breaking news
Kurnool District Latest News
-
ఆటోలతో విన్యాసాలు చేసి.. పోలీసులకు చిక్కి!
● ముగ్గురు యువకులు అరెస్టు.. ఆటోలు సీజ్ కర్నూలు: కర్నూలు–హైదరాబాద్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆటోలతో ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మూడు పోలీసు బృందాలను రంగంలోకి దింపి మమతా నగర్కు చెందిన శివ మల్లేష్, పేరపోగు అఖిల్, అశోక్ నగర్లోని శ్రీకృష్ణ కాలనీకి చెందిన గనమూరు జయసింహలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈనెల 1వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో పై ముగ్గురు నిందితులు పంచలింగాల సర్కిల్ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి ఆటోలను తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ సరదా కోసం రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. -
వైద్యం వికటించి శిశువు మృతి!
నందికొట్కూరు: పట్టణంలోని ఓ వైద్యశాలలో వైద్యం వికటించి ఆరునెలల శిశువు మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కుమ్మరి పేటకు చెందిన షాకీర్బాషా, అజిదాబాను దంపతుల కుమారుడు అబ్దుల్ రహిమాన్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తల్లిదండ్రులు స్థానిక అనసూయ హాస్పటల్కు తీసుకెళ్లారు. మూడు రోజుల నుంచి డాక్టర్ శ్రీనివాసులు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఆ బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి జోక్యం చేసుకొని విచారించి డాక్టర్ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
మల్లన్న దర్శనానికి జర్మనీ దేశస్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి జర్మనీ దేశస్తులు తరలి వచ్చారు. బుధవారం ఆ దేశానికి చెందిన సుమారు 20 మందితో కూడిన బృందం శ్రీశైలానికి చేరుకొని ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనానికి వెళ్లారు. జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. విదేశీ భక్తులను చూసిన స్థానికులు, యాత్రికులు వారితో మాటామంతి కలిపి, ఫొటోలు దిగేందుకు అసక్తి చూపారు. ప్లాస్టిక్ ప్లేట్ల వాహనాలు సీజ్ శ్రీశైలంప్రాజెక్ట్/ఆత్మకూరు రూరల్: శ్రీశైలం శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద బుధవారం ప్లాస్టిక్ ప్లేట్లను తరలిస్తున్న రెండు వాహనాలను శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పరమేశు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన తిరుమలశెట్టి, శ్రీకాంత్ టాటా ఇంట్రాల్ ఏపీ 39 ఏజె 4604 వాహనంలో 6,000 ప్లాస్టిక్ ప్లేట్లు శ్రీశైలంలోని భ్రామరి హోటల్కు తెస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పల్లె శివరామకృష్ణ అనే మరో వ్యక్తి శ్రీశైలంలోని రెడ్ల అన్నదాన సత్రానికి 1,30,000 ప్లాస్టిక్ ప్లేట్లను తెస్తున్నాడు. శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ వాహనాలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అటవీ అధికారి మాట్లాడుతూ నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతమని తెలిపారు. ఇటువంటి ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధమని, ఎవరైనా ఇటువంటి వస్తువులు కలిగి ఉన్నా, తరలించినా అటవీ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముథూట్, అపోలో ఫార్మసీలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఆయా ఉద్యోగాలకు పది నుంచి డిగ్రీ, ఫాం(బీడీఎం) చదివిన వారు అర్హులని, వయసు 21–35 సంవత్సరాలు ఉండాలన్నారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు. వ్యక్తి బలవన్మరణం డోన్ టౌన్ : పట్టణంలోని కొండపేటకు చెంది న రామసుబ్బయ్య (41) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన కొన్నేళ్ల నుంచి తాగుడుకు బానిసై ఏం పని చేసేవాడు కా దు. అయితే, ఉన్నట్టుండి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులుఓ గదిలో నిద్రిస్తుండగా మరో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రామసుబ్బయ్య అక్క లక్ష్మీదేవి ఫిర్యాధు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుష్టును నిర్మూలిద్దాం గోస్పాడు: కుష్టువ్యాధిపై అవగాహన పెంచుకొని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. బుధవారం నంద్యాలలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార వాహనం ద్వారా ఊరూరా ప్రజలకు కుష్టుపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం నంద్యాల: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 491 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానం ద్వారా 474 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 17 దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
ఏటీఎం దొంగ దొరికాడు
నంద్యాల: బ్యాంకు పాసుపుస్తకంలో లావాదేవీల ప్రింటింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడిని ఏ మార్చి ఏటీఎం ద్వారా రూ.1.24లక్షలు నగదు కాజేసిన దొంగ పట్టుబడ్డాడు. నంద్యాల ఏఎస్పీ మందా జావలి తెలిపిన మేరకు వివరాలు.. గత నెల 29వ తేదీన శ్రీనివాససెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన వృద్ధుడు సుబ్బరాయుడు బ్యాంకు పాసు పుస్తకంలో ప్రింటింగ్ కోసం వచ్చాడు. అక్కడే కాపుకాచి ఉన్న వెల్దూర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండన్నగారి సిద్దేష్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి నగదు డ్రా చేసుకుంటే ప్రింటింగ్ వస్తుందని నమ్మబలికించాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.1000 తీసి ఇవ్వమని ఏటీఎం ఇచ్చి పిన్ నంబరు చెప్పాడు. డబ్బు డ్రా తర్వాత వృద్ధుడికి నకిలీ ఏటీఎం ఇచ్చాడు. అతను ఇంటి వద్దకు వెళ్లిన కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.1.24 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్యాంకు వద్ద, ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి బుధవారం నంద్యాల బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు ఇదే తరహాలో కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు 11 కేసులు ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఏటీఎంల వద్దకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వడం, పిన్నంబరు చెప్పడం చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీఅభినందించారు. -
పరమేశ్వరా.. నిర్లక్ష్యం చూడవా!
శ్రీశైలంటెంపుల్: మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తుల రాక కూడా మొదలైంది. అయితే క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండుమూడురోజుల ముందే ఉత్సవ శోభ కనిపించేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో పరమేశ్వరా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఏవీ అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుకు సాగని పనులు శ్రీశైలంలో జర్మన్షెడ్లతో తాత్కాలిక క్యూ కంపార్ట్మెంట్, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇరువైపులా భక్తులు సేదతీరేందుకు జర్మన్ షీట్లతో భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద టెంజైల్ షెడ్తో మరో క్యూ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆలయ గోపురాలకు, ఉభయ దేవాలయాలకు విద్యుద్దీకరణ, చలువ పందిళ్లు, షామియానాలు, ఉద్యానవనాల్లో, ఆరుబయలు ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ప్రధానరోడ్డుకు ఇరువైపులా గ్రావెల్తో చదును చేసే పనులు, పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పాతాళగంగ వద్ద ఇనుప మెష్తో బారికేడింగ్, ప్రధాన రోడ్లలో డివైడర్లకు పెయింటింగ్, తాత్కాలిక టాయిలెట్లు తదితర పనులు ఇంకా పూర్తి కాలేదు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇంకా ఇవ్వలేదు. మరో మూడు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా ఈ పనులన్నీ పూర్తవుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. సమీక్షలకే సరి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేది నుంచి 18వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం విస్తృ త ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. దేవస్థాన ఈఓ ఆధ్వర్యంలో రెండు సార్లు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సారి, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో సహా దేవస్థాన అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు చేశారు. క్షేత్ర పరిధిలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అయినా, ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
ఆలూరు రూరల్: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఆలూరు పోలీసు స్టేషన్ ఆవరణలో బుధవారం ఎస్ఐ మన్మధ విజయ్తో కలిసి సీఐ రవి శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత నెల జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులో నివాస ఉంటున్న సరోజమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి భర్త ఫోన్ నంబర్ అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లో కేసు ఛేదించారు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి, రుద్రవరం మండల నందనపల్లె గ్రామానికి చెందిన తిరుపతి సురేష్ స్నేహితులు. నేర ప్రవృత్తి కలిగిన వీరే ఆలూరు వచ్చి సరోజమ్మ మెడలోని బంగారు చైను దోచుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం ఆలూరు మండలంలోని అంగసకల్లు గ్రామ రోడ్డులో నిందితులు కనిపించడంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ చైన్ స్నాచర్లపై తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని ఉండవల్లి పీఎస్లో రౌడీ షీటర్ ఉందని, అలాగే వివిధ పోలీసు స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు. -
అత్యాచార నిందితులను అరెస్టు చేయాలి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని అంబేడ్కర్ నగర్లో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఐద్వా, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాఘవేంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.అరుణ, బాధితురాలి కోడళ్లు, కృషమ్మ, మేరీ మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీన అంబేడ్కర్ నగర్లో 50 ఏళ్ల వృద్ధురాలిపై అత్యంత పాశవికంగా కళ్లలో కారం చల్లి.. చేతులు కట్టేసి ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఆమెను కర్రలు, రాళ్లతో కొట్టి హింసించారని, ఇది మానవ జాతికే అవమానకరమన్నారు. నిందితులకు మరో మహిళ సహకరించడం దురదృష్టకరమని, అత్యాచారం జరిగి ఆరు రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం తగదన్నారు. పోలీసులే కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ జోక్యం చేసుకొని నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే గ్రామస్తులతో కలసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్వరలో జన ఔషధి
నంద్యాల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో జన ఔషధి మెడికల్ షాప్ అందుబాటులోకి రానుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్ రూమును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో ఈ షాపులను ప్రారంభిస్తోందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి, జిల్లా చైర్మన్ దస్తగిరి, జిల్లా సెక్రెటరీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని బాషా, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్బాష, రెడ్ క్రాస్ డీఎఫ్ఓ సమీ, ఫార్మసిస్టు ఇంద్రజ, మున్సిపల్ ఇంజినీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఆదోని రూరల్: ఆదోని–ఎమ్మిగనూరు జాతీయ రహదారిలో స్కూటర్కు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. తాలూకా ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.... ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్కుమార్ (30) ఎర్రకోటలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను బుధవారం స్కూటీపై ఆదోని మండలంలోని పెసలబండ దేవరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు (కేఏ41 ఎంఏ3367) అతివేగంగా వచ్చి వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న పవన్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పవన్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు జయలక్ష్మి, హనుమంతు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. టిప్పర్కు రూ. 2.45 లక్షల జరిమాన డోన్ టౌన్ : జాతీయ రహదారిలో దత్తాత్రేయ స్వామి గుడి వద్ద బుధవారం ఓ టిప్పర్ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వెల్దుర్తి వద్ద జరుగుతున్న రైల్వే పనులకు వినియోగిస్తున్న ఈ వాహనానికి సంబంధించి రెండేళ్లుగా ఫిట్నెస్, రోడ్డు ట్యాక్స్ చెల్లించలేదు. అధికారులు బుధవారం దత్తాత్రేయ స్వామి తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించడంతో రూ. 2.45 లక్షల జరిమాన విధించి టిప్పర్ను డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు తిప్పరాదని, ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు. -
దిగుబడి భళా..ధర డీలా!
మండల పరిధిలోని ముక్కమల్ల గ్రామంలో ఓ రైతు శనగ పంట ఇరగ్గాసింది.ఈ ఏడాది రబీ సీజన్లో వేసిన శనగ విత్తనానికి వాతవారణం అనుకులించడంతో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ముక్కమల్ల గ్రామానికి చెందిన పోచ వెంకట రామిరెడ్డి రైతు ఐదు ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. నూర్పిడి చేశాక ఎకరాకు 14 క్వింటాలు దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి అయినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు. ప్రభుత్వ స్పందించి శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు – సంజామల -
చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులతో నిలిచిన నీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పే చిత్రం ఇదీ..జూపాడుబంగ్లా: రాయలసీమ ప్రజలు తమ గర్జనను వినిపించే సమయం ఆసన్నమైంది. సాగునీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ‘తాకట్టు’పై శంఖారావం పూరించే మహోన్నత అవకాశం లభించింది. గురువారం పోతులపాడు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ‘సీమ’ అకాంక్ష ప్రదర్శితం కానుంది. అనుమతివ్వకపోయినా కచ్చితంగా ‘చలో పోతిరెడ్డిపాడు’ నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్, ఎమ్మెల్సీ ఇసాక్బాష, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమతులు మంజూరయ్యాయి. వెంటనే పోతులపాడు గ్రామంలోని వెంకటశివారెడ్డి, చిన్నశాంతన్న పొలంలో రైతుశంఖారావం సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు. అడ్డంకులను దాటుకుని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవటానికి కారణమైన సీఎం చంద్రబాబు మోసాన్ని రైతులు, ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 5న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. అందులో భాగంగా జనవరి 30న పోతులపాడు గ్రామంలో సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ ఆదేశాలతో 30వ తేదీ సాయంత్రం ఆత్మకూరు డీఎస్పీ రాంమాజనేయనాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించారు. దీంతో అక్కడ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు 6 కిలోమీటర్ల పరిధిలో సభ నిర్వహించవద్దని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తరిగోపుల క్రాస్రోడ్డు వద్ద రైస్మిల్ సమీపంలో సభ నిర్వహణకు మరోసారి కాటసాని రాంభూపాల్రెడ్డి, బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, దారా సుధీర్, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అయినా సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. వెంటనే పోతులపాడులో సభ నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే సభకు రాయలసీమ జిల్లాల్లోని రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన మోటార్లు బిగించని ప్రాంతంనందికొట్కూరు: తల్లిలాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టడంపై రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. రాయలసీమ జిల్లాలోని 52 నియోజకవర్గాలకు, నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు కష్టాలు తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకంతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు కాల్వలోకి ఎత్తిపోయవచ్చు. రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు కష్టాలు తీరుతాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు సీఎం చంద్రబాబు ఆపేశారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆంక్షలు విధిస్తూ భారీ బందోబస్తు చలో పోతిరెడ్డిపాడు సభ నిర్వహణకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంతో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభకు వచ్చే వారు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సభకు ఎలా వచ్చారో ముగిసిన తర్వాత అలాగే వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చూసేందుకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు శంఖారావం పేరుతో ‘చలో పోతిరెడ్డిపాడు’ పోతులపాడులో ముమ్మరంగా సభ ఏర్పాట్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాటసాని, సిద్ధార్థరెడ్డి, దారాసుధీర్ రాయలసీమ రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపు -
వ్యక్తిగత కక్షలతోనే హత్య
పత్తికొండ: ఏపీ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ను వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. బుధవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్టు చూపి వివరాలను వెల్లడించారు. బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ ఏపీ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ సామాజికవర్గ సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలోని మైనార్టీ వర్గానికి చెందిన షేక్ సుభాన్వలి కుటుంబంతో కొద్ది రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. గతంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వేధించారన్న కారణంతో సుభాన్వలి కుటుంబ సభ్యుల్లో ఒకరిపై తుగ్గలి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అంతేకాకుండా సుభాన్ కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి పక్కనున్న స్థలం సమస్యలో రమేష్ జోక్యం చేసుకొని కొంత స్థలాన్ని అవతలి వర్గానికి ఇప్పించడంతో కక్ష పెంచుకున్నారు. సమీప బంధువైన లింగనేనిదొడ్డి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ పొలం విషయంలోనూ రమేష్ కలుగజేసుకొని పొలం సర్వే చేయించడంతో పాటు దాదాపు 2 ఎకరాలు ఇతరులకు స్వాధీనం కావడానికి కారణమయ్యాడనే బాధ పెంచుకున్నారు. ప్రతి పనిలో అడ్డుతగులుతూ ఆర్థికంగా నష్టం చేస్తుండటంతో రమేష్ను అంతమొందించేందుకు నిర్ణయించుకున్నారు. వాకింగ్కు వెళ్లిన సమయంలో.. గత జనవరి 30న సాయంత్రం గ్రామంలో తన నివాసం నుంచి బొందిమడుగుల రమేష్ కృష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల గ్రామం వైపు వాకింగ్కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించి నిందితులు ట్రాక్టర్ ఇంజిన్తో ఢీకొట్టారు. ఇనుపరాడ్డులు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని రమేష్ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అయితే కోలుకోలేక ఈనెల 31న మరణించాడు. నిందితులు అరెస్టుకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తుగ్గలి ఇన్చార్జి ఎస్ఐ మల్లికార్జున ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటితో పాటు హత్య కేసు నమోదు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించి బుధవారం తుగ్గలి మండలం రాతన గ్రామం చెరువుకట్ట దగ్గర షేక్ సుభాన్వలి, షేక్ హుశేన్పీరా, షేక్షావలి, షేక్ షేక్షావలి, షేక్ మాబాషా, షేక్ షాకీర్, షేక్ షరీఫ్, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ లాల్బాషా, షేక్ మౌళాలి, షేక్ మహమ్మద్లను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డులను పత్తికొండ మండలం చందోళి క్రాస్రోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించేందుకు సహకరించిన రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్ఐ మల్లికార్జున, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఇదిలాఉంటే పాతకక్షలతో జరిగిన హత్యకు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు. వారందరిపై న్యాయ సలహా తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. 12 మంది అరెస్టు హత్యకు ఉపమోగించిన ఆయుధాలు స్వాధీనం -
మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు, వేరుశనగ ధరలు పడిపోతున్నాయి. ప్రధానంగా కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గరిష్టంగా క్వింటా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8వేల లోపునకు పడిపోయింది. మార్కెట్కు కందులు 3,655 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,609, గరిష్ట ధర రూ.7,901 లభించింది. సగటు ధర రూ.7,801 నమోదైంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లలో కందుల ధరలు మరింత అధ్వానంగా ఉంటున్నాయి. కాగా వేరుశనగ ధర గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.15వేలకు చేరింది. ఈ ధర మూన్నాళ్ల ముచ్చటగా మారింది. మరుసటి రోజు నుంచే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు మార్కెట్కు 406 క్వింటాళ్ల వేరుశనగ వచ్చాయి. కనిష్టంగా రూ.5,625, గరిష్ట ధర రూ.9,018 లభించింది. నాలుగైదు రోజుల వ్యవధిలోనే క్వింటాపై రూ.6 వేల వరకు తగ్గడం గమనార్హం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి గోనెగండ్ల: చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ సుధాకర్ సూచించారు. బుధవారం మండల కేంద్రం గోనెగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక(హరిజన వాడ)పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలతో మాట్లాడి వివిధ సబ్జెక్టులలో వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట జేఎస్డబ్ల్యూ స్నేహలత, ఎంఈఓలు రామాంజినేయులు, నీలకంఠ, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు. సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులు కర్నూలు: ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 6న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బందోబస్తుకు నాలుగు జిల్లాల పోలీసులను వినియోగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు, 88 మంది ఎస్ఐలు, 297 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 485 మంది కానిస్టేబుళ్లు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, రెండు సెక్షన్ల ఏఆర్ పోలీసులు, 14 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్యేక అధికారిగా ఆజాద్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు ఉత్సవాల ముఖ్య అధికారిగా ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు సిబ్బందిని నియమించారు. వసతి గది, అటెండర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీఆర్వోను ఆదేశించారు. -
ఏఐ టెక్నాలజితో కచ్చితమైన క్యాన్సర్ చికిత్స
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆధునిక ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా కచ్చితమైన చికిత్స అందిస్తున్నాము. లీనియర్ యాక్సిలేటర్ మిషన్ ద్వారా క్యా న్సర్ కణితికి ఎంత మేరకు రేడియేషన్ ఇవ్వాలో ఏఐ నిర్ణయిస్తుంది. అలాగే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ద్వారా తీసిన స్కానింగ్లను విశ్లేషించి నివేదిక ఇస్తుంది. పలు రకాల ఆపరేషన్లు చేయడంలోనూ ఈ టెక్నాలజి ఎంతో ఉపయోగపడుతోంది. –డాక్టర్ సీఎస్కే ప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు -
4 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతివ్వండి
● ఫారెస్టు అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి నల్లమల మీదుగా పాదయాత్రకు వెళ్లే భక్తులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డితో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శ్రీశైలం మహాక్షేత్రానికి గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో పాదయాత్ర భక్తులకు నల్లమల మీదుగా వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. భక్తులు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలన్నారు. ప్రస్తుతం పులుల గణన జరుగుతున్నందున ఇబ్బందులు తలెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అటవీశాఖ అనుమతులతో వెంకటాపురం నుంచి దోర్నాల వరకు రహదారి విస్తరణ చేపడుతామన్నారు. శివరాత్రి భక్తులకు మెరుగైన వసతులు శ్రీశైలంప్రాజెక్ట్: శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం చేరుకునే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం దేవస్ధానం ౖచైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావుతో కలసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దిగువన లింగాలగట్టు వద్ద లోలెవల్ పుష్కరఘాట్లను పరిశీలించారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాపులు, సీఐలు జీవన్ గంగనాథబాబు, గంటా సుబ్బారావు ఉన్నారు. -
రాష్ట్రంలో ఆటవికపాలన
● టీడీపీ నేతలు బందిపోట్లుగా మారారు ● పెట్రోల్ బాంబులతో మాజీ మంత్రి ఇంటిపై దాడి అమానుషం ● వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు బొమ్మలసత్రం: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్లపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం, కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన దుష్ప్రచారం అందుకు ఉదాహరణ అన్నారు. సిట్ నివేదికలో లడ్డూలో కొవ్వు కలవలేదని తేలటంతో ఇప్పుడు మరో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దుష్ప్రచారంపై గొంతెత్తిన అంబటి రాంబాబు, జోగి రమేష్, వంశీ, నాని లాంటి మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటం దారుణమన్నారు. లీగల్ సెల్ స్టేట్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ టీడీపీ లడ్డూపై ఆరోపణలు చేస్తున్నట్లుగా లేదని సాక్షాత్తు ఆ దేవదేవుడిపై ఆరోపణల దాడి చేస్తున్నట్లుగా ఉందన్నారు. తప్పుడు ప్రచారమని ప్రపంచానికి తెలియటంతో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. లీగల్సెల్ పట్టణాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ గీతం యూనివర్సిటీకి రూ. 1000 కోట్ల భూములు కేటాయించారని ప్రశ్నిస్తే దాడులు, లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ రిపోర్టు చూపితే దౌర్జన్యాలు, కేసులు ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఇచ్చే సందేశమేమిటో చెప్పాలన్నారు. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కంప్లైంట్లు వేసి పోలీసులపై చట్టపరమైన చర్యలకు దిగుతామన్నారు. టీడీపీ నాయకులకు వారు చుట్టంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు సుహేల్రాణా, జీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కమ్ముకొస్తున్న క్యాన్సర్!
