Kurnool District Latest News
-
శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ ను సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. పది గడ్డివాములు దగ్ధం హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు. మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. -
సంగమేశ్వరుడి పూజకు వేళాయె!
ఆలయానికి బురదలోనే వెళ్తున్న భక్తులుకొత్తపల్లి: శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో వెలిసిన ప్రాచీన సంగమేశ్వరుడు జలాధివాసం వీడారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం బయటపడింది. ఆలయంలో చుట్టూ ఒండ్రు బురద పేరుకుపోయింది. గర్భగుడిలో, ఆలయ ముఖమండపంలో బురద నీటితో నిండి ఉంది. అయినా శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాచీన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. బురదలోనే ఒకరి వెంట ఒకరు నడుస్తూ ప్రాచీన ఆలయానికి వెళ్లి స్వామికి పూజలు చేశారు. చుట్టూ నీరు మధ్యలో సంగమేశ్వరాలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. పండుగ సెలవులు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఉంది. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివ లింగానికి, లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయం చుట్టూ బురద, రాళ్లు, రప్పలు ఉన్నాయని, ప్రమాదానికి ఆస్కారముందని, అంతా శుభ్రం చేసే వరకు ఆలయం లోపలికి ఎవరూ రావద్దని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. -
నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్మెంట్స్కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్మెంట్స్ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. మద్యం మత్తులో చెరువులోకి దిగి.. ● కంబాలపాడు చెరువులో మునిగి డోన్ వాసి మృతి కృష్ణగిరి: అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి సమీపంలోని చెరువులోకి ఈతకు దిగి మృత్యుఒడిలోకి చేరిన ఘటన మండలంలోని కంబాలపాడు గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణంలోని చిగురుమాను పేటకు చెందిన ఎరుకల రాజేష్ (25) శనివారం ఉదయం మద్యం సేవించి తమ ఇంటి దైవమైన కంబాలపాడు చెరువు కట్టపై ఉన్న గంగమ్మకు మొక్కు తీర్చుకునేందుకు కోడిపుంజుతో స్నేహితులు ఎరుకల సతీష్, ఎరుకల మల్లికార్జున, ఎరుకల ఆశోక్తోపాటు మరికొందరితో ఆలయం చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి వంట చేసుకుంటున్న సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. మద్యం మత్తులో ఉన్న రాజేష్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గాలించి బయటకు తీసుకొచ్చి డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా..మృతుడికి భార్య ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడటం చంద్రబాబు విజన్కు అద్దం పడుతుందోని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలే అజెండాగా పని చేస్తున్నారని విమర్శించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రెండేళ్లగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్ర బాబు కనీసం స్పందించండం లేదన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు దోచుకోవడం, వారు అభివృద్ధి చెందడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి పోరాటం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. గత ఖరీఫ్లో ప్రారంభమైన యురియా సమస్య నేటికీ తీర లేదన్నారు. ఇప్పటికీ రైతులు యురియాను బ్లాక్లో కొంటున్నారంటే దానికి చంద్రబాబు విజనే కారణమన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చేప్పుకునే చంద్రబాబు ఎక్కడ ఇచ్చారో అధికారికంగా విడుదల చేయాలన్నారు. కేవలం అనుబంధ సంస్థలకు, బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టి రాస్ట్రాలన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు తప్ప టీడీపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, కృష్ణారెడ్డి, వైఎస్సాపీపీ రాష్ట ప్రచార వింగ్ సెక్రటరీ బాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెల్డింగ్ చాంద్, పిన్నాపురం సర్పంచ్ ఎల్లకృష్ణయ్య, నాయకులు బాబి, మున్నా, స్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాయబార మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. జిల్లెల గ్రామరస్తాలో ఉన్న అమ్మవారి పొలిమేర కుంట వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. రాయబార మహోత్సవంలో పాల్గొన్న భక్తులు -
అల్లాహు అక్బర్
కర్నూలు సంతోష్నగర్ ఈద్గాలో నమాజ్ చేస్తున్న ముస్లింలురంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ‘అల్లాహు అక్బర్... లా ఇలాహ్ ఇల్లల్లా’ అంటూ తక్బీర్ చదువుకుంటూ ఈద్గాలకు చేరుకున్నారు. ఈద్గాలకు వెళ్లలేని వారు మసీదులకు వెళ్లి నమాజ్ చేశారు. ఈద్గా, మసీదుల్లో నమాజ్ చేయించిన ఖాజీలు, మౌల్వీల ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేశారు. సర్వ మానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్ను వేడుకున్నారు. నమాజ్, దువా అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం పండుగ రావడంతో శుభాలు జరగాలని కోరుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం మున్ముందు కొనసాగించాలని మతపెద్దలు సూచించారు. ిముస్లింలు, హిందువులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.దువా చేస్తున్న యువకుడు -
గ్యాస్కు బదులు విద్యుత్ స్టౌలు మేలు
కర్నూలు(సెంట్రల్): ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు గ్యాస్కు బదులుగా ఇండక్షన్ లేదంటే విద్యుత్ స్టౌలను వినియోగించేలా అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఎల్పీజీ గ్యాస్ అంశంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ బదులుగా మట్టి, కట్టెల పొయ్యిలువాడొద్దని సూచించారు వాటి ద్వారా మహిళలకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకావం ఉంద న్నారు. అడవులు నరికివేతకు గురికాకుండా ఇండక్షన్, విద్యుత్ స్టౌలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో వాటిని వాడుకోవడం మంచిదన్నారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు అపోహలకు గురై ఎక్కువ మోతాదులో సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారన్నా రు. గతంలో జిల్లాలో ప్రతిరోజు 9 వేల సిలిండర్లు మాత్రమే అవసరం ఉండేదని, ప్రస్తుతం 11వేల సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీ లు సిలిండర్లను దారి మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో కమర్షియల్ ట్యాక్స్ జేసీ నీరజ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్, డీఎస్ఓ రాజారఘువీర్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ పాల్గొన్నారు. నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 21న శనివారం నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్ష రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి శుక్రవారం తెలిపారు. అన్ని పరీక్షలు ముగిశాక ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. -
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి ఈనెల 7వ తేదీన నిర్వహించే కుంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఉద్యో గి కొబ్బరి కాయలు సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు. -
కేసీ రైతుల ఆందోళన
● ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్ నందికొట్కూరు: పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీటి సరఫరా నిలిపేస్తే ఎలా అంటూ కేసీ ఆయకట్టు రైతులు అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద మల్యాల, శాతనకోట రైతులు ఆందోళన చేపట్టారు. ఓ వైపు హంద్రీ నీవాకు నీటిని విడుదల చేస్తున్నా అధికారులు కేసీ కెనాల్కు ఎందుకు నిలుపుదల చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందన్నారు. కేసీ కెనాల్ కింద మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ పంటలు సాగు చేశామని, మొక్కజొన్న కంకులు గింజ పడుతున్న సమయంలో సాగునీరు వెంటనే అందించకపోతే ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో ఆందోళన చేపడితే రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పి మోసం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సాగు నీరు అందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మల్యాల, శాతనకోట రైతులు గోవిందు, నాగరాజు, షాలు, రషీదు, నరసింహ, అబ్దుల్ రహిమాన్, గోకారి, షేక్షావలి, వెంకటరెడ్డి, చిన్నన్న, మౌలాలి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, బిచ్చన్న, ఆంజనేయులు, శేఖర్, వెంకటేశ్వర్లు, ఠాగూరు నాయక్, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇంటర్ వరకూ ఉచితం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. నూతన భవనాలు, విశాలమైన తరగతి గదులు, మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభ కనబరిస్తే సీటు దక్కుతుంది. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల -
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయ్..!
నంద్యాల(న్యూటౌన్): కార్పొరేట్ తరహా వసతులతో ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా ఈనెలాఖరు 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. విద్యార్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్సైట్ను సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం 5వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ఇలా.. దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 01–09– 2014 నుంచి 31–08–2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ తెగల విద్యార్థులు అయితే 01–09–2012 నుంచి 31–08–2016 మధ్య పుట్టిన వారు అర్హులు. మోడల్ స్కూళ్లలో సౌకర్యాలు.. ● నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ● ఆరో తరగతి నుంచి ఇంటర్మీడిమెట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ● విశాల తరగతి గదులు, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య ● నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్ఎంఎంఎస్, ఐఎంఓ, ఐఏప్వో లాంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ● స్పోకెన్ ఇంగ్లిష్, హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక శ్రద్ధ, అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం, ఆధునిక పరికరాలతో కూడిన సైన్స్ ల్యాబ్లు ● ఎల్సీడీ ప్రొజెక్టర్ విద్యా బోధన ● ఇంటర్లో అందుబాటులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ● 9వ తరగతి నుంచి అకాడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష -
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
● కాల్షియం కార్బైడ్ వద్దు ● ఇథిలీన్ వాయువు ఎంతో మేలు ● ఉద్యానశాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): మామిడి.. ఫలాల్లో రారాజు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఏడాది మామిడి పంట తక్కువగా ఉంది. మొదట్లో పూతతో ఊరించిన మామిడి తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులతో 80 శాతంపైగా రాలిపోయింది. మామిడి మార్కెట్లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మామిడిని ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇవీ సూచనలు.. ● కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతుల గురించి రైతులు, వ్యాపారులు తెలుసుకోవాలి. ● ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగిస్తే అటువంటి పండ్లకు డిమాండ్ వస్తుంది. ● ప్రకృతి సిద్ధంగా పండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథలీన్తో మామిడిని మాగించాలి. ఇది రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. ● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టేందుకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. ● అవసరమైతే 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ● మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాల్లో ఉంచాలి. ● పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచితే సహజ సిద్ధంగా మాగుతాయి. ● కార్బైడ్ వాడని పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగులు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. కొంత దూరం వరకు పండ్లు మాగినట్లుగా కమ్మని వాసన వస్తుంది. ● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. ● పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. ఫ్రిజ్లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కార్బైడ్తో మాగిస్తే శిక్ష ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడంతో అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాసీ్త్రయంగా నిర్థారణ అయింది. -
ఫలించిన ఎస్పీ వ్యూహం
● ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం ● అర్ధరాత్రిలోపే దోర్నాల, మున్ననూరు చెక్పోస్టులు దాటిన వేలాది వాహనాలు శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం రథోత్సవం అనంతరం ట్రాఫిక్ జామ్ లేకుండా తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేక వ్యూహంతో పోలీసులు వాహనాల క్రమబద్ధీకరణలో ఈ ఏడాది పట్టు సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ఉగాదికి అధిక సంఖ్యలో శ్రీశైలంకు వాహనాలు చేరుకున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 6 వేలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు, టూరిస్ట్ బస్సులు, 15 వేలకు పైగా ఫోర్ వీలర్స్ వచ్చినట్లు అంచనా. ఉత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభమైనప్పటికీ ఈ నెల 10 నుంచే వాహనాల తాకిడి ప్రారంభమైంది. గతంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. బందోబస్తుకు పోలీసుల సంఖ్య పెంచడం, క్షేత్రంలో ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాలను గుర్తించి అక్కడ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం, డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ను పర్యవేక్షించడం, కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు జారీ చేయడం, బ్లూ కోర్టు సిబ్బంది నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండటం వంటి చర్యలు చేపట్టారు. రథోత్సవం రోజు గురువారం ఎస్పీ క్షేత్ర స్థాయిలో బ్లూ కోర్టు వాహనంలో క్షేత్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఆ సమయంలో అటు మున్ననూరు, ఇటు దోర్నాల చెక్పోస్టు నుంచి ఒక్క వాహనం కూడా శ్రీశైలం వైపు రాకుండా అడ్డుకున్నారు. గతంలో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో నిర్వహించే రథోత్సవం అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావాలంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు అయ్యేది. అలాంటిది ప్రస్తుతం ఎస్పీ ట్రాఫిక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శ్రీశైలంలో ఉన్న అన్ని పార్కింగ్ ప్రదేశాలు రాత్రి 9.30 గంటలకే దాదాపు ఖాళీ అయ్యాయి. ఘాట్ రోడ్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా రాత్రి 11.30 గంటలకు అన్ని వాహనాలు దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టులను దాటాయని ఎస్పీ ధ్రువీకరించుకుని గెస్ట్హౌస్కు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
పదవ తరగతి విద్యార్థి దుర్మరణం
కోవెలకుంట్ల:కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లి కార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె మండలం రామతీర్థంకు చెందిన లాజరయ్య కు ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్ద కుమారుడు కిషోర్ (16) బనగానపల్లెలో మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. బంధువుల ఇంటి నుంచి బియ్యం ప్యాకెట్ల తీసుకెళ్లేందుకు వచ్చి ట్రాక్టర్ ఇంజిన్పై కూ ర్చొని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని జ్యోతి స్కూల్ సమీపంలో ప్రమాదశాత్తు ఇంజిన్పై నుంచి జారి కింద పడటంతో ట్రాలీ టైర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గ్యాస్ కష్టాలు బారులుదీరి
ఇరాన్ యుద్ధం గ్యాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. సిలిండర్ల సరఫరాలో జాప్యమవుతుండటంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు వరుసగా రావడం, ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కొందరికి బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా ఓటీపీ వచ్చిన వారికే సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శిరివెళ్ల గ్యాస్ స్టాక్ పాయింట్ వద్ద వినియోగదారులు సిలిండర్లను క్యూలో ఉంచి తమ వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించారు. సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన తాము గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలో నిలవాల్సి వచ్చిందని వాపోయారు. – శిరివెళ్ల -
ఉగాది మహోత్సవాలకు పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీహోమం జరిపించారు. అనంతరం యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృదం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిపించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని పసుపు, సున్నం, సుగంద ద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. అనంతరం చండీశ్వరస్వామికి ఆలయ మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూల స్నాన కార్యక్రమాలు జరిపించారు. అవభృదంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామికి శుద్ధజలం, పంచామతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళం మొదలైన వాటితో స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రిశూల స్నానం కార్యక్రమంలో భాగంగా మల్లికాగుండం జలాన్ని తలపై ప్రోక్షించడంతో పాపాలన్ని హరించి శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సకల శుభాలు ప్రసాదించే భ్రమరాంబా.. ఉగాది మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీభ్రమరాంబాదేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. అలాగే అశ్వవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల విహారం ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆశీనులను చేయించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. -
అంబరాన్నంటిన మట్టి సంబరం
కల్లూరు: శ్రీ చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అంబరాన్ని అంటాయి. కల్లూరులోని అమ్మవారి ఆలయం వద్ద ఉదయాన్నే జ్యోతుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొక్కుబడులు ఉన్న రైతులు తమ ఎడ్లను రంగులతో, పూలమాలతో అలంకరించుకుని అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. రజకులు తమ గాడిదల (గార్ధభాలను) బండ్లను పూలతో, రంగులతో అలంకరించుకుని డప్పులు, మేళాతాళాలు, డ్రమ్స్, డిజేలతో ఉత్సాహంగా కేరింతలు, నృత్యాలు వేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బురదలో అలంకరించిన ఎడ్లు, గాడిదలతో ప్రదక్షిణలు చేశారు. బురదలో చిన్నారులు, యువకులు ఒంటి నిండి బురద చేసుకుని ఉత్సహంగా వేడుకలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న బురదలో తిరగడం వల్ల చర్మవ్యాధుల నుంచి అమ్మవారు కాపాడతారని భక్తుల విశ్వాసం. ఎద్దులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. సంబరాన్ని తిలకించేందుకు కర్నూలుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
జీడీడీపీ లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): జీడీడీపీ(గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రొడక్ట్)లక్ష్యాల సాధనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీడీపీ లక్ష్యాల సాధనపై శుక్రవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని రెట్టింపు పనితీరు రాబట్టేలా పనిచేయాలన్నారు. జీడీడీపీ లక్ష్యాల సాధన కోసం అన్ని నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకత పెంపు ద్వారా జీడీడీపీ ఉందని తెలిపారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ భారతి, ఐసీడీఎస్పీడీ విజయ, డీసీహెచ్ఎస్ జఫ్రూళ్ల, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి, డీఈఓ సుధాకర్, డీటీఓ రామచంద్రరావు పాల్గొన్నారు. -
బ్లాక్లో మద్యం.. పట్టుకోండి చూద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు. ఉగాది పండుగ సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ వైన్షాప్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 8 మంది వివిధ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు. గురువారం కూడా వైన్షాపుల వద్ద బహిరంగంగానే బ్లాక్లో విక్రయాలు జోరుగా సాగాయి. -
నాణ్యత బ్యాగోలేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు. ఇందులో మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు తదితరవి ఉండేవి. ఇవన్నీ నాణ్యంగా ఉండేవి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పేరు మార్చి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో కిట్లు ఇచ్చింది. అయితే, నాణ్యతను విస్మరించడంతో విద్యా సంవత్సరం పూర్తికాకముందే చంద్రబాబు సర్కారు ఇచ్చిన వస్తువులు చిరిగిపోతున్నాయి. ఇందుకు ఈ చిత్రాలే నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోయినా పిల్లల వీపులపై నేటికీ జగనన్న బ్యాగులే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి పిల్లల చదువు, వారికి అందించే వస్తువులపై నాటి, నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అవగతమవుతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుచెదరని నాణ్యత.. జగనన్న బ్యాగులతో బడికి -
వివాహిత ఆత్మహత్య
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లీలావతి (30 భర్త మధు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు భార్య వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో రెండురోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన లీలావతి ఈనెల 18న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు. -
గ్రామసీమల్లో వ్యవసాయ పనుల సందడి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ పనులు ప్రారంభించడానికి తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని అత్యంత శుభదినంగా అన్నదాతలు భావిస్తారు. దీంతో గురువారం ఉగాదిని పురస్కరించుకొని గ్రామసీమల్లో వ్యవసాయ పనుల సందడి నెలకొంది. పరాభవ నామ సంవత్సరం మొదటి రోజునే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గూడూరు, ఆదోని, దేవనకొండ, వెల్దుర్తి, పెద్దకడుబూరు, సి.బెళగల్, మంత్రాలయం తదితర మండలాల్లో ఉదయమే వృషభాలను నీటితో శుభ్రంగా కడిగి అలంకరించి పొలంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు చేపట్టారు. పరాభవ నామ సంవత్సరంలో కుటుంబంలో ఎవ్వరి పేరుతో బలం బాగుందో పంచాంగం ద్వారా తెలుసుకొని వారి ద్వారా వ్యవసాయ పనులు మొదలుపెట్టడం విశేషం. పరాభవ నామ సంవత్సరానికి గురువు రాజు అయినందున అన్ని శుభాలే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేడే పిడకల సమరం
● ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో కొనసాగుతున్న సంప్రదాయం ● పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు ఆస్పరి: ఉగాది పండుగకు ఆస్పరి మండలంలో ఓ ప్రత్యేకత ఉంది. పండగ మరుసటి రోజు మండలంలోని కై రుప్పల గ్రామంలో ప్రేమికులను గెలిపించేందుకు పిడకల సమరం జరుగుతుంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరుగుననున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్, గ్రామపెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకను తిలకించేందుకు మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. మొక్కుబడిగా భక్తులు పిడకల సమర్పణ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు నగలు, పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించడం సర్వసాధారణం. అయితే కై రుప్పల గ్రామంలో అందుకు భిన్నంగా భక్తులు వీరభద్రస్వామికి పిడకలు సమర్పించి మొక్కుబడి తీర్చుకుంటారు. స్వామివారి సన్నిధిలో శుక్రవారం జరిగే పిడకల సమరానికి నుగ్గులు సిద్ధం చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు వారికి తోచిన విధంగా పిడకలను ఆలయ ఆవరణలో రాశులుగా పోసి మొక్కుబడి తీర్చుకుంటారు. నేపథ్యమిది .. విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వీరభద్ర స్వామిని అవమాన పరచాలని నిశ్చయించుకొని తమకు అందుబాటులో ఉన్న పిడకలతో స్వామితో పాటు ఆయన వర్గీయులపై దాడి చేస్తారు. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగుతారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడి, ప్రతిదాడి రణ రంగాన్ని తలపించింది. తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి నిమ్న కులానికి చెందిన కాళికాదేవిని, అగ్రవర్ణానికి చెందిన వీరభద్రస్వామికి వివాహం చేశారని పెద్దలు చెబుతారు. ప్రాణాలకు తెగించి తమ కోసం పోరాడిన తమ వర్గీయుల కోరికలను వీరభద్రస్వామి, కాళికాదేవి తీర్చారట. ఈ నేపథ్యంలోనే ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు స్వామి, అమ్మవారి భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తుంది. కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి సమరం ఇలా సాగుతుంది పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి తదితర గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచి తమ ఇంటిలో ఉన్న పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు. -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరుడు జలాధివాసం వీడుతున్నాడు. 8 నెలలుగా కృష్ణాజలాల్లో ఆలయం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగుల నుంచి 840 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం ప్రాచీన సంగమేశ్వరాలయ ప్రాంగణంలో మోకాలిలోతు నీరు ఉంది. మరో 2 రోజుల్లో ఆలయంలో నీరు పూర్తిగా పోతుందని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. నీరు తగ్గడంతో ప్రాచీ న సంగమేశ్వర గర్భాలయ ద్వారానికి ఆలయ పురోహితుడు ఉగాది పర్వదినం సందర్భంగా మా మిడి తోర ణం కట్టారు. పక్కన ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మోకాలిలోతులో ఉన్న వేపధారు శివలింగానికి కృష్ణాజలాలతో అభిషేకం నిర్వహించి, మంగళహారతి ఇచ్చారు. నీరు మొత్తం ఆలయం నుంచి పోయిన తర్వాత బురద తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పురోహితులు చెప్పారు. -
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు
కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. – దినేష్గౌడ్, కౌన్సిలర్, డోన్ డోన్ మున్సిపల్ చరిత్రలో కమిషనర్ ప్రసాద్గౌడ్ అత్యంత అవినీతి పరునిగా పేరుగాంచారు. అనేక మందిని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలను, అక్రమ దుకాణాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సత్వర విచారణ జరగాల్సిందే. – సుంకయ్య, సీపీఐ కౌన్సిలర్, డోన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ డ్రైవర్ను ప్రైవేటు వాహనానికి వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విషయం మామూలు వ్యవహారం కాదు. కమిషనర్ నుంచి డ్రైవర్ వేతనాన్ని మొదటి నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఉన్నతాధికారులపై ఉంది. – బుర్రు రమాదేవి, కౌన్సిలర్, డోన్ -
మొదలైన చౌడేశ్వరి రాయబారాది ఉత్సవం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి గణపతి పూజ, సాయంత్రం అంకుర్పాణ, పంచాగ శ్రవణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం ఎస్ఐ భూపాలుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్స్లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్ తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది. మునీర్ 1వరకు స్వగ్రామంలో, 2 నుంచి 10వరకు గుత్తి సెయింట్ మేరీ, ఇంటర్, బీటెక్ ఇడుపులపాయలో చదివాడు. తర్వాత గేట్ పరీక్షలకు ప్రిపేరైన ఈ విద్యార్థి జియో మాటిక్స్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని మునీర్ తెలిపారు. కొడుకు ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. -
అధి‘కారు’లా.. మజాకా!
