవర్ కేకలు వేయగా పక్కన ఉన్న హులికనుమ గ్రామస్తులు అక్కడికి చేరు కుని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజ్ చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో లారీ ఇంజిన్ పూర్తి కాలిపోయింది. -
ఆదోని జిల్లాను తక్షణమే ప్రకటించాలి
● జిల్లా సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం ● ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయాలి ● జేఏసీ దీక్షలో వైఎస్సార్సీపీ నేతలు ఆదోని టౌన్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆంధ్రా ముంబాయిగా పేరుగాంచిన ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా సాధన కోసం స్థానిక భీమాస్ సర్కిల్లో ఆదోని జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదినారాయణరెడ్డి, గిరిరాజుల నేతృత్వంలో చేపట్టిన దీక్షకు శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ మధుసూదన్తో కలిసి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ రాజీవ్రెడ్డి, సీనియర్ నాయకులు జగన్మోహన్రెడ్డి సందర్శించారు. దీక్ష లో కూర్చొన్న వారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యా లు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు వందలాది మంది రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేశారు. భీమాస్ సర్కిల్ మీదుగా పాత బస్టాండు సర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్లి తిరిగి భీమాస్ సర్కి ల్ చేరుకుని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీక్షలో వినోద్రెడ్డి, నాగరాజ్, గిరిరాజు, రామలింగయ్య, శ్రీనివాసులు, సూర్యప్రకాష్, సుబ్రహ్మణ్యం, మురళీమోహన్, పాండు, శోభాలత, జయలక్ష్మి, హనుమంతు, హనుమంతరెడ్డి, రజాక్అహ్మద్, నాగరాజ్, సజ్జద్, పరమేష్, మల్లికప్ప, గిడ్డయ్య, వీరేష్ పాల్గొన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు ప్రణాళికలు
పాణ్యం: రైతులు ఆదాయం రెట్టింపునకు తగిన ప్రణాళికలు రూపొందించాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ శుక్రవారం పాణ్యంలో ఏపీఎంలతో సమావేశం నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన పీడీ మాట్లాడుతూ.. జిల్లాలో రైతు ఉత్పిత్తిదారుల సంస్థలను బలోపేతం చేస్తూ అదే విధంగా ప్రణాళికలు రూపొదించాలన్నారు. ఇందుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర మాట్లడుతూ రైతు ఉత్పిత్తిదారుల సంఘాలు ప్రభు త్వ రాయితీలను ఉపయోగించుకోవాలన్నారు. ఉద్యావనశాఖ అధికారి నాగ రాజు మాట్లాడుతూ.. రైతు సంఘంలో ఉన్నటువంటి ప్రతి రైతు పండ్లు, పూలు తోటలు సాగు చేసే వారికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందన్నారు. నాబార్డు ఏజీఎం కార్తీక్, జిల్లా జాయింట్ వ్యవసాయ అధికారి వెంటకేశ్వర్లు మాట్లాడుతూ ఉత్పత్తిదారుల సంస్థలో ఉండే రైతులకు నాబార్డు నుంచి సహకారం అందుతుందన్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని పశుసంవర్దకశాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో హీఫర్ సంస్థ ప్రతినిధులు రవికాంత్, జిల్లా డీపీఎం నాయక్, ఎఫ్పీఓ డీపీఎం సురేష్, మరియు 12 మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, సీసీలు, ఐఎఫ్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
తడకనపల్లి పశువుల హాస్టల్పై అధ్యయనం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం రాష్ట్రంలో పశువుల హాస్టళ్ల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉందని ఎన్ఆర్ఈజీఎస్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపిచంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో ఉన్న పశువుల వసతి గృహాన్ని సందర్శించారు. పశువుల హాస్టల్ నిర్వహణ, పశువుల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు జిల్లాలోనే పశువుల హాస్టల్ ఏర్పాటైందని, ఇదే తరహాలో రాష్ట్రంలో మరిన్ని పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తడకనపల్లిలోని పశువుల హాస్టల్ నిర్వహణను అధ్యయనం చేసి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కు నివేదిక ఇస్తామన్నారు. పశువుల హాస్టల్కు సంబంధించిన అన్ని విషయాలను నిర్వాహకురాలు జుబేదా చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మిత్రమా.. మేమున్నాం!
ఓ మిత్రుడు ఈ లోకం నుంచి దూరమైనా .. అతని కుటుంబానికి అండగా నిలిచి.. ‘మిత్రమా.. మేమున్నాం’ అంటున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం చదువులమ్మ ఒడిలో కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్కు చెందిన ఉమర్(46) కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో, ఆయన భార్య తస్లీమా నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో వారి కుమారుడు జిలానీ, కుమార్తె రెహానా అనాథలయ్యారు. ఉమర్ మిత్రులైన శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995 పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు నాగేశ్వరరావు, రాము, శంకర్, శేఖర్, సుబ్బారావు తదితరులు అండగా నిలిచారు. రెహానా పెళ్లి ఖర్చుల కోసం రూ. 2 లక్షలు పోస్టాఫీసులో డిపాజిట్ చేసి, ఆ బాండ్ను శుక్రవారం జిలానీకి అందజేశారు. ఔదార్యం చాటిన మిత్రులను పలువురు అభినందించారు. – శ్రీశైలంప్రాజెక్ట్ -
చెంచులకు మెరుగైన వైద్యం అందించాలి
కొత్తపల్లి: చెంచు గిరిజన గూడేల్లోని చెంచులకు మెరుగైన వైద్యం అందించాలని, క్యాన్సర్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సంచార చికిత్స ప్రోగ్రాం జిల్లా నోడల్ ఆఫీసర్ జగదీష్ చంద్రా రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న శివపురం చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన సంచార చికిత్స వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెంచులకు తరతరాల నుంచి వస్తున్న అలవాట్లను మాన్పించేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్సిడిసి, డి 4.0 సర్వేలో హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, క్యాన్సర్పై క్షుణ్ణంగా సర్వే చేయాలని ఆదేశించారు. అలాగే లెప్రసీ అనుమానిత కేసులను పరిశీలించాలన్నారు. వైద్యాధికారి హకీమ్ రషీద్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
రైతులను ఇంకెప్పుడు ఆదుకుంటారు?
