breaking news
Kurnool District Latest News
-
సిబ్బంది లేక ఇబ్బంది!
● గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు 14 మంది అవసరం ● ఉన్నది నలుగురు మాత్రమే గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది లేపక అధికారులకు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఆరుగురు లస్కర్లు, ఆరుగురు టెక్నికల్ సిబ్బంది, ఇద్దరు నైట్ వాచ్మెన్లు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు లస్కర్లు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక వర్క్ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో సిబ్బంది ఎంతో అవసరం అవుతుంది. సిబ్బంది లేకపోవడంతో రాత్రి పగలు ఉన్న నలుగురితోనే పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ దుస్థితి.. ప్రాజెక్టుకు గత రెండు నెలలుగా వరద నీరు వస్తోంది. గత నెల 12వ తేదీ నుంచి నేటి వరకు 30 సార్లు గేట్లు ఎత్తి నీటిని హంద్రీ నదికు విడుదల చేశారు. అత్యవసరం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ముగ్గురి వ్యక్తులను కాంట్రాక్ట్ కింద ఏర్పాటు చేసుకున్నారు. వారు నవంబర్ నెల చివరి వరకు మాత్రమే పనిలో ఉంటారు. ఉన్న ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు కూడా మరో మూడేళ్లకు రిటైర్డ్ అవుతారు. ఇక నియామకాలు జరగకపోతే మూడేళ్లకు ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది ఒక్కరు కూడా ఉండరు. సమస్యలు ఇవీ.. ప్రాజెక్టు నిర్వహణకు క్రస్ట్గేట్లకు వేసేందుకు గ్రీస్, ఇతర అవసరాలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాని నిధులను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులే సొంత నిధులతో గ్రీస్ను, ఇతర అవసర పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టులో సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాజెక్టు విద్యుత్ బిల్లు కూడా దాదాపు రూ.30 లక్షల మేర పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.గాజులదిన్నె ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ -
మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు
● ఇద్దరు చేస్తున్న దందాపై ఆగ్రహం ● నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం కర్నూలు (టౌన్): నగరంలో మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు చేశారు. కాలం చెల్లిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ పేరుతో అధికారుల వద్ద పైరవీలు చేయడాన్ని వ్యతిరేకించారు. కొత్తగా కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మెజార్టీ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఓ ప్రెవేటు హోటల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే అదిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏడేళ్ల క్రితం గడువు ముగిసినా.... గ్రేటర్ కర్నూలు కాంట్రాక్టర్ల అసోసియేషన్ 2015 మార్చి 10న ఏర్పాటైంది. ఇద్దరు మాత్రమే నాయకులుగా చెలామణీ అవుతున్నారు. ఇతరులను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇద్దరు మాత్రమే అభివృద్ధి చెందారు. బిల్లుల నుంచి పనుల వరకు వారే అధికారుల వద్ద వారే పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ సమావేశం నిర్వహించాలి. నూతనంగా కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అసోసియేషన్ గడువు 2018 మార్చి 9 వ తేదీ నాటికి ముగిసింది. ఇప్పటి వరకు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించలేదు. 4న నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం కర్నూలు కార్పొరేషన్లో 110 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరిలో 90 మందికి పైగా కాంట్రాక్టర్లు విసుగు చెంది కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇతర కాంట్రాక్టర్లతో చర్చించారు. దాదాపు అందరూ కాంట్రాక్టర్లు ఒప్పుకోవడంతో ఈనెల 4న కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని ఓ హోటల్లో సమావేశం కానున్నారు. అదే రోజు కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు వెల్లడించారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం మంది కాంట్రాక్టర్లు ఆంగీకారం తెలిపారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు, బిల్లుల పెండింగ్, తీవ్ర జాప్యంతో పాటు పలు సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆదుకోని ‘ఉపాధి’.. ఆగని వలసలు
కోసిగి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆదివారం కోసిగిలోని వివిధ కాలనీల నుంచే కాక మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూలీలు టెంపో వాహనాల్లో వలస వెళ్లారు. మరికొందరు రైల్వే స్టేషన్లో చైన్నె నుంచి ముంబై వెళ్లే మెయిల్ రైలులో మూటముళ్ల కట్టుకుని రైలు ఎక్కి కర్ణాటక ప్రాంతానికి వెళ్లారు. ఈఏడాది అధిక వర్షాలు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతి పోయాయి. పంటలు చేతిక రాకపోవడంతో కూలీలతో పాటు రైతులు కూడా తరలి వెళ్లుతున్నారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వలస వెళ్లారు. వెళ్లిన చోటు పిల్లతో పాటు ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయని చెబుతున్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామికి మహానందీశుడి పట్టువస్త్రాలు
మహానంది: కాలజ్ఞాన రచయిత, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం మహానంది దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆదివారం మహానంది ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకరశర్మ, వనిపెంట జనార్ధనశర్మ, వేదపండితులు హనుమంతుశర్మ, అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య బ్రహ్మంగారి మఠానికి చేరుకుని అక్కడి పీఠాధిపతి ఈశ్వరాచారి వారికి పట్టువస్త్రాలు అందించారు. బ్రహ్మంగారి మఠం అధికారులు స్వాగతం పలకగా శాస్త్రోక్తంగా అందజేశారు. -
5న కార్తీక లక్ష దీపోత్సవం
కర్నూలు కల్చరల్: కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 5వ తేదీన కార్తీక లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి కార్యాధ్యక్షులు ఇ.పద్మావతి పేర్కొన్నారు. ఆదివారం సమితి కార్యాలయంలో దీపోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదకొండు సంవత్సరాలుగా కర్నూలు నగరం వినాయక్ ఘాట్ కేసీ కెనాల్లో సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. సమితి కార్యదర్శులు జె.రాధిక, స్వప్నసారథి, సహ కార్యదర్శులు జయలక్ష్మి, సభ్యులు అనురాధ, హేమలత, మల్లీశ్వరి, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నదిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి మంత్రాలయం రూరల్: తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి ఒక యువకుడు మృతి చెందారు. ఈ దుర్ఘటన ఆదివారం తుంగభద్ర గ్రామం పుష్కరఘాట్ వద్ద చోటుచేసుకుంది. తుంగభద్ర గ్రామానికి చెందిన వీరేంద్రగౌడ్(26) ఆదివారం ఉదయం స్నానానికి తుంగభద్ర నదికి వెళ్లాడు. పుష్కరఘాట్ వద్ద జారి నీళ్లలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో నీళ్లల్లో కొట్టుకుని పోయాడు. నీళ్లల్లో కొట్టుకొని పోతున్న వీరేంద్రగౌడ్ను స్థానికులు కాపాడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. నదిలో కిలోమీటర్ మేర వరకు పోయి అక్కడ కంపచెట్లలో విగతజీవిగా కనిపించాడు. వీరేంద్రగౌడ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. తల్లి లక్ష్మీ ఈశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నదీతీర ప్రాంతాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలి కర్నూలు (టౌన్): కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వస్తుంటారని, నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులు తమ వెంట చిన్న పిల్లలను తీసుకొని వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఓర్వకల్లు కాల్వబుగ్గ రామేశ్వర శివాలయం , బ్రహ్మగుండేశ్వరం శివాలయం, గురజాల గ్రామ శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. క్రీస్తు త్యాగంతోనే పాప విమోచనం కర్నూలు (టౌన్): దేవాది దేవుడైన ఏసుక్రీస్తు లోకరక్షణార్థమై రక్తం చిందించి ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగానికి ఫలితంగానే మానవులకు పాప విమోచన లభించిందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. కర్నూలు నగరంలోని బుధవార పేట, వెంకయపల్లెలోని క్రిస్టియన్ సమాధుల వద్ద ఆదివారం పరిశుద్ధ ఆత్మల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవులు సమాధుల తోటలో డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీ ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. చనిపోయిన ఆత్మలను స్వర్గ ప్రాప్తి చేకూరాలన్నారు. అనంతరం సమాధులకు పవిత్ర తైలంతో పావనం చేశారు. చర్చి ఫాదర్లు ప్రతాప్ రెడ్డి, జాన్ డేవిడ్, ఆర్లప్ప. థామస్, సుధాకర్, రాజశేఖర్, ఉపదేశులు ఎన్, అంథోనీ, రాజు, మరియ దళ సభ్యులు, క్యాథలిక్ యూత్ పాల్గొన్నారు. -
సాంకేతిక వి‘పత్తి’
● పత్తి కొనుగోళ్లలో సర్వర్ సమస్యలు ● పరిష్కరించని మార్కెటింగ్ శాఖ ● ఇబ్బంది పడుతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు సర్వర్ సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. పత్తి దిగుబడులు మొదలైన మూడు నెలల తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే 50 శాతం దిగుబడులను తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోయారు. మిగిలిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశనే మిగులుతోంది. ‘యాప్’సోపాలు పత్తి కొనుగోళ్ల సాఫీగా జరుగాలంటే మూడు యాప్లు బాగా పనిచేయాల్సి ఉంది. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. యాప్లేవీ పనిచేయకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ–పంట యాప్లో రైతులు ఏ పంట.. ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఉంటాయి. సీఎం యాప్లో రైతుల ఆధార్, మొబైల్ నంబరు నమోదు చేస్తే ఈ–పంట యాప్లోని వివరాలు డిస్ప్లే కావాల్సి ఉంది. సీఎం యాప్లో ఈ–పంట యాప్లోని వివరాలు డిస్ప్లే కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కపాస్ కిసాన్ యాప్లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటారు. పత్తి పంటను ఏ తేదీలో.. ఏ కొనుగోలు కేంద్రానికి తీసుకెల్లాలనేది వస్తుంది. అయితే ఏ యాప్ పనిచేయకపోవడంతో ఒకవైపు రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 6 క్వింటాళ్లే కొనుగోలు.. స్లాట్ బుకింగ్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు సగటు దిగుబడి ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. సీసీఐ మాత్రం ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పత్తిని దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు 2,500 క్వింటాళ్లు కొనాల్సి ఉన్నప్పటికీ అరకొరగా కొనుగోలు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దిగుబడి మొత్తం కొనేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు మార్కెటింగ్ శాఖను, సీసీఐ అధికారులను కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బేతంచెర్ల: కనుమకింది కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జంగిటి అనిల్ కుమార్(29) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి శనివారం ఉదయం వచ్చాడు. ఎక్కడకు వెళ్లావని భార్య గంగమ్మ నిలదీయడంతో మనస్తాపానికి గురై పొలం దగ్గరకు వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుని భార్య గంగమ్మతోపాటు రెండేళ్ల కుమార్తె హర్షిత ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నబి తెలిపారు. -
ఎంపీడీఓలుగా ఐదుగురికి పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఐదుగురికి జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు పోస్టింగ్స్ ఇచ్చినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. పీఆర్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏ జిల్లాకు కేటాయించిన వారికి ఆ జిల్లాలోనే పోస్టింగ్స్ ఇచ్చినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పదోన్నతులు వచ్చాయని తెలిపారు. బేతంచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న పీ దస్తగిరిబాబును కొలిమిగుండ్లకు, బనగానపల్లె ఏఓ ఎస్ నాగరాజును బనగానపల్లెకు, బండి ఆత్మకూరు డిప్యూటీ ఎంపీడీఓ వై రామక్రిష్ణవేణిని అవుకు, తుగ్గలి ఏఓ ఎస్ఎం భాషను కోసిగి, గోస్పాడు డిప్యూటీ ఎంపీడీఓ ఎం నాగ అనసూయను ఓర్వకల్ ఎంపీడీఓగా పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. చిరుత పాద ముద్రల పరిశీలన ఆస్పరి: ఆస్పరి సమీపంలోని నల్లవాగు దగ్గర ఆదివారం ఆదోని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ తేజస్వి, ఆలూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, బీట్ ఆఫీ సర్ బాలకృష్ణ చిరుత పాద ముద్రలు పరిశీలించారు. ఆస్పరి రైతులు రెండు రోజులు నుంచి ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ఫారెస్టు ఆఫీసర్లుకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పరికి వచ్చారు. పాద ముద్రలను పరిశీలించి.. అవి చిరుతవి కాదని తోడేలివని రైతులకు వివరించారు. ఈసందర్భంగా ఆదో ని రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఒక వేళ చిరు త కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు, మహి ళలు ఒంటరిగా వెళ్లకుండా కొంత మంది గుంపు కలిసి వెళ్లాలని సూచించారు. పొలాలు దగ్గరకు చిన్న పిల్లలను తీసుకెళ్లకూడదన్నారు. వన్య ప్రాణులకు హాని కల్పించవద్దని రైతులకు సూచించారు. నేడు డయల్ యువర్ సీఎండీ కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు 9133331912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చని తెలిపారు. -
బాటిల్ ఉంది జాగ్రత్త !
ఇంట్లో కుక్క ఉంటే గేటుకు ‘కుక్కలు ఉన్నా యి.. జాగ్రత్త’ అంటూ బోర్డు తగిలిస్తారు. ఇక్కడ మాత్రం కుక్కలను భయపెట్టడానికి ఎర్ర నీళ్ల బాటిల్ ఉంచి.. బాటిల్ ఉంది జాగ్రత్త అంటూ శునకాలకే వార్నింగ్ ఇస్తున్నారు. కుక్కల బెడదతో కొందరు ఈ బాటిల్ మంత్రాన్ని వాడుతున్నారు. వీధి కుక్కలు ఇళ్ల ముందు మల, మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను పాడు చేస్తున్నాయని ప్రజలు బాటిల్ చిట్కాను అనుసరిస్తున్నారు. కుక్కలు ఇంటి ముందుకు రాకుండా పత్తికొండలో కొన్ని కాలనీ ప్రజలు ఓ బాటిల్ నీళ్లలో కొంత కుంకుమ వేసి బాటిల్ను తాడుతో ఇంటి గేటుకు, ప్రహరీకి వేలాడదీస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం పట్టణంలోని పలు వీధులకు విస్తరించింది. చాలా చోట్ల ఇంటి గేటుకు ఎర్ర రంగు నీళ్ల బాటిళ్లు వేలాడుతూ కని పిస్తున్నాయి. విషయం తెలియని చాలా మంది ఇదేమి పద్ధతి అంటూ ఆశ్చర్యపోతున్నారు. – పత్తికొండ రూరల్ -
● భక్తులకు భద్రత కరువు
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాఽశాల నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి అమాయక భక్తులు తొమ్మిది మంది మృతి చెందారన్నారు. సినిమా థియేటర్ల వద్ద పోలీసులను నియమించే కూటమి ప్రభుత్వం దేవాలయాల వద్ద ఎందుకు భద్రత కల్పించలేదని విమర్శించారు. పవిత్ర తిరుపతిలో లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం దేవాలయం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు అమాయక భక్తులు మృతిచెందారన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ నాయకులు నరసింహులు, యాదవ్, ప్రభాకర్, కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి, పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. -
● చెట్టంతా ఆదర్శం
ఈ చిత్రం చూస్తుంటే ఇంటిపై టెంకాయ చెట్టును నాటారా అన్నట్లుగా ఉంది కదూ.. అసలు విషయం ఏమిటంటే.. ఆ చెట్టు ఇంటిపైనా కాదు.. ఇంటిలోనే ఉంది. అదేంది ఇంటిలో చెట్టు అనుకుంటున్నారా..! బేతంచెర్ల పట్టణం కోటపేట కాలనీకి చెందిన నాపరాయి పరిశ్రమ యజమాని రహిమాన్కు చెట్లు అంటే ఇష్టం. రెండేళ్ల క్రితం శిథి లావస్థకు చేరుకున్న పడగొట్టి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే అప్పటికే ఏపుగా పెరిగిన టెంకాయ చెట్టును తొలగించకుండా ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ చెట్టు ఇంటికన్నా ఎత్తు పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఔరా అంటూ రహిమాన్ను అభినందిస్తున్నారు. – బేతంచెర్ల -
● తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
ఆలూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని భోగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో అయ్యప్ప మాలాధారులతో కలిసి ఆదివారం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. భక్తుల మృతి ఘటన నుంచి తప్పించేకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. జోగి రమేష్ను అరెస్టు చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆలూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఊరూరా ఏరులై పారుతోందని విమర్శించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించడంతోనే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారన్నారన్నారు. వైఎస్సార్సీసీ మండల అధ్యక్షడు మల్లికార్జున, జిల్లా నాయకులు రామాంజినేయులు, భాస్కర్, గిరి, ఎంపీటీసీ దేవరాజు,కో–అప్షన్ మెంబర్ మహబూబ్ బాషా, ఎల్లప్ప, వరుణ్, నాగప్ప, రంగన్న, అనిల్ హనుమతప్ప, నాగేంద్ర, బాషా, రెడ్డి, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం
● ఘనంగా కురువల కార్తీక వనభోజన కార్యక్రమం కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా కురువలు ఐకమత్యంగా ఉంటే ఎలాంటి సమస్యకై నా పరిష్కారం లభిస్తుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కర్నూలు, హిందూపురం ఎంపీలు బస్తిపాటి నాగరాజు, పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పెద్దపాడు రోడ్డులోని శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో 23వ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరిక చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. కురువలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ తదితర అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కులానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఈ నేపథ్యంలోనే కురువ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హిందూపురం ఎంపీ పార్థసారథి రూ.25 లక్షలను ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ అరుణ్కుమార్, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీలీలమ్మ, అనిత, గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శేఖర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, ఐఆర్ఎస్ అధికారి యాదగిరి, తహసీల్దార్ ఆంజనేయులు, పాల సుంకన్న, గడ్డం రామక్రిష్ణ, కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ, డా.లక్ష్మి ప్రసాద్, నాయకులు కే కిష్టన్న, ఉపాధ్యక్షులు కత్తి శంకర్, ఉరుకుందు, ధనుంజయ, కేసీ నాగన్న, నాగశేషులు, తిరుపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
దిగువకు 383.7 టీఎంసీల నీరు
కర్నూలు సిటీ: సుంకేసుల జలాశయం నుంచి జూన్ నెల నుంచే ఇప్పటి వరకు జల వనరుల శాఖ గణాంకాల ప్రకారం 383.7 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో టీబీ డ్యాం గేట్లు ఖరీఫ్ సీజన్కంటే ముందుగానే తెరుచుకున్నాయి. నదికి వచ్చిన వరద నీటితో సుంకేసుల జలాశయం గేట్లు ఇప్పటి వరకు తెరుచుకునే ఉన్నాయి. జలాశయం నుంచి కేసీ కెనాల్ ఆయకట్టుకు 17.33టీఎంసీలు, కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని జనాభాకు 1.7 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం నదిలో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇదిలా ఉండగా గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఈ ఏడాది హంద్రీ నదికి 9 టీఎంసీలకుపైగా నీటి ని వదిలారు. ప్రస్తుతం హంద్రీనదిలో 250 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్ర‘జల’ కష్టాలు కనిపించవా?ఆలూరు: ‘మంచినీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రజల కష్టాలు కనిపించవా’ అని అధికారులపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరులో అధికారులతో ఆదివారం వారు సమావేశమయ్యారు. జిల్లాలోనే తాగునీటి సమస్య ఆలూరులో ఎందుకు ఉందని ప్రశ్నించారు. వచ్చే తాగునీటిని కూడా ప్రజలకు సక్రమంగా పంపింగ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గ్రామపంచాయతీ అధికారులను హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మావతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య పాల్గొన్నారు. -
చిన్నారికి డెంగీ లక్షణాలు
వెల్దుర్తి: పట్టణంలో డెంగీ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం పట్టణంలోని రాణితోటకు చెందిన ఆరేళ్ల మానస డెంగీ జ్వరానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జ్వరం తీవ్రతరం కావడంతో తల్లిదండ్రులు మనోహర్, శిరీషలు కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డెంగీ లక్షణాలు తేలిన ట్లు నిర్ధారించారని తల్లితండ్రులు తెలిపారు. దీపం అంటుకుని చిన్నారి మృతి వెల్దుర్తి: దీపం అంటుకుని గా యాలపాలైన ఎనిమిదేళ్ల చిన్నారి రేవతి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం కోలుకోలేక మృతిచెందింది. గ్రామానికి చెందిన గొల్ల బుడ్డన్న, సు లోచన దంపతుల కుమార్తె రేవతి తన ఇంటి పక్క నే ఉన్న దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టే ప్రయత్నంలో ఉండ గా దీపారాధనకు ఉంచి దీపం దుస్తులకు అంటు కుని గాయాలపాలైంది. రేవతి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో 3వతరగతి చదువుతోంది. చిన్నారి ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి వారి కుటుంబానికి గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ కుమారుడు కృష్ణారెడ్డి అండగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సైతం ఆసుపత్రికి వెళ్లి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతిపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పట్టుబడిన వాహనాలకు రేపు వేలం నంద్యాల: పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ క్రిష్ణమూర్తి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన 10 వాహనాలకు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలన్నారు. వివరాలకు నంద్యాల ఎకై ్సజ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
నిరాశ పరిచిన మంత్రి బీసీ
● రాయల్టీ సమస్య వెంటనే పరిష్కారం కాదంటూ తేల్చిన మంత్రి ● ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ దాట వేసిన వైనం కొలిమిగుండ్ల: మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తే వెంటనే సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన మైనింగ్ యజమానులు, ట్రాక్టర్ల నిర్వాహకులు, కార్మికులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే పరిశ్రమ స్తంభించి కార్మికులు ఉపాధి కోల్పోయిన రోడ్డున పడ్డారు. రోజులు గడిచేకొద్ది కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో మైనింగ్ రాయల్టీలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో ఉత్పన్నమైన సమస్యల గురించి నాపరాతి గనుల యజమానులు మంత్రి బీసీ జనార్దనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బెలుం గుహల ఆవరణలో ఏర్పాటు చేసిన మైనింగ్, పాలీష్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ యజమానులు, కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాయల్టీ ప్రవేట్ పరం చేయడంతో ఎదురవుతున్న కష్ట, నష్టాల గురించి పలువురు యజమానులు మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. పాత పద్ధతిలోనే రాయల్టీ విధానం ఉండేలా చేస్తేనే పరిశ్రమ మనుగడ సాధిస్తుందన్నారు. ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్ని జిల్లాల్లో వివిధ రకాల మినరల్స్కు ఇదే పద్ధతి అమల్లో ఉందని మంత్రి బీసీ పేర్కొన్నారు. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం కాదని, పది రోజుల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని సమావేశానికి వచ్చిన యజమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మురహరి రెడ్డి
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరుకు చెందిన మురహరి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా జి.శివ శంకర్ రెడ్డి (పాణ్యం), జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శిగా మల్లెపోగు సోమశేఖర్ ( ఎమ్మిగనూరు), జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులుగా మదుబాబును (ఎమ్మిగనూరు) నియమించారు. కర్నూలు నగరంలోని 52 డివిజన్లకు సంబందించి డివిజన్ల వారీగా 52 మందిని డివిజన్ అధ్యక్షులుగా నియమించారు. పారా మెడికల్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్కేర్ సర్వీసెస్(డిప్లొమా ఇన్ పారామెడికల్)లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏలో బీసీ–ఏ కేటగిరీకి ఒక సీటు, ఈసీజీలో ఓసీ–పీహెచ్ కి ఒక సీటు, డీఏఎన్ఎస్లో ఓసీ–పీహెచ్కి ఒక సీటు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా కేటగిరీ లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను నవంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ఆమె వివరించారు. మల్లన్న సేవలో సినీ నటులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను సినీ, టీవీ నటులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకు న్నారు. శుక్రవారం సినీ నటుడు ఛత్రపతి ఫేమ్ శేఖర్, బుల్లితెర నటుడు అమర్దీప్ వేర్వేరు సమయాల్లో మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. సినీ, టీవీ నటులను చూసిన పలువురు భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె విరమణ కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి బకాయిల విడుదలకు హామీ రావడంతో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించినట్లు ఏపీ ప్రైవేటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,500 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి చేసిన ఆరోగ్యశ్రీ కేసులకు ప్రతి నెలా రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిందన్నారు. పాండురంగ స్వామి ఆలయంలో చోరీ హొళగుంద: వందవాగిలి గ్రామం గజ్జెళ్లి రోడ్డులో ఉన్న శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో గురు వారం అర్ధరాత్రి తాళిబొట్లు, కంచు గంటలను దొంగలు చోరీ చేశారు. రాత్రి సమయంలో ఆలయ తాళాలను పగులగొట్టి అమ్మ వారి మెడలోని రూ.35 వేలు విలువ చేసే 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువ చేసే రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను కూడా పగల గొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీరాంనగర్ క్యాంపు, మార్లమడికిలోని ఆలయాల్లో చోరీ జరగ్గా తాజాగా ఈ చోరీతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం
రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్య త ఇస్తామని ఎఫ్డీపీటీ బి.విజయకుమార్ అన్నారు. ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (ఎఫ్డీపీటీ)గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి రుద్రవరంరేంజ్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎర్రచందనం కలిగిన రేంజి, వన్యప్రాణులకు ఆవాసమిచ్చే ప్రదేశం రుద్రవరం రేంజిని అన్నారు. వృక్ష సంపదను కూల్చడం, వన్య ప్రాణులను వేటాడటం వంటి వాటిని అరికట్టేందుకు డ్రోన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొండల్లో సాయుధ దళాలను రంగంలోకి దించుతామని, ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సబ్డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, రేంజర్ ముర్తుజావలి ఉన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతి
పాములపాడు: చెలిమిల్ల గ్రామం వద్ద సుద్దవాగులో ఈ నెల 28న గల్లంతైన వ్యక్తి శవమై కనపించాడు. మూడు రోజుల క్రితం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరయ్య(46), వెంకటేష్ బైక్పై పాములపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నీటి ప్రవాహానికి అదుపు తప్పి కింద పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వెంకటేష్ను చెలిమిల్ల గ్రామానికి చెందిన యువకులు కాపాడగా నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం విధితమే. మూడు రోజులుగా ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో ఎస్ఐ సురేష్బాబు ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు, మత్స్యకారులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఈతవనం వద్ద నాగేశ్వరయ్య మృత దేహం లభ్యమైంది. మృతుడికి అతనికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు నాగమల్లేష్, కూతురు రాజేశ్వరి ఉన్నారు. ఈ నెల 28న మందుల కోసం పాముల పాడుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. -
అంతా ధ్వంసం
గతేడాది మహారాష్ట్ర దొంగల ముఠా దుశ్చర్యతో ప్రాజెక్టు పరిధిలోని ఆరు ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల్లో విలువైన సామగ్రి చోరీకి గురైంది. సామగ్రి సైతం దేనికీ పనికిరాకుండా ధ్వంసమైంది. మంత్రాలయం పరిధిలోని మూగలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్తో రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి 1200 కేజీ కాపర్ను దొంగలించారు. పంప్హౌస్లో రూ.18 లక్షలు నష్టం వాటిల్లింది. మాధవరం స్టేజ్–1 పంపుహౌస్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు, మూడు స్టార్టర్లు, ఇన్సులేటర్, బ్రేకర్స్, బ్యాటరీలను నాశనం చేశారు. అందులో 9 కాపర్ షీట్లను ఎత్తుకెళ్లారు. కారణంగా రూ.1.46 కోట్లు నష్టం జరిగింది. బసలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్లోనూ స్టార్టర్, బ్యాటరీలు, ఫీడర్లను ధ్వంసం చేయగా రూ.12 లక్షలు నష్టం వాటినట్లు కేసు నమోదైంది. ఎమ్మిగనూరు పరిధిలోని సోగనూరు స్టేజ్–1 పంపుహౌస్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు, 1200 కేజీల కాపర్ను దొంగలించారు. పంప్హౌస్లో రూ.20 లక్షలు నష్టం జరిగింది. పూలచింత స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్లోనూ 4 ట్రాన్స్ఫార్మర్లు, కాపర్, ఆయిల్ ఎత్తుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం వాటిల్లింది. చిలకలడోణ స్టేజ్–1, స్టేజ్–2 పంపుహౌస్లో 4 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్, ఆయిన్ తీసుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం జరిగిందని ప్రాజెక్టు అధికారుల అంచనా. -
● టీడీపీ కౌన్సిలర్ల తీరుపై సర్వత్రా విమర్శలు ● కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించని వైనం ● పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపునకు పట్టు ● తీర్మానాన్ని ఆమోదించాలని గగ్గోలు ● వ్యతిరేకించిన మెజార్టీ సభ్యులు
ఆ నలుగురు అంతే! బొమ్మలసత్రం: ఎంతో నమ్మకంతో ప్రజలు వారిని వార్డు కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మి కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు వమ్ము చేస్తున్నారు. పార్టీ కోసం ప్రజల సమస్యలను పక్కన పడేస్తున్నారు. వరుసగా మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాల్లో ఆ నలుగురు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయా వార్డు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 4, 12, 21, 27 వార్డు కౌన్సిలర్లు టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించుకోవాలని మూడు నెలలుగా సభలో వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుబడుతున్నారు. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతుంటే వాటిపై చర్చ జరపకుండా పార్టీ కార్యాలయం కోసం వారు చేస్తున్న గందరగోళంతో సభా సమయం వృథా అవుతోంది. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్.. మోంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం అజెండాలోని మొదటి అంశమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి పట్టణం నడిబొడ్డులో ఉన్న 1.57 సెంట్ల భూమి కేటాయింపు ప్రస్తావనను కౌన్సిల్ ఆమోదం కోసం ఉంచారు. అధిక సంఖ్యలో కౌన్సిల్ సభ్యులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించటంతో చైపర్సన్ ఆ అంశాన్ని రద్దు చేశారు. దీంతో 4వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ మెహబూబ్వలి, 12వ వార్డుకు చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్యామ్సుందర్లాల్, 21వ వార్డుకు చెందిన శ్రీదేవి, 27వ వార్డుకు చెందిన జైనాబీలు సభలో గందరగోళం సృష్టించారు. స్థలం కేటాయింపుకు అనుకూలంగా సభ్యులు ఆమోదం తెలపాలని పట్టుబట్టారు. సభలో వారు వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, పామ్షావలిలపై గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. మెజార్టీ సభ్యుల అభ్యర్థన మేరకు చైర్పర్సన్ మాబున్నిసా ఆ అంశాన్ని రద్దు చేయటంతో ఆ నలుగురు కౌన్సిలర్లు బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. మూడు నెలలుగా.... కౌన్సిల్ సమావేశంలో గత మూడు నెలలుగా టీడీపీ సభ్యుల తీరు ఇలాగే ఉంది. ప్రజా సమస్యలు కౌన్సి ల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు పట్టణంలో 42 వార్డుల కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ నలుగరు సభ్యుల్లో ప్రజా సమస్యలు చర్చించా లన్న తపన లేకపోగా ప్రజలకు అవసరం లేని తమ పార్టీ కార్యాలయ స్థల కేటాయింపు కోసం వారు పడేపాట్లు చూస్తే ముక్కున వేలేసుకుంటున్నారు. తమ వార్డుల్లో అభివృద్ధి మొత్తం జరిగిపోయినట్లు .. ఇక తమ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నట్లు.. కేవలం ఒకే అంశాన్ని సభలో చర్చకు పట్టుబడటం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. మంత్రి శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేదు.. ఈ సందర్భంగా కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తమ వార్డులో సాక్షాత్తు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా ప్రయోజనం లేదన్నారు. అభివృద్ధి పనులకు తమ వద్ద నిధులు లేవని నేరుగా కమిషనర్ చెప్పడం భావ్యం కాదన్నారు. అనివృద్ధి పనులు చేయలేనప్పుడూ పన్నులు చెల్లించవద్దని వార్డు ప్రజలకు చెబుతామన్నారు. మంత్రి వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభం చేసినప్పటికీ తమ వద్ద నిధులు లేవని చెప్పడం సరైందికాదన్నారు. అలాంటప్పు డూ వార్డుల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ ఆడంబరాలు చెప్పుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి నిధుల్లేవ్.. పట్టణంలోని 42 వార్డుల్లో రహదారులు, డ్రైనేజీలు తదితర అంశాలకు సంబంధించి కౌన్సిలర్లు ప్రస్తావనకు తేగా తమ వద్ద కౌన్సిలర్లు అడిగిన ప్రతి పనికి అంత నిధులు లేవని కమిషనర్ శేషన్న సమాధానమిచ్చారు. మున్సిపాల్టీ ద్వారా అమృత్ ఈఎంఐ చెల్లింపునకు రూ.74.53 లక్షలు కాగా తక్కిన వాటి ఖర్చులు పోను అంతంత మాత్రమే నిధులు ఉన్నాయని రూ.కోట్లు ఖర్చు చేసి కౌన్సిలర్లు అడిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేమని సభలో తేల్చి చెప్పారు. సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఎక్కడ వేయాలో తాము వెమళ్లీ ప్రత్యక్షంగా చూసి ఆ పనులను మాత్రమే చేస్తానని కమిషనర్ వెల్లడించారు. -
గురువా.. కనవా!