కర్నూలు(హాస్పిటల్):రంగు రంగులతో అందంగా కనిపించే పదార్థాలు, గుమగుమలాడే ఘాటైన సువాసనలు మనిషిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఆకర్షణీయంగా ఉన్న నిషేధిత రంగులను దట్టించి తయారు చేసిన పదార్థాలను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆరగించేస్తున్నారు. అవి శరీరంలోకి వెళ్లాక క్రమంగా విషతుల్యం చేస్తున్నాయి. కొన్నిరోజులకు అవి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనిషి ఆయువు తీస్తున్నాయి. ఇలాంటి పదార్థాల్లో స్వీట్స్, బేకరి ఐటమ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఐస్క్రీమ్లు, కూల్డ్రింకులు, ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్లు, రంగులు కలిపిన చికెన్ పకోడీలు, గోబీమంచూరియాలు, బజ్జీలు, బిర్యానీలు, గ్రేవీ పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు తదితరవి ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వైద్యులు నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో ఈ విషయం వెల్లడైంది. నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. క్యాన్సర్పై అవగాహన పెరగడంతో ప్రజలు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించే ఓపీకి 60 నుంచి 70 మంది వరకు రోజూ చికిత్స కోసం వస్తున్నారు. ఇన్పేషంట్లుగా నిత్యం 120 పడకలకు గాను 150 నుంచి 170 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ మూడు మేజర్, మూడు మైనర్ కలిసి నెలకు 180 నుంచి 200 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఆధునిక యంత్రాల ద్వారా 50 నుంచి 55 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. ఇవేగాక ఒమెగా హాస్పిటల్, అమీలియో హాస్పిటల్, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లలోన్లూ రోజూ 250 నుంచి 300 మంది దాకా క్యాన్సర్ రోగులు చికిత్స కోసం వెళ్తున్నారు. వీరిలో ఎక్కువగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణకోశ క్యాన్సర్, పేగు క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. క్యాన్సర్ రావడానికి కారణాలు క్యాన్సర్ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం (రొమ్ము, గర్భాశయం, పేగు, మూత్రపిండాల క్యాన్సర్లు), 40 శాతం పొగాకు (నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు), 10 శాతం ఇన్ఫెక్షన్లు(హెచ్పీవీ, హెపటైటిస్ బి వల్ల వచ్చే కాలేయ క్యాన్సర్) కారణం. మిగిలిన 25 శాతం క్యాన్సర్ల (రక్తం, ఎముక, ప్యాంక్రియాస్ల క్యాన్సర్)లకు సరైన కారణాలు లేవు. సంవత్సరం సర్జికల్ ఆంకాలజి మెడికల్ ఆంకాలజి రేడియేషన్ ఆంకాలజి 2019-20 8,596 10,846 8,306 2020-21 9,564 12,325 9,325 2021-22 10,396 14,214 10,103 2022-23 12,659 15,045 12,435 2023-24 14,269 16,568- 13,993 2024-25 13,326 17,245- 14,328 2025-26 11,325 14,239- 11,958 క్యాన్సర్ లక్షణాలు ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము క్యాన్సర్లో రొమ్ము వద్ద చను మొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పేగుల్లో బల్లలు ఏర్పడటం, పురీషనాళంలో నొ ప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లో నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, బ్రెయిన్ క్యాన్సర్లో భరించలేని తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత. క్యాన్సర్ లక్షణాలు దాని రకంపై ఆధారపడి ఉంటాయి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా వైద్యం నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం -
చంద్రబాబు ద్రోహంతో సీమ భవిష్యత్ ప్రశ్నార్థకం
పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహంతో రాయలసీమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. రాయలసీమలో కరువును తరమికొట్టేందుకు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రాయలసీమ ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ను తెలంగాణకు తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మంగళవారం పాణ్యం పార్టీ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను ఎమ్మెల్సీ ఇసాక్బాషా, పార్టీ నేతలతో కలసి కాటసాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగులు నీరు ఉండగానే తెలంగాణ ప్రభు త్వం ప్రాజెక్టులకు నీరు మళ్లించి వాడుకుంటుందన్నారు. అదే తరహాలోనే రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారన్నారు. దాదాపుగా రూ. 3వేల కోట్లకు పైగా వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుకు మో టార్లు అమర్చితే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని చెప్పినా ఇంత వరకు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. బాబు చేసిన ద్రోహం సీమ ప్రజలు గుర్తు పెట్టుకుని బుద్ధి చెబుతారన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు ఐదు ఉమ్మడి జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాజెక్ట్లకు ప్రాణం పోశారన్నారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే కారణంతోనే పనులు నిలిపేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్రెడ్డి, రామలక్ష్మయ్య, సుబ్బరాయుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, రామచంద్రుడు, అశోక్రెడ్డి, కృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి, భాస్కర్, చంద్రశేఖర్రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజ యవంతం చేయాలన్నారు.బహిరంగ సభకు తరలిరండి -
పోలీసు డాగ్ ‘టీనా’ మృతి
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో 9 ఏళ్ల పాటు సేవ లందించిన పోలీస్ డాగ్ టీనా వృద్ధాప్య సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇది ల్యాబ్ బ్రీడ్ జాతికి చెందిన ఫీమేల్ జాగిలం. టీనా మృతదేహానికి దిన్నెదేవరపాడు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్ పోలీసు సిబ్బంది కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందు పాతరలు పసిగట్టడంలో దిట్ట మందు పాతరలను పసిగట్టడంలో టీనా దిట్ట. వివిధ వీఐపీ బందోబస్తులో, పీఎం, సీఎం బందోబస్తు విధులలో మంచి సేవలు అందించింది. ఎన్నికల విధులు, శ్రీశైలం శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, వీఐపీ విజిట్స్, మంత్రాలయం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని టీనా సేవలను పోలీసు అధికారులు కొనియాడారు. 2013లో పది నెలల పాటు తెలంగాణ, మొయినాబాద్ ఐఐటీఏలో కఠోర శిక్షణ పూర్తి చేసుకుని 2014లో జిల్లాకు వచ్చింది. నాటి నుంచి నుంచి డాగ్ హ్యాండ్లర్గా ఏఆర్ కానిస్టేబుల్ సుంకిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. -
వాతావరణ సమాచారంలో ఏడబ్ల్యూఎస్ ముఖ్య పాత్ర
ఓర్వకల్లు: ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులను గమనిస్తూ ఖచ్చితమైన వాతావరణ సమాచారం సేకరణలో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్లూఎస్) కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. మంగళవారం కలెక్టర్ మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో ఏపీ ట్రాన్స్ కో ఆవరణలో అమర్చిన ఏడబ్ల్యూఎస్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఆర్టీజీఎస్కు అనుసంధానం చేశారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా వర్షపాతం, నేలలో తేమశాతం, వాతావరణ పీడనం, గాలి, ఉష్ణోగ్రతల వంటి వివరాలను ఆటోమేటిక్గా ఆన్లైన్లో నమోదు చేస్తాయని తెలిపారు. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి, వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడానికి సంబంధిత వాతావరణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్రానికి సంబంధించిన యంత్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరుగకుండా చూడాలని, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డీవైఎస్ఓ భాస్కర్, రామాంజనేయులు, ఏఎస్ఓ సరళకుమారి, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలించిన కలెక్టర్ డాక్టర్.సిరి -
రాష్ట్రపతి పాలన విధించాలి
ఆలూరు రూరల్: ‘టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. టీడీపీ దాడులను నిరసిస్తూ మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలసి ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు అసత్య ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలనే కుట్ర జరుగుతోందన్నా రు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తున్న చంద్రబాబు సీమ ద్రోహిగా నిలిచిపోతారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఈ నెల 5వ తేదీన రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత కేవలం అమరావతిని మాత్రమే పట్టించుకుంటున్నారే తప్పా. రాయలసీమ సాగు ప్రాజెక్టులను విస్మరించారన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలూరు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, భాస్కర్, శివ, మల్లేష్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. -
రెండో పంటకు అవకాశం లేకనే వలస
మాకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. ఖరీఫ్లో పత్తి సాగు చేశాం. గత ఏడాది నవంబర్ నెలకే పూర్తయింది. రెండో పంట లేకపోవడంతో ఉపాధి కరువైంది. అరకొరగా కల్పిస్తున్న ఉపాధి పనులకు వెళ్లినా వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. బతుకుదెరువుకు గుంటూరు ప్రాంతానికి వలస వచ్చాం. – ఈడిగ శ్రీనివాసులు, కామన్దొడ్డి, కోసిగి మండలం మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కిందనే వ్యవసాయం. ఖరీఫ్లో కంది సాగు చేశాం. అయిదు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడితే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పంట నవంబర్ నెలకే పూర్తయింది. రబీలో ఈ భూములను ఖాళీగా ఉంచుకున్నాం. పశ్చిమ ప్రాంతం మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా రెండో పంట వేసుకునే అవకాశం లేకపోతోంది. – మధుసూదన్రెడ్డి, ఆస్పరి సాగునీటి వసతి లేక పశ్చి మప్రాంతం పూర్తిగా వెనుకబడింది. రెండో పంటకు అవకాశం ఉంటే పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు ఉండవు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు సాకారమైతేనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. డీపీఆర్లు సిద్ధమయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. – నాగభూషణం రెడ్డి, రైతు, హెబ్బటం, హొళగుంద మండలం -
● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న అధికారులు
తుంగభద్రలో ఇసుక తోడేళ్లు నందవరం : తెలుగు తమ్ముళ్ల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో నాగలదిన్నె, చిన్నకొత్తిలి, నదికై రవాడి, గంగవరం గ్రామాల్లో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల్లో నది ఒడ్డు నుంచి కొందరు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక రవాణా దందాకు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. అక్రమ రవాణా సాగుతుందిలా.. మండలంలోని నాగలదిన్నె, చిన్నకొత్తిలి, గంగవరం, నదికై రవాడి, గురజాల గ్రామాల్లోని తుంగభద్ర నది ఒడ్డు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఎమ్మిగనూరుకు తరలిస్తున్నారు. 10 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 100 ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తున్నారు. నాగలదిన్నె మీదుగా కె. పేట, కనకవీడు గ్రామాల నుంచి, అలాగే మిట్ట సోమపురం, సోమలగూడూరు గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ముంచుకొస్తున్న నీటి ఎద్దడి.. తుంగభద్ర నదిలో నుంది అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాగలదిన్నె గ్రామంలో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అక్కడ ఇసుకలో నీటి గుమ్మీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇసుకాసురులు నీటి గుమ్మీల వద్దనే ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో నాగలదిన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లోని సివిల్, మోటార్ వెహికల్ ప్రమాదాలు, వివాహ సంబంధమైన కేసులు, భూసేకరణ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్, మున్సిపల్ ట్యాక్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పది సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల పరిష్కారానికి ఈ ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కల్లూరు, మద్దికెరలో అతి పెద్ద గోదాములు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని కల్లూరు, మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి పెద్ద గోదాములు నిర్మించుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ ప్రాజెక్టు (డబ్ల్యూఎల్జీఎస్పీ) కింద ఒక్కో సంఘం పరిధిలో 2,500 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించడానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకులోని ఫ్యాక్స్ డెవలప్మెంటు సెల్ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. ఈ గోదాములు నిర్మించాలంటే కనీసం 2 ఎకరాల భూమి అవసరం. మద్దికెర, కల్లూరు సహకార సంఘాలకు ఈ స్థాయిలో భూములు ఉండటంతో డబ్ల్యూఎల్జీఎస్పీ కింద గోదాముల నిర్మాణానికి సహకార శాఖ చర్యలు చేపట్టింది. డబ్ల్యూఎల్జీఎస్పీ 33 శాతం సబ్సిడీ ఇస్తుంది. జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాము వ్యాపారుల సిండికేట్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారుల సిండికేట్ కొనసాగుతోంది. మార్కెట్లో వాముకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సిండికేట్ కారణంగా ధరలు పెరుగకపోగా తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం మార్కెట్కు వాము 994 క్వింటా ళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,011, గరిష్ట ధర రూ.26,800 లభించగా..సగటు ధర రూ.12,6 99 మాత్రమే నమోదైంది. ఈ నెల 2న వాముకు లభించిన గరిష్ట ధర రూ.30,303 ఉండగా.. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. మార్కెట్కు వాము భారీగా వచ్చేలా ఒకటి, రెండు చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేయడం పరిపాటిగా మారింది. ఆర్యూలో విద్యార్థుల మధ్య గొడవ కర్నూలు (సెంట్రల్) : రాయలసీమ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. పీజీ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఏడాదిలో విద్యార్థుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం ఇది నాలుగో సారి. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఓబులేసు అనే విద్యార్థిపై మూడో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో నోటి వెంబడి రక్తం వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు కొందరు కలగజేసుకుని దాడిని సద్దుమణిగించారు. అయితే, దాడిచేసిన బీటెక్ విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. వర్సిటీలో తరచూ విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల మధ్య గొడవలు ర్యాగింగ్కు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై వైస్ చాన్స్లర్ వి.వెంకటబసవరావు స్పందిస్తూ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ లేకుండా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దాడి సంఘటనపై విచారణ చేయిస్తానని వివరించారు. అహోబిలేశుడికి బ్రహ్మరథం ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడికి ఊరూరా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి పార్వేట మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం ఉత్సవ పల్లకీ ఎస్ లింగందిన్నెలో కొలువు దీరింది. పొలిమేరకు చేరుకున్న పల్లకీకి గ్రామస్తులు స్వాగతం పలికారు. -
అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు
కర్నూలు: కర్నూలు పాతబస్తీ బండిమెట్ట అంబాభవా ని ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. శివస్వాములకు భిక్ష ఏర్పా టు చేసేందుకు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ మారుస్తుండగా పక్కనే ఉన్న దీపం సెగ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే వంట పనిచేస్తున్న లలితాబాయి, తులసి, కిట్టు, లక్ష్మి తదితరులు గాయపడ్డా రు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మాజీ ఎమ్మెల్యే చేయూత కర్నూలు(టౌన్): పాతబస్తీలో నెలరోజుల వయస్సు ఉన్న శిశువుకు గుండె సంబంధిత సమస్య తెలెత్తింది. చికిత్స కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు కిమ్స్ అసుపత్రికెళ్లగా పరీక్షించి ఆపరేషన్ అవసరమని, ఇందుకు రూ. లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేని మైనార్టీ వర్గానికి చెందిన ఆ దంపతులు వారం రోజుల క్రితం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ను కలిసి సమస్య విన్నవించారు. వెంటనే ఆయన స్పందించి కిమ్స్ ఆసుపత్రి యజమాన్యాంతో మాట్లాడి శిశువుకు అవసరమైన గుండె ఆపరేషన్ చేయించారు. మంగళవారం ఆ దంపతులు బిడ్డను తీసుకొని మాజీ ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
మూతపడిన బంగారు దుకాణాలు
ఎమ్మిగనూరుటౌన్: పుత్తడి, వెండి ధరలు అమాంతం పెరగడం.. మళ్లీ రోజుల వ్యవధిలో తగ్గుముఖం పడుతుండటంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో హెచ్చతగ్గులను భరిస్తూ వ్యాపారాలు చేయలేమని ప్రభుత్వాలు స్పందించి ధరలను స్థిరీకరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని షరాఫ్ బజార్లో బంగారు వ్యాపారులు తమ దుకాణాలు మూసి నిరసన తెలిపారు. ఽఆభరణాల తయారీకి కొన్న బంగారు, వెండి ధరలు తగ్గుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని గోల్డ్, సిల్వర్ దుకాణాల అసోసియేషన్ నాయకులు పీసీఆర్ వలి, మోహన్, ఖాదర్బేగ్ తదితరులు పేర్కొంటున్నారు. ధరలను స్థిరీకరిస్తే వ్యాపారాలు చేయగలుగుతామని తెలిపారు. -
బాబుపాలనలో బిహార్గా మారిన ఏపీ
● రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది ● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రపద్రేశ్ బిహార్గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకపాలన నడుస్తోందన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, పెట్రోలు బాంబులు వేసి ఇళ్లను తగలబెట్టడం, మహిళా మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ గుండాలు దాడులు చేయడం దారుణమన్నారు. ఏపీకి బిహార్ సంస్కృతిని తీసుకువస్తున్నారన్నారు. కూటమ సర్కారు రెండేళ్ల పాలనలో రెడ్ బుక్ అమలు తప్ప.. సంక్షేమ పాలన కనిపించడం లేదన్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇండియాలో కాకుండా పాకిస్తాన్లో ఉన్నామా... అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. మీరు అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందడం నిజం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అభాసుపాలు చేసేందుకు పవిత్ర తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక చెంప పెట్టులాంటిదన్నారు.అయినా, వారు మారలేదని ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్న డీజీపీ స్పందించకపోవడం విచారకరమన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కర్నూలు(సెంట్రల్) : మండల పరిధిలోని ఈ తాండ్రపాడు సమీపంలో బొలెరో వాహనంలో 23 బ్యాగుల్లో తీసుకెళ్తున్న 1050 కేజీల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఎరుకల రాముడు అనే వ్యక్తి పందుల కోసం బియ్యం తీసుకెళ్తన్నట్లు మంగళవారం సమాచారం రావడంతో డీఎస్ఓ ఎం.రాజారఘవీర్ ఆధ్వర్యంలో బృందం దాడి చేసింది. బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శతాధిక వృద్ధుడి మృతి కొలిమిగుండ్ల: కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా స్వయంగా తన పనులు తానే చేసుకునే తిమ్మనాయినపేటకు చెందిన శతాధిక వృద్దుడు ఖాశీం సాహెబ్ (103) మంగళవారం సహజ మరణం చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి నిద్ర కు ఉపక్రమించే సమయంలో కన్ను మూశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 1923లో ఆయ న జన్మించాడు. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలంలోని అబ్దులాపురం కాగా తిమ్మనాయినపేటకు చెందిన నూరూబ్ను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. భార్య పన్నెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాలుగు తరాలను చూసిన ఖాశీం సాహెబ్ చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకునేవారు. బీపీ,షుగర్ వంటి వ్యాధులు కూడ లేకపోవడం గమనార్హం. అక్రమ మద్యం ధ్వంసం డోన్ టౌన్: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని మంగళవారం డోన్ ఎక్స్జ్ పోలీసులు ధ్వంసం చేశారు. పట్టణ శివారులో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 680 లీటర్ల నాటు సారా, దాదాపు 261 లీటర్ల మద్యంను అసిస్టెంట్ ఎక్స్జ్ సూపరింటెండెంట్ రాముడు, నంద్యాల,డోన్ ఎక్స్జ్ సీఐలు లక్ష్మణ్, వరలక్ష్మి, ఎస్ఐ సోమశేఖర్, పట్టణ సీఐ ఇంతియాజ్బాషా ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అలాగే పట్టుబడిన 8 వాహనాల్లో 7 వేలం వేయగా రూ.96,200 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైన్షాపులో చోరీ కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డులో ఉన్న పీఆర్ వైన్ షాపులో సోమవారం అర్ధారాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి వైన్ షాపునకు చెందిన రేకుల షెడ్డు రేకు తొలగించి లోపలకు వెళ్లారు. రూ.40 వేలు విలువ చేసే మద్యం బాటిళ్లు, రూ.1.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు వైన్షాపులో క్యాషియర్గా పని చేసే పుట్ట బాలమద్దిలేటి మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీ నంద్యాల(అర్బన్): పట్టణంలోని చాంద్బాడ, సరస్వతి నగర్లలో ఉన్న 52, 119 రేషన్ షాపుల్లో మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉండటంతో సంబంధిత డీలర్లపై 6ఏ కేసు నమోదు చేశారు. -
మద్దమాంబకు నీరాజనం
● వైభవంగా అమ్మవారి రథోత్సవం అశేష భక్తజనం మధ్య రథోత్సవం మద్దికెర: మద్దమాంబ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండల కేంద్రం మద్దికెరలో వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కంకుమార్చన, విశేషపూజలు, మహామంగళ హారతి తదితర కార్యక్రమాలతో పాటు నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారికి ఆకు పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథంలో కొలువుంచారు. అనంతరం రథం ముందు హోమం కాల్చి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు మద్దమాంబకు జై అంటూ రథాన్ని ముందుకు లాగారు. రథం పైకి అరటిపండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు. ఈ వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
చౌడేశ్వరి మాతా.. రక్షమాం!
శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాల సందర్భంగా సోమవారం సాయంత్రం కోడుమూరులో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. తొలుత అమ్మవారి రథానికి దైవచార అటకార సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు ‘చౌడేశ్వరి మాతా.. రక్షమాం’ అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ ఎర్రిస్వామి తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. – కోడుమూరు రూరల్ -
మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులా?
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలని కోరారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం నేతల దూషణలను వీడియో క్లిప్పింగ్లతో చూపించారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయంలో ఏనాడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదన్నారు. పాలన చేతకాక అసహనంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నేతలను ఎంచుకొని దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజని.. ఇలా అనేక మంది వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇళ్లను ధ్వంసం చేయడం, దాడులకు తెగబడటం అత్యంత దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు రాష్ట్రంలో అరాచక శక్తులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ‘పొరబాటున మాటలు దొర్లాయి’ అని ఒక వైపు మాజీ మంత్రి అంబటి మీడియాను పిలిచి వివరణ ఇచ్చినా, దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీ వ్యవహారంలో అభ్యంతరం చెప్పినందుకే ఈ దాడులు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రకం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని తేలిపోయిందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ లేదంటూ సీబీఐ విచారణలో తెలిపోవడంతో చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తూ, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఎస్వీ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ నేతలు దూషించారన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, పట్టాభి, వంగలపూడి అనిత, నారాయణ అవమానకరంగా మాట్లాడినా కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండబోరన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం మారితే ఇప్పుడు దాడులు చేస్తున్న టీడీపీ నా యకులు, కార్యకర్తల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. అప్పుడు కాపాడటానికి చంద్రబాబు, లోకేష్ ముందుకురారని, సినిమా షూటింగ్ల్లో పవన్ కళ్యాణ్ ఉంటారన్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కొంత మంది పోలీసు అధికారుల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులు యాదవ్, కటారి సురేష్, తిరుమలేశ్వర రెడ్డి, కార్పొరేటర్ క్రిష్ణ కాంత్ రెడ్డి, కిషన్, పత్తాబాషా, రామాంజనేయులు పాల్గొన్నారు. కర్నూలు రెండో పట్టణ సీఐకి ఫిర్యాదు కల్తీ నెయ్యి కేసుపై సిట్ చార్జ్షీట్కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ నాగరాజును కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ మాజీ సీఎంకు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోస్టర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు పరువు పోయిందనే దాడులు వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
వేరుశనగ ధర తగ్గుతోంది
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అన్ని మార్కెట్ల్లో వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం మూడు మార్కెట్ల్లో కూడా ధరలు తగ్గడం గమనార్హం. ఎమ్మిగనూరు మార్కెట్లో గరిష్ట ధర రూ.6,980, ఆదోనిలో రూ.8,900, కర్నూలు మార్కెట్లో రూ.9,790 లభించింది. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ధర దయనీయంగా ఉండగా.. కర్నూలు మార్కెట్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇటీవల క్వింటా వేరుశనగ ధర రూ.15వేల వరకు చేరుకుంది. – వాము వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. మార్కెట్కు వాము 1120 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,222, గరిష్ట ధర రూ.30,303 లభించింది. సగటు ధర రూ.16,099 మాత్రమే నమోదైంది. వ్యాపారుల సిండికేట్ వల్ల వాము రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
రెవెన్యూ సమస్యలే అధికం
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం నిర్వహించారు. మొత్తం 238 అర్జీలు రాగా అందులో రెవెన్యూ క్లినిక్లకు సంబంధించినవి అధికంగా 136 ఉన్నాయి. అర్జీలు ఇచ్చినవారు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఏఒక్క అర్జీ కూడా నిర్ణీత సమయంలోపు పరిష్కారం కాకుండా ఉండకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇస్తే పరిష్కారానికి సులభం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అర్జీలను స్వీకరించారు.కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది శూన్యం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిచిప్పగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది శూన్యం అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పోలవరానికి రూ. 3,300 కోట్లు తప్ప ఏమీ లేదన్నారు. నిత్యం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి చంద్రబాబు సాధించింది ఏముందని ప్రశ్నించారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే వారు, ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన రూ. 3,300 కోట్లతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలా పూర్తి చేస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచకుండా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారం చేపట్టిన మొదట్లో ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని ఆశలు చూపింది. ప్రభుత్వ మాటలు నమ్మిన ఆయా వర్
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రుణాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, బీసీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ నెలలో హడావిడి చేసింది. ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్ను కూటా కేటయించినట్లు నమ్మబలికింది. పేదలు అనేక అకష్టాల మధ్య దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే నేటి వరకు రుణాలపై ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. జగనన్న పాలనలో అనేక పథకాల ద్వారా ఆన్ని వర్గాల ప్రజలకు నగదు బదిలీ జరిగింది. – ఆర్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఆయా కార్పొరేషన్లకు పాలక వర్గాలను నియమిస్తున్నారే కానీ, నిధులు కేటాయించడం లేదు. ఇప్పటి వరకు ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖాలాలు లేవు. నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణలో శూన్యం. ఆయా కార్పొరేషన్ల కార్యాలయాలు బోసి పోయాయి. అధికారులకు కేవడం రికవరీకే పరిమితమవుతున్నారు. ప్రస్తుత బడ్జెట్లోనైనా ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. – గౌస్దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి కర్నూలు(అర్బన్): స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. పేద వర్గాలను సంతృప్తి పరిచేందుకు గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో రుణాలు అందిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. కష్టాల మధ్య ఆన్లైన్ చేసిన తమ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో, కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొనింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్భాటాన్ని చూసి పేద వర్గాలకు చెందిన యువత పోటీపడి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే చివరకు ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మాట మార్చింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత, పేద వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. సైట్ను క్లోజ్ చేసి చోద్యం! జిల్లాలోని 2,034 మంది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.41.23 కోట్ల మేర సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం 2025 ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను నమ్మి దాదాపు 27 వేల మంది అనేక కష్టాల మధ్య దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, మండలాలు, మున్సిపాలిటీల వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. తీరా నేడో, రేపో రుణాలు అందుతాయనే సంతోషంతో ఉన్న బీసీ వర్గాలకు రుణాలకు సంబంధించిన సైట్ క్లోజ్ చేశారనే చావు కబురును చల్లగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీ రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోరాదని తేల్చేశారు. దీంతో గత తొమ్మిది నెలలుగా దరఖాస్తు చేసుకున్న వారందరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దిక్కుతోచని స్థితి జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 973 మందికి రూ.40.73 కోట్ల మేర సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ 4న వార్షి ప్రణాళికలను విడుదల చేశారు. అర్హులైన ఎస్సీలకు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ( 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ) రుణాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన వారు ఏప్రిల్ 14 నుంచి మే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. దీంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉన్నా మే నెల 11న దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ ఓబీఎంఎంఎస్ క్లోజ్ అయ్యింది. అయితే సైట్ను ఎందుకు క్లోజ్ చేశారంటే ... లబ్ధిదారులకు అనుకూలమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా యూనిట్లను మారుస్తున్నామంటూ ప్రభుత్వం బుకాయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వివిధ యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పథకం లబ్ధిపొందిన వివిధ వర్గాలు జమ అయిన మొత్తం (రూ.కోట్లలో) వైఎస్సార్ చేయూత 1,24,045 రూ.905.80 వైఎస్సార్ ఆసరా 2,49,976 రూ.568.28 కళ్యాణమస్తు, షాదీ తోఫా 2952 రూ.23.71 జగనన్న తోడు 92,739 రూ.126.81 వైఎస్సార్ బీమా 4578 రూ.45.49 వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు 29,520 (గ్రూపులు) రూ.140.36 జగనన్న చేదోడు 1,02,452 రూ.102.45 వైఎస్సార్ కాపునేస్తం 26,152 రూ.39.22 ఈబీసీ నేస్తం 64,733 రూ.97.10 మొత్తం: 6,97,147 రూ.2,049.22అదే దారిలో మైనారిటీ, గిరిజన రుణాలు.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించాల్సిన రుణాల్లో జాప్యం చోటు చేసుకోగా, మైనారిటీ కార్పొరేషన్లో అరకొరగా దరఖాస్తులను స్వీకరించి వెంటనే నిలిపివేసినట్లు సమాచారం. గిరిజన కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలకు సంబంధించిన వార్షిక ప్రణాళిక నేటికి కూడా రూపొందించనట్లు తెలుస్తోంది. ఎస్సీ, బీసీలకు తొమ్మిది నెలలుగా అందని రుణాలు మైనారిటీ, గిరిజన రుణాలపై పెదవి విప్పని చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు రూ.40.73 కోట్లు, బీసీలకు రూ.41.23 కోట్లు అంటూ ఆర్భాటం గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, బీసీ వర్గాలు దరఖాస్తులపై నేటికి స్పష్టత కరువే -
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు
కర్నూలు(హాస్పిటల్): జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా ఈనెల 17న విద్యార్థులందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు 0–5 ఏళ్ల వరకు అందించాల్సిన వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికారులు డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మల్లికార్జున, డీపీఎంఓ డాక్టర్ శైలేష్ కుమార్, డెమో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాలకు వచ్చే విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. బిల్లింగ్, పోల్స్ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ పాల్గొన్నారు. కర్నూలు: రైల్వే, ఆదాయ పన్ను శాఖలో నా అల్లుడు, స్నేహితుడి కుమారుడికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముంబైకి చెందిన ప్రవీణ భద్రినారాయణ ఖండేల్వాల్, మిథున్ దాస్లు రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్కు చెందిన మన్సూర్ అహ్మద్, దేవదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పత్తికొండ లక్ష్మీనగర్కు చెందిన లోకేష్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలసి ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్లైన్ నగదు దోపిడీ, కుటుంబంలో వేధింపులు, ఆస్తి తగాదాలపై ఎక్కువమంది ఫిర్యాదు చేశారు. వాటన్నిటిపై చట్ట పరి ధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి తదితరులు కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో తమ సమస్యలు చెప్పుకుంటున్న అర్జీదారులు -
అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్
బనగానపల్లె: యనకండ్ల గ్రామానికి చెందిన ఎస్సీ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు దాట్ల అమర్నాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆదివారం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 15వ తేదీన ఘటన జరగడంతో ఆమె మానసికంగా కుంగిపోయి వారం రోజుల తర్వాత మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కల్పన దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితుడు దాట్ల అమర్నాథ్ రెండు కేసులు ఉన్నాయని, గ్రామంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తెలిందన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్లో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇచ్చినా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత రాలేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఎయిర్పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులను సాధించడంలో కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలు విఫలమయ్యారని తేటతెల్లం అయ్యింది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్ పరిశ్రమలకు ఇప్పటి వరకు ఇచ్చే రూ.10 కోట్ల రుణాన్ని రూ.20 కోట్ల వరకు పెంచారు. జిల్లాలో ఇవి 1500 ఉన్నాయి. మరోవైపు ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. జిల్లాలో 5 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో ఎంపీలు వివరణ కోరాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడకు నేరుగా రైలు లేదు కర్నూలు నుంచి రాజధాని అమరావతి(విజయవాడ)కి వెళ్లేందుకు నేరుగా రైలును కేటాయించలేదు. అలాగే 48 ఏళ్లుగా ప్రతిపాదన ఉన్న కర్నూలు–మంత్రాలయం కొత్త రైల్వేలైన్, పంచలింగాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రిహబులిటీ వర్కుషాపునకు నిధులు ఇవ్వలేదు. కాచిగూడ – గుంటూరు ఎక్స్ప్రెస్ను విజయవాడ వరకు పొడిగించాలనే డిమాండ్ను పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె హైస్పీడు రైళ్లు కర్నూలు మీదుగా వెళ్లే అవకాశం ఉంది. వేతన జీవులకు ఊరట కర్నూలు జిల్లాలో ట్రేజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా మరో 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబులను సవరించారు.రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీంతో దాదాపు 20 వేల మందికి పన్ను నుంచి మినహాయింపు కలిగే అవకాశం ఉంది. జిల్లాకో బాలికల హాస్టల్ జిల్లాలో 6,20,658 లక్షల మంది రైతులు ఉన్నారు. ధరలు పతమైన సమయంలో కంది, మినుములను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి, అధికోత్పత్తి వంగడాల సృష్టి కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ఏర్పాటు చేస్తామని, పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. జిల్లాకో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఊతమివ్వని బడ్జెట్ ఇది. ఏపీ, తెలంగాణలకు పెద్దగా ఉపయోగపడని బడ్జెట్ ఇది. విశ్వ విద్యాలయాలకు ఏమాత్రం నిధులు లేవు. కర్నూలు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. ఇది ప్రాంతీయ అసమానతలకు దారి తీసే అవకాశం. పరిశ్రమలు, వ్యవసాయానికి చేయూతను ఇచ్చారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి ఏ మాత్రం నిధులు ఇవ్వలేదు. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్ప్రొఫెసర్కేంద్ర బడ్జెట్తో పేదలకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. టీడీపీ, బీజేపీ ఎంపీలు 21 మంది ఉన్నా బడ్జెట్లో నిధులు రాలేదు. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్ ప్రస్తావన లేదు. అమరావతికి రైలు లేదు. రైతులకు కనీస మద్దతు ధరపై మాట్లడలేదు. ఇది పూర్తిగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్. బడ్జెట్ సవరణలో ఏపీకి నిధులపై ఎంపీలు పోరాటం చేయాలి. – ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి గుండుసున్నా నిధులు వచ్చాయి. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ, ఇది సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్. ఎన్నికలు ఉన్నా తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల కోసమే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏపీకి ఒక్కప్రాజెక్టకు నిధులు లేవు.– బి.గిడ్డయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ కేంద్ర బడ్జెట్లో ఏపీకి, కర్నూలుకు నిధులుసాధించడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో రిక్తహస్తం చూపారు. రైతులకు కనీస మద్ధతు ధరపై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ బడ్జెట్తో ఉపయోగం లేదు –డి.గౌస్దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఈ బడ్జెట్ దేశ దిశ గతిని మార్చేది. అభివృద్ధి సాధించాలి. ఆ ఫలాలు పేద,మ ధ్య తరగతి వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 12.75 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు మేలు చేకూర్చారు. – సాయి ప్రదీప్, జిల్లా అధికార ప్రతినిధి, బీజేపీ కేంద్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన సూక్ష్మ పరిశ్రమలకు లబ్ధి చేకూరే అవకాశం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో వైఫల్యం -
‘సర్’తో మానవ హక్కుల ఉల్లంఘన
● ప్రముఖ కాలమిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం ఫాసిజం వైపు అడుగులు వేస్తోందని, ప్రశ్నించే వారిని జైళ్లలో వేసి నోర్లు మూయిస్తున్నారని ప్రముఖ కాలమిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కర్నూలులోని లలితా కళా సమితిలో పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు ఓంకార్ ఆధ్యక్షతన ‘మానవ హక్కుల పరిరక్షణ–మన ముందున్న సవాళ్లు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ద్వారా దేశంలో కోట్లాది మంది పౌరుల ఓటర్లను తొలగించి వారి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో అక్రమల చోరబాటుదారుల ను అరికట్టడానికి సర్ను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంత వర కు ఎంతమంది వలసదారులను గుర్తించిందో మాత్రం చెప్పడంలేదన్నారు. కానీ సర్ పేరు తో బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో కోట్లాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉపన్యాసకులుగా హాజరైన సీపీడీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచే శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కదాని పట్టించడమే కాక వారి మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ద్వారా ముస్లిం మైనార్టీ ఓటర్లను తొలగించేందుకే బీజేపీ సర్ను తెచ్చిందని ఆరోపించారు. అనంతరం కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం.తేజోవతి, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి, సీపీడీఆర్ఎస్ తెలంగాణ ఇన్చార్జ్ ఎస్ జానీ బాషా ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాము, చంద్రుడు, రమేష్, గోవిందరాజు, హనీఫ్, జహీర్, ప్రియాంక పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో శివయ్య జాతర
ఆదోని అర్బన్: మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని ఆదివారం శ్రీ శంభులింగేశ్వరస్వామి మండల దీక్ష శివ భక్తులు శివయ్య జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వామి శైలేంద్రనాథ్ స్వామి ఆధ్వర్యంలో శివ భక్తులు శివలింగాన్ని వాహనంలో కొలువుంచి ప్రధాన రహదారిలో ఓం నమఃశివాయ అను నామస్మరణతో ఊరేగించారు. ఆదోనిలో ప్రధాన రహదారులంతా ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగింది. డోలు, సన్నాయిల మధ్య శివస్వాములు చిందులు, శివతాండవం చేసుకుంటూ ఊరేగింపు ముందు శివయ్య జాతరను వైభవంగా నిర్వహించారు. శివయ్య ఊరేగింపులో శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై సంతపేట, బంగారు బజారు, మార్కండేయస్వామి, నిర్మల్ టాకీస్, కోట్ల కూడలి, పాత బస్టాండు మీదుగా శంభులింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంది. అనంతరం శివభక్తులకు అన్నదానం జరిగింది. -
ప్రత్యేక ఉద్యమం.. జేఏసీ చోద్యం
● టీడీపీ నాయకులను వదిలేసి రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న వైనం ● జేఏసీ తీరుపై పట్టణ ప్రజల విమర్శలుఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు జిల్లా కోసం టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డినో, టీడీపీ నాయకులనో అడ్డుకొంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకు విరుద్ధంగా జేఏసీ నాయకులు ఆదివారం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకుని విడ్డూరపు నాటకం ఆడారు. వాహనం దిగి వచ్చిన రాజీవ్రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతల మాటలను చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ వింటుందని చెప్పినా ఆందోళనకారులు వినలేదు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉండగా అంతకుమునుపే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ర్యాలీ చేసిన అధికార టీడీపీ నాయకులను జేఏసీ నాయకులు ఎందుకు అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేయడం, ఆయన ఇంటిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన రాజీవ్రెడ్డిని ఎందుకు అడ్డగించారని, ఇందులో ఏదో మతలబు ఉందని అన్నారు. -
మంచాలమ్మా.. దీవించమ్మా!