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక సబ్ట్రెజరీ అధికారి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అఽధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోన్ ఎంపీడీఓ, కమిషనర్ ప్రభుత్వ సొమ్మును కాజేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి కారు అద్దెకు తీసుకోకుండా ఇతరుల కారులో పర్యటించారని ఉన్నతాధికారులు అభియోగం మోపారు. కాసులకు కక్కుర్తి పడి ప్రతి నెల వేలాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి వాహనాల అద్దె రూపంలో కొల్లగొడుతున్నందున ఎంపీడీఓకు చెల్లించాల్సిన వాహనాల అద్దెను నిలిపివేయాలని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓతో పాటు డోన్ ట్రెజరీ అఽధికారికి సిఫారసు చేశారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో డోన్ ఎంపీడీఓ కంటే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ రెండాకులు ఎక్కువే చదివారని చెప్పవచ్చు. ప్రతి నెల తాను పర్యటనలు జరిపేందుకు రూ.35 వేలు తీసుకుంటూ డ్రైవర్ జీతం మిగిల్చుకునేందుకు కక్కుర్తి పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తాను పర్యటనలు జరిపే కారుకు ఎల్లో బోర్డు పెట్టుకోకుండా, డ్రైవర్ను నియమించుకోకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగి అయిన రూ.50వేల వేతనం తీసుకుంటున్న ఇమామ్ అనే ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ కారు డ్రైవర్గా వాడుకుంటున్నారు. అయితే డ్రైవర్ జీతంతో పాటు కారు అద్దె కింద ప్రతి నెల రూ.35 వేలను ఆయన మున్సిపల్ సాధారణ నిధుల నుంచి తన ఖాతాలోకి వేసుకుంటున్నారు. సీఎం సభకు రూ.6 లక్షలు ఖర్చు.. గత వారం డోన్ మండలం కొత్తబురుజు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సభకు డోన్ మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు కమిషనర్ ప్రసాద్గౌడ్ నిధులను కొల్లగొట్టేందుకు సర్వసభ్య అజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఈ విషయంపై శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు నిలదీయగా, ‘మీలో ఒక్కరైనా ఒక్కపూట తమ వర్కర్లకు భోజనం పెట్టారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం సభకు జిల్లా కలెక్టర్ భోజన వసతులు ఏర్పాటు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా రూ.6 లక్షలు సభ అనుమతి లేకుండా ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. దీంతో కంగుతిన్న కమిషనర్ ‘మీకు ఇష్టమైతే ఆమోదించండం, లేకపోతే లేదు’అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పాలకవర్గానికి మధ్య విబేధాలు సృష్టించడం, అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం తప్ప ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన ధ్యాస కమిషనర్కు లేదు. అతని అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలి. – మల్లికార్జునరెడ్డి, కౌన్సిలర్ ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ డ్రైవర్తో కమిషనర్ బిల్లులు స్వాహా అద్దె వాహనం లేకుండానే ప్రజా సొమ్ము కొల్లగొట్టిన ఎంపీడీఓ అధికారుల కక్కుర్తిపై ప్రజలు విమర్శలు నిధులు రికవరీ చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్ -
వైభవంగా కంబగిరి స్వామి ఉత్సవం
ఉయ్యాలవాడ: మండలంలోని సుద్దమల్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ కంబగిరి స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం స్వామి కి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయి ద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహ కంబగిరి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. సాయంత్రం అల్లూ రు, సుద్దమల్ల గ్రామస్తులు తేరుబండ్లతో ఆలయానికి చేరు కుని వృషభరాజములచే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండల ప్రజలతో పాటు ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, జమ్మలమడుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మండలంలో ఆయా గ్రామాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. రైతులు పండితులు సూచించిన దిశకు వెళ్లి పొలాల్లో సేద్యపు పనులు ప్రారంభించారు. అలాగే ఉయ్యాలవాడలో కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థకంగా వైఎస్సార్పీ నాయకులు పేదలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. -
మల్లన్నను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దడల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ బాషణ చేశారు. -
వైద్యం అందక.. ‘ఓపి’క లేక!
కర్నూలు పెద్దాసుపత్రిలో రోగుల సహనానికి పరీక్ష ● డాక్టర్ పరీక్షించడానికి ఒకరోజు ● వైద్య పరీక్షలకు మరోరోజు ● చికిత్సకు ఇంకో రోజు ● ముందే అస్వస్థత.. ఆపైన అవస్థ! ● కోడుమూరు మండలానికి చెందిన సుంకులమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత బుధవారం సర్జరీ విభాగానికి వెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. స్కానింగ్ వద్ద సిబ్బంది ఈ రోజుకు టోకన్లు అయిపోయాయి...23వ తేదీ రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. ● గూడూరుకు చెందిన రామాంజనేయులు జ్వరంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చాడు. జనరల్ మెడిసిన్ వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. రక్తపరీక్షలు చేయించుకుని వచ్చేసరికి మధ్యాహ్నం 3.30 గంటలు దాటింది. అప్పటికే వైద్యులు ఓపీలో లేకుండా వెళ్లారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఎవ్వరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు. ● మంత్రాలయానికి చెందిన తిక్కన్న కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. కొంత కాలం పాటు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గత బుధవారం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రం వద్ద అతనికి 23వ తేదీ రావాలని సూచించారు. అప్పటి వరకు డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. .. ఇలాంటి అనుభవం ఆసుపత్రిలో నిత్యం వందలాది మందికి ఎదురవుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న వైద్య విధానం చాలా మంది రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దాసుపత్రిని నమ్ముకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓపీ టికెట్ తీసుకునేటప్పటి నుంచి చివరకు మందులు తీసుకుని ఇంటికి వెళ్లే వరకు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధానం వల్ల చాలా మంది రోగులు మధ్యలోనే వెనుదిరిగి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన అధిక శాతం చిన్నచిన్న వ్యాధులకు స్థానిక ఆర్ఎంపీలచే వైద్యం చేయించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 నుంచి 3,500 మంది దాకా ఓపీ చికిత్సకు రోగులు వస్తున్నారు. వీరిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి తగ్గక మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వస్తున్న వారే ఉన్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఓపీ టికెట్లు ఇచ్చేందుకు గతంలో రెండు, మూడు కౌంటర్లు మాత్రమే ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో వాటిని భారీగా పెంచారు. డిజిటల్ ఓపీ విధానాన్ని ప్రవేశపెట్టి రోగులకు త్వరగా ఓపీ టికెట్ అందేలా చూశారు. ఈ విధానంతో ప్రస్తుతం ఓపీ టికెట్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. అయితే ఓపీ విభాగాల వద్ద వైద్యులకు చూపించుకోవడానికి సోమ, మంగళ, బుధవారాల్లో అధికంగా క్యూ ఉంటోంది. అక్కడ చికిత్స చేయించుకున్న వైద్యులు రాసిన వైద్యపరీక్షల చీటీలు తీసుకుని డయాగ్నోస్టిక్ బ్లాక్కు వస్తే అక్కడ అప్పటికే వందల మంది క్యూలో ఉంటున్నారు. ఎక్స్రే, వివిధ రకాల రక్తపరీక్షలు, మూత్రపరీక్షల కోసం ఒక్కొక్కరు కనీసం గంటసేపు వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చిన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలను అదే రోజు చేయకుండా రెండు రోజుల తర్వాత రావాలని చెబుతున్నారు. అప్పటికే నిర్వహించిన రక్తపరీక్షల నివేదికలు మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్యలో ఇస్తున్నారు. వీటి కోసం ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం ఒకరిపై ఒకరు పడ్డ విధంగా తీసుకోవాల్సి వస్తోంది. తీరా నివేదికలు తీసుకుని ఓపీ విభాగాల వద్దకు వెళితే అప్పటికే వైద్యులు వెళ్లిపోయి ఉంటున్నారు. క్యాజువాలిటికీ వెళితే మళ్లీ ఓపీకే వచ్చేవారం రావాలంటూ సెలవిచ్చి పంపిస్తున్నారు. ఎక్స్రే ఫిల్మ్ల నివేదికలు మరుసటి రోజు ఇస్తున్నారు. ఇవి తీసుకోవడానికి ఒకరోజు, వాటిని తీసుకుని వైద్యుల వద్ద చికిత్సకు మరోరోజు రావాల్సి వస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఎక్కడ! ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు ఓపీ చికిత్స అందించాలని స్వయానా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పలుమార్లు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆదేశించారు. అయినా ఓపీలో వైద్యులు ఉండటం లేదు. అధిక శాతం ఉదయం 12 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు. ఆ తర్వాత ఒకరిద్దరు పీజీలు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటలకు సైతం పీజీలే ఉంటున్నారు. 3.30 గంటల తర్వాత చాలా మంది ఓపీలో ఉండటం లేదు. ఈ సమయంలో వైద్యపరీక్షల నివేదికలు తీసుకుని వచ్చిన రోగులకు వైద్యులు కనిపించక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఆయా ఓపీల్లో వైద్యులు, వైద్యపరీక్ష కేంద్రాల్లో సిబ్బంది ఉన్నారా లేరా అని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఎంఆర్ఐ కోసం రోజుల తరబడి! ఆసుపత్రిలో ఎంఆర్ఐను గత 8 ఏళ్లుగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 25 నుంచి 30 వరకు మాత్రమే ఎంఆర్ఐలు తీయగలుగుతున్నారు. ఓపీ విభాగంలో వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఇక్కడకు వచ్చిన రోగులకు మూడు, నాలుగు రోజుల తర్వాత రావాలని సమయం ఇస్తున్నారు. వారు చెప్పిన రోజులో ఎంఆర్ఐ తీయించుకున్నాక నివేదిక కోసం మరో రెండు రోజులు ఆగి రావాల్సి వస్తోంది. ఇలా ఎంఆర్ఐ పరీక్ష కోసమే వారం రోజులు పడుతోంది. ఆ నివేదిక తీసుకుని వైద్యుల వద్దకు వెళితే మొదట్లో చూసిన డాక్టర్లు ఉండటం లేదు. నిన్ను చూసిన డాక్టర్ లేరు...ఫలానా రోజు రావాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇలాంటి విధానం వల్ల రోగులు నిత్యం వేదనకు గురవుతున్నారు. -
నయన మనోహరం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం మల్లన్న రథోత్సవం కనుల పండువగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం స్థానాచార్యులు రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చారు. రథానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అధికారులు కూష్మాండబలి సమర్పించారు. ప్రత్యేక హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కన్నడ భక్తులు ‘సిరిగిరి మల్లయ్య.. మహాత్మ మల్లయ్య’ అని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య భక్తిపూర్వకంగా రథంపైకి అరటిపండ్లు, ఖర్జూరాలు, కలకండ విసిరి భక్తి చాటుకున్నారు. రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు నిర్వహించారు. ఉత్సవంలో కర్ణాటక జాంజ్, వీరగాసీ, కన్నడ జానపద డోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, గొరవయ్యల, నందికోలు నృత్యాలు అలరించాయి. రథోత్సవ దర్శనంతో సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కొర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రాజరాజేశ్వరీ అలంకారం ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీభ్రమరాంబాదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భక్తులకు కటాక్షించారు. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు. ఈ దేవిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో చెప్పారు. నేడు ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాలకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమ్మవారు భ్రమరాంబాదేవి నిజాలంకరణ అలంకారం, స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ ఆలయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ఉగాది మహోత్సవాలు ముగుస్తాయి. శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం స్వామిఅమ్మవార్ల దర్శనంతో పులకించిన భక్తులు రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భ్రమరాంబాదేవి కటాక్షం ఉగాది మహోత్సవాలకు నేడు పూర్ణాహుతి -
నేడు పంచాంగ శ్రవణం
ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం ఉదయం 10.30గంటలకు దేవస్థాన అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథాంగహోమం, రథాంగపూజ, రథాంగబలిహారణలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి -
జిల్లా వాసులకు ఉగాది పురస్కారాలు
కర్నూలు కల్చరల్: జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు.సాహిత్య, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేస్తున్న కురాడి చంద్రశేఖర కల్కూరకు ‘కళా రత్న’ (హంస) పురస్కారం, సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న నంద్యాలకు చెందిన డాక్డర్ వీడీవీ రమణమూర్తి, గాయకుడు, సంగీత దర్శకుడు విశ్వనాథ్ రామ అయ్యర్ (కర్నూలు), సాహిత్యంలో గద్వాల సోమన్న (కర్నూలు), నాటక రంగంలో నీలం ఓంకార స్వామి (కర్నూలు), సూక్ష్మ చిత్రాలులో శివ కేశవ మచాని (కర్నూలు), సామాజిక సేవలో బీసీ రాజమోహన్ రెడ్డి (నంద్యాల), సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ అబ్బాయి కాంత్ (నంద్యాల) లకు ‘ఉగాది’ పురస్కారాలు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో వారికి పురస్కారాలు అందించనున్నారు. రిటైర్డ్ ఏజేసీ మృతి కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా డీఆర్వో, అడిషనల్ జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రామస్వామి గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చి వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో నగరంలోని అమ్మా హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రామస్వామి జిల్లా అధికారులకు ఎంతో సుపరిచితులు. ఈనేపథ్యంలో ఆయన మృతి సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు నివాళి అర్పించారు. కర్నూలు ఆర్డీఓ కె.సందీప్కుమార్, కర్నూలు అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రమేష్బాబు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2025–26 సంవత్సరానికి అర్హులైన విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగులు) బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శా ఖ సహాయ సంచాలకులు రయీస్ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. గ్రూపు–4 పో స్టులు 9, క్లాస్–4 పోస్టులు 8 ఖాళీగా ఉన్నా యన్నారు. ప్రతి పోస్టుకు విద్యార్హత, కేటగిరీలలో ఖాళీల వివరాలు, నమూనా దరఖాస్తుతో కూడిన వివరాలకు వెబ్సైట్ www.kurnool. ap.gov.in, www.nandyal.ap.gov.inలో పొందుపరిచామన్నారు.వివరాలకు 08518–277864 నెంబర్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గంటల్లోపు సహా య సంచాలకులు, విభిన్న ప్రతిభావంతు లు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్, కర్నూలులో అందజేయాలన్నారు. శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో ఎట్టకేలకు శ్రీశైలంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రే ట్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిఫార్సును ప్రభుత్వం అంగీకరించడంతో హైకోర్టు రిజిస్టర్ వీఎస్ఎస్ శ్రీనివాస శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జెస్కు హైకోర్టు రిజిస్టార్ నుంచి ఉత్తర్వులు అందాయి. కాగా అనేక సంవత్సరాలుగా శ్రీశైలంలో క్యాంప్ కోర్టు మాత్రమే ఉంది. అది కూడా నెలలో రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం మాత్రమే సీనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం దేవస్థానం టోల్గేట్ సమీపంలో ఐటీడీఏ మ్యూజియం పక్కనే బసవనంలో ఉన్న భవనంలో తాత్కాలిక క్యాంప్ కోర్టును నిర్వహిస్తున్నారు. -
● పెద్దాసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ● 2.5 గ్రాముల రక్తమున్నా శస్త్రచికిత్స విజయవంతం చేసిన వైద్యులు
బాలుడికి ప్రాణం పోశారు కర్నూలు(హాస్పిటల్): కడప జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు అరుదైన జబ్బు కారణంగా రక్తపు వాంతులు, తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బాలునికి సైతం మేమున్నామంటూ భరోసానిచ్చి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు ఇక్కడి వైద్యులు. బుధవారం ఈ కేసు వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘కడప జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని రాజుపల్లి గ్రామానికి చెందిన శివ, ఆదిలక్ష్మిల కుమారుడైన పెంచలయ్య(15) రెండు నెలలుగా నల్లటి మలం(మెలినా), రక్తపు వాంతులు,(హీమాటెమేసిన్), తీవ్ర బలహీనతతో బాధపడుతున్నాడు. కడపలో వైద్యులకు చూపించగా డియోడినమ్లో రక్తస్రావం కలిగించే పుండ్లు(డియోడినమ్ అల్సర్స్) ఉన్నట్లు గుర్తించారు. జనవరిలో అతనికి ఎండోస్కోపి ద్వారా ప్యాడ్లాక్ క్లిప్ అమర్చినా రక్తస్రావం పూర్తిగా ఆగలేదు. ఆ సమయంలో అతనికి హీమోగ్లోబిన్ స్థాయి 2.5 గ్రాములు మాత్రమే. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆ బాలుడిని గత నెల 17వ తేదీన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం వైద్యులు పరీక్షించి ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్(ఏపీసీ)ద్వారా చికిత్స చేసినా రక్తస్రావం తగ్గకపోవడంతో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు గత నెల 26న ప్రాక్సిమల్ ఇలియమ్ భాగంలో ఎంటెరోటమి చేసి ఎండోస్కోపి నిర్వహించారు. ఇందులో యాంజియో ఎక్టేసియా(రక్తనాళాల అసాధారణ విస్తరణ)ను గుర్తించి, దానిపై కూడా ఏపీసీ చికిత్స అందించారు. అదే సమయంలో డియోడినల్ అల్సర్ నుంచి రక్తస్రావం కొనసాగుతుండటంతో ఎండోస్కోపి నిర్వహించిన తర్వాత, ఎక్స్ప్లోరేటరి లాపరోటమి చేశారు. గ్యాస్ట్రో డియోడినల్ ఆర్టరి(జీడీఏ)ను లిగేషన్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. దాదాపు 8 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. డిశ్చార్జ్ సమయానికి అతనిలో హిమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాములకు పెరిగింది’ అని వివరించారు. ఈ క్లిష్టమైన కేసును శస్త్రచికిత్స విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ ఆర్. రామకృష్ణనాయక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స అందించడంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు హెచ్ఓడీ డాక్టర్ మోహన్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్కుమార్రెడ్డి, డాక్టర్ సందీప్రెడ్డి, డాక్టర్ అర్షియా, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ గీత శ్రావణి కీలక పాత్ర పోషించారు. -
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
కల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్పొరేటర్ల పదవి కాలం ముగియడంతో పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ శాలువ కప్పి సన్మానించారు. కల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కాటసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా ఐక్యతతో ఐదేళ్ల పాలన దిగ్విజయంగా అందించామన్నారు. కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ ఒత్తిడిలకు తలొగ్గకుండా పార్టీలో ఉండి వార్డులను అభివృద్ధి చేశారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత పట్టుదలతో పని చేసి మరోసారి మేయర్ పీఠాన్ని దక్కుంచుకుందామన్నారు. మేయర్ రామయ్య మాట్లాడుతూ ఐదేళ్లలో రూ. 800 కోట్లతో కర్నూలు నగరంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామన్నారు. పారిశుద్ధ్యంలో కర్నూలు నగరం మెరుగైన ర్యాంకు సాధించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిసిపలిటీ స్టాండింగ్ కమిటీకి రెండు సార్లు ఎన్నికల జరిగాయన్నారు. ఐక్యంగా ఉండడంతో స్టాండింగ్ కమిటీలో రెండు సార్లు తామే గెలిచామన్నారు. మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్. రేణుక, కార్పొరేటర్లు నాగలక్ష్మీరెడ్డి, అరుణ, దండు లక్ష్మీకాంతరెడ్డి, పల్లె శారద, నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, సాన శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, గాజుల శ్వేతారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని విక్రమసింహారెడ్డి, సాంబశివరావు, కో ఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి తదితరులను కాటసాని దంపతులు సత్కరించిన వారిలో ఉన్నారు. -
ముస్లింలకు ఇఫ్తార్ విందు
డోన్ రూరల్: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సుభాన్ స్వగృహంలో బుధవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్ బాషా, పాతపేట అబ్దులా, రియాజ్, ఫరెస్ట్ మౌలాలి, మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మెన్ జాకిర్ హుసేన్, ప్యాపిలి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, ఎద్దుపెంట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, పారిశ్రామికవేత్తలు ప్రశాంత్, క్వాలిటీ అబ్దులా పాల్గొన్నారు. -
పేదల గుడిసెలు కూల్చివేత
● రోడ్డున పడిన 64 కుటుంబాలు ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుప్రతి ప్రహరీ గోడ పక్కన మున్సిపల్ స్థలంలో పేదల గుడిసెలను బుధవారం తొలగించారు. ఉదయం 6 గంటలకే మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. గుడిసెల్లో ఉన్న వారు అందోళనకు దిగారు. ప్రొక్లెయిన్లను, అధికారులను అడ్డుకోవటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హైకోర్టు ఉత్వర్వులు ఉన్నాయని, తామేమీ చేయలేమని, ఇంత ముందే గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. బాధితులు వినపించకోకుండా గుడిసెలను తొలగించరాదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి హైకోర్టు ఉత్తర్వులను ఎవరూ అడ్డుకోవటానికి లేదని, ప్రొక్లెయిన్లతో 64 గుడిసెలను తొలగించారు. పండుగ పూట రోడ్డున పడేశారు! ‘పిల్లలతో పండగ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు..పండగ పూట రోడ్డున పడేశారు.’ అంటూ బాధితులు అవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న తాము ఖాళీ చేయాలంటే ఎలా అని రోదించారు. తమ పిల్లలకు పదో తరగతి పరీక్షలు ఉన్నాయని చెప్పినా అఽధికారులకు కనికరం కూడా లేకుండా పోయిందన్నారు. మొత్తం 64 గుడిసెలను తొలగించటంతో పిల్లపాపాలతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంత మంది అద్దె ఇళ్లు వెతుక్కోగా, మరి కొందరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. కాగా.. బాధితులు బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. -
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
● జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ శ్రీశైలంటెంపుల్: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. బుధవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో మహిళా జన్సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గృహహింస, బలవంతపు శ్రమ, వృద్ధ మహిళలపై దౌర్జన్యాలు వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. మహిళా భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంగన్వాడీ, ఆరోగ్య, విద్యా శాఖలు సమన్వయంతో బాలికల అరోగ్యం, పోషణపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లాలో మహిళల భద్రత కోసం, రక్షణ కోసం తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వ్యక్తి ఆత్మహత్య
పాములపాడు: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన బోయ అమర్ తాగుడుకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. దీనిపై భార్య శ్యామల మందలించడంతో ఈ నెల 14న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెంది రాత్రి ఇంట్లో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే కర్నూలు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ షేక్షావలి తెలిపారు. మృత దేహానికి కర్నూలులోనే పంచనామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మిషన్లో పడి.. ఆదోని అర్బన్: ప్రమాదవశాత్తూ వేరుశనగకాయల కోత మిషన్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు బోయ వీరేంద్ర (32) వ్యవసాయం చేస్తూ కూలీ పనికి పోయేవాడు. మంగళవారం మిషన్కు వేరుశనగకాయల కట్టె వేసే పనికెళ్లాడు. చేతికి టవాల్ కట్టుకుని వేరుశనగకాయల కట్టెను మిషన్లో వేస్తుండగా టవాల్ను లాక్కొని ఆ వ్యక్తిని కూడా మిషన్ లోపలికి లాక్కొంది. దీంతో కొట్టుమిట్టాడుతూ వీరేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పల్లవి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి. వీరేంద్ర మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో – బైక్ ఢీ ● ఒకరు దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలో ప్రవహించే లోలెవల్ కాలువ (ఎల్లెల్సీ) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆటో – మోటార్ బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనీకి చెందిన నారాయణ, భార్య లీలమ్మ, కుమార్తె జాహ్నవి, మరో వ్యక్తి కలసి ఆటోలో ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి పెద్దకడుబూరు మండలం గంగులపాడు గ్రామానికి చెందిన గోవిందప్ప అనే వ్యక్తి మోటార్ బైక్పై గ్రామానికి వెళ్తున్నాడు. ఎల్ఎల్సీ కాలువ సమీపంలో బైక్ ఆటోను ఢీ కొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న నారాయణ(59) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, లీలమ్మ, జాహ్నవి, మరొకరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నారాయణ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. క్వింటా వేరుశనగ రూ.8,670 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 2,423 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా ధర గరిష్టంగా రూ.8,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,560, మధ్యస్త ధర రూ.7,500 నమోదైందన్నారు. అదేవిధంగా ఆముదాలు 54 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,737, మధ్యస్త ధర రూ.5,903, గరిష్ట ధర రూ.5,911 నమోదైంది. కందులు 4 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,112 లభించింది. రైలు కింద పడిగుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్ శివారు ఈద్గా సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రైల్వేట్రాక్పై మృతదేహం పడి ఉన్నట్లు స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పరిశీలించారు. ప్రమాదంలో ముఖం శిథిలమై ఉండటం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. నలుపు, తెలుపు రంగు హాఫ్ షర్టు, సిల్వర్ కలర్ వీ నెక్ టీషర్టు, కుడిచేతిపై ఢమరుకం, త్రిశూలం పచ్చబొట్టు, ఎడమ చేతిపై రతి అనే అక్షరాలు ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు 9247575608 (సీఐ), 9247575610 (ఎస్ఐ)కు సమాచారం అందించాలన్నారు. -
ఇల కై లాసం.. దేవీ అభయం!
గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యంశ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగిరిలో భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఎనిమిది భుజాలతో శోభిల్లుతూ భక్తులను కటాక్షించారు. శంఖం, చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం ధరించి అభయమిచ్చారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కై లాసవాహనాన్ని అదిష్టించిన స్వామిఅమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. మహాదుర్గగా అలంకీకృతులైన భ్రమరాంబాదేవిని, కై లాసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ఉత్సవం నిర్వహించి రాజగోపురం మీదుగా క్షేత్రప్రధాన వీధుల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రపురవీధుల్లో కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. ఈ గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, కళాకారుల వేశాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, జానపద డోలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నె తీసుకువచ్చాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవోలు, అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు. నేడు వీరాచార విన్యాసాలు.. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, శ్రీభ్రమరాంబాదేవికి మహాసరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండప్రవేశం నిర్వహిస్తారు. శివదీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాసాల కార్యక్రమానికి దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్ట బందోబస్త్ చేపట్టింది. కనుల పండువగా కొనసాగుతున్న ఉగాది మహోత్సవాలు మహాదుర్గగా శ్రీశైల భ్రామరి దర్శనం కై లాస వాహనంపై ఆది దంపతుల విహారం కన్నడ భక్తులతో పోటెత్తిన శ్రీశైలం నేడు ప్రభోత్సవం, నందివాహనసేవ, వీరాచార విన్యాసాలు శ్రీగిరికి పోటెత్తుతున్న కన్నడ భక్తులు శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలను తిలకించి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ కన్నడ భక్తులు పరవశించిపోతున్నారు. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది కన్నడ భక్తులు చంటి ప్లిలతో, మహిళలు, వృద్ధులు సైతం నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. తప్పెట దరువులతో, రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ ‘మల్లన్న.. నీ దర్శనానికి వచ్చాం..’ అంటూ కన్నడ భక్తులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. క్షేత్రానికి చేరుకు న్న కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ పూజా వేళలను మార్పులు చేసి వేకువజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. -
పండుగకు వచ్చి అనంతలోకాలకు
● గోనెగండ్లలో విషాదం ● బైక్ను ఢీకొన్న లారీ ● ఇద్దరు దుర్మరణం గోనెగండ్ల: ఉగాది పండుగ కోసం ఊరికొచ్చిన కొన్ని గంటల్లోనే రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. గోనెగండ్లలో లారీ– బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లలోని మొట్టివీధికు చెందిన మద్దక్క, అచ్చమ్మ కుటుంబాలు స్థానికంగా పనులు లేకపోవడంతో రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం తెలంగాణకు వలసవెళ్లాయి. ఈనెల 19న ఉగాది పండుగ ఉండటంతో మంగళవారం తెల్లవారుజామున వారు సొంతూరుకు వచ్చారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి సరుకుల కోసం మద్దక్క కుమారుడు మునిస్వామి (31), అచ్చమ్మ కుమారుడు మొండి వీరేష్ (17) బైక్పై గంజిహళ్లి రోడ్డు నుంచి బస్టాండ్ దగ్గరకు వెళ్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి అతివేగంగా వస్తున్న లారీ గోనెగండ్ల హైస్కుల్ సమీపంలో వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైర్ కింద పడిపోయిన మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరేష్కు తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ చంద్రబాబు దర్యాప్తు చేపట్టారు. మునిస్వామికి భార్య సిమ్రాన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అచ్చమ్మకు వీరేష్ ఒక్కగా నొక్క కుమారుడు. పండుగ కోసం వచ్చి మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబా లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ము నిస్వామి, వీరేష్ ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవార ని చావులోనూ అలాగే వెళ్లారని రోదించారు. రోడ్డు ఆక్రమణతోనే ప్రమాదాలు ఎమ్మిగనూరు–కర్నూలు రోడ్డు గోనెగండ్లలో దాదాపు 80 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ రోడ్డులో నిత్యం వాహనాల రాక పోకలు సాగుతుంటాయి. అయితే, రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాదారులు తమ అంగళ్ల ముందు ఆనకట్ట మాదిరిగా ఎత్తుగాా మట్టి వేయడం, తోపుడు బండ్లు పెట్టడం చేస్తున్నారు. దీంతో 80 అడుగుల రోడ్డు కాస్త 20 అడుగుల రోడ్డుగా మారింది. దీంతో బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో తరచుగా ప్రమాదా లు జరుగుతున్నాయి. లారీ వేగంగా వచ్చినప్పుడు మునిస్వామి, వీరేష్లు పక్కకు వెళ్లడానికి స్థలం లేకపోవడం కూడా ప్రమాదానికి ఓ కారణమని స్థానికులు అంటు న్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని రోడ్డుకు ఆనుకొని వెలసిన ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. మృతిచెందిన మునిస్వామి, వీరేష్ -
సబ్ రిజిస్ట్రార్ల నియామకం
కర్నూలు(సెంట్రల్): కల్లూరు, కోసిగి సబ్ రిజిస్ట్రా ర్లుగా ఎం.రాముడు, ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇందులో కల్లూరు సబ్ రిజిస్ట్రార్గా వచ్చిన మద్దిరాముడు అవుకు, కోసిగి సబ్ రిజిస్ట్రార్గా వచ్చిన ఎం.శ్రీనివాసులు నంద్యాల డీఆర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసేవారు. వీరిద్దరికీ సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిలో ఒకరిని కల్లూరుకు, మరొకరిని కోసిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్ మంగళవారం బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తించారు. జాకెట్ తెచ్చిన తంటా ● ఘర్షణలో ఇద్దరికి గాయాలు గుత్తి రూరల్: ఓ మహిళకు చెందిన జాకెట్ పక్కింట్లో కనిపించడంతో గొడవ చోటు చేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు.. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలోని శివాలయం వద్ద నివాసముంటున్న సుంకులమ్మ మంగళవారం ఉతికేసిన తన నాలుగు జాకెట్లను ఇంటి బయట ఎండలో ఆరవేసింది. అయితే అవి కనిపించకుండా పోయాయి. కాసేపటి తర్వాత ఆ జాకెట్లు పక్కింట్లో ఉన్న శాంతమ్మ, నందిని వద్ద కనిపించడంతో సుంకులమ్మ నిలదీసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సుంకులమ్మ సోదరులు లక్ష్మన్న, రాము అక్కడకు చేరుకుని సోదరి పక్షాన మాట్లాడారు. ఆ సమయంలో మాటామాట పెరగడంతో లక్ష్మన్న, రాముపై కర్రలు, ఇనుప రాడ్లతో శాంతమ్మ, నందిని, చిన్నవీరప్ప, ఉరుకుందు, చిన్ని, వంశీ దాడి చేసి గాయపరిచారు. ఘటనలో తలలు పగిలి తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న, రామును వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న , రాము -
ఎక్కడికక్కడ ఖాళీ సిలిండర్లు
శిరివెళ్ల: హిందూ ముస్లింలకు అతి పెద్ద పండుగలు ఉగాది, రంజాన్. సరిగ్గా పండుగల వేళ గ్యాస్పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బుక్ చేసిన రెండు, మూడు రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. మండల కేంద్రంలో ఏ ఇంటి ముందు చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. బండి రాగానే ఆత్రుతతో సిలిండర్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. మొన్నటి వరకు దోసె రూ.30 ఉండగా.. నేడు రూ. 40లకు విక్రయిస్తున్నారు.ఫొటోలు : వడ్డె శ్రీనివాసులుమేము గాయత్రీ ఎస్టేట్లో 2023 నుంచి ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నడుపుతున్నాం. రూ.1000లకు లభించే గ్యాస్ బండ ఇప్పుడు రూ.2వేలు పెట్టినా దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో హోటల్ మూసేద్దామనుకుంటున్నా. మా హోటల్పై పలువురు ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ఉపాధి కోల్పోతారు. – రంగ ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నిర్వాహకుడు, కర్నూలు గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్లో కొనాల్సి వస్తోంది. వంట నూనెల ధర కూడా మండుతోంది. యుద్ధానికి ముందు సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.162 ఉండగా నేడు రూ.185లకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. వంట నూనెల కృత్రిమ కొరతను అడ్డుకోవాలి. – అరుణ, నంద్యాల చెక్పోస్టు ఏరియా, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న దృశ్యంఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న యువకుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వంట గ్యాస్ కొరత బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయం అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధర అడ్డగోలు ధరలపై నియంత్రణ కరువు పండుగలు, శుభకార్యాల వేళ అవస్థలు -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● నలుగురికి గాయాలు ● గొర్రెల మందను తప్పించబోగా ఘటనపాణ్యం: ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తమ్మరాజుపల్లె–సిమెంట్నగర్ గ్రామాల మధ్య ఘాట్ దిగే చోట జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీ 39ఏజీ 5899 నంబర్ గల నందాల్య డిపో ఆర్టీసీ బస్సు బేతంచెర్ల నుంచి 55 మంది ప్రయాణికులతో నంద్యాలకు వస్తుంది. తమ్మరాజుపల్లె–సిమెంట్నగర్ గ్రామాల మధ్య ఘాట్ చివరి మలుపు వద్ద దిగే క్రమంలో ఒక్క సారిగా గొర్రెల మంద ఎదురొచ్చింది. ఆ గొర్రెలను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘాటనలో బేతంచెర్లకు చెందిన రాణి, ఉసేన్బీ, కమల, నాగలక్ష్మీ అనే ప్రయాణికులకు గాయాలు కావడంతో 108వాహనంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తలించారు. నంద్యాల డిపో మెనేజర్ మాధవిలత ఈ ఘటనపై ఆరా తీశారు. -
దాతృత్వానికి ప్రతీక రంజాన్
నంద్యాల(అర్బన్): పవిత్ర రంజాన్ మాసం దానధర్మాలకు, దాృత్వానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక జుమ్మా మసీదులో ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత ఇఫ్తార్ విందు స్వీకరించారు. రాష్ట్రం, దేశం, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక దువా చేశారు. అనంతరం శిల్పారవి మాట్లాడుతూ ముస్లింలు నెలరోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు ఉండి అల్లా స్మరణలో గడపడం విశేషమన్నారు.అంతేకాకుండా పేదలకు తమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, నంద్యాలలో మతసామరస్యం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ముస్లిం బాలికల మదరసా అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేశారు. ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి -
హొళగుందలో అకాల వర్షం
హొళగుంద/ఆలూరు రూరల్: మండల కేంద్రంతో పాటు గజ్జహళ్లి, వందవాగిలి తదితర గ్రామాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. వర్షంతో పాటు కొద్దిపాటి ఈదురుగాలులు వీయడంతో మామిడి పిందెలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిరప తడిసి పోయాయి. ఈ సమయంలో ఆదోని నుంచి హొళగుంద సబ్స్టేషన్కు కొద్ది సేపు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పగలంతా వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగింది. ఈ ఏడాది తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద రబీకి నీరివ్వకపోవడంతో వరిసాగు చేయక పోవడంతో పంట నష్టం చోటు చేసుకోలేదు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్లు పడటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు సాయంత్రం కురిసిన వానతో వాతావరణం చల్లబడి ఊరట చెందారు. రాజమండ్రి ఆర్డీఓగా ఆర్.శివరాముడు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిపిన పలువురు డీఆర్వోలు, ఆర్డీఓల బదిలీల్లో భాగంగా కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న ఆర్.శివరాముడు రాజమండ్రి ఆర్డీఓగా బదిలీ అయ్యారు. ఆయన వాస్తవానికి ఫిబ్రవరి 24న కడపలోని తెలుగు గంగ ప్రాజెక్టు యూనిట్–2 ఎస్డీసీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన ఆ పోస్టులో ఇంత వరకు చేరలేదు. ఈనేపథ్యంలో మంగళవారం జరిపిన బదిలీల్లో కడప నుంచి రాజమండ్రి ఆర్డీఓగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. -
కొండలు తవ్వేస్తున్నారు!
● అధికారపార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్ దందా ● చోద్యం చూస్తున్న అధికారులుడోన్: అధికారపార్టీ నాయకులు బరితెగించారు. ఏకంగా కొండలు తవ్వి గ్రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. డోన్ మండలంలోని రేకులకుంట, వెంకటనాయునిపల్లె, మల్లెంపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లో కొండలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన వీటిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడింది. పగలు రాత్రి తేడాలేకుండా ఆ కొండలను ప్రొకై ్లన్లతో తవ్వి మొరుసు ట్రాక్టర్లలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, గృహనిర్మాణ అవసరాలకు, రైల్వే డబ్లింగ్ పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీల అనుమతులు, రెవెన్యూ అధికారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇవేవి లేకుండా గ్రావెల్ అక్రమ త్రవ్వకం నిరాటకంగా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడి, అక్రమ అరెస్టు ను ఖండిస్తూ కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని కల్లూ రు అర్బన్ ఇందిరమ్మ కట్ట దగ్గర ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, చంద్రబాబు ప్రజలకు శ్రీరంగ నీతు లు చెప్పి వారు మాత్రం అచరించరని విమర్శించారు. చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో కామ క్రీడలు నిర్వహిస్తే దానిని తప్పు అని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ నాయు డు తీరును వ్యతిరేకిస్తూ తిరుపతిలో శాంతియుత నిరసన తెలియజేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించి, అనంతరం పోలీసు కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళ తో ఉన్న వీడియోలో బీఆర్ నాయుడు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారన్నారు. ఆ వీడియోను టీడీపీ నాయకులు ఫేక్ అని, దాంట్లో తప్పేముందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు చేతకానితనంతోనే బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలకు అనర్హులని విమర్శించారు. టీటీడీ చైర్మన్గా భక్తి భావంతో ఉండేవారిని నియమించాలన్నారు. కూటమి ప్రభుత్వం, నాయకుల తప్పులను ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించా రు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఆరో పించారు. బీఆర్ నాయుడుని తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రతిష్టతను దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నర సింహులు, సాన శ్రీనివాసులు, లక్ష్మీకాంతరెడ్డి, నాగ లక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, మిద్దె చిట్టెమ్మ, అరుణ, గాజుల శ్వేతారెడ్డి, నాయకులు రంగప్ప, చిన్న, మీదివేముల ప్రభా కర్రెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, గోపాల్రెడ్డి, పెద్దపాడు శ్రీధర్రెడ్డి, శివశంకర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమలత, శివారెడ్డి, సత్యంరెడ్డి, సాయి పాల్గొన్నారు. -
తెలుగుగంగ .. భద్రత బెంగ
● ప్రధాన కాల్వను వెంటాడుతున్న గండ్లు ● ఆందోళన చెందుతున్న రైతులు బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాల్వకు ఇటీవల తరచుగా గండ్లు పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చిన్న దేవళాపురం, నారాయణాపురం, జీసీ పాలెం, లింగాపురం, రామాపురం గ్రామాల పరధిలో ప్రధాన కాలువ గట్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల ఇరవై రోజుల వ్యవధిలోనే రెండు సార్లు గండి పడింది. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం కేవలం రెండు వేల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్లో కాల్వకు అధిక క్యూసెక్కులు విడుదల చేయాల్సి వస్తోంది. దీంతో కాల్వ గట్టు సామర్థ్యంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల శిథిలమైన కాల్వ గట్టును పటిష్ట పరచకపోతే గండ్లు పడే అవకాశం లేకపోలేదు. మరో వైపు కొందరు రైతులు తమ పొలాలకు నీళ్లు మళ్లించుకునేందుకు కాల్వ గండ్లు కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా అండర్ టన్నెళ్లు, సూపర్ పాసేజ్ ప్రాంతాల్లో గండి కొట్టి సమీపంలోని చెరువులు, కుంటలు నింపుకుంటున్నారు. దీంతో ప్రధాన కాల్వ గట్టు దెబ్బతిని గండ్లు పడే అవకాశం ఉంది. భారీ గండ్లు పడితే పంట పొలాలను నీళ్లు ముంచెత్తే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయడంతో పాటు గట్టును పటిష్ట పరచాలని రైతులు కోరుతున్నారు. -
ప్లీజ్.. నన్ను తాకొద్దు..