అన్నదాతల వలస బాట మంత్రాలయం: జిల్లా పశ్చిమ ప్రాంతంలో బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు గురురాఘవేంద్ర ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఒక మైనర్ ఇరిగేషన్, 11 ఎత్తిపోతల పథకాలు ఉండగా మొత్తం 50 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. దీంతో నీరందక రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారు. తీవ్ర కరువుతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్న ఊరిని వదిలి జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. రబీ సీజన్ ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గురురాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకు నిధులను కూడా కేటాయించలేదు. ప్రాజెక్టు లక్ష్యం ఇదీ.. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద మంత్రాలయం నియోజకవర్గంలో మూగలదొడ్డి, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతలతోపాటు సూగూరు మైనర్ ఇరిగేషన్ జలాశయం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా 2006లో సూగూరు జలాశయం ప్రారంభోత్సవం చేశారు. అదేరోజు రూ.261.19 కోట్లతో పులికనుమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోగనూరు, పూలచింత, చిలకలడోణ ఎత్తిపోతలు, కోడుమూరు నియోజకవర్గంలో ఏపీఎస్ఐడీసీ శాఖ పరిధిలో కృష్ణదొడ్డి, చింతమాన్పల్లె, రేమట, మునుగాల లిఫ్టు ఇరిగేషన్ పథకాలు నెలకొల్పారు. తుంగభద్ర నది నుంచి 5.373 టీఎంసీల నీటిని జలాశయాలకు ఎత్తిపోసి సాగునీరు అందించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎమ్మిగనూరులో 4,350 ఎకరాలు, నందవరంలో 8,033 ఎకరాలు, మంత్రాలయంలో 11,034 ఎకరాలు, కోసిగిలో 8,566 ఎకరాలు, పెద్దకడబూరులో 1,420 ఎకరాలు, సి.బెళగల్లో 6,825 ఎకరాలు, గూడూరులో 4,365 ఎకరాలు, కర్నూలులో 4,997 ఎకరాల ఆయకట్టు నిర్ధారించారు. ప్రతిపాదనలకే పరిమితం ముఠా చోరీల కారణంగా ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయి. పంపుహౌస్ల మరమ్మతుల కోసం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపి ఏడాది కావొస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించడం లేదు. ప్రాజెక్టు అధికారులు మరమ్మతులకు రూ.17 కోట్లు అంచనాతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. మొండికేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కేటాయించలేదు. కేవలం రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఎంఎఫ్) కింద రూ.1.28 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. పథకం పరిధిలో ఏడు పనులు, జీతాలకు ఈ నిధి సరిపోయింది. మాధవరం, బసలదొడ్డి పథకాల నుంచి సెంటు భూమికి నీరివ్వలేదు. పథకాల పరిధిలో భూములు బీళ్లుగా మారాయి. మూగలదొడ్డి స్టేజ్–1 పంపుహౌస్ తుంగభద్ర నదిలో వరద నీరు ఏరులై పారుతోంది. పంపుహౌస్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో పథకాలన్నీ దిష్టిబొమ్మలుగా మారాయి. నీరు ఎత్తిపోయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా రబీ సీజన్లో పంట సాగుకు అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఇటీవల ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు, కేసీ కాలువ మైనర్ రిపేర్లకు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. జిల్లా పశ్చిమ ప్రాంత రైతులను పట్టించుకోకపోవడం దారుణం. –గడ్డం నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి పంపుహౌస్ల్లో జరిగిన చోరీలతో పథకాలు నిరుపయోగంగా మారాయి. కరువు ప్రాంత రైతులకు ఊతంగా ఉన్న ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. వలసల నియంత్రణకు జీఆర్పీ ప్రాజెక్టు మరమ్మతులు ఎంతో అవసరం. ఇప్పటికై నా ప్రభుత్వం దిగివచ్చి రబీ పంటలకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంది. – రాముడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి -
కర్నూలులో ‘ఐక్యత’ పరుగు
కర్నూలు టౌన్:సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొనిరాష్ట్రీ య ఏక్తా దివాస్ పేరుతో యూనిటీ రన్ను శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమై రాజ్విహార్ వరకు కొనసాగింది. రన్ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడారు. రన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు అడిషనల్ ఎస్పీ బహుమతులు అందజేశారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక సంజామల: సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ సంచాలకులు బాషా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ అఽథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో నవబంర్ 5 నుంచి 9 వరకు జరిగే అంతర్జాతీయ ఏసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో బాషా పాల్గొనున్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షబ్బీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, వసంత లక్ష్మి తదితరులు ఆయనను అభినందించారు. -
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
● పెచ్చులూడిన తరగతి గది పైకప్పు ● స్థల వివాదంతో మధ్యలో నిలిచిన నాడు – నేడు పనులు ● గ్రామ సచివాలయంలో తరగతుల నిర్వహణ జూపాడుబంగ్లా: పారుమంచాల ఉర్దూ పాఠశాల విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల తెరవక ముందే తరగతి గది పైకప్పు పెచ్చులు కూడి కింద పడ్డాయి. శుక్రవారం ఉదయం తరగతి గది తెరిచిన విద్యార్థులకు బెంచీలపై పెచ్చులు కనిపించాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గ్రామంలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో నాడు–నేడు పథకం కింద ఈ పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. పునాదులు తవ్వి గదుల నిర్మాణం చేపట్టారు. కాగా స్థలం విషయమై గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తటంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం పునాదులకే పరిమితమైంది. ఒకటి నుంచి ఐదు వరకు 15 మంది విద్యార్థులుండగా వారు శిథిలమైన తరగతి గదుల్లోనే విద్యను అభ్యిసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన ఎంఈఓ–1 చిన్న మద్దిలేటి పాఠశాల తరగతులను ఎంపీడీఓ అనుమతితో పాత సచివాలయంలో నిర్వహించేలా చేశారు. -
మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి కబర్ధికర్నూలు (టౌన్): మద్యం, మాదక ద్రవ్యాలతో జీవితాలు సర్వనాశనం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. జిల్లా న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. తాగి వాహనం నడపడంతో ప్రమాదాలు జరగడమే కాకుండా జీవితాలు నాశనం అవుతాయన్నారు. ర్యాలీలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, మొదటి, ఏడవ అదనపు జిల్లా జడ్జీలు కమలా దేవి, లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్, న్యాయవాదులు, పారా లీగల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కన్నీటి దిగుబడి!
కర్నూలు(అగ్రికల్చర్): పొలంలో విత్తనం వేసినప్పటి నుంచి పంట పండించే వరకు రైతులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చాక దానికి విలువ లేక లబోదిబోమంటున్నారు. మార్కెట్లో కనీసం మద్దతు ధర కూడా లభించకపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 16,165, నంద్యాల జిల్లాలో 2,01,057 చొప్పున 2,17,222 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల డీజల్ ఇంజిన్లు అమర్చుకుని సాగునీటిని అందించారు. ఇందుకోసం ఎకరానికి రూ. 5 వేలు అదనపు భారం పడింది. అవసరం లేని సమయంలో వర్షాలు కురవడం, ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో కంకి నిండా గింజ రాలేదు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. మిగిలింది నష్టమే! మొక్కజొన్న సాగులో రాణించాలంటే క్వింటాకు కనీసం రూ.2600 వరకు ధర ఉండాలి. ప్రస్తుతం మద్దతు ధర రూ.2400 ఉంది. మార్కెట్లో మాత్రం రూ.1400 నుంచి రూ.1800 వరకు మాత్రమే ధర వస్తోంది. పంట దిగుబడులు మార్కెట్లోకి రాకముందు క్వింటాకు రూ.2000 నుంచి రూ.2200 వరకు ధర లభించింది. దిగుబడులు మార్కెట్లోకి రావడం మొదలైన తర్వాత ధర పడిపోయింది. క్వింటాపై రైతులు రూ.600 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.30 వేల వరకు వస్తోంది. మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి వస్తుంది. లేదంటే నష్టమే మిగులుతోంది. నాలుగైదు నెలల పాటు కష్టించిన రైతుకు మిగులు సున్నానే. ఽమొక్కజొన్న రైతు ఇంత భారీగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. నకిలీలతో నట్టేట మునిగిన రైతులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నకిలీల బెడద పెరిగిపోయింది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో మొక్కజొన్నలో విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. మామూలుగా అయితే మొక్కజొన్నలో గరిష్టంగా కంకులు మాత్రమే వస్తాయి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు సబ్ డివిజన్లలో ఒక్క మొక్కకు ఐదారు కంకులు వచ్చాయి. ఒక్క కంకికి కూడా గింజలు రాలేదు. వీటిని చూస్తే ఎవ్వరికై న నకిలీ విత్తనాల ప్రభావమేనని స్పష్టమవుతుంది. కాని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం ‘అవి నకిలీ విత్తనాలు కాదు... అధిక వర్షాల వల్ల ఇలా జరిగింది’ అని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఒక్క నందికొట్కూరు సబ్ డివిజన్లో 36 ఫిర్యాదులు వచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పంటలకు మద్దతు ధర లేని సందర్భాల్లో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో పంటలకు మార్కెట్లో ధర పెరిగేది. మొక్కజొన్న, వరి తదితర పంటల కోతలకు ముందే రైతు భరోసా కేంద్రాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు ఊరట లభించేది. ప్రస్తుతం ఇలా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంటలకు ధరలు పడిపోయాయి. నష్టం వచ్చి రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటుండగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పౌరసరఫరాల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేవు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సన్న రకాలు సాగు చేస్తారని, వీటికి ధర బాగుంటుందని ప్రభుత్వానికి పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వానికి నివేదించంపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఇవీ కష్టాలు.. పంట కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా మోంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న పైరు వర్షానికి నేలవాలడంతో రైతులకు కష్టాలు తప్పలేదు. మొక్కజొన్న రైతుకు లభించని ‘మద్దతు’ మార్కెట్లో అరకొర ధర స్పందించని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు -
వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టారేణుక
● ఎమ్మిగనూరు సమన్వయకర్తగా రాజీవ్రెడ్డిఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడైన కడిమెట్ల రాజీవ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. -
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున మండలాల్లో, గ్రామాల్లో చిన్నపాటి గొడవలు జరుగకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. అవసరం అయితే పీడీ యాక్ట్లు నమోదు చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈగల్ టీమ్ క్యూర్ కోడ్ను అవిష్కరించారు. అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, క్రిష్ణ మోహన్, లీగల్ ఆడ్వైజర్ మల్లిఖార్జునరావు, డిఎస్పీలు బాబు ప్రసాద్ పాల్గొన్నారు. -
కృష్ణమ్మా.. చల్లగా చూడమ్మా!
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రెండో శుక్రవారం సాయంత్రం కృష్ణమ్మ హారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాతాళగంగ వద్ద ప్రతిష్టించిన కృష్ణవేణి విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులిచ్చారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవో వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
ఇలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ నుంచి పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ ముమ్మరంగా అన్ని శాఖల అధికారులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని రకాల వస్తు
చాలా మంది జీఎస్టీ సంస్కరణల మేరకు ఔషధాలు విక్రయించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అందరికీ నూతన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ మేరకు వాట్సాప్లలో మెసేజ్లు పంపించాం. కరపత్రాలు మెడికల్షాపుల వద్ద అతికించాం. ఇటీవల కర్నూలులో నిర్వహించిన మేళాలో మూడు స్టాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. కానీ చాలా మంది పాత స్టాక్ ఉందని చెబుతూ ధరలు తగ్గించకుండా మందులు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇకపై ముమ్మరంగా దాడులు చేస్తాం. మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే ధరలు తగ్గించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. –పి.హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ రూ.కోట్ల దాకా వ్యాపారం సాగుతోంది. అయితే ఈ దుకాణాల్లో అధిక శాతం ప్రజలకు జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు అందడం లేదు. గతంలో ఔషధాలు, శస్త్రచికిత్సల పరికరాలపై 12 శాతం, కొన్నింటిపై మాత్రమే 5శాతం జీఎస్టీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా గత నెల 22వ తేది నుంచి మందులపై ఉన్న 12శాతం జీఎస్టీని 5 శాతానికి, క్యాన్సర్ సహా అరుదైన వ్యాధులకు వాడే 33 రకాల మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ఈ నూతన ధరల ప్రయోజనాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ప్రజలకు అందించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ పేర్కొంది. కానీ మెజారిటీ దుకాణాల్లో ఈ తగ్గింపు ధరలు లభించడం లేదు. జీఎస్టీపై అధిక శాతం ప్రజలకు అవగాహన ఉన్న కర్నూలు నగరంలోనే నూతన సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఇక నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి ప్రాంతాల్లో అడిగినా జీఎస్టీ తగ్గించే నాథుడే కరువయ్యారు. అధికారులకు తగ్గించామని చెబుతూనే ! ఒకవైపు జీఎస్టీ 12 శాతం నుంచి 7 శాతంకు తగ్గించి మందులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువ కావాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేళాలు, ప్రచార జాతాలు, ర్యాలీలు నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. కానీ వారి ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏ దుకాణంలోనూ జీఎస్టీ తగ్గించి ఇవ్వడం లేదు. ఎక్కడా పాత, కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. అడిగితే మా వద్ద పాత స్టాక్ ఉందని, కొత్త స్టాక్ ధరలు తగ్గించి వస్తే ఇస్తామని దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పుడు మీకు(వినియోగదారులకు) 7శాతం తగ్గించి ఇస్తే తాము నష్టపోతామని వారు పేర్కొంటున్నారు. పాత నిల్వలైనా ప్రస్తుత తగ్గిన ధరల ప్రకారమే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చినా అమలు కావడం లేదు. జీఎస్టీ అధికారులతో పాటు డ్రగ్ నియంత్రణ అధికారులు నిఘా పెంచి తరచూ తనిఖీలు చేస్తేనే జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందే వీలుంది. ఏది కావాలో తేల్చుకోమంటున్న మెడికల్ దుకాణాల వ్యాపారులు పాత ధరలకే మందుల అమ్మకాలు తగ్గించి విక్రయించని వైనం తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్న సామాన్య ప్రజలు తనిఖీలు చేయని అధికారులు కర్నూలు నగరానికి చెందిన విజయ్కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ మెడికల్షాపునకు వెళ్లి మందులు కొన్నాడు. ఇందుకు అతనికి రూ.1,200 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.1,080 ఇవ్వాలని షాపు అతను సూచించాడు. ‘ఇప్పుడు మందులపై కూడా 7 శాతం జీఎస్టీ తగ్గింది కదా తగ్గించరా’ అని దుకాణదారున్ని విజయ్కుమార్ ప్రశ్నించాడు. ‘మీకు ఇప్పటికే 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాం కదా...జీఎస్టీ కావాలంటే ఆ డిస్కౌంట్ ఉండదు’అని చెప్పాడు. దీంతో డిస్కౌంట్తోనే సరిపెట్టుకుని విజయకుమార్ వెళ్లిపోయాడు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన మాధవరెడ్డి స్థానికంగా ఉన్న ఓ మెడికల్షాపులో మందులు కొన్నాడు. ఈ మేరకు రూ.3,600 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.3,140 చెల్లించాలని షాపు అతను సూచించాడు. బిల్లు కావాలని అడిగితే బిల్లు కావాల్సి వస్తే నీకు జీఎస్టీ 7 శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పాడు. 3 శాతం నష్టపోవాల్సి వస్తుందని భావించి మాధవరెడ్డి బిల్లు లేకుండానే మందులు తీసుకెళ్లిపోయాడు. -
జీఎస్టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దు
చాలా దుకాణాల్లో నూతన జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్టీ తగ్గించాలంటే డిస్కౌంట్ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్ అయితే ఎంఆర్పీపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. మనం జీఎస్టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్ కోల్పోతాం. ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్పీపై 7 శాతం జీఎస్టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్గేమ్ ఆడుతున్నారు. -
ఈ నెల కొత్త పింఛన్లు లేవు
కర్నూలు(అగ్రికల్చర్): నవంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరగనుంది. జిల్లాలో 2,37,904 పింఛన్లకు రూ.103.82 కోట్లు విడుదల అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కనీసం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీనిపై కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2024 ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎప్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని టీడీపీ నేతలు ఊరువాడా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ ఊసే లేకుండా పోయింది. కొత్త పించన్లు ఇవ్వకపోగా.. ఉన్న వాటిని అడ్డుగోలుగా తొలగిస్తుండటం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి అఖిల భారత సర్వీసు అధికారుల పర్యటన కర్నూలు(సెంట్రల్): గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల పనితీరును పరిశీలించేందుకు జిల్లాకు 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించారు. ఇందులో ఒక్కరు ఐఈఎస్, ముగ్గురు ఐఎస్ఎస్, ఇద్దరు ఐసీఏఎస్, ఏడుగురు ఐఎఫ్ఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో శిక్షణలో ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనితీరును నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరిశీలించి తిరిగి వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టును నమోదు చేస్తారు. కొత్త పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 240 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడంతో 240 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటిపై రాజకీయ పార్టీలు ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఇప్పటికే ఉన్న 2,203 కేంద్రాలకు కొత్త కేంద్రాలు అదనమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు. ఆదోని టౌన్: బస్సులు నడపాలని విద్యార్థులు శుక్రవారం ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జునకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఢణాపురం ఉదయ్బాబు మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలలకు చదువుకోవడానికి ఆదోని పట్టణానికి వస్తుంటారన్నారు. బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులతో టూటౌన్ ఎస్ఐ రామ్నాథ్ మాట్లాడటంతో ధర్నా విరమించారు. -
ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం
మా జిల్లాలో ఉల్లి, పత్తికి ఎక్కువ నష్టం జరిగింది. ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. రైతులంతా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా విధి విధానాల రూపకల్పనలోనే ఉన్నామని చెబుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అతివృష్టి, అనావృష్టి. అని ప్రజలు అనుకుంటున్నారు. ఉల్లి పంటకు ఇంత ముందు రూ.1200 ఇస్తామని కొన్నారు. కానీ, రైతులకు ఆ రూ.1200 ఇప్పటికీ ఇవ్వలేదు. దాదాపు 75 శాతం రైతులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. – ఎస్వీ మోహన్రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
ప్రైవేటు చెక్ పోస్టులు ఎత్తేయాలి
● నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికుల ఆందోళన బేతంచెర్లలో నిరసన తెలుపుతున్న నాపరాతి పరిశ్రమ కార్మికులుప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద నిలిచిన నాపరాళ్ల ట్రాక్టర్లుబేతంచెర్ల: నాపరాళ్ల పరిశ్రమకు పాత పద్ధతిలోనే రాయల్టీలు మంజూరు చేస్తూ, ప్రైవేటు చెక్పోస్టులు ఎత్తేయాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం పట్టణంలోని బనగానపల్లె రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు రాయల్టీ చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న నాపరాతి పరిశ్రమపై రాయల్టీలు పెంచడమే కాకుండా ప్రైవేటుకు అప్పగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా పెద్ద తరహా పరిశ్రమలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమలను నడుపుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యజమానులు, కార్మికులు వెంకటేశ్వర్లు, చింతల నాగిరెడ్డి, మోహన్ రావు, నాగేశ్వరరావు, ఓబులేసు, సుబ్రమణ్యం, నాగేష్, లక్ష్మి కాంతారెడ్డి, ఉపేంద్ర, ప్రసాద్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
జగనన్న ఉన్నప్పుడే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంటున్నారు
నంద్యాల జిల్లాలో 5,98,750 ఎకరాల్లో పంటలు వేస్తే మొత్తం దాదాపు 36 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 17,312 ఎకరాలు, కంది 1046, మినుములు 769 హెక్టార్లు, మొక్కజొన్న 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆళ్లగడ్డలో రెండు కాలనీల మునిగిపోతే మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. వరి పంట పడిపోయింది. అరటి దెబ్బతినింది. వర్షం వల్ల బాగా ఇబ్బంది అయ్యింది. జగనన్న ఉన్నప్పుడే ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంటున్నారు. – కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి: మోంథా తుపాన్తో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని అలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. భారీ వర్షాలకు అలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి మండలాల్లో మిరప, పత్తి, కంది, వేరుశనగ, సజ్జ, ఉల్లి, టమాట పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇటీవల సాగు చేసిన పప్పుశనగ, మిరప తదితర పైర్లు నీట మునిగి కుళ్లిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రకృతి సైతం రైతులపై పగబట్టినట్లు ఉందని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి, రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా హేమంత్కుమార్ ● నేడు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్ పదవీ విరమణ కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిగా డాక్టర్ హేమంత్కుమార్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన కొద్ది నెలలుగా కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా పనిచేస్తున్న గుడివాడ శ్రీనివాస్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో డాక్టర్ హేమంత్కుమార్ను తాత్కాలికంగా నియమించారు. 61 ఇళ్లు నేలమట్టం కర్నూలు(సెంట్రల్): మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో 61 ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఈమేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటల అంచనా కొనసాగుతోంది. దాదాపు 35 వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తరువాత ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించనున్నారు. వివాహ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి కర్నూలు: వివాహ సంబంధ వెబ్సైట్ల (మ్యాట్రిమోనియల్) పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఇటీవలి కాలంలో వివాహ సంబంధ వెబ్సైట్లు, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా మ్యాట్రిమోనియల్ మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పొందే నేరగాళ్లు అమాయకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నకిలీ పేర్లతో ఆకర్షణీయమైన ఫొటోలతో మ్యాట్రిమోనియల్ ప్రొఫైళ్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా మోసానికి గురైతే సైబర్ క్రైం టోల్ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. -
ఆశలను ‘కూల్చేసి’!
ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటి నిర్మాణాలను చేపట్టలేని పేదల ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసేందుకు పూనుకోవడం అనాలోచిత చర్య. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు అందించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడం దుర్మార్గం. – కే రామాంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు పలు హామీలను ఇచ్చింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలను ఇచ్చి గృహాలు నిర్మించి ఇస్తామని నమ్మబలికింది. అయితే నేటికి ఒక్క గృహాన్ని కూడా మంజూరు చేయలేదు. హామీని అమలు చేయాలి. – కే ప్రభాకర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించిన ఇళ్లపై కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, మంజూరైన ఇంటిని నిర్మించుకోలేని గృహాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలోని అధికారులు ఆయా కాలనీలను సందర్శించి నిర్మాణాలు ప్రారంభించని గృహాలను లెక్కగట్టి, వీటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలను పంపారు. ఈ లెక్కన జిల్లాలోని నాలుగు అర్బన్ ప్రాంతాల్లో 13,403 గృహాలు రద్దు కానున్నాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో ‘నవ రత్నాలు పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వర్గాల సొంతింటి కలను సాకారాం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఎలాంటి సొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి, ఉచితంగా ఇళ్లు నిర్మించుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలో 291 వైఎస్సార్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి దాదాపు 52 వేల గృహాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జగనన్న కాలనీల పేర్లను పీఎంఏవై ఎన్టీఆర్ కాలనీలుగా మార్చింది. అలాగే అప్పట్లో ఇళ్లు మంజూరైనా, వివిధ కారణాల వల్ల గృహ నిర్మాణాలు చేపట్టని పేదల ఇళ్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఒక్క ఇంటినీ మంజూరు చేయని ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తవుతున్నా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత ఇళ్లు లేని వేలాది మంది పేదలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నా, నేటికీ ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి. కేవలం అర్బన్ ప్రాంతాల్లో (కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడురు) అది కూడా సొంత స్థలాలు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పీఎంఏవై –2 కింద 2,839 మందికి గృహాలు మంజూరైనట్లు సమాచారం. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలను అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్షగా ఉంది. అయితే ఈ నిర్మాణాలు కూడా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 13,403 గృహాల రద్దుకు ప్రతిపాదనలు గ్రామాల్లో కొత్తగా ఒక్క ఇంటినీ మంజూరు చేయని ప్రభుత్వం అర్బన్లో సొంత స్థలాలున్న వారికి మాత్రమే 2,839 గృహాలు మంజూరు -
టెండర్లలో పాల్గొనొద్దు
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో టెండర్ల పనులపై అధికార పార్టీ నేతల అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు దాఖలు చేయకూడదని, తమకే పనులు కావాలంటూ బెదిరింపులు దిగే స్థాయికి చేరారు. ముక్కూమొఖం తెలియని వ్యక్తులు, కాంట్రాక్ట్ పనులు చేయని వారు, కాంట్రాక్టు లైసెన్స్ కూడా లేని వారు సైతం కార్పొరేషన్లో పెత్తనం చెలాయిస్తున్నారు. కేవలం వారికున్న అర్హత మంత్రికి అనుచరులుగా వ్యవహరించడమే. ఏడాది కాలంగా కర్నూలు కార్పొరేషన్లో వారి ఆగడా లు శృతి మించుతున్నాయి. అర్హత ఉండి నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొంటే ఏ ఒక్కరికీ అభ్యంతరం ఉండదు. కానీ అధికార పార్టీ అనే ఒకే ఒక్క అర్హతతో టెండర్ల ప్రక్రియలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా కర్నూలు నగరంలో రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొనకూడదంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇంత చేసి వారు ఏమైనా ఆ పనులు చేస్తారా... అంటే అదీ లేదు. కేవలం తమకు కావాల్సిన వారికి పనులు ఇప్పించుకుని 10 శాతం కమిషన్లు దండుకునేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్ రాజకీయం.. నగరపాలక సంస్థలో ఇటీవల అభివృద్ధి పనులకు సంబంధించి సిండికేట్ రాజకీయానికి నేతల అనుచరులు తెర తీశాారు. ఏడాది కాలంగా మంత్రికి అనుచరులుగా వ్యవహరిస్తున్నా ఒకరిద్దరు మున్సిపల్ కాంట్రాక్టర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రక్రియలో ఏ మాత్రం అనుభవం లేని పాతబస్తీకి చెందిన ఈ వ్యక్తి మున్సిపల్ అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల కోసం దందా చేస్తున్నారు. పైగా టెండర్ల ప్రక్రియ పోటీ పడి దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లకు క్లాస్లు పీకుతున్నారు. పోటీ పడి అంచనా విలువ కన్నా లెస్కు పనులు దక్కించుకుంటే ఇంకేం లాభం. సిండికేట్ అవుదాం. పోటీ లేదు. గీటీ లేదు. పనులు దక్కించుకుందాం. అవసరమైతే టెండర్లను ఎక్సెస్కు దక్కించుకుందాం. తానే దగ్గరుండి ఇంజినీరింగ్ అధికారులతో సెటిల్ చేస్తా. వాళ్ల పర్సెంటేజీలు వాళ్లకు ఇద్దాం. అంటూ బేరసారాలు చేసేశారు. ఇక బిల్లులు రాకుంటే చెప్పండి. ఇంత పర్సెంటేజీ ఇచ్చుకుంటే సరే.. ఏ పనైనా క్లియర్ చేస్తానంటూ ఇప్పటికే హామీలు ఇచ్చాడు. తాజాగా మరోసారి టెండర్ల ప్రక్రియల ఫలానా వర్కులన్నీ తమకే కావాలంటూ ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకూడదంటూ హుకుం జారీ చేయడం, వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం చర్చానీయంశంగా మారింది. ఇలా పర్సంటేజీలకు పనులు ఖరారైతే నాణ్యత పరిస్థితి ఏంటన్న అభిప్రాయాన్ని పలువురు కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. అంతా తాము నడిపిస్తాం. అంచనాలు మించి టెండర్ దాఖలు చేసినా... మైహూనా అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి ఇంజినీరింగ్ విభాగంలోని ఒక అధికారి జీ హుజూరు అంటూ వత్తాసు పలకడం విశేషం. నిఘా వర్గాలు సైతం తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సప్ గ్రూపుల్లో.. బిజినిపల్లె సందీప్ (మంత్రి అనుచరుడు) పేరుతో నగరపాలక టెండర్లకు సంబంధించి ఐడి : 854082 నోటీసు నెంబర్ : 15 నుండి 19 వరకు ఉన్న దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనవద్దని మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అలాగే 851330 – 17/8 నుంచి వరుసగా 17/9, 17/7 పనుల టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదని సదరు అనుచరుడు సూచించారు. కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఇతడు పాణ్యం అర్బన్ వార్డుల్లోను తమ వాళ్లకే పనులు ఇప్పించేందుకు చక్రం తిప్పడం గమనార్హం. -
మత్తు పదార్థాలను నియంత్రించండి
నంద్యాల: వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఉన్నత విద్యా, తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నియంత్రణ అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి తదితర మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యకూడళ్లలో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు హోర్డింగ్లను ఏర్పాటు చేసి యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ యోగేంద్ర బాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం తరపున మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. -
● ఉల్లి పంట జీవాల పాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దేవనకొండ మండలం కరిడికొండ గ్రా మానికి చెందిన రైతు మహబూబ్బాషా తనకున్న ఎకరన్నర పొలంలో రూ.1.80 లక్షల పెట్టుబడి పెట్టి ఉల్లి సాగుచేశాడు.పంట చేతికొచ్చే దశలో ఉంది. కోతకోసి మార్కెట్కి తరలించాలంటే మరో రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మార్కెట్లో ఉల్లి క్వింటా రూ.600 మించి ధర పలకకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధరతో కొనుగోలు చేసే నాథుడే లేకపోవడంతో జీవాలకు వదిలేశాడు. – దేవనకొండ -
మార్కెట్యార్డ్లో అగ్నిప్రమాదం
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గోదాంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఖాళీ గోనెసంచులు కాలిపోయాయి. రైతులు, సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించి 500 గోనెసంచుల కాలిబూడిదయ్యాయని గోనెసంచుల వ్యాపారి మాబూబాషా ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్యార్డ్ కార్యదర్శి చంద్రమౌలితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. బనగానపల్లె: భారీ వర్షాలతో నందవరం గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న 60 మేకపిల్లలు మృతి చెందినట్లు గొల్ల బర్రెన్న, హరికృష్ణ, కృష్ణ మద్దిలేటి తెలిపారు. వర్షంతో పాటు ఈదురుగాలులకు మేక పిల్లలు మృతి చెందినట్లు వారు చెప్పారు. తమకు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. -
అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటు
● బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్ దార సుధీర్ నందికొట్కూరు: వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్చార్జ్ అబుబక్కర్ మృతి పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్, యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. బుధవారం అబుబక్కర్ మృతదేహానికి డాక్టర్ దార సుధీర్, సిద్ధార్థరెడ్డి, హఫీజ్ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబుబక్కర్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో కొనసాగుతూ జిల్లా స్థాయికి ఎదిగారన్నారు. ఆయన లేని లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్రెడ్డి, కౌన్సిలర్లు నాయబ్, సురేష్, రవూఫ్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు పుల్యాల నాగిరెడ్డి, చంద్రమౌళి, రమేష్నాయుడు, అవాజ్ కమిటీ నాయకులు సుభాన్, అబ్దుల్ జబ్బార్, ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ తదితరులు నివాళులర్పించారు. -
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మహానంది: సీతారామాపురం గ్రామానికి చెందిన చింతపూత నరసింహుడు(71) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. నరసింహుడు గ్రామ సమీపంలోని చెంచయ్య పొలం వద్ద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొందన్నారు. మృతుడి భార్య వెంకటసుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పాములపాడు: ఉధృతంగా ప్రవహిస్తున్న సుద్దవాగులో నాగేశ్వరయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లి మండలం నాగంపల్లికి చెందిన వెంకటేష్, పరమేశ్వరుడు, నాగేశ్వరయ్యలు పాములపాడు నుంచి బైక్పై వెళ్తున్నారు. పరమేశ్వరుడు ముందుగానే బైక్నుంచి దిగాడు. మిగతా ఇద్దరూ అలాగే వెళ్లారు. అదపు తప్పి బైక్ కిందదపడటంతో సుద్దవాగు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న చెలిమిల్ల గ్రామస్తులు స్పందించారు. వెంటనే వెంకటేష్ను కాపాడారు. అయితే నాగేశ్వరయ్య ఆచూకీ తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు పుట్టీల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య నంద్యాల(అర్బన్): పట్టణ శివారు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమ్రాన్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు మందలించడంతో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హరికిషన్కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
కర్నూలు కల్చరల్: జిల్లాకు చెందిన బాలల కథా రచయిత డాక్టర్ ఎం.హరికిషన్కు సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం హైదరాబాద్లో ని తెలుగు కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచా ర్య వెలుదండ నిత్యానందరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయుడు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం విభాగాధిపతి ఎస్.రమేష్, రిజిస్ట్రార్ కోట్ల హ నుమంతరావు తదితరులు హరికిషన్కు పురస్కారాన్ని అందజేశారు. సంయుక్త అక్షరాలు లేకుండా విద్యార్థుల్లో ఉత్తమ విలువలు పెంపొందించేలా అత్యంత సులభమైన శైలిలో రచించిన చందమామ పుస్తకంలోని 25 కథలు పిల్లల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వాళ్లను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని, నవ సమాజ నిర్మాణంలో భాగమవుతాయని, ఇప్పటి తరానికి ఇటువంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో ఉందని అతిథులు పేర్కొన్నారు. -
పాల వ్యాన్ డ్రైవర్పై చేయి చేసుకున్న ఎంవీఐ
పత్తికొండ: పాల వ్యాను డ్రైవర్పై ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకోవడంతో పత్తికొండలోని బైపాస్ రహదారిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం నుంచి ఆదోనికి వెళ్తున్న పాలవ్యానును తనిఖీల్లో భాగంగా రికార్డుల పరిశీలన కోసం బైపాస్ రహదారిలో ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎండీ అవైస్ వాహనాన్ని ఆపారు. పాలవ్యాను డ్రైవరు చరణ్రెడ్డి బండి రికార్డులను చూపడంలో కాస్త ఆలస్యం చేయడంతో ఎంవీఐ డ్రైవరుపై బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. బండి పేపర్లు లేకపోతే జరిమానా వేయాలి కాని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న స్థానికులు ఎంవీఐను నిలదీయడంతో అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో బైపాస్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంవీఐ చేయి చేసుకోవడంతో డ్రైవరు చరణ్రెడ్డి రహదారిపై బైఠాయించి నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శివాజీనాయక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పాలవ్యాను, డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పాల లారీ కావడంతో సరుకును ఆదోనిలో దింపి రావాలని చెప్పి పంపించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. వివాదాలకు కేరాఫ్ ఆదోని ఎంవీఐ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జరిమానాలు విధించకుండా వాహనదారులపై చేయి చేసుకోవడం ఆదోని ఎంవీఐ కెంఎడి అవైస్కు పరిపాటిగా మారింది. గతంలో బెంగళూరుకు చెందిన న్యాయవాది తన కుటుంబసభ్యులతో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదోని మండలం బిణిగేరి వద్ద వాహనాల తనిఖీలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో ఎంవీఐ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా న్యాయవాది కారు బ్యానెట్పై ఎక్కగా దాదాపు రెండు కిలో మీటర్లు దూరం తీసుకెళ్లారు. అక్కడి స్థానికులు ఎదురు తిరగడంతో వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం మరోసారి పాలవ్యాను డ్రైవర్పై దురుసుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎంవీఐ కేఎండీ అవైస్ను వివరణ కోరగా రికార్డులను చూపడంలో పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు దురుసుగా మాట్లాడటంతోనే తాను చేయి పైకెత్తానని తెలిపారు. -
భూసార పరీక్ష ఫలితాలపై అవగాహన కల్పించండి
కర్నూలు(అగ్రికల్చర్): భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు అవగాహన కల్పించాలని కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మండలాల వ్యవసాయ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 6,500 భూసార పరీక్ష ఫలితాల కార్డులు వచ్చాయని, వీటిని రైతులకు అందజేసి ఫలితాలను బట్టి వచ్చే రబీలో స్థూల, సూక్ష్మ పోషకాలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షల్లో సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్లు తేలితే 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ పోషకాలను పంపిణీ చేస్తామని రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో సాంంకేతిక ఏఓ శ్రీవర్ధన్రెడ్డి, ఏఓలు దస్తగిరిరెడ్డి, రవిప్రకాశ్, విష్ణువర్ధన్రెడ్డి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. కర్నూలు: జిల్లా పోలీసు శాఖకు జూడో, క్లస్టర్ ఆటల పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 10వ జాతీయ పోలీస్ జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుంచి ఆర్ఎస్ఐ కల్పన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరచి కరాటేలో కాంస్య పతకం, పెన్కాక్ సిలాట్లో వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్పీ తన క్యాంప్ కార్యాలయంలో ఆమెను సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ జావెద్ పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో మే నెలలో నిర్వహించిన బీఈడీ మూడో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 1098 మంది రీ వాల్యుయేషన్కు దర ఖాస్తు చేసుకోగా 955 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలు htt pr://rayareemauniverrity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
అత్యాశతో అవినీతికి పాల్పడరాదు
● డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులు అత్యాశతో అవినీతికి పాల్పడి ఉద్యోగ ధర్మానికి అన్యా యం చేయరాదని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. ఆత్మసాక్షితో విధులను నిర్వహించి పేదలకు సేవ చేయాలని, అప్పుడు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025 కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడారు. ఈనెల 31న దేశ తొలి ఉప ముఖ్యమంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అవినీతి నివారణపై ప్రజ లు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నవంబర్ 2 వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఎంతో కష్టపడి చదివి లక్షల మందితో పోటీ పడి సాధించిన ఉద్యోగాన్ని పది మంది మంచి కోసం వినియోగించాలన్నారు. ఉద్యోగ ధర్మంలో అవినీతి అక్రమాలకు పాల్పడి సమాజంలో తలదించుకుని బతికే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ మధ్య ఉద్యోగులకు వస్తున్న ఫేక్ ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టు పేరుతో వస్తున్న వాటికి భయపడాల్సిన అవసరంలేదని, నీతి, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నిబంధనల మేరకు 1000 కంటే ఎక్కువ నగదు ఉంచుకోరాదని సీసీఎల్ఏ రూల్స్ చెబుతున్నట్లు చెప్పారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాలను ఏటా వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమన్నారు. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు. వచ్చే జీతంతో ఆనందంగా జీవనం గడపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా చిన్న పిల్లల ఆరోగ్య అధికారి జఫరుల్లా, ఏసీబీ ఇన్స్పెక్టర్లు కృష్ణ, రాజా ప్రభాకర్ పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో ఇదీ పరిస్థితి..
మోంథా తుపాను ప్రభావంతో కర్నూలు జిల్లాలో దాదాపు 4వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హొళగుంద, కోసిగి, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, మద్దికెర మండలాల్లోని 27 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంది. వరి 1,500 ఎకరాలు, శనగ 2,500 ఎకరాల ప్రకారం దెబ్బతిన్నాయి. వరికి ఎకరాకు రూ.30 వేలు, శనగకు ఎకరాకు రూ.15 వేల ప్రకారం రూ.7.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో ఓర్వకల్లో 57.8 మి.మీ, కర్నూలు రూరల్లో 37.6, కల్లూరులో 34.6, కర్నూలు అర్బన్లో 34.2, వెల్దుర్తిలో 23, గూడూరులో 14.8, క్రిష్ణగిరిలో 14.4 మి.మీ వర్షపాతం నమోదైంది. -
లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి బియ్యం, కందిపప్పుతోపాటు నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో మొత్తం 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలన్నీ జలమయం అయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే పంట మట్టిపాలైంది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల ఎకరాలకు పైగా వరి పంటలు ధ్వంసమయ్యాయి. శ్రీశైలం: తుపాన్ కారణంగా శ్రీశైలానికి చేరుకునే వాహనాలను మున్ననూరు, దోర్నాల చెక్పోస్టుల వద్ద మంగళవారం రాత్రి నుంచి నిలుపుదల చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో అమ్మవారి ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు నిండిపోయి ఆలయ ప్రాకార దక్షిణ మాడ వీధిలో వరదలా ప్రవహించింది. పాతాళగంగ రోప్వే నుంచి ఘాట్ల వరకు ఉన్న రోడ్డు మార్గంలో కొండ రాళ్లు విరిగిపడటంతో తాత్కాలికంగా వేసుకున్న షాపులు కూలిపోయాయి. -
చాలా బాధగా ఉంది
ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడం చాలా బాధగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి తక్కువగానే వచ్చింది. కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పంట దిగుబడి ఆదాయం వస్తుందని భావించాను. మా కష్టం నీటిపాలు అయ్యింది. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని న్యాయం చేయాలి. – రాజేంద్రప్రసాద్, ఆత్మకూరు మార్కెట్యార్డులో ధాన్యాన్ని నిల్వ ఉంచితే తడవదని భావించాం. వ్యాపారులు రావడంతో 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కాటా వేసి ఉంచాం. ఊహించని విధంగా గోడౌన్లో దాచుకున్న ధాన్యమంతా తడిచింది. ఈ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. ఆరబోసేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి. – భాస్కర్రెడ్డి, ఆత్మకూరు మాకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేసి సంబరపడ్డాను. పెట్టుబడి పోయి అంతోఇంతో వస్తుందని భావించాను. అయితే పంట ఇలా వరదపాలవుతుందని ఊహించలేదు. అప్పులను మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – సాంబశివుడు, క్రిష్ణాపురం -
తుపాను గుప్పిట్లో అన్నదాతలు
మోంథా తుపాను గుప్పిట్లో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. అతి భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కోతల వేళ తుపాను చుట్టుముట్టడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 21 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే జిల్లాను ముసురు పట్టుకుంది. జిల్లా యంత్రాంగం వర్షపాతం నమోదు వివరాలను ప్రతి 3–4 గంటలకు పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. 322 హెక్టార్లలో పంట నష్టం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రాథమికంగానే అతి తక్కువగా చూపడం గమనార్హం. మోంథా తుపాను ప్రభావం హొళగుంద, చిప్పగిరి, కోసిగి, పెద్దకడుబూరు మండలాల్లోని ఎనిమిది గ్రామాలపై ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తం 322 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రకటించారు. హొళగుంద మండలంలో 150 హెక్టార్లు, కోసిగి మండలంలో 120 హెక్టార్లలో వరి, చిప్పగిరి మండలంలో 17 హెక్టార్లలో శనగ మొత్తం 287 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. కాగా పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో 30 హెక్టార్లు, కోసిగి మండలం డి.బెళగల్ గ్రామంలో 5 హెక్టార్లలో మిరప పంట దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు రూ.11.75 లక్షల మేర నష్టం వాటిళ్లింది. -
పంట కోతలు వాయిదా వేసుకోండి
తుగ్గలి: మోంథా తుపాను నేపథ్యంలో రైతులు పంట కోతలను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. మంగళవారం ఆమె రాతన శివారులో రైతులు ఉల్లిగడ్డలను గ్రేడింగ్ చేసుకోవాడాన్ని పరిశీలించి స్వయంగా కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్ష దాకా ఖర్చు పెట్టామని, దిగుబడి బాగానే వచ్చినా పైసా మిగల్లేదని రైతులు వాపోయారు. రైతులు సాగు చేసిన ప్రతి పంటను కచ్చితంగా ఈ–క్రాప్ బుకింగ్ చేయాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామ సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో వసతి సౌకర్యాలు, మెనూ ప్రకారం భోజనం, బోధనపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్, తుగ్గలి తహసీల్దార్ రవి, ఎంపీడీఓ విశ్వమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి, ఏఓ సురేష్, ఎంఈఓలు మాలతి, వెంకటేశ్వర్లు, ఏపీఓ హేమసుందర్ ఉన్నారు. -
ఎన్సీసీతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు సిటీ: విద్యార్థి దశలో ఎన్సీసీలో చేరితే క్రమ శిక్షణతో పాటు, శారీరక ఆరోగ్యం మెరుగై ఉజ్వల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తుందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఎన్సీసీలో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎన్సీసీ 28 ఆంధ్ర బెటాలియన్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ శశికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపిక ప్రక్రియకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉన్నత విద్యలోనూ, పోలీసు శాఖ, త్రివిధ దళాల ఉద్యోగాల ఎంపికలోనూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాలేజీ నుంచి 60 మందికి అవకాశం ఉంటే 75 మంది పోటీ పడ్డారన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ 28వ ఆంధ్రా బెటాలియన్ పురుషుల ఆఫీసర్ డాక్టర్ ఎ బంగారుబాబు, ఎన్సీసీ ఆఫీసర్ జక్తర్ సింగ్, పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 11 నుంచి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు కర్నూలు టౌన్: చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని నవంబర్ 11, 12 తేదీల్లో కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ (బాల బాలికలు), హ్యాండ్బాల్ (బాలబాలికలు), ఫుట్బాల్ (బాలురు), బాస్కెట్బాల్ (బాలికలు), రగ్బీ (బాల బాలికలు), చెస్ (బాల బాలికలు), రైఫిల్ షూటింగ్ (బాల బాలికలు) తదితర క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే ఆయా స్కూళ్ల జట్ల వివరాలను నవంబర్ 7లోపు పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 93938–27585 నంబర్ను సంప్రదించాలన్నారు. -
వెల్ఫేర్ సొసైటీలో సభ్యత్వం తీసుకోండి
కర్నూలు(అర్బన్): జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు నవంబర్ 23న జరగనున్న దృష్ట్యా, సొసైటీలో సభ్యత్వం తీసుకోని ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ నెల 31లోగా తీసుకోవాలని ఎన్నికల కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కోరారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్మెన్ సొసైటీకి నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 9న నామినేషన్లను దాఖలు, 12న పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని, అభ్యర్థుల అవగాహన సమావేశాన్ని 13న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 23న ఓటింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. సీనియర్ సభ్యులు పురుషోత్తం మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో సీనియర్ సభ్యులు కేడీవీఎం రెడ్డి, వాసు, ప్రసాద్, గోవర్దన్, రవీంద్ర పాల్గొన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలి నంద్యాల(న్యూటౌన్): కనీస వేతనం, హెచ్ఆర్ పాలసీ అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వీఓఏల సంఘంం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రూపాదేవి, ధనలక్ష్మి సూచించారు. స్థానిక జేకే ఫంక్షన్ హాల్లో వీఓఏల సంఘం రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర వీఓఏల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 13 మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను, 43 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులు వీఓఏలపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలని, 5జీ మొబైల్స్, సిమ్ కార్డ్స్, రెండేళ్ల సీ్త్రనిధి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సురెన్స్ కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తీర్మానించారు. వీటి సాధనకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మహా సభల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, నాయకులు పుల్లా నరసింహులు, లక్ష్మణ్, తోట మద్దులు, గౌస్, బాలవెంకట్, తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీప పొలాల్లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన కమ్మరి దస్తగిరి ఆచారి (38) మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దస్తగిరి ఆచారికి చెల్లెలిచెలిమ గ్రామానికి చెందిన వరలక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. మృతుడి భార్య వరలక్ష్మి పి.కోటకొండ గ్రామంలో ఆశావర్కర్గా పనిచేస్తోంది. కాగా వివాహమైనప్పటి నుంచి భార్య భర్తలిద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనేపథ్యంలో 4 నెలల క్రితం వరలక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగాన్ని రూ.2 లక్షలకు ఇతరులకు అమ్ముకుని, భర్తను వదిలేసి కర్నూలు చేరి అక్కడే జీవనం సాగిస్తోంది. అనంతరం మృతుడు దస్తగిరి కూడా కర్నూలు వెళ్లి భార్యతో రాజీపడి అక్కడే కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దస్తగిరి 15 రోజుల క్రితం కారుకు డ్రైవర్గా బళ్లారికి వెళ్లి అక్కడి నుంచి పలుమార్లు ఫోన్ చేసినా భార్య స్పందించలేదు. దీంతో కర్నూలు చేరుకున్న దస్తగిరి భార్య వరలక్ష్మిపై అనుమానంతో మూడు రోజుల నుంచి తీవ్రంగా గొడవపడుతున్నాడు. ఈ విషయంపై సోమవారం రాత్రి వరలక్ష్మి సోదరుడు కమ్మరి మధు, పెద్దమ్మ కుమారుడు వీరేష్లిద్దరూ కలిసి మృతుడు దస్తగిరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఏమి జరిగిందో తెలియదు కానీ దస్తగిరి ప్యాలకుర్తి పొలాల్లో శవమై కన్పించాడు. కాగా భార్య సోదరులు కమ్మరి మధు, వీరేష్లతో కలిసి తమ కుమారుడు దస్తగిరి ఆచారిని దారుణంగా కొట్టి, గొంతుకు ఉరేసి చంపి ఇక్కడ పడేశారంటూ మృతుడి తండ్రి వెంకటరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోడుమూరు ఇన్చార్జ్ సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. -
కిలో టమాట రూ.50
కర్నూలు(అగ్రికల్చర్): రిటైల్ మార్కెట్లో టమాట ధర అమాంతం పెరుగుతోంది. కర్నూలు రైతుబజారులో ఎలాంటి నాణ్యత లేని టమాట కిలో ధర రూ.26 పలుకుతోంది. బయటి వ్యాపారులు కిలో రూ.50 పైనే విక్రయిస్తున్నారు. రైతులకు మాత్రం టమాట ధర సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. సోమవారం పత్తికొండ మార్కెట్లో క్వింటా టమాటకు కనిష్టంగా రూ.1,200.. గరిష్టంగా రూ.2వేల ధర మాత్రమే లభించింది. సగటు ధర రూ.1,600 నమోదైంది. మార్కెట్లో టమాటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. వినియోగదారులను మాత్రం టమాట ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతంత మాత్రం వచ్చిన దిగుబడులు కూడా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిపోవడంతో స్థానికంగా టమాటకు కొరత ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చంద్రబాబువి చెత్త ఆలోచనలు
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం: సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. స్వార్థం కోసం ఇలాంటి కుట్రకు తెరతీయడం సబబు కాదన్నారు. మంగళవారం మంత్రాలయంలోని వాసవీ కల్యాణ మంటపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నా కూటమి పాలకులల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సదాలోచనతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. గతాన్ని మరిచిపోవద్దు.. తాను పెట్టిన భిక్షతోనే టీడీపీ నేత రాఘవేంద్రరెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు వచ్చిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆయన తండ్రి రామిరెడ్డికి కేడీసీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఎదిగారని గుర్తు చేశారు. రాఘవేంద్రరెడ్డి కుటుంబం గతాన్ని మరిచి వ్యవహరిస్తోందని పేర్కొ న్నారు. ఇలాంటోళ్లు ఎంతమంది పోటీకి వచ్చినా వచ్చే ఎన్నికల్లో ఐదోసారి తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అండదండలు ఉన్నంత కాలం తనకు ఓటమంటూ లేదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి, మండల కన్వీనర్ జి.భీమారెడ్డి, పార్టీ జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ గురురాజారావు, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచులు హోటల్ పరమేష్, వీరనాగుడు, వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్శెట్టి, నాయకులు దశరథరెడ్డి, రోగప్ప, సూగూరు లక్ష్మయ్య, బొంబాయి శివ, వీరారెడ్డి, మదుసూధన్రెడ్డి, శంకర్, నరసింహులు, గోపిస్వామి తదితరులు పాల్గొన్నారు.కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం కూటమి ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానం రద్దుకు కోటి సంతకాల సేకరణ కార్యాచరణ చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి లక్ష్యానికి మించి సంతకాలు సేకరిద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 60 వేలకు పైగా సంతకాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మంత్రాలయం నుంచి అధికంగా సంతకాలు సేకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఆహా..ఓహో.. అని డప్పు కొట్టుకుంటోందని వై.బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు ఎన్నటికీ చేతకాదన్నారు. మూడేళ్లు గడిస్తే రెడ్ రాజ్యాంగం తుడిచిపెట్టుకు పోతోందన్నారు. కూటమిని కూకటి వేళ్లతో పీకేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. -
విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ నాయకుడి మృతి
నందికొట్కూరు: విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ ఉమ్మడి కర్నూలు జిల్లా జోనల్ ఇన్చార్జ్ అబుబక్కర్(షేక్ షాలిమియా)(51) మంగళవారం మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. అబుబక్కర్ స్థానిక మా పల్లె దోశ హోటల్ ఎదుట ఉన్న స్టాండ్ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టూ ఉన్న వారందరూ కలిసి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పార్టీ యూత్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్ సంతాపం ప్రకటించారు. అబుబక్కర్ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడిగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని, ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. -
జిల్లా పరిషత్లో కంట్రోల్ రూమ్
● మూడు షిఫ్టుల్లో ఆరుగురు ఉద్యోగుల విధి నిర్వహణ కర్నూలు(అర్బన్): మోంథా తుపాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కంట్రోల్ రూమ్లో ఈ నెల 31వ తేది వరకు 24 గంటలు సేవలు అందించేందుకు ఆరుగురు ఉద్యోగులు మూడు షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9885050659, 9603944141, 8247569269, 9494734090, 9014581332, 9848498816 నెంబర్లను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీసీఏ నిబంధల మేరకు చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కంట్రోల్ రూమ్కు డిప్యూటీ ఎంపీడీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఎంపిక చేసిన సచివాలయ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తారన్నారు. -
గమ్మత్తు కనరా..!