మంత్రాలయం: మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాలో తయారు చేయించిన బెల్లం అచ్చులతో, చెరకు గడలతో, గడ్డితో ఆదివారం అలంకరించారు. విశేష పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం మహాద్వారం నుంచి ‘మంచాలమ్మా.. దీవించమ్మా’ అంటూ భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం చేశారు. అనంతరం మూల బృందవనానికి నిత్య పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి, మహా మంగళ హారతి చేశారు. శ్రీ మఠం ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పూజ నిర్వహించారు. బళ్లారి జిల్లాలో తెక్కలకోటకు చెందిన ఏడు వందల మంది భక్తులు కాలినడకతో 120 కిలో మీటర్లు దూరం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్నారు. -
మామిడి తోట సాగు చేశా..
మాకు 3.76 ఎకరాలు ఉన్నా గతంలో పంటలు పండక, పెట్టుబడులు కూడా రాక అప్పులై వాటిని తీర్చేందుకు రాజంపేట, రైల్వేకోడూరు వలస పోయే వాళ్లం. ఉపాధి పథకం అమలు చేసిన తర్వాత మా బతుకులు మారిపోయాయి. మామిడి చెట్లు నాటాం. మూడేళ్ల పాటు చెట్లను పెంచుకునేందుకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏటా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఉపాధి పథకంతో ఎంతో మేలు జరిగింది. వలసలు పోకుండా సొంతూళ్లోనే ఉంటున్నాం. – ఆర్ గోలేనాయక్, సన్నకారు రైతు, మీటేతండ 20 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్షాలు ఒత్తిడి తేవడంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది. ఎంతో మంది పేదలు, రైతులకు ఆసరాగా నిలిచిన పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీబీజీ రామ్జీ పేరు మార్పు తప్ప ఒరిగేదేమీ లేదు. చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు. ఉపాధి పథకాన్ని తల లేని మొండెంగా తయారు చేసింది. 125 రోజులకు పని దినాలు పెంచుతున్నట్లు చెప్పి నిధులు తగ్గించింది. కొత్త చట్టంతో పేదల పొట్ట కొడుతోంది. – నబీ రసూల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచన పాలన సాగిస్తోందని, టీడీపీ గుండాలు విధ్వాంసాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు శనివారం హత్యాయత్నానికి పాల్పడి, ఆయన కారుకు నిప్పటించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆదివారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బానాయించి అరెస్టు చేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమన్నారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంబటి అక్రమ అరెస్టు కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ప్రమాదం లడ్డూలో కల్తి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సిట్ ఆధికారుల విచారణలో భాగంగా లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టుకు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంబటి రాంబాబుపై దాడికి పాల్పడి అక్రమ అరెస్టు తెరలేపారనన్నారు. అరెస్టులతో ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. పోలీసుల అత్యుత్సాహం చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల అత్యుత్సాహం చేస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేసి రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడిపిస్తున్నారని విమర్శించారు. ఎల్లాకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని పోలీసులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. నిరసనలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున కో–ఆప్షన్ మెంబర్ బాషా, జిల్లా నాయకులు చిన్న ఈరన్న, నాయకులు వెంకటేషులు, శివ, హనుమంతప్ప, భాస్కర్, నెట్టెకల్లు, బి.మల్లికార్జు, ఎల్లప్ప, వరుణ్, జే.వీరేష్, ధనుంజయ, ఈరన్న, రొక్కప్ప, చంద్ర, నాగేష్, బి.ఈరన్న, నాగప్ప, రామలింగ, మల్లప్ప, వీరభద్రి, వీరేష్, మునెప్ప, సురేంద్ర, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
46 ఏళ్ల తర్వాత..
కర్నూలు(సెంట్రల్): కోడుమూరు మండలం లద్దగిరి జెడ్పీ పాఠశాలకు చెందిన 1979–80వ బ్యాచ్ పూర్వపు విద్యార్థులు 46 ఏళ్ల తరువాత అపూర్వ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాలులో అప్పటి విద్యార్థి, నేటి అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 46 ఏళ్ల తరువాత మళ్లీ ఒకే వేదికపైకిరావడంతో బాల్య స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యా రు. పాఠశాల తరగతి గదులు, ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యార్థి జీవితంలోని మధుర క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. హోదాలు, బాధ్యతలను పక్కనబెట్టి మళ్లీ విద్యార్థులుగా మారిన ఆ మధుర క్షణాలు సమ్మేళానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కటే నవ్వులు, కన్నీళ్లు, ఆనందం కలసి ఈ సమావేశాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చాయి. కాగా.. ఈ సమ్మేళనంలో 15 మంది పూర్వ విద్యార్థుల ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా అప్పటి విద్యార్థి, సాహిత్యాభిమాని ఉమ్మరాజు చిన్న ఓబులేసు రచించిన శ్రీషిరిడి సాయి స్తోత్ర శతకాన్ని స్నేహితులు ఆవిష్కరించారు. -
రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
ఆదోని రూరల్: ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వెట్టి చాకిరి (బాండెడ్ లేబర్) నుంచి 21 మందికి విముక్తి కల్పించారు. ఆదోని ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కపటి–నాగలాపురం గ్రామాల మధ్య ఉన్న ఇటుకల బట్టీలో మూడు నెలలుగా ఒడిశా, ఛత్తీస్ఘడ్, రాష్ట్రాలకు చెందిన 21 మంది వెట్టి చాకిరి పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 16 మంది పెద్దలు కాగా, అందులో పురుషులు ఏడుగురు, మహిళలు 9 మంది, ఒక బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. ఇటుకల బట్టీలో పని చేయించేందుకు ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి, అనంతరం వారిని తీవ్రంగా వెట్టి చాకిరి చేయించేవారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా విడుదల చేయించారు. విడుదలైన వారందరికీ ప్రభుత్వం తరపున రిలీజ్ సర్టిఫికెట్లు అందజేశారు. బాధితులకు రావాల్సిన వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, వారిని సొంత ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ తెలిపారు. వెట్టి చాకిరి నేరమని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఎవరైనా ఈ విధమైన అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తంగాకుండా కార్మిక శాఖ అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాని సబ్కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వెట్టి చాకిరి నుంచి 21 మందికి విముక్తి -
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
కర్నూలు(సెంట్రల్): నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియ ప్రాంగణంలో నవోదయ 2.0 లో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఉపా ధి కల్పనకు సంబంధించిన కర్నూలు నగరంలోని 20 మంది బంగారుపేట వాసులకు ఇండియన్ బ్యాంకు ద్వారా మంజూరైన ఆటోలు, తోపు డు బండ్లు, కంకర మిల్లర్లను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని సూచించారు. నాటుసారా తయారీ మాని ముందుకు వచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపుతామని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ డీసీ శ్రీదేవిమాట్లాడుతూ.. బంగారుపేటలో ఇంకా మిగిలిపోయిన వారందరూ సారాను కాయడం మాని స్వయం ఉపాధితో బతికేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం ద్వారా అర్థిక సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రూ.20 లక్షల విలువైన వాహనాలను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు, మెప్మా పీడీ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
ఆళ్లగడ్డ: గంజాయి దిగుమతి చేసుకుని విక్రయాలు చేపడుతున్న ఐదురుగురు ముఠా సభ్యులను శనివారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ వివరించారు. శిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామా నికి చెందిన జింకల మద్దిలేటి దగ్గరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసులు బోయిలకంట్ల గ్రామ సమీపంలోని కాశినాయన ఆశ్రమం దగ్గరకు గంజాయి తీసుకుని వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడ మాటు వేశారు. అక్కడ మద్దిలేటి, కోడూరు శ్రీనివాసులుతో పాటు దండబోయిన గురుస్వామి, షేక్ అబ్దుల్ నబీ, మెఘల్ గఫార్బేగ్ గంజాయిని తరలించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోడూరు శ్రీనివాసుల ద్వారా ఒడిశా నుంచి గంజాయి సరఫరా చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించారు. ఐదుగురికి రిమాండ్ -
ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీయడం ఘోర అపచారం
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: రాజకీయ స్వార్ధం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేశారని, ఇది ఘోర అపచారం అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో కార్యకర్తలతో కలసి శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎదుట టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. గతంలో చంద్రబాబు అలిపిరి సంఘటన నుంచి బయటకు వచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, హనుమాపురం ఈరన్న, మంత్రాలయం మండల కన్వీనర్ భీమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దురుద్దేశంతోనే..
ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసిందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతల వక్రబుద్ధి మారాలని కోరుతూ శనివారం రుద్రవరం మండలం శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరిహార పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం చేరుకున్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. -
ఇంటి వద్దే పింఛన్లు మాటల్లోనే!
హాలహర్వి: చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంటోంది. ప్రతినెలా వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. చింతకుంట గ్రామంలో శనివారం సచివాలయ సిబ్బంది ఓ ఆలయం వద్దకు కూర్చొని పింఛన్లుదారులను అక్కడికే రప్పించుకున్నారు. దీంతో ఇళ్ల నుంచి పింఛను పంపిణీ ప్రాంతాలకు చేరుకునేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ నోటి మాటలకే పరిమితమవుతోంది. 2024 జూలై నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నా ఆచరణలో 20 నుంచి 30 శాతం వరకే పంపిణీ జరుగుతోంది. శనివారం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగింది. సర్వర్ సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైంది. 10 గంటల వరకు సర్వర్ వేధించడంతో అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 గంటల తర్వాత సచివాలయాల్లోనే పంపిణీ చేయడంతో అతి కష్టం మీద వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతూ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కల్లూరులో పింఛన్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కోడుమూరు, సీ.బెళగల్, కర్నూలు, ఆదోని, డోన్, బనగానపల్లి, అవుకు తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రానికే పరిమితమైంది. ఇదిలాఉంటే కర్నూలులోని కొత్తపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్ల పంపిణీ చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 91.53 శాతం పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 2,13,117 పింఛన్లు ఉండగా 1,94,311 పంపిణీ చేశారు. ఈ జిల్లాలో 91.18 శాతం పంపిణీ పూర్తయింది. -
శ్రీవారి లడ్డూను రాజకీయ లబ్ధికి వాడుకోవడం దుర్మార్గం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి చిప్పగిరి: శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవమని, స్వామి ఆలయంలో ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూనూ కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు వాడుకోవడం దుర్మార్గమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరి కాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక్క అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆధారం లేకుండా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎలా అరోపణలు చేస్తారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ గుడి మెట్లను శుభ్రం చేసి నటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సీబీఐ సిట్ చార్జిషీట్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, సర్వర్ఖాన్, సేనాపతి, జయన్న, మహానంది, నెట్టికంటి తదితరులు పాల్గొన్నారు. -
7న నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరు రూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం 9వ, 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. శనివారం ఆమె స్థానిక విద్యాలయంలో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి లేటరల్ ఎంట్రీ పరీక్షకు 9వ తరగతికి 1,014 మంది.. 11వ తరగతికి 1,382 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 9వ తరగతి ప్రవేశానికి బనవాసి నవోదయ, మాచాని సోమప్ప బాలికల పాఠశాలలో.. 11వ తరగతికి బనవాసి ఏపీఆర్ గురుకుల పాఠశాల, ఎమ్మిగనూరులో, ప్రభుత్వ బాలుర పాఠశాల, జెడ్పీ హైస్కూల్ వీవర్స్ కాలనీ, శ్రీ నీలకంఠేశ్వర జెడ్పీ హైస్కూల్, మాచాని సోపమ్ప ఇంగ్లీష్ మీడియం హైస్కూళ్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. సందేహాలంటే 08512–294545 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఐసీడీఎస్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): శిశు గృహ, బాల సదనాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పి.విజయ తెలిపారు. కర్నూలులోని శిశు గృహలో రెండు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ( ఈడబ్ల్యూఎస్ –1, ఎస్సీ త్రీ –1 ) వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. అలాగే పెద్దపాడు బాల సదనంలో హౌస్ కీపర్ –1 ( ఓసీ ), పత్తికొండ బాల సదనంలో ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ –1 ( ఓసీ ) పోస్టులను పార్ట్టైం పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 9వ తేది లోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు. విద్యార్హతలు, పూర్తి వివరాలకు వెబ్సైట్: https://kurnool.ap.gov.in// కార్యాలయ నోటీస్ బోర్డును పరిశీలించాలని పేర్కొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శ్రీశైలం: ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడను కూల్చి వేయడం దారుణమని, బ్రాహ్మణులు అంటే చులకనగా కనిపిస్తున్నారా అని దేవస్థానం అధికారులను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడ దుర్గ గుడికి సంబంధించిన భూములు మొదలుకొని విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములను టీడీపీ పందేరం చేస్తోందని విమర్శించారు. కరివేన సత్రం ప్రహరీ గోడ కూల్చివేతను సమాచార లోపం అని దేవస్థానం అధికారులు కప్పిపుచ్చుకోవడం సబబు కాదన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఏసీ చంద్రశేఖర్ రెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించడం కాదని, సస్పెండ్ చేయాలన్నారు. సత్రం పరిశీలనకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడం దారుణం అన్నారు. మూడు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మె ల్యే ప్రధాన పురవీధిలో విలేకరులతో మాట్లాడారని, తాను కాటేజీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మహానంది హుండీ ఆదాయం రూ. 37.47 లక్షలు మహానంది: మహానందిలో శనివారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.37.47 లక్షల ఆదాయం లభించింది. స్థానిక అభిషేక మండపంలో ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. 36 రోజులకు శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు కోదండ రామాలయం, ఆంజనేయస్వామి, వినా య క నంది ఆలయాల ద్వారా రూ.36,97,920, గో సంరక్షణ విభాగం ద్వారా రూ.16,695, నిత్య అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.32,511 వచ్చిందన్నారు. -
పాప ప్రక్షాళన చేసుకోండి
తిరుపతి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారని, వారు తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితువు పలికారు. కృష్ణగిరి మండలం కర్ల కుంట గ్రామం తిరుమలరాయుడు స్వామి దేవాలయంలో శనివారం ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఎదుట టెంకాయలు కొట్టారు. భక్తుల మనోభావాలను గాయపరిచిన ‘కూటమి’ నేతలు బహిరంగ క్ష మాపణ చెప్పాలనే పోస్టర్ను అవిష్కరించారు. హిందువుల మనోభావాలను కించపరచిన సీఎంచంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు తిరుమలలో ముక్కును నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ
ఎమ్మిగనూరురూరల్: మండల పరిఽధిలోని చెన్నాపురం గ్రామం మలుపు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటేకల్ గ్రామానికి చెందిన బోయ ఉరకుందు ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి తమిళనాడుకు చెందిన లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఎద్దుల బండి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొట్టడంతో బండిపై ఉన్న బోయ కురుకుంద, ఎమ్మిగనూరుకు చెందిన బొలెరో డ్రైవర్ ఉరుకుందకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా ధ్వంసం కాగా, ఎద్దు కొమ్ము విరిగి గాయపడింది. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్, వాష్ అండ్ గో కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీ సులు జిల్లా అంతటా చర్యలు చేపట్టారు. రహదారులపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివా రం తెల్లవారుజాము వరకు స్టాప్, వాష్ అండ్ గో కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్లలోని జాతీయ రహదారులలో లారీలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలెరో వాహనాలను ఆపి వాహన సంబంధిత పత్రాలు, లైసెన్సులతో పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. తెల్లవారుజామున కునుకు తీయకుండా ముందు జాగ్రత్తగా డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి జా గ్రత్తలు సూచించారు. అతి వేగంతో నడపరాదని, రాంగ్ రూట్లలో వెళ్లకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్ జైల్ను మండల లీగల్ సెల్ చైర్మన్, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ హెల్ప్ ఐఎడ్ డెస్క్, క్లినిక్ను తనిఖీ చేసి దాని గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే లీగల్ సెల్ హెల్ప్లైన్ 15100 సమాచారం ఇవ్వాలన్నారు. వృద్ధ, పేద ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి గురు ప్రసాద్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మహిళ అదృశ్యం నంద్యాల(అర్బన్): మండలంలోని అయ్యలూరు మెట్ట గ్రామానికి చెందిన సుప్రియ అదృశ్యమైనట్లు రూరల్ పోలీసులు తెలిపా రు. ఈనెల 29వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన సుప్రియ తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు భర్త ప్రశాంత్ బంధువులు, సన్నిహితుల వద్దకు వెళ్లి విచారించినా ప్రయోజనం లేకుండా పోయింది. సుప్రియ కనిపించలేదంటూ శనివారం ప్రశాంత్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దేవుడంటే బాబుకు నమ్మకమే లేదు
బొమ్మలసత్రం: తిరుమల పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అన్నారు. పట్టణంలోని గుడిపాటిగడ్డ వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూప్రసాదాన్ని రాజకీయానికి వాడుకోవడం తగదన్నారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుదాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
నాపరాతి గనిలో ట్రాక్టర్ బోల్తా
● డ్రైవర్ మృతి అవుకు(కొలిమిగుండ్ల): నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు శనివారం దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. అవుకు మండల పరిధిలోని రామాపురానికి చెందిన బోయ వెంకటరాముడు(45) నాపరాళ్ల లోడింగ్తో పాటు డ్రైవర్గా వెళుతుంటాడు. ఈ క్రమంలోనే ఉదయం ట్రాక్టర్లో గ్రామానికి సమీపంలోని గనిలోకి వెళ్లి నాపరాళ్లను లోడ్ చేసుకొని బయలు దేరాడు. గని మధ్యలోకి రాగానే ఇంజిన్, ట్రాలీకి మధ్యనున్న పిన్ కట్ కావడంతో అదుపు తప్పి ఇంజిన్ భాగం గని గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటరాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గనిలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా అనివార్య కారణాలతో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ కేసీ తిరుపాలు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రంగారెడ్డి, చిన్నమ్మ దంపతుల కుమారుడు పార్థసారధిరెడ్డి (33) ఎంసీఏ పూర్తి చేసి హైదారబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తల్లి చిన్నమ్మ చనిపోవడంతో రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శనివారం ఉదయం గ్రామంలోని కొత్తపల్లె హుసేన్ పశువుల పాక వద్ద పార్థసారధిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని శరీరంపైన ఎలాంటి గాట్లు లేకపోవడంతో అనారోగ్యమా, ఇతర కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి చూడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఐ తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవా సహాయం
● లీలా వెంకటశేషాద్రి కర్నూలు: దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు శనివారం కర్నూలు సీ క్యాంప్లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో మాజీ సైనికుల కోసం నల్సావీర్ పరివార్ సహాయత యోజన 2025లో భాగంగా ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించామన్నారు. ఈ క్లినిక్లో న్యాయవాది, పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వీరు మాజీ సైనికులకు చట్టబద్ధమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయాన్ని అందించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులన్నా. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ఆర్ రత్నరూత్, న్యాయవాది విజయ, పారా లీగల్ వాలంటీర్ మధుసూదన్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం చేరుకునే పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధి కారి శ్రీనివాసరావు అన్నారు. శనివారం వారు క్షేత్ర పరిధిలోని కై లాసద్వారం, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను దేవస్థానం ఇంజినీరింగ్, సంబంధిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా కై లాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక చలువ పందిర్లను (తాత్కాలిక షెడ్డు) పరిశీలించారు. కై లాసద్వారం, భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా చేస్తుండాలని ఆదేశించారు. కై లాసద్వారం వద్ద మొత్తం 60 వేల లీటర్లు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కై లాసద్వారం, హఠకేశ్వరం వద్ద భక్తులకు అన్నదానం చేసే భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలకు దేవస్థానం తరుఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పా టు చేయాలన్నారు. ఆతర్వాత హఠకేశ్వరాలయం వద్ద దేవస్థానం నిర్మిస్తున్న నీటి సంపు నిర్మాణాన్ని పరిశీలించారు. దేవస్థానం నిర్మిస్తున్న జల్లు స్నానాల ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు సుబ్బారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరమేశుడు, బీట్ ఆఫీసరు ఆర్. బాలాజీ ఉన్నారు. -
గ్రీన్కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఓర్వకల్లు: గుమ్మితం తండా పరిధిని బహుళార్ధక సోలార్ పరిశ్రమను స్థాపించిన గ్రీన్కో యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహర్రెడ్డి ఆయన సతీమణి డీసీసీబీ మాజీ చైర్పర్సన్ విజయ మనోహరి శనివారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ సునీల్కుమార్కు ఫిర్యా దు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ దంపతులు మాట్లాడుతూ.. కాల్వ రెవెన్యూ పరిధిలో తమకు 10 ఎకరాలు భూమి ఉందని, అందులో మామిడి మొక్కలు ఉన్నాయన్నారు. భూమిలో సుమారు 4 ఎకరాల మేర గ్రీన్కో యాజమాన్యం వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మామిడి మొక్కలను తొలగించి వ్యర్థాలను నిల్వ చేసినట్లు తెలిపారు. పొలంలో డ్రిప్ పైపులను పగిలి పోయాయన్నారు. ఈ విషయంపై పలుసార్లు కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రీన్కో సిబ్బంది నిర్వాకంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి
దేవుడి పేరు చెప్పుకుని ప్రజలను మభ్య పెడుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కోరారు. ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్లో కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వెంకటేశ్వరస్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళను అత్యాచారం చేసి ఐదుసార్లు అబార్షన్ చేయించిన ఘనత ఆ ఎమ్మెల్యేకే చెల్లించిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ నిందితుల అరెస్ట్
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలో లక్ష్మీవెంకటేశ్వర గోడౌన్ ప్రాంతంలో శుక్రవారం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను చాగలమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పెద్దవంగలి గ్రామానికి చెందిన చిందలూరి మహబూబ్బాషా, స్థానిక పోస్టాఫీసు వీధికి చెందిన అనిమెల దస్తగిరి బాషాలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.50,000లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్ఐ తెలిపారు. -
గోల్డెన్ అవర్లో చికిత్సకు తోడ్పడండి
● ఆర్టీఓ భరత్ చవాన్ కర్నూలు: ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆర్టీఓ భరత్ చవాన్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు శివారు నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు, సిబ్బందికి రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణ, గుడ్ సమారిటన్ అంశాలపై గుడ్ సమారిటన్, రాహ్వీర్ పథకం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకెళ్తే రూ.25 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. ఇయర్ ఫోన్, బ్లూ టూత్ వాడుతూ వాహనాలు డ్రైవ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియో ప్రదర్శించి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంవీఐలు మధుసూదన్, రవీంద్ర కుమార్, నాగరాజ నాయక్, సుధాకర్ రెడ్డి, ఏఎంవీఐలు బాబుకిషోర్, గణేష్ బాబు, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, డీన్ శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్కు ఏడాది జైలు
కర్నూలు: లారీని అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి రైల్వే పోలీసు మృతికి కారణమైన ఐచర్ వాహన డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్.అనిల్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కర్నూలు నగరంలోని అపూర్వ విల్లాస్లో నివాసముంటున్న రైల్వే పోలీసు మేకల వెంకటేశ్వర్లు (56) తన సోదరుడు మేకల శ్రీనివాసులు 2017 డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి వెంకటేశ్వర్లు మోటర్సైకిల్ను ఢీకొట్టగా ఎగిరి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేకల శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాజ్ జిల్లా కేడా గ్రామానికి చెందిన నిందితుడు జితేంద్రపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణ డ్రైవర్ జితేంద్రపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ గోపాలకృష్ణ వాదించారు. తీర్పు అనంతరం నిందితుడిని కర్నూలు సబ్ జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. -
ఘనంగా సిద్ధేశ్వరస్వామి వసంతోత్సవం
హొళగుంద: సిద్ధేశ్వరస్వామి జాతర శుక్రవారం సాయంత్రం వసంతోత్సవంతో వైభవంగా ముగిసింది. గత నెల 23న కంకణ ధారణతో ప్రారంభమైన జాతరలో భాగంగా 28న రథోత్సవం, 29న లంకాదహనం కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం వసంతోత్సవంలో భాగంగా ఆలయంలో సిద్ధేశ్వరునికి ఆకుపూజ, మహామంగళారతి, అభిషేకాలు, తదితర పూజలు చేపట్టారు. అనంతరం రాత్రి పల్లకీలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ పూజారుల ఇంటికి చేర్చడంతో ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన పలు సామాజిక నాటకాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కారులో వచ్చి చైన్ స్నాచింగ్ ఆలూరు రూరల్: బంగారు నగల దొంగలు శ్రుతి మించుతున్నారు. ఏకంగా కారులో వచ్చి చైన్స్నాచింగ్కు పాల్పడుతున్నారు. ఆలూరులో ఓ మహిళ మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు చైన్ను దోచుకెళ్లారు. పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులోని మార్కెట్ యార్డు పక్కన ఉన్న ఇంటి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు సరోజమ్మ తెలిపిన వివరాల మేరకు. సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఇంటి ముందు నిలిపారు. అందులో ఒక వ్యక్తి సరోజమ్మ దగ్గరకు వెళ్లి నీ భర్త ఉన్నాడా.. అని అడిగాడు. ఆ సమయంలో ఆమె భర్త వెంకటరామప్ప లేడని చెప్పగా, ఫోన్ నంబర్ కావాలని ఆడిగాడు. సరోజమ్మ తన భర్త ఫోన్ నంబర్ చెబుతుండగా సెల్ ఫోన్ లేదని, నంబర్ రాసుకోవడానికి పెన్ను, పేపర్ ఇవ్వాలని అడిగాడు. ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మెడలోని బంగారు గొలుసు లాక్కొని కారెక్కి పరారైనట్లు తెలిపారు. అపహరణకు గురైన బంగారు గొలుసు 45 గ్రాములు ఉందని చెప్పారు. గుర్తుతెయని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి అప్పగింత శ్రీశైలం: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో ఒంటరిగా శ్రీశైలం చేరుకున్న బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వన్టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా భీమునిపల్లికి చెందిన భరత్ సింహా రెడ్డి(15) తల్లిదండ్రులతో గొడవ పడి శ్రీశైలం చేరుకున్నాడు. క్షేత్ర పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. బాలుని వివరాలను సేకరించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు శుక్రవారం శ్రీశైలం చేరుకోవడంతో అప్పగించామన్నారు. గోనెగండ్ల హైస్కూల్ వంట ఏజెన్సీ తొలగింపు గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న వంట ఏజెన్సీని తొలగించినట్లు ఎంఈఓ నీలకంఠ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో నాణ్యత లేదని, మెనూ ప్రకారం పాటించడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వంట ఏజెన్సీని తొలగించాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వంట ఏజెన్సీని తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఏజెన్సీ వారు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ పాలకవర్గ సభ్యులు నియామకం కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ సీడ్ సర్టిఫికెట్ అథారిటీ పాలకవర్గం సభ్యులు (గవర్నింగ్ బాడీ)గా సీడ్ మెన్ అసోసియేషన్ నుంచి ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు సభ్యులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవారు కావడం విశేషం. కర్నూలు జిల్లా నుంచి శ్రీకృష్ణ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా నుంచి మంజీరా సీడ్స్ ప్రొప్రైటర్ సి.రామ మద్దిలేటిలను నామినేట్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో జారీ చేశారు. వీరు రెండేళ్ల పాటు పాలకవర్గం సభ్యులుగా కొనసాగుతారు. -
● నేడు జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ● ఎంపీటీసీ సభ్యుల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
జూపాడుబంగ్లా: ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్లు ప్రజా తీర్పును అవమానిస్తూ జూపాడుబంగ్లా ఎంపీపీ సీటును కై వసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూపాడుబంగ్లా ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే సభలో ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా.. వీగిపోతుందా అనేది నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నయానో.. భయానో వైఎస్సార్సీపీకి చెందిన ఆరు గురు ఎంపీటీసీ సభ్యులను అధికారపార్టీ నాయకులు తమ వైపు తిప్పుకొని ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా శనివారం ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి అధ్వర్యంలో జూపాడుబంగ్లా ఎంపీడీఓ కార్యాలయంలో తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులతో అవిశ్వాస తీర్మాన సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే తమకు అనుకూలమైన ఎంపీటీసీ సభ్యులను తెలుగు తమ్ముళ్లు క్యాంపు తరలించగా జూపాడుబంగ్లా–2 ఎంపీటీసీ కృపాకర్ను నరసరావుపేట వద్ద అడ్డుకొని వెనక్కి పిలుచుకొని వచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న తూడిచెర్ల ఎంపీటీసీ దొడ్డా నాగమణిని అధికారపార్టీ నాయకులు క్యాంపునకు తరలించటం గమనార్హం. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానం సభకు ఎంత మంది సభ్యులు హాజరవ్వనున్నారు? వారిలో ఎంత మంది మద్దతు పలుకుతారు? అనే విషయం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సభలో తొమ్మిది మంది ఉండగా వారిలో ఆరుగురు తప్పసరిగా మద్దతు పలికితే తీర్మానం నెగ్గే అవకాశం ఉంది, లేదంటే వీగిపోనుంది. ఈ నేపథ్యంలో పీఓగా వ్యవహరించే ఆర్డీఓ నాగజ్యోతి తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
నగలు ధరించి రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు
కర్నూలు: ఉత్సవాలు, జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకుని వెళ్లకపోవడమే ఉత్తమమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బంగారం ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో దొంగతనాలకు అవకాశమివ్వకుండా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇళ్ల దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు బంగారానికి మెరుగులు దిద్దుతామంటూ ఇళ్ల వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారమివ్వాలని కోరారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలు అప్రమత్తతతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యంత విలువైన ఆభరణాలు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో దాచుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, 112కు ఫోన్ చేసి సమాచారమివ్వాలన్నారు. ప్రజల సహకారంతోనే నేరాల కట్టడి సాధ్యమవుతుందని, అప్రమత్తతే భద్రతకు మూలమని ఎస్పీ తెలియజేశారు. గడిగరేవుల పొలాల్లో చిరుత సంచారం గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలోని పొలాల్లో శుక్రవారం చిరుత పులి కనబడటంతో రైతు భయంతో పరుగు తీశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ రామ్మోహన్రెడ్డి ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. డిప్యూటీ రేంజర్ విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ అబ్దుల్ కలాం పొలాలను పరిశీలించారు. గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. -
వచ్చాడయ్యో స్వామి..