● ఉల్లి రైతులకు పైసా ఇవ్వలేదు ● మండల మీట్లో అధికారులపై ప్రజా ప్రతినిధులు మండిపాటు పత్తికొండ: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఇంకెప్పుడు ఆదుకుంటారు.. అంటూ వైఎస్సార్సీపీ హోసూరు ఎంపీటీసీ నెట్టేకల్, చిన్నహుల్తి, పెద్దహుల్తి సర్పంచ్లు కేశవరెడ్డి, విజయలక్ష్మి సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీశారు. శుక్రవారం పత్తికొండ మండల పరిషత్ సమావేశం హాల్లో ఎంపీపీ నారాయణ్దాస్ ఆధ్యక్షతన మండల మీట్ జరిగింది. ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎంపీడీఓ కవిత, తహసీల్దార్ హుశేన్సాహెబ్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు జాబితా రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టమాట రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి పంటకు మార్కెట్లో ధర లేకపోవడంతో కొందరు పొలంలోనే వదిలేశారని, మరి కొందరు దున్నేశారన్నారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ప్రభుత్వం ఇస్తామని మాట చెప్పి రెండు నెలలు గడుస్తున్నా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఖరీఫ్లో రైతులు సాగు చేసిన అన్ని పంటలు పూర్తిగా నష్టపోయినా అన్నదాతలు ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తుకుండా ముందు జాగ్రత్తగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నరసింహులు, వైస్ ఎంపీపీ బలరాముడు, ఎంపీటీసీ నీలకంఠ, సర్పంచ్ పూరి శ్రీరాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అదుపు తప్పినస్కూల్ బస్సు
నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల బాట వద్ద శుక్రవారం చెన్నకేశవస్వామి స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుంకేసుల గ్రామం నుంచి ఉదయం స్కూల్ బస్సులో విద్యార్థులు పాఠశాలకు బయల్దేరారు. మార్గమధ్యలో బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపు తప్పి బస్సు చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ఉన్న హర్షవర్థన్ అనే బాలుడికి చిన్న గాయమైంది. మిగతా విద్యార్థులందరూ క్షేమంగా బయట పడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటన స్థలం వద్ద చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లి, దండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. చెన్నకేశవ స్కూల్ యజమాన్యం కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి డోన్ టౌన్: పట్టణంలోని రైల్వే గేట్ల సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు పట్టణ పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడు యాచకుడని, గురువారం రాత్రి మద్యం మత్తులోనే మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆచూకీ వివరాలు తెలిస్తే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.రైలు నుంచి జారిపడి కర్ణాటక వాసి మృతి కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్ డౌన్ ట్రాక్లో ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి పడి కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంతకల్లు నుంచి రాయచూరు వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి కాలు జారి పట్టాలపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన రైల్వే గ్యాంగ్మెన్లు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అక్కడికి వెళ్లి పరిక్షించేలోగా అప్పటికే మృతి చెందాడు. ఆయన వద్ద గుంతకల్లు నుంచి పూణె వరకు ప్రయాణించేందుకు టికెట్, జేబులో మద్యం సీసా ఉన్నట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆధార్ కార్డు ఆధారంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అజయ్(44) గా గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనస్తాపంతో వ్యక్తి మృతి అవుకు(కొలిమిగుండ్ల): పట్టణంలోని గుర్రాలపేట వీధికి చెందిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గుర్రాల రామస్వామి(48) మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వస్తుండేవాడు. ఇలా తాగి వస్తే పిల్లలను ఎలా చదివించాలి అని భార్య కళావతి ప్రశ్నించింది. ఈ విషయంలో దంపతులిద్దరూ శుక్రవారం గొడవ పడ్డారు. తర్వాత భార్య పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనస్తాపానికి గురైన రామస్వామి క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. కొద్ది సేనటి తర్వాత కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రూ. పది వేలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు
● దినసరి కూలీగా మారిన వలంటీర్ ఈ యువకుడి పేరు బోయ ఉలుగప్ప. బీకాం, బీఎడ్ చదివాడు. ఇతను హొళగుందలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య పార్వతితో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. రెండెకరాల మెట్ట భూమి మాత్రమే ఉండి వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంభాన్ని పోషించుకునే వారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు గ్రామ వలంటీరుగా పని చేస్తూ నెలకు ఇచ్చే రూ.5 వేలుతో పాటు కుటుంబాన్ని పోషించేవాడు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబునాయుడుతో పాటు కూటమి నేతలు హామీలిచ్చి మరిచిపోయారు. నెలకు రూ.10 వేలు వస్తుందని ఆశతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలి వీధిన పడ్డారు. దీంతో అటు వలంటీర్గా దూరమై.. ఇటు నిరుద్యోగ భృతి అందక కుటుంబ పోషణ భారంగా మారడంతో దినసరి కూలీగా మారాల్సి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలో 122 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు 1,443 మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. వీరంతా సేవా కార్యక్రమాలకు దూరమై.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం కోల్పోయారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఎంతో మంది వీధిన పడ్డారు. – హొళగుంద -
ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు
ఆస్పరి: మండలంలోని కారుమంచి గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టిన ధార్మక, ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి కారుమంచి గ్రామస్తులకు ఆధ్మాత్మిక బోధనలు చేశారు. చివరి రోజు కుంకుమార్చన, గోపూజ, శోభాయాత్ర నగర సంకీర్తన నిర్వహించారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు పెద్ద రంగారెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి, గ్రామ పెద్దలు, టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు మురళిరెడ్డి, కౌలుట్లయ్య, రవిప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. మందుబాబులకు రూ. 1.30 లక్షల జరిమానా తుగ్గలి : మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయ స్థానం రూ.1.30 లక్షలు జరిమానా విధించింది. శుక్రవారం జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు..స్టేషన్ పరిధిలోని బెంగళూరు–ఆదోని రహదారిపై నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 13 మందిపై కేసు నమోదు చేసి పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి జ్యోత్స్నా దేవి రూ.10వేల చొప్పున 13 మందికి మొత్తం రూ.1.30 లక్షలు జరిమానా విధించారని ఎస్ఐ వివరించారు. జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం కర్నూలు కల్చరల్: కర్నూలు ఎన్సీసీ గ్రూప్ క్యాడెట్స్ తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో మంచి శిక్షణ పొంది జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ అన్నారు. శుక్రవారం కర్నూలు ఎన్సీసీ 28వ పటాలం వార్షిక పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కర్నూలు ఎన్సీసీ గ్రూప్ అఽధికారులు, శిక్షణ సిబ్బంది మంచి శిక్షణ ఇచ్చి క్యాడెట్లను ఉన్నతంగా తీర్చిదిద్ది దేశ భక్తిని పెంపొదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కర్నూలు గ్రూప్ ప్రధాన అధి కారి కల్నల్ అలోక్ త్రిపాఠి, పరిపాలన అధికారి శశికుమార్, సూపరింటెండెంట్ జి.కృపా సాగర్, తదితరులు పాల్గొన్నారు. -
సెల్ ఫోన్ల దొంగల అరెస్ట్