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మొక్కను సెన్సిటివ్ ప్లాంట్ లేదా టచ్ మీ నాట్ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో మాత్రం అత్తిపత్తి, ముట్టుకుంటే మాడి అని కూడా పిలుస్తారు. దీని ఆకులను తాకినప్పుడు లేదా కదిపినప్పుడు క్షణాల్లో ముడుచుకపోతాయి. అందుకే దీన్ని సిగ్గుపడే మొక్క అనే పేరుతో పిలుస్తారు. ఇది దక్షిణ, మధ్య అమెరికాకు చెందినప్పటికీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలుపు మొక్కగా వ్యాపించింది. ఇది తరచుగా పొడినేల లేదా బీడు భూముల్లో పెరుగుతుంది. ప్రస్తుతం అధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడంతో కనుమరుగవుంది. పొలా ల్లో ఎక్కడ చూసి విచ్చల విడిగా కనిపించేది. దొర్నిపాడులోని ఓ స్కూల్లో మైదానంలో ఈ మొక్కలు కనిపించాయి. – దొర్నిపాడు -
ప్రాణం తీసిన స్పీడ్బ్రేకర్
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ ఒక ప్రాణం తీసింది. స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా వేయడంతో బైక్పై కూర్చొన్న ఫక్కీరెడ్డి భాస్కర్రెడ్డి భార్య ఫక్కీరెడ్డి పద్మావతమ్మ(58) కింద పడి ఈ నెల 14న కోమాలోకి వెళ్లారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందారు. ఇష్టానుసారంగా స్పీడ్బ్రేకర్ వేయడంతోనే తన భార్య మృతి చెందారని ఫక్కీరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. కానిస్టేబుల్ సస్పెన్షన్ ఆదోని అర్బన్: స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామకృష్ణను సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గార్డెనియా విల్లాస్లో రాఘవేంద్ర అనే బాధితుడు ఇంటి దగ్గర కానిస్టేబుల్ రామకృష్ణ ప్రహరీని పగలగొట్టి భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో రామకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పంపారు. -
అదుపు తప్పిన కారు
రుద్రవరం: మండల పరిధిలోని ముత్తలూరు మెట్ట సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం వైపు నుంచి ఆళ్లగడ్డకు వేగంగా వెళ్తున్న కారు ముత్తలూరు మెట్ట వద్ద మలుపు తిరుగుతూ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు తెలంగాణ వాసులు కాగా, దెబ్బతిన్న కారును యంత్రం ద్వారా ట్రక్కులోకి చేర్చుకొని తీసుకెళ్లారు. ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు వెల్దుర్తి: పట్టణంలోని ఓ వైన్షాపు వద్ద సోమవారం జరిగిన వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కృష్ణగిరి మండలం టి.గోకులపాడుకు చెందిన గోవిందు కత్తిపోటుకు గురయ్యాడు. గోవిందుకు, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఇటీవల విభేదాలు తలెత్తాయి. గోవిందు రెచ్చగొట్టడంతో వైన్షాప్ వద్దకు చేరుకున్న బోయ సురేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిపై పొడిచాడు. రక్తగాయాలైన గోవిందు స్థానిక సీహెచ్సీలో ప్రథమ చికిత్స పొందాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. -
విశ్రాంత డీఆర్వో జి.పుల్లయ్య మృతి
కర్నూలు(సెంట్రల్): విశ్రాంత డీఆర్వో జి.పుల్లయ్య మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్తో పోరాడుతూ సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన గతంలో కర్నూలు డీఆర్వోగా, తహసీల్దార్గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నంద్యాల డీఆర్వోగా వెళ్లారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా డీఆర్వోగా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో కర్నూలులోనే ఉంటున్న ఆయన క్యాన్సర్తో పోరాడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.నాగరాజు, లక్ష్మీరాజు తదితరులు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి ఆస్పరి: బిణిగేరి గ్రామ సమీపంలో సోమ వా రం ట్రాక్టర్ కింద పడి మహేష్ బాబు (24) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు మేరకు.. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామం నుంచి నాపరాళ్ల లోడుతో డ్రైవర్ శేఖర్తో పాటు మహేష్ బాబు ఆదోని మండలం పెద్దహరివాణంకు అన్లోడు కోసం వెళ్తున్నారు. బిణిగేరి గ్రామం సమీపంలో డ్రైవర్ శేఖర్ దగ్గర కూర్చున్న మహేష్ బాబు జారి కింద పడ్డాడు. దీంతో వెనుక టైర్లు ఎక్కడంతో మహేష్బాబు అక్కడక్కడే మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నంద్యాల(అర్బన్): పంటల సాగులో రైతులు వైవిధ్యం పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ అన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో సోమవారం పంటల వైవిధ్యం అనే అంశంపై జిల్లాలోని ఏఈఓలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ఎకరం వరి పంటకు ఇచ్చే నీటితో సుమారు 2–3 ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను సాగు చేయాలని సూచించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలో సుమారు 45 శాతం మెట్ట భూమి సాగులో ఉందని, అందులో పంట వైవిద్యాన్ని పాటించాలన్నారు. బెట్టను తట్టుకొనే వంగడాలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గిరిజారాణి, డాక్టర్ అశోక్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో సంగమేశ్వరుడి దర్శనం
కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో సంగమేశ్వరుడు జలాధివాసం వీడనున్నాడు. సోమవారం జలాశయం నీటిమట్టం 843 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం తగ్గడంతో సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం క్రమేపీ కృష్ణమ్మ ఒడిని వీడుతోంది. ప్రస్తుతం ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ కింది భాగం వరకు నీటి మట్టం ఉంది. దీంతో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సంగమేశ్వరాల యం జలాధీవాసం వీడనుంది. కాగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న కన్నడ భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు రావడం విశేషం. ఆయల పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివలింగానికి కర్ణాటక భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. -
డ్రగ్స్కు అడ్డాగా ఏపీ
ఆలూరు రూరల్: చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి డ్రగ్స్కు ఏపీ అడ్డగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడటం అత్యంత దారుణమన్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఆలూరు నియోజకవర్గంలో సైతం గుట్టుగా గంజాయి సాగు జరుగుతోందన్నారు. గంజాయి, కల్తీ మద్యం అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతోందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడ్డ యువత అరాచకాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారన్నారు. గత ఆదివారం ఆలూరు–ఆస్పరి మండలాల పరిధిలోని చిన్నహోతూరు, మరకట్టు, మూసానహల్లి గ్రామాల మధ్య అడవిలో పేకాట స్థావరాలపై జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేసి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే నియోజకవర్గంలో పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
భారీగా మద్యం పట్టివేత
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణం వెంకటాపురం కాలనీలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ సుధీర్బాబు తెలిపారు. ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం డంప్ చేసినట్లు పక్కా సమాచారం రావటంతో దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఆంజనేయులు సైన్యంలో చేరి రిటైర్ట్ అయ్యాడని, చౌకధరతో తెచ్చిన మద్యాన్ని అధికర ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారన్నారు. మొత్తం 100 బాక్సులు తెచ్చినట్లు, అందులో 50 బాక్సులు విక్రయించగా మిగిలినవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మద్యాన్ని సైన్యం నుంచి తెచ్చుకున్న చెక్కపెట్టెలో రైలులో తీసుకువస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వీటి విలువ దాదాపు రూ. 6 లక్షలు పైగా ఉంటుందన్నారు. నిందితుడిపై ఇదే స్టేషన్లో మూడు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మద్యం బాటిల్స్పై అరుణాచలం స్టిక్కర్లు ఉన్నాయని, వీటిని అక్కడే నుంచే తెచ్చాడా, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చాడా అనేది విచారణ తరువాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ కేసును ఛేదించడంతో ఎకై ్సజ్ అిసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, కర్నూల్ సీఐ చంద్రవాస్, ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీగా పుట్టా మహేష్ అనర్హుడు
కర్నూలు(టౌన్): డ్రగ్స్ లేకుండా చేస్తా అని ప్రచారం చేసి, చివరకు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆ పదవికి అనర్హుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల చంద్రబాబు పాలనలో అరాచకాలు, మహిళలపై దాడు లు, వేధింపులు పెరిగిపోయాయన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై ఐదు రౌండ్ల కాల్పులు జరపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేయడంతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడన్నారు. అదే పార్టీకి చెందిన కిరణ్ రాయ ల్, కూన రవికుమార్ మహిళలను వేధిస్తు న్నా అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ తమను వేధిస్తున్నాడని ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి కారణమైందన్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేసి, దౌర్జన్యం చేసి, మహిళలను సైతం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. కర్నూలులో అర్ధరాత్రి మద్యం సేవించిన మంత్రి టీజీ భరత్ అనుచరులు మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేయ్యలేదా.. దాడికి యత్నించలేదా? ఎలాగోలా మద్యం మత్తులో ఉన్నవారిని స్టేషన్కు తరలిస్తే అక్కడ వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కుర్చీలో కూర్చోబెట్టి టీ తాగించి పంపించారన్నారు. విద్యా రంగ సమస్యలు పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ వీడియో గేమ్స్, క్రికెట్ చూడటం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఈ రాష్ట్రానికి సుపరి పాలన ఒక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. -
● రూ. 7 లక్షలు విలువజేసే ఏడు వాహనాల స్వాధీనం
మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు కర్నూలు (టౌన్): వెూటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను (ఒకరు మైనర్) పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14 వ తేదీ వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి కర్నూలు మార్కెట్ యార్డు వద్ద మోటారు సైకిల్ను పార్కింగ్ చేశారు. యార్డులోకి వెళ్లి వచ్చేలోపు వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వెంకటరమణకాలనీకి చెందిన కార్తీక్ స్థానికంగా ట్రెండ్ మచ్చాలో సేల్స్బాయ్గా పనిచేస్తున్నాడు. తన మోటార్ సైకిల్ను షాపు వద్ద పార్కింగ్ చేయగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ విక్రమసింహరెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, సిబ్బంది మురళీధర్, సుబ్బారాయుడు, గోవింద్లు టీమ్లుగా ఏర్పడి అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. కర్నూలు నగరంలోని బాపూజీ నగర్కు చెందిన మల్లెపోగు చెన్నయ్య, సమీప బంధువు ఒక మైనర్ బాలుడు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
బ్యాడిగ మార్కెట్కు పోటెత్తిన వాహనాలు
హాలహర్వి: ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ బ్యాడిగ మిరప మార్కెట్కు మిరప తరలింపు జోరందుకుంది. జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని మండలాలతో పాటు హాలహర్వి మండలంలోని గూళ్యం, నిట్రవట్టి, సిద్ధాపురం తదితర గ్రామాల నుంచి రైతులు తమ పంట దిగుబడులను టిప్పర్లు, మినీ వాహనాల్లో తరలిస్తున్నారు. ఆలూరు మీదుగా ఈ వాహనాలు వెళ్తూ హాలహర్విలో రోడ్డు పక్కన ఆపడంతో సందడి నెలకొంది. కాగా.. ఎకరాలో పంట సాగుకు రూ.80 వేల నుంచి రూ.1.20లక్షల వరకు వెచ్చించారు. బ్యాడిగ రకం మిరప ఎకరాకు 6–10 క్వింటాల దిగుబడి వస్తుంది. సీడు మిరప ఎకరాకు 15–20 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గుంటూరు మార్కెట్కు వెళ్లడానికి దూరం కావడంతో పాటు.. ఖర్చులు ఎక్కువవుతుండటంతో సరైన ధర లభించదని, వెంటనే టెండర్లు పాడి డబ్బు వెంటనే ఇస్తున్న కారణంగా బ్యాడిగకు వెళ్లి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సీడ్ మిరప ధర క్వింటా రూ.15వేల నుంచి రూ.20 వేలు ఉండగా.. బ్యాడిగ మిరప ధర క్వింటా రూ.42వేల నుంచి రూ.53 వేలు పలుకుతోంది. -
వినియోగదారుల రక్షణ చట్టంతో మోసాలకు అడ్డుకట్ట
కర్నూలు(సెంట్రల్): కేంద్రం ప్రభుత్వం 2019లో తెచ్చిన వినియోగదారుల రక్షణ చట్టంతో వ్యాపారులు చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.రాజారఘువీర్ తెలిపారు. ఆదివారం వినియోగదారుల కోర్టులో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన దినాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో చిన్న వస్తువును కొనుగోలు చేసినా బిల్లును తీసుకోవాలని సూచించారు. తద్వారా ఆ వస్తువు నకలిదీ అయినా, నాణ్యత లేకున్నా మోసాన్ని నివారించేందుకు వీలు ఉంటుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్కుమార్, సభ్యురాలు నజ్మా కౌసర్ మాట్లాడుతూ.. వినియోగదారుల సేవలు లేదా వస్తువు కొనుగోలు మోసం జరిగితే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలని సూచించారు. 1915 అనే టోల్ నంబర్కు నేరుగా వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదు చేయవచ్చున్నారు. మరో కమిమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాతూ.. ఆన్లైన్ కొనుగోళ్లలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, బిల్లులు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, నదీంహుస్సేన్, శివమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
వీరశైవానికి ప్రతీకలు కన్నడిగులు
ఆత్మకూరురూరల్: నల్లమల అడవుల మీదుగా సాధారణ నడకతో ప్రయాణించడమంటేనే అది ఒక సాహసం. ఆ పర్వతప్రాంతంలో శిఖరాలు అధిరోహిస్తు లోయల్లోకి దిగడం సాధారణ స్థితిలోనే ప్రాణాంతకం. అలాంటిది నాలుగు అడుగుల కృత్రిమ కాళ్లను (కర్రకాళ్లు) కట్టుకుని కొండ ఎక్కడం కాని, లోయలలోకి దిగడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. అయితే ఉగాది పరిశకు హాజరయ్యేందుకు కన్నడిగులు పాదయాత్రతో అధిక మంది నల్లమల మీదుగా నడుస్తుండగా కొందరు మాత్రం ప్రత్యేకంగా మరగాళ్లతో వస్తుంటారు. నాగలూటి వద్ద మెట్లు ఎక్కేటప్పుడు, భీముని కొలను వద్ద శిఖరం ఎక్కడం, దిగడం మరగాళ్లతో నడవడం కష్టసాధ్యమైనది. ఏమాత్రం జారినా 80 అడుగుల లోయల్లో పడిపోవాల్సిందే. కొందరు సహచరులు మరగాళ్లతో నడిచే వారిని తాళ్లతో కట్టి బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తారు. ఇంతటి ప్రమాదకర ప్రయాణం చేసే వీరిని చూస్తే మధ్య యుగాలలో వీరశైవ మతం అవలంభించే వారు గుర్తుకొస్తారు. వారు తమ మొక్కులను భీకరంగా మొక్కే వారు. అంతే భీకరంగా వాటిని తీర్చుకునే వారు. కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీశైలంలో మహాశివుడికి తమ తలలను తెగ నరుక్కుని ఆత్మార్పణ గావించుకునే వారు. ఆ పరంపరలో తమ శరీరాలను కష్టపెట్టే మహాభక్తి నేటి తరాల్లో కూడా ఇలా కనిపిస్తూ ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తోంది. -
గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం
● జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్నాయక్ కర్నూలు(అర్బన్): గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం చేస్తామని గిరిజన ప్రజా సమాఖ్య (జీపీఎస్) జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్యా శంకర్నాయక్ అన్నారు. కర్నూలు నగర శివారుల్లోని గిరిజన భవన్లో గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజునాయక్, రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ గిరిజన సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వడిత్యా శంకర్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాది గిరిజన కుటుంబాలకు కనీస సదుపాయాలు లేవన్నారు. కనీసం రేషన్, ఆధార్కార్డులు కూడా లేని పరిస్థితి కొనసాగుతుండడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో సుగాలి, చెంచు, ఎరుకల, యానాది, నక్కల వంటి అనేక గిరిజన జాతులు ఉన్నప్పటికీ వారికి సముచిత రాజకీయ ప్రాతినిఽథ్యం లేదన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచే ప్రతిపాదన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. శ్రీశైలం దేవస్థానంలో గిరిజన సత్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీపీఎస్ గౌరవాధ్యక్షుడు కేజీ నాయక్, రాయలసీమ ఉద్యమ నేత సీమ కృష్ణ, సందీప్నాయక్, రామ్ బాలాజీ నాయక్, నాగస్వామి నాయక్, సుధాకర్నాయక్, శివనాయక్, వెంకటశివ నాయక్, బాలనాయక్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
ఆడపడుచు అనుగ్రహం కోసం
● శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు ● మల్లన్న దర్శనానికి బారులుదీరిన భక్తులు శ్రీశైలంటెంపుల్: తమ ఇంటి ఆడపడుచు అనుగ్రహం కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి శ్రీశైల భ్రమరాంబ దేవికి భక్తిశ్రద్ధలతో మొక్కు లు తీర్చుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉత్సవాల కంటే ముందుగానే శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. సోమవారం ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు నాలుగు విడతలుగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. -
స్పర్శ దర్శనం కోసం సాహసం
శ్రీశైలం: మల్లన్న దర్శనార్థమై శ్రీశైలం వచ్చిన కన్నడిగులు ఆదివారం క్యూలైన్లలో ప్రమాదకర పరిస్థితుల్లో సహసం ప్రదర్శించారు. సుమారు 20 అడుగుల పైగా ఎత్తుకు కట్టిన క్యూల గ్రిల్స్ పైకి ఎగబాకి పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి పక్కనే ఉన్న మరో క్యూలోకి కిందికి దూకారు. ఆదివారం రాత్రి వరకే స్పర్శ దర్శనం ఉండడంతో సోమవారం నుంచి అలంకార దర్శనం మాత్ర మే ఏర్పాటు చేయడంతో ఎలాగైనా స్వామివార్లను స్పర్శ దర్శనం చేసుకోవాలని సంకల్పంతో ఈ సాహసానికి పాల్పడ్డారు. ఆదివారం వేకువ జాము నుంచి ఉచిత ప్రత్యేక దర్శన క్యూలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. త్వరగా దర్శనం చేసుకోవాలని తలంపుతో కొంతమంది ఒక క్యూ నుంచి మరో క్యూలోకి వెళ్లేందుకు సాహసం చేశారు. ఉచిత ప్రత్యేక దర్శన శీఘ్ర దర్శన క్యూ షెడ్లలో ఉన్న ఇనుప గ్రిల్ పట్టుకొని పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి మరో క్యూలోకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంత ఎత్తు నుంచి ఎవరైనా ప్రమాదవశాత్తు కింద పడితే అంతే సంగతులు. మరోవైపు 500 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్ల క్యూల వద్ద టికెట్ల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ పోలీసు బందోబస్తు ఉండటంతో పోలీసులు చొరవ తీసుకొని తోపులాటను అడ్డుకున్నారు. కానీ క్యూ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాక లోపల బందోబస్తు పోలీసులు తెల్లవారుజాము సమయంలో లేకపోవడంతో కొందరు యువకులు అత్యుత్సాహంతో ఎత్తైన క్యూలలోకి ఎక్కి దిగారు. -
ప్రమాదమని తెలిసినా..
మహానంది: పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకర మని ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వేలాది కిలో మీటర్ల దూరం నుంచి చిన్న చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో కూర్చుని ప్రయాణాలు చేస్తున్నారు. ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం, మహానంది, ఉరుకుంద ఆలయాలకు వస్తున్నారు. అందులో చాలా మంది చిన్న చిన్న వాహనాల్లో ఇలా పరిమితికి మించి కూర్చు ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. మహానందిలో ఆదివారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది. -
నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం
కల్లూరు: నిరక్షరాస్యత నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు మండలం చిన్నటేకూరు, తడకనపల్లె గ్రామాలోని పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వయోజనులు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగశేషాచలరెడ్డి, ఎపిఎం పుష్పావతి, తదితరులు పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.9,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం 3,574 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటాకు గరిష్టంగా రూ.9,290 ధర లభించిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ. 3,461, మధ్యస్థ ధర క్వింటా రూ.7,120 పలికినట్లు పేర్కొన్నారు. ఆముదాలు 88 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ. 2,520, మధ్యస్థ ధర క్వింటం రూ.5,811,గరిష్ట ధర రూ.5,904 , కందులు 6 క్వింటాళ్లు వి క్రయానికి రావడంతో వాటిలో క్వింటం కనిష్ట ధర రూ.6,520, మధ్యస్థ ధర రూ.6,869, గరిష్ట ధర రూ.7,029 పలికిందన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామ సమీపంలో ఆదివారం స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరా లు మేరకు.. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలకు చెందిన విరూపాక్షి, రామకృష్ణతో పాటు మరో 16 మంది వ్యక్తులు చిన్నహోతూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతుండగా దాడు లు చేసి అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకుని 17 సెల్ఫోన్లు, 8 బైకులు సీజ్ చేశామన్నారు. ఎక్క డైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్ప డితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ఆదోని సెంట్రల్: రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమాసం. కఠోర ఉపవాస దీక్షలతో పగలు, రాత్రి తేడా లేకుండా అల్లా స్మరణలో గడుపుతారు. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రాత్రి లైలతుల్ ఖదర్. దీన్నే ’బడీరాత్’ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే ముస్లింల ఆరాధ్య దైవ గ్రంథం దివ్యఖురాన్ అవతరించిందని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలకు, ఖురాన్ పఠనానికి, దానధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను తమ ప్రత్యేక ప్రార్థనలతో అల్లా క్షమిస్తారని నమ్మకం. దీంతో రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడుపుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా మసీదులున్నాయి. నేడు లైలతుల్ ఖదర్ సందర్భంగా వాటిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇషా నమా జ్ తర్వాత జరిగే ఈ ప్రార్థనల్లో ఆధ్మాతిక వేత్తల ప్రసంగాలు, పవిత్ర ఖురాన్ పఠనం, జికర్, తహజు ద్ నమాజ్ చేస్తూ రాతంత్రా జాగరం చేస్తారు. -
రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన
మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులు కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సిబ్బంది పనిభారంతో సతమతవుతున్నారు. ఒక బాధ్యతతో నాలుగైదు విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవులో వెళ్లాలన్నా కుదరకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. దీంతో రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, పత్తికొండ రెవెన్యూ సబ్డివిజన్లలో ఇన్చార్జ్ అధికారులు ఉన్నారు. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదోని సబ్కలెక్టర్ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో ఈ బాధ్యతలను హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–3 సబ్ కలెక్టర్ అజయ్ చంద్రశేఖర్కు అప్పగించారు. పత్తికొండ ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన తన బాధ్యతలను సబ్ కలెక్టర్ కొండయ్యకు అప్పగించి వెళ్లిపోయారు. తహసీల్దార్ల స్థానంలో డీటీలకు బాధ్యత కర్నూలు, ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో చాలా తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిప్పగిరి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, కోడుమూరు,, పెద్దకడబూరు, కౌతాళం, హొళగుంద, హాలహర్వి, కృష్ణగిరి మండలాలకు తహసీల్దార్లు లేరు. వారి స్థానంలో డీటీలకు బాధ్యతలు అప్పగించారు. పత్తికొండ డివిజన్లో పత్తికొండ, తుగ్గలి, ఆలూరు తప్ప మిగతా అన్ని మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఒక్క ఎమ్మిగనూరుకు మాత్రం నందవరం తహసీల్దార్కు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన నందవరం, ఎమ్మిగనూరు మండలాలకు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతులు లేనట్టేనా? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రెవెన్యూలో పదోన్నతుల ఫైల్ కదలడంలేదు. ఈ క్ర మంలో రిటైర్మెంట్లు, సస్పెన్షన్ల ద్వారా ఏర్పడుతు న్నా ఖాళీల పోస్టులను ఇన్చార్జ్లకు అప్పగించి చే తులు దులుపుకుంటున్నారు.జిల్లాలో మొత్తం రెండు ఆర్డీఓ,11 తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్లకు సబ్ కలెక్టర్/ఆర్డీఓ, డిప్యూ టీ తహసీల్దార్లకు తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లు/ఆర్ఐలకు డిప్యూటీ తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్/ఆర్ఐలుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కారుణ్య నియమకాల ద్వారా భర్తీ చేయవచ్చు. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అడ్హక్ పదోన్నతులకు బ్రేక్! ఇటీవల కర్నూలు జిల్లాలో ఖాళీగా 11, నంద్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 10 తహసీల్దార్ పోస్టులకు అడహక్ పదోన్నతుల కోసం కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఎల్ఏకు నివేదించారు. మొదట అక్కడ అడహక్ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా అడహక్ పదోన్నతులకు రెడ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ పద్ధతిలోనే తహసీల్దార్ పదోన్నతులను ఇవ్వనున్నట్లు సీసీఎల్ఏ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. అయితే అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో పదోన్నతులపై దృష్టి సారించడంలేదు. దీంతో ఇన్చార్జ్లతో పాలన ముందుకు సాగడం లేదు. ఒకవైపు రీసర్వే.. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుట్టలు గుట్టలుగా వినతులు వస్తున్నాయి. ఇన్చార్జ్లుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతల్లో పనిచేయాలని వీరిని అనధికారికంగా ఒత్తిడి వేయడంపై ఆవేదన చెందుతున్నారు. కొందరు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించలేక అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో చాలా మంది అధికారులు సెలవులో వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజ్లు, వాట్సాప్ లింక్ల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు పంపించి బ్యాంకు వివరాలు, ఓటీపీ తీసుకొని డబ్బులు దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, కార్డు వివరాలు, ఓటీపీలను చెప్పరాద ని హెచ్చరించారు. తెలియని యాప్లు ఇన్స్టాల్ చేయడంతో మొబైల్లోని డేటా దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీశైలం చేరుకున్న పుదుచ్చేరి సీఎం శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్ర మం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు రూ. 64.32 కోట్లు కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ పన్ను వసూళ్లు ముమ్మరం చేసినట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ. 64. 32 కోట్లు, నీటి పన్ను రూ. 6.74 కోట్లు వసూళ్లు అయినట్లు తెలిపారు. నగరంలోని పలు వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతిరోజూ 3 వేల నుంచి 3,500 ఓపీ రోగులు, 1200 నుంచి 1500 ఐపీ రోగులు చికిత్స పొందుతున్నారు. వాస్తవంగా ఇది 1,050 పడకల ఆసుపత్రి. గత ప్రభుత్వంలో దీని సామర్థ్యాన్ని 1,500 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముందుకు సాగుతుండగా ఎన్నికలు సమీపించాయి. దీంతో ఈ అంశం అటకెక్కింది. అయినా కూడా అప్పట్లో 1,500 పడకలకు అవసరమైన బడ్జెట్ను ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. కానీ ఇప్పుడు కేవలం 1,050 పడకలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు. నిధుల లేమితో ఆసుపత్రి ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ నిధులు సైతం ఆగిపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సిందే! ప్రైవేటు ఆసుపత్రుల్లో మాదిరిగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కూడా ఆరోగ్యశ్రీ(డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం ద్వారా ఇక్కడ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఉచితంగా వైద్యం అందించే కేంద్రం. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటేనే ఉచిత వైద్యం అనే రీతికి తీసుకొచ్చారు. ఈ ఆసుపత్రిలో దాదాపుగా 90 శాతం రోగులు ఆరోగ్యశ్రీ కార్డుపైనే చికిత్స పొందుతున్నారు. ఈ కార్డు లేకపోతే వారు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొన్ని వ్యాధులకు ఆసుపత్రిలో ఉన్న మందులు ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అధికారులే బయట కొనుగోలు చేసి రోగులకు అందించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కార్డులేని వారు ఆ మందులను డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేయలేని ప్రభుత్వానికి చెందిన నాల్గవ తరగతి ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే చిరుద్యోగులు, వ్యాపారులు చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఆసుపత్రిలో ఇలాంటి రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స మాత్రమే ఉచితం. ఖరీదైన మందులు, ఇన్ప్లాంట్స్, స్టెంట్స్, ఆపరేషన్కు అవసరమయ్యే ఇతర పరికరాలు కొనుగోలు చేయాల్సిందే. ఇతర రాష్ట్రాల వారికి మరీ ఇబ్బంది కర్నూలు మీదుగా రెండు జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో క్షతగాత్రులను ఈ ఆసుపత్రికే చికిత్స నిమిత్తం తీసుకొస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉంటే వారు చికిత్సకు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే వారి వద్ద ఎవ్వరూ లేకపోతే ఆసుపత్రి అధికారులు ఉచితంగా వైద్యం అందేలా చేస్తున్నారు. వారి వద్ద ఎవ్వరైనా ఉంటే మాత్రం జేబు నుంచి కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రిపై, వైద్యులపై నమ్మకంతో ఎక్కువ మంది చికిత్స కోసం వస్తుంటారు. వారి ఆరోగ్య కార్డులు ఇక్కడ చెల్లుబాటు కావు. ఈ కారణంగా ఇలాంటి వారు సైతం వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు మినహా, ఖరీదైన మందులు, ఆపరేషన్కు అవసరమైన సర్జికల్స్, పరికరాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. లేకపోతే వారి రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు తెగేసి చెబుతున్నారు. ఉచితం కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు? ప్రభుత్వ ఆసుపత్రి అంటే దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం అందించాలి. భారత పౌరులకు ఇది ప్రాథమిక హక్కు. మనిషికి ప్రభుత్వాలు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ రాష్ట్రానికై నా వర్తిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, అది కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి ఉచితంగా వైద్యం చేస్తామని కొర్రీలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి, ఇతర రాష్ట్రాల వారికి ఉచితంగా వైద్యం ఎలా చేయాలో ఆయా రాష్ట్రాల పాలకులు, అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందించే పరిస్థితి లేదనడం ఎంతవరకు న్యాయమని రోగులు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముందులు కొనాల్సిందే! ఆపరేషన్లకు ఖర్చు తడిసిమోపెడు ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి, ఉద్యోగులకు తిప్పలు తెలంగాణ, కర్ణాటక వాసులకు ఇంకా ఇబ్బంది వైద్యుల చికిత్స మాత్రమే ఇక్కడ ఉచితం ప్రభుత్వ ఆసుపత్రి అంటే కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ఉచిత వైద్యం అందించే ఆరోగ్య కేంద్రం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందుతోంది. అది లేని వారి జేబుకు భారీ చిల్లు పడుతోంది. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలు మాత్రమే ఉచితం. మందులు, ఆపరేషన్కు అవసరమైన ఇన్ ప్లాంట్స్, స్టెంట్స్ వంటివన్నీ కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిగ్గా కేటాయించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో ‘బాబూ.. పెద్దాసుపత్రికి వెళ్లొద్దు’ అని ప్రజలు అంటున్నారు. మాది తెలంగాణ రాష్ట్రం. కర్నూలు జిల్లా సరిహద్దులోని రాజోలి గ్రామం. నాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మా తరతరాలుగా వైద్యం కోసం కర్నూలుకే వస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, నాకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదంటున్నారు. నాకు నడుములో వెన్నుపూసలు అరిగిపోవడంతో ఆపరేషన్ అవసరమైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉచితంగా వైద్యం చేయలేమని, హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. మేము పేదవారం. హైదరాబాద్కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత మాకు లేదు. వైద్యం చేయాలని డాక్టర్లను వేడుకుంటున్నా వినడం లేదు. – కె.శివమ్మ, రాజోలి, తెలంగాణ రాష్ట్రం ఆసుపత్రిలో రోగులకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి వైద్యుల సేవలు, ఆసుపత్రిలో ఉన్న మందులు అందిస్తున్నాం. ఆపరేషన్కు అవసరమైన ఇన్ప్లాంట్స్, స్టెంట్స్ వంటివి రోగులే కొనుగోలు చేయాలని చెబుతున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇలాంటివి ప్యాకేజీలో వస్తాయి కాబట్టి మేమే కొనుగోలు చేసి ఇస్తాం. కార్డు లేకపోతే అందరికీ కొనుగోలు చేసి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి బయట కొనుగోలు చేసుకుని తెస్తే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
హామీలు అమలు చేయకుండా శ్రమదోపిడీ
కర్నూలు(సెంట్రల్): ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి ఆరోపించారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ అధ్యక్షతన ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు చాలీచాలనీ వేతనాలు ఇస్తూ రోజుకొక యాప్తో వేధిస్తోందని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలి కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణపాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్నగర్లో నివాసం ఉంటున్నారు. గాయత్రీ ఎస్టేటులోని అర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. తండ్రి జయరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రమణ్యేశ్వరుడికి వెండిపడిగెలు వితరణ పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామికి ఆదివారం రెండు వెండి పడిగెలు భక్తులు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు 500 గ్రామలు, బండిఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య 485 గ్రాముల వెండి పడిగెలు ఇచ్చారని తెలిపారు. -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధికసంఖ్యలో భక్తులు శ్రీగిరి తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది మహోత్సవాలు సోమ వారం ఉదయం 9 గంటలకు దేవస్థాన ఈఓ, ఉభ య దేవాలయాల ప్రధానార్చకు లు, స్థానాచార్యులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో మొదటిరోజు సోమవారం భ్రమరాంబాదేవికి మహాలక్ష్మీ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకీకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు గ్రామపురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
నంద్యాల: పట్టణ శివారులో కర్నూలు బైపాస్ రహదారిలో కుందూనది వంతెన కింద శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నంద్యాల త్రీటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం కుందూనది బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు పట్టణంలోని నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వీధికి చెందిన పెయింటర్ హారిఫ్ (38)గా గుర్తించారు. మృతుడికి భార్య హమీద, కొడుకు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి తనతో ఘర్షణ జరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని మృతుడు భార్య చెబుతుండగా.. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపేశారని మృతుడి సోదరి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
లోక్ అదాలత్లో 41వేల కేసులు పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు. రైతు త్యాగం మరువరానిది తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్ బిల్లుల నకిలీ సందేశాలను నమ్మొద్దు కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ మరిన్ని వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించాలని కొందరు వినియోగదారులకు సందేశాలు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలియజేస్తుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ఫ్రీ నెం.1912 లేదా 1800 425 155333కు కాల్ చేయవచ్చని, లేదా 91333 31912 నెంబరుకు చాట్ చేయవచ్చని సూచించారు. యువకుడు ఆత్మహత్య బనగానపల్లె: పట్టణంలోని తెలుగుపేటలో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు పది నెలల క్రితం వడ్డే చెంచయ్య తన కుమారుడు వడ్డె హేమంత్కుమార్ (19) కోసం ఫైనాన్స్ ద్వారా బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో ఫైనాన్స్ సిబ్బంది బైక్ను తీసుకెళ్లారు. ఈ విషయంలో తండ్రి, కుమారుడు తరచూ ఘర్షణ పడుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన హేమంత్కుమార్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి కొత్తపల్లి: ఓ గిరిజన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన చదరంపెంట గూడెం వాసి అయిన నిమ్మల పెద్ద అంకన్న అనే గిరిజన వృద్ధుడు సాయంత్రం స్నానం చేసి దుస్తువులు శుభ్రం చేసుకునేందుకు గూడెంకు పక్కనే ఉన్న గొరిసెల కాల్వకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో అటవీలోంచి ఓ ఎలుగుబండి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో అంకన్న కుడి, ఎడమ చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి బారి నుంచి అంకన్న బయటపడి గూడెం చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అంకన్నకు అటవీశాఖ నుంచి ఆర్థిక సహాయం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. -
శ్రీగిరి మల్లయ్య యుగే యుగే!
● శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు ● నేటితో ముగియనున్న స్పర్శదర్శనం ‘హే..మల్లయ్య...హే.. శ్రీగిరి మల్లయ్య యుగే యుగే’.. అంటూ కన్నడ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. కంబి(పల్లకీ)లు మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. పల్లకీల ముందు తప్పెట దరువులకు రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు. కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని తరలివస్తున్న కన్నడ భక్తులతో శనివారం శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. మల్లన్న స్పర్శదర్శనం నేటితో (ఆదివారం) ముగియడంతో కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీగిరి చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. – శ్రీశైలం టెంపుల్ కంబి(పల్లకీ)ని మోసుకుంటూ.. -
జై మల్లన్న.. జైజై భ్రమరాంబ!
● ఆడపడుచు దర్శనానికి తరలివస్తున్న కన్నడిగులు ● నల్లమల మీదుగా శ్రీగిరి వైపు అడుగులు ఆత్మకూరు: శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసిన శ్రీభ్రమరాంబదేవి కన్నడిగులకు ఆడపడుచుగా కొలువుదీరి ఉందని భక్తుల విశ్వాసం. ఉగాది ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా సంప్రదాయం కొనసాగుతోంది. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివభక్తురాలైన భ్రమరాంబ కర్ణాటక ప్రాంతానికి చెందినవారని స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడ్ని వరించారు. శివుడు ఓ భ్రమరాన్ని (తుమ్మెదను) చూపించి, అది నిలిచిన చోటుకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో అమ్మవారు భ్రమరాన్ని అనుసరించారు. ఆ తుమ్మెద శ్రీశైలం వద్ద ఆగింది. అక్కడికి వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి.. స్వప్నంలో కనిపించింది తానేనని చెప్పడంతో అమ్మవారు వివాహమాడారు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కన్నడిగురాలైన భ్రమరాంబదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఏటా శ్రీశైలానికి సారె తెస్తారు. వందల కి.మీ. దూరం నుంచి శ్రీశైలం మహాక్షేత్రానికి కన్నడ సంప్రదాయరీతిలో మిరియాలపట్టు, ముత్తైదు సౌభాగ్యాలతో కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమలు, నూతన పట్టుచీరలు, రవికెలు, కొత్త చాటతో అమ్మవారికి చీర, సారె మహిళల నెత్తిపై పెట్టుకుని తమ ఆడపడుచు శ్రీభ్రమరాంబదేవి సమర్పిస్తారు. అమ్మవారికి మొక్కులు తీర్చి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు. వందల కి.మీ పాదయాత్రగా.. ఉత్సవాలకు దాదాపు 20 రోజుల ముందుగానే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. బళ్లారి, రాయచూరు, గుల్బర్గా, సోలాపూర్, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి వందల కి.మీ నడుస్తూ శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం నుంచి నల్లమల మీదుగా అటవీ మార్గంలో రాత్రి సైతం టార్చ్లైట్ల వెలుతురులో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నాగలూటి వద్ద వీరభద్రుడికి మొక్కులు చెల్లించి మెట్ల మార్గంలో నడక మొదలు పెడుతున్నారు. నాగలూటి వద్ద మహారాష్ట్ర బృందం చేపట్టిన అన్నదానంతో ఆకలి తీర్చుకుని శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. కై లాస ద్వారం చేరుకుని వడివడిగా శ్రీగి చేరి భ్రమరాంబకు జై.. మల్లన్నకు జై అంటూ నినదిస్తున్నారు. -
జిల్లాలో ముగిసిన సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను నలుగురు సభ్యులు కలిగిన సెంట్రల్ టీం తనిఖీలు చేపట్టింది. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. వెల్దుర్తి, మద్దికెర, దేవనకొండ, కర్నూలు, తుగ్గలి మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. ఉపాధి నిధులతో చేపట్టిన పండ్ల తోటలను కూడా పరిశీలించారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ల పురోగతిని అధ్యయనం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలతతో సమావేశమయ్యారు. తమ పర్యటనకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తాము చేపట్టిన తనిఖీలపై నివేదిక ఇస్తామని ప్రకటించారు. కాగా ఆదివారం నుంచి సెంట్రల్ టీమ్ ప్రతినిధులు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. -
ఎలక్ట్రీషియన్ మృతి
ఎమ్మిగనూరురూరల్: గువ్వలదొడ్డి గ్రామంలో ఎలక్ట్రీషి యన్ దుర్గాప్రసాద్ (28) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. గ్రామా నికి చెందిన మునిస్వామి, పద్మావతిల కుమారుడు దుర్గాప్రసాద్(28) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఆరేళ్ల క్రితం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన బేగంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గౌతంనంద్ (2) అనే బాలుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఐదు నెలలుగా బేగం పుట్టినిల్లు రాళ్లదొడ్డికి వెళ్లిపోయింది. భార్య పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12వ తేదీ ఇంట్లో గదిలో గడియ వేసుకుని నిద్రించి శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. త లుపులు బద్దలకొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
కర్నూలు (టౌన్): ప్రత్యేక అవసరాలు కలిగిన మహిళలు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఎంపవర్మెంట్ ఆఫ్ డెఫ్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళా సమాన అవకాశాలతో ముందుకు రావాలన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని రాణించాలన్నారు. మహిళలు తమ హక్కులు తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. డెఫ్ సంస్థలు సత్యవాణి, సయ్యద్ గౌస్ పాషా, సుబాల్ బాషా, తేజస్విని, ధరణీకుమారి, లక్ష్మీ, షేక్ రిజ్వానా బేగమ్, తేజేశ్వరి, సౌజన్య, సుబ్బమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నెలాఖరు వరకే ఎస్సార్బీసీకి నీటి విడుదల పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదల ఉంటుందని ఈఈ కిష్టన్న తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్బీసీ ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రసుత్తం గోరుకుల్ల జలాశయంలో 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడా నీటిని వృథా చేయరాదన్నారు. ఈనెల చివరి నాటికి గోరుకల్లు వద్ద నీటిని నిలిపివేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆయా బ్లాక్ కింద సాగు చేసుకునే రైతులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం అందిస్తామన్నారు. -
వివాదాలకు ‘బలి’అవుతూ!
కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్ కుమార్ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్కుమార్తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి నిర్బంధం తెలంగాణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్ను స్టేషన్కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్ను కర్నూలు అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్తో రాజీ సంప్రదింపులు చేశారు. శాంతి కోసం పొట్టేలు బలి వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్హెచ్ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్స్టేషన్కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్లో వంటలు చేయించి స్టేషన్ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్టాపిక్గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరుపై విమర్శల వెల్లువ పరిస్థితులు అనుకూలించేందుకు శాంతి పేరుతో స్టేషన్కు పొట్టేలు బలి రక్త తర్పణం చేసి విందు చేసుకున్న సిబ్బంది పోలీసు శాఖలో హాట్ టాపిక్గా మారిన ఘటన ముడుపుల విషయంలో క్రైం పార్టీ పోలీసులపై వివాదం ఇదే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్లో సీఐ మధుసూదన్గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు. -
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపె దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ, అగ్రిప్రతిష్ఠాపన, నిత్యహవనములు జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 18న వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మొత్తం 37,331 మంది విద్యార్థుల కోసం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరిటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించి తగిన శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచినట్లు చెప్పారు. సెల్ఫోన్లు నిషేధం పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్ఎస్, మంచినీరు, మందులతో కూడిన ఉచిత వైద్య శిబిరాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపితే చాలని సూచించారు. ప్రశ్నపత్రాలను 34 పోలీసు స్టేషన్లలో భద్రపరిచామన్నారు. వీటిని ప్రతి రోజు ఉదయం 8 నుంచి 8.30గంటల మధ్య కేంద్రాలను చేరుస్తామన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలు లేదని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు. నేడు అక్షరాంధ్ర అభ్యాసకులకు పరీక్షలు అక్షరాంధ్ర కార్యక్రమంలో విద్యను అభ్యసించిన వారికి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,62,235 మంది పరీక్షలు రాసేందుకు అనువుగా మొత్తం 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లుగా పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లను నిమించినట్లు చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్లో వయోజన విద్యా శాఖ డెప్యూటీ డైరక్టర్ చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ విజయ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హాల్టిక్కెట్ చూపితే విద్యార్థులకు ఉచిత ప్రయాణం విలేకరుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి -
47 ఏళ్లుగా కన్నడిగుల సేవలో..
పాములపాడు: స్థానిక శ్రీ శివ బ్రహ్మ మల్లికార్జున స్వా మి ఆశ్రమంలో 47 సంవత్సరాలుగా కన్నడ పాదయాత్రికులకు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శేషన్న గౌడు మాట్లాడుతూ.. భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. జూటూరు గ్రామం జగనన్న కాలనీలో గ్రామానికి చెందిన కుళాయప్ప సొంతంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచు నాయిని సావిత్రమ్మ, మధుసూదన్రావు, భజన చౌడయ్య, మన్నె పుల్లయ్య, రామకృష్ణ, శ్రీని వాసులు, మల్లికార్జున శివ, నాగరాజు, భజన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఏడు పదుల వయస్సులో.. పాములపాడు: అతని వయస్సు 70 ఏళ్లు.. వందల కి.మీ పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ వయస్సులో కూడా హుషారుగా ఓం నమః శ్శివాయ అంటూ నడక సాగిస్తున్న వృద్ధుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన శివపుత్ర అనే వృద్ధుడు పాదాలకు స్వతహాగా తయారు చేసుకున్న బట్ట పాదరక్షకులతో వడివడిగా నడక సాగిస్తున్నారు. ఇప్పటికి సుమారు 10 రోజులుగా 300 కిలోమీటర్లకు పైగా నడిచారు. మధ్యాహ్న వేళ సేద తీరుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో నడక సాగిస్తున్నట్లు తెలిపారు. స్వామిపై ఉన్న భక్తితో వెళ్తున్నానని, ఆయనే తన దరికి క్షేమంగా చేర్చుకుంటాడని తెలిపారు. శ్రీశైలం చేరుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శ్రీశైలం చేరుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. రాత్రి కి భ్రమరాంబా అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం ఉదయం 6 గంటలకు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని దేవస్థానం అధికారులు తెలిపారు. -
వామ్మో.. కమీషన్ ఏజెంట్లు
● వాము రైతులను దగా చేస్తున్న వైనం ● అనధికార కాటాదారులతో తూకాలు ● లైసెన్స్ల రద్దుకు నోటీసుల జారీ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము రైతులను దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమీషన్ ఏజెంట్లపై అధికారులు నిఘా పెట్టారు. మార్కెట్లో 38ఏ, 38బి, 28, 11ఏ, 11బి, 1, 40 షాపుల కమీషన్ ఏజెంట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీరినే మార్కెట్లో వాము దొంగలుగా పేర్కొంటున్నారు. వీరు వాము పండించే ప్రాంతాలకు వెళ్లి రైతులకు మాయమాటలు చెప్పి తమ దుకాణాలకు వచ్చే విధంగా చేసుకుంటున్నారు. మార్కెట్కు దాదాపు 2000 క్వింటాళ్లు వస్తుండగా.. వీరికే అత్యధికంగా వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో పండించిన వాము మార్కెట్కు ఎక్కువగా వస్తోంది. ఈ నెల 12వ తేదీ కర్ణాటకకు చెందిన ఓ రైతును అవినీతి ఆరోపణలు ఉన్న ఓ కమీషన్ ఏజెంటు తూకంలో దగా చేయడంపై మార్కెట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తూకాలు ఆలస్యం చేయడం, రైతుల కన్నుగప్పి దగా చేయడం సర్వసాధారణమైంది. కాటాకు సీలు తొలగించి అక్రమాలకు పాల్పడిన కమీషన్ ఏజెంటు మళ్లీ అదే తరహాలో సీలు తొలగించి వాము స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం కృష్ణవేణి ట్రేడర్స్ కమిషన్ ఏజెంటు దుకాణంలో కాటాకు సీలు తొలగించి తూకాలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించి కాటాను స్వాధీనం చేసుకున్నా రు. లైసెన్స్ రద్దుకు నోటీసులు జారీ చేశారు. మరో వైపు శ్యాంపుల్స్ రూపంలో రైతుల నుంచి బలవంతంగా వాము తీసుకుంటున్న ఇద్దరు కాటాదారులకు లైసెన్స్ల రద్దు కోసం నోటీసులు జారీ చేశారు. అనేక ఆరోపణలు ఉన్న కమీషన్ ఏజెంట్లకే వాము ఎక్కువగా వస్తున్నందున లైసెన్స్ కలిగిన కాటాదారులే తూకాలు వేయాలని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
టీడీపీ ఆగడాలకు అడ్డేది
● యాదవాడలో వైఎస్సార్పీపీ నాయకుడి మోటార్, పైపులైన్ల ధ్వంసం విద్యుత్ మోటార్ పైపులను ధ్వంసం చేసిన దృశ్యం, ఓవర్హెడ్ ట్యాంక్ సంబంధించి విద్యుత్ తీగలను కట్చేసిన దృశ్యం ఆళ్లగడ్డ: చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డేలేకుండా పోతుంది. వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని యాదవాడ గ్రామంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు నరసింహారెడ్డికి చెందిన పొలం మోటార్, పైపులైన్లను ధ్వంసం చేశారు. ముందుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రభుత్వ మోటార్ను నరసింహారెడ్డి వాడుకుంటున్నాడని అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన మండల, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బోరు ప్రభుత్వానిది కాదని తేల్చారు. దీంతో నాయకులు అక్కసుతో పొలానికి నీరు వెళ్లేందుకు వీలు లేకుండా పైపులను ధ్వంసం చేసి పైశాచిక అనందం పొందుతున్నారు. అలాగే నరసింహారెడ్డి భార్య బొల్లపు సరస్వతీ గ్రామ సర్పంచ్ కావడంతో గ్రామానికి నీటిసరఫరా చేసి ఓహెచ్ఆర్ వద్ద విద్యుత్ తీగలను కట్ చేశారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి సరఫరా కాక ఇబ్బందులు పడ్డారు. -
వ్యక్తి ఆత్మహత్య
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర ప్ప తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం గాజులపల్లెకు చెందిన బోయ శ్రీకాంత్ (37), ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మౌనికకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి శ్రీకాంత్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాలేదు.గురువారం రాత్రి నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుర్తించి, ఉరిని తప్పించి వెంటనే శ్రీకాంత్ను బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. బైక్ను ఢీకొన్న కర్ణాటక బస్సు ● వ్యక్తికి తీవ్ర గాయాలు ఆత్మకూరురూరల్: ఆత్మకూరు – కర్నూలు రహదారిలో కరివేన గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన బాలీశ్వరయ్య అనే వ్యక్తి బైక్పై కరివేనకు వస్తూ సర్వీస్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్తుండగా శ్రీశైలం నుంచి రాయచూరు వెళ్తున్న కర్ణాటక బస్సు వేగంగా ఢీకొంది. బాలీశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పది మంది భక్తులకు గాయాలు శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం టోల్గేట్ వద్ద శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో కన్నడికులకు చెందిన బొలెరో వాహ నం అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. వన్టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి, దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. శుక్రవారం ఉద యం కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా పొట్లగిరి గ్రామానికి చెందిన కర్ణాటక వాసులు బొలెరో వాహనంలో దేవస్థానం టోల్గేట్ చేరుకున్నారు. వాహన డ్రైవర్ వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవస్థానం వైద్యశాలకు 108లో తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. కోళ్లకు విషం డోన్ రూరల్: మండల పరిధిలో కొచ్చెర్వు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందికి రైతు రామకృష్ణ తన పొలంలో కోళ్లను పోషిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆహారంలో విషం కలిపి వాటికి పెట్టడంతో 24 కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. -
కాన్పు డబ్బులు వచ్చాయని..!