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి పార్వేట మహోత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ పల్లకీ గ్రామగ్రామాన విశేష పూజలందుకుంటూ శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. ఉత్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములు కొలువైన ఉత్సవ పల్లకీ ఉదయం పడకండ్లలో పూజలు ముగిసిన అనంతరం ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. పల్లకీ పట్టణ పొలిమేరలోని వక్కిలేరు బ్రిడ్జిపైకి రాగానే స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యంలో ఎదురేగి గోవిందా.. గోవింద అంటూ నీరాజనం పలికారు. మంగళ వాయిద్యాల మధ్య తన్వయత్వంతో పల్లకీని భుజాలపై ఎత్తుకుని పట్టణానికి తోడ్కొనివచ్చి మొదటి తెలుపైన సర్కార్ తెలుపుపై కొలువుంచారు. కొనసాగిన సంప్రదాయం.. స్వామి ఉత్సవ పల్లకీ పట్టణ పొలిమేరకు చేరుకున్న వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కుల,మతాలకు అతీతంగా ఘన స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం ఉత్సవమూర్తులు మొదటగా ప్రథమ తెలుపు (సర్కారు తెలుపు)పై కొలువుదీరుతారు. అనంతరం ఒక్కో ప్రభుత్వ శాఖ కార్యాలయం వద్దకు స్వామి దూతలు వెళ్లి ఆ కార్యాలయ అధికారి, సిబ్బందిని స్వామి దగ్గరకు మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి దర్శన భాగ్యం కల్పిండం బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా మొదట పురపాలక సంఘం (గ్రామ పంచాయతీ), తహసీల్దార్ , పోలీసు, ఉప ఖజానా, కార్యాలయ అధికారులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వాహనాల మళ్లింపు.. పాత బస్టాండు నుంచి సంత మార్కెట్ వరకు అహోబిలం రోడ్డులో ఇరువైపుల తిరునాల అంగళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్, పోలీస్ అధికారులు పాతబస్టాండు నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. ఈ రహదారిలో వెళ్లే వాహనాలను మరో దారిలో మళ్లించారు. ముత్యాలపాడు – చాగలమర్రి, అహోబిలం, రుద్రవరం తదితర గ్రామాల వైపు వెళ్లనున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలు బైపాస్ రోడ్డుమీద తిరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ తిరునాల ముగిసే వరకు వాహనాలు ఈ రహదారిలోనే తిరిగేలా పోలీస్, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొదలైన తిరునాల శ్రీ అహోబిలేశుడి తిరునాల అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలా నరసింహుడు, ప్రహ్లాదవరదుడు కొలువైన ఉత్సవ పల్లకీ ఏ గ్రామానికి వెళితే అక్కడ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఉత్సవ పల్లకీ పట్టణానికి చేరుకున్న సందర్భంగా పట్టణంలో ప్రధాన వీధుల్లో తిరునాల అంగళ్లు వెలిశాయి. దీంతో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి పోయాయి. చిన్న పిల్లలు, యువతీ యువకులు రంగుల రాట్నాల్లో తిరుగుతూ కేరింతలు కొడుతుంటే మహిళలు తమ ఇళ్లకు వచ్చిన ఆడపడుచులకు, స్నేహితులకు సంప్రదాయంగా గాజులు, కుంకుమను బహుమతిగా ఇస్తున్నారు. దీంతో పట్టణంలో వెలిసిన గాజులు, కుంకుమ అంగళ్లు మహిళలతో కిక్కిరిసిపోతున్నా యి. చిన్న పిల్లలను ఆట బొమ్మల దుకాణాలు ఆకట్టుకుంటున్నాయి. పట్టణ సీఐ యుగంధర్, ఎస్ఐ నగీనల పర్యవేక్షణలో ప్రత్యేక బలగాలతో డీఎస్పీ ప్రమోద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహంతో వలసల నివారణ
శ్రీశైలంప్రాజెక్ట్: చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించవచ్చునని పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లో భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి సహకారంతో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై సదస్సులో పాల్గొన్న వక్తలు తమ ప్రయోగాలు, అనుభవాలు, ఆలోచనలను విశదీకరించారు. పరిశ్రమలు మనుగడ సాగించాలంటే డిజిటలైజేషన్ను ఉపయోగించుకొని ఒక ముడి సరుకుతో ఎన్ని రకాల ఉత్పత్తులు చేపట్టవచ్చో, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చో తెలుసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తి, డిజైన్, క్వాలిటీ, ప్యాకింగ్ చేసుకోవాలన్నారు. స్థానికంగా దొరికే ముడి సరుకుతో ఉత్పత్తులు చేసి, ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడం వలన ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. యువత కొత్త తరహా ఆలోచనలతో చిన్నచిన్న స్టార్టప్లు ప్రారంభించి స్థానికంగా పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. సదస్సులో యోగివేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.విజయభారతి, సిటీ కాలేజీ ఆఫ్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.జాన్సీరాణి, స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.రాజలింగంగౌడ , తెలంగాణ దేవరకొండ ఎంకెఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రవి, హైదరాబాద్ వివేకానంద డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సంతోషి విరాళ, సదస్సు కన్వీనర్ డా.ఎం.బుచ్చయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హుస్సేన్ బాషా, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ జి.సి.ఎల్లారెడ్డి, అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి.తాతిరెడ్డి, ఎస్బీఐ మేనేజర్ బాలన్న, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. -
బడిలో బియ్యం మాయం
● 240 బస్తాలు తరలించి సొమ్ము చేసుకున్న వైనం ● టీడీపీ నేత హస్తంపై అనుమానం ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలలో 3,323 మంది విద్యార్థినులు చదువుతుండగా ప్రతి రోజు 2,500కు మించి మధ్నాహ్న భోజనం తినడం లేదు. మిగతా వారంతా ఇళ్ల నుంచే క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. ఇదిలావుండగా పాఠశాలలో దాదాపు 240 మధ్యాహ్న భోజన బియ్యం బస్తాలను ఇటీవల పట్టణంలోని 33వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడి సహకారంతో స్కూల్ దాటించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేత బియ్యాన్ని కోర్టు రోడ్డులో ఉన్న ఓ డీలర్ వద్ద విక్రయించాడని సమాచారం. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అండతో ఓ వైపు ప్రకృతి వనరులు కొల్లగొడుతూ మరో వైపు పిల్లల నోటికాడ ముద్దను సైతం లాక్కుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే బియ్యం మాయంపై విచారణ చేపట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. కాగా తమ పాఠశాలలో బియ్యం బస్తాల లెక్కలు సరిగా ఉన్నాయని, బియ్యం స్వాహా చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. -
భక్తుల మనోభావాలతో చెలగాటమా?
● చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి బొమ్మలసత్రం: భక్తుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం బ్రాహ్మణ కరివేన సత్రం గోడ కూల్చివేతలాంటి దాడులు కూటమి ప్రభుత్వానికి సరికాదన్నా రు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషాతో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లా డుతూ.. శ్రీశైలం ఆలయ అధికారులు కరివేన సత్రం నిర్వాహకులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ కూల్చివేయటం ఎంత వరకు సమంజసమన్నా రు. బ్రాహ్మణులు దైవానికి, భక్తునికి మధ్య సారథులుగా ఉంటారని, వారి ఆధీనంలో నడిచే సత్రం ప్రహరీని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తిరు మల లడ్డూలో జంతుకొవ్వు కలిపారని ఆరోపించిన కూటమి నేతలకు సిట్ నివేదిక చెంపపెట్టుగా మారిందన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడం చంద్ర బాబు నైజమన్నారు. ఆవునెయ్యిని కల్తీ చేశారని చెబుతూ ఆలయాల మెట్లు శుభ్రం చేసిన పవన్కళ్యాణ్ ఇప్పుడు తిరుమల మెట్లు శుభ్రం చేసి ప్రాయశ్చిత్తం కోరుకోవాలన్నారు. హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషిని హిందువులు మరిచిపోలేదన్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం దుర్మార్గమే... శ్రీశైలంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీని ఆలయ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆలయ అధికారులు గోడను కూల్చారని ఆరోపించారు. ఆలయ అధికారులు కూల్చిన గోడను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పేరుతో హడావుడి చేసే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. తిరుమల లడ్డూపై విషప్రచారం చేసిన నేతలు పుట్టగతులు లేకుండా పోతారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ రాష్ట్ర సెక్రటరీ సద్దల సూర్యనారాయణరెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీగేనా.. నెగ్గేనా ! -
పరిశ్రమల అభివృద్ధికి నైపుణ్యాలు అవసరం
శ్రీశైలంప్రాజెక్ట్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నైపుణ్యాలు అవసరమని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ జి.నరేష్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లోని కృష్ణవేణి రెడ్ల కల్యాణ మండపంలో ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ సహకారంతో చేపట్టిన సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాల మద్దతు, కొత్త ఆలోచనలు అత్యంత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను ఉపయోగించుకొని ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండాలని పలువురు వక్తలు అన్నా రు. వివిధ రకాల చిన్న తరహా పరిశ్రమల ఏర్పా టు, స్థానిక వనరులతో ఉత్పత్తి, పోటీ ప్రపంచంలో మార్కెటింగ్ వంటి అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సదస్సులో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హుస్సేన్బాషా, సదస్సు కన్వీనర్ డా.ఎం.బుచ్చయ్య, అధ్యాపకులు, విద్యార్ధులు, అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి.తాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ జ్యువెలర్స్ ప్రారంభంకర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక పార్కు రోడ్డులో గురువారం యజ్ఞ జ్యువెలర్స్ ప్రారంభమైంది. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు మెచ్చే విధంగా అధునిక డిజైన్లలో జ్యువెలర్స్ ఉన్నాయన్నారు. సంస్థ యజమాని దుగ్గినేని మల్లికార్జున రావు మాట్లాడుతూ.. తమ షోరూం ప్రారంభం సందర్భంగా నగర ప్రజల కోసం ఐదు రోజుల పాటు బంగారు ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ చార్జెస్, ఫ్లాట్ 50 శాతం వేస్టేజ్ ఆఫర్ ప్రకటించామన్నారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు మానికొండ సిరిచందన, మానికొండ భాను ప్రకాష్ పాల్గొన్నారు. కర్నూలులో పట్టపగలే చోరీ ● 14 తులాల బంగారు అపహరణ కర్నూలు (టౌన్): పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే లోపే ఓ ఇంట్లో చోరీ జరిగింది. 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని విజయలక్ష్మీనగర్లో నివసించే మద్దిలేటి ప్రైవేట్ ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తూ గురువారం విధులకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య లక్ష్మీదేవి కూతురుతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని బ్యాంకు వద్దకు పని నిమిత్తం వెళ్లింది. తిరిగి వచ్చిన వారి ఇంటికి తాళం లేకపోవడం, లోపల గడియ పెట్టుకోవడంతో అనుమానం వచ్చి కేకలు వేశారు. ఇంట్లో ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బయటికి వచ్చి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆమె పట్టుకునే ప్రయత్నంలో పెనుగులాట జరిగింది. ఆమెను తొసేసిన ఇద్దరు దొంగలు అక్కడే పార్కు చేసిన వారి బైక్లో పరారయ్యారు. లోపలికి వెళ్లి బీరువాను పరిశీలిస్తే 14 తులాల బంగారు నగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుష్టు వ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు (అర్బన్): జిల్లాలో కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఏర్పాటైన ‘స్పర్శ’ లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ ఏడాది ‘వివక్షతను అంతం చేయడం – గౌరవాన్ని కాపాడదాం’ అనే థీమ్తో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా స్పర్శ లెప్రసి అవగాహన ప్రచార వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాలు, వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. కుష్టు వ్యాధిపై ఉన్న అపోహలు, వివక్షతను తొలగిస్తూ బాధితులకు సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ భాస్కర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.మల్లికార్జున రెడ్డి, డీపీఎంఓస్ టి.చంద్రశేఖర్ రెడ్డి, వై.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ముత్తలూరుకు మేము వెళ్లం!
● అధికార పార్టీ నేతల తీరుతో ఉద్యోగుల బెంబేలు ● బాధ్యతలు చేపట్టేందుకు పంచాయతీ కార్యదర్శి వెనకడుగురుద్రవరం: ప్రభుత్వ అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఉద్యోగులు విధులు నిర్వహించలేక సెలవులపై వెళ్తున్నారు. ఇందుకు ఉదాహరణ మండలంలోని ముత్తలూరు గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. గ్రామ సర్పంచ్ కురువ మహేశ్వరి కొంత కాలంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. వాటికి సంబంధించి బిల్లులు చేయాలని పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ను అడిగారు. విష యం తెలుసుకున్న టీడీపీ నాయకుడు కూడా తాము చేసిన అభివృద్ధి పనులకు ముందు బిల్లులు చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పనులకు సంబంధించి ఎం. బుక్ తదితర రికార్డులు లేకపోవడంతో బిల్లు చేయలేనని తేల్చి చెప్పాడు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావించిన ఆ కార్యదర్శి మెడికల్ లీవ్పై వెళ్లారు. దీంతో ఆలమూరు పంచాయతీ కార్యదర్శి నాములేటికి ముత్త లూరు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే సమస్యాత్మక గ్రామంలో తాను బాధ్యతలు చేపట్టలేనని ఉన్నతాధికారులకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు 10 రోజులుగా సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
అపూర్వ వేడుకకు ముస్తాబు
వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాల అపూర్వ వేడుకకు ముస్తాబవుతోంది. పాఠశాల ప్రారంభమైన 1958 మొదటి బ్యాచ్ మొదలుకొని ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 8న పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం పాఠశాలకు రంగులు వేయిస్తున్నారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రతి ఒక్కరిని రప్పించేందుకు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కమిటీలుగా ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులతో పాటు గురువుల నంబర్లు సేకరించి వ్యక్తిగతంగా వేడుకకు ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పండుగ వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. – కొలిమిగుండ్ల -
లోక కల్యాణార్థం
పేరుసోములలోని విష్ణుకంటి క్షేత్రం పీఠాధిపతి రామ్మోహన్స్వామి లోక కల్యాణార్థం చేపట్టిన పాదయాత్రకు భక్తులు నీరాజనం పలుకుతున్నారు. అవుకు మండలంలోని ఎర్రమల కొండల్లో వెలసిన శ్రీలక్ష్మి కంబగిరిస్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. గురువారం ఉదయం క్షేత్రం నుంచి బయలుదేరిన స్వామి గాలేరి నగరి వరద కాల్వ వెంట కొలిమిగుండ్ల మండలంలోని బెలుం శింగవరంకు చేరుకోగానే భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడే వీరపాపులమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. దారి వెంట భక్తులు కీర్తనలు ఆలపిస్తు ముందుకు సాగారు. కొండపై ఉన్న టెక్కె స్వామి దర్గా వద్దకు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. పదేళ్ల నుంచి ప్రతి ఏటా మాఘమాసంలో పాదయాత్ర చేపడుతున్నట్లు స్వామి పేర్కొన్నారు. సృష్టిలో ప్రతి జీవి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 800 మందికి పైగానే భక్తులు స్వామి వెంట అడుగులు వేస్తున్నారు. – కొలిమిగుండ్ల -
లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి
● వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డికర్నూలు(టౌన్): పవిత్ర తిరుపతి వెంకన్న ఆలయంలో కల్తీ కొవ్వుతో లడ్డూలు చేస్తున్నారంటూ ప్రపంచ వ్యాప్త హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్తీ లడ్డుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టిన అత్యున్నత సంస్థ సీబీఐ లడ్డూ పవిత్రతకు భంగం కలిగినట్లు ఎలాంటి అధారాలు లేవని స్పష్టం చేసిందన్నారు. గురువారం ఆయన స్థానిక వెంకటరమణ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరితో కలిసి పూజలు చేసి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసత్య ప్రచారాలకు చెక్ పడిందని, నిత్యం సనాతన ధర్మం, హిందువుల గురించి మాట్లాడే కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ ఇప్పటికై నా బయటకు రావాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ.. నలుగురికి గాయాలు
బనగానపల్లె రూరల్: మండలంలోని చిన్నరాజుపాళెం గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నరాజుపాళెం తండాకు చెందిన మౌలాలీస్వామి నాయక్, బాలస్వామి నాయక్ ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు బయలుదేరారు. అదే సమయంలో బనగానపల్లెకు చెందిన శివనందం, మనె మ్మ ద్విచక్ర వాహనంపై జలదుర్గం వైపు వెళ్తుండగా.. చిన్నరాజుపాళెం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలపై ఉన్న నలుగురు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనం, ఆటోల సాయంతో వారిని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన శివనందం, మనెమ్మప్రమాదంలో ఢీకొట్టుకున్న బైక్లు -
రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలి
మహానంది: రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేలా కొత్త పరిశోధనలు చేపట్టాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిటైర్డ్ డైరెక్టర్, డీన్ డాక్టర్ ఆర్వీఎస్ రెడ్డి అన్నారు. మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో బుధవారం బుక్కాపురంలో రైతు సదస్సు, ఉద్యాన పంటల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యాన, వ్యవసాయ విద్యలను అభ్యసించే విద్యార్థులు నూతన ఆవిష్కరణలు దిశగా పరిశోధన చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులు మంచి ఆదరణ ఉందని, కొనుగోలు చేసేందుకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారన్నారు. నూతన సాంకేతిక పద్ధతులు, పరిజ్ఞానం అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్ష్మీ నరసమ్మ, సర్పంచ్ కందుల వరలక్ష్మమ్మ, ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ సీహెచ్ కిషోర్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్, శాస్త్రవేత్తలు డాక్టర్ దీప్తి, డాక్టర్ హేమాద్రి, ఉద్యాన అధికారి హరేంద్ర, అనంతరాజుపేట ఉద్యాన కళాశాల, ఎన్ఎస్ కళాశాల ఏడీఆర్లు డాక్టర్ బి. హరి మల్లికార్జునరెడ్డి, సూర్యతేజ, మంజూష, తదితరులు పాల్గొన్నారు. -
కుష్టు వ్యాధికి ఏదీ కళ్లెం!