ఊరూరా ఏటీఎం (ఎనీ టైం మద్యం) దుకాణాలు వెలిశాయి. చిరు దుకాణాలు బెల్ట్షాప్లుగా మారాయి. పరదాల చాటున మినీ బార్లను తలపిస్తున్నాయి. మందు కోసం పట్టణాలకు రావాల్సిన అవసరం లేదు. పక్క వీధిలో అడుగుపడితే చేతిలో సీసా ప్రత్యక్షమవుతోంది. అవసరమైతే అక్కడే సిట్టింగ్ వేసినా అడిగేవారు ఉండరు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఓ వైపు మద్యం దుకాణదారులు నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తుండగా మరో వైపు పల్లెల్లో బెల్ట్ షాపు దందా ఫుల్గా సాగుతోంది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు, దారుణాలు చోటు చేసుకుంటున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. – సాక్షినెట్వర్క్ ఈర్నపాడు గ్రామంలోని బెల్ట్ షాప్ వద్ద ఉన్న పర్మిట్ రూమ్లో వాడేసిన లిక్కర్ బాటిళ్లు మహానందిలో కూల్ డ్రింక్స్ ట్రేలో క్వార్టర్ బాటిళ్లు పెట్టిన దృశ్యం -
మనవడిని చూడకుండానే మృత్యుఒడికి!
● ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని మహిళ మృతి ● మరో 16 మందికి గాయాలు అవుకు(కొలిమిగుండ్ల): కోడలు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరగా చూసేందుకని బయలుదేరిన ఓ మహిళ.. మార్గమధ్యలో మృత్యుఒడికి చేరింది. ఉప్పల పాడు ఆర్చీ సమీప మలుపు రోడ్డులో మంగళవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో అవుకు మండలం శివవరానికి చెందిన చాకలి లక్ష్మీదేవి(55) మృతిచెందగా మరో 16 మంది గాయాలపాలయ్యారు. ప్రయాణికులు తెలిపిన వివరాలు.. బనగానపల్లె డిపో హైర్ బస్సు 36 మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకుని తాడిపత్రికి బయలుదేరింది. ఆర్చీ సమీపాన ఉన్న శ్రీకృష్ణుడి గుడి వద్దకు చేరుకోగా మలుపులో బనగానపల్లె వైపు వెళ్తున్న లారీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మీదేవి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ కనకాద్రిపల్లెకు చెందిన నాగరాజు, అంకిరెడ్డిపల్లె లక్ష్మీనారాయణమ్మ, అవుకు కృష్ణవేణమ్మ, గోర్లగుట్టకు చెందిన లక్ష్మీదేవి, పునీత్, చౌడమ్మ, నడిపి సుబ్బరాయుడు, అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన నాగేంద్రతో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. లక్ష్మీదేవి మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. ఈమె కోడలు సుకన్య (కుమారుడి భార్య) పురిటి నొప్పులతో తాడిపత్రి ఆసుపత్రిలో చేరిందని బంధువులు ఫోన్ చేయడంతో చూసేందుకని వెళ్లి ప్రమాదం బారిన పడింది. కాగా లక్ష్మీదేవి మృతి చెందిన కొద్ది నిమిషాలకే కోడలు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనవడిని చూడకుండానే పోయావా అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంట తడిపెట్టింది. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి, అవుకు ఎస్ఐ రాజారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన నలుగురిని కుటుంబ సభ్యులు నంద్యాల, కర్నూలుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ తీవ్రంగా గాయపడిన గోర్లగుట్ట లక్ష్మీదేవి -
జీడీపీ నీటి విడుదల
గోనెగండ్ల: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీడీపీ నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నాలుగో క్రస్ట్ గేటు ద్వారా 336 క్యూసెక్కుల నీరు హంద్రీ నదిలోకి విడుదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వెయ్యి క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి వచ్చి చేరుతోంది. 3.7 టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టును మంగళవారం ఇరిగేషన్ ఈఈ పాండురంగయ్య, డీఈ సుబ్బారాయుడు పరిశీలించారు. -
పోలీసుల అప్రమత్తతతో తల్లీబిడ్డలు సురక్షితం
మంత్రాలయం: పోలీసుల అప్రమత్తతతో తల్లీ, బిడ్డలు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్ఐ శివాంజల్ తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన సౌమ్య శివానంద్ భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో మంగళవారం తెల్లవారుజామున మంత్రాలయం చేరుకుంది. పిల్లలతో కలిసి తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. బెంగళూరులోని బిడిది పోలీస్ స్టేషన్ ఎస్ఐ ద్వారా విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగరాజులను అప్రమత్తం చేశారు. వారు నదీ తీరంలో గాలింపు చేపట్టి సౌమ్య శివానంద, కుమారుడు భువనేష్, కూతురు చార్విని గుర్తించి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరులు సనత్కుమార్, సచిన్, రాహుల్ను పిలిపించి అప్పగించారు. -
రక్తదానం చేసి.. స్ఫూర్తి నింపి..
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలం కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీపీఓలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అమీలియో హాస్పిటల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, జెమ్కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. డీపీఓలో 110 మంది, ఏపీఎస్పీ పటాలంలో 60 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరాల్లో పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘పోటెత్తిన’ అదనపు బాధ్యతలు
నిర్లక్ష్యం.. నీరుగారిన ఆశయం రాయలసీమ జిల్లాల్లోనే అత్యంత కీలకమైనది హంద్రీనీవా ప్రాజెక్ట్సు. ఈ ప్రాజెక్టు ఫేజ్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. అదనపు బాధ్యలతోనే నెట్టుకొస్తున్నారు. నాణ్యత విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు కొంత మంది పక్క జిల్లాల్లో నివాసం ఉంటారు. ఓ ఇంజనీర్ అతిథిగా వచ్చి 15 రోజులకు, నెలకొసారి వచ్చి పోతుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతి పొలానికీ నీరు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతన్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. సాగునీటి ప్రాజెక్టుల ఆశయమే నీరుగారిపోతోంది. జల వనరుల శాఖలో కీలకమైన సర్కిల్స్కు రెగ్యులర్ పర్యవేక్షక ఇంజనీర్లు లేరు. ఈఈలుగా పని చేస్తున్న వారికి అదనపు బాధ్యతలుగా ఎస్ఈ పోస్టులను అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి ఆ శాఖలో పని చేస్తున్న ఈఈలకు పదోన్నతులు ఇచ్చి రెగ్యులర్ ఎస్ఈలను నియమించాల్సి ఉంది. -
75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసాల సాగుకు మొక్కజొన్న, జొన్న విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విత్తనాలు 5 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు మొక్కజొన్న విత్తనాలు 10 టన్నులు, జొన్న విత్తనాలు 10 టన్నుల ప్రకారం కేటాయించారన్నారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ పూర్తి ధర రూ.340 ఉండగా.. సబ్సిడీ రూ.255 ఉంటుందని.. రైతులు రూ.85 చెల్లించాలన్నారు. జొన్న 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని.. రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏక వార్షిక విత్తనాలైన జొన్న, మొక్కజొన్న విత్తనాలను అన్ని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు లేవు ఆలూరు: జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు మంజూరు చేయలేమని ఆలూరు హౌసింగ్ డీఈ జె.విజయ్కుమార్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ఆలూరులో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐ సర్వే ద్వారా పక్కాగృహాలను మంజూరు చేయాలని ఉన్నతాధికారులు నుంచి తమకు ఉత్తర్వులను అందాయన్నారు. నవంబర్ 5 నాటికి పక్కాగృహాలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాలంటే అందుకు గ్రామ సచివాలయంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
విద్యార్థులూ.. ఇదీ పోలీస్ ‘గన్’ కీర్తి!
● ఆయుధాలు చూపించి అవగాహన కల్పించిన ఎస్పీ దంపతులు ● ముగిసిన ఆయుధాలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనకర్నూలు: ‘విద్యార్థులు ఇదిగో ఏకే 47 .. దూరంలో ఉన్న లక్ష్యాన్ని తునాతునకలు చేస్తుంది. ఇదిగో ఇదేమో డ్రోన్ కెమెరా.. చాలా ఎత్తుకు ఎగిరి అక్కడ జరిగే ప్రతి దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది. ఇది దిశ ఎస్ఓఎస్ యాప్ ... ప్రతి సెల్ఫోన్లోను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆడపిల్లలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఫోన్ ఊపితే చాలు మీరు ప్రమాదంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసి పోతుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని రక్షిస్తారు. ఇవేమో పోలీసు జాగిలాలు.. దొంగల ఆచూకీ కనుగొని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి’ అంటూ విద్యార్థులకు ప్రతి అంశాన్ని ఎస్పీ దంపతులు విక్రాంత్ పాటిల్, దీపికా పాటిల్ వివరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ కర్నూలు 2వ పటాలం మైదానంలో కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలీసులు శాంతి భద్రతలకు ఉపయోగించే ఆయుధాలు, నేర నిర్దారణకు వినియోగించే పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు కొద్దిసేపు ఉపాధ్యాయుల్లా వ్యవహరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కమ్యూనికేషన్స్పై అవగాహన పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థ, ఫోరెన్సిక్ సామాగ్రి పనితీరు తదితర వాటిపై అక్కడున్న సిబ్బంది కూడా విద్యార్థులకు వివరించారు. పిస్టల్, తుపాకీ వినియోగం, టియర్ గ్యాస్ వినియోగం, బాంబుల గుర్తింపు, వాటిని నిర్వీర్యం చేయడం, వేలి ముద్రల సేకరణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధుల రక్షణకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తారో వివరించారు. ఆయుధ ప్రదర్శనను వీక్షించేందుకు కర్నూలులోని పలు పాఠశాలల విద్యార్థులు వచ్చారు. డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ అడిషినల్ ఎస్పీ క్రిష్ణమోహన్, ఆర్ఐలు పోతుల రాజు, జావేద్, నారాయణ తదితరులు పాల్గొనగా, ఏపీఎస్పీ 2వ పటాలంలో ఇంచార్జీ అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, మహబూబ్ బాషా, అసిస్టెంట్ కమాడెంట్లు రవికిరణ్, డీవీ రమణ, వెంకట శివుడు, రిజర్వు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కొలిమిగుండ్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. బెలుం గుహల ఆవరణలోని మీటింగ్ హాల్లో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వరయ్యను ముందుగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికై నందుకు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రైతులకు ఏ పంటకూ గిట్టు బాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఉల్లి రైతులకు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాక ముందు, వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఒకే సారి రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. భూ బ్యాంక్ అంటూ ప్రతి నియోజకవర్గంలో లక్షల ఎకరాలు సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు శ్రీకారం చుడుతున్నారన్నారు. రాజధానికి సమీపంలోనే ఎయిర్పోర్టులు ఉన్నా కొత్తగా కట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రధాని ఎజెండాను మోస్తున్నారని విమర్శించారు. రూ.6,400 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నా యని గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తుండటం దుర్మార్గమన్నారు. రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యేలు పోర్టుల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడటం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై సీపీఐ నిర్విరామంగా పోరాటం సాగిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి రంగమనాయుడు, మండల రైతు సంఘం నాయకులు పుల్లయ్య, పెద్దయ్య, వేణుగోపాల్రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కు అప్పగించడం దారుణం ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం -
ఇలకై లాసం.. కార్తీక శోభితం
శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చా రు. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు లక్ష వత్తులు వెలిగించి నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు బిస్కెట్లు, అల్పాహారం అందించారు. కమనీయం..లక్షదీపోత్సవం కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. అలాగే లక్షదీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వీరన్నస్వామి, మార్కండేయశాస్త్రి ఇచ్చారు. భక్తులు హారతులను కనులారా తిలకించి స్వామిఅమ్మవార్లను దర్శించి నేత్రానందభరితులయ్యారు. ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు. మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు -
అధ్వాన రోడ్డుపై ప్రజల ఆందోళన
సి.బెళగల్: ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలను అడ్డుకుని ప్రజలు ధర్నా చేపట్టారు. సోమవారం సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ ప్రజలు గ్రామం దగ్గర అధ్వాన రోడ్డు దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యపు తీరుపై మండిపడుతూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామం దగ్గర ఎమ్మిగనూరు – గూడూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై సంవత్సర కాలంకు పైగా దాదాపు మీటరున్నర గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా మారడంతో రోడ్డును బాగు చేయాలని అధికారులకు, టీడీపీ నేతలకు చెప్పి పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రజలు ధర్నా చేశారు. దీంతో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వాహనాలు ఆగిపోయాయి. ప్రజా నిరసనకు గ్రామ రైతులు, యువకులు, విద్యార్థులు, ప్రయాణికులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం మండల కేంద్రం సి.బెళగల్కు చేరుకుని తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ రాణెమ్మ, ఎస్ఐ పరమేష్ నాయక్కు ప్రజలు వినతిపత్రాలు ఇచ్చారు. ఆత్మ పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీలత కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఏడాది జూన్ వరకు ఇక్కడే ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం ఎమ్మిగనూరు ఫామ్ డీడీఏగా బదిలీ అయ్యారు. అక్కడ నాలుగు నెలల పాటు పనిచేశారు. ఇటీవల శ్రీలతకు జేడీఏగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఆత్మ పీడీ పోస్టులో నియమిస్తూ ఇటీవల వ్యవసాయ శాఖ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం
● మూడు రోజులుగా 24 కేసులు నమోదు ● రూ.1.45 లక్షలు జరిమానాలు విధించిన అధికారులు నంద్యాల(న్యూటౌన్): పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తామని నంద్యాల జిల్లా రవాణా అధికారి శివారెడ్డి హెచ్చరించారు. సోమవారం డీటీఓ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో నంద్యాల ప్రాంతంలోని ప్రధాన జాతీయ రహదారిలో మూడు రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు చేశామన్నారు. మూడు రోజుల నుంచి 14 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒక బస్సును సీజ్ చేశామన్నారు. మూడు రోజుల్లో రూ.1.45 లక్షలు జరిమానా విధించినట్లు డీటీఓ తెలిపారు. కొన్ని ట్రావెల్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్లు లేని పక్షంలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో సీజ్ చేస్తామన్నారు. -
అడుగడుగునా ‘మందు’పాతర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం లభిస్తోంది. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తోంది. బెల్టు షాపుల నిర్వహణకు అడ్డూఅదుపూ లేకపోవడంతో 16 సంవత్సరాలు దాటని పిల్లలు కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. – సాక్షినెట్వర్క్ ఎమ్మిగనూరు పట్టణంలో మంత్రాలయం రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్ -
ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని పాతబస్టాండ్, 2వ వార్డు, 4వ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా వైద్యాన్ని ప్రెవేటు వ్యక్తులకు ఇస్తే సహించేది లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద, సామాన్య, మద్య తరగతి వర్గాలు సైతం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. వాటిని ప్రైవేటీకరణ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తోందన్నారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఎకరాల కొద్దీ ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు కుట్రలు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేశామన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, 2వ వార్డు పరిధిలోని మైనార్టీ నాయకులు ఫిరోజ్, వలీ, నాగరాజు, రాము, ఆస్లామ్, పుర్ణా, 4వ వార్డు పరిధిలోని కార్పొరేటర్ ఆర్షియా ఫర్హీన్, విక్రమ సింహారెడ్డి, ఆనంద్ రెడ్డి, మహేంద్ర, రైస్ బాబా, రాము, చిట్టిబాబు, శ్రీకాంత్, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిడ్తూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కొందరు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా పాణ్యం మండలంలోని ఎస్ కొత్తూరు శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి దర్శనానికి ఆటోలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తిరిగి ఆటోలో వెళ్తుండగా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడగా అందులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన బోయ సరస్వతి (55), మహేశ్వరమ్మకు తీవ్ర గాయాలు కావడంతో 108లో కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్ఐ ధనుంజయ.. గాయపడిన ఆటో డ్రైవర్ బోయ రాఘవేంద్ర, లక్ష్మీదేవి, గౌతమ్నంద, లక్ష్మీదేవి, మద్దమ్మ, షేక్ షరీఫాబీ, షేక్ రేష్మా, పవిత్ర, శ్యామల, షేక్ రిజ్వాన్, రాణి, కె. భవ్యశ్రీని నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతురాలి సరస్వతికి భర్త సుంకన్న, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమకు ప్రాణాధారమైన శ్రీశైలంను నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన ముఖ్యనాయకులతో కలిసి మాట్లాడుతూ.. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబిక దేవి ఒకే సన్నిధిలో వెలసిన ఏకై క క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతులతో సీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందన్నారు. 60వేల ఎకరాల భూమిని సీమ ప్రజల త్యాగంతో నిర్మించుకున్నారన్న విషయాన్ని పాలకులు మరువవద్దన్నారు. సీమ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంపై వస్తున్న వదంతులను ప్రభుత్వం ఖండిస్తూ ప్రకటన జారీ చేయాలన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని అత్యంత బాధ్యతగా తీసుకొని శ్రీశైలం సీమలోని నంద్యాల జిల్లా పరిపాలన పరిధిలోనే కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్రెడ్డి, సభ్యులు సుధాకర్రావు పాల్గొన్నారు. -
ఆంధ్రా ఉమెన్స్ టీ–20 కోచ్గా శ్రీనివాసులు
కర్నూలు (టౌన్): ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 టీ 20 క్రికెట్ మ్యాచ్లకు ఫీల్డింగ్ కోచ్గా కర్నూలు నగరానికి చెందిన వాల్మీకి శ్రీనివాసులు నియమితులయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉమెన్స్ అండర్–19 మ్యాచ్ బిహార్, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లకు ఆయన కోచ్గా వ్యవహరించడంపై కర్నూలు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా క్రికెట్ అసొసియేషన్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని వయస్సుల క్యాటగిరీలకు ఫీల్డింగ్ కోచ్గా, టీమ్ మేనేజర్ గా వ్యవహరించినట్లు వెల్లడించారు. స్కేటింగ్ సాధనతోనే పతకాలు సాధ్యం కర్నూలు (టౌన్): ప్రతి రోజు స్కేటింగ్ను సాధన చేయడం ద్వారానే పతకాలు సాధ్యమని మానవత కన్వీనర్ యాని ప్రతాప్ అన్నారు. ఆదివారం స్థానిక బి. క్యాంపు లోని ఈట్ స్ట్రీట్లో జిల్లా స్థాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. మంచి ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ.. చిన్నారులు అంతర్జాతీయ క్రీడను ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. స్కేటింగ్ క్రీడల్లో వ్యక్తిగతంగా గుర్తింపు రావాలంటే ప్రతి రోజు సాధన తప్పకుండా చేయాలన్నారు. అప్పుడే స్కేటర్లకు మంచి విజయాలు చేకూరుతాయన్నారు. స్కేటింగ్ అసోసియేషన్ సీఈవో సునీల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్కేటింగ్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే నెల 1 వ తేదీ నుంచి కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలోస్కేటింగ్ కార్యదర్శి అబూబకర్, సంయుక్త కార్యదర్శి పునీతా చౌదరి పాల్గొన్నారు. యువకుడి మృతి కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలను మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన దస్తగిరి(30) కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం 11.30 గంటల సమీపంలో కోవెలకుంట్లకు వచ్చి సుష్మిత ఫర్టిలైజర్ షాపు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతి చెందినట్లు గమనించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు. మృతుని తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. డిప్యూటేషన్పై డైట్కు అవకాశం కర్నూలు సిటీ: ప్రభుత్వ, జిల్లా, మున్సిపల్ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై ప్రభుత్వ డైట్ (బి.తాండ్రపాడు)కాలేజీలో డిప్యూటేషన్పై పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయూబ్ హూసేన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలో ఫిలాసఫి/సోషియాలజీ లెక్చరర్ ఒకటి, తెలుగు లెక్చరర్ ఒకటి, ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులను డైట్ కళాశాలలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు డైట్ కాలేజీ జూనియర్ అసిస్టెంట్ ఉదయ్ 7661913634ను సంప్రదించాలన్నారు. -
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● మూడో రోజు 14 కేసుల నమోదు ● రూ.72 వేలు జరిమానా, రూ.96 వేల పన్నులు వసూలుకర్నూలు: కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు విస్తృతం చేసి నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా మీదుగా నిత్యం 200కు పైగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. హైదరాబాద్, బెంగుళూరు, చైన్నె, తిరుపతి, విజయవాడ, షిర్డీ వంటి ప్రాంతాలకు నిత్యం ట్రావెల్స్ బస్సులు కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు వెయ్యి మందికి పైగానే రోజు ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్దం ఘటన నేపథ్యంలో రవాణా అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేశారు. ఘటన జరిగిన మొదటి రెండు రోజుల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షల జరిమానా విధించగా, 3వ రోజు శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తనఖీలు కొనసాగాయి. సుమారుగా 50కి పైగా వాహనాలను తనిఖీలు చేసి 14 బస్సులపై ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇందుకు గాను రూ.72,050లు జరిమానా విధించి, పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనాల నుంచి రూ.96 వేలు వసూలు చేశారు. తనిఖీల సందర్భంగా అనేక లోపాలు బయట పడ్డాయి. ప్రధాన ఉల్లంఘనలు ఇవే ... నిబంధనలకు విరుద్ధంగా సరుకులను అనధికారికంగా రవాణా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రమాదకర వస్తువులను సైతం లగేజీ రూపంలో అనుమతిస్తున్నారు. ఇవే ప్రమాద తీవ్రతకు కారణమవుతున్నాయి. ఫైర్ అలారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మంటలను అర్పే యంత్రాలు ఉండడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండక పోవడం, వాణిజ్య సరుకు రవాణా, పన్నుల ఎగవేత, సీట్లు ఆల్ట్రేషన్ చేయడం వంటి లోపాలు గత మూడు రోజులుగా బయట పడుతున్నాయి. తనిఖీల సందర్భంగా అధికారులు వాహన పర్మిట్లు, పన్నులు, ఎఫ్సీలు, బస్సుల్లో అత్యవసర ద్వారాలు, వాహన రికార్డులు వంటివి పరిశీలించి ఉల్లంఘనలు ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ – బెంగుళూరు, కర్నూలు – కడప జాతీయ రహదారులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ మార్పు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్ గడువు ముగియడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. మూడో రోజు అగ్నిమాపక పరికరాలు లేని ఆరు బస్సులపై కేసులు నమోదు కాగా, ఎమర్జన్సీ డోర్ లేని ఒక బస్సు పైన పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు బస్సులు, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న ఒక బస్సు, కిటికీ అద్దాలు సక్రమంగా లేకుండా ఉన్న మరో ఐదు బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి. లేకుంటే అపరాధ రుసుం విధించడంతో పాటు బస్సును సీజ్ చేస్తాం, రహదారి భద్రతపై డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఉల్లంఘనలకు పాల్పడితే ఉపేక్షింది లేదు. తనిఖీలు నిరంతరాయంగా సాగుతాయి. – శాంతకుమారి, డీటీసీ -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
కోసిగి: మండల కేంద్రంలోని ఉరుకుంద క్రాస్ రోడ్డు సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న జొల్లు లీలావతి ఇంట్లో ఈ నెల 6వ తేదీన చోరీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంత రెడ్డి తెలి పారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితులను అరెస్ట్ చూపు తూ వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన అంజినయ్య, పరుశురాం కందుకూరు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 25 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, రూ.6,300 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులపై రాయచూరులో మర్డర్ కేసు, పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్ఐ హనుమంత రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నజీర్, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. ‘పాప దొరికింది’.. అలరించింది కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘పాప దొరికింది’ హాస్య నాటిక అలరించింది. ఆదివారం సీక్యాంప్ కళాక్షేత్రంలో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటిక హాస్య భరితంగా సాగింది. అనంతరం నాటిక కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి రూ. 20 వేల నగదు పారితోషికాన్ని అందించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ.. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న సాంఘిక నాటికల ప్రదర్శనలో భాగంగా ఈ నాటిక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటిక ఆహుతులను అలరించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడు, కళాక్షేత్రం మాజీ అధ్యక్షులు దస్తగిరి, కార్యదర్శి యాగంటీశ్వరప్ప, సభ్యులు సీవీ రెడ్డి, సంగా ఆంజనేయులు, రాజారత్నం, మహమ్మద్ మియ్యా, రమణ పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక భక్తులు భారీగా వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీమఠం ప్రాంగణంలో రాఘవేంద్రుల మూలబృందవన ప్రతిమను బంగారు పల్లికీలో కొలువుంచి భక్తజనం మధ్య ఊరేగించారు. శ్రీమఠం కారిడార్లో భక్తుల కోలహలం -
గుంతలు దాటలేక..