హొళగుంద: ‘మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు వచ్చాయి’ అని సైబర్ నేరగాడు ఆశ పెట్టి బాధితుడి నుంచి రూ. 19 వేలు కాజేశాడు. ఈ సంఘటన శుక్రవారం హొళగుందలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముల్లా షాకీర్ అనే యువకుడికి శుక్రవారం సాయంత్రం 917289982513 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ ‘ప్రభుత్వం మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు అందిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే నంబరు తదితర వివరాలు ఇవ్వాలి.’ అంటూ నమ్మబలికాడు. సైబర్ నేరాలపై అంతగా అవగాహన లేని షాకీర్ రూ.6 వేలు వస్తాయి అనే అశతో వివరాలన్నీ ఇచ్చేశాడు. అయితే జీరో అకౌంట్ అని రూ.6 వేలు పడాలంటే మరో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని నమ్మబలికాడు. ఆన్లైన్లోనే ఖాతా తెరుస్తానని చెప్పి ఫినో పేమెంట్స్ బ్యాంక్ పేరిట కొత్త ఖాతా తెరిచి ఖాతాలో ముందుగా రూ.10 వే లు, ఆ తర్వాత రూ.5 వేలు, రూ.4 వేలు చొప్పున నగదు వేసుకోండని చెప్పాడు. అమాయకుడైన షాకీర్ తన అకౌంట్లోనే ఉంటాయి కదా అని సదరు కేటుగాడు మాటలు నమ్మించి ఫోన్ పే నంబరుకు పది నిమిషాల్లో ఆ మొత్తం నగదు వేశాడు. విషయాన్ని తెలిసిన వాళ్ల దగ్గర చెప్పడంతో వారు వెంటనే ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్ల పనేనంటూ బాధితుడు హొళగుంద పోలీసులను ఆశ్రయించాడు. -
ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్
కర్నూలు: ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై కర్నూలులో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్టేషన్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్షర్ ద్వారా ఆటోడ్రైవర్లకు చూపించి అవగాహన కల్పించారు. వేగంగా వాహనం నడపటం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటివి చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీఐ సూచించారు. మద్యం సేవించి వాహ నం నడపరాదని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. -
శ్రీగిరిలో కన్నడ భక్తుల సందడి
● ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం ● 15వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కన్నడ భక్తుల సందడి నెలకొంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ముందుగానే అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు. కన్నడ భక్తులు శ్రీశైల భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి వారిని తమ అల్లుడిగా భావిస్తారు. తమ ఇంటి ఆడపడుచు అయిన భ్రమరాంబా దేవిని కను లారా దర్శించి, చీర, సారే సమర్పించేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో తరలి వస్తు న్న భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. తమ ఇంటి ఆడపడుచు ఆశీస్సుల కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం పాదయాత్ర చేస్తూ తమ ఆడపడుచు చెంతకు చేరుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబ దేవి కోసం ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. దర్శ నం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. స్పర్శ దర్శనం కోసం తరలివస్తూ.. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించా రు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో పది రోజులపా టు కనడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశా రు. దీంతో మల్లన్న స్పర్శ దర్శనం కోసం ఉత్సవాల కంటే ముందుగానే భారీగా కనడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మల్లన్న స్పర్శ దర్శనం చేసుకుని, తమ జన్మ ధన్యమైందని కన్నడ భక్తులు పరితపిస్తున్నా రు. దేవస్థానం కల్పించిన మల్లన్న స్పర్శ దర్శనంపై కన్నడ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని పాదయాత్రగా వేలాది మంది కన్నడ భక్తులు తరలివస్తున్నారు. వెంకటాపురం నుంచి నల్లమల అడవు ల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. వృద్ధులు, చంటిపిల్లలు, మహిళలు సైతం ఎండను కూడా లెక్క చేయకుండా అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. పలువురు భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వస్త్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా గే శివ స్వరూపంగా భావించే పల్లకీని మోసుకుంటూ పాదయాత్రగా వస్తున్నారు. కొందరు యువకులు డప్పు వాయిద్యాలతో చిందులు వేసుకుంటూ భక్తి, శ్రద్ధలతో తరలివస్తున్నారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఉచిత, రూ.500, రూ.200 టికెట్ల ప్రవేశ ద్వారాల నుంచి మల్లన్న దర్శనానికి బారులుదీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు రద్దీగా మారాయి. భక్తుల శివనామస్మరణ మారుమోగుతుంది. -
అన్నదాతా సుఖీభవా!
● 20 ఏళ్లుగా నాగలూటి వద్ద అన్నదాన క్రతువు ● మల్లన్న భక్తుల ఆకలి తీర్చుతున్న మహారాష్ట్ర బృందం ఆత్మకూరురూరల్: దాహమేస్తే నీరు కూడా దొరకని నల్లమల ప్రాంతం. అలాంటి చోట పది రోజుల పాటు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం చేయడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. దాతల సహకారంతో దాదాపు 20 ఏళ్లుగా నాగలూటి ఆలయం వద్ద మహారాష్ట్ర బృందం అన్నదాన యజ్ఞం నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి మొదలు యావత్తు ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి కన్నడిగులు, మహారాష్ట్రీయులు వందల కి.మీ. పాదయాత్రగా నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. వీరి కోసం మహారాష్ట్ర బృందం అడవిలో మెట్ల పాదం వద్ద వెలసిన నాగలూటి వీరభద్ర స్వామి సమీపంలో 20 ఏళ్లుగా అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తోంది. కొల్లాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. పది రోజులపాటు 24 గంటలు నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో సుమారు 7 లక్షల మంది కన్నడిగులు ఈ అన్నదాన శిబిరాన్ని సందర్శించనున్నట్లు అంచనాలున్నాయి. రోజుకు 50 వేల చపాతీలు తయారీ అన్నదాన శిబిరంలో రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే ఆటోమేటిక్ మిషన్ను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చారు. పిండి తడిపి, ముద్దలు చేసి ఆపై చపాతీలుగా రుద్ది, పెన్నంపై కాల్చే వరకు అంతా ఆటోమేటిక్గా మిషన్పై తయారవుతుంటాయి. అంతే కాక కూరగాయలు తరిగే మిషన్ వంటి ఎన్నో ఆధునిక వంట ఇంటి సామగ్రిని ఇక్కడ వినియోగిస్తున్నారు. నాగలూటి వీరభద్రేశ్వరుడి సేవలో భాగంగా మా ట్రస్ట్ అన్నదాసోహ మహా కార్యం నిర్వహిస్తోంది. ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఈ యజ్ఞం సాగుతోంది. సుమారు 200 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రవాణా తదితరాలు కూడా దాతల సహకారంతో సాగుతోంది. ఉచితంగా వైద్య శిబిరం కూడా నడిపిస్తున్నాం. – ఎంఎస్ పాటిల్, అన్నదాన శిబిరం ట్రస్ట్ అధ్యక్షులు -
స్వయం ఉపాధిలో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ కుటుంబానికి ఆర్ధిక భరోసాగా నిలవాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటాపురం కాలనీ వద్ద బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మెట్ యూనిట్ కేంద్రాన్ని ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అదేవిధంగా సోమప్ప సర్కిల్లో చలివేంద్రాన్ని ప్రారంభించి, కోతుల బావి ఆంజినేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోనెగండ్ల రోడ్డులోని శ్రీఅంబా భవాని ఆలయంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదానంలో భాగంగా భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు కామర్తి నాగేషప్ప, కంఠ, శివప్రసాద్, మధుబాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వర్సిటీల అభివృద్ధికి కృషి కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆర్యూ వీసీ వి.వెంకట బసవరావు అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప వర్సిటీల పర్యటనల్లో భాగంగా శుక్రవారం ఆర్యూను సందర్శించారు. ఆ వర్సిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీల్లో గిరిజనులకు అందుతున్న ఫలాలను పరిశీలించేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. వీసీ మాట్లాడుతూ.. వర్సిటీల్లో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్లు డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. వర్సిటీలో కొందరు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయడం లేదని, వేతనాల్లో తేడాలు ఉన్నాయని తదితర విషయాలను వెంకటప్ప దృష్టికి తెచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను వర్సిటీ అధికారులు సన్మానించారు. వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ నరసింహులు, అకడమిక్ అఫైర్స్ డీన్ సీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీసీఆర్ కార్డులు ఇచ్చి ఏం లాభం?
మాకు ఎలాంటి భూములు లేవు. రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. 2025–26 సంవత్సరానికి సంబంధించి 3.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. ఇందులో పత్తి సాగు చేసి అధిక వర్షాల నష్టాలు మూట కట్టుకున్నాం. కౌలు భూమికి రైతు అంగీకారంతో ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా జారీ చేసింది. కార్డుతో సహా ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో అన్నదాత సుఖీభవ కింద సాయం కోసం రైతు సేవా కేంద్రంలో సమర్పించాం. అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. ఉపయోగం లేని సీసీఆర్ కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. – ఉప్పరి లక్ష్మన్న, తులసాపురం, కర్నూలు మండలం -
‘పెద్ద’ కష్టం.. ‘పైసా’చికం!
పేరుకు పెద్దాసుపత్రి. చుట్టుపక్క జిల్లాలకూ పెద్దదిక్కు. వందలాది మంది ఉద్యోగులు.. వేలాది మంది రోగులు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్నా.. కనీస పర్యవేక్షణ లోపించింది. కళ్లెదుటే రోగులు ఇబ్బందులు పడుతున్నా.. ఏ ఒక్కరిలోనూ మానవత్వం కనిపించని పరిస్థితి. ఇక్కడ జరిగేదంతా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో రోగులు, సహాయకులకు నిత్య నరకం తప్పడం లేదు. రోగులకు ఎలాంటి అవసరమొచ్చినా, సహాయకులే దగ్గరుండి చూసుకోవాల్సిన దుస్థితి. రక్త పరీక్షలు, స్కానింగ్లు.. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే స్ట్రెచ్చర్ను కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి సిబ్బంది ఓ చేయి వేయాలంటే ఆ చేతిని తడిపితేనే స్ట్రెచ్చర్ కదులుతుంది. ఈ ‘పైసా’చికం ఆసుపత్రి అధికారులకు తెలియనిది కాదు, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం రోగులకు శాపంగా మారుతోంది. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసు శాఖ జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేసింది. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. జనవరి నుంచి మార్చి 12వ తేదీ వరకు రెండున్నర నెలల్లో 1,666 మంది మద్యం సేవించి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని ఎస్పీ సూచించారు. -
బాధాకరం
మేం 2023లో పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనలో 4.80 ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అదే ఏడాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వెబ్ల్యాండ్తో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా మా పేరుమీదనే భూమి ఉంది. 2025 జూలై నెలలోనే రాతనలో గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలసి పాసుపుస్తకం తదితర అన్ని వివరాలు ఇచ్చాం. అయితే అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. నిజమైన రైతులకు సాయం దక్కకపోవడం బాధాకరం. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కనీసం అన్నదాత సుఖీభవ కింద చేయూత కూడా దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – తెలుగు వెంకటస్వామి, జి.సింగవరం, కర్నూలు మండలం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నా మూడు విడతలుగా ఆర్థిక సాయం అందలేదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందింది. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడ లేదు. ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. – బడేసాహెబ్ రైతు, డీ కోటకొండ గ్రామం, ఆస్పరి మండలం అప్పులు పెరిగాయి నాకు సొంత భూమి లేదు. ఐదేళ్లుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రెండేళ్లుగా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ అని పేర్లు పెట్టారు. ఎలాంటి ఫలితం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి అని అడిగితే అధికారులు వస్తుంది... వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. – రాజశేఖర్, కౌలు రైతు, పచ్చారపల్లి గ్రామం, హాలహర్వి మండలం నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పథకం కింద వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సకాలంలో డబ్బులు పడేవి. విత్తనాలు, ఎరువులు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా వేయకపోవడం దారుణం. – మారెప్ప, రైతు, నిట్రవట్టి, హాలహర్వి మండలం -
జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేద్దాం
కర్నూలు: ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని కేసులను పరిష్కరించి విజయవంతం చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో 17 బెంచీలతో కేసుల పరిష్కారం చేయాలని నిర్ణయించామన్నారు. లోక్అదాలత్లో పరిష్కా రం జరిగిన కేసుల్లో అప్పీల్ సమస్య ఉండదని, లోక్ అదాలత్ ఉత్తర్వు తుది ఆదేశాలన్నారు. కక్షిదారులు తమ అపరిష్కృత కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సహాయకులు, టైపిస్టు పోస్టులను కారుణ్య నియామకాల కింద అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీ చైర్మన్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోరుకున్న ప్రదేశాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కార్యాలయాల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉంటూ మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు. జూనియర్ అసిస్టెంట్లు: ఎ.వినయ్రాజు(పీఆర్ఐ సబ్ డివిజన్, నంద్యాల), టి. రంగస్వామి(జెడ్పీహెచ్ఎస్, రామళ్లకోట), పి.శ్రీచందన(జెడ్పీహెచ్ఎస్, హుసేనాపురం), వై.వైష్ణవి(జెడ్పీహెచ్ఎస్, కోవెలకుంట్ల), హెచ్.అశ్వథ్బాషా(జెడ్పీహెచ్ఎస్ దీబగుంట్ల). టైపిస్టులు: బి.జ్ఞాన సందీప్(ఎంపీపీ, వెల్దుర్తి), ఎం.అజయ్ డానియల్ ప్రకాష్(ఎంపీపీ, మంత్రాలయం), ఎల్.ఫాతిమాబేగం(పీఆర్ క్యూసీ పీఆర్ సబ్ డివిజన్, కర్నూలు). -
సీసీఆర్సీ కార్డు ఉన్నా ఫలితం లేదు
మాకు సొంతంగా సెంటు భూము లేదు. దేవాలయ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నాం. 2025–26 సంవత్సరానికి 5.90 ఎకరాలకు సీసీఆర్సీ కార్డును ప్రభు త్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. మొదటి, రెండవ విడతల్లో రాలేదు. మూడవ విడత లో కౌలుదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగనప్పుడు ఇక సీసీఆర్సీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నట్లు. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం -
‘కౌలు’కోలేని మోసం!
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవతో అర్హులకు న్యాయం చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇది వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలు, పీఎం కిసాన్ కింద రూ.4వేల ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ నుంచి కౌలుదారులను పక్కన పెట్టారు. మూడవ విడతలో న్యాయం జరుగుతుందని అధికారులు కౌలుదారులను నమ్మించారు. అయితే ఇప్పుడు కూడా కౌలుదారులతో పాటు అర్హులైన పట్టా రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. కౌలుదారులను నట్టేట ముంచిన చంద్రబాబు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీసీఆర్సీ పత్రాలు పొందిన సాగుదారులకు అన్నివిధాల న్యాయం చేసింది. పెట్టుబడి సాయంగా రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కౌలుదారులతో పాటు ఆర్వోఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి పూర్తి మొత్తాన్ని చెల్లించి అండగా నిలిచింది. ఇలా 28,600 మంది సాగుదారులకు వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలుదారులకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా 24,793 మంది సాగుదారులకు కార్డులు జారీ అయ్యాయి. అయితే అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందించలేకపోవడం గమనార్హం. 21,841 మందికి అన్నదాత సుఖీభవ ఎగనామం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం 2,72,757 మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. వైఎసార్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ 21,841 మంది రైతులకు తీరని అన్యాయం చేసింది. కౌలుదారులతో పాటు భూ యజమానులకు అన్యాయం జిల్లాలో 2025–26లో 24,793 సీసీఆర్సీ కార్డులు జారీ ఒక్క కౌలుదారుకూ అందని సాయం చుక్కల భూముల పేరిట అర్హులకు ఎగనామం -
యుద్ధ భయంతో నష్టాలు
వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో ధరలు ఉంటేనే రాణించగలం. ఉన్నట్టుండి యుద్ధం రావడంతో తమిళనాడులోని నమ్మకల్ జోన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గుడ్లు పెద్ద ఎత్తున డంప్ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోకి కూడా గుడ్ల సరఫరా పెరిగింది. ఫలితంగా ఇక్కడ ఉత్పత్తి అయిన గుడ్లకు ధర తగ్గిపోతోంది. యుద్ధానికి ముందుకు 100 గుడ్ల ధర రూ.600 ఉండగా.. నేడు రూ.420 మించని పరిస్థితి. దళారీలకు ధరలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు మూటకట్టుకుంటున్నాం. – వెంకటేష్, గుడ్ల ఉత్పత్తి రైతు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం -
బియ్యంపై యుద్ధ ప్రభావం
గల్ఫ్ దేశాల్లో కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ అధికం. కర్నూలు సోనా బియ్యం గల్ఫ్ దేశాలతో పాటు యురోపియన్ కంట్రీస్కు కూడా ఎగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా బియ్యం ఎగుమతులు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు సోనా ప్రధాన ఆహార పంట. విదేశాలకు ఎగుమతులు ఉండటం వల్ల కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్లో మార్పులు లేకపోయినప్పటికీ యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. -
గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): గ్లకోమా పట్ల అప్రమత్తతతో చూపును కాపాడుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. బుధవారం ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుంచి రాజ్విహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆసుపత్రి హెచ్ఓడీ డాక్టర్ యుగంధర్రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిణి డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకర అలవాట్లు అలవర్చుకోవాలి
కర్నూలు(హాస్పిటల్): కిడ్నీ వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్విహార్ సెంటర్ వరకు కొనసాగి తిరిగి ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వరకు సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన చికిత్సలు, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ అనంత్, డాక్టర్లు పీఎల్.వెంకట పక్కిరెడ్డి, శ్రీధరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్లో ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఆటోమేషన్’తో ఇంటి నుంచే డ్రిప్ నిర్వహణ కర్నూలు(అగ్రికల్చర్): బిందు సేద్యం పొందిన రైతులకు సబ్సిడీపై ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సన్న, చిన్నకారు రైతులకు 55 శాతం, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. జిల్లాలో మొదటిసారి క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఆటోమేషన్ యూనిట్ను అమర్చే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆటోమేషన్ పనితీరు, ప్రోగ్రామింగ్పై రైతులకు శిక్షణనిచ్చారు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంట్లో నుంచే చరవాణి ద్వారా ఆపరేట్ చేయవచ్చని ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. ఇందువల్ల రైతులకు సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ ఫిరోజ్ఖాన్, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు. -
హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు
● 110 డొమెస్టిక్, 30 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై బుధవారం జిల్లా సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అఽధికారి ఎం. రాజారఘువీర్ మాట్లాడుతూ అయిల్ కంపెనీల్లు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాడుకుంటున్నట్లు సమాచారం రావటంతో డాదులు చేశామన్నారు. మొత్తం 90 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంటి అవసరాల కోసం తీసుకున్న సిలిండర్లను అనధికారికంగా హోటళ్లకు వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే చర్యలుంటాయన్నారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను పొదుపుగా ఉపయోగించుకోవాలని, సింగిల్ సిలిండర్ ఉన్నవారు బుకింగ్ 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి బుకింగ్కు 31 రోజులకు చేసుకోవాలన్నారు. కాగా సిలిండర్లను సీజ్ చేసి యజమానులపై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏఎస్వో వెంకటరాజు, డిప్యూటీ తహసీల్దార్లు రుద్రగౌడ్, షహనీషా, నవీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్రెడ్డి, వెంకటేశ్వర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
టమాటా ధర పతనం
దేవనకొండ: టమాటా ధర పతనం కావడంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కిలో టమాటా బహిరంగ మార్కెట్లో రూ.20 ఉండగా, రైతుల దగ్గర మాత్రం వ్యాపారులు కేవలం కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కనీసం తెంపిన కూలీ ఖర్చులు కూడా రాక రైతులు టమాటాను తెంచకుండానే పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టమాటా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్యాస్ కొరత ఆసరాగా సైబర్ మోసాలు: ఎస్పీ కర్నూలు: ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.. వెంటనే బుకింగ్ చేసుకోండి.. అంటూ తప్పుడు సందేశాలు పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్లు, నకిలీ లింకుల ద్వారా గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ బుకింగ్, ప్రత్యేక డిస్కౌంట్ల పేరుతో మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్కు అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్లు లేదా అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే సైబర్ క్రైం హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిశీలన కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీ యుపీహెచ్సీలో నిర్వహిస్తున్న హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం డీఐఓ డాక్టర్ ఉమ పరిశీలించారు. వ్యాక్సిన్ స్టాక్ స్టేటస్ను తెలుసుకున్నారు. అక్కడి నుంచి అరోరా నగర్ సచివాలయం సందర్శించి రెగ్యులర్ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఇంటింటి సర్వే చేసి, 14 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను గుర్తించి యుపీహెచ్సీలలో వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. ఆమె వెంట హెచ్ఈఈఓ బాబా ఫకృద్దీన్, సిబ్బంది ఉన్నారు. 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ సీజన్కు సంబంధించి పంటల నమోదు ప్రక్రియ ముగిసింది. రైతు సేవా కేంద్రాల వారీగా పంటల నమోదు వివరాలను రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఈ వివరాలను పరిశీలించి పంటల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఆర్ఎస్కేల్లో రాత పూర్వకంగా చెప్పవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలకు గురువారం ఒక్క రోజే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15 వరకు పంటల నమోదుపై సోషల్ ఆడిట్ కొనసాగుతుందన్నారు. పంటల నమోదుకు ఈ–కేవైసీ తప్పనిసరి అని, బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. రబీలో సాధారణ సాగు 1.07 లక్షల హెక్టార్లు ఉండగా.. 1,75,711 హెక్టార్లలో పంటలు సాగయ్యాయన్నారు. -
విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రజాస్వామ్య వేదిక
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్రజాస్వామ్య వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవపూజ ధనుంజయ ఆచారి, ఎన్ శాంతికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బీసీ భవన్లో విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విశ్వ బ్రాహ్మణ, కుల వృత్తి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, కానిపాకం వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ కులంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులను గుర్తించలేని స్థితి ఉందన్నారు. 2024 ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హామీలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు గిడ్డయ్య ఆచారి, రమేష్ ఆచారి, తిమ్మయ్య ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, ప్రణదీప్ ఆచారి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టౌన్ప్లానింగ్లో ఏసీబీ తనిఖీలు
కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్), ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్) పథకాలకు అనుమతి ఇవ్వడంతో కర్నూలు నగరంలో వేల సంఖ్యలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్లైన్లో క్లియర్ చేసేందుకు టౌన్ప్లానింగ్ అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు, చైన్మెన్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్) బాండ్ల జారీ, భవన నిర్మాణాల అనుమతులు, నిర్మాణాల్లో అదనపు అంతస్థుల ఫిర్యాదుల్లో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్కెట్ వాల్యులో అవకతవకలకు పాల్పడి టీడీఆర్ బాండ్లు చేసినట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, శ్రీనివాస్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ప్లానింగ్ విభాగంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల టౌన్ ప్లానింగ్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అప్రూవల్స్ అనుమతులు, టీడీఆర్ల జారీలపై దృష్టి సారించి రికార్డులను పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. మొత్తం ఈ విభాగంలో 15 మంది ఉద్యోగులను విచారించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ ఎస్ఐ సుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు కార్యాలయంలో తిష్ట వేసి రికార్డులను పరిశీలించారు. సోదాల్లో ఉద్యోగుల నుంచి రూ.లక్ష వరకు నగదు లభించినట్లు సమాచారం. -
రక్షకుడు..వీరభద్రుడు!