కర్నూలు(హాస్పిటల్): కుష్టు వ్యాధిగ్రస్తుడంటే ఒక అస్పృశ్యత, అంటరానితనంగా భావించే వారు ఒకప్పుడు. ఆ వ్యాధిగ్రస్తుడుంటే ఊరికి దూరంగా ఉంచేవారు. వారిని అక్కడే ఉంచి అవసరమైన చికిత్స, అవసరాలు అందించేవారు. ఇలాంటి బాధితులతో ఏర్పడిన కాలనీలు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ వ్యాధిపై కొన్నేళ్లుగా ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో క్రమంగా కుష్టువ్యాధి బాధితులూ అందరితో పాటు కలిసి జీవిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వందేళ్ల క్రితమే మహాత్మాగాంధీ చెబుతూ దగ్గరుండి వారికి సేవలు చేశారు. ఆయన వారికి అందించిన సేవలకు గుర్తుగా వర్ధంతి రోజును జాతీయ కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఐదు సీహెచ్సీలు, ఒక బోధనాసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. దీంతో పాటు 672 సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రతి సంవత్సరం కొత్తగా కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. లక్షణాలున్న వారిని మొదటగా పీహెచ్సీల్లోని మెడికల్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయిస్తున్నారు. వారికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పంపించి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. అనాథలైన కుష్టు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు కర్నూలు నగరం నందికొట్కూరు రోడ్డులో ఉన్న మరియా నిలయం ఏర్పాటు చేశారు. అక్కడున్న వైద్యులు, సిబ్బంది, సేవకులు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు పుట్టుకొస్తునే ఉన్నాయి...! వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆశ, ఏఎన్ఎంలచే ఇంటింటి సర్వే చేయించి కొత్త కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కొత్తగా కేసులు పుట్టుకొస్తునే ఉన్నాయి. ప్రస్తుతం పాత కేసులతో కలిపి జిల్లాలో మొత్తం 174 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. కొత్తగా ప్రతి లక్ష మందిలో 6.96 మందికి కుష్టువ్యాధిగ్రస్తులు పుట్టుకొస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బహుళ ఔషధ చికిత్స(మల్టీడ్రగ్ థెరపీ) ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ మందులను మొదటి నెల వైద్యుని వద్ద, రెండవ నెల నుంచి ఏఎన్ఎం ద్వారా ఇంటి వద్దే మందులు తీసుకోవచ్చు. వైద్యులు సూచించిన మేర నిర్ణీత కాలానికి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. కుష్టువ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు 15 రోజుల పాటు కుష్టు వ్యాధిపై స్పర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని గ్రామ పంచాయతీల్లో, వార్డు సచివాలయాల్లో వ్యాధిపై ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులచే గ్రామసభలు నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమం ద్వారా కొత్త కేసులను గుర్తించి చికిత్స ప్రారంభించడం, ఇలాంటి వారి పట్ల వివక్ష చూపకుండా చేయడం, వారిలో అంగవైకల్యాన్ని తగ్గించడం, కొత్త కేసుల సంఖ్యను తగ్గించడం ఉద్దేశం. – డాక్టర్ ఎల్.భాస్కర్, డీఎంహెచ్వో, కర్నూలు సంవత్సరం కేసులు 2018-19 531 2019-20 506 2020-21 136 2021-22 173 2022-23 188 2023-24 278 2024-25 214 2025-26లో 173 ఇప్పటి వరకుకుష్టు వ్యాధి లక్షణాలు...! ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రి అను బ్యాక్టిరియా వల్ల వస్తుంది. రోగి తుమ్మడం, దగ్గడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు కనిపించేందుకు మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. స్పర్శలేని మచ్చలు, ముఖం, చెవులు, ఛాతి, వీపుపై నొప్పిలేని బుడిపెలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, వాపులు ఉండటం, ముక్కుదూలం అణిగిపోయి గాలి ఆడక పోవడం, బొటనవేలు, చిటికెనవేలు, మణి కట్లు పనిచేయకపోవడం, కాలి వేళ్లునేలకు రాసుకోవడం, పాదాలు, చేతులపై బొబ్బ లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏటా నమోదవుతున్న కొత్త కేసులు ఈ ఆర్థిక సంవత్సరంలో 173 కేసుల నమోదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉచితం నేడు జాతీయ కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవం -
శ్రీగిరిలో సౌకర్యాలు కను‘మరుగు’
● పే అండ్ యూజ్ పద్ధతిలో మరుగుదొడ్లు ● భక్తులకు తొలగని కష్టాలు శ్రీశైలంటెంపుల్: భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రీశైల దేవస్థాన పాలకమండలి సభ్యులు, అధికారులు విఫలమయ్యారు. భక్తలు మరుగుదొడ్లకు వెళితే రూ.10, స్నానానికి వెళ్తే రూ.20 చెల్లించాల్సి వస్తోంది. శ్రీశైలానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. వసతి గదులను పొందేందుకు తమ వద్ద ఆర్థిక స్థోమత లేని భక్తులు క్షేత్ర పరిధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, మరుగుదొడ్లపై ఆధారపడతారు. అయితే క్షేత్ర పరిధిలో ఎక్కడా ఉచిత మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే! శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సరిపడా వసతి గదులు లేవు. దీంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాధికాలకు సామూహిక టాయిలెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో శివసదనం, ఔటర్రింగ్రోడ్డు, పార్కింగ్ ప్రదేశాల వద్ద, పుష్కరిణి సమీపంలో, శ్రీశైలం పీహెచ్సీ ఎదురుగా, ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, అమ్మవారి ఆలయం వెనుక, టూరిస్టు బస్టాండ్ వద్ద, హెచ్పీసీఎల్ పెట్రోల్బంక్ వద్ద ఇలా పలుచోట్ల మొత్తం సుమారు 800టాయిలెట్లు ఉన్నాయి. ఆయా టాయిలెట్లను వినియోగించుకుంటే టాయిలెట్కు రూ.10, స్నానానికి రూ.20వెచ్చించాల్సిందే. క్షేత్ర పరిధిలో ఉన్న 678టాయిలెట్లకు పారిశుద్ధ్య విభాగం ద్వారా దేవస్థానం టెండర్ పిలిచారు. సంవత్సరానికి రూ.24లక్షల చొప్పున దేవస్థానానికి చెల్లించేలా టెండర్లో పొందుపర్చారు. క్యూకాంప్లెక్స్లో భక్తులకు ఉచితంగానే టాయిలెట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి అమ్మవారి ఆలయం వెనుక, ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న టాయిలెట్లను ఉచితంగా నిర్వహిస్తాం. క్షేత్ర పరిధి 4 ఎకరాల్లో ఉండడంతో నిర్వహణ పరంగా కష్టతరంగా మారింది. ఈ విషయమై బోర్డులో కూడా చర్చించాం. క్షేత్ర పరిధిలో ఉన్న ప్రైవేట్ టాయిలెట్లలో సైతం ఫిబ్రవరి 1నుంచి యూజర్ చార్జీలు రూ.5 వసూలు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
యూరియా దుర్వినియోగంపై విచారణ
కర్నూలు (అగ్రికల్చర్): గతేడాది ఖరీఫ్ సీజన్లో ఆదోని సబ్ డివిజన్లోని కౌతాళం మండలానికి మార్క్ఫెడ్ ద్వారా సరఫరా అయిన యూరియా దారి మళ్లడంపై గురువారం అగ్రానమి ఏడీఏ రాజశేఖర్ విచారణ జరిపారు. విచారణకు ఆదోని ఏడీఏ బాలవర్ది రాజు, కౌతాళం మండల వ్యవసాయ అధికారి శేషాద్రి, మార్క్ఫెడ్ మేనేజర్ రాజు హాజరయ్యారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో యూరియాకు తీవ్ర సమస్య ఏర్పడింది. మార్క్ఫెడ్ నుంచి కౌతాళం మండలానికి సరఫరా అయిన యూరియా కర్ణాటక రాష్ట్రానికి మళ్లించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూరియా దారి మళ్లడానికి కౌతాళం ఏఓ శేషాద్రి కారణమంటూ న్యాయవాది ఒకరు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. యూరియా దుర్వినియోగంపై ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫిర్యాదును ప్రభుత్వానికి పంపడంతో విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్ నియమితులయ్యారు. ఈయన ఇదివరకు కౌతాళంలో చేపట్టారు. అయితే ఫిర్యాదుదారు విచారణకు హాజరుకాలేదు. తాజాగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించిన విచారణకు కూడా గైర్హాజరయ్యారు. ఫిర్యాదుదారుతో వ్యవసాయ అధికారి అవగాహన ఏర్పరుచుకోవడం వల్లనే విచారణకు హాజరుకావడం లేదనే చర్చ జరుగుతోంది. విచారణకు ఫిర్యాదుదారు అయిన వ్యక్తి సహకరించకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని అగ్రానమీ ఏడీఏ తెలిపారు. -
క్వింటా వేరుశనగ రూ.15,001
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర రోజురోజుకు పెరుగుతోంది. రబీలో సాగు చేసిన రైతుల పంట పండుతోంది. 2023లో ఇదే నెలలో ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు మార్కెట్లకు దాదాపు 5వేల క్వింటాళ్లకు పైగా వేరుశనగ వచ్చింది. 2024లో కూడా 3వేల క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు 800 క్వింటాళ్లు మించని పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్కెట్లో వేరుశనగ బంగారం అవుతోంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లతో పోలిస్తే కర్నూలు మార్కెట్లో వేరుశనగకు రికార్డు స్థాయి ధర లభిస్తుండటం విశేషం. కర్నూలు మార్కెట్కు గురువారం 319 క్వింటాళ్ల వేరుశనగ రాగా కనిష్ట ధర రూ.5,508, గరిష్ట ధర రూ.15,001 లభించగా.. సగటు ధర రూ.11,589 నమోదైంది. దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 8 బస్తాల వేరుశనగ తీసుకురాగా క్వింటా రికార్డు స్థాయిలో రూ.15001 ధరతో కొనుగోలు చేశారు. అత్యదిక ధర పొందిన రైతు వెంకటేశ్వర్లును, కమీషన్ ఏజెంటును మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, కమీషన్ ఏజెంట్లు సత్కరించారు. ● కందుల ధర క్రమంగా పెరుగుతోంది. మార్కెట్కు 4,076 క్వింటాళ్ల కందులు రాగా కనిష్ట ధర రూ.4,312, గరిష్ట ధర రూ.9,216 లభించగా.. సగటు ధర రూ.8,679 నమోదైంది. ● మార్కెట్కు 855 క్వింటాళ్ల వాము వచ్చింది. కనిష్ట ధర రూ.1,288, గరిష్ట ధర రూ.28,150 లభించగా.. సగటు ధర రూ.21,010 పలికింది. -
టూరిజం అభివృద్ధికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకొని టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓర్వకల్ రాక్ గార్డెన్ ఉత్సవాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా టూరిజం అధికారి లక్ష్మినారాయణ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ను ఆదేశించారు. గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, ఆదోని రాంజల వాటర్ ట్యాంక్లో బోటింగ్, రెస్టారెంట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు నివేదికలు తయారు చేయాలన్నారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని దేవాలయాల సందర్శనకు టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టూరిజం అధికారి లక్ష్మినారాయణ మాట్లాడుతూ రూ.14 కోట్లతో జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఐదు నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. సమావేశంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజశ్వి, ఇన్చార్జి డ్వామా పీడీ మాధవీలత, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ, టూరిజం కమిటీ సభ్యుడు పత్తి ఓబులయ్య, సీపీఓ భారతి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమకు ఎత్తిపోతల పఽథకాలతోనే న్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చిత్రంలో పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు కర్నూలు(టౌన్): ‘‘సీమ ప్రజలకు సాగు, తాగునీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. తెలంగాణతో కుమ్మక్కయ్యాడు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభించాలి. లేకపోతే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సీమ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రేటర్ రాయలసీమకు చెందిన అన్ని జిల్లాల రైతులు, ప్రజలు కలిసి వచ్చే నెల 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం కల్లూరులోని నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో వర్షపాతం కూడా తక్కువేనన్నారు. ఈ కారణంగా ప్రతి ఏటా వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రాయలసీమలో ప్రాజక్టుల పట్ల ఈ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష పార్టీగా రాయలసీమ ప్రాంతంలో వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించేంత వరకు ఉద్యమబాట పడుతున్నట్లు స్పష్టం చేశారు. రేవంత్ వ్యాఖ్యాలపై నోరు మెదపరేం? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నాలుగు గోడల మధ్య చంద్రబాబుతో కలిసి రాయలసీమలో లిఫ్ట్ పనులు నిలిపివేసినట్లు ప్రకటించారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. సీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ఈ వాఖ్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో లిఫ్ట్ పనులు పూర్తయితే సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ పనులు నిలిపివేశారన్నారు. సమావేశంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి(శ్రీశైలం), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ), కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా, నందికొట్కూర్ ఇన్చార్జి దారా సుధీర్, ఆదిమూలపు సతీష్(కోడుమూరు), రాజీవ్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి (ఎమ్మిగనూరు), పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ పాల్గొన్నారు. ఆశలను ‘నీరు’గార్చారు మాజీ మంత్రి బుగ్గన, కాటసాని రాంభూపాల్ రెడ్డి వెల్లడి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు భారీగా రావాలి లేదంటే రాయలసీమ ఎడారిగా మారుతుంది శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీరు చేరకముందే తెలంగాణకు తరలిస్తున్నారురాయలసీమకు న్యాయం జరగాలంటే ఎత్తిపోతల పథకాలతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు సీమ ప్రజలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఆయన హయాంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించలేదన్నారు. మళ్లీ 2014–19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరోసారి సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో సాగునీటి ప్రాజక్టులు, ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో సీమ ప్రాంత అభివృద్ధికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు నీరు చేరక ముందే తరలిస్తున్నారన్నారు. దీన్ని అధిగమించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారన్నారు. 22 టీఎంసీలు సీమకు రావాలని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయకపోతే కరువుతో సీమ ప్రాంతం అల్లాడుతుందన్నారు. -
15 నిమిషాలకే రిజిస్ట్రేషన్
కర్నూలు (సెంట్రల్): నాట్ బుకింగ్ విధానంతో 15 నిమిషాలకే రిజిస్ట్రేషన్ పత్రిక ముగుస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్ కుమార్ విక్రయదారులకు సూచించారు. గురువారం ఆయన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు విక్రయదారులకు 15 నిమిషాలకే పూర్తయిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట కర్నూలు సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు, కల్లూరు సబ్ రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. -
ప్రభుత్వాసుపత్రి వైద్యసేవలన్నీ డిజిటలైజేషన్
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలన్నీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. వంద శాతం పేపర్లెస్ విధానం, పూర్తిస్థాయి రోగి ఆరోగ్యసేవల డిజిటలైజేషన్ దిశగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసి ఆఫీసర్లకు, టెక్నికల్ సిబ్బందికి నిక్ నెక్ట్స్జెన్ ఈ–హాస్పిటల్స్పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ జోన్కు నోడల్ ఆఫీసర్గా వచ్చిన విజయలక్ష్మి మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న అన్ని రకాల వైద్యసేవలు, సదుపాయాలు, రోగి ఆరోగ్య స్థితిగతులు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసేందుకు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందులో భాగంగా 10 రోజుల్లో అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఆరోగ్యసేవల కోసం వచ్చిన ప్రతి రోగికి అబా యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. ఓపీ సేవల వద్ద అబా యాప్ స్కానర్ పోస్టర్లను విరివిగా ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ఓపీడీ, ఐపీడీ, ఐసీయూ, సర్జరీ, లే బొరేటరి, రేడియాలజి సేవల వివరాలు విధిగా నెక్ట్స్జెన్ ప్లాట్ఫార్మ్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఎన్ఐసీ డీడీ ఎలెన్ ప్రమోద్ పాల్గొన్నారు. -
జనసేన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపత్తికొండ: చిరుద్యోగి అయిన మహిళను బెదిరించి, దురాగతానికి పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రైల్యేకోడూరులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగికి ఐదు సార్లు బలవంతంగా అపరేషన్ చేయించి దుర్మార్గపు పనులకు పాల్పడిన అరవ శ్రీధర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. సమాజంలో చిరుద్యోగిగా జీవనం కొనసాగిస్తున్న మహిళకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్కళ్యాణ్కు సూచించారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో బెదిరించి మహిళపై బలవంతగా ఇలాంటి నీచపు పనులకు పాల్పడిన జనసేన ఎమ్మెల్యేకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. మహిళలకు తమ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పవన్కళ్యాణ్ ప్రతి వేదికపై ప్రసంగాలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆర్ఎస్ఐను అభినందించిన ఎస్పీ
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ)గా పనిచేస్తున్న మేడగం సురేష్ రెడ్డి గ్రూప్–2లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో (జీఏడీ) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) ఉద్యోగం సాధించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూనే ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికై న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను ఆయన కార్యాలయంలో సురేష్ రెడ్డి బుధవారం పూలమొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. కఠినమైన విధి నిర్వహణతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అభినందనీయమని ఎస్పీ ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించారు. పోలీసు శాఖలో పనిచేస్తూ కూడా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని ఈ విజయం ద్వారా నిరూపితమైందని ఎస్పీ పేర్కొన్నారు. ఇతర పోలీసు సిబ్బందికి కూడా ఇది స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో గ్రూప్–1 లక్ష్యంతో ఇదే పట్టుదల, కృషితో సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆర్ఎస్ఐ నేపథ్యం... అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమారుడు సురేష్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి 2015లో ఆర్ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. వీరిది వ్యవసాయ కుటుంబం. 2025 ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో 300 మార్కులకు గాను 230 మార్కులు సాధించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం (సెక్రెటేరియట్)లో ఏఎస్ఓ ఉద్యోగం సాధించారు. -
అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు....
● కర్నూలు కొత్తబస్టాండ్లో కడపకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు ఆగింది. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు వెళ్లే మహిళలు ఆ బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం చూపి నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు వృద్ధ మహిళల బంగారు ఆభరణాలు దోచేశారు. పాణ్యం దాటాక ఆభరణాలు పోయినట్లు బాధితులు గుర్తించి కండక్టర్తో చెప్పారు. బస్సును ఆపి విచారించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన జరిగి నాలుగు మాసాలు గడచినా పోలీసులు పట్టించుకోలేదు. ● కోవెలకుంట్లకు చెందిన శారద భర్తతో కలసి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి కోవెలకుంట్ల వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా ఇద్దరు బురఖా ధరించిన మహిళలు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 9 తులాల బంగారు నగలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహారాష్ట్ర కోలా జిల్లాకు చెందిన రాజీ సుల్తానా, షేక్ రఫికా ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అంతర్రాష్ట్ర మహిళా దొంగలను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఈ రెండు సంఘటనలే కాదు.. ప్రయాణ సమయాల్లో మహిళల మెడల్లో, బ్యాగుల్లో నుంచి నేరుగా బంగారు ఆభరణాలు లాక్కెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఉచిత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న కర్నూలు బస్టాండ్ కర్నూలు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక వారి రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీనికి తగినట్లు బస్టాండ్లలో భద్రత ఏర్పాట్లు లేకపోవడం సమస్యలకు దారి తీస్తోంది. ప్రయాణికుల వలె దొంగలు రద్దీలోకి చొరబడి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్టాండ్లలో జరిగే చోరీల్లో కొన్ని మాత్రమే పోలీసుల వరకు వెళ్తున్నాయి. భద్రతా లోపాలను దొంగలు వారికి అనువుగా మలుచుకుని అందిన కాడికి దోచుకుపోతున్నారు. జిల్లాలో కర్నూలుతో పాటు ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ఇది దొంగలకు అవకాశంగా మారింది. బంగారాన్ని చోరీ చేయడంపైనే వారు ప్రధానంగా గురి పెడుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల ద్వారా ఈ విషయం అవగతమవుతోంది. ఆళ్లగడ్డకు చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి భర్తతో కలసి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి బస్టాండ్లో ఆళ్లగడ్డ బస్సు ఎక్కుతుండగా దొంగలు ఆమె బంగారు ఆభరణాలు తస్కరించారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగో పట్టణ పోలీసులు హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారిని విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నలుగురు సిబ్బంది శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. పక్కనే ఉండి చాకచక్యంగా... చిన్న నగ చేతికి చిక్కినా రూ.లక్ష వస్తాయని ఆశ పడుతూ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీ సమయంలో పక్కనే ఉంటూ బస్సు ఎక్కుతున్నట్లు నటించి చాకచక్యంగా నగలు, పర్సులు కొట్టేస్తున్నారు. పోలీస్ ఔట్పోస్టు ఉన్నా పర్యవేక్షణ నామమాత్రమే... కర్నూలు బస్టాండ్లో విచిత్ర పరిస్థితి. రోజూ 70 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పోలీసు ఔట్పోస్టు ఉన్నా పర్యవేక్షణ లేక చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. సెల్ఫోన్లు, పర్సులు, ఆభరణాలు పోగొట్టుకున్న ప్రయాణికులు కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేయడానికి కూడా ఔట్పోస్టులో పోలీసులు ఉండరు. ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు కూడా నామమాత్రమయ్యాయి. ప్రయాణ సమయంలో వీలైనంత వరకు తక్కువ ఆభరణాలు ధరించడం, తరలించడం మంచిది. ముఖ్యంగా బస్సు ఎక్కేటప్పుడు చుట్టు పక్కల గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మత్తు కలిపిన తినుబండారాలు ఇచ్చి నిద్రమత్తులోకి జారుకోగానే దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. సీటు దొరికించుకోవాలన్న ఆత్రుతతో పక్కనున్న వారిని కూడా గమనించకపోవడం వల్ల దొంగలకు అవకాశంగా మారుతోంది. ప్రయాణికులు అజాగ్రత్త, నిర్లక్ష్యం వీడాలి. – విక్రమసింహ, సీఐ జిల్లా కేంద్రం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో నిఘా నేత్రాలు అలంకారప్రాయంగా మారాయి. రాష్ట్రంలోనే కర్నూలు రెండో అతిపెద్ద బస్టాండ్. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్లో ఈ పరిస్థితి ఉండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ బస్టాండ్లో రెండు నెలల వ్యవధిలో ఐదు చోరీ సంఘటనలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సెల్ఫోన్లు, బ్యాగుల అపహరణ సర్వసాధారణంగా మారింది. ప్రతి రోజూ ఒకటి, రెండు సంఘటనలు జరుగుతున్నా సీసీ కెమెరాల్లో స్పష్టమైన దృశ్యాలు కనిపించకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఓ మహిళా ప్రయాణికురాలి సంచిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల రెండు తులాల బంగారు గొలుసు అపహరించారు. క్యాంటీన్లో అల్పాహారం తిని నంద్యాలకు వెళ్లే బస్సు ఎక్కి ఆధార్ కార్డు కోసం సంచి తెరవడానికి చూడగా అప్పటికే ఎవరో తెరచి అందులో బంగారు గొలుసు అపహరించినట్లు గుర్తించి లబోదిబోమన్నారు. బస్సు అప్పటికే నన్నూరు టోల్ప్లాజా వద్దకు చేరుకోవడంతో వెనక్కు రాలేక చేసేదేమీ లేక ఆమె వెళ్లిపోయింది. ఆర్టీసీ బస్టాండ్లలో కొరవడిన నిఘా మహిళలూ... ప్రయాణాల్లో జర జాగ్రత్త! బంగారం ధరతో పాటే పెరుగుతున్న చోరీలు స్వీయ రక్షణతోనే ఆభరణాలు భద్రం -
పెద్దాసుపత్రి డైట్ టెండర్ మాకే దక్కాలి!
● అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ● మొత్తం 15 మంది టెండర్ దాఖలు ● వీరిలో అనర్హులే అధికంకర్నూలు(హాస్పిటల్): ‘చూడండి సార్...! మీరేం చేస్తారో మాకు తెలియదు...ఈసారి ఆసుపత్రి డైట్ టెండర్ మావాడికే రావాలి. ఇందుకు సంబంధించి నిబంధనలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. ఇతర విషయాలే మైనా ఉంటే నేను చూసుకుంటాను. ఉన్నతాధికారులు కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు. మీరు అలాగే ఉండాలి’ అంటూ ఆసుపత్రి అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఈ మేరకు కొందరు తమ అనుచరుల ద్వారా, మరికొందరు స్వయంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డైట్ విభాగానికి (రోగులకు ఆహారం సరఫరా చేసే) టెండర్ పిలిచారు. ఈ మేరకు బుధవారం టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజు. మొత్తం 15 మంది టెండర్ వేశారు. వీరిలో హైదరాబాద్, తిరుపతి, ఒంగోలు, కడప, విశాఖపట్టణం, గుంటూరు ప్రాంతానికి చెందిన వారూ ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు ఆసుపత్రికి ఆహారాన్ని సరఫరా చేసిన వారితో పాటు స్థానికంగా హోటళ్లు, మెస్లు, క్యాటరింగ్ సర్వీస్లు, బిర్యానీ పాయింట్లు నిర్వహించే వారూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, మొత్తం 15 మందిలో నలుగురైదుగురు మాత్రమే టెండర్కు అర్హులవుతారన్న చర్చ నడుస్తోంది. కానీ మిగిలిన వారు, స్థానికులు కొందరు కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి టెండర్ తమకే వచ్చేలా చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో సదరు నేతలు సైతం అధికారులకు టెండర్ తమ వారికి వచ్చేలా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేయాలంటే 500 పడకలకు పైగా ఉన్న బోధనాసుపత్రుల్లో ఇది వరకు సరఫరా చేసి ఉండాలి. ఇలా ఆహారం సరఫరా చేసిన దానికి ఏడాదికి రూ.25 లక్షలు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి వంటి నిబంధనలు ఉన్నాయి. ఇవేమీ లేకున్నా కొందరు తాము కూడా రోగులకు ఆహారం సరఫరా చేస్తామని చెప్పి ముందుకు రావడంతో ఈసారి టెండర్లో పోటీ పెరిగింది. కొందరు ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరులైతే తాము ఉన్నతాధికారులతో సైతం ఒప్పించుకున్నామని, టెండర్ తమకే లభిస్తుందని, మాకు అడ్డురావద్దని టెండర్ వేసేందుకు వచ్చిన వారిని బెదిరించినట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో రోగికి రోజుకు ఆహారాన్ని అందించేందుకు రూ.38 ఇచ్చేవారు. ఈ మొత్తానికి బయట టిఫిన్ కూడా రాదని భావించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి రోజుకు రూ.80కు పెంచింది. దీనిపై మూడేళ్ల క్రితం టెండర్దారులు పోటీ పడి రూ.72 కు కోడ్ చేసి టెండర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు, వైద్యులు, వైద్య విద్యార్థులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు నెలకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఏడాదికి రూ.3.60 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటోంది. దీంతో ఈసారి ఆసుపత్రి డైట్పై ఆశావహుల కన్నుపడి పోటీ పెరిగింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీన టెండర్ బాక్స్ను జాయింట్ కలెక్టర్ సమక్షంలో తెరిచి టెండర్దారును ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
టీబీ డ్యాంలో 26.5 టీఎంసీలు
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో బుధవారం 1633 అడుగులకు 1603.88 అడుగులతో, 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యంలో 26.062 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో జీరో ఉండగ ఔట్ఫ్లో 507 క్యూసెక్కులు నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 1618.09 అడుగులతో 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. జలాశయం గేట్ల ఏర్పాటుకు డిసెంబర్ 10న డ్యాంలో నిల్వ ఉన్న 63 టీఎంసీల నుంచి 31 తేది వరకు ప్రతి రోజు కాలువలకు వదులుతున్న 10 వేల క్యూసెక్కులతో పాటు అదనంగా మరో 7 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులుతూ వచ్చారు. 28 టీఎంసీలకు చేరుకుంటుండగా జనవరి 15న అన్ని కాలువలకు నీటి సరఫరను నిలిపివేశారు. జలాశయంలో నీటి నిల్వ తగ్గితే గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టాలనే టీబీ బోర్డు ఇంజనీర్ల ఆలోచన మేరకు నీటిని తగ్గించారు. -
స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదు