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డు వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో పత్తి దిగుబడులతో వస్తున్న వాహనం ఆదివారం వర్షపునీటిలో బోల్తా పడింది. చిన్న వర్షం వచ్చినా చెరువుగా మారే ఈ రహదారిలో రోజూ ఒక వాహనం, వ్యక్తులు పడిలేవడం నిత్యకృత్యంగా మారింది. ఆదివారం రైతు పత్తి దిగుబడులను అమ్మకానికి యార్డుకు తీసుకొస్తుండగా వాహనం బోల్తా పడి పత్తి దిగుబడి వర్షపునీటిలో తడిచి రైతుకు నష్టం వాటిల్లింది. ఆ రహదారిపై చిన్న వర్షానికే వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరా యం కలుగుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కనీస మరమ్మతులైనా చేయాలని రైతులు, వాహనాదారులు, స్థానికులు కోరుతున్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పైప్లైన్కు రంధ్రం
కృష్ణగిరి: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి డోన్కు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్కు కోయిలకొండ గ్రామ సమీపాన రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. నెల రోజులుగా పైప్లైన్కు రంధ్రం పడినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు గ్రామానికి చెందిన చెరువు మాధవకృష్ణ పొలంలోకి వెళ్తున్నాయి. చివరి మజిలీకి దారి కష్టాలు కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో ముస్లింలకు సంబంధించిన శ్మశానవాటికకు వెళ్లే దారిలో హంద్రీ నది ఉండటంతో రాకపోకలు సాగించే పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హంద్రీ నదిలో పారే నడుము లోతు నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అవతలి ఒడ్డున అంతిమ సంస్కారాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ హంద్రీపై రూ. 7.95 కోట్లతో వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శంకుస్థాపన చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడంతో వంతెన గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లిలు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామం నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 40 కుటుంబాల ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి, బెంగళూరు పట్టణాలకు ఆల్విన్ (టిప్పర్) వాహనంలో పిల్లాపాపలతో కలిసి వలస వెళ్లారు. గ్రామాల్లో సాగుచేసిన పంటలు వర్షాల ధాటికి నష్టం రావడంతో రోజూ కురుస్తున్న వర్షాలకు రబీ సీజన్లో వేసిన పప్పుశనగ, జొన్న, వాము పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో చేసేదేమి లేక స్థానికంగా పనులు లేక వలస వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు, రైతులు తెలిపారు. స్థానికంగా ఉపాధి పనులు కల్పిస్తే ఇక్కడే పనులు చేసుకునేవారమని వారు చెప్పారు. శ్రీగిరి కిటకిట శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు భక్తులు కార్తీకదీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక దీపారాధనకు దేవస్థానం విస్త్రత ఏర్పా ట్లు చేసింది. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్నీ కిటకిటలాడాయి. కుందూ నదికి పోటెత్తిన వరద కోవెలకుంట్ల: స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్తోపాటు ఎగువ ప్రాంతాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుందూలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో నదికి అనుసంధానంగా ఉన్న కప్పల పాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరీవాహకంలో ఉన్న వరి పైర్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పంట నీట మునిగింది. -
పసుపు పంటపై విష ప్రయోగం
● వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడి పొలంపై దుండగుల దాష్టికంచాగలమర్రి: చిన్నవంగలి గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు కంసాని లక్ష్మీ రెడ్డికి చెందిన పసుపు పంటపై గుర్తు తెలియని దండగులు గడ్డి మందు పిచికారీ చేశారు. లక్ష్మీరెడ్డి మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేశాడు. ఏపుగా పెరిగిన పసుపు పంటను చూసి ఓర్వ లేని దుండగులు శనివారం అర్ధరాత్రి సమయంలో 3 రకాల గడ్డి మందులను పొలం బోరు వద్ద ఉన్న డ్రిప్ ట్యాంకు నీటిలో కలిపి ఆ మందు సీసాలను ట్యాంకులోనే వేశారు. అలాగే ఆ మందులు కలిపిన నీటిని పసుపు పంటపై కొంత మేర పిచికారీ చేశారు. ఆది వారం ఉదయం రైతు లక్ష్మీరెడ్డి పసుపు పంట పొలం వద్దకు వచ్చి పరిశీలించగా, కొంత విస్తీర్ణంలో పసుపు మట్టలు కాలిపోయిన వర్ణంలో కనిపించాయి. అనుమానంతో డ్రిప్ ట్యాంకును పరిశీలించగా ట్యాంకులో గడ్డి మందు సీసా కనబడటంతో పంటపై విష ప్రయోగం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పరిహారం కోసం వివరాలను తీసుకున్నాం
ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఇందుకోసం బాధిత కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర వివరాలను తీసుకున్నాం. త్వరలోనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది. – డాక్టర్ ఏ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్ నా అల్లుడు శ్రీనివాసరెడ్డి బస్సు దహనంలో చనిపోయాడు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. క్రేన్ మెకానిక్గా పనిచేసి జీవనం చేసేవాడు. పనికోసం హైదారాబాద్కు వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరులో పని కోసం కాల్ వస్తే వెళ్లాడు. అయితే మార్గమధ్యలో ప్రమాదం జరిగి చనిపోయాడు. శ్రీనివాసరెడ్డికి భార్య లక్ష్మీజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేదంటే వారు రోడ్డున పడతారు. – అచ్చిరెడ్డి. రావులపాళెం, తూగో జిల్లా నా కుమారుడు ఆర్గ బంధోపాధ్యాయ చనిపోవడం చాలా బాధ ఉంది. నా భార్య, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మాది సొంతూరు కలకత్తా. అయితే ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి స్నేహితుడు పిలిస్తే దీపావళి పండగకు హైదరాబాద్కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చనిపోవడం అన్యాయం. 23 ఏళ్లకే నూరేళ్లు నిండాయి. పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాం. అవన్నీ కల్లలయ్యాయి. – అభిజిత్ బంధోపాధ్యాయ, బెంగళూరు● -
మోంథా తుఫానుపై అప్రమత్తంగా ఉండండి
● జూమ్ కాన్ఫరెన్స్లో డీబీసీడబ్ల్యూఈఓ కే ప్రసూనకర్నూలు(అర్బన్): మోంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల శ్రేయస్సు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన కోరారు. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆమె జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున పాత భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు చెందిన హెచ్డబ్ల్యూఓలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే విద్యార్థుల వసతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అందరు హెచ్డబ్ల్యూఓలు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉండాలన్నారు. మూడు రోజులు వర్షాలు ఉన్నందున విద్యార్థుల మెనూకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అవసరమైన నిత్యావసర సరుకులను నాలుగైదు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్లను కూడా అదనంగా నిల్వ ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు వర్షంలో తడవకుండా చూడాలన్నారు. అలాగే హాస్టళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే పలు వసతి గృహాల విద్యార్థులతో ఆమె జూమ్ కాన్ఫరెన్స్లోనే వారికి అందుతున్న మెనూ, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. -
ఆయుధ పాఠం
కర్నూలు: రకరకాల తుపాకులు, రైఫిళ్లు, మెటల్ డిటెక్టర్లు, రాకెట్ లాంఛర్లు, పిస్టళ్లు, మెషిన్గన్లు, అత్యాధునిక బైనాక్యులర్లు, సురక్షిత జాగిలాలు, అత్యంత నైపుణ్యత కలిగిన సిబ్బంది వెరసి జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ అధరహో అనిపిస్తోంది. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏటా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ కలసి ప్రారంభించారు. రెండో రోజు సోమవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ నుంచి నేరస్థుల కట్టడి వరకు పోలీసులు వినియోగిస్తున్న అధునాతన ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల రక్షణ వరకు ఎలాంటి ఆయుధాలు వినియోగిస్తున్నారు? అవి ఎలా ఉంటాయి? వాటి వినియోగం ఎలా? తదితర అంశాల గురించి విద్యార్థులకు అక్కడ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ప్రదర్శనలో వివిధ రకాల రైఫిళ్లు, పిస్టోల్, గన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, డే విజన్ బైనాక్యులర్, బాంబ్ డిటెక్టర్, స్పీడ్ గన్ మిషన్, ట్రాఫిక్ సిగ్నల్ సైన్ బోర్డు, డ్రంకెన్ బ్రీత్ ఎనలైజర్ మిషన్, ఫింగర్ప్రింట్ ఐడెంటిఫికేషన్, డ్రోన్ కెమెరాలు, వజ్ర వాహనం, ఫాల్కన్, బాంబ్ సూట్, డాగ్ స్క్వాడ్ బృందాలు వినియోగించే ఆయుధాలు ఉంచారు. కార్యక్రమంలో ఆర్ఐలు పోతల రాజు, జావెద్, నారాయణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న ఇండస్ స్కూల్, బి.క్యాంప్లో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ప్రారంభించిన అదనపు ఎస్పీలు పోలీసు ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన -
మృత్యువును ఎదిరించి.. ప్రాణాలు కాపాడి!
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయత్నించినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికై నా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి బస్సు దుర్ఘటనలో వెలుగులోకి వాహనదారుల సాహసం డోర్లు పగలగొట్టి ఐదారుగురిని కాపాడినట్లు సమాచారం బస్సు రెండో డ్రైవరు, క్లీనర్ తెగింపుతో ఎనిమిది మంది సేఫ్ కొందరు వీడియోలు, ఫొటోలు తీస్తూ బాధ్యత విస్మరించిన వైనం -
ఉద్యమాలతో కార్మికుల బతుకుల్లో మార్పులు
● సీఐటీయూ 13వ జిల్లా మహాసభలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): ఉద్యమాలతోనే కార్మికుల బతుకల్లో మార్పులు వస్తాయని, ఉద్యమాలకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత సీఐటీయూపై ఉందని మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. శనివారం కార్మిక, కర్షక భవన్లో సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సీఐటీయూ జెండా ను మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సీఐటీ యూ జెండా ఔన్నత్యంపై గేయాలను ఆలపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందుగా సీఐటీయూ విస్తరణ కోసం విశేష కృషి చేసిన నాయకులు బి.రాజగోపాల్, బి.మహానందరెడ్డి, జేఎన్శేషయ్యల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు పీఎస్ రాధాకృష్ణ, పి.నిర్మల, ఈరన్న అధ్యక్షత వహించగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక వ్యతరేకమన్నారు. కార్మికుల 8 గంటల పని విధానాన్ని మోదీ 10–13 గంటల వరకు పెంచారన్నారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక చట్టాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బి.రామాంజనేయులు, నారాయణస్వామి, ప్రభాకర్, సాయిబాబా, విజయరామాంజనేయులు, ఉమాదేవి, రఘుబాబు, దివాకర్, నరసింహులు, అబ్దుల్దేశాయ్, పీఎస్ గోపాల్, రాముడు, మధు పాల్గొన్నారు. -
మహిళపై టీడీపీ నాయకుడి దాడి
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో ఓ మహిళపై టీడీపీ నాయకుడు సగినేల రమణ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు.. ప్రతాప్ కొంత కాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటి ఆవరణలోని జామ చెట్టుకు ఉన్న కాయలను టీడీపీ నాయకుడు సగినేల రమణ తెంచుకుని, మళ్లీ తన అల్లుడు వినయ్ను పంపించాడు. ఆ సమయంలో ప్రతాప్ కొడుకు పార్థు.. తెంపొద్దు అని మందలించాడు. దీంతో కోపోద్రేక్తులైన మామా, అల్లుళ్లు ప్రతాప్ కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతని భార్య జ్యోతి కిందపడటంతో కాలికి గాయం కావడంతో నందికొట్కూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎముక విరిగిందని చెప్పడంతో కర్నూలుకు తరలించారు. ఈ మేరకు ముచ్చుమర్రి స్టేషన్లో ప్రతాప్ ఫిర్యాదు చేయగా.. కేసు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేంద్ర తెలిపారు. మృతుల కుటుంబాలకు అతిథి గృహంలో విడిది కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున దహనమైన బస్సులో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేశారు. వారికి అక్కడే భోజనం, వసతిని అధికారులు కల్పించారు. కాగా, చనిపోయిన 19 మందిలో 18 మంది కుటుంబీకులు డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు. 48 గంటల తరువాత ఆ డీఎన్ఏలకు సంబంధించి ఫలితాలు రానుండడంతో అంత వరకు వచ్చిన కుటుంబసభ్యులకు అధికార యంత్రాంగమే విడిది ఏర్పాటు చేసింది. నీటి కుంటలో పడి బాలుడి మృతి చాగలమర్రి: గొట్లూరు గ్రామానికి చెందిన దూదేకుల ధర్మతేజ(15) శనివారం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల బాల దస్తగిరి, సిద్దేశ్వరి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ధర్మతేజ శనివారం ఉదయం గ్రామ పొలిమేరలోని బీడు పొలాలో పశువులను మేపేందుకు వెళ్లాడు. అక్కడ తోటి స్నేహితులతో ఆడుకుంటూ పక్కనే ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు. కుంటలో నీరు నిండుగా ఉండటంతో నీళ్లలో మునిగి పోయాడు. వెంటనే స్నేహితులు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నీళ్లలో ముగినపోయిన ధర్మతేజను బయటికి తీశారు. వెంటనే చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని కేరళ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక ఎస్ఐ సురేష్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. న్యూసెన్స్ కేసులో జైలు శిక్ష శిరివెళ్ల: బోయిలకుంట్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి న్యూసెన్స్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిందని ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. మద్యం తాగి గ్రామంలో న్యూసెన్స్ సృిష్టించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడంతో కేసు నమోదు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచామన్నారు. విచారణ చేసి జడ్జి నిందితుడికి జైలు శిక్ష విధించారన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అల్లర్లు సృష్టించడం, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
కౌశల్ క్విజ్ పోటీలకు వేళాయె!
● దరఖాస్తుకు నేడు తుది గడువునంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 2025 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ (కౌశల్ క్విజ్) పోటీలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంటాయి. వాటిలో భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్ర దేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీకాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ పోటీలు ఒకటి. వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుని, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. కౌశల్ సైన్స్ 2025 పరీక్ష దరఖాస్తుకు నేటి (ఈనెల 26వ తేదీ)తో గడువు ముగుస్తోంది. అర్హులు: అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఇలా: తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ సబ్జెక్టుల టీచర్ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఈనెల 26వ తేదీ లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏపీ.ఓఆర్జీల రిజిస్ట్రేషన్ చేయాలి. పరీక్ష ఇలా: కౌశల్ సైన్స్ క్విజ్ ప్రాథమిక స్థాయి ఆన్లైన్ పరీక్షను నవంబర్ 1న 8వ తరగతికి, 3న తొమ్మిదో తరగతికి, 4న 10వ తరగతికి నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27న, 10వ తరగతికి 28న జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల తేదీని తర్వాత ప్రకటిస్తారు. మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్, డెస్క్టాప్ ద్వారా రాయవచ్చు. మరిన్ని వివరాలకు: జిల్లా కో ఆర్డినేటర్ కేవీ సుబ్బారెడ్డి 9948605546 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. బహుమతులు: జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.7,500, ద్వితీయ బహుమతిగా రూ.6వేలు, తృతీయ బహుమతిగా రూ.4,500, కన్సోలేషన్ బహుమతుల కింద రూ.3 వేలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో కన్సోలేషన్ బహుమతులుగా రూ.6 వేల వంతున ప్రదానం చేస్తారు. -
ఎన్సీసీ ప్రవేశాలకు ఎంపిక
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీసీలో ప్రవేశాలు కల్పించేందుకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరాశాంతి అధ్యక్షతన జరిగిన ఈ ఎంపిక ప్రక్రియకు ఎన్సీసీ 28 ఆంధ్రా బెటాలియన్ ఆఫీసర్ లెఫ్లినెంట్ కల్నల్ శశికుమార్ హాజరయ్యారు. విద్యార్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించారు. పారామిలటరీ సైనిక, రక్షణ రంగ, పోలీసు, ఇతర ఉద్యోగాలలో ఎన్సీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. కాలేజీ నుంచి 32 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఎన్సీసీకి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ డా.ఆర్ కామల్లీ నాయక్ పాల్గొన్నారు. -
వంతెనను ఢీకొని లారీ డ్రైవర్ మృతి
● ఘాట్ రోడ్డులో ఆరు గంటలు ట్రాఫిక్ జామ్మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్రోడ్డులో శనివారం ఉదయం పురాతన రైల్వే వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నంద్యాల వైపు నుంచి గిద్దలూరుకు మొక్కజొన్న ధాన్యం బస్తాలతో వెళుతున్న లారీ మార్గమధ్యలో బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెనను ఢీకొంది. భారీ మలుపు ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన డ్రైవర్ బాలహుసేని(50) క్యాబిన్లో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో గిద్దలూరు వైపు నుంచి నంద్యాల, నంద్యాల వైపు నుంచి గిద్దలూరు, విజయవాడ వెళ్లే వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు మాత్రమే వెళుతుండగా లారీలు, బస్సులు అధిక సంఖ్యలో ఇరువైపులా ఆగిపోయాయి. అరటికాయలతో వెళుతున్న వాహనాలతో పాటు ఇతర వాహనాల రాకపోకలు కష్టంగా మారింది. సుమారు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గిద్దలూరు పోలీసులు క్రేన్ల సాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీని తప్పించడంతో యథావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాద ఘటన గిద్దలూరు పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంక్షేమ హామీ ‘ఔట్’
కర్నూలు(అగ్రికల్చర్): ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలీచాలని వేతనాలతో వీరు సతమతం అవుతున్నారు. ‘ మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయనే విషయం తెలుసు.. వేతనాలు అతి తక్కువగా ఉన్నాయి.. రేషన్ కార్డులు ఇస్తాం..కుటుంబంలో అర్హత కలిగిన వారు ఉంటే పింఛన్లు ఇస్తాం.. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తాం’ అని ఎన్నికల సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టీడీపీ ఆధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అవుతున్నా హామీ అమలు కాలేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై ఒక్క డీఏ ఇచ్చారు. ఔట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చిన సీఎం చంద్రబాబు వారి సమస్యల గురించి పట్టించుకోలేదు. ఇవీ కష్టాలు.. పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 6,500 మంది ఉన్నారు. ఇతరత్రా మరో 3,500 మంది ప్రకా రం దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఆఫీసు సబార్డినేట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్, టైపిస్ట్లు గా పనిచేస్తున్న వారందరూ ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులయిన వారే. ఆఫీసు సబార్డినేట్లకు నెలకు రూ.12000, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు నెలకు రూ.16 వేల వేతనం వస్తోంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా.. ఏ ఒక్క నె ల కూడ 1వ తేదీ వేతనాలు ఇవ్వలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి నెలా రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే మూడు నాలుగు రోజులు ఆలస్యంగా వేతనాలు పొందుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపైనే పని భారం ఎక్కువగా ఉంది. ఇటీవలనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్డు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అ మలు చేయాల్సిన బాద్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నప్పటికీ స్పందన లేకుండా పోయింది. ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులు అనారోగ్య కారణాలతో లేదా ప్రమాదవశాత్తు మృతిచెందితే ఆ కుటుంబాన్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. కారుణ్య నియామకాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేయడం లేదు. ‘పోషక్’ హీనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2014 నుంచి పోషక్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ద్వారా అమలు అవుతోంది. ఈ కార్యక్రమం కింద జిల్లా కో ఆర్డినేటర్, అసిస్టెంటు కో–ఆర్డినేటర్, ప్రాజెక్టు వారిగా బ్లాక్ కో–ఆర్డినేటర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. 2014లో ఉన్న వేతనాలే.. ఇప్పటికీ ఉన్నాయి. 11 ఏళ్లు అవుతున్నా.. వేతనాల్లో ఒక్క రూపాయి కూడా పెరుగుదల లేకుండా పోయింది. ఐసీడీఎస్ కార్యక్రమాలన్నీ వీరి ద్వారానే అమలు అవుతున్నాయి. వీరికి పీఆర్సీ ప్రయోజనాలు లేవు. ప్రతి ఏటా 3 శాతం వేతనం పెంచాల్సి ఉంది. ఈ విషయం నియామక ఉత్తర్వుల్లోనే ఉంది. కాని పోషక్ అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు. వైఎస్సార్సీపీ హయాంలో గౌరవం వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో తొలుత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే వేతనాలు చెల్లించేవారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చొరువ కారణంగా రెగ్యులర్ ఉద్యోగుల కంటే ముందుగా వేతనాలు పొందేవారు. పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి విముక్తులను చేశారు. టీడీపీ పాలనలో దుస్థితి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు జీవనాడిగా ఉన్న పొరుగు సేవల కార్పొరేషన్ను రద్దు చేసి గత టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్నే మళ్లీ తీసుకరావడానికి కసరత్తు జరిగింది. దీనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందుకు ఏకమై వ్యతిరేకించడంతో రద్దు చేస్తే తిరుగుబాటు వస్తుందని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పటి వరకు పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టలేదు. ఈ కార్పొరేషన్తో సంబంధం లేకుండానే వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఈ ఉద్యోగాలను టీడీపీ నేతలు అమ్మకానికి పెట్టినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు చాలీచాలని వేతనాలతో సతమతం పోషక్ అభియాన్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం శ్రమ దోపిడీ! ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఉంటే వీరికి పింఛన్ల అర్హత కూడా లేకుండా పోయింది. వీరికి డీఏలు ఉండవు. పీఆర్సీ ప్రకటించినపుడు మాత్రమే వేతనాల్లో కొంత పెరుగుదల ఉంటుంది. పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీకి పాల్పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● 12 ప్రైవేటు ట్రావెల్స్పై కేసులు నమోదు ● రూ.2.42 లక్షల జరిమానా కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి పర్యవేక్షణలో రెండు రోజులుగా మోటర్ వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ, ఏఎంవీఐలు) బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నట్లు బయటపడిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. కర్నూలులో బెంగుళూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు బస్సులకు సక్రమంగా రికార్డులు లేకపోవడం, ఏడు ట్రావెల్స్ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేనట్లు గుర్తించారు. అలాగే ఒక బస్సుకు ఎమర్జెన్సీ బటన్స్, అలారం పనిచేయకపోవడం, మరో బస్సుకు ఎమర్జెన్సీ డోర్ పనిచేయకపోవడం, ఒక బస్సుకు పర్మిట్ లేకపోవడం, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న మరో బస్సుపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ శాంతకుమారి తెలిపారు. రెండు బస్సులు షీల్డ్ గ్లాసులు (అద్దాలు) లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షలు జరిమానా విధించినట్లు డీటీసీ వెల్లడించారు. -
జిల్లా అంతటా ‘మోంథా’ అప్రమత్తం
కర్నూలు(సెంట్రల్): మోంథా తుపాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. కలెక్టరటేలోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మండల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 27వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. నదీతీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మునిసిపల్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, పీఆర్, ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నార. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుంకేసుల రిజర్వాయర్ ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల బండ్స్ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, హాస్టళ్లలో ముందస్తుగా విద్యార్థులను మరో ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వైద్య బృందాలను ఏర్పాటు చేసుకొని వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
క్లస్టర్ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య
● ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రావుకర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్. విజయ భాస్కర్ రావు అన్నారు. క్లస్టర్ వర్సిటీ పరిధిలోని మూడు కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలోని మూడు కాలేజీల్లో మల్టీ డిస్సిప్లినరీ విధానాన్ని అవలంబించాలన్నారు.ఇన్చార్జ్ వీసీ వెంకట బసవరావు మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో తొమ్మిది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను విజయవంతంగా ప్రారంభించామన్నారు. వర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి పాల్గొన్నారు. -
రైతుల అభ్యున్నతికి పట్టుదలతో పనిచేస్తాం
● జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కర్నూలు(అగ్రికల్చర్): రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ పథకాల పకడ్బందీ అమలుకు పట్టుదలతో పనిచేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. శనివారం జాయింట్ డైరెక్టర్ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉమ్మడి జిల్లాలో జేడీఏగా, విభజన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించారు. ఇటీవలనే ఈమెకు జాయింట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్గా పదోన్నతి లభించింది. డీడీఏ బాధ్యతలు అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్కు అప్పగించి జేడీఏ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా విధుల్లో చేరారు. జేడీఏగా పదోన్నతి పొందిన జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మిని అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, ఏవోలు అల్లీపీర, రాఘవేంద్ర, ఉషారాణి, మణిమాలిక, శారదమ్మ తదితరులు అభినందించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్య కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్పోస్టు సమీపంలోని వెంకటాద్రి నగర్లో నివాసముంటున్న రఘునాథ రెడ్డి కూతురు బొమ్మిరెడ్డి గిరిజ (25) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మహారాష్ట్రలో పీజీ చదువుతోంది. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు రెండు రోజుల క్రితం కర్నూలుకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి కిందకు దింపి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలూరు: అభివృద్ధి చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ అబ్జర్వర్ గుండం ప్రకాష్రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆలూరు మండలం మొలగవెల్లి, హత్తిబెళగళ్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఉల్లి, టమాట, మిర్చికి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతుల దయనీయ పరిస్థితిని పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారన్నారు. మృతులకు సంతాపం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రైవేట్ బస్సు దగ్ధమై 19 మంది ప్రయాణికులు మృతి చెందగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. గ్రామ సభల్లో రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, పార్టీ పరిశీలకులు గడ్డం ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్రరెడ్డి, నాయకులు అనిల్రెడ్డి, రంగన్న, చిన్న ఈరన్న, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): క్రీడలతో మానసిక ఆరోగ్యం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ అండర్–14, అండర్–17 విభాగాల్లో ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రికెట్లో ప్రతిభ చాటి ఎంతో మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్లో సీట్లు సంపాదించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి క్రిష్ణ, ఎస్జీఎఫ్ సభ్యులు శేఖర్, పరమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవాలి
● జిల్లాలోని అన్ని చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులను నింపండి ● ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర నీటి కేటాయింపుల్లో జిల్లా వాటాను సమర్థవంతంగా వినియోగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మైనర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 15 తరువాత తుంగభద్ర డ్యామ్ గేట్ల మరమ్మతులు పనులు చేపడుతుండడంతో పూర్తిస్థాయిలో నీటి వాటాను వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్యామ్ ద్వారా రావాల్సిన 5 టీఎంసీలు, ఎల్ఎల్సీ ద్వారా రావాల్సిన 5 టీఎంసీల నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని చెరువులు, ఎస్ఎస్ట్యాంకులను నింపాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 35 ఎస్ఎస్ ట్యాంకులు, 67 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు(చెరువులు) ఉన్నాయని, వాటిని ఏ సమయానికి పూర్తి స్థాయిలో నీటిని నింపుతారో తగు నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఆదోని ఎస్ఎస్ ట్యాంకుకు జరుగుతున్న మరమ్మతులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ‘భూమాత రక్షణ’ రైతుకు ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూమాత రక్షణ కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబరులో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భూమాత’ పథకంలో భాగంగా జిల్లాలో అత్యధికంగా ఎరువులను వినియోగించే 100 గ్రామాలను ఎంపిక చేసుకొని రైతులకు అవగాహన కల్పించాలన్నా రు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 18004254299 ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమ పథకాల అమలు కోసం 24 గంటలపాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ను గురువారం ఆమె సందర్శించారు. అక్కడ పనిచేసే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 18004254299కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చు. కార్యక్రమాల్లో జేసీ నూరుల్ కమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు కుళ్లిపోతున్నాయి!