ఇల కై లాసంగా పిలువబడే శ్రీశైలంలో ఏటా ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ వెలసిన భ్రమరాంబా దేవిని తమ ఆడబిడ్డగా భావించి దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, వీరు తమ ఆడబిడ్డ కంటే ముందే నాగలూటి వీరభద్రస్వామిని దర్శించుకుని తొలిమొక్కు చెల్లించుకుంటారు. ఎందుకిలా అంటే వీరభద్ర స్వామిని తమ రక్షకుడిగా కొలుస్తామని చెబుతారు. నేటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఆత్మకూరు: మూడు దశాబాల క్రితం శ్రీశైలానికి సరైన రవాణా మార్గం ఉండేది కాదు. శ్రీశైలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన వెళ్లేవారు. ఎండావాన, కొండాకోన, రాళ్లురప్ప అని చూడకుండా శివనామస్మరణ చేస్తూ నల్లమల అడవి గుండా శ్రీగిరికి చేరుకునేవారు. అయితే, ఈక్రమంలో తమకు మార్గమధ్యంలో ఎలాంటి అవరోధం కలగకుండా సురక్షితంగా క్షేత్రానికి చేర్చాలని నల్లమల కొండ అంచున ఉన్న నాగలూటిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ముందుకు సాగుతారు. ఇలా చేస్తే తమ ప్రయాణం సాఫీగా సాగుతుందని వారి నమ్మకం. కాలినడకన వెళ్లే భక్తులు నేటికీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉగాది మహోత్సవాల సందర్భంగా తొలిమొక్కు చెల్లించుకునే వారితో వీరభద్రస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఈ స్వామిని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులే కాకుండా కాలినడకన వెళ్లే ప్రతి ఒక్కరు శరభ, శరభ, భద్ర..భద్ర అంటూ స్మరించుకుంటూ దట్టమైన నల్లమల అడవి గుండా ఇల కై లాసానికి చేరుకుంటున్నారు. నాగలూటి వీరభద్రస్వామిపై భక్తుల నమ్మకం మల్లన్న కంటే ముందే తొలి పూజ నేటికి కొనసాగిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు మా ఆడపడుచు శ్రీ భ్రమరాంబాను దర్శించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే వీరభద్రస్వామిని స్మరించుకుని తొలి అడుగు వేస్తాం. నాగలూటిని చేరుకోగానే స్వామిని కనులారా దర్శించి మొక్కులు చెల్లిస్తాం. రవాణా మార్గాలు లేని కాలంలో మా పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారు. స్వామిని మేము రక్షకుడిగా భావిస్తాం. – శ్రీమత్గారి గౌర, ముద్దాపూర్, బాగలకోటె జిల్లా, కర్ణాటక రాష్ట్రం మా ఇంటి ఇలవేల్పు శ్రీ వీరభద్రస్వామి. యేటా కర్ణాటక రాష్ట్రం నుంచి బయలుదేరి నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రానికి చేరుకుంటాం. ఇంటి నుంచి తెచ్చుకున్న టెంకాయలు, పూజా సామగ్రిని స్వామికి సమర్పిస్తాం. అనుక్షణం మమ్మల్ని కాపాడి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసేలా చూడాలని కోరుకుంటాం. తొలి పూజ చేయకుండా శ్రీశైలానికి వెళ్లం. ఇది మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయం. – గుండయ్య, బళ్లారి పట్టణం, కర్ణాటక రాష్ట్రం -
మల్లన్నను దర్శించుకున్న సీబీఐ డైరెక్టర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సీబీఐ డైరెక్టర్(న్యూ ఢిల్లీ) ప్రవీణ్ సూద్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఆమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని, జ్ఞాపికను అందించి సత్కరించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ కర్నూలు(సెంట్రల్): రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ కావడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ఓటీపీలు సమయానికి రాకపోవడంతో వినియోగదారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు స్లాట్బుకింగ్ సమయం మించిపోతే ఇబ్బందులు పడతామని క్రయ, విక్రయదారులు తీవ్ర ఆందోళన చెందారు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ నెమ్మదించినట్లు తెలుస్తోంది. చింతకాయల కోసం వెళ్లి రైతు మృతి శిరివెళ్ల: చింతకాయల కోసం వెళ్లిన ఓ రైతు కింద పడి మృతి చెందాడు. మంగళవారం యర్రగుంట్లలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్లకు చెందిన శిరిగిరి ప్రతాపరెడ్డి ( 35 ) చింతకాయల కోసం స్థానిక దర్గా వద్ద ఉన్న చింత చెట్టు వద్దకువెళ్లాడు. చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్య రాజేశ్వరి సోమ్మసిల్లి పడిపోయింది. కుటుంబాన్నికి పెద్ద దిక్కయిన రైతు మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. గోనెగండ్ల : మండలంలోని అలువాల గ్రామంలో భీరప్ప స్వామి దేవర ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భీరప్ప స్వా మికి భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటి నుంచి గురువు బసవరాజు, పూజారి మల్లయ్య, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పటం ఎక్కే కార్యక్రమం నిర్వహించారు. కురువ కులస్తులు వివాహం చేసుకోవాలంటే గుడి కట్ట సభ్యులకు పటం ఎక్కే కార్యక్రమం తప్పనిసరి కావడంతో కార్యక్రమానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఉత్సవాలను తిలకించడానికి వివిధ గ్రామాల కురువ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను తిలకించారు. దేవర ఉత్స వాల సందర్భంగా నిర్వహించిన గొరవయ్యల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మిగనూరులో పాలిసెట్ పరీక్షా కేంద్రాలు ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ చిన్నపురెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పాలిసెట్ ఎంట్రెన్స్ ఆదోని పట్టణంలో ఒక్కటే నిర్వహించేవారని చెప్పారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2026 నుంచి పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షా కేంద్రాలను ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడుపై పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చునన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగలకు రెండేళ్లు జైలు శిక్ష
కృష్ణగిరి/కర్నూలు(టౌన్): చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలకు జైలుశిక్షపడింది. వెల్దుర్తి సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ జి. కృష్ణమూర్తి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బిజ్నోపూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్లు పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. సికింద్రాబాద్లో స్థిరపడి వెండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే రాజస్థాన్ను చెందిన ప్రవీణ్ ఆర్ రావల్ వ్యాపార నిమిత్తం గతేడాది అక్టోబర్ 26న హైదరాబాద్ నుంచి రూ. 25 లక్షల నగదుతో బస్సులో గుత్తికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో అమకతాడు టోల్ప్లాజా వద్ద డబ్బు సంచిని చూసుకుంటే కనిపించలేదు. వెంటనే సమీపంలోని కృష్ణగిరి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరుసటి రోజు (అక్టోబర్ 27న) కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామ సమీపంలో ఉన్న వెంగనబావి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీని అంగీకరించడంతో రిమాండ్కు పంపారు. మంగళవారం ఆ ఇద్దరు దొంగలకు డోన్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. జ్యోతి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముద్దాయిలకు శిక్ష పడడంలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్రావు, పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
మహిళ దుర్మరణం
కర్నూలు (సిటీ): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పంచలింగాలకు చెందిన ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి స్పల్పగాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఉండవల్లి సమీపంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బస్తిపాటి నాగరాజు చిన్న కుమారుడు నాగరాజు వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి మండలం కంచిపాడులో జమ్ములమ్మ దర్శనం నిమిత్తం స్వగ్రామం పంచలింగాల నుంచి కారులో బయలుదేరారు. ఉండవల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బైక్ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోగా అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో మనెమ్మ (60) అనే మహిళ మృతిచెందగా మద్దిలేటి, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు ఎంపీకి స్వయాన చిన్నమ్మ. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ ప్రమాద విషయం తెలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. -
భక్తుల సేవలో..
నందికొట్కూరు: శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న భక్తులకు వివిధ వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మార్గ మధ్యంలో తమ వంతు సేవలు అందిస్తున్నారు. నందికొట్కూరు పట్టణ సమీపంలో జమ్మిచెట్టు వద్ద ఇన్ట్యాచ్ నంద్యాల చాప్టర్ కన్వీనర్ శివకుమార్రెడ్డి, మన ఊరు– మనగుడి మన బాధ్యత అధ్యక్షుడు రఘువీర్ ఆధ్వర్యంలో పోలూరు జీవన్జ్యోతి ఓకేషనల్ జూనియర్ కళాశాల సిస్టర్ స్వరూపరాణి, విద్యార్థులు కేరళ తరహాలో ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. అలాగే పట్టణ శివారులో కొందరు అన్నదానం, మరికొందరు మజ్జిగ, కలింగరపండ్లు, మంచినీళ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ సంవత్సరం ఏప్రిల్ 7న మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కొబ్బరికాయల సమర్పణలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తి పూర్వక అడుగులు
శివయ్య పిలుస్తున్నాడు.. శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తులుఇల కై లాసమైన శ్రీగిరి వైపు కన్నడిగుల భక్తి పూర్వక అడుగులు పడుతున్నాయి. వందల కి.మీ దూరం.. మండే ఎండలతో సెగలు కక్కే రోడ్లపై పాదయాత్రగా శివయ్య భక్తులు తరలి వస్తున్నారు. కొందరు భుజాన బసవన్న కావడీలు.. మరి కొందరు నెత్తిన మల్లన్న అపురూప ప్రతిమలు.. కాషాయ పతాకాలు చేతపట్టి.. కాళ్లకు ఎత్తైన కర్రలు కట్టుకుని నడక సాగిస్తున్నారు. దారి పొడవునా శివయ్య చిత్ర దుస్తులు ధరించిన భక్తులు భజనలు చేసుకుంటూ.. మల్లన్న పాటలు పాడుకుంటూ నల్లమల వైపు వెళ్తున్నారు. కర్ణాటక ప్రాంత భక్తులు శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు భారీగా పాదయాత్రగా తరలివెళ్తున్నారు. కర్నూలు – ఆత్మకూరు రహదారి వెంట కన్నడిగులు వరుస కట్టి వడివడిగా అడుగులు వేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుహనుమాన్ జెండా పట్టుకొని..శివయ్యపై భక్తితో... -
మహిళా సాధికారతకు దోహదపడాలి
కర్నూలు(అర్బన్): మహిళల పనుల్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచి మహిళా సాధికారతకు దోహదపడాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాన్ని తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 10వ రోజు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో మెన్ కుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పురుషులు వంట వండటం వినూత్నంగా, ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో డీసీపీఓ టి.శారద, సీనియర్ సహాయకులు సురేష్రెడ్డి, సతీష్, ఈఓ రాజేశ్వరి, డీసీ బాలు, వన్స్టాప్ సెంటర్ మేరీ స్వర్ణలత, జూనియర్ సహాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వెలవెలబోతున్న ఆప్కో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో కూడా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మినహా మిగిలిన వాటి పనితీరు అంతంతమాత్రమే. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆ సంఘమే మార్కెటింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాల మార్కెటింగ్కు ఆప్కోనే ఆధారం. రెండేళ్లుగా జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపని పరిస్థితి. రెండేళ్లుగా మంగళగిరిలోని ఆప్కో గోదాము నుంచి కొత్త సరుకు రాకపోవడంతో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఆప్కో గోదాము మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొత్త సరుకు రాకపోగా ఉన్నది పాతబడిపోయింది. పాత సరుకు కొనేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో మూటకట్టి మంగళగిరి గోదాముకు పంపుతున్నారు. -
క్వింటా వేరుశనగ రూ.8,550
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.8,550 పలికింది. 3,075 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు మార్కెట్లో విక్రయానికి తెచ్చినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ.3,891, మధ్యస్థ ధర రూ.7,780 పలికిందన్నారు. ● ఆముదాలు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,611, మధ్యస్థ ధర క్వింటా రూ.5,763, గరిష్ట ధర రూ.5,774 నమోదైందన్నారు. ● కందులు 8క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా కనిష్ట ధర రూ.4,212, మద్యస్థ ధర రూ.6,420, గరిష్ట ధర రూ.7,011.. మినుములు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా రూ.6,670 గరిష్ట ధర పలికిందన్నారు. -
రైతులకు విరివిగా రుణాలివ్వాలి
కర్నూలు(సెంట్రల్): అన్నదాతలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసీ బ్యాంకర్లతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని, పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న డిజిటల్ పేమెంట్స్ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆర్బీఐ రూపొందించిన డిజిటల్ లావాదేవీల పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ బ్యాంకు ఆఫీసర్ రామకృష్ణ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు డివిజినల్ మేనేజర్ గౌతమ్, సీబీఆర్ ఎస్ఈటీఐ డైరెక్టర్ పుష్పకుమార్, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
43 చేనేత సహకార సంఘాల్లో మిగిలింది ఏడు
● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆప్కో షోరూము మూత ● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెరుచుకోని రెండు షోరూములు ● చేనేత వస్త్రాల ఉత్పత్తి లేక అంధకారంలో ఆప్కో ● ఉగాది ముంగిట వెలవెలబోతున్న ఆప్కో షోరూములు ● రెండేళ్లుగా కొత్త స్టాక్ సరఫరాలో చేతులెత్తేసిన వైనం ● కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మూతపడిన ఆప్కో గోదాము ● ఐదు నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఇక్కట్లు ● చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణలోనూ వైఫల్యంకర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్కో దివాళా దిశగా పయనిస్తోంది. ఏడాదికొకటి చొప్పున ఆప్కో షోరూములు మూతపడుతున్నాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సాహం కరువైంది. చేనేత సహకార సంఘాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కోలో చీకటి రాజ్యమేలుతోంది. దసరా, ఉగాది హిందువులకు అతి పెద్ద పండగలు. ఈ సారి ఉగాదితో పాటే రంజాన్ కలసి వచ్చింది. అయితే ఆప్కో షోరూములు మాత్రం వెలవెలబోతున్నాయి. హుందాతనానికి, మన్నికకు చేనేత వస్త్రాలు పెట్టింది పేరు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు చేనేత, ఆప్కో మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షోరూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రత్యేక స్కీమ్ల ద్వారా ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం విశేషం. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని షోరూములకు సరఫరా చేయడం జరిగింది. పండుగలకు నెల రోజుల ముందే కొత్త డిజైన్లతో ఆప్కో షోరూములు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఇటు చేనేత, అటు ఆప్కోలో నిస్తేజం నెలకొంది. మూతపడుతున్న షోరూమ్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో షోరూములు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే కర్నూలు పాత బస్టాండులోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఉన్న ఆప్కో షోరూము మూత పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఆప్కోపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించినట్లు సమాచారం. తాజాగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చేనేత బజారులో ఉన్న ఆప్కో షోరూము మూతపడటం ఆందోళన కలిగించే విషయం. కలెక్టరేట్కు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 35 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని ఆప్కో షోరూము మూతపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. -
రిజిస్ట్రేషన్లలో సందేహాలను తీర్చండి
● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి విన్నవించిన క్రెడాయ్కర్నూలు(సెంట్రల్): ప్లాట్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు సమయంలో సబ్ రిజిస్ట్రార్లు వ్యక్తం చేసే చిన్న చిన్న సందేహాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని, వాటికి సరైన పరిష్కారం చూపాలని క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల కోరారు. మంగళవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్ బజారిని వారి కార్యాలయాల్లో క్రెడాయ్ ప్రతినిధులు కలసి సందేహాల నివృత్తి కోసం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్లు, సబ్ డివిజన్లపై వ్యక్తమవుతున్న సందేహాలతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈసీలు రావడానికి ఎక్కువ సమయం పడుతోందని, దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా చూడాలని కోరారు. ఈసీల్లోని చిన్న చిన్న తప్పులు వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేఅవుట్ విధానంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు జే.సురేష్కుమార్రెడ్డి, పి.గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
నగరపాలక ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి నియమితులయ్యారు. ఈనెల 17న కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కలెక్టర్ను నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జీవో 284 జారీ చేశారు. అలాగే కర్నూలు కార్పొరేషన్లో కమిషనర్గా పనిచేస్తున్న పి.విశ్వనాథ్ను ప్రభుత్వం నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆర్ఐఓ జి.లాలెప్ప తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పరీక్షలు నిర్వహించగా 20,731 మంది విద్యార్థుల్లో 20,205 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ నెల 17న ఫస్ట్ ఇయర్, 18వ తేదీకి సెకండియర్ పరీక్షలు ముగియనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్కృతం సబ్జెక్టు మూల్యాంకనం కొనసాగుతోంది. 20వ తేదీ తరువాత ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు ఇంట ర్మీడియెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యం కర్నూలు(టౌన్): భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యమ ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపా రు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు ఓవర్లోడ్తో ప్రయాణించకూడదన్నారు. అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. వాహనాల్లో వంట గ్యాస్ సిలిండర్లు రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా, లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. 14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోట్ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమ కు కేటాయించిన సమయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు. మైనారిటీ బాలికల గురుకులంలో ప్రవేశాలు కర్నూలు(అర్బన్): పంచలింగాల గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశానికి అర్హులైన మైనారిటీ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ భారతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 31లోగా https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వివరాలకు 8712625070 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు పీఎస్. రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.నిర్మల డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ల పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెం.124ను అమలు చేయాలని కోరారు. మదర్ డిపార్ట్మెంట్ అయిన మెడికల్ అండ్ హెల్త్కు హెల్త్ సెక్రటరీలను బదలాయించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో హెల్త్ సెక్రటరీలకు ఇంక్రిమెంట్ అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పీ–4 సర్వే, మున్సిపల్ తదితర సర్వేలపై సర్వే పేరుతో సతమతమవుతున్నారని, వారిని మారుమూల గ్రామాలకు రాత్రి 10 గంటల వరకు తిప్పుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏఓ అరుణకు వారు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ న్యూసిటీ కమిటీ అధ్యక్షులు వై.నాగేష్, హెల్త్ సెక్రటరి యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, నంద్యాల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, మాధవి, శంషాద్, సుజాత, రాధాబాయి, నాగమణి, రజని, వరలక్ష్మిదేవి పాల్గొన్నారు. -
హంస వాహనంపై రంగనాథస్వామి
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీరంగనాథస్వామి సోమవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా స్థానిక బావి వద్దకు తీసుకెళ్లి వసంతోత్సవం జరిపారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుంచారు. దేవాలయ ఆవరణలో పల్లకీ సేవ చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ ఈఓ రెబ్బావీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, సభ్యులు రామయ్య, నరసింహులు, రంగస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలి
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, రుచి ఏ విధంగా ఉందనే విషయాలను తనిఖీ చేయాలన్నారు. హౌసింగ్కి సంబంధించి ఆప్షన్–3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 1,521 ఇళ్ల నిర్మాణాల లోపాలను సరిచేయడం జరిగిందని, మిగిలిన 1001 వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్కి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా వర్గీకరణ మార్పు (క్లాసిఫికేషన్ ఛేంజ్), నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇనామ్ భూములకు సంబంధించి వాటివి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్కి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం ఘాట్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు. కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పాము కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు. కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీని అమలు చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయని నేపథ్యంలో ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
ఆర్యూ విద్యార్థుల భిక్షాటన
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, పీడీఎస్యూ, ఆర్పీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐఎస్ఏఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖజానాకు కన్నం వేస్తున్న రిజిస్ట్రార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. రిజిస్ట్రార్పై పలుమార్లు వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసినా విచారణకు స్పందించకపోవడం, తొలగించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు హరిష్, రాజు, ఏఐఎస్ఏ నాయకులు రాము, ఆర్పీఎస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి!
శిశిర రుతువు రాకతో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ ఆకుల వలువలను నేలరాల్చి నిలుచున్న వృక్షాలు నల్లమలలో పసిపిల్లలను తలపిస్తుంటాయి. అలాంటి చెట్ల సమూహంలో మోదుగ చెట్లు మరింత విశిష్టంగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిన మోదుగ చెట్లు ఆకుల స్థానంలో ఎర్రటి మొగ్గలు పూస్తాయి. అవి విచ్చుకుని అడవి తల్లికి కొత్త అందాలను అద్దుతాయి. అందుకే వీటిని అగ్ని పూలు అని, మంకెన పూలు అని పిలుస్తూ కవితలు రాస్తుంటారు. ఆంగ్లంలో ఈ పూలను ఫ్లేమ్ ఆఫ్ది ఫారెస్ట్గా పిలుస్తారు. జనవరి చివరి వారం నుంచి మోదుగ పూలు పూస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల వ్యాప్తంగా మోదుగ పూలు విస్తారంగా కనపడుతున్నాయి. తొలకరి పలకరించే వేల మోదుగ మోడులు చిగురులు తొడుగుతాయి. – ఆత్మకూరు రూరల్ -
ఘనంగా శివపార్వతులకు పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి తదితర భక్తులు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. హాస్టల్ లైబ్రరీకి పుస్తకాల వితరణ కర్నూలు (అర్బన్): నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల నెం.1 వసతి గృహంలోని లైబ్రరీకి పంచాయతీరాజ్ డీఈఈ, ఏపీఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పి.మల్లికార్జున, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చినట్లు వసతి గృహ సంక్షేమాధికారిణి బి.బెన్నమ్మ తెలిపారు. సోమవారం స్థానిక హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులుగా కూడా ఆయన పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని తెలిపారు. దాతల నుంచి కళాశాల విద్యార్థినులకు అవసరమైన పుస్తకాలను సేకరించి హాస్టల్ లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీని హాస్టల్లోని విద్యార్థినులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని బెన్నమ్మ తెలిపారు. -
కదలని ఆర్టీసీ బస్సు
కదలని ఆర్టీసీ బస్సును డ్రైవర్లు, కండక్టర్లు నెట్టుతున్న ఈ దృశ్యం సోమవారం కోసిగి ఆర్టీసీ బస్టాండ్లో కనిపించింది. కోసిగి నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. అయితే బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో కండక్టర్, మరో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వెనుక నుంచి తోయాల్సి వచ్చింది. ఇలాంటి బస్సులు కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో కూడా నిలిచి పోతున్నాయని, కండీషన్లో ఉండేవి నడపాలని ప్రయాణికులు కోరారు. – కోసిగి -
ఆస్తి కోసం భర్త వేధిస్తున్నాడు.. న్యాయం చేయండి
● ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదుకర్నూలు: ‘మేమిద్దరం పదేళ్లుగా దూరంగా ఉంటున్నాం... నా పేరు మీద గూడూరులో ఉన్న ప్రైవేటు స్కూల్ను భర్త రమేష్ ఆక్రమించుకోవాలని నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఆస్తి, చెక్బౌన్స్ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాడు’ అని కర్నూలుకు చెందిన రాధిక ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ శివశంకర్, తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● విద్యాంజలి పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని కర్నూలు బీక్యాంప్కు చెందిన అహ్మదున్నీసా ఫిర్యాదు చేశారు. ● బెంగళూరులోని డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోని పట్టణానికి చెందిన నరేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ● పెద్ద కుమారుడు తన బాగోగులు పట్టించుకోకుండా ఆరోగ్యపరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. ● భర్త గుండెపోటుతో మృతిచెందారని, ఆయన పేరు మీద వచ్చిన జీవిత బీమా (ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. -
హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి!