డోన్ టౌన్: సెల్ఫోన్లను అపహరించే ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిందితుల వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని జాతీయ రహదారి మ్యాక్స్4 వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 21 సెల్ ఫోన్లు గుర్తించి విచారణ చేపట్టారు. డోన్ పట్టణానికి చెందిన ఇద్దరు బాలులుహైదరాబాద్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫోన్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వాటిని వారి తండ్రులు రాంబాబు, ఎంకన్నకు అప్పగిస్తే విక్రయించేవారని తెలిసింది. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల విలువ సుమారు రూ.1.05 లక్షలు ఉంటుందన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో రూరల్ స్టేషన్ సీఐ సీఎం రాకేష్, ప్యాపిలి సీఐ వెంకట్రామిరెడ్డితో పాటు సబ్ డివిజన్ ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, మధుసూదన్, నాగార్జున, నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
● ఉపాధి కరువై.. ఊరు వదిలి
వాహనాల్లో బయలుదేరుతున్న వలస కూలీలు ఊర్లు ఖాళీ అవుతున్నా పాలకులు, అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఓ వైపు వ్యవసాయ పనులు లేక.. మరో వైపు ఉపాధి హామీ పనులు గిట్టుబాటు గాకా.. రైతులు, వ్యవసాయ కూలీలు మూటాముల్లె సర్దుకుని పనుల కోసం ఊరు వదులుతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఊర్లకు ఊళ్లు ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బడి మాన్పించి పిల్లలను సైతం తల్లిదండ్రులు వెంట తీసుకెళ్తున్నారు. శుక్రవారం కుప్పగల్లు నుంచి రెండు వలస బండ్లు కదిలాయి. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదని కూలీలు వెంకోబా, ఎం.వెంకటేష్, లక్ష్మన్న, వెంకటేష్, సుధాకర్, కుమార్, చిన్న వెంకటేష్, లక్ష్మయ్య, తిరుమల, చిన్నారెడ్డి, ఎర్రిస్వామి, గోవిందరాజులు తదితరులు తెలిపారు. దాదాపు 30 కుటుంబాలు కర్ణాటకలోని సైదాపూర్, షాపూర్, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు చెప్పారు. – ఆదోని రూరల్ -
కొండలు ఎక్కేసి.. క్షీర సాగరం ఈదేస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): పర్వతాలను అధిరోహించడంలో అతను దిట్ట... ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్ద పర్వతమైన కిలిమంజారోను అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. ఆ తర్వాత భారత దేశంలో అతి పెద్ద పర్వతమైన కాంచనగంగను అధిరోహించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది ప్రధాన లక్ష్యమైనప్పటికీ పదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో సాధ్యపడలేదు. పర్వతారోహణలో నేర్పరి అయిన యువకుడు నేడు ఏ2 పాల ఉత్పత్తిలో విశేషంగా రాణిస్తున్నాడు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన మూలింటి అల్లాబకాష్ హెచ్ఎఫ్ ఆవులతో డెయిరీఫామ్ ఏర్పాటు చేసుకొని ఏ2 పాలు ఉత్పత్తిలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2023లో దేశీవాలి హెచ్ఎఫ్ ఆవులతో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. వివిధ ఉద్యోగాలకు ఎంపికై మెడికల్ టెస్ట్ వరకు వెళ్లినా కంటి సమస్య వల్ల వెనుదిరిగాడు. అయినా నిరాశ చెందకుండా దేశీవాలి ఆవులతో డెయిరీఫామ్ ఏర్పాటు చేసుకొని రాణిస్తుండటం విశేషం. రెండేళ్ల క్రితం తొలుత చిన్న షెడ్ ఏర్పాటు చేసుకొని రెండు హెచ్ఎఫ్ ఆవులతో మొదలు పెట్టిన యువకుడు 22 ఆవులతో పాల ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజుకు 150 లీటర్ల పాల ఉత్పత్తి.. మొత్తం ఆవుల్లో పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెల 2 ఆవులు ఈతకు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందుకున్నారు. పచ్చి మేతతో పాటు పోషక విలువలు కలిగిన దాణా తదితర వాటిని వినియోగిస్తుండటం వల్ల రోజుకు 150 లీటర్ల ఏ2 పాలు ఉత్పత్తి అవుతాయి. దేశీ వాలీ ఆవు పాలల్లో ఏ2 ప్రొటీన్ ఉంటుంది. ఏ2 పాలకు పట్టణ ప్రాంతాల్లో విశేషమైన డిమాండ్ ఉంటుంది. ఏ2 పాలను పట్టణ ప్రాంతాల్లో లీటరు రూ.100 ఆపైన ధరతో విక్రయిస్తున్నారు. అల్లాబకాష్ గ్రామీణ ప్రాంతంలో డెయిరీ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ అంత ధరతో కొనేవారు లేకపోవడంతో స్థానిక డెయిరీకే లీటరు పాలను రూ.38 ప్రకారం పోస్తున్నారు. ఈ ప్రకారమే పాల ఉత్పత్తి ద్వారా ఆయన నెలకు అన్ని రకాల ఖర్చులు పోగా... నికరాదాయం రూ.1.20 లక్షలు పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో విక్రయించుకుంటే రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. హెచ్ఎఫ్ ఆవులతో ఏర్పాటు చేసుకున్న డెయిరీ పామ్ సంతృప్తికరంగా ఉంది. ఇంటిల్లిపాది డెయిరీ నిర్వహణపైనే ఉంటున్నాం. 100 ఆవులకు సరిపడే విధంగా ఫామ్ను విస్తరించుకున్నాం. ప్రస్తుతం ఫామ్లో 22 ఆవులు ఉన్నాయి. డెయిరీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరు ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలను అభివృద్ధి చేసుకున్నాం. ఎన్ని పర్వతాలు ఎక్కినా లభించని సంతృప్తి ఏ2 పాల ఉత్పత్తి ద్వారా లభిస్తోంది. – అల్లాబకాష్, పాడిరైతు కాఫ్ ఏ ఇయర్ పాటిస్తూ..పాడిపరిశ్రమ వైపు అడుగులు వేసిన అల్లాకాష్ ముందుగా పలు అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. పాలదిగుబడి తగ్గిపోకుండా.. అదే క్రమంలో ఆవుల సంఖ్యను పెంచే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కృతిమ గర్భధారణ ద్వారా ఆడదూడలు పుట్టే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాఫ్ ఏ ఇయర్ రూల్ను పాటిస్తున్నాడు. తనకు ఆరు ఎకరాల భూమిని కేవలం ఆవులకు అవసరమైన పశుగ్రాసాల సాగు మాత్రమే చేపడుతుండటం విశేషం. పచ్చి మేత కోసం సూపర్ నేపియర్, 4జీ బుల్లెట్, గరుడ నేపియర్ రకాలను సాగు చేస్తున్నాడు. పచ్చి మేత దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చాఫ్ కట్టర్ కూడా వినియోగిస్తున్నాడు. ఆవుల నుంచి పాలు తీయడానికి మిల్క్ మిషన్లు కూడా వినియోగిస్తున్నాడు. హెచ్ఎఫ్ ఆవులతో ఏర్పాటు చేసుకున్న డెయిరీ ఫామ్ను డోన్ ఏరియా హాస్పిటల్ సహాయ సంచాలకులు డాక్టర్ నాగరాజు సందర్శించి తగిన సూచనలు ఇస్తున్నారు. డెయిరీ పామ్లో రాణిస్తున్న పర్వతారోహకుడు 22 హెచ్ఎఫ్ ఆవులతో ఏ2 పాల ఉత్పత్తి ఆరు ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాభివృద్ధి నెలకు నికరాదాయం రూ.1.20 లక్షలుపైనే -
గ్రాసం కరువు.. పశు పోషణ బరువు!
గడివేముల: పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పశుగ్రాసం కొ రత ఏర్పడింది. పశువుల మేతకు వరిగడ్డిని కొనాలంటే ట్రాక్టర్ గడ్డి ధర రూ.3 వేలకు పైగా పలుకుతోంది. అంత డబ్బుతో గడ్డిని కొనలేక పాడి రైతులకు పశు పోషణ బరువైంది. పాడి పశువులకు మేత సరిగాలేక పాల దిగుబడి కూడా తగ్గిపోయింది. దీంతో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇవీ కష్టాలు.. నంద్యాల జిల్లాలో మొత్తం 4.33 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో 1,51,452 ఎకరాల్లో వరి సాగు చేశారు. కేసీ కెనాల్, ఎస్బార్బీసీ, తెలుగుగంగ కింద విస్తారంగా వరి సాగు అయ్యింది. మోంథా తుపాన్తో కురిసిన భారీ వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. దాదాపు 1.02 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు మొదట అంచనాలు వేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లు కారణంగా 11,448 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నివేదిక పంపారు. వరి పంటకు నష్టం వాటిల్లడంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. మొక్కజొన్న చొప్ప దొరకని దుస్థితి నెలకొంది. గడ్డి సరిగ్గా లేకున్నా... పడిపోయిన వరిని రైతులు కోస్తున్నారు. గడ్డి కోసం జిల్లాలోని పాడి రైతులతోపాటు అనంతపురం, ప్రకాశం జిల్లా గిద్దలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వస్తున్నారు. శిరవెళ్ల, దొర్నిపాడు, గోస్పాడు, మహానంది, బండిఆత్మకూరు, గడివేముల, బనగానపల్లె మండలాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏ పొలంలో చూసినా వరి కోత మిషన్లు రంగంలోకి దిగి పంట కోతలను జరుపుతున్నాయి. భారీ వర్షాలతో గడ్డి సరిగ్గా లేకున్నా డిమాండ్ వస్తోంది. దానిని కొనుగోలు చేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకుని వెళ్తున్నారు. ఒక ఎకరాకు లభించే వరిగడ్డికి రూ. 3 వేల వరకు ధర వస్తోంది. చైన్ల మిషన్లతో అయితే గడ్డి కొంత పాడవడంతో చక్రాల్లాగా బేళ్లు కడుతున్నారు. అధిక శాతం బేళ్లను చుట్టుకొని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కొక్క బేలు సుమారు 20 నుంచి 30 కిలోల వరకు ఉంటుంది. ఒక్కొక్క బేలు ధర 70 నుంచి 90 రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. నాకు ఐదు బర్రెలు, ఎద్దులు ఉన్నాయి. గత కొన్ని రోజుల కిందట కురిసిన మోంథా తుఫాన్ కారణంతో వరిమళ్లు దెబ్బతిన్నాయి. పశువులకు మేత కోసం వరిగడ్డి కొనాలంటే ఎకరా రూ.3 వేల దాకా పలుకుతోంది. దీంతో చుట్టు మండలాల నుంచి వరిగడ్డిని కొనాల్సి వస్తుంది. పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. –పైపాలెం ఉశేని, గడివేముల తుపాన్తో దెబ్బతిన్న వరి దొరకని పశుగ్రాసం ఎకరా వరి గడ్డి ధర రూ. 3వేలు పాడి రైతుకు తప్పని తిప్పలు -