కోడుమూరు రూరల్: మంచి ధర వస్తుందని ఎన్నో ఆశలతో ఉల్లి సాగు చేసిన రైతుకు కన్నీరే మిగిలింది. మార్కెట్లో ధర లేక కొందరు పొలాల్లోనే పంటను పశువులు, గొర్రెలకు వదిలేశారు. మరికొందరు ట్రాక్టర్తో దున్నేశారు. ఇప్పుడు వర్షం కురుస్తూ రైతుల ఆశలపై నీళ్లను చల్లింది. కోడుమూరు మండలం వర్కూరుకు చెందిన ఓ రైతు ఉల్లి దిగుబడులను కల్లందొడ్డిలో ఆరబెట్టాడు. గత రెండు రోజులుగా వానలు పడుతుండడంతో అవి కుళ్లిపోయాయి. అలాగే బైన్దొడ్డి గ్రామంలో వర్షాలకు దిగుబడులను మార్కెట్కు తరలించలేక ఓ రైతు కల్లందొడ్డిలో అలాగే వదిలేశాడు. దీంతో ఉల్లి గడ్డలు మరింత కుళ్లిపోతున్నాయి. -
సాగు నష్టాల మూట.. ఊర్లు వలస బాట
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, పండిన పంటలకు మద్దతు ధరలు లేక పోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోయారు. మరో వైపు ఉన్న ఊరిలో ఉపాధి కరువై ప్రజలు వలస బాట పట్టారు. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. గత నెలలో కురిసిన అధిక వర్షాల వల్ల పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేటికీ మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ పూర్తి కాలేదు. ఈ సీజన్లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించిన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదును జమ చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కిన టమాట రైతు.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో అధికంగా పండించే టమాట ఈ ఏడాది రైతు కంట కన్నీరు తెప్పించింది. దాదాపు 13,500 ఎకరాల్లో సాగు చేసిన టమాటకు ఈ ఏడాది ధర లేకపోవడం వల్ల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకానొక సందర్భంలో కిలో టమోటా ధర 10 పైసలు కూడా పలకకపోవడం వల్ల రైతులు తాము పండించిన టమోటాను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆదుకుంటామంటూ పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. శనగ విత్తనాలు కరువు ప్రస్తుత రబీ సీజన్లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 వేల క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా కూడా శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ పల్లెలు ఖాళీ..జిల్లాలో పనులు లేక, పస్తులుండలేక పశ్చిమ పల్లెలు వలస బాట పడుతున్నాయి. ఉన్న కొద్ది భూముల్లో వేసిన పంటలు వివిధ కారణాల వల్ల చేతికి రాకపోవడం, వచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా గ్రామాలను వదిలి కూలీ పనులు చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లోని ఆనేక గ్రామాల ప్రజలు హైదరాబాద్, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వలసలను నివారించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా కూలి అంతంత మాత్రంగానే ఇస్తుండడం వల్ల కూలీలు వలస పోతున్నారు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు ( సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్పిట్స్ ) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రస్తావించినా.. ‘ఆదోని నియోజకవర్గంలో ఏ పల్లైకె నా వెళ్లండి అధ్యక్షా ... అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి, 2.62 లక్షల మంది ఓటర్లు ఉన్న ఆదోని నియోజకవర్గంలో లక్ష మంది వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. సాగు, తాగు నీటికి ఇబ్బందే, పరిశ్రమలు లేవు ... ఇవన్ని మంత్రికి తెలుసా’ అని అసెంబ్లీలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యే డా.పార్థసారథి ప్రశ్నించారు. ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే లక్ష మంది పనుల్లేక వలసలు వెళ్లారని ఎమ్మెల్యే డా.పార్థసారథి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావించినా, నేటికి ప్రభుత్వం వలసలను నివారించే చర్యలను చేపట్టలేదు. వర్షాలతో కుదేలైన రైతాంగం నత్తనడకన పంట నష్ట పరిహారం ఎన్యుమరేషన్ ఉల్లి రైతుకు ప్రభుత్వం రూ.16.50 కోట్ల బకాయి అవసరానికి అందని శనగ విత్తనాలు వలసలతో ఖాళీ అయిన పశ్చిమ పల్లెలు నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంనేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ... జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 24వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మత్స్య శాఖ, దేవదాయ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
రికార్డుల్లో ఇప్పటి వరకూ ప్రభుత్వ భూమి.. త్వరలో మారే అవకాశం!
టీడీపీ నేతలు కబ్జా చేస్తున్న పొలం ఎల్పీ నెంబర్ 1725. ఖాతా నెంబర్ 200019 సర్వేనెంబర్ 369–1ఏ, 369–5 పరిధిలోని మొత్తం 11.34 ఎకరాల భూమి స్వభావం ‘ప్రభుత్వ భూమి, కేటాయించని ప్రభుత్వ భూమి’ అని అడంగల్లో ఉంది. భూమి వినియోగ తీరు కూడా వ్యవసాయేతర అని, పట్టాదారుని పేరు మిగులు భూమి, అనుభవ స్వభావం ప్రభుత్వ భూమి అని స్పష్టంగా రికార్డుల్లో కనిపిస్తోంది. ఇంతటి విలువైన భూమిని ఇటు అధికారులు, అటు టీడీపీ నేతలు కలిసి దోచుకునేందుకు రంగం సిద్ధమైంది. మరి ఈ విషయం ఆర్డీఓకు తెలుసా? తెలియదా? అనేది తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఇంత విలువైన భూమిని కబ్జా చేస్తున్నారంటే అధికాపార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఉంటుందా? వారి అనుమతి లేకుండానే కిందిస్థాయి నేతలు ఇంత సాహసానికి ఒడిగడతారా? ఒక వేళ తెలిసీ ఇప్పటి వరకు మౌనం వహించారంటే వాళ్లకు కూడా ఈ భూ దందాలో భాగం ఉందా? అనే చర్చ కొనసాగుతోంది.ప్రభుత్వ భూమికి సంబంధించి భూకమత పటం -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
కర్నూలు టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగబోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఈనెల 28న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకూడదంటూ కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని రంగాల్లో వైఫల్యం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రెవేటు వ్యక్తులు అమ్మేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను తమ అనయూయులకు అప్పగించేందుకే పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ప్రైవేటీకరణ చేస్తే పేద రోగులకు ఉచిత వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కొక్క మెడికల్ సీటు రూ.1.50 కోట్లు అమ్ముకునేందుకు కుట్రలు పన్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణను అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అమ్మేందుకు సిద్ధమైందన్నారు. వివిధ రోగాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం దారుణమన్నారు. పేదలంటే గిట్టని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షులు బోయ రాఘవేంద్ర నాయుడు, కిషన్, కార్పొరేటర్లు షేక్ అహమ్మద్, షాషావలీ, మైనార్టీ నాయకులు ఫిరోజ్, వైఎస్సార్సీపీ నాయకులు లాజరస్, గద్దె రాజశేఖర్ పాల్గొన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకు ఉద్యమం ఈనెల 28న ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసనలు పోస్టర్లను ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
‘కూటమి’ కుట్రకు అధికారుల సహకారం
ఆదోని రూరల్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ కుట్రకు అధికారుల సహకారం అందించి ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ అన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఆదోనిలోని ఎంపీడీఓ కార్యాలయానికి గురువారం వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మినిట్స్ బుక్లో పేర్కొన్న తీర్మాన పత్రాన్ని ఇవ్వాలని బుధవారమే వైస్ ఎంపీపీ నరేంద్రరెడ్డి, ఇతర ఎంపీటీసీలు కోరగా ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీఓ జనార్దన్ను ప్రశ్నించారు. అందుకు ఎంపీడీఓ జనార్ధన్ మాట్లాడుతూ.. ‘అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నా పరిధిలో లేదని, ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ పరిధిలో ఉందని, అందుచేత ఆయనే తీర్మాన మినిట్స్ అందించాల్సి ఉంది’ అన్నారు. వెంటనే సబ్కలెక్టర్ అజయ్కుమార్కు ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడారు. ‘అందుబాటులో లేనని, రేపు కూడా అందుబాటులో ఉండనని, శనివారం వచ్చి అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలను’ అని సబ్ కలెక్టర్ తెలిపారు. చట్ట విరుద్ధంగా.. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ.. బుధవారం జరిగిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై ఎంతటి న్యాయ పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 29 మంది ఎంపీటీసీ స్థానాలను పరిగణనలోకి తీసుకుని కోరం ప్రకారం 19 మంది ఉండాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 26 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా, అందులో ఇద్దరు ఎంపీటీసీలు మృతిచెందగా, ఒకరు రాజీనామా చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న 23 మంది ఎంపీటీసీలను పరిగణనలోకి తీసుకుని అవిశ్వాస తీర్మానం ఎన్నిక జరిపి ఉంటే 15 మంది ఎంపీటీసీలు ఉంటే నెగ్గేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకు వైఎస్సార్సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీలు హాజరైతే అధికారులు కూటమి ప్రభుత్వ కుట్రకు కొమ్ము కాసి వీగిపోయేలా చేశారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, న్యాయవాది జీవన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేశారు న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ -
‘పల్లె పండుగ’కు నిధులు కరువు!
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఏడు నెలలు పూర్తి అవుతున్నా నిధులు విడుదల కాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత పల్లెపండుగకు సిద్ధం అవుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడత పల్లెపండుగ పనులు 2024 నవంబరులో శ్రీకారం చుట్టి 2025 మార్చితో ముగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంటు కింద సీసీ రోడ్లు, పశువుల షెడ్లు నిర్మించారు. అలాగే ఉపాధి నిధులతో పండ్లతోటల అభివృద్ధి, సోప్ఫిట్స్, నీటితొట్లు, ఫారెస్ట్ నర్సరీలు చేపట్టారు. ఇందులో ఓ ఒక్క కార్యక్రమానికి నిధులు నిధులు విడుదల కాలేదు. బిల్లులకు గ్రహణం మొదటి విడత పల్లెపండుగ కింద చేపట్టిన పనులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇందులో కర్నూలు జిల్లాకు రూ.85 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.65 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. సీసీ రోడ్లకు సంబంధించిన బిల్లులే 75 శాతం (రూ.100 కోట్ల) వరకు ఉన్నాయి. పనులు పూర్తి చేసిన తర్వాత నిధుల విడుదల కోసం పండ్ ట్రాన్స్ఫల్ ఆర్డర్ (ఎఫ్టీవో) జనవరిలో జనరేట్ చేశారు. అయితే ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఎం.బుక్ రికార్డు చేసి ఎప్టీవో జనరేట్ చేయని వాటికి సంబంధించి మరో రూ.30 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నష్టాలే మిగిలాయి! జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణం, పండ్లతోటల అభివృద్ధి, పశువుల నీటి తొట్లు, సోక్ పిట్స్ నిర్మించుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. 2024–25 సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 1,200, నంద్యాల జిల్లాలో 850 పశువుల షెడ్లను. అప్పులు తెచ్చి నిర్మించుకున్నారు. వారంతా నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పండ్లతోటల అభివృద్ధికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు రూ.25 కోట్లు, పశువుల షెడ్లుకు రూ. 22 కోట్లు, నీటితొట్ల( 900)కు దాదాపు రూ.2.5 కోట్లు, సోక్ఫిట్స్(4000)కు రూ.2.40 కోట్లు, ఫారెస్ట్ నర్సరీలకు రూ.2.20 కోట్లు విడుదల కావాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఎఫ్టీవో జనరేట్ అయి నెలలు గడుస్తున్నా.. అతీగతీ కూడా లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వెల్లువెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ.150 కోట్ల బకాయిలు నిధులు ఇవ్వకుండామళ్లీ పల్లెపండుగ–2 అంటూ హడావుడి పనులు చేయించాలని అధికారులపై ఒత్తిడి ఈ ఏడాది సీసీ రోడ్ల నిర్మాణం లేనట్టే! -
ఈ ఏడాది కేవలం పశువుల షెడ్లే!
2025–26 సంవత్సరానికి సంబంధించి పల్లె పండకు–2 చేపట్టడానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేశారు. నిధులు విడుదల కానందున ఈ ఏడాది సీసీ రోడ్లకు మంగళం పలికారు. ఈ ఏడాది ఒక్క సీసీ రోడ్డుకు కూడా అవకాశం లేకుండా పోయింది. పశువుల షెడ్లు మాత్రం నిధులు మంజూరు చేస్తామని చెబుతున్నారు. 2024–25లో మంజూరు చేసి నిర్మించుకోని వాటితో పాటు 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,600 పశువుల షెడ్లు మంజూరు చేయతలపెట్టారు. అయితే పశువుల షెడ్లు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే పనులు మంజూరు చేయాలని, వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, గ్రామీణాభివృధ్ధి శాఖ ఉన్నతాధికారులు.. డ్వామా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. -
పొలంలో రక్త పింజరి
మహానంది: బుక్కాపురం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న గడ్డి పొలంలో గురువారం రక్తపింజరి పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. గడ్డి కోసేందుకు వెళ్లిన వారు పామును గుర్తించి పరుగులు తీశారు. అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. మోహన్ పొలం వద్దకు చేరుకొని గడ్డి మొక్కల మధ్య ఉన్న నాలుగు అడుగుల పొడవున్న రక్తపింజరి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశారు. రైలు కిందపడి వ్యక్తి మృతి డోన్ టౌన్: స్థానిక రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు కిందపడి మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన ఫెయింటర్ సతీష్ (52) గురువారం ఉదయం పని నిమిత్తం గుంతకల్లు నుంచి కాచిగూడ మీదుగా బోధన్ వెళ్లే రైలు కదులుతున్న సమయంలో ఎక్కడానికి ప్రయత్నించాడు. కాలు జారీ కింద పడటంతో అతనిపై రైలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లైంగిక నేరాలపై విద్యార్థులకు అవగాహన కర్నూలు టౌన్: లైంగిక నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. గురువారం పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు లైంగిక నేరాలు, మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థు ల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, పోలీసు శాఖ పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. వ్యాస రచన పోటీ ల్లో ప్రతిభ చాటిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. మద్యం మత్తులో వీరంగం ● రైల్వేస్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని శిక్ష విధించిన న్యాయమూర్తి కడప కోటిరెడ్డిర్కిల్: తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలు లో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ యాక్టు 355 ప్రకా రం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్ సెకండ్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు. -
ఆలూరులో భారీ వర్షం
ఆలూరు రూరల్: అల్పపీడన ప్రభావంతో గురువారం ఆలూరులో కుండపోత వర్షం కురిసింది.దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్యా హ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. పాత బస్టాండు సమీపంలోని జూనియ ర్ కళాశాల ముందు ఎల్లార్తి రోడ్డులోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారులు చెరువులను తలపించాయి. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కురిసింది. హాలహర్వి: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విరుపాపురం, బిలేహాల్, గూళ్యం, నిట్రవట్టి, బాపురం, పచ్చారపల్లి తదితర గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘గులాబీ’ పురుగు మరింత ఉద్ధృతి
● నివారణ చర్యలు చేపట్టండినంద్యాల(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ కింద సాగు చేసిన పత్తి పంటను గులాబీ రంగు పురుగు ఆశించినట్లు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్, పత్తి విభాగ కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణలు తెలిపారు. భీమవరం సమీపంలో సాగు అయిన పత్తి పంటను గురువారం డాక్టర్ శివరామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. పత్తి పంట సాగు అయి నేటికి 140 రోజులు అయ్యిందన్నారు. కాయ, పక్వ దశ నుంచి పత్తి తీత దశలో ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఆధారంగా పత్తి పైరును గులాబీ పురుగు ఆశించిందన్నారు. పురుగు ఉద్ధృతి రాబోయే మూడు నెలల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్ధృతి అక్టోబర్ నెలలోనే ఆర్థిక నష్ట పరిమితి దాటినట్లు గుర్తించామన్నారు. రైతులు రాబోవు మూడు నెలల్లో తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవాలన్నారు. ముందుగా ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉద్ధృతిని గుర్తించాలన్నారు. ప్రతి బుట్టలో వరుసగా మూడు రోజులు 8–10 పురుగులు పడిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పురుగు సామూహిక నిర్మూలనకు ఎకరాకు 10–15 లింగాకర్షణ బుట్టలు ఉంచాలని, పురుగు ఆర్థిక నష్ట పరిమితి (ప్రతి బుట్టలో 8–10 పురుగులు మూడు రోజులు వరుసగా పడిన) దాటిన వెంటనే వేపనూనె 1500 పీపీఎం, 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పదిరోజుల వ్యవధిలో వరుసగా ప్రొఫొనోపాస్, 20మి.లీ క్లోరో పైరీపాస్, 2.5మి.లీ పైరీడా లిల్, 1.5మి.లీ లీటరు నీటితో కలిపి మార్చిమార్చి పిచికారీ చేయాలన్నారు. పంట ఆఖరి దశలో బైఫ్రెన్త్రిన్, 2.0మి.లీ, పెంప్రోపత్రిన్, 2.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను జనవరి నెల తర్వాత పొడిగించకూడదన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కర్నూలు(అర్బన్): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షుల పాత్ర చాలా కీలకమని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో కర్నూలు డివిజన్లోని సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ఆధారంగానే దేశం అభివృద్ధి అంచనా వేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్ని క్షేత్ర స్థాయిలోని సర్పంచులు, ఎంపీపీల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు తోడుగా స్థానిక వనరులను పెంచుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధుల ద్వారా సామాజిక అవసరాలను మెరుగు పరచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొదటి పౌరుడైన సర్పంచు గ్రామీణాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. గ్రామాలను ప్రగతి పథం వైపు నడిపించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో పేదరికానికి దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, జి.నాగేష్, ఆస్రఫ్ బాషా, పి.జగన్నాథం పాల్గొన్నారు. -
వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తం
కర్నూలు(సెంట్రల్): వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు, పాత బ్రిడ్జీలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న చోట మోటార్లతో తొలగించాలన్నారు. పత్తి విక్రయానికి పేర్లు నమోదు చేసుకోండి కర్నూలు(అగ్రికల్చర్): రైతులు ఈ ఏడాది ఖరీఫ్లో పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో (గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ ఐవోఎస్లో అందుబాటులో ఉంది) స్లాట్ బుక్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.8,060 ఉందని, తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉండాలని పేర్కొన్నారు. తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉంటే అలాంటి పత్తిని సీసీఐ కొనుగోలు చేయదన్నారు. రైతులు పత్తిని లూజుగా తీసుకురావాలని, ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే సీసీఐ కొనుగోలు చేయదన్నారు. పులికొండలో డెంగీ కేసు పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పులికొండ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక డెంగీ బారిన పడింది. ఈ నేపథ్యంలో బుధవారం మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే బాలిక కస్తూరిబా పాఠశాలలో చదువుతుండటంతో పాఠశాల పరిసరాల్లో సైతం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పంటల నమోదు గడువు మరోసారి పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ మరోసారి పొడిగించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ–క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలోని మొత్తం సర్వే నెంబర్లు, వీటికి సంబంధించిన భూములను ఇప్పటి వరకు 56 శాతం మాత్రమే నమోదు చేశారు. ఈ ఖరీప్ సీజన్లో సాగైన భూముల వరకు అయితే 92 శాతం నమోదయింది. దాదాపు 3 నెలలుగా పంటల నమోదు జరుగుతోంది. ఇప్పటికి మొత్తం సర్వే నెంబర్లలో 56 శాతం మాత్రమే పూర్తయింది. తాజాగా ఈ నెల 30 వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని పొడిగిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీలో అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్రెంటీస్కు దరఖాస్తు చేసుకోవాలని జోనల్ స్టాఫ్ శిక్షణ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.www.apprenticerhipindia.gov.in అనే వెబ్సైట్లో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 08518–257025 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మా గ్రామంలో మద్యం అమ్మొద్దు! కల్లూరు: మా గ్రామంలో మద్యం అమ్మకూడదని గ్రామ ప్రజలందరూ ర్యాలీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగోలోకి వచ్చింది. కల్లూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ప్రజలందూ గ్రామంలో మద్యం అమ్మకూడదని నిర్ణయించారు. ఇప్పుడున్న మద్యం షాపులను వెంటనే మూసివేయాలంటూ రెండు రోజుల క్రితం ర్యాలీ చేశారు. అలాగే దండోరా కూడా వేయించారు. గ్రామ ప్రజల ఐక్యత వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పెద్దలు నిర్ణయించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు ర్యాలీకి దూరంగా ఉండటం గమనార్హం. -
మలుపులో రెండు వాహనాలు ఢీ
● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● మూడు గంటలకుపైగా ట్రాఫిక్కు అంతరాయంకొలిమిగుండ్ల: బెలుం గుహల సమీపంలో ఉన్న మలుపుల వద్ద బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..హైదరాబాదు నుంచి భారీ వాహనం ఐరన్ షీట్లు తీసుకొని కల్వటాల సమీపంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి బయలు దేరింది. గుహల వద్దకు చేరుకోగానే అదే సమయంలో రామాపురం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీకొంది. లారీ డ్రైవర్ రాజేష్ తీవ్రగాయాల పాలయ్యాడు. ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు, తోటి వాహనదారులు అతి కష్టం మీద అతడిని బయటకు లాగి చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరువైపుల నుంచి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన చోట బైక్లు మినహా ఇతర వాహనాలు పోయేందుకు అవకాశం లేక పోవడంతో మూడు గంటలకు పైగానే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరుగా వర్షం కురవడంతో వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ, హైడ్రా వాహనాలను పిలిపించి ప్రమాదానికి గురైన లారీని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
బాధితులకు పరిహారం త్వరితగతిన అందించాలి
కర్నూలు(సెంట్రల్): కోర్టుల ఆదేశాల మేరకు బాధితులకు త్వరగా పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో విక్టిమ్ కంపన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులు, అనాథ పిల్లలకు ఆధార్ కార్డుల మంజూరు, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ అకౌంట్స్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు, నంద్యాల, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హిట్ అండ్ రన్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు పరిహారాలు అందించాలని ఆదేశించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలో భాగంగా జైలులో ఉన ఖైదీల విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధార్ కార్డులేని 125 మంది అనాథ బాలలను గుర్తించామని, అందులో 56 మందికి కార్డులు మంజూరు కాగా, మిగిలిన వారికి త్వరగా కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వదలని వర్షం.. తీరని నష్టం
కోవెలకుంట్ల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని దొర్నిపాడు మండలంలో అత్యధికంగా 20.4 మి.మీ, అవుకు మండలంలో 15.2 మి.మీ, కోవెలకుంట్ల మండలంలో 12.4 మి.మీ, ఉయ్యాలవాడ మండలంలో 14.4 మి.మీ, సంజామల మండలంలో 10 మి.మీ, కొలిమిగుండ్ల మండలంలో 5.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఆయా మండలాల వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతాన్ని అధికారులు నమోదు చేశారు. బుధవారం 10 గంటల నుంచి తిరిగి సబ్డివిజన్లో వర్షం ఆగకుండా కురుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఆయా మండలాల్లో రబీ సీజన్లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, మినుము, తదితర పంటల్లో వర్షపునీరు భారీగా చేరింది. రేవనూరు, కలుగొట్ల, లింగాల, తదితర ప్రాంతాల్లో జొన్న నీట మునిగింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టణ శివారులోని కుందూనదికి భారీగా వర్షపునీరు చేరడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో రబీ పంటల సాగుకు ఆటంకం ఏర్పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల,అవుకు మండలాల్లో మొక్కజొన్న, ఉల్లి, శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కొందరు రైతులు పంట కోత కోసి కల్లాలు,ఆరు బయట ప్రదేశాలు,రోడ్ల మీద ఆరబోసుకున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నీట మునిగిన పంటలు ఆందోళనలో రైతులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూనది -
‘మీ డబ్బు – మీ హక్కు’ను ప్రజల్లోకి తీసుకెళ్లండి
నంద్యాల: ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే వాల్పోస్టర్లను విడుదల చేశారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి. నరసింహారావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, యూనియన్ బ్యాంక్ నూనెపల్లె బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున, డీఈఓ, కేజీబీవీ ప్రిన్సిపాల్ తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆస్తులు పరిపక్వతకు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు చేరకపోవడానికి ఖాతాదారుల మరణం, చిరునామా మార్పు, లేదా నామినీ వివరాల లోపం వంటి కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు..మీ హక్కు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నంద్యాల జిల్లాలోని 27 కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలకు ఒక్కొక్క పాఠశాలకు ఒకటి చొప్పున మొత్తం 27 కంప్యూటర్లు అందజేశారు. -
పశుబీమాకు మంగళం!