● రిటైర్డు జెడ్పీ సీఈఓ జి.జయపాల్రెడ్డి కర్నూలు(అర్బన్): రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదని రిటైర్డు జెడ్పీ సీఈఓ జి.జయపాల్రెడ్డి అన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా స్థానిక సంస్థలకు అదనంగా నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆచరణలో అవి అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆయా సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే స్థానిక సంస్థలు లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నాయన్నారు. ప్రజల చేత ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ మితిమీరిన జోక్యం వల్ల ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సుమతీ శతకం సినిమా బృందం సందడి కల్లూరు: దూపాడు సమీపంలోని అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘సుమతీ శతకం’ సినిమా బృందం సభ్యులు సందడి చేశారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం, వినోద కార్యక్రమాల్లో భాగంగా కాలేజీ యాజమాన్యం ఆ బృందాన్ని ఆహ్వానించింది. సినీ హీరో అమర్దీప్, హీరోయిన్ శైలి, దర్శకుడు ఎం.ఎం. నాయుడు, నటులు తేజ, మహేష్ విట్టు తదితరులు కళాశాలలో కలియతిరిగి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దు వెల్దుర్తి: కంది, పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వొద్దని జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆయె మండలంలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కంది కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, కొనుగోలు పద్దతులను పరిశీలించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రామళ్లకోట గ్రామ పరిధిలో సాగు చేసిన పొగాకు దిగుబడులను, వేరుశనగ పంటలను పరిశీలించారు. అగ్రిమెంట్పై ఐటీసీ కంపెనీ క్వింటం రూ.16,300 ప్రకారం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం రామళ్లకోట ఆర్ఎస్కేలో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట ఏఓ అక్బర్బాషా, కందుల కొనుగోలు కేంద్రం బ్రాంచ్ మేనేజర్ షేక్షావలి ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు పాణ్యం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. హైవేలో ప్రమాదాలు జరగకుండా సచనలు ఏర్పాటు చేయాలన్నారు. పాణ్యంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ను బుధవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పెండిండ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు. -
శ్రీశైలంలో శివస్వాముల వాహనం బోల్తా
● ఒకరికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలుశ్రీశైలం: శ్రీశైలేశుడిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న శివసాములు వాహనం బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. క్షేత్ర పరిధిలోని క్షత్రియ రాజుల సత్రం ఎదురుగా ఉన్న టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందుకూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది శివ స్వాములు మంగళవారం రాత్రి శ్రీశైలానికి ఓ ట్రాలీ వాహనంలో శ్రీశైలం చేరుకున్నారు. బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. క్షత్రియ రాజుల సత్రం వద్దకు రాగానే వాహన డ్రైవర్ రాము అక్కడ ఉన్న టర్నింగ్ వద్ద స్పీడ్గా కట్ చేయడంతో ట్రాలీ ఆటో ఒకవైపు ఒరిగిపోయి కింద పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ట్రాలీ వాహనాన్ని లేపి అందులో ఉన్న శివ స్వాములను చికిత్స నిమిత్తం దేవస్థానం వైద్యశాలకు తరలించారు. శివకుమార్ అనే శివ స్వామికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం స్థానిక వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. అలాగే మహేష్, సిద్దుల అంజి, నాగరాజుతో పాటు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ నమోదులో పొరపాట్లకు తావివ్వొద్దు
తుగ్గలి: భూ సర్వే రికార్డుల ఆన్లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం ఆయన తుగ్గలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్, సబ్ డివిజన్, రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి భూ వివరాల ఆన్లైన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వేలో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సంబంధిత రైతుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అసైన్డ్ భూముల ఆన్లైన్కు సంబంధించి రీ సర్వే డీటీ మధుమతి, వీఆర్వోలు, సర్వేయర్లకు జేసీ పలు సూచనలు చేశారు. అంతకు ముందు రైతు సేవా కేంద్రం వద్ద మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన కందుల బ్యాగ్ల తూకాలు, నాణ్యత, తేమ శాతం పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో భరత్నాయక్, తహసీల్దార్ రవి తదితరులు ఉన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు కర్నూలు: కర్నూలు న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ రెగ్యులర్ ఉద్యోగ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని మొదట నోటిఫికేషన్ వెలువడిందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎం అబీం నిధులతో పంచాయతీ భవనాలు కర్నూలు(అర్బన్): ప్రధానమంత్రి ఆయు ష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాక్ట్చర్ మిషన్ (పీఎంఏబీహెచ్ఐఎం) నిధులతో జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు. ఒక గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.32 లక్షలు, విలేజ్ హెల్త్ క్లీనిక్ భవన నిర్మాణానికి రూ.42 లక్షలను వెచ్చించనున్నారు. జిల్లాకు 35 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 24 గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 87 హెల్త్ క్లీనిక్స్ భవనాలు మంజూరు కాగా, 63 ప్రాంతాల్లో భవనాలు నిర్మించేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 11 గ్రామ పంచాయతీ భవనాలు, 24 విలేజ్ హెల్త్ క్లీనిక్స్ భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని అధికారులు జిల్లా కలెక్టర్ను కోరారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
● మూడు జిల్లాల ప్రిన్సిపాళ్లతో ఏపీ మోడల్ స్కూల్ జేడీనంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ మెడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా అన్నారు. బుధవారం నంద్యాల డిప్యూటీ డీఈఓ కార్యాలయ సమావేశ భవనంలో మూడు జిల్లాలకు చెందిన ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, విద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణపై వదంతులు నమ్మవద్దన్నారు. పది విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలన్నారు. పది పరీక్షలు కట్టుదిట్టంగా జరుగుతాయని, ఇందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. విద్యార్థులు చదవకుండా పాస్ కావాలని కోరుకోకూడదని తెలిపారు. విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రతి రోజు పరీక్షలు నిర్వహించాలన్నారు. తర్వాత ఇంటర్ ప్రీ ఫైనల్ ఫలితాలపై సమీక్షించారు. ఈ ఏడాది పది, ఇంటర్లో వందశాతం ఫలితాలు రావాలని ఆదేశించారు. సమావేశంలో నంద్యాల డీఈఓ జనార్ధన్రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర్ ప్రసాద్, డోన్ డిప్యూటీ డీఈఓ వెంకటరామిరెడ్డి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీగా కిరణ్కుమార్
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీగా కిరణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన విధుల్లో చేరారు. ఇక్క డ పనిచేస్తున్న జి.కల్యాణి బదిలీపై వెళ్లడంతో అప్పటి నంంచి అనంతపురం డీఐజీ విజయలక్ష్మీని ఇన్చార్జిగా కొనసాగించారు. అయితే ఇటీవల కిరణ్కుమార్పై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసిన ప్రభుత్వం కర్నూలు డీఐజీగా నియమించారు. గృహ నిర్మాణ సందేహాలకు కాల్ చేయండి కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తమ సందేహాల నివృత్తికి ఈ నెల 29న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పీడీ కార్యాలయ ఫోన్ 08518– 257481 నెంబర్కు కాల్ చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ చిరంజీవి కోరారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నిర్మాణ సామాగ్రి, సిమెంట్, స్టీల్, బిల్లుల గురించి తమ సందేహాలను ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించిన సమస్యలపై కూడా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
రాలిన చీని రైతుల ఆశలు
కృష్ణగిరి: చీని తోటలను తెగుళ్లు చుట్టుముట్టడంతో రైతుల ఆశలు రాలిపోతున్నాయి. దిగుబడి బాగా వస్తుందని ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేసినా ఫలి తం లేకుండా పోయింది. చెట్టు నుంచి కాయలు చేతి వచ్చే సరికి తెగుళ్లు అధికమయ్యాయి. లక్షల రూపాయల పెట్టుబడులు మట్టిలో కలిసిపోతున్నాయి. పెనుమాడ, చుంచు ఎర్రగుడి తదితర గ్రామాల్లోని తోటలకు కాంకర తెగులు సోకింది. చీని కాయలు పసుపురంగులోకి మారి చెట్టు నుంచి రాలిపోతున్నాయి. అలాగే మంచు ప్రభావంతో మంగు తెగులు సోకింది. కాయలన్నీ నల్లగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. తెగుళ్లు సోకడంతో 5 నుంచి 7 క్వింటాళ్లు వచ్చేది కష్టమేనని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే క్వింటా చీని కాయలను రూ. 20వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేసేవా రు. గతేడాది ఇదే ధరతో కాయలను విక్రయించామని, ఈ ఏడాది క్వింటా రూ. 12వేలు నుంచి రూ.15 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఉద్యానశాఖ అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తగ్గిన దిగుబడి -
వైభవంగా మధ్వనవమి వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మధ్వ నవమి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు నేతృత్వంలో మంగళవారం వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేడుకల్లో భాగంగా శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, ఆంజనేయస్వామికి విశేష పంచామృతాభిషేకం గావించారు. అనంతరం స్వర్ణ రథంపై మధ్వమత ఆది గురువు చిత్ర పటాన్ని శ్రీ మఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగించారు. ఎంతో పవిత్రంగా సాగిన మధ్వ నవమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
కర్నూలు(సెంట్రల్): కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం ఉదయం ఆమె కార్యాలయానికి చేరుకుని సేల్ డీడ్ల స్వీ కరణ, డాక్యుమెంట్ల నమోదు, రిజిస్ట్రేషన్ ప్రక్రి య, ఫైళ్ల భద్రత, కంప్యూటరైజ్డ్ ఎంట్రీలు, ప్ర జలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ రిజిస్ట్రేషన్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డాక్యుమెంట్లలో వివరాలను సరిగా నమోదు చేయాల న్నారు. అనంతరం వినియోగదారులతో మాట్లాడి స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సమస్యలపై ఆరా తీశారు. ఆమె వెంట కర్నూలు ఇన్చార్జి డీఆర్ భార్గవ్, కర్నూలు ఇన్చార్జి సబ్ రిజిస్టార్ వరప్రసాద్ ఉన్నారు. ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 21 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,313 మందిలో 1,236 మంది హాజరయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు 18 కేంద్రాలుగా ఏర్పాటు చేయగా 1,081 మందిలో 1,062 మంది పరీక్షలకు హాజరయ్యారు. నగరంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. రగ్బీ జాతీయ క్రీడల కోచ్గా తొగర్చేడు పీఈటీ కృష్ణగిరి: మండల పరిధిలోని తొగర్చేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాసులు రగ్బీ జాతీ య క్రీడల కోచ్గా ఎంపికై న ట్లు పాఠశాల విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రాజేష్ మంగళవారం తెలిపారు. 69వ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ 2025–26 క్రీడలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్నారన్నారు. అండర్–19 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో శ్రీనివాసులు కోచ్గా వ్యవహరిస్తారన్నారు. క్రీడలు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఢిల్లీలోని త్యాగరా య స్టేడియంలో జరుగనున్నట్లు పేర్కొన్నారు. ఏఆర్ ఏఎస్పీకి సత్కారం కర్నూలు: జిల్లా పోలీసు శాఖ ఆర్మ్డ్ రిజర్వు వి భాగం అదనపు ఎస్పీ సింగాల కృష్ణమోహన్కు రాష్ట్రస్థాయి పురస్కారం దక్కింది. విధి నిర్వహణ లో అంకితభావంతో పనిచేసినందుకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభు త్వం ఆయనకు విశిష్ట సేవా పథకాన్ని ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో కృష్ణమోహన్ను ఏఆర్ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నారాయణ, జావేద్, పోతుల రాజు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్ఎస్ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థుల సత్తా
● 13 మంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు కర్నూలు(హాస్పిటల్): సూపర్స్పెషాలిటీ (ఎస్ఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో కర్నూలు మెడికల్ కాలేజి వైద్య విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఏకంగా 13 మంది పీజీ విద్యార్థులు ఆలిండియా ఉత్తమ ర్యాంకులు సాధించి కోర్సులో ప్రవేశం దక్కించుకోనున్నారు. దేశవ్యాప్తంగా మెడిసిన్, పీజీ పూర్తి చేసిన తర్వాత సూపర్స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత డిసెంబర్ 26, 27వ తేదీల్లో నీట్–ఎస్ఎస్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో 12 మంది సర్జరీ పీజీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో డాక్టర్ డి.విష్ణు శ్రీకర్రెడ్డి 65, డాక్టర్ కె. సాయికళ్యాణ్ 75, డాక్టర్ కె.ఉదయ్కుమార్ 125, డాక్టర్ కె.వినీత్రెడ్డి 210, డాక్టర్ అంబటి తేజేశ్వర్రెడ్డి 343, డాక్టర్ ఆర్. శిరీష 378, డాక్టర్ జి.అనంత నివేష్ 668, డాక్టర్ పి. మహ్మద్ సర్ఫరాజ్ 926, డాక్టర్ పి.పవన్కళ్యాణ్ 936, డాక్టర్ వి. సాయిచరణ్ 1022, డాక్టర్ టి.మహేంద్రబాబు 1168, డాక్టర్ ఇ. అనిల్కుమార్ 1500, డాక్టర్ జి. సాయిహరీష్రెడ్డి 2206వ ర్యాంకులు సాధించారు. వీరిలో డాక్టర్ విష్ణుశ్రీకర్రెడ్డి, డాక్టర్ తేజేశ్వరరెడ్డి ప్రస్తుతం సర్జరీ విభాగంలో సీనియర్ రెసిడెంట్లుగా ఉన్నారు. మంగళవారం వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్, జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్, అభినందించారు. కార్యక్రమంలో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.కోటిరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీలో నిలిచిన నీటి ప్రవాహం
బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు నీటి విడుదల నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎస్సార్బీసీ పరిధిలోని పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, అవు కు, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలోని 13 బ్లాక్ల ద్వారా 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, నువ్వులు, మినుము మరి న్ని వాణిజ్య పంటలను కూడా సాగు చేశారు. అయితే అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నీటి సరఫరాను నిలిపివేయడంతో పంటల సాగుపై ఆందో ళన చెందుతున్నారు. సాగునీటి నిలుపుదల చేస్తే తమ పరిస్థితి ఏమటని ప్రశ్నిస్తున్నారు. -
రోడ్డు భద్రత సామాజిక బాధ్యత
● డీటీసీ శాంతకుమారి కర్నూలు: రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజిలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీటీసీ శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రత నిబంధనలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, ప్రతి వాహనదారుడు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. గత ఏడాది అక్టోబర్ 24న చిన్నటేకూరు వద్ద మద్యం తాగిన బైకర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారని గుర్తు చేశారు. విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయకూడదని, రాత్రి 10 గంటల తర్వాత వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. ఆర్టీఓ భరత్ చవాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గుడ్ సమారిటన్ రాహ్–వీర్’ పథకం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకెళ్తే రూ.25 వేలు నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్ర తపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐలు కె.మల్లికార్జున, ఆర్వీ మధుసూదన్, కె.రవీంద్ర కుమార్, ఎంవీ సుధాకర్ రెడ్డి, ఏఎంవీఐ బాబుకిషోర్, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సుస్మిత, యశ్వంత్, డీన్ డాక్టర్ కె.దేవకి, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో లోటుపాట్లు సరిదిద్దుకోకపోతే చర్యలు
దొర్నిపాడు: ఉపాధి పనుల్లో జరుతున్న లోటుపాట్లను సిబ్బంది సరిదిద్దుకోవాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ సూర్యనారాయణ హెచ్చరించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ. 5,22,88,956 పనులు చేశారు. దీంతో పనులకు సంబంధించి స్థానిక ఉపాధిహామీ కార్యాలయ ఆవరణలో 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపరాధ రుసుము, కూలీల అదనపు చెల్లింపులకు సంబంధించి రూ.40,085 రికవరీ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. జాబ్కార్డు కల్గిన శ్రామికులందరికీ పనులు కల్పించాలన్నారు. పనులకు హాజరు కాకపోయినా హాజరు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులు జరిగే సమయంలో ఏపీఓల పర్యవేక్షణ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏవీఓ పరమేశ్వరుడు, ఏపీఈ(డీవీవో సెక్షన్) రాజశేఖర్రెడ్డి, ఎంపీడీఓ సావిత్రి, ఏపీడీ సాంబశివరావు, ఏపీఓ హనీఫా ఎస్ఆర్పీ లక్ష్మీనారాయణ, డీఆర్పీలు రవి, రవికుమార్, బోస్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ నబీసాహెబ్ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలకు చెందిన గంటశాల పవన్ కుమార్ (38)కు సిమెంట్ నగర్ గ్రామా నికి చెందిన కవితతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. జీవనోపాధి నిమిత్తం భార్య స్వగ్రామంలోనే స్థిరపడ్డారు. అయితే, కొంత కాలంగా మద్యానికి బానిసై భార్య కవితను వేధించడం మొదలుపెట్డాడు. సోమవారం రాత్రి కూడా గొడవ పడటంతో పిల్లలను తీసుకొని కవిత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన పవన్ కుమార్ (38) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న హనుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రైతుబజారును సందర్శించిన ఐఎస్ఓ అధికారుల బృందం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని సీ క్యాంపు రైతుబజారును హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధుల బృందం సందర్శించింది. టీమ్ లీడర్ శివయ్య రైతులు, వినియోగదారులు, రైతుబజారు అధికారులతో ముఖా ముఖి మట్లాడారు. రాష్ట్రంలోని టాప్–5 రైతుబజార్లులో కర్నూలు సి.క్యాంపు ఒకటి, ఈ రైతుబజారుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. రాష్ట్ర రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాధవిలత వినతి మేరకు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధుల బృందం రైతు బజారును సందర్శించింది. పరిశుభ్రతను పరిశీలించి రైతుబజారులో రైతులకు తగిన స్థానం లభిస్తుందా... వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు లభిస్తున్నాయా.. రైతుబజారులో జరుగుతున్న కూరగాయల అమ్మకాల పట్ల రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుబజారు నిర్వహణపై మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణ మూర్తి, ఎస్టేటు అధికారి కల్యాణి, హార్టికల్చర్ కన్సల్టెంటు శివకుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
డివైడర్పైకి దూసుకెళ్లిన కావేరి ట్రావెల్స్ బస్సు
కర్నూలు: కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కర్నూలు శివారు ప్రజానగర్ కాలనీ, టిడ్కో ఇళ్ల మధ్య 40వ నెంబర్ జాతీయ రహదారి (రింగ్ రోడ్డు)పై అదుపు తప్పి డివైడర్పై దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు నిద్రమత్తులో నుంచి తేరుకుని కేకలు వేశారు. ట్రావెల్స్ బస్సు రేడియేటర్ పైప్ ఊడిపోయి ఇంజిన్ వేడెక్కి ఆగిపోవడంతో అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వెనకాల వస్తున్న ట్రావెల్ బస్సులోకి ప్రయాణికులను ఎక్కించి పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రేడియేటర్ పైపు ఊడిపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. -
ఐదు రోజుల పని విధానం కావాలి
● బ్యాంకుల్లో తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు ఆవేదన ● బ్యాంకుల సమ్మెతో స్తంభించిన లావాదేవీలు కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడి కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే వారంలో ఐదు రోజుల పని దినాలు అవసరమని యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ నాగరాజు అన్నారు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో యూఎఫ్బీయూ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలో బ్యాంకుల సమ్మె కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సెలవులు ఉండటం, 27న బ్యాంకులు సమ్మె పాటించడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 650 బ్యాంకు శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కర్నూలులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అన్ని బ్యాంకుల యూనియన్ల నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యూఎఫ్బీయూ జిల్లా నేతలు మాట్లాడుతూ.. బ్యాంకు యూనియన్లు పదేళ్లుగా చేస్తున్న డిమాండ్ల్లో వారంలో ఐదు రోజుల పని దినాలు కల్పించాలనేదే ప్రధానమైందని పేర్కొన్నారు. ఈ డిమాండ్ను 2023 డిసెంబరు 7న బ్యాంకు యూనియన్లతో జరిపిన చర్చల్లో ఐబీఏ అంగీకరించిందని తెలిపారు. 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిందని వివరించారు. అయితే, అక్కడి నుంచి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు తదితర సాంకేతికత అందుబాటులో వచ్చినందున ఐదు రోజుల పని విధానంతో ఖాతాదారులకు ఇబ్బంది ఉండదని వివరించారు. కార్యక్రమంలో యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, ఏఐబీఈఏ నాయకులు అనిల్కుమార్రెడ్డి, ఎల్లయ్య, వాసుదేవరెడ్డి, ఏఐబీవోసీ నాయకులు జియా ఉర్ రహిమాన్, రాజు, పుష్పక్ కుమార్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, ఏపీజీబీ నాయకులు హనుమంతురెడ్డి, వాసు, సీఐటీయూ నాయకులు అంజిబాబు, మునెప్ప, ఎల్ఐసీ, జీఐసీ నాయకులు సునీల్ కుమార్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
మాన్యం భూమిలో మైనింగ్ అక్రమాల పరిశీలన
బనగానపల్లె రూరల్ : పలుకూరు గ్రామంలోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 308లో ఉన్న మాన్యం భూమిలో కొన్ని నెలల నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది. జిల్లా దేవదాయశాఖ అఽధికారి ఎస్ మోహన్, ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న ఏడుగురు అక్కడి నుంచి పారిపోయారు. అఽధికారులు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నదెవరు.. ఎంత మేర నాపరాయి వెలికితీశారు తదితర వివరాలను పరిశీలించారు. చర్యల నిమిత్తం నివేదిక ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు దేవదాయశాఖ అధికారి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఈఓ బ్రహ్మనందరెడ్డి, ఆలయ అర్చకులు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యంతో చదవాలి వెల్దుర్తి: విద్యార్థినులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని చదవాలని డీసీఓ డాక్టర్ ఐ శ్రీదేవి, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శాంతకుమారి సూచించారు. స్థానిక పీఎంశ్రీ డా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకల పాఠశాల/కళాశాల (పీఎంశ్రీ ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ) వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ప్రిన్స్పాల్ లక్ష్మీ ప్రసూన ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. పది, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రణాళికతో చదవి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. ఉత్తమ ప్రతిభతో ఇటు గురుకులానికి, అటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంఈఓ ఇందిర, డిప్యూటీ ఎంపీడీఓ రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. స్నేహితుడి మరణం తట్టుకోలేక.. కౌతాళం: స్నేహితుడి మరణం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల పరిధిలోని కుంటనహాల్ గ్రామంలోఈ సంఘటన చోటుచేసుకుంది. కౌతాళం సీఐ అశోక్కుమా ర్ తెలిపిన వివరాల మేరకు.. కుంటనహాల్ గ్రా మానికి చెందిన బింగి తిమ్మప్ప(24),మాని స్నేహితులు. పొలం పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే, వారం రోజుల క్రితం మూగజీవాలు తెచ్చుకునేందుకు వెళ్లిన మాని కర్ణాటక రాష్ట్రం సిందనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తోటి స్నేహితుడి మృతిని తట్టుకోలేని తిమ్మప్ప ప్రతి రోజు గుర్తు చేసుకుంటూ మదన పడేవాడు.ఈ క్రమంలో సోమ వారం పశువులకు మేత తెస్తానని పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రి తరలించినట్లు సీఐ తెలిపారు. గల్లంతైన యువకుడు శవమై తేలాడు నంద్యాల(అర్బన్):కేసీ కెనాల్లో గల్లంతైన యు వకుడు మంగళవారం శవమై తేలాడు. పట్టణ ంలోని విశ్వనగర్కు చెందిన శ్రీనివాసులు అలి యాస్ శ్రీకాంత్ ఆదివారం స్నేహితులతో కలిసి కెనాల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. రెండురోజులుగా స్నేహితులు, తల్లిదండ్రులు, పోలీసులు గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే, నీటిలో పడిపోయిన వంద అడుగుల దూరంలోనే మంగళవారం ఉదయం శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసులు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఆదోని అర్బన్: గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహానికి టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్రెడ్డి దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. సోమవారం స్థానిక పాత బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే టూటౌన్ పోలీసులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక రోజు గడిచినా బంధువుల ఆచూకీ తెలియకపోవడంతో సీఐ రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆదేశాలతో గుడ్ మార్నింగ్ సంఘం, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి స్థానిక శ్మశాన వాటిలో ఖననం చేశారు. -
మొండికేసిన బస్సు
బనగానపల్లె: ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. కండీషన్ లేని బస్సులు నడపడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ధర్మవరం నుంచి నంద్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బనగానపల్లె ఆర్టీసీ డిపోకు రెండు కిలోమీటర్ల దూరంలో మొండికేసింది. బస్సు బెల్టు తెగిపోవడంతో ముందుకు కదలని పరిస్థితి. దీంతో అందులో ఉన్న 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు డ్రైవర్, కండెక్టర్ వారిని కిందకు దించి వేరే బస్సులో పంపారు. ఉచిత బస్సు హామీ అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు బస్సుల కండీషన్పై దృష్టి సారించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బయోగ్యాస్ కంపెనీలో గ్యాస్ లీక్ కల్లూరు: ఉలిందకొండ సమీపంలోని రిలయన్స్ బయోగ్యాస్ సోపాన్ కంపెనీలో గ్యాస్ లీకై ంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు గాయపడ్డారు.ఉలిందకొండ గ్రా మానికి చెందిన సురేంద్ర (25 ), నాయకల్లు గ్రా మానికి చెందిన చంద్రమోహన్ (25), మహేష్ (22 ) గాయపడిన వారిలో ఉన్నారు. వీరిని స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు నగరంలో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఉలిందకొండ పోలీసులు విచారిస్తున్నారు. -
సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టునవుతా...!
మా స్వస్థలం అనంతపురం పట్టణం. నాన్న జనార్దన్రెడ్డి ఆర్ట్స్ కళాశాలలో ప్రి న్సిపాల్గా చేసి రిటైరయ్యారు. అమ్మ జయశ్రీదేవి గృహిణి. అక్క కీర్తన తిరుపతిలోని స్విమ్స్లో ఎండోక్రైనాలజిస్టుగా పనిచేస్తున్నారు. నేను ఎంబీబీఎస్ (2014 బ్యాచ్), జనరల్ సర్జరీ పీజీ (2021బ్యాచ్)లో కర్నూలు మెడికల్ కాలేజీలోనే చదివాను. పీజీ పరీక్షలో కూడా స్టేట్ టాపర్గా నిలిచాను. ఇప్పుడు నీట్–ఎస్ఎస్(సూపర్స్పెషాలిటీ) ప్రవేశ పరీక్షలో 65వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కావాలని ఉంది. –డాక్టర్ డి.విష్ణు శ్రీకర్రెడ్డి, సీనియర్ రెసిడెంట్, జీజీహెచ్, కర్నూలు -
అభివృద్ధి శూన్యం
డోన్: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను చేజేతులారా దూరం చేసుకున్నందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం డోన్ పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కాట సాని రాంభూపాల్రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ పరిశీలకులు దేశం సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజే ష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుగ్గన మాట్లాడుతూ.. చెప్పిందే చేయడం, మాట తప్పకపోవడం లాంటి లక్షణాలతో ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని ఆకర్షణీయమైన అబద్ధ్దాలతో వంచించిన చంద్రబాబునాయుడుకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా ఏమి నష్టపోయామన్నది ప్రజలకు అర్థమైపోయిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్సా ర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, అక్రమ కేసులు బనాయించి వేధించినా, ఆస్తులు ధ్వంసం చేసి నష్టం కలిగించినా భవిష్యత్తులో టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చాలా సహనంతో వ్యవహరిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులకు విద్య, వైద్యాన్ని దూరం చేయాలనుకోవడం చంద్రబాబు వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ఇలాంటి విధానాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సూపర్సిక్స్ పథకాల పేరిట పేదప్రజలను మభ్యపెట్టి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి చంద్రబాబునాయుడు అమలుచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దోమల నివారణ, పంటలపై క్రిమికీటకాల నివారణ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడిపే బదులు రైతన్న భరోసాకు ఆర్థికసహాయం, పండించిన పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఎక్కడ దేశంలో ఐదవ అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్యాపిలి మండల కేంద్రం వద్ద నిర్మించేందుకు అనుమతులు తీసుకొస్తే ఆ పథకాన్ని టీడీపీ నాయకులు రద్దుచేయించారని మాజీ మంత్రి బుగ్గన ఆరోపించా రు. డోన్ రైల్వే గేట్ల కింద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖను ఒప్పించి రూ.8కోట్లు మంజూరు చేయిస్తే నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా నిధులు మంజూరు చేయించకుండా కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులతో లక్ష విలువ చేసే పనులకు కూడా ప్రజాప్రతినిధులే భూమిపూజ చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డోన్ను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు రూ.3,500 కోట్లను మంజూరు చేశారని బుగ్గన గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నిర్మిస్తున్న ఐటీడీఆర్ భవన నిర్మాణంతో పాటు ఎస్సీ బాలికల కోసం కొత్తపల్లె వద్ద వసతిగృహం, బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటిఐ నిర్వహణకు సొంత శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి నియోజకవర్గంలో 33 చెరువులను హంద్రీనీవా నీటితో నింపి నియోజకవర్గంలో 10వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని ప్రయత్నిస్తే దానిని టీడీపీ నాయకులు సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారన్నారు. రూ.320 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి శుద్ధ జలాన్ని పంపిణీ చేయాలనే మహత్తర కార్యక్రమాన్ని మామూళ్ల కోసం మధ్యలో ఆపివేసి ప్రజలకు సకాలంలో తాగునీరు అందకుండా చేసింది ఎవరని నిలదీశారు. -