నియోజకవర్గానికో రైతుబజార్
కర్నూలు(అగ్రికల్చర్): నియోజకవర్గానికి ఒక రైతుబజారు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని ఆదేశించారు. రైతుబజారు ఏర్పాటుకు నియోజకవర్గం కేంద్రంలో కనీసం అర్ధ ఎకరా నుంచి ఎకరా భూమి గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు కర్నూలు, ఆదోనిలో మాత్రమే రైతుబజార్లు నిర్వహిస్తున్నారు. కల్లూరు గోవర్ధన్నగర్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుబజార్ నిర్మించింది. అయితే ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రైతుబజారుకు భూమిని ఎంపిక చేశారు. ఇందులో రైతుబజారు నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్లు వేస్తున్నారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతుబజార్ల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరులో భూమిని గుర్తించనున్నారు. ఆకతాయిలకు కౌన్సెలింగ్ కర్నూలు: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఆకతాయిలు ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు గురువారం జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీల సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని.. లేదా డయల్ 112, 100కు సమాచారం అందించాలని విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలలతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల వద్ద పోలీసులు బృందాలుగా నిఘా ఉంచారు. మఫ్టీలో అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్ఆర్ల పరిశీలన కర్నూలు (అర్బన్): జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు సంబంధించి గురువారం సాయంత్రం సర్వీసు రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లాలో 54 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, వేర్వేరు గ్రామ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి లభించనుంది. ఈ నేపథ్యంలో పదోన్నతి పొందనున్న వారి సర్వీసు రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు వారికి ఎక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్, కార్యాలయ పరిపాలన అధికారిణి గీతాప్రతిమ పాల్గొన్నారు. -
కుష్టు రహిత సమాజంగా తీర్చిదిద్దాలి
కర్నూలు(హాస్పిటల్): కుష్టు వ్యాధి రహిత సమాజం అందరి బాధ్యత అని కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ వి.శాంతారామ్ అన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి సర్వేపై కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది. ఈ బృందం గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్తో సమావేశమై చర్చించారు. అనంతరం డాక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ.. సర్వే సమయంలో నిబంధనల ప్రకారం అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వం అందించే వైద్య సేవలను ప్రజలకు తెలపాలన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష లేకుండా ప్రజల్లో వైద్య సిబ్బంది అవగాహన తీసుకురావాలన్నారు. గృహ సందర్శనలకు వెళ్లినప్పుడు స్పర్శ లేని మచ్చల గురించి విచారించి అలాంటి కేసులు ఉంటే నమోదు చేయాలన్నారు. కుష్టు వ్యాధి మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి నిర్ధారణ అయితే చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేస్తే కచ్చితంగా నయం అవుతుందన్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు నమోదు చేసిన స్పర్శ లేని మచ్చలను సంబంధిత వైద్యాధికారి చేత నిర్ధారించి చికిత్స తీసుకునేటట్లు ప్రోత్సహించాలని చెప్పారు. కేంద్ర బృందంలో డాక్టర్ రీతి తివారి, డాక్టర్ మాన్సి, రాష్ట్రస్థాయి అధికారి డాక్టర్ దేవసాగర్, కన్సల్టెంట్ సత్యవతి ఉన్నారు. సమావేశంలో న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, డీపీఎంఓ సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
పద్మశాలి నగర్లో చోరీ
ఆదోని అర్బన్: పట్టణ శివారు ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న పద్మశాలి నగర్లో మూడు రోజుల క్రితం చోరీ జరిగింది. ఎస్ఐ రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఇంటి యజమాని గొల్ల చంద్రశేఖర్ దంపతులు ఇంటికి తాళం వేసి పని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం వారు ఇంటికొచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బీరువా తాళాలను పగలగొట్టి, అందులో ఆరు తులాల బంగారం, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.4 వేలు నగదు చోరీకి గురైనట్లు యజమాని ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. పట్టపగలే దోపిడీ మంత్రాలయం రూరల్: కల్లుదేవకుండ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రామాంజినేయులు, లక్ష్మి దంపతులు గురువారం ఉదయం పొలానికి వెళ్లగా, కుమార్తె విరేషమ్మ మంత్రాలయంలో స్కూల్కు వెళ్లింది. సాయంత్రం బడి నుంచి ఇంటికి చేరుకున్న కుమార్తె తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. బీరువాలో ఉన్న దాదాపు రూ. 70 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పది వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని హెడ్ కానిస్టేబుళ్లు అంజినేయులు, లక్ష్మీనారాయణ తెలిపారు. వెల్దుర్తి: పట్టణ శివారులో యూటర్న్ వద్ద హైవే 44పైకి చేరుకున్న బైక్ను వేగంగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మల్లెపల్లె గ్రామానికి చెందిన బోయ మహేశ్(31) డ్రైవర్గా పని చేస్తున్నాడు. వెల్దుర్తి పట్టణం కొండ పేటలో నివాసముంటున్న తన తల్లి కళావతి వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో డోన్ రైల్వే గేట్ల వద్ద నుంచి హైవేపైకి చేరుకున్నాడు. యూటర్న్ ద్వారా కర్నూలు వైపు ఉన్న తన గ్రామానికి చేరుకునే ప్రయత్నంలో ఉండగా కర్నూలు వైపు నుంచి డోన్ వైపు అతివేగంగా వచ్చిన ఐచర్ లారీ బైక్ను ఢీకొంది. బైక్పై నుంచి కింద పడ్డ బోయ మహేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. హైవే అంబులెన్స్లో స్థానిక సీహెచ్సీకి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుని భార్య కృష్ణవేణి, కుటుంబ సభ్యులు, తల్లి రోదనలు మిన్నంటాయి. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బోయ మహేశ్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణ నష్టం తప్పేదని ప్రమాద ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోలుకోలేక బాలుడి మృతి పెద్దకడబూరు: అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ నిరంజన్రెడ్డి వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన వడ్డే నాగేష్, ముత్తమ్మ దంపతుల ఏకై క కుమారుడు వడ్డే ప్రవీణ్(6) ఈ నెల 11వ తేదీన పొయి దగ్గర వెళ్లడంతో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. కుటుంబీకులు గమనించి మంటలు ఆర్పి హుటాహుటిన ఆదోని ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తండ్రి నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కొడుకును బతికించుకునేందుకు చేసిన ప్రయత్నం చివరకు విఫలమై విగత జీవిగా ఇంటికి చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మదిని దోచి ‘పట్టా’రు..