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి సర్కారు గతేడాది ఉచిత పంట బీమాకు మంగళం పాడగా ఇప్పుడు పశుబీమాకు ఎసరు పెట్టింది. ఇందులో భాగంగా అరకొరగా బడ్జెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పశునష్ట పరిహార పథకం, పశుబీమా పథకాలు విజయవంతంగా అమలు చేసి పశుపోషకులు, రైతులకు భరోసా ఇచ్చింది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు పశువులకు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పశువుల విలువలు అపారంగా పెరిగాయి. అనారోగ్య కారణాలతో పశువులు మరణిస్తే రైతుకు చేకూరే నష్టం అంతా, ఇంతా కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పశునష్ట పరిహార పథకం, పశుబీమా పథకాలను అమలు చేసింది. తగిన మేర బడ్జెట్ ఇచ్చి ఏడాది పొడవునా పశుబీమాను ప్రోత్సహించింది. గత ప్రభుత్వం అమలు చేసిన పశుబీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికీ అరకొరగా బడ్జెట్ ఇస్తుండటంతో బీమా పథకం మూన్నాళ్ల ముచ్చట అయ్యింది. ఏడాది పొడవునా బీమా అమలు చేయడానికి బడ్జెట్ కనీసం రూ.50 లక్షలు అవసరమవుతుంది. 2024–25లో రూ.19 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఈ బడ్జెట్ నాలుగు నెలల్లోనే అయిపోయింది. 8 నెలల పాటు బీమా అమలు లేకుండా పోయింది. ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్ రూ.11 లక్షలే 2025–26 సంవత్సరం మొదలై 7 నెలలు అవుతోంది. ఈ నెలల కాలంలో పశుబీమా పథకానికి విడుదల చేసిన బడ్జెట్ రూ.11లక్షలు మాత్రమే. ఈ మొత్తంతో 1,057 పశువులకు బీమా చేశారు. జాతి పశువులకు రూ.30 వేల విలువకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.1,720 ఉండగా... సబ్సిడీ రూ.1,632 ఉంటుంది. రైతు రూ.298 భరించాల్సి ఉంది. నాటు పశువులకు రూ.15 వేల విలువకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.965 ఉండగా.. సబ్సిడీ రూ.816 ఉంటుంది. రైతు రూ.149 భరించాల్సి ఉంటుంది. గొర్రెలు, మేకలకు రూ.6 వేలకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.256 ఉండగా... సబ్సిడీ రూ.216 ఉంటుంది. రైతు రూ.40 చెల్లించాల్సి ఉంది. పశుబీమా అమలుకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో మూడు నెలలుగా బీమా నిలిచి పోయింది. మూడు నెలల కాలంలో వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పశుబీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వ్యాధులతో పశువులు మరణించినప్పుడు కలుగుతున్న నష్టం అంతా.. ఇంతా కాదు. ఇప్పటికై నా కూట మి ప్రభుత్వం చొరవ తీసుకొని పశుబీమా అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏడాదికి బడ్జెట్ రూ.50 లక్షలు అవసరం 2024–25లో ఇచ్చిన నిధులు 19 లక్షలు ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్ కేవలం రూ.11 లక్షలే మూడు నెలల నుంచి పైసా ఇవ్వని వైనం -
పోలీసు అమరవీరుల త్యాగాలను మరవద్దు : ఎస్పీ
కర్నూలు(అగ్రికల్చర్): పోలీసు అమరవీరుల త్యాగాలను మరువకుండా ఆయా కుటుంబాలకు అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అమరవీరుల ఇళ్లను పోలీసు అధికారులు సందర్శించి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించారు. వారోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ రాజు హెబ్బటం గ్రామంలో 2008లో అమరుడైన బీఎస్ఎఫ్ జవాన్ రామాంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈనెల 31వ తేదీ వరకు అమరవీరుల గ్రామాల సందర్శన, చర్చా వేదికలు, వక్తృత్వ పోటీలు, పోలీసు త్యాగాలు, పరాక్రమ చిత్రాల ప్రదర్శన, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఏర్పాటుచేసి.. 31న సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
న్యాయం కోసం కోర్టుకెళ్తాం
● కోరం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ● మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ఆదోని టౌన్: ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసి అడ్డదారిలో గెలిచేందుకు కూటమి నాయకుల కుయక్తులు పన్నారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ పార్టీ తరఫున గెలిచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈరోజు అవిశ్వాసం ఉందని సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ లేరని, చాలా సేపు వేచి ఉండడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్చార్జి సబ్కలెక్టర్ ఉన్నారని తెలిసి ఎంపీటీసీలతో కలిసి అక్కడికి వెళ్లి అవిశ్వాస తీర్మానం పత్రాన్ని అందజేసేందుకు వెళ్తే... మీరు ఇక్కడికి రాకూడదని ఇన్చార్జి సబ్కలెక్టర్ చెప్పడం సరికాదన్నారు. చివరకు కోరం లేదని ఇన్చార్జ్ సబ్కలెక్టర్ చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. 26 మందిలో ఇద్దరు చనిపోగా, ఒకరు రాజీనామా చేయగా, 23 మంది మిగిలారన్నారు. ఇందులో 16 మంది వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు ఉండగా, ప్రస్తుతం ఉన్న 23 మంది ఎంపీటీసీల్లో 2/3లో 15 మంది కోరం ఉంటే సరిపోతుందని, దీనిని పట్టించుకోకుండా అవిశ్వాసం వీగిపోయిందని ఇన్చార్జి సబ్కలెక్టర్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అడ్డదారిలో అవిశ్వాసం వీగిపోయేలా కుట్రపన్నిందన్నారు. దీనిపై న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ తరపు ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
మహిళ అవయవదానం
● గ్రీన్ ఛానల్తో సాఫీగా గమ్యాలకు అవయవాలుకర్నూలు(హాస్పిటల్): భర్త ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే మరణించినా తన రెక్కల కష్టంతో ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. అలాంటి తల్లికి ఫిట్స్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. తమ తల్లి మరో నలుగురి రూపంలో జీవించి ఉండాలని పిల్లలు భావించారు. దాంతో అవయవదానానికి ముందుకొచ్చారు. గుండెలు కదలించే ఈ ఘటన కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. ఈ నెల 18వ తేది రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావమైంది. దాంతో ముందుగా ఆమెను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో చూపించారు. అనంతరం అక్కడి నుంచి ఈ నెల 19న కర్నూలులోని మౌర్య ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు పూర్తిగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21వ తేదిన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అవయవాలను దానం చేసే అవకాశం ఉండటంతో జీవన్దాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కె.రాంబాబు బృందం ఆమె పిల్లలకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దాంతో పెద్ద మనసుతో ఆ పిల్లలు తమ తల్లి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. బుధవారం ఆమె ఒక కిడ్నీ, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న రోగులకు దానం చేయగా, మరో కిడ్నీని నెల్లూరులోని అపోలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రికి పంపారు. ఇందుకోసం కర్నూలు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా అవయవాలు తక్కువ సమయంలోనే నెల్లూరు, హైదరాబాద్ చేరుకున్నాయి. కష్టకాలంలో కూడా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన భాగ్యమ్మ పిల్లలను జీవన్దాన్ బృందం, కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం, యాజమాన్యం అభినందించారు. అశ్రునయనాలతో పుష్పాంజలి ఘటించి వీడ్కోలు పలికారు. -
జీపు బోల్తా.. తప్పిన ప్రమాదం
కోడుమూరు రూరల్: ఆస్పరి, గోనెగండ్ల మండలాల్లోని కై రుప్పల, బైలుప్పల పాఠశాలల్లో విధులు నిర్వహించే టీచర్లు 11మంది బుధవారం ఉదయం కర్నూలు నుంచి పాఠశాలలకు ఓ జీపులో బయలుదేరారు. అయితే, కె.నాగలాపురం, సల్కాపురం గ్రామాల మధ్య టైరు పేలడంతో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు, ఇతర వాహనదారులు బోల్తా పడ్డ జీపులో నుంచి టీచర్లకు బయటకు లాగేశారు. అయితే, ఈ ప్రమాదంలో టీచర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా జీపు డ్రైవర్కు మాత్రం రక్తగాయాలయ్యాయి. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో టీచర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్పై నుంచి పడి మహిళ మృతి దేవనకొండ: బైక్పై వెళ్తుండగా కింద పడి ఓ మహిళ దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ మండలం నలకలదొడ్డి గ్రామానికి చెందిన పింజరి ఫాతిమా (21) భర్త కాశీంతో కలిసి మంగళవారం మండలకేంద్రమైన దేవనకొండలోని బంధువుల పొలంలో పత్తి తీసేందుకు వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా కర్నూలు–బళ్లారి మార్గంలో బైకుపై నుంచి ఫాతిమా కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో భర్త 108కు ఫోన్ చేసి కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి మామ పింజారి లాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు. అమెజాన్, అమ్మకందారులపై నాన్ బెయిలబుల్ వారెంట్కర్నూలు(సెంట్రల్): అమెజాన్, అమ్మకందారులపై కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించని అమెజాన్తోపాటు అమ్మకందారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. సి. బెళగల్కు చెందిన కె.వీరేష్ 2024 సెప్టెంబర్ 29వ తేదీన అమెజాన్లో ఆపిల్ ఐ ఫోన్ ప్లస్ను రూ.79,900లకు కొనుగోలు చేశారు. అయితే ఆయన ఆర్డర్ చేసిన ఫోన్కు బదులుగా ఐ క్యూ నియో 9 ప్రోన్ను పంపడంతో బాధితుడు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో అమెజాన్తోపాటు అమ్మకం దారులకు నోటీసులు ఇచ్చి బాధితుడికి రీప్లేస్ లేదా రూ.79,900లకు వడ్డీతో రిఫండ్ చేయాలని, రూ.25 వేల నష్టపరిహారం, రూ.10 వేల వ్యయ ప్రాయాసల కోసం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, 2025 ఆగస్టు 18వ తేదీ వరకు బాధితుడికి రిఫండ్, రీప్లేస్మెంట్ జరగకపోవడంతో తిరిగి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకొని 2025 ఆగస్టు 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా అమెజాన్ పాటించలేదు. ఈ క్రమంలో బుధవారం జరిగిన వాయిదాల్లో కమిషన్ చైర్మన్ కరణం కిశోర్ కుమార్, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి అమెజాన్తోపాటు ఇద్దరు అమ్మకం దారులకు నాన్ బెయిల్బుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను నంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు. -
కుట్రలు పన్ని.. ప్రలోభాలు ఎర వేసి!
● కూటమి నేతల కుయుక్తులతో వీగిపోయిన వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ఆదోని రూరల్: మెజార్టీ లేకపోయినా కూటమి నాయకులు కుట్రలు పన్ని.. ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ స్థానాన్ని లాక్కున్నారు. అత్యధిక మంది ఎంపీటీసీలు కలిగిన వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం వీగిపోయింది. వైఎస్సార్సీపీ తరఫున నెగ్గి ఆదోని మండలం ఎంపీపీ (కపటి ఎంపీటీసీ)గా ఉన్న దానమ్మ బీజేపీలోకి చేరింది. దీంతో ఆమైపె మెజార్టీ సభ్యులు కలిగిన వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ప్రత్యేకాధికారి, సబ్కలెక్టర్ అజయ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు 16 మంది హాజరయ్యారు. అయితే కోరం కోసం 19 మంది ఎంపీటీసీలు లేరని అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పెషల్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి ఆదోని మండలంలో 29 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నాడు 26 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఇందులో 24 స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. తర్వాత ఇద్దరు ఎంపీటీసీలు చనిపోగా, ఒకరు రాజీనామా చేయడంతో మొత్తం 23 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురిని కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేసి లాక్కోగా.. బైచిగేరికి చెందిన ఎంపీటీసీ నాగభూషణంరెడ్డిని కిడ్నాప్ చేసిన విషయం పాఠకులకు విధితమే. దీంతో వారి సంఖ్య 7కు చేరింది. వైఎస్సార్సీపీకి 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరంతా బుధవారం అవిశ్వాస తీర్మాణంలో పాల్గొనేందుకు రాగా కోరం లేదని ప్రత్యేక అధికారి ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వెల్దుర్తిలో వివాహిత దారుణ హత్య
వెల్దుర్తి: మండల కేంద్రం వెల్దురిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తిలోని 14 వ వార్డులో నివసించే ఉజ్మా (34)కు, మస్తాన్ అనే గౌండతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వెల్దురిలోని వడ్డెగేరిలో నివసించే వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానం పెంచుకున్న మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసిన పైకం ఇవ్వాలని ఇటీవల ఆమైపె ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమైపె దాడి చేసినట్లు తెలిసింది. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉజ్మా ఇంటికి మాజీ ప్రియుడు వెళ్లాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది. పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కాగా మృతురాలు ఇంటా, బయట ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల హార్డ్డిస్క్, ఆమె సెల్ఫోన్ సైతం హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట ప్రజ్ఞాపూర్లో గౌండ పని చేసేందుకు వెళ్లిన మస్తాన్.. భార్య హత్య విషయం తెలుసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ మధుసూధన్ రావు, ఎస్ఐ అశోక్లు సంఘటనాస్థలికెళ్లి విచారించారు. మృతురాలి తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుత్ ఉచ్చు కేసులో నిందితుల అరెస్ట్
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు రూరల్ సర్కిల్ పరిధిలోని బానకచర్ల – బానుముక్కల గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం పన్నిన విద్యుత్ ఉచ్చు తీగ తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ కృష్ణ నాయక్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిలైన మిడ్తూరు మండలం తలముడిపికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు, పాములపాడు మండలం వేంపెంటకు చెందిన మాదారం సుభాష్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం స్థానిక జేఎఫ్ఎంసీ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి 15 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ఆత్మకూరులోని అటవీశాఖ కార్యాలయంలో డీఎస్పీ రామాంజి నాయక్ విలేకరులతో మాట్లాడి కేసు వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు సురేష్ కుమార్ రెడ్డి, రాము, ఎస్ఐ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
● తొలిరోజు పరమేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తులుశ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడు కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి నవంబరు 21వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసంలో శివుని ఆరాధనకు భక్తులు అసక్తి చూపుతారు. ఇందులో భాగంగా కార్తీకమాసం మొదటిరోజు శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాస్ట్రాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీఽధిలో ఉసిరి చెట్ల కింద పలువురు భక్తుల దీపారాధన చేసుకుని, ప్రత్యేక నోములు చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. వెలిగిన ఆకాశదీపం శ్రీశైలం టెంపుల్: కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగాణంలోని ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పైభాగంలో ఆకాశదీపం నెలకొల్పారు. కార్తీకమాసం ముగింపు వరకు ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజను చేశారు. అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిపించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ● కార్తీక పౌర్ణమిన వైభవోపేతంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి
కార్తీకం..శుభకరం! శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రం దీప కాంతులతో వెలుగొందనుంది. నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే మిగతా పర్వదినాల కంటే ఈ మాసంలో శివుడిని ఆరాధించేందుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీగిరికి తరలివస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని దీపారాధన చేసుకుంటారు. ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కృష్ణానది వద్ద పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం విశేషంగా జరుపుతారు. ముందుజాగ్రత్తగా శ్రీగిరికి తరలివచ్చే భక్తుల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. కార్తీకమాసంలో ప్రతి సోమవారం(నాలుగు సోమవారాల్లో) లక్షదీపోత్సవం, పుష్కరిణికి హారతి నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలోని పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి నవవిధ హారతలు ఇస్తారు. అనంతరం లక్షదీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ దీపోత్సవంలో భక్తులందరూ కూడా దీపాలను వెలగించుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. సుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులు సమర్పిస్తారు. హారతి కార్యక్రమంలో ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహాహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతులు ఇస్తారు. అలాగే ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో విశేషంగా పూజాదికాలు నిర్వహించి చివరగా స్వామి అమ్మవార్లకు దశహారతులతో నీరాజనాలు సమర్పిస్తారు. జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్తంభాలపై నెయ్యితో వత్తులను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఇది తోరణంగా వెలుగుతుంది. తోరణంలో కాలిన నూలు వత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. వనభోజనాలు: కార్తీకమాసంలో ముఖ్యమైన అంశం వనభోజనాలు. ఈ వనభోజనాలను పలు వృక్షజాతులున్న వనంలో ఉసిరిక చెట్టు కిందనే చేయాలని శాస్త్రం చెబుతుంది. వనంలోనే వంటలను వండుకొని తినాలి. ఈ వంటల్లో ఉసిరిక కాయలను విధిగా వినియోగించాలి. వనభోజనాలు చేయడం వలన అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉపవాసం ఆధ్యాత్మిక సాధనకు అనువైన కార్తీకమాసంలో ఉపవాసం ప్రధానమైనది. ఈ నెలలో పగలు ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేయడం మంచిది. పగలంతా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు, అల్పాహరం వంటివి తీసుకోవచ్చు. ఈ నెలంతా ఉపవాసం ఉండకపోయినా కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి వంటి పర్వదినాల్లోనైనా ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. పుణ్యనదీ హారతి కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని పాతాళగంగ వద్ద కృష్ణవేణమ్మ తల్లికి సాయంత్రం 5 గంటలకు పుణ్యనదీహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. కృష్ణవేణి నదీమాతల్లికి విశేషపూజలు నిర్వహించి వాయనంగా సారె సమర్పిస్తారు. -
మా గ్రామంలో క్రికెట్ ఎలా ఆడతారు
బేతంచెర్ల: మా గ్రామంలో క్రికెట్ ఎలా ఆడతారని మొదలైన గొడవ దాడికి కారణమైంది. దీంతో బాధితులు గ్రామస్తులతో కలిసి పోలీసుస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మండలపరిధిలోని బుగ్గానిపల్లె తండాకు చెందిన కిరణ్ నాయక్, పుల్లన్న నాయక్ మరికొందరు మిత్రులతో కలిసి దీపావళి పండుగ సందర్భంగా మండలంలోని సిమెంట్ నగర్ పాణ్యం సిమెంట్ హైస్కూలు గ్రౌండులో సోమవారం క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా మా గ్రామంలో మీకు ఆడేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన అనిల్ నాయక్, రాజేష్ నాయుడు, సమీర్, లక్ష్మణ్ నాయక్, స్వామినాయక్ మరికొంత మంది యువకులు అడ్డుకున్నారు. వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా కిరణ్ నాయక్, పుల్లన్న నాయక్పై గొడవపెట్టుకొని క్రికెట్ బ్యాట్, వికెట్లతోదాడి చేశారు. ఆటను వీక్షించడానికి వచ్చిన మరికొంత మంది బుగ్గానిపల్లె తండా గ్రామస్తులు వారించిన వారిపైనా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున బేతంచెర్ల పోలీసుస్టేషన్కు చేరుకొని సమస్యను విన్నవించారు. పోలీసులు స్పందించకపోగా మీరు ఫిర్యాదు చేసి వెళ్లండని సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ మేరకు అనిల్ నాయక్, రాజేష్ నాయుడు, సమీర్, లక్ష్మణ్ నాయక్, స్వామి నాయక్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. -
చిట్టి చేతులు.. వెట్టి చాకిరి
ఇక్కడ గుడ్ల బాక్స్లను మోసుకుంటూ వెళ్తున్న విద్యార్థులు కోవెలకుంట్ల మండలం చిన్నకొప్పెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన వారు. మంగళవారం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గుడ్లస్టాక్ వచ్చింది. ఈ స్టాక్ను తీసుకెళ్లి వంట ఏజెన్సీ పాఠశాలలో భద్ర పరచాలి. అయితే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతోనే వాటిని మోయించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిదుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. –కోవెలకుంట్ల -
శ్రీశైలం ఘాట్లో బస్సు, కారు ఢీ
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం ఉదయం బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన భక్తులు కారులో శ్రీశైలం వస్తున్నారు. 9 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం సమీపంలో ఎదురుగా వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రవికుమార్(64), ప్రభావతి (54), వాసుదేవయ్య (36), తేజస్విని (30) గాయపడ్డారు. వీరిని 108 వాహనం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన రవికుమార్, ప్రభావతిలను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రిషికాంత్ టౌన్షిప్లో దొంగల హల్చల్
కర్నూలు: నగర శివారులోని నంద్యాల రోడ్డులో ఉన్న రిషికాంత్ టౌన్షిప్ (శిల్ప టౌన్షిప్ పక్కన) లో దొంగలు హల్చల్ చేశారు. ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్ నెం.9లో నివసించే శ్రీకాంత్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీ కెమెరాకు గుడ్డలు చుట్టి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. మొదట ఫ్లాట్ కింద ఉన్న కార్యాలయంలోకి వెళ్లి రూ.10 వేలు నగదు, ల్యాప్టాప్ను తస్కరించారు. ఇంట్లోకి వెళ్లేటప్పుడు సెన్సర్ బల్బులను గుర్తించి వాటిని తొలగించి పగలగొట్టి హల్చల్ చేశారు. ముఖానికి మాస్కులు, మంకీ క్యాపులు ధరించి చేతులకు గ్లౌజులు వేసుకుని ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడినట్లు మరో సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. అదే వెంచర్లో నివాసముంటున్న కోనా రెడ్డి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగలు చోరీ చేశారు. ఈ వెంచర్ ఏర్పాటై 6 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం వల్ల తరచూ కాలనీలో దొంగలు ప్రవేశించి చేతివాటం ప్రదర్శిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సమీప కాలనీ స్కందాన్షిలో కూడా దొంగలు భారీగా నగలు, నగదు చోరీ చేశారు. మద్యం బాబులకు అడ్డాగా... నూతనంగా ఏర్పాటైన ఈ కాలనీలు మద్యం బాబులకు అడ్డాగా మారాయి. నగర శివారు కావడంతో రాత్రివేళల్లో మద్యం బాబులు ఈ ప్రాంతాల్లో తిష్ట వేసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతుంటారు. ఇదే కాలనీలో ఇద్దరు పోలీసు అధికారులు నివాసముండగా మరో ఇద్దరు అధికారులు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. తరచూ పోలీసు వాహనాలు కాలనీలో తిరుగుతున్నప్పటికీ దొంగలు అదును చూసి ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. పోలీసు గస్తీ అంతంతమాత్రంగా ఉండటంతో దొంగలకు అవకాశంగా మారింది. చోరీ విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం
ఆదోని సెంట్రల్/మంత్రాలయం: ఆదోని డివిజన్ పరిధిలోని మంత్రాలయం ఆర్ఎస్ దగ్గర కిలోమీటరు నంబర్. 535/23–25 మధ్య ఎ.బాలరాజు అనే వ్యక్తి ట్రైన్ నుంచి ప్రమాదావశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఆర్పీ ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. మృతుడు తమిళనాడు రాష్ట్రం ముతుసమియపురం మండలం ముహపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. బతుకు దెరువు నిమిత్తం సోలాపూర్కు వెళ్లి ట్రైన్లో స్వగ్రామానికి తిరిగొస్తున్నాడు. సోలాపూర్ నుంచి మధురై వరకు రైల్వే టికెట్ ఉంది. ట్రైన్ నంబర్ 16351లో ప్రయాణం చేస్తుండగా మంత్రాలయం ఆర్ఎస్ దగ్గర ప్రమాదావశాత్తు రైలు నుంచి జారి కిందకు పడడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడిని 108 అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ బాలరాజు మృతి చెందాడు. మృతుడికి భార్య కామాక్షి, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిసింది. -
శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీ ఎన్నిక
కర్నూలు(సెంట్రల్) : జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ శారీరక దివ్యాంగ ఉంద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం కార్మిక, కర్షక భవన్లో అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ గ్రేషి స్టేబిస్టిన్, ముఖ్య సలహాదారులుగా వన్నూర్బాషా, లక్ష్మన్న, జిల్లా అధ్యక్షుడిగా కె.నాగరాజు, ఉపాధ్యక్షులుగా కె.రాముడు, మహేశ్వరరెడ్డి, రమేష్, ప్రధాన కార్యదర్శిగా పి.బాషా, కోశాధికారిగా జి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులుగా ఎస్.దేవేంద్ర, టి.హరికృష్ణ, చాంద్బాష, నీలప్ప, ఎస్ఎండీ రఫీక్, జిల్లా కన్వీనర్గా పి.కిశోర్కుమార్, ఐటీ కార్యదర్శి ఇబ్రహీం, మీడియా కార్యదర్శిగా ఎం.రవీంద్రబాబు, లాజిస్టిక్ కార్యదర్శులుగా టి.శీను, ఎం.రవికుమార్, ఎ.శివారెడ్డి, సాంస్కృతి విభాగం కార్యదర్శులుగా జెట్టివీరేష్, సూర్యప్రకాష్, డి.విశ్వేశ్వరప్పను ఎన్నుకున్నారు. అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎల్.ఎల్లమ్మ, మహిళా కార్యదర్శులు శ్రీదేవి, సరిత ఎన్నికయ్యారు. కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం ఆత్మకూరు రూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. ఇందిరా నగర్లో నివసించే ప్రవీణ్కుమార్ (28)కు ఇటీవల భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. ఇరువురు తరచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన ప్రవీణ్కుమార్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన వెలువడటంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రవీణ్కుమార్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకర్నూలు: కర్నూలు–దూపాడు రైల్వేస్టేషన్ మధ్య గల హ్యాంగౌట్ హోటల్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం ఉదయం రైలు కింద పడి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుంది. క్రీమ్ కలర్ హాఫ్ షర్టు, ముదురు ఎరుపు రంగు షార్టు ధరించాడు. కుడిచేతి మణికట్టుపై సులోచన అనే అక్షరాలు ఉన్నాయి. 5.5 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ వర్ణం ఉంటాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే పీఎస్ హెడ్ కానిస్టేబుల్ నూర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 99088 89696 లేదా 90304 81295 లేదా 99859 37035 నంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. -
కాసులిస్తే చాలు..
● సెలవురోజుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్లు ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సబ్జైల్ సిబ్బంది ఇష్టారాజ్యంపత్తికొండ: పత్తికొండ సబ్ జైల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. కాసులిస్తే చాలు నిబంధనలు విరుద్ధంగా సెలవురోజుల్లోనూ ములాఖత్లకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకు వేళాపాళా కూడా ఏమీ ఉండదు. నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారు కొందరు.. వివిధ కేసుల్లో ఆరైస్టె రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారు మరికొందరు స్థానిక సబ్జైలులో ఉన్నారు.వీరిని వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎప్పుడంటే అప్పుడు కలవాడానికి వీలుండదు. నిర్దేశించిన రోజుల్లో నిర్ణయించిన సమయానికి కలవాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను ఇక్కడి జైలు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. రేటు ఫిక్స్ చేసి ములాఖత్కు అనుమతిస్తున్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుదరదని వెనక్కి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జైల్ నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో ములాఖత్లకు అనుమతి ఇవ్వకూడదు. అయితే, దీపావళి పండుగ రోజైన సోమవారం ఏకంగా 20 మందికి అనుమతి ఇచ్చారు. పెద్ద మొత్తంలో వారి నుంచి డబ్బు ముట్టడంతోనే నిబంధనను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో సబ్జైలుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే జైల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాగా సెలవు రోజు ములాఖత్పై సబ్జైల్ అధికారి వెంకటయ్య వివరణ కోరగా రూల్స్ ప్రకారం అనుమతించరాదని ఖైదీలకు సంబంధించిన కుటుంబసభ్యులు అడగడంతో మానవతా కోణంలో అవకాశమిచ్చినట్లు చెప్పుకొచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని కొణిదేల రోడ్డులో ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన పాలమర్రి నారాయణ (47) కూలీ పనులు చేసుకొని జీవిస్తుంటాడు. సోమవారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు మొక్కజొన్న దిగుబడిని నందికొట్కూరు పట్టణ సమీపంలో జీవనజ్యోతి స్కూల్ వద్ద ఉన్న మెట్టపై ఆరబోసేందుకు వచ్చాడు. పని ముగించుకొని సాయంత్రం చీకటి పడగానే బైక్పై స్వగ్రామానికి బయలుదేరిన అతను కొణిదేల రోడ్డులో ఆగి ఉన్న బిజినవేముల గ్రామానికి చెందిన తిరుపతయ్య ట్రాక్టర్ను ఢీకొట్టాడు. చీకటిలో కనిపించకపోవడంతో జరిగిన ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య రాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పోలీసు అమరవీరులను
స్మరించుకోవడం మనందరి బాధ్యత కర్నూలు: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత.. వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. మంత్రి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్మృతి పెరేడ్కు హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలో ఈ సంవత్సరం ఐదుగురు ప్రాణత్యాగం చేశారన్నారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతూ నిజాయితీగా పనిచేస్తూ నేరాలు జరగకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. పోలీసులు నూతన టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారని, అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. ఏ ఘటన జరిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులేనని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 191 మంది పోలీసుల పేర్లను అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా చదివి వినిపించారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసులు వెంకటేశ్వర్లు, అబ్దుల్ కరీం, కె.రాముడు కుటుంబాల వారిని శాలువ, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ఉపేంద్ర బాబు, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు పోలీసు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు
కర్నూలు(అగ్రికల్చర్): డీఏ అరియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు ఏమాత్రం సరికాదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క డీఏ విడుదల చేస్తూ జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ల 60, 61పై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెరిగిన డీఏ అక్టోబర్ నెల వేతనంతో కలిపి నవంబర్ నెలలో చెల్లిస్తారని, సాంప్రదాయం ప్రకారం అరియర్స్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ప్రావిడెండ్ ఫండ్(జడ్పీపీఎఫ్)లో కలపాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు 21 నెలల అరియర్స్ డీఏ ఆ విధంగానే కలుపుతారని భావించామన్నారు. అయితే జీపీఎఫ్లో కాకుండా పదవీ విరమణ తర్వాత ఇస్తామని జీవోలో పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వీస్లో ఉండి మరణించిన వారికి, పెన్షనర్లకు డీఏ అరియర్స్ 2027–28 నుంచి 12 విడతల్లో చెల్లిస్తామనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను ఇప్పటికే ఏపీ ఎన్జీవో అసోషియేషన్తో పాటు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయన్నారు. త్వరలోనే జీవోల మార్పునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఆయన వెంట జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, భాస్కరనాయుడు, పి.రామకృష్ణారెడ్డి, ఆర్వీ రమణ, వ్యవసాయ ఉద్యోగుల సంఘం, వెటర్నరీ పారా సిబ్బంది సంఘం నేతలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ బదిలీ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ పి.శాంతికళ బదిలీ అయ్యారు. ఆమెను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్(సీఎంఓహెచ్)గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ కింద ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 27న కర్నూలు డీఎంహెచ్ఓగా ఆమె విధుల్లో చేరారు. వ్యక్తిగత కారణాలతో పలుమార్లు సెలవు పెడుతూ వచ్చారు. ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం ఆమె అందుబాటులో ఉండటం లేదన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇదే సమయంలో జిల్లాలో భ్రూణహత్యలు, గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కోడుమూరులో కర్ణాటక రాష్ట్ర అధికారులతో ఏపీ వైద్యా రోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు బాషా నర్సింగ్హోమ్పై డెకాయిట్ ఆపరేషన్ ద్వారా దాడులు నిర్వహించి అక్కడ గర్భస్థలింగనిర్ధారణ చేస్తుండటాన్ని గమనించి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇదే సమయంలో డాక్టర్ పి.శాంతికళ తన కింది స్థాయి ఉద్యోగులపై పట్టు సాధించలేకపోవడం, జాతీయ కార్యక్రమాల అమలులో జిల్లా అట్టడుగుకు చేరుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె కూడా కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కొనసాగింది. దీంతో మంగళవారం నాటి బదిలీ ఉత్తర్వులతో వదంతులకు ఫుల్స్టాప్ పడింది. డాక్టర్ భాస్కర్కు ఎఫ్ఏసీ బాధ్యతలు జిల్లా క్షయ నియంత్రణాధికారిగా, ఎయిడ్స్ అండ్ లెప్రసి అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్కు డీఎంహెచ్ఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీఎంహెచ్ఓ వచ్చేంత వరకు ఆయన డీఎంహెచ్ఓగా కొనసాగనున్నారు. ఈ సీటు కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. -
పేలుతున్న టపాసుల ధరలు!
కర్నూలు(సెంట్రల్): బాణాసంచా ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ రకం టపాసులను ముట్టుకున్నా షాక్ కొడుతున్నంత పని అవుతోంది. దీంతో దీపావళి పర్వదినాన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అటువైపు చూడాలంటే భయపడాల్సి వస్తోంది. కనీసంగా రూ.5 వేల వరకు క్రాకర్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తుండడంతో అయోమయంలో ఉన్నారు. స్థానికంగా రేట్లు పెంచి.. దీపావళి పండుగ రోజున నరకాశుని వధ కోసం బాణాసంచాను పేల్చి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాణాసంచాను కుటుంబ సభ్యులందరూ ఒకచోటా చేరి పేల్చడం పారిపాటైంది. ఈ క్రమంలో ప్రజలకు అవసరమైన బాణాసంచాను అందుబాటులో ఉంచేందుకు 86 ఏళ్ల నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలో క్రాకర్స్ మర్చంట్ అసోసియేషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, పత్తికొండ, ఆదోనిలలో ప్రజలకు అనువైన చోటా స్టాళ్లను ఏర్పాటు చేసి బాణాసంచాను పరిమితమైన రేట్లకు ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కర్నూలులో 100, ఆదోనిలో 15, పత్తికొండలో 4 బాణాసంచా స్టాళ్లను ఏర్పాటుచేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఆయా పట్టణాల్లో స్టాళ్ల సంఖ్యను పెంచారు. ఇదేక్రమంలో స్టాళ్లలో బాణాసంచా రేట్లను కూడా విపరీతంగా పెంచడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఏకంగా 25 శాతం వరకు రేట్లు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఒక్కో కుటుంబంపై దాదాపు 3–5 వేల వరకు అదనపు భారం పడుతోంది. మరోవైపు స్థానిక క్రాకర్స్ మర్చంట్ ప్రోద్బలంతోనే రేట్లు పెంచి అముతున్నట్లు చెబుతున్నారు. ఈ స్టాళ్లలో షాపు ఏర్పాటు చేసుకోవాలంటే అసోసియేషన్కు రూ.20 వేలు, జీఎస్టీ పేరిట రూ.20 వేలు, మునిసిపాలిటీకి రూ.5 వేలు, అదనపు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా డబ్బులతోపాటు పెట్టుబడి, నాలుగు రోజుల నిర్వహణ ఖర్చులు, లాభాల కోసం రేట్లను పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాగా, షాపుల్లో మాత్రం 80–90 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నా వినియోగదారుడికి మాత్రం రేట్లు తగ్గడంలేదు. వ్యాపారాలు తగ్గాయంటున్న వ్యాపారులు మరోవైపు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అసోసియేషన్కు రూ.46 వేలు కట్టి స్టాల్ను ఏర్పాటు చేసిన వ్యాపారాలు జరగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలుకు సమీపంలోని వెల్దుర్తిలో క్రాకర్స్ తయారీ కేంద్రం ఉండడంతో వినియోగదారులతోపాటు వ్యాపా రులు అక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో ఇక్కడ కంటే అక్కడే తక్కువ బాణాసంచా విక్రయాలు జరుగుతుండడంతో అక్కడే వెళ్లి తెచ్చుకుంటున్నారని, ఫలితంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వారు కనీసం అసోసియేషన్కు చెల్లించినా డబ్బులైనా వస్తాయా లేదా అన్న మీమాంసలో ఉన్నారు. గ్రీన్కాకర్స్ను మాత్రమే కాల్చాలిజాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో గ్రీన్ కాకర్స్ను మాత్రమే అమ్మేలా వ్యాపారులకు నిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టరు, ఎస్పీ, జిల్లా అగ్నిమాపక అఽధికారి, ఆర్డీఓలు, కాలుష్య నియంత్రణ మండలి, మునిసిపల్ అధికారులు బాణసంచా వ్యాపారులతో సమావేశాలను నిర్వహించుకొని ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పండుగరోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య బాణసంచాను పేల్చాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జీఎస్టీ తగ్గినా రేట్లు అధికమే కనీసం రూ.5 వేలు వెచ్చించాల్సి వస్తోందని ప్రజల ఆవేదన విపరీతమైన ధరలతో వేడుకలకు దూరంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు -
ఆలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే విరాళం
ఆదోని రూరల్: మండలంలోని గణేకల్ గ్రామంలో ఉన్న బంగారమ్మవ్వ దేవాలయ నిర్మాణానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి రూ.1,01,000 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవ్వవారి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత ఆశీస్సులు సాయిప్రసాద్రెడ్డిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ధర్మయ్య, ఉచ్చీరప్ప, లక్ష్మయ్య, గోపాల్, చిన్న ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి కర్నూలు(అర్బన్): యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని తులసీ గ్రూప్ చైర్మన్ తులసీ రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద బలిజ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు, మాజీ అధ్యక్షులు యర్రంశెట్టి నారాయణ రెడ్డి, రోపా అధ్యక్షులు చింతలపల్లి రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న స్కాలర్షిప్స్ ఉన్నత చదువులకు తోడ్పాటును అందిస్తుందన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 180 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ.9 లక్షలను స్కాలర్షిప్స్ రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరు జనార్దన్రెడ్డి, కొట్టే చెన్నయ్య, బాలరాజు, భాస్కర్బాబు, మల్లికార్జునమూర్తి, మలిశెట్టి దివాకర్, గాండ్ల లక్ష్మన్న, మండ్లెం రవి, సింగంశెట్టి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి బస్సుయాత్ర ఆదోని సెంట్రల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సుయాత్ర చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ బాషా, నిర్మాణ బాధ్యులు గిడ్డయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదోని పట్టణంలోని ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంవగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభు త్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిలా ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, రంగస్వామి, థామస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రైతు అదృశ్యం బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ జగన్మోహన్ ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన చాకలి పెద్ద వెంకటేశ్వర్లు (57) శనివారం సాయంత్రం పొలం దగ్గరకు వెళ్తున్నానని ఇంటిలో చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టు చుట్టు పక్కల, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అతని కుమారుడు చాకలి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
టపా‘కాసులు’.. బాణా‘సంచు’లు
దీపావళి పర్వదినం ఆనందంగా జరుపుకునేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగకు రెండు రోజుల ముందు నుంచే బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు ఆసక్తిగా రకరకాల టపాసులు కొనుగోలు చేస్తున్నారు. రేట్లు అధికంగా ఉన్నాయంటూనే కొందరు సంచులు, బ్యాగులు నింపుకుని వెళ్తున్నారు. కాగా మైదానంలో బాణాసంచా విక్రయాల సమయంలో పాటించాల్సిన నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు పండగ -
బ్రహ్మనందీశ్వర ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ
నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కోటా వీధిలో వెలసిన శ్రీబ్రహ్మనందీశ్వరస్వామి దేవస్థానంలో మన ఊరు–మన గుడి, మన బాధ్యత సభ్యులు కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు ఆలయ గోపురాలను శు భ్ర పరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటూరు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ 100 మందికి పైగా సభ్యులచే గుడిని శుభ్రం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా పాత బడిన దేవుళ్ల ఫొటోలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సభ్యులకు అందజేస్తే తాము వాటిని విసర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హరికృష్ణ, డాక్టర్ కార్తీకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయం
● 24న నంద్యాలలో భారీ సభ ● సాగునీటి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి నంద్యాల(అర్బన్): సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే రాయలసీమ సాగునీటి సాధన సమితి ధ్యేయ మని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. రాయలసీమ నీటి హక్కులను రక్షించడం, సీమకు న్యాయం జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 24న పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో భారీ సభ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో కలిసి సభ పాంప్లేట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమ రైతులు 60 వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ ప్రాజెక్టు రూపకల్పనలో సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్సార్బీసీ, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుమారు 3 లక్షల ఎకరాలను భూ సేకరణ ద్వారా రైతులు త్యాగం చేశారని, వాటి ద్వారా సీమలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాల్వల ద్వారా నీరు అందుతుందన్నారు. మరో 2 లక్షల ఎకరాలకు రైతులు ఇంజిన్ల సాయంతో నీరు తోడుకోవాల్సి వస్తుందన్నారు. మిగిలిన 10 లక్షల ఎకరాల రైతులు నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న 5 నుంచి 10 శాతం పనులు పూర్తి చేస్తే మొత్తం ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. కుందూనది విస్తరణ పేరుతో కొత్త భూసేకరణలు చేయడం అన్యాయమన్నారు. 24న నిర్వహించే సభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నాయకులు వడ్డె మహదేవ్, చైర్మన్ వడ్డె శోభానాద్రీశ్వరరావుతో పాటు కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్రావు, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగతికి నాగరికత నేర్పిందే అమ్మ!
కర్నూలు కల్చరల్: ‘జగతికి నాగరికత నేర్పింది అమ్మ. అమ్మ చరితం పొగడటం ఎవరి తరం కాదు’ అని పలువురు సాహితీ వేత్తలు అభిప్రాయపడ్డారు. సాహితీ సదస్సు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మద్దూరు నగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో ప్రముఖ పద్య కవి, రాష్ట్ర పతి అవార్డు గ్రహీత చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి రచించిన ‘మాతృ దర్శనం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ సదస్సు అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూరా, తెలుగు భాష వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయ సాహిత్యంలో ఇప్పటి వరకు అమ్మపై ఎంత మంది కవులు కవిత్వ రాసినా అంది నిత్య నూతనంగానే ఉంటుందన్నారు. తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ కె.చంద్రమౌళిని, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి పుస్తక సమీక్ష చేశారు. అనంతరం రచయిత కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. నరసం అధ్యక్షరాలు సుబ్బలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీ వేత్తలు పోత న్న, వెంకట కృష్ణ, మారుతి, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, బసరావరాజు, మధుసూ దన శర్మ, శ్రీనివాసమూర్తి, డాక్టర్ హరికిషన్, ఎస్డీవీ అజీజ్ పాల్గొన్నారు. -
27 నుంచి ‘రాయలసీమ’ కార్మికుల రిలే దీక్షలు
ఆదోని సెంట్రల్: సమస్యల పరిష్కారానికి రాయలసీమ స్పిన్నింగ్ మిల్ కార్మికులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి వెంకప్ప తెలిపారు. ఆదోని రాయలసీమ మిల్లు కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లు మూతపడి 25 సంవత్సరాలు అవుతున్నారు 150 మంది కార్మికులకు పీఎఫ్, పెన్షన్ రాలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టీయూ నాయకుడు నారాయణ, కార్మికులు కుమార్, మల్లికార్జున, రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం కర్నూలు(సెంట్రల్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల కోసం దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అంజిబాబు, పీఎస్ రాధాకృష్ణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.నాగరాజు తెలిపారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలంటే మిన్నకుండిపోవడం అన్యాయమన్నారు. gê¡Ä¶æ$ çÙ*sìæ…VŠæ ´ùsîæ-ÌSMýS$ MýSÆý‡*²Ë$ }MýSÆŠæలు కర్నూలుటౌన్: జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు కర్నూలు షూటర్ శ్రీకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం కార్యదర్శి ఎండీ బాషా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో నిర్వహించిన 16వ సౌత్జోన్ స్థాయి రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో కర్నూలు షూటర్ శ్రీకర్ ప్రతిభ చూపారని తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 400 పాయింట్లకు 350 పాయింట్లు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. -
వివక్ష తగదు
ఉపాధ్యాయుల సరండర్ లీవ్ల బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. వాటిపైన ప్రతి ఏడాది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అయినప్పటికీ వారి ఖాతాల్లో ఇంతవరకు సరండర్ లీవ్స్ మొత్తం కెడ్రిట్ కాలేదు. పోలీసులకు విడతల వారీగా సరండర్ లీవ్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్న విధంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు పెండింగ్ బకాయిలను ఇవ్వాల్సిందే. – కరుణానిధి మూర్తి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు -
నాలుగు డీఏలు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులతోముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరుపడం హర్షణీయమే. కాని ఉద్యోగులు ఆశించిన రీతిలో డిమాండ్లకు ఆమోదం లభించలేదు. సరండర్ లీవ్లు ఒక్క పోలీసులకు మాత్రమే ఇస్తామనడం తగదు. ఇతర ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? పోలీసులతో సమానంగా అందరికీ సరండర్ లీవ్లు మంజూరు చేయాలి. ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం దరదృష్టకరం. పెడింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలి. – సర్దార్ అబ్దుల్ హమీద్, ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు -
పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలనే కుట్ర
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలనే కుట్రను సహించేది లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని పాతబస్తీ ప్రాంతంలో బేకారి కట్ట వద్ద కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించడమే కాకుండా, స్థానికంగా ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలన్న మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. రూ.8,500 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ఎలాగైనా తమ అనుచరులకు అప్పగించేందుకు ప్రెవేటీకరణ చేస్తోందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పీపీపీ విధానాన్ని విరమించుకునేంత వరకు ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కార్పొరేటర్ జుబేర్, పార్టీ నాయకులు రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, కిషన్, వస్తాద్, బాబుబాయ్, చాంద్, మైనార్టీ నాయకులు ఫిరోజ్, సర్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తూకం ప్రకారమే కూలి!
ఆలూరు: పొలంలో పత్తిని తీసేందుకు వచ్చిన కూలీలకు వారి తీసిన పత్తిని తూకం వేసి కూలి ఇస్తున్నారు. ప్రస్తుతం పత్తి కోతకు కూలీలను పిలిస్తే రోజుకు రూ.400 వరకు డిమాండ్ చేస్తున్నారు. అలా కాదంటే తాము తీసిన పత్తిని తూకం వేసి కిలోకు రూ.12 చెల్లించాలంటున్నారు. మొన్నటి వరకు కోస్తా, తెల్లంగాణ ప్రాంతాల్లో మాత్రమే ఈ పద్ధతి ఉండేది. ప్రస్తుతం ఈ విధానం జిల్లాకు వచ్చింది. నేడు పోలీస్ పీజీఆర్ఎస్ రద్దు కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ను ఈ నెల 20న రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రావొద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, పోలీస్ కుటుంబాలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గైనకాలజీ పీజీ సీట్లు పెరుగుదల కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో గైనకాలజీ విభాగానికి మరో నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ విభాగంలో 18 పీజీ సీట్లు ఉండగా పెరిగిన నాలుగు సీట్లతో కలిపి 22కు చేరాయి. ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 21వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 బాల బాలికలు టేబుల్ టెన్నిస్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లా స్థాయి ఎలిజిబులిటీ ఫారం, ఎండీఎం ఫారం, సీబీఎస్ఈ విద్యార్థులు అయితే డిక్లరేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, పుట్టిన తేదీ పాఠశాల రికార్డుతో హాజరు కావాలన్నారు. వీరారెడ్డి ఇంట్లో సోదాలు దొర్నిపాడు: వెల్త్ అండ్ హెల్త్ స్కీంలో భాగంగా దొర్నిపాడులో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల పేరిట మోసపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడు వీరారెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఆదివారం డీఎస్పీ ప్రమోద్ బృందం సోదాలు చేసింది. తనిఖీల్లో ప్రామీసరి నోట్లు, విలువైన ఆస్తి పత్రాలు, ప్రింటర్లు, ల్యాప్ టాప్లు దొరికినట్లు తెలిసింది. సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరడంతో బాధితులు నిరసన విరమించారు. డీఎస్పీ వెంట సీఐలు మురళీధర్రెడ్డి, హనుమంత్నాయక్, ఎస్ఐలు రామిరెడ్డి, వరప్రసాద్ ఉన్నారు. -
ఆలూరులో వాల్మీకుల నిరసన
ఆలూరు: టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ వైకుంఠం జ్మోతమ్మ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్అండ్బీ అథితిగృహం ఆవరణలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి రామాంజనేయులు, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు వాల్మీకి వరుణ్కుమార్ మాట్లాడారు. వాల్మీకి కులస్తుల్లో ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాలను, ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని తొలగించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వినతి పత్రాన్ని అందజేశారన్నారు. అయితే ఎమ్మెల్యేకు ఇంగ్లిష్, హిందీ భాషలు రావని, వినతి పత్రం ఎలా అందించారని టీడీపీ ఇన్చార్జ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంటనే వైకుంఠం జ్మోతమ్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలూరు వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అరికెర వెంకటేశ్వర్లు, మనేకుర్తి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రసాద్రెడ్డి, ఆలూరు మండల వైఎస్సార్సీపీ కో–కన్వీనర్ వీరేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఆగదు
డిమాండ్లను సాధించుకునేందుకు మొదట ఉద్యమాన్ని లేవదీసింది ఉపాధ్యాయ సంఘాలే. ఎట్టకేలకు 16 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపడటం సంతోషాన్ని ఇచ్చింది. అయితే చర్చలు మాకు సంతృప్తిని ఇవ్వలేదు. ముఖ్యమంత్రితో చర్చలంటే దాదాపు అన్ని డిమాండ్లకు పరిష్కారం లభించాలి. నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా.. కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం తీవ్ర నిరాశను మిగిల్చింది. 12వ పీఆర్సీ లేదు. ఐఆర్ ఊసే లేదు. ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. పీఆర్సీ, ఐఆర్ సాధించుకునేందుకు మా ఉద్యమం ఆగదు. – హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేవలం ఒక్క డీఏకు ఉద్యోగ సంఘాల నేతలు సంబరపడుతుండటం చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రభుత్వంతో కోట్లాది రూపాయల విలువ చేసి డిమాండ్లు సాధించుకున్నాం అన్నట్లుగా ఉద్యోగ సంఘాలు గొప్ప స్టేట్మెంట్లు ఇస్తుండటం దారుణం. ఒక్క డీఏతో సంబరపడిపోతూ.. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారనే విధంగా ప్రకటనలు ఇస్తుండటం చూస్తే బాధేస్తోంది. ఇప్పటికై నా మిగిలిన మూడు డీఏలు, పీఆర్సీ, ఐఆర్ ఇతర డిమాండ్లు సాధించుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – గిరికుమార్రెడ్డి, మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, కర్నూలు ● -
నీ వెంటే నేను..
● భార్య మృతి చెందిన గంటలోనే భర్త మరణం ● ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి ప్యాపిలి: దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిచారు. వృద్ధాప్యంలో సైతం అన్యోన్యంగా ఉంటూ కాలం వెళ్లదీశారు. మరణం సైతం వీరిని వీడయలేదు. నీ వెంటే నేనంటూ గంటల వ్యవధిలో ఇద్దరు తనవు చాలించారు. ఈ విషాద ఘటన ఆదివారం ప్యాపిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అరవేటి లక్ష్మీనారాయణ (90), వెంకటలక్ష్మమ్మ (77) దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. వీరికి నలుగురు కుమారులు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఒక కుమారుడు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. మూడో కుమారుడు సతీశ్ తల్లిదండ్రులతో కలసి ప్యాపిలిలో ఉంటున్నాడు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మమ్మలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త లక్ష్మీనారాయణకు సపర్యలు చేస్తూ అతనికి చేదోడువాదోడుగా ఉంటున్న భార్య వెంకటలక్ష్మమ్మ ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందారు. విషయం తెలిసిన భర్త లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపానికి గురై 10–30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. అరవేటి లక్ష్మీనారాయణ నంద్యాల, నందికొట్కూరు, మద్దికెర తదితర ప్రాంతాల్లో లైబ్రేరియన్గా పని చేసి 1993లో పదవీ విరమణ పొందారు. ఒకే రోజు భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. -
అదుపు తప్పి లారీ బోల్తా
తుగ్గలి: గిరిగెట్ల సమీపంలోని లింగాల వంక బ్రిడ్జిపై నుంచి శనివారం అదుపుతప్పి లారీ కిందపడి పోయింది. గుత్తి నుంచి పత్తికొండ వైపు హిటాచీ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ మార్గమధ్యలో లింగాల వంక వంతెన దాటగానే అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం రద్దీకి ఇరుకుగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే పత్తికొండ–బెంగళూరు రోడ్డును విస్తరించడంతో పాటు బ్రిడ్జిని వెడుల్పు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఊళ్లు ఖాళీ అవుతున్నాయ్! గోనెగండ్ల: పల్లెలు వల స బాట పడుతున్నాయి. ఊర్లకు ఊళ్లు పనులు వెత్కుంటూ కదులుతున్నాయి. సొంతూరులో ఉపాధి లేకపోవడంతో తెలంగాణ, గుంటూరు ప్రాంతాలకు వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు వలస వెళ్తున్నారు. శనివారం మండల కేంద్రం గోనెగండ్లతో పాటు గంజిహళ్లి, కులుమాల, అగ్రహారం తదితర గ్రామాల నుంచి కూలీలు పొట్ట చేత పట్టుకొని వలస బాట పడుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన కూలీలు శుక్ర, శనివారం తెలంగాణలోని మహబూబ్నగర్, తదితర పట్టణాలకు వలస వెళ్లారు. గోనెగండ్ల ఎస్సీ కాలనీలో రాత్రి 50 కుటుంబాలు వలస బాట పట్టాయి. ఈ ఏడాది సాగుచేసిన పంటలు నష్టపోవడం, ప్రస్తుతం గ్రామాల్లో పనులు లేకపోవడం, అధికారులు పనులు చూపకపోవడంతో వలసలు వెలుతున్నట్లు కూలీలు చెబుతున్నారు. డిసెంబర్ వరకు పనులు చేసుకొని మళ్లీ తిరిగి సొంత గ్రామాలకు వస్తామంటున్నారు. పొలంలో పత్తి చోరీ గోనెగండ్ల: కున్నూరు గ్రామంలో ఓ రైతు పొలంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పత్తిని అపహరించారు. గ్రామానికి చెందిన రైతు సుబ్బరాయుడు 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రతి రోజున తీసిన పత్తి పంటను పొలంలో వేసిన షెడ్లో నిల్వ చేసేవాడు. తీసిన పత్తి పంట అంత ఒకేసారి అమ్మితే బాగుంటుందని భావించి పొలంలోనే తీసిన పత్తిని యూరియా సంచులలో నింపి పొలంలోనే ఉంచాడు. షెడ్లో దాదాపు 60 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచాడు. గుర్తించిన దుండగులు పథకం ప్రకారం శుక్రవారం రాత్రి వంద యూరియా బస్తాల్లో దాదాపు 30 క్వింటాళ్ల మేర అపహరించారు. శనివారం ఉదయం రైతు పొలానికెళ్లి చూడగా పత్తి పంటను దొంగలించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు పొలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మల్టీపర్పస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ప్రత్యేకంగా ప్యాక్స్ డెవలప్మెంటు సెల్ ఏర్పాటు చేసి ఆప్కాబ్లో పనిచేసే సీనియర్ మేనేజర్, ఏజీఎం స్థాయి అధికారిని ఇన్చార్జ్గా నియమించారు. ఏఏ సంఘం ఎలాంటి వ్యాపారాల్లో రాణించేందుకు ఆసక్తి చూపుతుందో అందుకు అనుగుణంగా ఈ సెల్ డీపీఆర్లు సిద్ధం చేస్తుంది. ఇందుకు అనుగుణంగా డీసీసీబీ, ఆప్కాబ్ సంఘాలకు నిధులు ఇచ్చేది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో సహకార సంఘాలు లాభాల బాట పట్టాయి. సంఘాలకు సొంత భవనాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు అయ్యాయి. కొన్ని సంఘాలకు పెట్రోలు పంపులు కేటాయించారు. పలు సంఘాలకు జీవనధార మందుల దుకాణాలు కూడా ఇచ్చారు. బంగారంపై రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. కొన్ని సంఘాలు బియ్యం వ్యాపారం కూడా చేస్తున్నాయి. సంఘాలకు అనుబంధంగా మల్టీపర్సప్ గోదాములు కూడా నిర్మించారు.