ఉత్తమ సేవలకు అవార్డు
గడివేముల: గ్రామ పాలనలో మెరుగైన సేవలు అందించిన కొరటమద్ది సర్పంచ్కు ఉత్తమ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఎంపిక కాగా.. నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరట మద్ది ఒకటి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మి కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రి చేతుల మీదుగా సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఎడమకంటి నాగేశ్వరరెడ్డి, దంపతులు అవార్డు అందుకున్నారు. -
బాలుడికి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
కర్నూలు: నగరంలోని అశోక్ నగర్లో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. పారిశుద్ధ్య కార్మికులు కాల్వ మరమ్మతు పనులు చేస్తుండగా అక్కడున్న విద్యుత్ స్తంభం కుప్పకూలింది. స్తంభం నేల కూలే సమయంలో ఆ రోడ్డు మార్గం మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని చూసి స్థానికులు గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేశారు. ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు ముందుకు వెళ్లకుండా వేగంగా వెనక్కు పరుగులు తీసి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాలుడు ప్రమాదం నుంచి తప్పించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు కూడా విద్యుత్ స్తంభం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్తంభం రోడ్డుకు అడ్డంగా పడటమే కాక అక్కడున్న విద్యుత్ వైర్లు డిష్ వైర్లపై పడటంతో మొత్తం తెగిపోయి నేలపై పడ్డాయి. దీంతో కాలనీ ప్రజలు కొద్దిసేపు భయాందోళనకు లోనయ్యారు. స్థానికుల సమాచారంతో విద్యుత్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కాలనీ ప్రజలకు ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. -
వేరుశనగకు రికార్డుస్థాయి ధర
క్వింటా రూ.12,096 ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వేరుశనగకు క్వింటా రూ.12,096 ధర పలికింది. ఈ మేరకు 2,614 సంచుల వేరుశనగకాయలు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.12,096, మధ్య ధర రూ.10,666, కనిష్ట ధర రూ.5,599 నమోదైంది. పత్తి ధర రూ.8,519 అలాగే 2,762 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.8,519, మధ్య ధర రూ.8,011, కనిష్ట ధర రూ.4361 పలికింది. -
● తప్పుడు కేసులకు భయపడొద్దు ● రైతుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం‘తప్పుడు కేసులు, నిర్బంధాలకు ఏ ఒక్క కార్యకర్త భయపడొద్దు.. రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎం కన్వెన్షన్ హాల్లో డోన్ నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడం మానుకోకపోతే టీడీపీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సీఎం చంద్రబాబు ..తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నిలుపుదల చేయడం దుర్మార్గమని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అప్పుడు వద్దని.. ఇప్పుడు సర్వేనా..? భూ యాజమాన్య హక్కు రైతులకు కల్పించేందుకు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ రీసర్వే చేయగా, నానా యాగి చేసి అప్రతిష్టపాలు చేసిన చంద్రబాబునాయుడు నేడు అదే సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాల్లో మార్పులు ఏమి చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అది కూడా తప్పుల తడకగా ఉందని రైతులకు గుర్తుచేశారు. -
జాలిమంచిలో పట్టపగలే చోరీ
ఆదోని రూరల్: పట్టపగలే జాలిమంచి గ్రామంలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో దొంగలు చొరబడి ఆరున్నర తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు రూ.2 లక్షల నగదును చోరీ చేసినట్లు బాధితుడు బోయ రంగారెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం చోరీ జరిగిందని, బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. రేపు బ్యాంకుల సమ్మె కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల సమ్మెను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ ఈ.నాగరాజు తెలిపారు. వారంలో ఐదు రోజుల పని దినాల కోసం చేపట్టిన సమ్మెలో కార్పొరేట్ బ్యాంకులు మినహా అన్ని బ్యాంకులు పాల్గొంటాయని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకుల సమ్మె సందర్భంగా 27న కర్నూలులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. కర్నూలు ఏరువాక కేంద్రానికి ‘ఉత్తమ’ అవార్డు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఏరువాక కేంద్రానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. 2024–25 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఏరువాక కేంద్రంగా ఎంపికై ంది. ఏరువాక కేంద్రం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ సుజాతమ్మ, ఇతర శాస్త్రవేత్తలు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. రైతులకు ఎప్పటికపుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు అందుతున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి కర్నూలు ఏరువాక కేంద్రం ఎంపిక అయ్యింది. గుంటూరులో ఈ నెల 29న జరిగే కార్యక్రమంలో ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ సుజాతమ్మ ఉత్తమ పురస్కారాన్ని అందుకోనున్నారు. పొగాకు రైతులకు లభించని గిట్టుబాటు ధర కర్నూలు(అగ్రికల్చర్): పొగాకు సాగులో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. క్వింటాకు కనీసం రూ.18,000 ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. అయితే పొగాకు కంపెనీల అసోసియేషన్ మాత్రం క్వింటాలుకు కేవలం రూ.1,6500 ధరను నిర్ణయించింది. పొగాకు కంపెనీలు పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. అంతంతమాత్రం ధరను నిర్ణయించడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాది రూ.1,5500 ధర ఉంది. ఈ ధరకు కనీసం 10 శాతం పెంచాలని రైతులకు కోరుతున్నారు. 2024–25లో పొగాకు సాగు చేసిన రైతులు గతంలో ఎపుడూ లేని విధంగా నష్టాలు మూట కట్టుకున్నారు. కొనేవారు లేక దాదాపు 50 వేల క్వింటాళ్ల పొగాకును పారబోశారు. గత ఏడాది నష్టపోయిన రైతులు 2025–26లో పొగాకు సాగు తగ్గించారు. పెట్టుబడి వ్యయం పెరిగినా కంపెనీలు నిర్ణయించిన ధర సాగు ఖర్చులకు అనుగుణంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులకు రాత పరీక్ష కర్నూలు సిటీ: జిల్లాలోని మూడు ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలోని ఐయాన్ డిజిటల్ జోన్లో ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించారు. ఉదయం మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 76 మంది అభ్యర్థులకుగాను 38 మంది హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టుకు 19 మందికిగాను 18 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీ, గణితం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఎం.హెచ్ అప్పా హైస్కూల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. దక్షిణ కొరియా సదస్సులో కర్నూలు వైద్యుడు కర్నూలు(హాస్పిటల్): దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ యురాలజీ సదస్సులో కర్నూలుకు చెందిన యూరాలజిస్టు డాక్టర్ సేపూరి బాల రవితేజ పాల్గొన్నారు. ఈయన కర్నూలు మెడికల్ కాలేజిలోని యురాలజి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కడ నిర్వహించిన ఆ సదస్సులో ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్గా గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లి ప్రసంగించారు. ప్రతిష్టాత్మక వేదికపై భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఏకై క ఫ్యాకల్టీగా తాను ఉండటం గర్వంగా ఉందని ఆయన ‘సాక్షి’తో తెలిపారు. ఇది మన దేశ వైద్యరంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి అంతర్జాతీయ వైద్యనిపుణులు, తోటి యురాలజిస్టులతో క్లినికల్ అంశాలపై తాను చర్చించి, తన అనుభవాలు పంచుకోవడం సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
వృద్ధాప్యంలో ఏదీ కరుణ
కర్నూలు(హాస్పిటల్): సృష్టిలో ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం తప్పనిసరి. ఈ వయస్సుకు వచ్చిన వారు చాలా మందిలో బడలిక, నిస్సత్తువ, నీరసం, చేతగానితనం, నిస్సహాయత ఆవహిస్తాయి. ఇలాంటి సహాయంలో వారు ఇతరుల సహాయం లేకుండా సొంతంగా పనిచేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కుటుంబసభ్యులు, స్నేహితులు తోడుంటే ఫరవాలేదు. అందరూ ఉన్నా వారికి చేయూత అంతంత మాత్రం ఉంటే వారి జీవితం నరకప్రాయమే. ఇలాంటి వారికి అనారోగ్యం ఏర్పడితే కనీసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నా కష్టమే. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఓపీ సేవలు సైతం అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2011లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ(ఎన్పీహెచ్సీఈ)ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులకు) ప్రత్యేక ఓపీ అమలు చేయాలి. వారికి ప్రత్యేక వార్డు(జీరియాట్రిక్ వార్డు) ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస(వృద్ధాశ్రమా లు) కేంద్రాలు నిర్వహించాలి. వారికి అవసరమైన వైద్యపరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైన హెల్త్కార్డులు జారీ చేయాలి. అవసరమైతే వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించాలి. వారికి సహాయంగా సేవలు అందించాలి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏవీ అమలు కావడం లేదు. వృద్ధుల వెంట ఎవ్వరైనా కుటుంబసభ్యులు ఆసుపత్రికి వస్తేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. ఒంటరిగా ఆసుపత్రిలో ఉంటానంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనూ చేర్చుకోవడం లేదు. సమాజంలో సైతం వారు ఎవ్వరూ ఆదరించకపోతే వృద్ధులు అనాథగా జీవించాల్సిందే. వైఎస్సార్సీపీ హయాంలో... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 2023 ఏప్రిల్ నుంచి ఆగష్టు నెల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 ఏళ్లకు పైబడిన వారు కేవలం 3,55,045 మంది చికిత్స పొందారు. 2022 సంవత్సరం సైతం 14 లక్షలకు పైగా వృద్ధులు వైద్యం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మేరకు సేవలను సీనియర్ సిటిజన్లు అందుకున్నారు. కానీ ప్రస్తుతం వీరు అందరితో పాటే వారికి చికిత్సలు అందుకోవాల్సి వస్తోంది. సహాయకులుంటేనే వారికి చికిత్స, ఫిజియోథెరపీ వంటి చికిత్సలు అందిస్తున్నారు. సహాయకులు లేనిదే వారు ఆసుపత్రిలో అన్ని చోట్లా తిరిగే ఓపిక లేక అనాథగా ఉంటూ రోగం ముదిరి మరణించే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఫ్యామిలి ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి వృద్ధులకు చికిత్స అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వృద్ధాప్యంలో వేధించే వ్యాధులుమతిమరుపు, కీళ్లవాపులు, కీళ్లనొప్పులు, ఆయా సం, క్యాన్సర్, కంటి శుక్లం, కంటిచూపు తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం, నిరాశ, డిప్రెషన్, మధు మేహం, రక్తపోటు, మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి వాపు, మెదడు, నాడీ మండల వ్యవస్థలో సమస్య కారణంగా చిత్తవైకల్యం, అజీర్ణం, మలబద్ధకం, నరాల బలహీనత, వణుకుడు రోగం (పార్కిన్సన్), న్యూమోనియా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మం పొడిబారడం, చర్మం మీద పొలుసులు రావడం, నిద్రలేమి, అతి నిద్ర, పక్షవాతం, క్షయ, మహిళల్లో మూత్రం ఆపుకోలేని పరిస్థితి, మూత్రమార్గం ఇన్ఫెక్షన్కు గురికావడం, గుండెజబ్బులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపించని ప్రత్యేక లైన్లు ప్రత్యేక ఓపీ కనుమరుగు అందరితో పాటు క్యూ లైన్లో నిలబడి నీరసం నిలబడలేక కుప్పకూలిపోతున్న వైనం కుటుంబసభ్యులు ఎత్తుకుని ఓపీకి వెళ్తున్న వైనం -
ప్రజాస్వామ్యానికి పౌరులే కీలకం
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు(సెంట్రల్): ప్రజాస్వామ్యంలో పౌరులే కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాలను విద్యార్థినులు ఆలపించారు. వేడుకలకు హాజరైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్కుమార్ వీడియో సందేశాన్ని వినిపించారు. ‘నా భారతదేశం – నా ఓటు’ అన్న సందేశంతో అధికారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు ప్రతిజ్ఞ చేశారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. సీనియర్, జూనియర్ ఓటర్లకు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, ఏఓ శివరాముడు,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు. -
యఽథేచ్ఛగా సుద్దమట్టి తవ్వకాలు
కోడుమూరు రూరల్: అక్రమార్కులు ప్రకృతి వనరులను దర్జాగా కొల్లగొడుతున్నారు. నిన్నటి వరకు హంద్రీనది నుంచి ఇసుక తరలించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు నేడు సుద్దమట్టిపై కన్నేశారు. వర్కూరు గ్రామ సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమకాల్వ కింద ఉన్న భూముల్లో నుంచి వారం రోజుల నుంచి సుద్దమట్టిని తరలిస్తున్నారు. గ్రామంలో సుద్దమట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆ వైపు తొంగి చూడడం లేదు. దీంతో పట్టపగలే ట్రాక్టర్లతో సుద్దమట్టిని తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కాగా గ్రామంలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల ఉన్న రోడ్డు మీదుగానే ట్రాక్టర్లతో వేగంగా మట్టిని నిత్యం తరలిస్తుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వృద్ధాప్యంలో మూత్రాశయ సమస్యలు
వృద్ధాప్యంలో చాలా మందికి మూత్రనాళ సమస్యలు సహజం. కొందరు మూత్రాన్ని ఆపుకోలేక మధ్యలోనే పోసుకోనే ఇబ్బంది తలెత్తోంది. కొందరు ప్రొస్టేట్ వాపు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది ప్రోస్టేట్ క్యాన్సర్కు దారి తీస్తుంది. ఇలాంటి సమస్యలున్న వారిని ఆదరించాలి. వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. మందులను రెగ్యులర్గా వాడుతూ ఉంటే మూత్ర సమస్యలు పరిష్కారం అవుతాయి. వారు మూత్రానికి బాత్రూమ్కు వెళ్లే సమయంలో ఒకరు తోడుండాలి. లేకపోతే వారు బాత్రూమ్లో జారిపడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ అబ్దుల్ సమద్, యూరాలజిస్టు, కర్నూలు -
తొలగని ‘దారి’ద్య్రం
హొళగుంద: హొళగుంద–ఢణాపురం రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డులో మారెమ్మ వంక నుంచి ఢణాపురం వరకు ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. మొత్తం 25 కి.మీ. దూరం ఉన్న ఈ ఆర్అండ్బీ డబుల్ రోడ్డు నిర్మాణానికి గతంలో ఎన్డీబీ నిధులు రూ. 62.29 కోట్లు మంజూరయ్యాయి. వివిధ కారణాలతో అర్ధాంతరంగా పనులు నిలిపేశారు. ఇటీవల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా నేటికి పనులు మొదలు పెట్ట లేదు. వందవాగిలి క్రాస్, హెబ్బటం, నాగనాథన హళ్లి మధ్య అడుగుఅడుగునా గుంతలు ఉన్నాయి. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గుంతలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిని చూసి ఎల్లార్తి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో దూరం, ఖర్చు పెరగడమే గాక సమయం వృథా అవుతోంది. -
కమనీయం.. రథోత్సవం
నందికొట్కూరు: శ్రీఛాయ ఉషా సమేత సూర్యభగవానుడి రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మితమైన పట్టణంలోని సూర్య నారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు భరత్కృష్ణ శర్మ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాలు, కుంకుమార్చనలు, అష్టోత్తర పుష్పార్చనలు చేపట్టారు. అనంతరం చిత్తూరు సురేష్కుమార్ శర్మ, నాగభూషణం శర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు సూర్య నారాయణ స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు. పురవీధుల వెంట కల్యాణ ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు. సాయంత్రం భక్తజనం మధ్య రథోత్సవం కొనసాగింది. రథంలో కొలువైన స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. -
లక్ష్మమ్మవ్వ సన్నిధిలో హైకోర్టు జడ్జి
ఆదోని అర్బన్: శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వను ఆదివారం సాయంత్రం హైకోర్టు జడ్జి కె.శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయచో టి సుబ్బయ్య, ఆర్.విశ్వనాథం పూర్ణకుంభంతో వారికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మహాయోగి లక్ష్మమ్మవ్వ వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు జడ్జి వెంట ఆదోని రెండో అదనపు జిల్లా జడ్జి పి.జె.సుధ, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.లీలాసాయి సుభాష్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అర్చన ఉన్నారు. ఏఆర్ ఏఎస్పీకి ఎంఎస్ఎం అవార్డు కర్నూలు: కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సింగాల కృష్ణమోహన్కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పోలీస్ అధికారులకు ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పోలీస్ మెడల్ ఫర్ మెరిటోయస్(ఎంఎస్ఎం) సర్వీస్ అవార్డు దక్కింది. ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఈ మేరకు ఆయనకు చోటు లభించింది. ఆర్ఎస్ఐ నుంచి.. కృష్ణమోహన్ ఆర్ఎస్ఐ హోదాలో 1991లో పోలీస్ శాఖలో చేరారు. ఆర్ఐగా 2000లో, డీఎస్పీగా 2011లో, 2024లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. స్పెషల్ పార్టీ కూంబింగ్ ఆపరేషన్లో ప్రధాన పాత్ర పోషించారు. 2009లో కర్నూలుకు వచ్చిన వరదల సందర్భంగా నెలరోజుల పాటు సేవలందించి అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఒక సేవాపతకం, ఉత్తమ సేవా పతకం, డీజీ మెడల్, 60 ప్రశంసాపత్రాలు, 50కి పైగా గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డులను ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి ● ఖాతాలో రూ.14.29 లక్షలు మాయం పాణ్యం: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాతాల్లో డబ్బులుంటే క్షణాల్లో ఊడ్చేస్తున్నారు. మండల కేంద్రమైన పాణ్యం గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఖాతా నుంచి రూ. 14.29 లక్షలను స్మార్ట్గా దోచేశారు. పాణ్యం ఏఆర్ కాలనీలో నివాసమున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి అల్లాబకాష్ ఈనెల 23వ తేదీన ‘పెన్షన్ రావాలంటే అడిగే వివరాలు చెప్పిండి’ అంటూ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. దీంతో బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పారు. సైబర్ నేరగాళ్లు పంపిన 10 డిజిట్ నంబర్లను ఏటీఎంలో నమోదు చేసిన కొద్ది క్షణాలకే అతని ఖాతాలో రూ.14,29,500 మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అక్రమార్జనకు ‘కొమ్ము’ కాస్తూ..
● పెద్దాసుపత్రిలో పచ్చని చెట్లతో వ్యాపారం ● భారీ వృక్షాలను నరికి తరలిస్తున్న కొందరు ఉద్యోగులు కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత కొన్ని నెలలుగా ఏపుగా పెరిగిన వృక్షాలను కొందరు వ్యక్తులు గొడ్డళ్లు, యంత్రాలతో నిలువునా నరికి నేలకూల్చేస్తున్నారు. వాటిని ప్రత్యేకంగా తెచ్చుకున్న వాహనాల్లో ఆసుపత్రి దాటించేస్తున్నారు. ఇందుకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సహకరిస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. ఇటీవల ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వద్ద, పూర్వ క్యాన్సర్ వార్డు దగ్గర ఏపుగా పెరిగిన చెట్లను నరికేశారు. తాజాగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వెనుకవైపున పలు వృక్షాలను సైతం నరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయాన్ని సెక్యూరిటీ గార్డులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పనులు ఆపి వచ్చి మాట్లాడాలని ఆదేశించారు. అయితే చెట్లు కొట్టే వ్యక్తులు రాకుండా అక్కడి నుంచి ఉడాయించారు. ఆసుపత్రిలో పర్యవేక్షణకు సంబంధించిన ఓ కీలక ఉద్యోగికి ఇందులో పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చెట్లను కొట్టివేయించి వాటి ద్వారా వచ్చిన సొమ్మును అతను ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేల్ ఆవరణలో సైతం చెట్లను కొట్టివేశారు. ఇందులోనూ అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఒక మొక్క వృక్షంగా పెరిగి చల్లని గాలిని, ఆక్సిజన్ను ప్రకృతికి అందించేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలా ఏపుగా పెరిగిన వృక్షాలను నిమిషాల్లో అక్రమార్కులు నరికి నేలకూలుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారి ఆగడాలను అరికట్టాలని వారు కోరుతున్నారు. -
గణతంత్ర వేడుకులకు సర్వం సిద్ధం
● ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం ● ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభంకర్నూలు: గణతంత్ర వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలోని పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం మైదానాన్ని రంగురంగుల జెండాలతో అలంకరించారు. వేదికకు ఇరువైపులా వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. పురప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు కూర్చునేందుకు కూడా ప్రత్యేక వేదికలను తీర్చిదిద్దారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మైదానం మొత్తం మున్పిపల్ అధికారులు ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. కొండారెడ్డిబురుజును విద్యుత్ బల్బులతో అలంకరించారు. కవాతు రిహార్సల్స్ పరిశీలన గణతంత్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ను ఆదివారం ఉదయం నిర్వహించారు. రిహార్సల్స్ను అడిషనల్ ఎస్పీలు హుసేన్పీరా, క్రిష్ణమోహన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి కవాతును పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, గ్యాలరీలు, స్టాల్స్ను పరిశీలించారు. వేడుకలకు అతిథులు, ప్రముఖులు హాజరవుతున్నందున భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, మంచి నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. హోంగార్డ్ డీఎస్పీ ప్రసాద్తో పాటు ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్, ఏఆర్, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు రిహార్సల్స్లో పాల్గొన్నారు. విస్తృత తనిఖీలు ... గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పోలీస్ శాఖ నగరంలో ముందస్తు తనిఖీలు చేపట్టింది. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, వీఐపీలు హాజరు కానుండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన దాదాపు 400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థలకు చెందిన ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించనున్నారు. -
అంతులేని జాప్యం
రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అంతంతమాత్రం వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అంతులేని జాప్యం జరిగింది. ప్రభుత్వం చొరువ తీసుకొని రైతులు, మహిళల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. – బీమానాయక్, మీటే తండా, తుగ్గలి మండలం చంద్రబాబు పాలనలో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకునే లింకేజీ రుణాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టడం దారుణం. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని మభ్య పెట్టారు. ఇప్పటి వరకు తూతూమంత్రంగా ఒక్క సిలిండరు మాత్రమే ఇచ్చారు. – పి.లక్ష్మిదేవి, మాజీ మండల సమాఖ్య అధ్యక్షురాలు, బేతంచెర్ల మండలం సంక్షేమ పథకాల ఊసే లేకపోవడంతో మహిళల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకపోయారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారు. స్వయంసహాయక సంఘాల మహిళలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. – చిట్టెమ్మ, మాజీ మండల సమాఖ్య అధ్యక్షురాలు, కల్లూరు మండలం -
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
కోడుమూరు రూరల్: గూడూరు మండలంలోని పొన్నకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు గూడూరు ఎస్ఐ రాజకుళ్లాయప్ప ఆదివారం విలేకరులకు తెలిపారు. పొన్నకల్కు చెందిన ఓ బాలిక ఈనెల 18నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా, ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. దీంతో బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజకుళ్లాయప్ప పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఓర్వకల్లు: సోమయాజులపల్లె ఘాట్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాంలో ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగరలో నివాసముంటున్న షేక్ వలిబాషా తన భార్య బోయ శాంతి (38)తో కలసి వ్యక్తిగత పనిమీద కర్నూలుకు బైక్పై బయలుదేరారు. పని ముగించుకొని తిరిగివెళ్తుండగా సోమయాజులపల్లె ఘాట్ రోడ్డులో వారి బైక్ తప్పింది. బైక్పై కూర్చున్న శాంతికి తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శాంతి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
రాకపోక.. నరకయాతన
● చంద్రబాబు ప్రభుత్వంలో బాగుపడని రోడ్లు ● అడుగడుగునా గుంతలు.. తేలిన రాళ్లు ● ప్రయాణమంటే భయపడుతున్న ప్రజలు గూడూరు–కర్నూలు రహదారి దుస్థితివాహనదారుల అగచాట్లుఎమ్మిగనూరురూరల్: ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వ కారణం..అంతా గతుకుల మయం.. రాళ్లు రప్పలు, దుమ్ముధూళి.. రోడ్డుపైకి రావాలంటనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోడ్లపై గుంతలన్నీ పూడ్చేశామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఊరూరా ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితిలో రోడ్లు కనిపిస్తున్నాయి. అధ్వానంగా.. నిత్యం రద్దీగా వాహనాలు తిరిగే గూడూరు–కర్నూలు రోడ్డు అధ్వానంగా మారింది. మొత్తం 12 కిలో మీటర్ల మేర ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని ప్రజలు సి.బెళగల్, గూడూరుకు ఈ రోడ్డు నుంచే వెళ్లాలి. జిల్లా కేంద్రమైన కర్నూలుకు వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారి. తెలంగాణ రాష్ట్రంలోని ఐజ, సుంకేశ్వరి ప్రాజెక్ట్ సందర్శకులు ఈ రోడ్డుమీదనే వెళ్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపే దారి మధ్యలోనే గర్భిణులు ప్రసవం అయిన సందర్భాలున్నాయి. భారీ వర్షం కురిస్తే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ముందుకు కూడా కదల్లేవు. రాళ్లు తేలి.. రాళ్లు తేలిన గూడూరు–కర్నూలు రోడ్డు చూసిన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ నేతలు గ్రామాలకు ప్రచారాలకు వెళ్లే సమయంలో ఈ రహదారి దుస్థితి కనిపించటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా బెండకాయ పొలానికి దుమ్ము పడకూడదని కలుగొట్ల గ్రామానికి చెందిన కౌలు రైతు నీరుగంటి రాముడు రోడ్డు పొడవునా చీరలు కట్టాడు. అయినా ప్రయోజం లేకుండా పోయింది. రోడ్డు పక్కన ఉన్న పత్తి, జొన్న పొలాలకు కూడా దుమ్ము బెడద తప్పటం లేదు. దుమ్ము పంటపై ఉండటంతో పిచికారీ చేసిన రసాయన మందులు పనిచేయటం లేదని రైతులు వాపోతున్నారు. -
కొనసాగుతున్న వలసలు
కోసిగి: పనులు లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. ఆదివారం కొల్మాన్పేట, కామన్దొడ్డి, తిప్పల దొడ్డి, వందగల్లు, కందుకూరు గ్రామాల నుంచి ఆరు బొలెరో లు, రెండు డీసీఎంలలో దాదాపు 250 మందికి పైగా కూలీలు తరలి వెళ్లారు. ఇళ్ల తాళాలు వేసి మూటా ముళ్లసర్దుకుని పిల్లలపాపలతో తరలి వెళ్లారు. విద్యార్థులను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్లారు. కూలీలు అత్యధికంగా గుంటూరు, వినుకొండ, విజయవాడ వైపు వెళ్లారు. అక్కడ మిరప పొలాల్లో పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. మద్యం మత్తులో వాగులో పడి మృతి ● ప్రమాదాన్ని దాచిన స్నేహితుడు నందికొట్కూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 18వ తేదీన బ్రాహ్మణకొట్కూరు పంప్హౌస్ వద్ద లభించిన గుర్తు తెలియని మృతదేహం పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన లింగాల ఏసేపుగా తేలింది. రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆదివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 15వ తేదీన గ్రామం నుంచి లింగాల ఏసేపు, అదే గ్రామానికి చెందిన ధర్మతేజ ఇద్దరు కలిసి నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి స్నేహితుల వద్దకు మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం మత్తులో అల్లూరు నుంచి రాత్రి 8 గంటల సమయంలో బైక్పై మిట్టకందాలకు బయల్దేరారు. మార్గమధ్యలో అల్లూరు సమీపంలోని హంద్రీనీవా కాల్వ బ్రిడ్జి వద్ద బైక్ అదుతప్పింది. ఈ ప్రమాదంలో ధర్మతేజ గట్టున పడగా, బైక్తోపాటు ఏసేపు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ధర్మతేజ దాచిపెట్టాడు. ఈ క్రమంలో ఏసేపు మృతదేహాన్ని లభించడం, పోలీసులు కర్నూలు మార్చురీకి తరలించి భద్రపరిచారు. అయితే ఏసేపు కుటుంబీకులు ఆచూకీ కోసం గాలిస్తూ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహం గురించి వివరించి గుర్తించమని చెప్పడంతో కేసు మిస్టరీ వీడింది. ప్రమాద విషయం దాచినపెట్టిన ధర్మతేజపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. -
గ ‘మ్మత్తు’గా దొరికిపోతున్నారు!