అర్జునుడి విల్లు నుంచి సంధించిన బాణమా.. ప్రకృతి మాత నెత్తిన ధరించిన పసిడి ఆభరణమా.. అన్నట్లుగా కను చూపు మేర కనిపించే రైలు మార్గం ఓ వైపు. మేఘాలతో కప్పేసి హిమగిరులను తలపించే ఎత్తైన కొండల అందాలు మరో వైపు.. పుడమి తల్లి పచ్చని కోక కట్టుకుందా అన్నట్లుగా పచ్చని సోయగాలు ఇంకో వైపు.. ఇలా అడుగడుగునా అపురూప దృశ్యాలకు నెలవు నల్లమల. నంద్యాల–గిద్దలూరు నల్లమల మార్గంలో రైలులో ప్రయాణం ప్రయాణికులకు ఓ అద్భుతమైన యాత్రగా గుర్తుండిపోతుంది. నల్లమల పచ్చటి అందాలు, పక్షుల కిలకిలారావాలు, ఆకాశం, నల్లమల కొండలు ఒక్కటిగా కలిసి పోయాయా అన్నట్లు అగుపించే దృశ్యాలు మనసును దోచేస్తాయి. నల్లమలను వీక్షిస్తూ ఎందరో కవుల హృదయాలు స్పందించి అపురూప గేయాలను ఆలపించారు. – మహానందిపచ్చటి నల్లమల అందాల మధ్య అందమైన రైలు ప్రయాణంమంచు కాదది.. నల్లమలను తాకిన శ్వేతవర్ణపు మేఘాలు -
క్రీడా పోటీల్లో ‘విభిన్న’ ప్రతిభ
మారిన జీవన శైలితో పట్టణాల్లో ప్రజలు ఒక కిలోమీటరు కూడా నడవని దుస్థితి నెలకొంది. ఆటోల్లో, వాహనాల్లో వెళ్లేవారు ఎక్కువ అయ్యాయి. వీరి ధీటుగా విభిన్న ప్రతిభావంతులు రన్నింగ్ రేస్లో, వీల్చైర్ పోటీల్లో ప్రతిభను చూపి ఆశ్చర్యానికి గురిచేశారు. నంద్యాల పట్టణంలోని నవజీవన్ క్రీడా మైదానంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్, షాట్పుట్, షటిల్ బ్యాడ్మింటన్, పరుగు పందెం, షాట్పుట్ వంటి పోటీల్లో విభిన్న ప్రతిభా వంతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు డిసెంబర్ 3న నంద్యాల పట్టణంలోని టౌన్హాల్లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు, మాజీ ఐఎంఏ అధ్యక్షుడు రవికృష్ణ తెలిపారు. జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య, కరస్పాండెంట్ సిస్టర్ జాన్మేరి, ఫాదర్ మర్రెడ్డి, పద్మా, పీఈటీలు సుంకన్న, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. – నంద్యాల(న్యూటౌన్) -
నలుగురు విద్యార్థుల డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో చూచిరాతలకు పాల్పడ్డ నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా గురువారం బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 3,709 మందికి 3,483 మంది, బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 142 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 104 మందికి 95 మంది హాజరయ్యారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, కోవెలకుంట్ల ఎస్వీబీ డిగ్రీ కళాశాలలో ఒకరు చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో.. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పింఛన్లకు నిధులు విడుదల కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.196.71 కోట్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.104.32 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.92.39 కోట్లు మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు ఈ నెల 29న బ్యాంకులకు విడుదలవుతాయి. అదే రోజున వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్పేర్ అసిస్టెంట్లు డ్రా చేస్తారు. డిసెంబర్ 1న పంపిణీ చేయనున్నారు. పంప్మోడ్తో 6,031 క్యూసెక్కుల నీటి మళ్లింపు శ్రీశైలం ప్రాజెక్ట్: ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం పంప్మోడ్ ఆపరేషన్తో 6,031 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయంలోకి మళ్లించారు. మిగులు విద్యుత్ను వినియోగించుకుని రివర్స్బుల్ సిస్టంతో డ్యాం ముందు భాగంలో ఉన్న నీటిని జలాశంలోకి తరలించారు. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయానికి 9,738 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 14,946 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.909 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 8,514 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,832 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం సమయానికి జలాశయంలో 202.0439 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. జనవరి 29, 30 తేదీల్లో జాతీయ సదస్సు శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 29, 30వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హుస్సేన్బాషా తెలిపారు. కళాశాలలో బుధవారం బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల వాణిజ్య విభాగం, న్యూఢిల్లీకి చెందిన ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పత్రాల సమర్పణను జనవరి 10లోగా ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. -
బాబూ.. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేయలేం!
● ఉద్యోగానికి వర్క్ ఇన్స్పెక్టర్ రాజీనామా?కర్నూలు(టౌన్): ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో కొంత మంది ఉద్యోగులు సెలవుల్లో వెళ్లారు. తాజాగా గురువారం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసే వై.ప్రవీణ్ (సీఎఫ్ఎంఎస్ ఐడీ: 1008159013, ఏపీసిఓఎస్ ఐఛిఠీ : 109160152 ) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పదేళ్లుగా ఆయన చక్కగా విదులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలలుగా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆవేదన ఇదీ.. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ముఖ్యమైన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఈఈ గంగాధర్ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లిపోయారు. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్ వైష్ణవి సెలవుల్లో ఉన్నారు. వరుస సెలవుల్లో వెళ్లిపోవడానికి ఉన్నతాధికారుల వ్యవహర శైలినే ప్రధాన కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది నెలల వ్యవధిలో పదవీ విరమణ పొందనున్న ఓ అధికారి తనకేమి సంబంధం లేన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు సైతం అదనపు బాధ్యతలను భరించలేక సెలవుల్లో వెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. క్షేత్రంలో ఉన్న సమయంలో సమీక్షలకు రావాలని, కార్యాలయంలో ఉంటే క్షేత్రానికి రావాలని వేధిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వార్డు సచివాలయాల ఉద్యోగులు సైతం మూకుమ్మడిగా సెలవుల్లో వెళ్లిపోయేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆనంతపురంలో పనిచేస్తున్న ఈఈ రమణమూర్తికి ఎస్ఈగా ఇన్చార్జీ ఉత్తర్వులు ఈ వారంలో రానున్నాయని సమాచారం. ఇందుకు ఓ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
ఎస్సీల ఇంటి బేస్మెట్లు నేలమట్టం
● అర్ధరాత్రి జేసీబీతో ధ్వంసం కొలిమిగుండ్ల: మండల కేంద్రంలో స్థానిక కస్తూర్బా పాఠశాలకు ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ చెంతనే ఎస్సీలు ఇళ్ల నిర్మాణాల కోసం నిర్మించుకున్న బేస్మెట్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి జేసీబీ సాయంతో నేల మట్టం చేశారు. ఇటిక్యాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 112/ఏలోని భూమిని 763/1గా సబ్ డివిజన్ చేసి ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేశారు. 70 మంది లబ్ధిదారులకు ఎండార్స్మెంట్ ఇవ్వడంతో 2024లో బేస్మెట్లు నిర్మించుకున్నారు. ఈ స్థలంలో ఒక్కొక్కరు రూ.70 వేలు నుంచి లక్ష రూపాయలకు పైగానే బేస్మెట్ల నిర్మాణం కోసం ఖర్చు చేసుకున్నారు. కూలీ పనులకు వెళ్లి దాచుకున్న సొమ్ముతో కట్టించుకున్నామని రాత్రికి రాత్రే పడగొట్టారని లబ్ధిదారులు వాపోయారు. అధికారికంగా పట్టాలు ఇవ్వక పోయినా పలు సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎండార్స్మెంట్ ఇవ్వడంతో నిర్మాణాలు చేసుకున్నామన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. తమ స్థలాలను లాక్కునేందుకు ఈకుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేస్మెట్ల కోసం పెట్టిన ఖర్చు నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. నిర్మాణాలు తొలగించడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తహసీల్దార్ శ్రీనివాసులును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. -
తాత్కాలిక టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో పార్ట్ టైం(తాత్కాలికం) టీచర్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నటేకూరులో జేఎల్ మ్యాథ్స్ –1, కోవెలకుంట్లలో జేఎల్ ఫిజిక్స్ –1, లక్ష్మీపురంలో టీజీటీ హిందీ –1 , వెల్దుర్తిలో టీజీటీ ఫీహెచ్వై సైన్స్–1, కోవెలకుంట్ల టీజీటీ పీహెచ్వై సైన్స్–1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ అర్హత ఉండి, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఎడ్ పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1లోగా కార్యాలయ పనివేళల్లో జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో అందించాలన్నారు. డిసెంబర్ 2న డెమో డీసీఓ సమక్షంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దిన్నెదేవరపాడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో డెమో నిర్వహిస్తామన్నారు. వివరాలకు 9441192673 నంబర్ను సంప్రదించాలన్నారు. కర్నూలు కల్చరల్: కర్నూలు ఓల్డ్సిటీలోని దక్షిణ షిరిడీ సాయిబాబా దేవస్థానానికి 1.250 కేజీల వెండి కిరీటాన్ని భక్తులు బహూకరించారు. బొల్లవరం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, పద్మావతి కుటుంబ సభ్యులు గురువారం వెండి కిరీటం అందించగా ఆలయ పాలక మండలి తరపున ప్రధాన కార్యదర్శి మహాబలేష్ స్వీకరించారు. 29న ‘ప్రత్యేక’ వైద్యశిబిరం నంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందిచేందుకు ఈనెల 29న నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శంకర్ప్రసాద్, ఎంఈఓ బ్రహ్మం నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల, గోస్పాడు, పాణ్యం, మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన మానసిక, శారీరక, వినికిడి, బహుళ వైకల్యం ఉన్న 18 సంవత్సరాల్లోపు పిల్లలందరూ హాజరు కావచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్కార్డు, రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, రెండు ఫొటోలు, యూడీ ఐడీ కార్డు తప్పక తీసుకొని రావాలని తెలిపారు. -
పొలాల్లో దొంగలు పడ్డారు!