● బాబు పర్యటన అలా ముగిసింది..డోన్: మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’లో భాగంగా చేపట్టిన పర్యటన ఆద్యంతం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చానని పేర్కొంటూనే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందనేది మాత్రం చంద్రబాబు చెప్పలేకపోయారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే డోన్ నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, గత ప్రభుత్వం వ్యవస్థల్లో విధ్వంసం సృష్టించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్పితే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన వాటి సంఖ్యను చెప్పకపోవడం గమనార్హం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం, జంతు చర్మాలతో చేసిన చెప్పులతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకున్నారు. టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దుచేస్తానని, భూ రీసర్వేను ఆపివేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అదేవిధానాన్ని కొనసాగించడాన్ని కూడా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. హామీలు తూచ్! సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ను తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని, అవుకు రిజర్వాయర్ నుంచి ప్యాపిలి మండలం కొండ మీది పల్లెలకు సాగునీరు అందజేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల వద్ద భూగర్భ జలాల పెంపునకు అధిక నిధులు విడుదల చేయాలని కోరినా సీఎం చంద్రబాబు స్పందించలేదు. అన్నీ పరిశీలిస్తామని ముక్తసరిగా చెప్పి దాటవేయడం గమనార్హం. జలదుర్గం మండల కేంద్రం ఏర్పాటు అంశాన్ని ఎత్తకపోవడం ప్రజల్లో చర్చకు తావిచ్చింది. బీసీ సర్పంచ్కు అవమానం సభ ప్రారంభమై అరగంట గడిచినా స్థానిక గ్రామ సర్పంచ్ అయిన బీసీ మహిళ ప్రమీలను వేదికపైకి పిలవకపోవడం పట్ల రైతుల్లో ఆగ్రహం కనిపించింది. ఉడుములపాడు సర్పంచ్ ఉప్పరి రాధమ్మ భర్త సర్పంచ్ లేకుండా గ్రామసభ ఎలా జరుపుతారంటూ కేకలు వేస్తూ సర్పంచ్ను పిలవండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ తప్పు తెలుసుకొని సర్పంచ్ ప్రమీలను వేదికపైకి ఆహ్వానించారు. -
గర్భాశయ క్యాన్సర్కు ‘హెచ్పీవీ’ చెక్
కర్నూలు(హాస్పిటల్): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు చెక్పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 14 ఏళ్లు నిండి బాలికలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యు ల వద్దకు వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 30 నుంచి 40 మందికి కీమోథెరపి, 50 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిత్యం 500 మందికి పైగా ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇందులో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు 20 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇకపై మహిళలకు ఈ క్యాన్సర్ రాకుండా చేసేందుకు కేంద్ర ప్ర భుత్వం ముందస్తుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా 14 ఏళ్లు నిండి బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలు 19,704 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. నేటి నుంచి వ్యాక్సినేషన్ జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాణాంతక సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ(మంగళవారం) ఈ వ్యాక్సినేషన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలులో ఎ.క్యాంపులోని మెరిడియన్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే(14వ పుట్టినరోజు జరుపుకుని 15వ పుట్టినరోజుకు ముందున్న) బాలికందరికీ ఈ వ్యాక్సిన్ వేస్తామన్నారు. గార్డిసిల్–4 వ్యాక్సిన్ను 0.5ఎంఎల్ మోతాదులో ఎడమ చేతికి వేస్తారని తెలిపారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్కార్డు, తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. టీకా వేయించుకునే వారు యువిన్ పోర్టల్ లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆహారం తిని రావాలని చెప్పారు. టీకా వేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వివరించారు. అందుబాటులో వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా క్యాన్సర్ బాధితుల్లో 20 శాతం మందికి ఇదే సమస్య జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలు 19,704 అందుబాటులో 13,177 వ్యాక్సిన్లు -
అన్నదాన యజ్ఞానికి అంతా సిద్ధం
● సరంజామాతో తరలివచ్చిన మహారాష్ట్ర బృందంఆత్మకూరురూరల్: ఏ చిన్న వస్తువు కావాలన్నా రోడ్డు పాయింట్కు రావాలంటే ఆరేడు కి.మీ అడవిలో నడవాల్సిందే.. అలాంటి చోట 16 ఏళ్లుగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే కన్నడ పాదయాత్రికుల కోసం అన్నదానం కొనసాగించడం అంటే ఒక యజ్ఞంతో సమానమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్కు చెందిన వలంటీర్లు అన్ని సంబారాలతో సోమవారం నల్లమలకు చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటిలో ఉన్న వీరభద్రాలయం వద్ద వారు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు 24 గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రస్ట్ అధ్యక్షులు మాలగొండ్ల పాటిల్, కార్యదర్శి పాండుతో పాటు 200 మంది స్వచ్ఛంద సేవకులు ఈ అన్నదాన క్రతువులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ ఏడాది భక్తుల కోసం చపాతీలు కూడా అందివ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందుకోసం రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే మిషన్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐదు భారీ లారీల్లో కావలసిన కిరాణ సరుకు కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. -
13న పీఎం కిసాన్ సాయం విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, ఈ ఏడాదికి సంబంధించి మూడవ విడత సా యం ఈ నెల 13న విడుదలవుతుందని డీఏవో సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సమీపంలో ని వ్యవసాయ కార్యాలయం, గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. మల్లన్న సేవలో.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. -
ఘనంగా సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు ఉత్తరాధన వేడుకలు సోమవారం వైభవంగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి చెందిన నలుగురు విద్యార్థులు సుబుధేంద్రతీర్థుల సన్నిధిలో రుగ్వేద సంహిత మంగళాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వేద పాఠశాల విద్యార్థులను ఫల మంత్రాక్షితలతో శ్రీమఠం పీఠాధిపతి ఆశీర్వదించారు. -
వలసల నివారణకు చిన్న తరహా పరిశ్రమలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు (సెంట్రల్): వలసల నివారణకు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో నీతి అయోగ్ నిర్వహించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్కు సంబంధించి ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్లో ‘గ్రీన్ ఆనియన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్’ అనే అంశంపై ప్రెజంటేషన్ ఇచ్చారు. చిప్పగిరి, మద్దికెర, హొళగుంద మండలాల్లో చాలా మంది జీవనోపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. హొళగుంద మండలంలో ఉల్లిపాయకు సంబంధించి గ్రీన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్ చిన్నతరహా పరిశ్రమ స్థాపించామన్నారు. ఈ యూనిట్ వ్యవస్థాపకునితో పాటు ఆరుగురికి ప్రత్యేక ఉపాధిని, వంద మందికి పైగా రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ యూనిట్ స్థాపన ఖర్చు దాదాపు రూ.7.4 లక్షలు కాగా యూనిట్ నుంచి నెలకు స్థూల రాబడికి సంబంధించి రూ.2,88,750, నిర్వహణ ఖర్చు నెలకు రూ.2,10,000 నికర లాభం నెలకు రూ.78,750 ఉంటుందన్నారు. ఈ రకమైన యూనిట్లను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. -
కదల్లేను.. పింఛన్ ఇచ్చి ఆదుకోండి!
● జేసీకి విన్నవించిన దివ్యాంగురాలుకర్నూలు(సెంట్రల్): పక్షపాతం వచ్చి కాళ్లు, చేతులను కదపలేని స్థితిలో ఉన్నానని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ను ఆదోని మండలం సదాపురానికి చెందిన బి.నర్సమ్మ అనే మహిళ వేడుకున్నారు. రెండేళ్లుగా పింఛన్ మంజూరు కాకపోవడంతో అద్దె కారులో ఆమెను సోమవారం కుటుంబ సభ్యులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తీసుకొచ్చారు. అయితే ఆమె దుస్థితిని చూసిన జాయింట్ కలెక్టర్ కారు దగ్గరకే వెళ్లి అర్జీ తీసుకున్నారు. కాగా, ప్రజల ఫిర్యాదులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పరిష్కరించాలని జేసీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సరైన ఎండార్స్మెంట్ ఇస్తేనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని, లేదంటే మళ్లీ అర్జీల రూపంలో వస్తూనే ఉంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
కర్నూలు(సెంట్రల్): కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్కుమార్ ఆదివారం ఉత్వర్వులు ఇచ్చారు. కల్లూరు గ్రామ సర్వే నంబర్ 645ఏ వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా రిజిస్ట్రార్ బజారితో విచారణ జరిపించినట్లు చెప్పారు. ఆయన నివేదిక మేరకు ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తదుపరి పూర్తి నివేదికను కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కల్లూరు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈశ్వర్ను నియమించినట్లు డీఐజీ తెలిపారు. సోమవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. లోన్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): లోన్ యాప్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమానాస్పద లోన్ యాప్లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. లోన్ యాప్లు డౌన్లోడ్ చేసిన తరువాత మొబైల్లో ఉన్న కాంటాక్టులు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం వంటి వివరాలను యాక్సెస్ చేసి తరువాత వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. లోన్ యాప్ మోసాలకు గురైన వారు 1930కు కాల్ చేయాలని, లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, నిధుల వినియోగంపై తనిఖీ చేసేందుకు జిల్లాలో కేంద్రబృందం పర్యటించనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ మండలాల్లో ఉపాధి పనుల తనిఖీ, నిధుల వినియోగం తదితర వాటిని పరిశీలించనుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ కింద జిల్లా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక ఆడిట్ చేసేందుకు ఈ టీమ్ జిల్లాకు వస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి చెందిన స్పెషల్ ఆడిట్ టీమ్ జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తుందని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత తెలిపారు. టీమ్ లీడర్గా డిల్లీ స్పెషల్ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ ఆడిట్ అధికారి(ఏవో) వినిత చౌదరి వ్యవహరించనున్నారు. టీమ్లో ఆడిట్ అధికారులు నీరజ్కుమార్ యాదవ్, కిరణ్మలి సభ్యులుగా ఉంటారు. అప్పటికప్పుడు మండలాలను ఎంపిక చేసుకొని తనిఖీలకు వెళ్లే అవకాశం ఉంది. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర, చెడు నడత, సమస్మాత్మక వ్యక్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు తరచు సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి స్టేషన్లకు పిలిపించి ఎస్హెచ్ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. తరచు గొడవల్లో తలదూర్చే వారిని తీవ్రంగా హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా పోలీస్ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. -
బాధితులను పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే
హేమంత్ మృతదేహాన్ని సమ్మతగేరి గ్రామానికి తీసుకొచ్చారు. చదువులో బాగా రాణిస్తూ సౌమ్యంగా ఉండి ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న హేమంత్ మృతి వార్తతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమ్మతగేరికి వెళ్లారు. తల్లిదండ్రులు అడ్వకేట్ లక్ష్మికాంత్, సరిత, కుటుంబ సభ్యులను పరామర్శించి ౖధైర్యం చెప్పారు. హేమంత్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారివెంట మండల కన్వీనర్ షఫివుల్లా, ఎస్కే గిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి నిరోధకులు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో రాజకీయ వివక్ష చూపించరాదు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. – శ్రీరాములు, రాష్ట్ర మీట్ కార్పొరెషన్ మాజీ చైర్మన్ చంద్రబాబు ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అబివృద్ధి పనులను అడ్డుకోవడం అర్థరహితం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. – మల్యాల విజయ భాస్కర్రెడ్డి, రైతు, మల్యాల గ్రామం -
ఏకగ్రీవ ఎన్నిక
● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీలు ఏర్పాటుకర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యాయి. ఆదివారం కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హాజరై నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బాల సుబ్రమణ్యం, ఎస్ మహబూబ్బాషా (డోన్), ఫైరోజ్ (ఓర్వకల్) వ్యవహరించారు. కర్నూలు జిల్లా కమిటీ.. కర్నూలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు (కర్నూలు సబ్ రిజిస్ట్రార్) జిల్లా అధ్యక్షుడిగా ఎంయూ మురళీ సుందరరావు, ఉపాధ్యక్షులుగా డీ లలితకుమారి, ప్రధాన కార్యదర్శిగా జే ప్రవీణ్కుమార్, జాయింట్ సెక్రటరీగా బీ భవానీ, ట్రెజరర్గా టీ ఈశ్వరయ్య, ఈసీ మెంబర్లుగా ఫైరోజ్, బీ కర్ణ, మూర్తికుమార్, ఉదయ్కుమార్, అనిత, ఎన్ రాధను ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా కమిటీ.. నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎస్ మహబూబ్బాషా (డోన్), జిల్లా అధ్యక్షుడిగా కే శివకుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా కే అబ్దుల్కరీం, జాయింట్ సెక్రటరీగా కే మంజుల, ట్రెజరరీగా ఎం.హుజిమియ్యా, ఈసీ మెంబర్లుగా జే వీఎన్రాజు, ఎన్. మధుబాబు, బీ వసంత, ఎం రాముడు, ఎన్ నీలమ్మ, ఎల్,వీరన్న, పీ జయవాణిని ఎన్నుకున్నారు. -
ఆడ పిల్లలను చదివించాలి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): మహిళా శక్తి అపారమని, ఆడ పిల్లలను చదివిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని జిలా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. తాను మహిళగా పుట్టినందుకు గర్వ పడుతున్నానని, అనేక ఆటుపోటులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తున్నానని చెప్పారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలతో ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపి వేయించడం తదన్నారు. తాను కలెక్టర్గా వచ్చిన తరువాత 8 నెలల కాలంలో 83 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. వారందరినీ ప్రత్యేకంగా క్యాంపుల్లో ఉంచి చదివిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సీ్త్రల అక్షరాస్యత 57 శాతంగా ఉందన్నారు. అనంతరం జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. డీఆర్డీఏ మెప్మా ద్వారా వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన 60.02 లక్షల మంది మహిళలకు మెగా చెక్ను అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఆమెకు ఏ హోదా ఉంది... అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధికారికంగా హాజరు కావడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆమెకు ఏ హోదా ఉందని అధికారులు ఆహ్వానించారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అయితే ఇతర పార్టీల మహిళా నాయకురాళ్లను ఎందుకు ఆహ్వానించలేదని ఐద్వా, ఏపీ మహిళా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
సుయతీంద్రతీర్థుల మధ్యారాధన
మంత్రాలయం: నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు మధ్యారాధన వేడుకలు ఆదివారం శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో స్వామిజీ మధ్యారాధన వేడుకలు కనుల పండువగా సాగాయి. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సుయతీంద్రతీర్థుల చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. -
మహిళా హామీలు గాలికొదిలేశారు
● చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు మొండిచేయి ● రెండేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి లేదు ● వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి కాటసాని ఉమా మహేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. జగనన్న మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కన్నా రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయిందన్నారు. కనీసం బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అరకొరగా ఇస్తున్నారని, బస్సుల్లేని ఉచిత బస్సు పథకంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మహిళా కార్పొరేటర్లు మునెమ్మ, పల్లవి, అరుణ, ఆర్షియా ఫర్హీన్, చిట్టెమ్మ, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
విద్యాలయంలో ఉన్మాది విలయం
● కత్తి, రాడ్తో హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి దాడులు ● సమ్మతగేరి విద్యార్థి మృతి, 8 మందికి తీవ్రగాయాలు సాక్షి, బళ్లారి/ హొళగుంద: అక్షరాలు నేర్పే చదువుల తల్లి ఒడిలో రక్తపాతం సంభవించింది. రోజూ మాదిరిగానే భోజనం చేసి నిద్రిస్తున్న సహచర విద్యార్థులపై మరో విద్యార్థి రాక్షసునిలా మారి దాడికి తెగబడ్డాడు. బళ్లారి శివార్లలోని గురుకుల స్కూల్ ఇంటర్నేషనల్ అనే ఓ ప్రైవేటు స్కూలు హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి శనివారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఉన్మాదిగా కత్తి, రాడ్డులో సహచర విద్యార్థులపై దాడి చేశాడు. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని సమ్మతగేరి గ్రామానికి చెందిన హేమంత్ (15) అనే 9వ తరగతి విద్యార్థిని బెడ్డు మీదే పొడిచి, రాడ్డుతో కొట్టి చంపాడు. మోక్షిత్, హేమంత్, వినయ్, విష్ణు, భానుప్రసాద్, మనోజ్ అనే విద్యార్థులు, శశికళ అనే విద్యార్థినికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆకస్మికంగా జరిగిన ఈ ఘోరంతో హాస్టల్ రక్తసిక్తమైంది. టీచర్ బ్లెస్సీ, ఓ హాస్టల్ ఉద్యోగి కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను స్థానిక బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి, న్యాయవాది బి.లక్ష్మీకాంత్ దంపతులు, బంధువులు, మిగతా విద్యార్థుల బంధువులు పరుగు పరుగున వచ్చారు. ఆదివారం ఉదయం బిమ్స్ ఆస్పత్రి పోస్టుమార్టం వద్ద విషాదం నెలకొంది. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరి కన్నీరుమున్నీరుగా విలపించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు తదితరులు బందోబస్తు కల్పించారు. చంపే అవసరం ఏముంది? విద్యార్థి తండ్రి లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో తన కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. భరత్ అనే విద్యార్థి దాడి కత్తితో పొడిచి చంపాడని విలపించారు. తన కుమారునికి ఎలాంటి గొడవ పడే మనస్తత్వం కాదని, అందరితో కలిసిమెలిసి ఉంటాడని, రాడ్, చాకుతో దాడి చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదన్నారు. తమ కుమారుడుని హత్య చేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని తల్లి, బంధువులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థి మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్తూ ఎంత ఘోరం జరిగిపోయిందని రోదించారు. -
‘ఇంటి’ గుట్టు బట్టబయలు!
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం... నమ్మి ఓట్లు వేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గత ఎన్నికల సమయంలో డోన్ పాతబస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రేషన్కార్డు, ఆధార్కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సెంటు చొప్పున ఇంటిస్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతున్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా డోన్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పైగా జగనన్న కాలనీల్లో సౌకర్యాల కల్పనకు నయాపైసా ఖర్చు చేయలేదు. టీడీపీ నేతల ‘ఇంటి’ గుట్టు బట్టబయలు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పాలన అంటూ నిట్చూర్చుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందని, అప్పట్లో మంజూరైన ఇళ్లు, ఇంటి స్థలాలు, ఏర్పాటైన కాలనీలను గుర్తు చేసుకుంటున్నారు. 80 వేల కుటుంబాలకు కుచ్చుటోపీ డోన్ నియోజకవర్గంలో డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్యాపిలి మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 80 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒకటిన్నర సెంటు ఇస్తామని తెలుగుదేశం పార్టీ పేరుతో ఆ పార్టీ నేతల ఫొటోలను ముద్రించి కార్డులు ఇంటింటికీ పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ కార్డులను పట్టించుకోవడం లేదు. ప్రజలు వీటిని టీడీపీ నేతలకు చూపిస్తే వాటిని తీసుకుని చెత్తబుట్టల్లో వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కార్డులు ఎవరికీ కనిపించకుండా దహనం చేస్తున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి 80 వేల కుటుంబాలకు టీడీపీ నేతలు కుచ్చుటోపీ పెట్టారని ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో డోన్ నియోజకవర్గంలో ఏడు వేల పక్కాగృహాలను మంజూరు చేశారు. పలు కాలనీల ఏర్పాటుకు ఉదారంగా నిధులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో 10వేల పక్కాగృహాలను మంజూరు చేసి జగనన్న కాలనీల ఏర్పాటు చేశారు. ఇప్పుడు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. – కీర్తి, బేతంచెర్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అర్హులైన ఒక్క నిరుపేద కుటుంబానికి అంగుళ స్థలం కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదు. – వరలక్ష్మి, ఏనుగుమర్రి, ప్యాపిలి మండలం. ఒకటిన్నర సెంటు ఇస్తామని టీడీపీ నేతల హామీ అధికారంలోకి వచ్చాక గజం స్థలం కూడా ఇవ్వని వైనం అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజల ఆగ్రహం -
మంజూరైన పనులు రద్దు
ఓబులాపురం వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్ను టీడీపీ నేతలు రద్దు చేయించారు. అలాగే ప్యాపిలి శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో మంజూరైన ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను నిలిపివేశారు. మెట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. వెంగళాంపల్లె, అబ్బిరెడ్డి పల్లె చెరువుల వద్ద టూరిస్ట్ బోటు కలగా మిగిలింది. డోన్ నియోజకవర్గంలో ఏడు పార్కుల అభివృద్ధి పనులను నిలిపివేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ కళాశాల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4 లక్షల లీటర్ల నీటి కేపాసిటి గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను నిలిపివేశారు. -
నిజాయితీ చాటిన కండక్టర్
● పోగొట్టుకున్న బంగారు బ్రేస్లెట్ ప్రయాణికుడికి అప్పగింతకోవెలకుంట్ల: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు బ్రేస్లెట్ జారవిరుచుకున్న ప్రయాణికుడు ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీతో తిరిగి పొందాడు. కోవెలకుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున 5.10 గంటలకు కర్నూలులో కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు బనగానపల్లెకు చేరుకోగా సొంత పని ఉండటంతో అక్కడే దిగాడు. బస్సు కోవెలకుంట్లకు చేరుకున్న తర్వాత ఒక ట్రిప్పు అమడాలకు, మరో సింగల్ బనగానపల్లెకు వెళ్లింది. అయితే బస్ వెళ్లిపోయిన రెండు గంటలకు చేతికి బ్రేస్లెట్ కన్పించకపోవడంతో బస్సులో పడిపోయి ఉండవచ్చని భావించి కోవెలకుంట్లలో ఉన్న తన స్నేహితుడు రవితేజకు ఫోన్ చేసి చెప్పాడు. రవితేజ తండ్రి శివరాం స్థానిక ఆర్టీసీ డిపోలో క్లర్క్గా విధులు నిర్వర్తిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కుమారుడి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కర్నూలు నుంచి బయలుదేరిన బస్సు వివరాలు తెలుసుకుని ఆ బస్సు కండక్టర్ ఈవీ రమణను ఫోన్ చేశాడు. బస్లో బ్రేస్లెట్ పడిపోయిందని వెనుక నుంచి మూడవ సీటు వద్ద పరిశీలించాలని సూచించాడు. కండక్టర్ సీటు వద్దకు వెళ్లి చూడగా సీటు మధ్యలో కన్పించింది. కండక్టర్ ఏ మాత్రం ఆలోచించకుండా బ్రేస్లెట్ దొరికినట్లు సమాచారం ఇచ్చాడు. రెండున్నర తులాల బంగారు బ్రేస్లెట్ పోగొట్టుకున్న ప్రయాణికుడిని పిలిపించి డిపో మేనేజర్ నాగరాజు సమక్షంలో అందజేశారు. నిజాయితీ చాటిన కండక్టర్ ఈవీ రమణను డీఎంతోపాటు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. -
కమనీయం గోరంట్ల మాధవుడి కల్యాణం
కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ, భూదేవి మాధవస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కల్యాణం, గరుడోత్సవ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కల్యాణానికి శ్రీమాధవస్వామి తరఫున ఎర్రగుడి వాసులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, ఆలయ పండితులు ఆగమ శాస్త్రప్రకారం కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు. స్వామి కల్యాణం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, రమణమూర్తి, హరి, వెంకట్రామయ్య, పద్మానాభ ఆచారి, రాజేష్, కర్ణం లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వైభవంగా గరుడోత్సవం.. కల్యాణంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఉంచి మేళతాళాల మధ్య గ్రామ పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడి పోటా పోటీగా లాగుతూ గరుడోత్సవాన్ని ఎంతో అట్టహాసంగా కోలాహలంగా నిర్వహించారు. కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
విద్యార్థినుల భద్రతకు పెద్దపీట..
● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం, ఉపాధ్యాయులు (టీజీటీ /పీజీటీలు) సైతం మహిళలే. ● అలాగే ప్రతి పాఠశాలకు ప్రహరీ, గేటు, వాచ్మెన్తో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది. ● అధికారులు తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు ప్రవేశం ఉండదు. ● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ● వైఎస్సార్సీపీ హయాంలో మన బడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు. ● మోనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు. ● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక పథకాలకు వీరంతా అర్హులే. -
రమణీయం.. రంగనాథుడి రథోత్సవం
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథస్వామి రథోత్సవం శనివారం అశేష భక్తజనవాహిని మధ నిర్వహించారు. ఉదయం రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవికి అర్చకులు రంగస్వామి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో గోవింద నామస్మరణ హోరెత్తింది. సాయంత్రం సతీసమేత ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి అశేష భక్తజన వాహిని మధ్య మహా రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఈఓ రెబ్బ వీరయ్య, ఆలయ చైర్మన్ రవి, సర్పంచు మల్లికార్జున, తహసీల్దారు గుండాల నాయక్, దాతలు పారా రామచంద్ర ప్రసాద్, పారా విశ్వనాథ్, మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం చౌదరి, రామలింగారెడ్డి, ఉప సర్పంచు గోపాల్, మాజీ ఆలయ చైర్మన్ దస్తగిరిగౌడు తదితర ప్రముఖులు రథోత్సవంలో పాల్గొన్నారు.