● 23 రోజుల్లో 582 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ● రూ.58.20 లక్షలు జరిమానా కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్నా మద్యంప్రియులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 23వ తేదీ వరకు 582 మంది మందుబాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున న్యాయస్థానం జరిమానా విధించారు. ఈ లెక్కన 23 రోజుల్లో రూ.58 లక్షలు మందుబాబులు మూల్యం చెల్లించారు. అలాగే 23 రోజుల్లో 627 మందిపై ఓవర్ స్పీడ్ కేసులు, 585 మంది హెల్మెట్ ధరించకపోవడంతో కేసులు నమోదయ్యాయి. అలాగే సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ 89 మంది వాహనదారులు పట్టుబడగా వారిపై ఈ–చలానాలు నమోదు చేశారు. 986 మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, మైనర్లు వాహనం నడపటం, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రత నియమాలపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, తనిఖీల సందర్భంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. -
గమ్యం చేరిన లక్ష్యం
● రాష్ట్రంలోనే హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న తొలి ఎస్సీ యువతి ● 26న పరేడ్ మైదానంలో ఆర్టీసీ బస్సు నడపనున్న విశ్వవాణి కర్నూలు(అర్బన్): మహిళలు అన్ని రంగా ల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కష్టమైన రంగాల్లో కూడా వెనకడగు వేయడం లేదు. పురుషులకే పరిమితమైన డ్రైవింగ్లో కూడా మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారు. అయితే కేవలం లైట్ వెహికల్స్కే పరిమితమైన మహిళలు నేడు హెవీ వెహికల్స్ నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వాహనాలను నడుపుతున్న మహిళల జాబితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. కర్నూలు పాతబస్డాండ్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీ ప్రాంతానికి చెందిన విజయేశ్వరరావు, మణి దంపతుల కూతురు విశ్వవాణి బీఎస్సీ చదివారు. ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రైవింగ్లో శిక్షణను పూర్తి చేసుకొని ఆర్టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే తొలి ఎస్సీ మహిళా డ్రైవర్గా కూడా గుర్తింపు పొందనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈనెల 12వ తేదీ వర కు అర్హులైన వారికి ఆర్టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రై వింగ్లో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణకు ఉమ్మడి కర్నూ లు జిల్లాలో 20 మంది ఎంపిక కాగా, ఇందులో 19 మంది పురుషులు కాగా, విశ్వవాణి ఒక్కరే మహిళ . ఇష్టంతోనే స్టీరింగ్ పట్టా .. ‘ఉద్యోగ రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశాల వైపు చూశాను. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, ఆర్టీసీ కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, ట్రైనింగ్ కళాశాల ఇన్స్ట్రక్టర్ వలితో పాటు నాతో శిక్షణ తీసుకుంటున్న వారు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ బస్సును నడిపేందుకు నన్ను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’. ఆర్టీసీ శిక్షణ బస్సును నడుపుతున్న విశ్వవాణి -
ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ప్రజలకు ఉన్న ఏకై క వజ్రాయుధం ఓటు హక్కు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు మదిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. దీనిని ఎన్నికల కమిషన్ విశేషంగా ప్రోత్సహిస్తోంది. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించినట్లు అవుతుంది. – డాక్టర్ ఏ.సిరి, కలెక్టర్, కర్నూలు భారత దేశం ప్రజాస్వామ్య దేశం. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల్లో భాగస్వా మ్యం కావాలి. ఇది యువత విధి. భారతదేశ ఎన్నికలు ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శం. యువత తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయి. – పి.కరుణానిధిమూర్తి, డైట్ కాలేజీ, కర్నూలు -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం
కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశం. అగ్రరాజ్యమైన అమెరికా కంటే మన దేశంలోనే ప్రజాస్వామ్య విలువలు ఎక్కువ. భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటే అందుకు కారణం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలించడమే. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలన్నీ ప్రజా ప్రభుత్వాలే. ఇలా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నికలు ఎంతో తోడ్పాడుతున్నాయి. ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలకు రాజ్యాంగం అందించింది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటరుగా మార్చేందు కు, యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25వ తేదీని 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుతోంది. వృద్ధుల నుంచి మధ్య వయస్సు వారు, 18–19 ఏళ్ల యువతీ,యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నూటికీ నూరు శాతం పోలింగ్ నమోదు అయ్యేలా ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలకు చేపడుతున్నారు. నేడు అధికారులతో ఎన్నికల ప్రతిజ్ఞ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రతిజ్ఞ కార్యక్రమాలను ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయిలో డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజలతో నా భారతదేశం – నా ఓటు అనే థీమ్తో ఎన్నికల ప్రతిజ్ఞ చేస్తారు. అలాగే ప్రతీ బూత్ లెవల్లోనూ బీఎల్ఓలు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కాగా, కలెక్టరేట్లో సునయన ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్స వం సభను నిర్వహించి ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ఎన్నికల అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తారు. 18 ఏళ్లు నిండితే ఓటరుగా నమోదుకు అవకాశం... భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించింది. కావున, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఓటరు నమోదు సవరణ జాబితాను సిద్ధం చేస్తారు. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండి విదేశాల్లో ఉండే వారు కూడా తగిన ఆధారాలు చూపి ఓటరుగా నమోదు కావచ్చు. ఎప్పుడు 18 ఏళ్లు నిండిన అదే సమయం నుంచి ఓటును ఏపీ సీఈఓ సైట్ ద్వారా 365 రోజులపాటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అదేవిధంగా సవరణ జాబితాలను కూడా ఏడాదికి రెండుసార్లు ప్రకటిస్తారు. సర్తో ఆందోళన... భారత జాతీయ ఎన్నికల కమిషన్ సాధారణంగా ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్తో ఓటరు జాబితాను పరిశీలించేది. దీని ప్రకారం జాబితాలో ఉన్న వారు ఎవరైనా చనిపోయినా, అనర్హులకు ఓటు ఉన్నా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, ఇంటి మార్పు చేసుకున్నా వారి వివరాలను మాత్రమే పరిశీలించి మార్పులు, చేర్పులు చేసేవారు. అయితే రెండేళ్లుగా ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)తో ముందుకు వచ్చింది. దీనిప్రకారం జాబితాలోని ప్రతి ఓటును ఎన్నికల కమిషన్ పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో మొత్తం 20,62,569 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు 28,109 మంది అధికంగా ఉన్నారు. 18–19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 27,927గా ఉంది. జిల్లాలో ఓటర్ల వివరాలు (2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రకారం) -
గంజాయి బ్యాచ్ అరెస్టు
కర్నూలు: కర్నూలు నగరం 4వ పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలోని 87, 88 సచివాలయాల వద్ద పాడుబడిన గదిలో గంజాయి తీసుకుంటున్న సమాచారంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపేటకు చెందిన దుర్గాప్రసాద్, గురురాఘవేంద్ర నగర్కు చెందిన కుమార్, సాయికుమార్, ఎన్ఆర్పేటకు చెందిన గౌతమ్, బంగారుపేటకు చెందిన సత్యప్రణయ్, జొహరాపురం హర్షవర్దన్, వీఆర్ కాలనీ సాయికృష్ణ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 250 గ్రాముల గంజాయి, దానిని సేవించడానికి ఉపయోగించిన బాటిల్తో పాటు రెండు బైకులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన ఏడుగురిలో దుర్గాప్రసాద్ గంజాయి సరఫరాదారుడు కాగా, మిగిలిన ఆరుగురు సేవించేవారు. బుధవారపేటకు చెందిన షేక్ మాలిక్ బాషాతో పాటు మరొకరు కలసి జట్టుగా ఏర్పడి అరకు నుంచి కిలోల కొద్దీ గంజాయిని తెచ్చి నగరంలోని ప్రధాన ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. దుర్గాప్రసాద్ కొంతకాలంగా ప్రధాన సూత్రదారి షేక్ మాలిక్ బాషా నుంచి కొనుగోలు చేసి పొట్లాల రూపంలో ఉద్యోగులు, విద్యార్థులకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు బయటపడింది. దుర్గాప్రసాద్ భారత్పే ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు. అయితే తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలనే ఆశతో అడ్డదారిగా గంజాయి రవాణా మార్గాన్ని ఎంచుకుని పోలీసుల వలకు చిక్కాడు. గంజాయి సేవిస్తున్న వారిలో విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లో అనాటమి టీచింగ్ ఫ్యాకల్టీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజనీరింగ్ విద్యార్థి, ట్రావెల్ బిజినెస్, మాజీ ఐటీ ఉద్యోగి, డీ–ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. వీరిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచినట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మహానంది:మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందా డు. శనివారం ఆంజనేయపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మహానంది మండలం గాజులపల్లెకు చెందిన కొలిమి మత్తూమ్(64) ఆంజనేయపురం సమీపంలోని పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నా డు. సోలార్తో పాటు ఓ బల్బు కోసం విద్యుత్ వైరు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆయన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా తీగను గమనించలేదు. ఆ తీగ కాస్త సోలార్పై పడటంతో ప్రమాదవశాత్తూ ఆ విద్యుత్ సరాఫరా కావడంతో మత్తూమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన రైతుకు భార్య కొలిమి రమీజా ఉండగా ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈఈ ప్రభాకర్రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. తీగ డ్యామేజీని గుర్తించినట్లు చెప్పారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కే. విశాలక్ష్మి అండర్–19 విభాగంలో జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్యస్రవంతి తెలిపారు. గతేడాది నవంబర్ 23న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో జాతీయ పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ నెల 27 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థిని విశాలక్ష్మి, పీఈటీ సుప్రియను శనివారం ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమె అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి మంచి పేరు తీసుకరావాలని ఆమె ఆకాంక్షించారు. -
26న పీజీఆర్ఎస్ రద్దు
కర్నూలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న(సోమవారం) నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో జిల్లా కేంద్రానికి రా వొద్దని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.రూ.10 వేలు దాటిన వేరుశనగ ధర కర్నూలు(అగ్రిల్చర్): వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యా ర్డుకు శనివారం 241 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.5,699, గరిష్ట ధర రూ.10,202 లభించింది. సగటు ధర రూ.9,869 నమోదైంది. ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగు తగ్గిపోయింది. ఇందువల్ల మార్కెట్లో వేరుశనగకు కొరత ఏర్పడుతోంది. డిమాండ్కు తగినట్లు వేరుశనగ సరఫరా లేకపోవడం వల్ల ధర పెరుగుతోంది. ఈ నెల 23న గరిష్టంగా రూ.9,519 ధర లభించింది. తాజాగా రూ.10,202 లభించింది. ఒక్కరోజులోనే క్వింటాపై రూ.683 పెరుగుదల ఉండటం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26 రబీ సీజన్లలో వేరుశనగ సబ్సిడీపై పంపిణీ చేయకపోవడమే వేరుశనగకు కొరతకు కారణమవుతోంది. పోలీసుల విస్తృత తనిఖీలు కర్నూలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కర్నూలులో ముందస్తు తనిఖీలు నిర్వహించారు. ప్రజ ల భద్రతే లక్ష్యంగా కర్నూలు బస్టాండ్లోని పా ర్సిల్ కార్యాలయాలు, వాహన పార్కింగ్ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు విక్రమసింహ, చంద్రబా బు నాయుడు, నాగరాజరావు ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్తో పాటు రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ పార్సిల్ కార్యాలయాలు, వెయిటింగ్ హాల్, ప్లాట్ఫారం, రైలు భోగీల్లోని ప్రయాణికుల బ్యాగులను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా ముందస్తు తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: సీసీ కెమెరాల నిఘాలోఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆర్ఐఓ జి.లాలెప్ప, జాల్లా వృత్తి విద్యాధికారి డా.సురేష్ బాబు సూచించారు. కర్నూలు ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెట్లు, ఎగ్జామినర్లకు శనివారం ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకేషనల్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు మొదటి, ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు రెండో, 6 నుంచి 10వ తేదీ వరకు మూడో స్పెల్ పరీక్షలు ఉంటాయన్నారు. జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు మొదటి, 6 నుంచి 10వ తేదీ వరకు రెండో స్పెల్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో పరీక్షల కమిటీ సభ్యులు నాగభూషణ్ రెడ్డి, ప్రసాద్, సురేష్ చంద్ర, మల్లికార్జునరావు, టౌన్ మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
● దోచుకోవడం..దాచుకోవడమే టీడీపీ నేతల నైజం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కోడుమూరు రూరల్: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ముగిసిపోయిందని, ఆ పార్టీ నాయకులంతా ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకుంటున్నారన్నారు. కోడుమూరులో ఎస్ఈసీ సభ్యులు కోట్ల హర్షవర్దన్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ము ఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణు క, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15లో గా ప్రతి గ్రామంలోనూ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వం ఉన్నవారికి గుర్తింపు కార్డును ఇస్తామన్నారు. సీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని ఎస్వీ విమర్శించారు. జగనన్న పాలనలో ప్రతి రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యూరియా అందుబాటులో ఉండేవని, నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, సీమ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో భూముల రీసర్వే నిర్వహిస్తే జగనన్న లాక్కూంటున్నాడంటూ ఆరోపణలు చేసి రైతులను తప్పుదోవ పట్టించిన సీఎం చంద్రబాబు నేడు మళ్లీ భూముల రీసర్వే నిర్వహిస్తూ క్రేడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యకర్తలే పార్టీకి పునాదులు వైఎస్సార్సీపీకి కార్యకర్తలే పునాదని పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న సీఎం చంద్రబాబు గుండ్రేవుల ప్రాజెక్టు కోసం రూ.5వేల కోట్లను ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ నిత్యం పోరాటాలు చేస్తోందన్నారు. సమావేశంలో గూడూరు ఎంపీపీ సునీత, మున్సిపల్ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్లు రమేష్నాయుడు, రామాంజినేయులు, సోమశేఖర్రెడ్డి, మోహన్బాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పాటిల్ హనుమంతరెడ్డి, లాయర్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శులు కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, శివరాముడు, అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్రెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డీలర్ క్రిష్ణారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతమ్, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎం బాషా, నియోజకవర్గ అధ్యక్షులు బందెనవాజ్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు మధు శేఖర్, ఆయా మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో పొగలు
వెల్దుర్తి: కల్లూరు మండల పరిధిలోని ఉలిందకొండ హైవేపై శనివారం ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. డోన్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు కర్నూలుకు వెళ్లి 79 మంది ప్రయాణికులతో తిరిగివస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్నటేకూరు వద్ద బస్సులో ప్రారంభమైన ఉలిందకొండ హైవేపై ఎక్కువయ్యాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ కుమార్ బస్సును ఆపి ప్రయాణికులను దిగమనడంతో తోపులాట జరిగింది. పలువురు చిన్నారులు, యువతులు స్వల్పగాయాలకు గురయ్యారు. కొందరు ఆందోళనకు గురై బస్సుల కిటికీల నుంచి కిందకు దూకేశారు. బస్సు చాలా పాతది కావడం, లోడు ఎక్కువగా ఉండటంతో ఇంజిన్ వద్ద ఉన్న రేడియేటర్పై భారం పడి పొగలు వచ్చినట్లు డ్రైవర్ గుర్తించారు. ఇదే హైవే ప్రాంతంలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన సంఘటన, ఇటీవల నంద్యాల జిల్లాలో శిరివెళ్ల వద్ద మరో బస్సు దుర్ఘటన గుర్తుకు వచ్చి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మంచి బస్సులను నడపాలని కోరారు. -
గణతంత్ర దినోత్సవ బహుమతుల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: గణతంత్ర దినోత్సవ బహుమతులు, అమరవీరులైన జవాన్లకు విరాళాల పేరిట నకిలీ వెబ్ లింకులతో కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సోషల్ మీడియా, వాట్సప్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మరాదని, అధికారిక వెబ్సైట్లు ధృవీకరించుకున్న సమాచారాన్ని మాత్రమే నమ్మాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. వ్యక్తిగత సమాచారం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటీపీలు, అపరిచిత లింకులలో పంచుకోవద్దని సూచించారు. గిఫ్ట్ కార్డుల లింకులను ఆశపడి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులు లేదా నేషనల్ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930 లేదా వెబ్సైట్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్ కోచింగ్ కర్నూలు(అర్బన్): ట్రాన్స్జెండర్లు, విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ఐటీ/ఐటీఈస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు https://apdascac.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
విజయ డెయిరీ చైర్మన్కు సన్మానం
నంద్యాల(అర్బన్): అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కుట్రలు చేసినా విజయ డెయిరీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్వితీయ విజయం సాధించింది. విజయ డెయిరీ చైర్మన్గా ఎస్వీ జగన్మోహన్రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. కర్నూలులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో 12 మంది డెయిరీ డైరెక్టర్లు.. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్ జగన్మోహన్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తొలిసారి 2021 జనవరిలో, ప్రస్తుం రెండో సారి ఎన్నిక కావడంపై డైరెక్టర్లు, డెయిరీ ఎండీ ప్రదీప్కుమార్ చైర్మన్ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్ 15న 12 మంది డైరెక్టర్లు తనను చైర్మన్గా ఎన్నుకున్నారన్నారు. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలు ఉన్నందున చైర్మన్ ఎన్నికను ప్రకటించలేదన్నారు. నామినేషన్లు వాయిదా పడటంతో డైరెక్టర్లు తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. -
పశ్చిమాన వలసల జోరు
● ఇప్పటికే ఊళ్లు విడిచిన 1.50 లక్షల కుటుంబాలు ● సంక్రాంతి నుంచి కిక్కిరుస్తున్న వలసబండ్లు ● చదువు మానేసి తల్లిదండ్రులతో పాటే పిల్లలు ● రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలిక మృత్యువాత ● స్థానికంగా ఉపాధి కల్పించని ప్రభుత్వం ● టీడీపీ నేతలు, ఉపాధి సిబ్బంది కుమ్మకై ్క దొంగ మస్టర్లు 25 నుంచి మార్కెట్ యార్డు బంద్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 25 నుంచి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026టెంపోలో వలసపోతున్న కందుకూరు గ్రామస్తులుకర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో ఉపాధి జాడ కరువైంది. 2023–24లో ఇదే సమయంలో ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 55వేల మంది, నంద్యాల జిల్లాలో 36వేల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. నేడు కర్నూలు జిల్లాలో 21వేలు, నంద్యాల జిల్లాలో 16వేల కు మించని పరిస్థితి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వీబీ జి రామ్జీ కొత్త పథకం అమల్లోకి రానుంది. కొత్త పథకం ఏ విధంగా ఉంటుందో, ఏమోననే ఉద్దేశంతో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ మొదలుకొని ఏపీఓ స్థాయి వరకు దోపిడీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ఉపాధి సిబ్బందితో కుమ్మకై ్క ఉపాధి నిధులను కొల్లగొడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు, నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే లక్ష కుటుంబాలు వలసబాట పట్టాయి. రానున్న రోజుల్లో మరో 50వేల కుటుంబాలు వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యం వలసలే.. సంక్రాంతి పండగ తర్వాత జిల్లా నుంచి నిత్యం వందలాది కుటుంబాలు పొట్ట చేతపట్టుకొని వలసబాట పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇళ్లకు తాళం వేసి బడికి వెళ్లే పిల్లలను సైతం వెంట పెట్టుకొని గుంటూరు ప్రాంతంలో మిర్చి తెంపడానికి పోతున్నారు. ప్రధానంగా కోసిగి, మంత్రాలయం, కౌతాళం, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, పెద్దకడుబూరు మండలాల నుంచి వలసలు అధికంగా ఉంటున్నాయి. డిసెంబర్ నెల చివరికే వ్యవసాయ పనులు పూర్తి కావడం, రబీలో వ్యవసాయం లేకపోవడంతో వ్యవసాయ కూలీలు.. సన్న, చిన్న, మధ్యకారు రైతులకు ఉపాధి కష్టమైంది. వలసపోతున్నప్పటికీ ఈ మండలాల్లోని సగం పంచాయతీల్లో ఉపాధి పనులు లేకపోవడం గమనార్హం. ఈ నెల 23న కోసిగి మండలం కామన్దొడ్డి గ్రామం నుంచి అనేక కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ గ్రామంలో ఉపాధి పనులే కల్పించలేదు. దీంతో వలసబాట పట్టిన నగేష్, ఉరుకుందమ్మలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. పశ్చిమ ప్రాంతంలోని పలు మండలాల మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తోంది. వాస్తవానికి ఈ నది పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. నడిమధ్యలో నది ప్రవహిస్తున్నా పంటలు సాగు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కళ్లెదుటే నీరు కనిపిస్తున్నా రబీ సీజన్లో భూములు ఖాళీ ఉంచుకోక తప్పని పరిస్థితి. తుంగభద్ర నదిపై పశ్చిమ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటు ఉమ్మడి రాష్ట్రాన్ని, అటు విభజిత రాష్ట్రానికి 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కరువుపీడిత ప్రాంతమైన ఆదోని రెవెన్యూ డివిజన్పై పగపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేదవతి నదిపై ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమైనా చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టడం గమనార్హం. సా్థనికంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. గత శుక్రవారం కోసిగి మండలంలోని కామన్దొడ్డి, కందుకూరు గ్రామస్తులతో పాటు కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన కూలీలు 8 టెంపోలలో దాదాపు 300 మందికి పైగా కోసిగి మీదుగా వలస వెళ్లారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో గుంటూరులో మిరప పనులకు తరలిపోతున్నారు. కందుకూరు గ్రామానికి చెందిన కూలీలు ఇప్పటి వరకు వలస వెళ్లిన దాఖలాల్లేవు. అయితే ఈ ఏడాది తుంగభద్ర నదికి హోస్పేట్ డ్యాం నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వకపోవడంతో గ్రామంలో వ్యవసాయ భూములు సాగుకు నోచుకోలేదు. దీంతో ఆ గ్రామస్తులు పనుల్లేక ఊరు విడవాల్సి వచ్చింది. ఆయా గ్రామాల్లో కూలీలు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి కన్నీటి పయనమయ్యారు. – కోసిగిభారీ వాహనాలను నడుపుతున్న మహిళల జా బితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. ఈమె ఆర్టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. 8లోuకాకి లెక్కలతో సరి.. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 56,90,338, నంద్యాల జిల్లాలో 55,18,093 పని దినాలు కల్పించినట్లు లెక్కలు చూపుతున్నారు. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 1.11 కోట్ల పనిదినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు కనీసం 20వేలు ఉండాలి. గత 10 నెలల కాలంలో కర్నూలు జిల్లాలో 2,041, నంద్యాల జిల్లాలో 2,590 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. బోగస్ మస్టర్లు వేయడం వల్లే పని దినాలు పెరిగినట్లు తెలుస్తోంది. పెద్దకడుబూరు అనావృష్టి మండలం. ఈ మండలంలో కేవలం 10 కుటుంబాలు మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకున్నాయంటే ఉపాధి పనుల తీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. -
కేసీ ఆయకట్టు.. కన్నీటి తడులు!
● ఆందోళనలో మొక్కజొన్న, మినుము, కంది రైతులుపగిడ్యాల: కేసీ కాలువ ఆయకట్టు కింద రబీ సీజన్లో రెండవ పంట సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. కేసీ కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో దాదాపు వారం రోజులుగా పొలాలకు నీటి తడులు కట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పైర్లు తురాయి దశలో ఉండగా మినుము, కంది, వేరుశనగ పైర్లు పూత పడుతున్నాయి. కేసీ కాలువ పూర్తిగా ఒట్టిపోవడంతో స్లూయిస్లకు నీరందడం లేదు. తురాయి దశలోని మొక్కజొన్న పైర్లకు నీరు కట్టకపోతే పంట చేతికందని పరిస్థితి నెలకొంది. మండలంలోని నెహ్రూనగర్, పీకే ప్రాగటూరు, పాత, కొత్త ముచ్చుమర్రి, కొత్త ఎల్లాల, బీరవోలు, సంకిరేణిపల్లె, ఆంజనేయనగర్, పగిడ్యాల, కొత్త పాలమర్రి, లక్ష్మాపురం, తూర్పు, పడమర ప్రాతకోట, రైతుపల్లె, ఎం,ఎన్. ఘణపురం, తూర్పు, పడమర వనుములపాడు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీ కాలువకు రెండు పంటలకు సమృద్ధిగా ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు సరఫరా చేశారని గర్తుకు తెచ్చుకుంటున్నారు. రబీ సీజన్లో సాగైన పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ మొదటి వారం వరకు కేసీ కాలువకు నీటి సరఫరాను కొనసాగించాలని రైతాంగం కోరుతున్నారు. మల్యాల ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి లిఫ్ట్ ద్వారా కేసీకి విడుదల చేయాల్సిన నీటిని సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఈ విషయమై కేసీ కెనాల్ నీటిపారుదల శాఖ నంది కొట్కూరు సెక్షన్ ఏఈఈ వీరమ్మ వివరణ కోరగా.. తుంగభద్ర డ్యాం మరమ్మతులు ఉన్నందున 0 నుంచి 120 కి.మీ. వరకు పంటలు సాగు చేయరాదని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయన్నారు. నీటి విడుదల విషయమై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఈఈ, డీఈలు వెళ్లారని ఆమె పేర్కొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి (23) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి పట్టణంలో ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రరెడ్డికి ఇద్దరు సోదరులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉదయం పని నిమిత్తం పట్టణానికి వచ్చిన సురేంద్రరెడ్డి నూనెపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. శ్రీశైలం నుంచి 11,676 క్యూసెక్కుల తరలింపు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు గురువారం నుంచి శుక్రవారం వరకు 11,676 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.490 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 4,933 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,343 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కర్నూలు: కర్నూలు శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన శరీన్ నగర్ వైపు నుంచి వచ్చే సర్వీసు రోడ్డులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ హుసేన్ బాషా (41) శరీన్ నగర్లో నివాసముంటూ అదే కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గోబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడు అబ్దుల్లాతో కలసి పల్సర్ వాహనంపై సూర్య దేవాలయం వైపు నుంచి గుత్తి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా హోండా యాక్టివాలో మరో వ్యక్తి వేగంగా వచ్చి పల్సర్ను ఢీకొట్టింది. దీంతో షేక్ హుసేన్ బాషాకు నుదుటిపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ 112కు ఫోన్ చేసి సమాచారమివ్వగా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన అబ్దుల్లాను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. గాయాలకు గురైన అబ్దుల్లా గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతుని భార్య పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి పంట రక్షణపై అవగాహన అవసరం
● తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు లు అవగాహన పెంచుకోవాలని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఉద్యానభవన్తో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న దృష్టా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మామిడి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడంతో నాణ్యత పెంపొందుతుందని తెలిపారు. కవర్లు తొడగకపోతే చీడపీడల ప్రభావం వల్ల కాయల్లో నాణ్యత దెబ్బతింటుందని, కాయల్లో నాణ్యతను పెంచుకునేందుకు ఫ్రూట్స్ కవర్లు వినియోగించాలని సూచించారు. నీరు, ఎరువుల యాజమాన్యంపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ... తేనేమంచు పురుగు, గొంగలి, కాండం తొలుచు, తామర పురుగులు, పండు ఈగ తదితర వాటివల్ల మామిడికి నష్టం కలుగుతుందని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రారంభంలో చీడపీడలను గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. కాగా పలువురు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పూత పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అనుమానాలపై రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు నరేష్కుమార్రెడ్డి, మదన్మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు. కూలీల ఆటో బోల్తా ● వృద్ధురాలి మృతి పాణ్యం: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. వారిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలకు.. పాణ్యంకు గ్రామానికి చెందిన 12 కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బలపనూరు సమీపంలో పొలూరు పొలాల్లోకి వెళ్లారు. పనులు ముగించుకుని తిగిరి వసున్న సమయంలో జీఎం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కావడంతో సమీపంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన పాణ్యంకు చెందిన గుడిపాటి పెద్దక్క(61) కోలుకోలేక మృతి చెందింది. రాములమ్మ, రాజేశ్వరి, జ్యోతి, మధారా, షష్మీ, దస్తగిరమ్మతో పాటు మరొకరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సరస్వతీ నమోస్తుతే!
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు కనులపండువగా నిర్వహించారు. సరస్వతి దేవి పుట్టినరోజును పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటి వేడుకలు కావడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ చిన్నారులకు అమ్మవారి చెంతన అక్షరాభ్యాసాలు చేయించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని ‘సరస్వతీ దేవి నమోస్తుతే’’ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఉదయం 4 గంటలకు కవాటోద్ఘాటనం, మంగళవాయిద్యాల నడుమ చారుఘోషిణి నదీ పవిత్రజలంతో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, అమ్మవారికి విశేష అభిషేకం, షోడశోపచారపూజ అదేవిధంగా పూలమాలలతో విశేష అలంకరణ వేదపండితులు నిర్వహించారు. అనంతరం 5.20 గంటలకు అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏఈఓ ఫణిందర ప్రసాద్, ఆలయ చైర్మన్ రామేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఆర్డీఓ నాగజ్యోతి, సర్పంచు చంద్రశేఖర్ యాదవ్, కొలనుభారతి దేవి ఆలయ చైర్మన్ వెంకటనాయడు వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయానుసారంగా అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, కుంకుమార్చన, పుష్పార్యన, బాలభోగనివేదన, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, తహసీల్దార్లు ఉమారాణి, చంద్రశేఖర్ నాయక్, గోపాలకృష్ణ, కొత్తపల్లి జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, మండల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కె.సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కుసుమలత, పార్టీ నేతలు జనార్దన్ రెడ్డి, నారాయణరెడ్డి, నందికుంట సర్పంచు నిత్యలక్ష్మీదేవి, ఎంపీటీసీ బాలరాజు, మునిరంగ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం, శ్రీశైలం దేవస్థానం వారు, శ్రీ వాసవి మాత ఆర్య, వైశ్యఅన్నదాన సత్రాలవారు భోజన వసతి కల్పించారు. వేడుకగా సామూహిక అక్షరాభ్యాసం కొలనుభారతి దేవి ఆలయ సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయ ని, మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల విశ్వా సం. ఇందులో భాగంగా శుక్రవారం వసంత పంచ మి వేడుకలో 810 మంది చిన్నారులకు శ్రీశైలం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అక్షరాభ్యాసం చేయించారు. కనుల పండువగా వసంత పంచమి వేడుకలు వేడుకగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు -
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
● కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా ● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలుపెద్దకడబూరు: అతి వేగానికి రెండు ప్రాణాలు బలి అయ్యాయి. ఆదోని – ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో హనుమాపురం గ్రామ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఏఎస్ఐ శివరాములు వివరాల మేరకు.. ఆదోని పట్టణానికి చెందిన గౌస్మోద్దీన్, గాలిబ్ మున్షి, మహమ్మద్ ఇలియాజ్, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాబీర్బాషాలు పీడీఎస్ రైస్ (రేషన్ బియ్యం) సరఫరా కోసం కారులో ఆదోని నుంచి ఎమ్మిగనూరు మండలం ముగతి గ్రామానికి వెళ్తున్నారు. అయితే షేక్ షాబీర్బాషా కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతున్న సమయంలో హనుమాపురం గ్రామ బస్టాండ దగ్గర అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయాడు. కారు అతి వేగంతో ఉండగా అదుపు తప్పి ఎడమ వైపు ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. అక్కడ ఉన్న చెట్టును ఢీకొని కారు బోల్తాపడింది. పక్కనే రోడ్డుపై వెళ్తున్నవారు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. అప్పటికే గాలిబ్మున్షి(61) అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురిని అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ షాబీర్బాషా(25) చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగిలిన గౌస్మోద్దీన్, మహమ్మద్ ఇలియాజ్ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రైవేటు ఆస్పతికి తరలించారు. గౌస్మోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వృద్ధురాలి మృతి మద్దికెర: స్థానిక బస్టాండు షెల్టర్లో గుర్తు తెలియని వృద్ధురాలు శుక్రవారం మృతి చెందినట్లు మద్దికెర ఎస్ఐ హరిత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 80 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా గ్రామంలో యాచిస్తూ కడుపునింపుకునేందన్నారు. వృద్ధురాలికి తెలుగు బాష రాదని, కన్నడ మాత్రమే వస్తుందన్నారు. ఎవరైనా అడిగితే తనది హోస్పేట్ అని చెబుతుండేదన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు మద్దికెర ఎస్ఐ 9121101130కు ఫోన్ చేయాలన్నారు. -
25న జాతీయ ఓటరు దినోత్సవం
కర్నూలు(సెంట్రల్): జనవరి 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవ నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నా భారతదేశం–నా ఓటు అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25న సునయన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో సీనియర్ ఓటర్లు, కొత్త ఓటర్లను సన్మానిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 8 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 54 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు పదో తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్నారు. 2025 జూలై ఒకటో తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులే అర్హులన్నారు. ఆయా పోస్టుకు పెళ్లియి అదే గ్రామంలో నివాసం ఉంటున్న వాళ్లే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టుల వివరాలను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పోలీస్ హెల్ప్లైన్ సేవలపై విస్తృత ప్రచారం కర్నూలు: పోలీస్ హెల్ప్లైన్ నెంబర్లు 100, 112, 1930 తదితర సేవలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా అవగహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల వారీగా సచివాలయ మహిళా పోలీసులతో కలసి పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి మహిళల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై కూడా మహిళలు, విద్యార్థులకు వివరించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సదస్సుల్లో వివరించారు. యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కాటసాని శివనరసింహా రెడ్డి కల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహా రెడ్డిని స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం నియమించింది. -
వలసబాటలో విషాదం
ఆత్మకూరు రూరల్: వలసబాటలో విషాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో తొమ్మిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో గీతా భవన్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలివీ.. కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్దొడ్డి గ్రామానికి చెందిన నాగేష్ దంపతులు తమ కుమార్తె కీర్తి(9), మరికొందరితో కలసి గుంటూరులో మిరప తోటల్లో పనులు చేసేందుకు వలస కూలీలుగా వెళ్ళేందుకు ఒక బొలెరో వాహనంలో ప్రయాణమయ్యారు. వాహనం ఆత్మకూరు పట్టణశివార్లలో బైపాస్ రోడ్డుపై వెళుతున్న సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో ఒక డిసిఎం వాహనం వచ్చి నేరుగా వారు ప్రయాణిస్తున్న బొలెరోను ఢీకొంది. దీంతో బొలెరో పైనుంచి కీర్తితో పాటు మరో నలుగురు ఎగిరి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో కీర్తి అక్కడికక్కడే మరణించింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన డిసిఎం డ్రైవర్ ప్రమాద సమయంలో తప్ప తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదేళ్ల బాలిక మృతి ఉపాధి కరువై వలస పోతుండగా ఘటన తప్పతాగి డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్