● మాయమవుతున్న బోరు మోటర్లు, విద్యుత్ తీగలు ● వారంలో 35 మోటర్లు అపహరణ ● లబోదిబోమంటున్న రైతులు రుద్రవరం: ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు చీడపీడలు వీటి నుంచి పంటను కాపాడుకోలేక సతమవుతున్న రైతులకు కొత్తగా దొంగల బెడద వేధిస్తోంది. రాత్రికి రాత్రి పొలాల్లో విద్యుత్ బోరు మోటర్లు, తీగలు అపహరణకు గురవుతున్నాయి. కోటకొండ గ్రామ చుట్టు పక్కల పలువురు రైతులకు చెందిన మోటార్లు చోరీకి గురయ్యాయి. తెలుగుగంగ ఆయకట్టు రైతులు అధిక శాతం బోర్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే రబీకి పొలాలు సిద్ధం చేశారు. రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పొలాల్లోకి వెళ్లి కనిపించిన వ్యవసాయ బోరుమోటర్ల వద్దకు వెళ్లి కేబుల్ తీగలను దొంగలిస్తున్నారు. అలాగే భూమి అంతర్భాగంలో కాకుండా భూమిపైనే ఉన్న బోరు మోటర్లను తస్కరిస్తున్నారు. ఉదయాన్నే పంటకు నీరు పారించుకునేందుకై పొలాల వద్దకు వెళ్లిన రైతులు అక్కడ కేబుల్ తీగలు, బోరు మోటర్ల మాయం అవ్వడంతో అవాక్కవుతున్నారు. వారం రోజుల నుంచికోటకొండ గ్రామంలో ఈ దొంగతనాలు అధికమయ్యాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన పులువురు రైతులు రుద్రవరం ఎస్ఐ మహ్మద్రఫికి ఫిర్యాదు చేశారు. ఖరీఫ్లో మొక్కజొన్న వేయగా, భారీ వర్షాలకు పంట మొత్తం దెబ్బతిని నష్టపోయామని, ఈ క్రమంలో రబీకి సిద్ధమవుతుంగా బోర్ల మోటార్లు చోరీ కంటి మీద నిద్ర కరువు చేస్తున్నాయని వాపోతున్నారు. వారం రోజుల్లోనే తమ గ్రామ పరిధిలో 35 బోరు మోటర్ల విద్యుత్ కేబుల్ తీగలు, రెండు బోరు మోటర్లు దొంగతనానికి గురయ్యాయన్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగల ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు. -
భరత్ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా!
నగరానికి గుండెకాయ తరహా స్థలంపై చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. శివారు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములున్నా స్వార్థంతో ఉన్న ఉద్యోగులపై కక్షకట్టింది. ఇప్పటికిప్పుడు అదే ప్రాంతంలో కట్టాలని భీష్మిస్తున్న తీరు చూస్తే ఆ స్థలంతో తమ పబ్బం గడుపుకోవాలనే ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఉద్యోగులు.. పిల్లల చదువులు మధ్య ఉండటం.. కొందరు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటం.. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి టీజీ భరత్ ‘కర్ర’పెత్తనం చేస్తుండటం.. అందుకు జిల్లా అధికారయంత్రాంగం వత్తాసు పలుకుతుండటం ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తోంది.కర్నూలు(సెంట్రల్): కర్నూలు రాజధానిగా ఏర్పాటైన 1953 ప్రాంతంలో ఉన్నతాధికారుల కోసం ఏ, బీ, సీ విభాగాల్లో 1,009 క్వార్టర్స్ను నిర్మించారు. అయితే కాలంతోపాటు కట్టిన భవనాల ఆయుష్షు కూడా తగ్గిపోవడంతో కొన్ని భవనాలు బాగున్నా, మరికొన్ని పాడుబడ్డాయి. ఈ క్రమంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా అక్కడ మినీ స్టేడియం కట్టే పేరిట స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే నగరం నడిబొడ్డున స్టేడియం కడితే ట్రాఫిక్ సమస్య వస్తుందనే విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ మంత్రి టీజీ భరత్ మరో ప్రతిపాదనగా హైకోర్టు బెంచ్ తెరపైకి వచ్చింది. ఈ సారి అధికారిక, అనధికారికంగా నివాసం ఉంటున్న అందరూ ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే కర్రలు పట్టుకునైనా బలవంతంగా బయటకు పంపాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటైనా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా అన్న ప్రశ్నలు ఉద్యోగులు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్నా మంత్రి పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. జగన్నాథ గట్టులో దాదాపు 1000 ఎకరాల భూమి హైకోర్టు బెంచ్ ఏర్పాటులో భాగంగా రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేయాలని ఉద్యోగులను వేధిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కనీసం 2026 ఏప్రిల్ వరకు సమయం కావాలని కోరుతున్న పట్టించుకోని పరిస్థితి. అప్పటి వరకు సమయమిస్తే తమ పిల్లల చదువులు, ఉద్యోగ ప్రదేశాలకు అనువుగా ఇళ్లు చూసుకుంటామని చెబుతున్నా మంత్రి టీజీ భరత్, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గత ప్రభుత్వ హయాంలో జగన్నాథగట్టులో దాదాపు 1000 ఎకరాల భూమిని లా యూనివర్సిటీ, హైకోర్టు భవనాల కోసం కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మంత్రి మొండి పట్టు వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే నగరం మరింత విస్తరించి అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంత్రి మాటే జీవోనా.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఏ, బీ, సీ క్వార్టర్లు ఖాళీ చేయకపోతే కర్ర తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడంపై అక్కడ నివాసం ఉంటున్న ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన చెబితే తమను ఎలా ఖాళీ చేయించేందుకు సిద్ధమవుతున్నారని ఉద్యోగులు ఉన్నతాధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు టీజీ భరత్ చెబితే క్వార్టర్లను ఖాళీ చేయిస్తున్నారా? లేదంటే ప్రభుత్వం నిర్ణయించిందా? అనే విషయం స్పష్టం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయమైతే అందుకు సంబంధించిన జీఓ, సర్క్యులర్ ఏమైనా ఇచ్చారా? ఉంటే ప్రతిని అందజేయాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ఓ లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ వేతనాల్లో హెచ్ఆర్ఏ కట్ అవుతోందని, అలాంటప్పుడు ఇప్పటికప్పుడు ఖాళీ చేయమంటే ఎలాగని కన్నీరుమున్నీరవుతున్నారు. బలవంతంగా తమ ఇళ్లకు కరెంట్, వాటర్ కనెక్షన్లు తొలగిస్తున్నారని, ఇలా చేయడం జీవించే హక్కును కాలరాయడమేనంటున్నారు. ఏ, బీ, సీ క్వార్టర్స్లోనే హైకోర్టు బెంచ్ ఎందుకు.. అధికారిక ఉత్తర్వులు వస్తే ప్రజల ముందుంచండి రాత్రికి రాత్రి ఖాళీ చేయమనడం అన్యాయం ప్రతినెలా హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నా వేధింపులు తగవు జగన్నాథగట్టులో కట్టుకోవడంలో అభ్యంతరమేంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న నివాసిత ఉద్యోగులుకర్నూలులో ఏ, బీ, సీ క్వార్టర్ల నివాసితులు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే. లేకుంటే కర్రతో సమాధానం చెబుతాం. రెండు వారాల వ్యవధిలోనే కర్నూలు హైకోర్టు బెంచీకి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ప్రతిపక్ష పార్టీని కలిస్తే మీకే వేళ్లు, చేతులు కాలుతాయి. రచ్చ చేయాలని చూస్తే కుదరదు. ఇక్కడ ఉండేది టీడీపీ ప్రభుత్వం, కర్రతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. – ఈనెల 24న మంత్రి టీజీ భరత్ హెచ్చరిక -
శుభకార్యాలకు విరామం!
● ఫిబ్రవరి 17 వరకు మౌఢ్యమి ● 83 రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ కొలిమిగుండ్ల: శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. నేటి నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు దాదాపు 83 రోజులు శుక్రమూఢం కొనసాగనుంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు,కొత్త వ్యాపారాల ప్రారంభం తదితర పనులు చేయకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. మౌఢ్యమి సమయంలో ఈరెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి. అందుకే శుభకార్యాలు జరుపుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. బోసిపోనున్న ఫంక్షన్ హాళ్లు శుక్ర మౌఢ్యమి కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బోసిపోనున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, సప్లయి సామగ్రి నిర్వాహకులు, వంట మాస్టర్లు, బాజా భజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది. -
రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామస్థాయిలో ఒకవైపు మూగజీవులకు వైద్య సేవలు అందిస్తూ... మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ను కించపరిచే విధంగా ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పీవీ లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ పెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అనే పదం వాడే అర్హత నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్కు లేదని అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. బుధవారం కలెక్టరేట్లోని గోకులం సమావేశ మందిరంలో జీవీవో, వీఎల్వో, ఎల్ఎస్ఏ కార్యావర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ఏ పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని, ఎంపికై న వారికి డిపార్టుమెంటు అధికారులే డివార్మింగ్, వాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చారన్నారు. అయితే, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని కించపరచడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో అధికారులు, నాన్ గెజిటెడ్ కేడర్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కౌన్సిల్ చైర్మన్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ హేమంత్కుమార్కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు జనార్ధన్రెడ్డి, గంగన్న,ఆయేశ్వరీ, హనుమంతు, సులోచన, సుమలత తదితరులు పాల్గొన్నారు. -
బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో 94 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు బుధవారం 3,718 మందికి గాను 3,499 మంది (94శాతం) విద్యార్థు లు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 145 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 102 మందికి 94 మంది హాజరైనట్లు తెలిపారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు ఆదోని అర్బన్: పట్టణంలో రెండు రోజుల క్రితం కంచిగారి వీధిలో బిల్డింగ్ను బతికున్న వ్యక్తిని మరణించినట్లుగా సృష్టించి చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ను బుధవారం రద్దు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై ‘బతికున్న వ్యక్తి మరణించినట్లుగా సృష్టించి’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఆదోని సబ్రిజిస్ట్రార్ సునంద అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున వారిని పిలిపించి వారితో రుద్ద చేయించారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఆదోనిలో ఇప్పటివరకు మూడు జరిగాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం తప్ప సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు ఏవీ అని ఆదోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేలు కొరికిన ఆటోడ్రైవర్ డోన్ టౌన్: తన ఇంటి వద్ద ఆటోను పార్క్ చెయ్యవద్దని హుస్సేన్ అనడంతో కోపంతో ఆటో డ్రైవర్ వేలు కొరికాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డోన్ పాతపేటకు చెందిన హుస్సేన్ ఇంటి వద్ద అదే కాలనీకి చెందిన షేక్షావలి ప్రతి రోజు రాత్రి ఆటో పార్కింగ్ చేస్తున్నారు. ఆటోను పార్కు చెయ్యవద్దు అని మంగళవారం రాత్రి ఆటకాయించడంతో ఆటో డ్రైవర్ షేక్షావలి ఆగ్రహంతో గొడవకు దిగాడు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ తండ్రి, భార్య తోడై హుస్సేన్పై దాడి చేశారు. అదే సమయంలో హుస్సేన్ చేతి వేలు షేక్షావలి కొరికాడు. గమనించిన కాలనీ వాసులు వారించి బాధితున్ని చికిత్సల నిమ్మిత్తం వైద్యశాలకు తరలించారు. -
విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం
కర్నూలు (టౌన్) : విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా విద్యాశాఖా ధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. పిల్లలకు త్రోబాల్, రన్నింగ్, షాట్పుట్ వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు క్రీడలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. కర్నూలు మండల విద్యాధికారి అబ్దుల్ రెహెమాన్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పిల్లల పోటీలను డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
జూపాడుబంగ్లా: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పనిచేస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి, రీజనల్ మేనేజర్ పీవీ రమణ అన్నారు. బుధవారం మండలంలోని పారుమంచాల గ్రామంలో ఏపీబీజీ శాఖ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకుల బలోపేతం కోసం రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, సప్తగిరి, చైత న్య, వికాశ్ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,351శాఖలు కలిగిన తమ బ్యాంక్ 1.30 కోట్ల మంది ఖాతాదారులతో రూ.1,28,000 కోట్ల టర్నోవర్తో దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంక్గా కొనసాగుతుందన్నారు. బ్యాంకుల విలీనం ద్వారా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారుడు ఎన్ని బ్యాంకు నెంబర్లు కలిగి ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఓ సెల్నెంబర్ ఉండాలన్నారు. ప్రస్తుతం తమ బ్యాంకు ద్వారా డ్వాక్రా, పంట, గోల్డ్, విద్యారుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలు ఇస్తున్నామన్నారు. పారుమంచాల బ్యాంకు ప్రస్తుతం రూ.60 కోట్ల టర్నోవర్తో రైతులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మొండి బకాయిదారులు ఎవ్వరైనా ఉంటే డిసెంబర్ నెలాఖరులోగా వన్టైం సెటిల్మెంటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీజనల్ ఆఫీసర్లు ఎస్ఎం సాయికిరణ్, రహీం, మేనేజర్లు కిషోర్బాబు, చిరంజీవిశ్రేష్టి, సునీల్కృష్ణ, మల్లిఖార్జునరెడ్డి, రియాజ్బాషా, రైతులు కరుణాకర్రెడ్డి, వెంకటరమణారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
నష్టాన్ని దిగమింగుతూ.. కష్టాన్ని దున్నేస్తూ
సి.బెళగల్: ఉల్లి రైతుల గోడు వర్ణనాతీతం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కోతకు వచ్చిన పంటను కొందరు మూగజీవాలకు వదిలేస్తుండగా.. మరికొందరు పొలంలోనే దున్నేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉల్లి రైతులు ఈ దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నా చంద్రబాబు సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోంది. సి. బెళగల్ మండల పరిధిలోని మారందొడ్డిదొడ్డి గ్రామానికి చెందిన మహబూబ్బాష అనే రైతు ఖరీఫ్ సీజన్లో రెండెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కింద దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చుచేశాడు. ధర లేకపోవడంతో కోతకోసి విక్రయిస్తే కూలీల ఖర్చులు కూడా రావని బుధవారం పొలంలోనే పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
దేవనకొండ: చదువుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మైమూన్ మొదట విడతలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీటు సాధించింది. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకె రవికృష్ణ ఈ విషయం తెలుసుకొని ఆ విద్యార్థినిని బుధవారం విజయవాడలోని తన కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నాలుగేళ్లు చదివేందుకు అయ్యే ఖర్చును బొమ్మిడాలా ట్రస్ట్ సమకూర్చుతుందని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
తండ్రి మందలించాడని..
● ఇంటినుంచి పారిపోయిన విద్యార్థి గోనెగండ్ల: పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. ఇన్చార్జ్ సీఐ చిరంజీవి తెలిపిన వివ రాల మేరకు.. కులుమాల గ్రామానికి చెందిన అరెకంటి రాజు కుమారుడు ఏబేల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఐదారు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో అలిగిన ఏబేల్ ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ సీఐ తెలిపారు. ఎవరికై నా ఆ బాలుడు కనిపిస్తే 9963766379 లేదా గోనెగండ్ల పోలీస్ స్టేషన్ 9121101074కు సమాచారం ఇవ్వాలని కోరారు. తూకాల్లో తేడాలు వస్తే చర్యలు చాగలమర్రి: తూకాల్లో తేడలు వస్తే జిల్లా తునికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎం.జిలానీ భాషా తెలిపారు. చాగలమర్రిలోని మెయిన్ బజార్లో ఉన్న బంగారు దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు దుకాణాదారులు ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్ర వేయించుకోకుండా ఉపయోగిస్తుండటంతో రూ.30,000 జరిమానా వేశారు. తూనికల శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో గ్రామంలోని అన్ని దుకాణాలు మూసి వేశారు. డోన్, నంద్యాల ఇన్స్పెక్టర్లు నాగరాజు, అనిత, సిబ్బంది హనుమాన్ సింగ్, మధు, శ్రీశాంత్ పాల్గొన్నారు. -
వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన కమ్మలదిన్నె లక్ష్మన్న(42) అనే వలస కూలీ బుధవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాల్లో పనులు లేక బతుకు తెరువు కోసం లక్ష్మన్న భార్య భీమక్క , 9వ తరగతి చదువుతన్న కుమార్తె గోవిందమ్మతో కలిసి రాయచూరు జిల్లా హోస్పేట్ మండలం జిగుకల్లు గ్రామంలో పత్తి వేరుట కోసం నెల రోజుల క్రితం వలస వెళ్లారు. ఉదయం పొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలి కిందకు పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ప్రైవేట్ వైద్య శాలకు తరలించే లోగా మృతి చెందాడు. ఆయనకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. వలస వెళ్లి కుటుంబాన్ని పోిషించుకునేవాడు. ఒక కుమారుడికి వివాహం చేయగా, రెండో కుమారుడు రామాంజినేయులు గ్రామంలో 10వ తరగతి చదువుతున్నా డు. ఆకస్మికంగా కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. -
జూనియర్ వెటర్నరీ ఆఫీసర్కు జాతీయస్థాయి పురస్కారం
కర్నూలు(అగ్రికల్చర్): లింగనిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం ద్వారా పెయ్య దూడలను అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ అనురాధకు జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డు లభించింది. 2023లో లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టి పాడిని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. కర్నూలులోని పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. మహానంది మండలం గోపవరం గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్న అనురాధ 2023, 2024, 2025లో లింగనిర్ధారిత వీర్యంతో 800 ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేశారు. దీని వల్ల చూలు కట్టి పుట్టిన దూడల్లో 95 శాతం అంటే 340 పెయ్యదూడలే ఉన్నాయి. అలాగే పాల ఉత్పత్తి పెరిగింది. పాల ఉత్పత్తిలో అద్భుతంగా రాణిస్తున్న రైతులు, డెయిరీ ఫాంలు నిర్వహించే వారికి, కృత్రిమ గర్భధారణ ద్వారా పెయ్యదూడలు అభివృద్ధి చేసే పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు దేశం మొత్తం మీద 2000 మంది దరఖాస్తు చేసుకోగా 20 మంది ఎంపికయ్యారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత జాతీయ స్థాయిలో చివరకు ముగ్గురు మాత్రమే అవార్డులకు అర్హులుగా నిలిచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అనురాధ ఒకరు. బుధవారం జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వశాఖ మంత్రి ఆమెకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన జేవీఓను ఉమ్మడి జిల్లా పశుసంరవ్ధక శాఖ అధికారులు అభినందించారు. -
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలి
● జాతీయ రాజ్యాంగ దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకట శేషాద్రి కర్నూలు సిటీ: దేశానికి దిక్సూచి అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రాజనీతి విభాగం ఆధ్వర్యంలో ప్రజాపరిరక్షణ ఐక్యవేదిక, కాలేజీ ఎన్ఎస్ఎస్–2 యూనిట్లు సంయుక్తంగా బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకొని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది వై.జయరాజు మాట్లాడుతూ రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగ రూపకల్పనలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఆ తరువాత ఈగల్ టీం ఎస్ఐ సృజన్కుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహూమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపల్స్ హేమంత్, సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు డా.రాయపాటి శ్రీనివాస్, ప్రజాస్వామ్య పరిరక్షణ జిల్లా కార్యదర్శి అడ్వకేట్ రవికుమార్, మాజీ సైనికాధికారి కె.డి.జె. బాలు, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా.ఆర్ రోషన్న, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
● పెట్రోల్ బంకుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
మండల పరిధిలోని నర్సాపురం వద్ద బుధవారం ఓ ట్రాక్టర్ పెట్రోల్ బంకు మీదకు దూసుకెళ్లింది.అయితే ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. నర్సాపురం నుంచి అహోబిలం వెళ్లే దారిలో ఓ పెట్రోల్ బంకు ఉంది. డ్రైవర్ తన ట్రాక్టరుకు డీజల్ పట్టించుకునేందుకై వెళ్లాడు. డీజల్ పట్టించాక ట్రాక్టరును ముందుకు కదిలించే సమయంలో హఠాత్తుగా డ్రైవర్కు బీపీ తగ్గడంతో ట్రాక్టర్ నడపడంలో పట్టు తప్పింది. దీంతో ఒక్క సారిగా ఆ ట్రాక్టరు ముందుకు దూసుకెళ్లి డీజల్ పట్టే బంకును ఢీ కొట్టింది. పెట్రోల్ బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురై హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. – రుద్రవరం -
● ముళ్ల ఏదును తప్పించబోయి..
రోడ్డుపై అడ్డుగా వచ్చిన ముళ్ల ఏదు (ముళ్లపంది) తప్పించే క్రమంలో ఓ ఏజెన్సీ ఉద్యోగి కింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మహానంది సమీపంలో చోటు చేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన కుమార్ రాయల్ మహానంది దేవస్థానంలో ఏజెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై వెళ్తుండగా జినశంకర తపోవనంలో నల్లమల అడవి నుంచి రోడ్డుపైకి ముళ్ల ఏదు రావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో కుమార్ చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. – మహానంది -
డిసెంబర్ 1 నుంచి పులుల గణన
మహానంది: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) పరిధిలో డిసెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పులుల గణన కార్యక్రమం ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ అధికారులు తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వన్యప్రాణుల గణన జరగనున్నట్లు చెప్పారు. భారతదేశం అంతా ఒకేసారి జరిగే గణనలో ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఫేజ్–1 ప్రక్రియలో భాగంగా మూడు రోజుల పాటు మాంసాహార, మరో మూడు రోజుల పాటు శాఖాహార జంతువుల గణన ఉంటుందన్నారు. రెండు భాగాలుగా జరిగే ట్రెయిల్ పాత్, ట్రాంజాక్ట్ పద్దతుల్లో వన్యప్రాణుల గణన ఉంటుందన్నారు. ట్రయిల్ పాత్(మాంసాహార జంతువులు), ట్రాంజాక్ట్(శాఖాహార) పద్దతుల్లో వన్యప్రాణి జంతువులను లెక్కిస్తారన్నారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలో జరిగే గణనకు సంబంధించి ఇప్పటికే అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులతో పాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అఽథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ వన్యప్రాణుల గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్ఎస్టీఆర్ పరిధిలో 87 పెద్ద పులులు ఉన్నట్లు సమాచారం. -
ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
ఓర్వకల్లు: సమాజంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని ఉయ్యాలవాడలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం దేశ ప్రజలకు అత్యున్నత గ్రంథమన్నారు. అందులో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి పౌరుడు గౌరవించి ఆచరించాలన్నారు. అనంతరం ఆమె ఉయ్యాలవాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాజకుమారి పొలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో అధిక లాభాలు ఆర్జిస్తున్న మహిళా రైతును కలెక్టర్ అభినందించారు. అనంతరం మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి హేమంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయాధికారి మాధురి, ఎంపీడీఓ నాగ అనసూయ, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


