Kurnool District Latest News
-
జగనన్న మార్టులకు ‘చంద్ర’గ్రహణం
కర్నూలు నగరంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న జగనన్న మార్టులు మూతపడ్డాయి. వీటి పేరును మహిళామార్టు అని మార్చి రెండేళ్లు అవుతున్నా తెరవలేదు. ఈ మార్టుల్లో నాణ్యమైన నిత్యావసరవస్తువులు ఎంఆర్పీ ధర కంటే తక్కువగా లభించేవి. మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. రిలయన్స్, క్రాప్టర్ అండ్ గ్యాంబల్ వంటి ప్రముఖ సంస్థలతో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకొని పొదుపు గ్రూపులు చేసిన వస్తువులు సైతం మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఉపయోగ పడుతున్న మహిళా మార్టుల పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. మూతపడిన పట్టించుకున్న పాపాన పోలేదు. మూత పడిన క్రికెట్, టెన్నిస్ కోర్టులు కర్నూలు (టౌన్): కర్నూలు.. ఒకప్పటి రాష్ట్ర రాజధాని. రాయలసీమ ముఖద్వారంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ నగరంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలులో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కౌన్ని సౌకర్యాలను తొలగించారు. నగర పాలకవర్గం గడువు గత మార్చి 18వ తేదీ ముగిసినా ఇప్పటి వరకు ‘స్పెషల్’ పాలన కనిపించడం లేదు. మంత్రి ఉన్నా నత్తనడకన పనులు కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో రెండేళ్లలో ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కమిషనర్లు, ఇతర విభాగాల అధికారుల బదిలీలతో పాలనలో స్తబ్ధత నెలకొంది. చేసిన పనులకు రూ. కోట్లలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సీఎఫ్ఎంఎస్లో బిల్లులు చేయడంలోనే అంతులేని జాప్యం జరుగుతుండటంతో కొంత మంది హైకోర్టు మెట్లు ఎక్కారు. అధికారులకు నోటీసులు జారీ చేయించడంతో సదరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించింది. దీంతో మున్సిపల్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలో నంద్యాల చెక్పోస్టు నుంచి ఎస్ఎస్ గార్డెన్ వరకు 100 అడుగుల రోడ్డుకు స్థానిక ప్రజాప్రతినిధి అనుమతులు తీసుకువచ్చినా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు జొహరాపురంలో రూ. 2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. కర్నూలు ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు, క్రీడాకారులకు, ఔత్సాహిక క్రీడాకారులకు నామమాత్రపు ఫీజులతో అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఈ క్రీడా ప్రాంగణం మూత పడింది. క్రీడాకారులు మళ్లీ ప్రైవేటు నిర్వాహకులను ఆశ్రయించాల్సి వచ్చింది. అన్ని వసతులతో నిర్మించిన ఇండోర్ స్టేడియానికి మూతవేశారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు చిరువ్యాపారుల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో స్ట్రీట్ మార్కెట్లు నిర్మించింది. వినాయక్ ఘాట్, కృష్ణానగర్ ఐటీసీ సర్కిల్, గుత్తి పెట్రోల్ బంకు సర్కిల్, వాల్ మార్టు ఎదురుగా వ్యాపారాలు చేసుకునేందుకు ఇవి ఉన్నాయి. వీటిని మూసివేయడంతో చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీల ప్రహసనం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కర్నూలు కమిషనర్ ఐఏఎస్ భార్గవ్ తేజను బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్కు ఇన్చార్జ్గా బాధ్యతలు ఇచ్చి ఆయననూ తప్పించారు. కమిషనర్ రవీంద్రబాబు బాగా పనిచేస్తుండగా ఒక ప్రజాప్రతినిధికి కోపం వచ్చి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కూడా బదిలీ వేటు పడింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పి. విశ్వనాథ్ను పట్టుమని పది నెలల గడవక ముందే బదిలీ చేశారు. పైగా పోస్టింగ్ ఇవ్వలేదు. వరుస బదిలీల వెనుక టీడీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అలాగే నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజశేఖర్, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి, డాక్టర్ నాగ ప్రసాద్ బాబు.. ఇలా వివిధ విభాగాల అధికారులను సైతం ఇష్టానుసారంగా బదిలీలు చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. దుకాణాల్లో కార్యాలయం నగరపాలక నూతన భవనాన్ని రూ. 28 కోట్లతో నిర్మించతలపెట్టారు. ఇప్పటికే 60 శాతం పైగా పను లు పూర్తయ్యాయి. రూ. 5 కోట్ల బిల్లులు మంజూరు చేస్తే సరిపోతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పనులను నిలిపి వేసింది. చేసిన పనికి బిల్లులు మంజూరు చేయకుండా కాంట్రాక్టర్ను ముప్పు తిప్పలు పెట్టింది. బిల్డింగ్ పనులు పూర్తి కాక నగరపాలక కార్యాలయాన్ని వెంకటరమణ కాలనీ లోని దుకాణాల్లోకి మార్చారు. దీనికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేశారు. స్వచ్ఛత.. తూచ్! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్వచ్ఛతలో కర్నూలు నగరం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో క్లాప్ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముగ్గురు ప్రజారోగ్య ఆధికారులను మార్చడంతోపాటు క్లాప్ ఆటోలను రద్దు చేశారు. స్వచ్ఛత ర్యాంకు సాధించాలంటూ 200 మంది అదనపు వర్కర్లను నియమించారు. దీంతో కార్పొరేషన్కు ప్రతి ఏటా రూ.3.50 కోట్ల భారం పడుతోంది. క్లాప్ ఆటోలు లేవంటూ పది ప్రైవేటు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి నెల రూ.40 లక్షలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. అయి నా రాష్ట్ర స్థాయిలో కర్నూలు నగరం స్వచ్ఛతలో ఆరో స్థానానికి దిగజారింది. మట్టి రోడ్డుకు రూ.50 లక్షలు అభివృద్ధి ఎక్కడ అని ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు రూ.50 లక్షలతో 60 శాతం నిర్మించిన మట్టి రోడ్డును చూపుతున్నారు. రాజ్విహార్ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం నుంచి కల్లూరు దర్వాజ వరకు మట్టి రోడ్డు వేస్తున్నారు. హంద్రీ నదిలో వేస్తున్న మట్టి రోడ్డుకు ఇరిగేషన్ అధికారుల అనుమతి తీసుకోకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలు
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా నరసింహులును ఒకటవ పట్టణ పోలీసులు మర్డర్ చేసిన ముద్దాయిని తీసుకెళ్లినట్లుగా స్టేషన్కు తరలించడం ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు నగరంలో సతీష్ అనే దళిత యువకుడి ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించిందన్నారు. మంత్రి టీజీ భరత్ అనుచరుడు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరింపులతోనే సతీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. ఇదే విషయాన్ని నరసింహులు సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మంత్రితో గట్టు తిలక్ సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేర్ చేయడం తప్పు ఎలాగవుతుందన్నారు. నరసింహులుపై 41 కేసులు నమోదు చేసి స్టేషన్కు తరలించడం, నాలుగు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టడం చూస్తే పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, శ్రేణులను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అక్రమ కేసుల ను మానుకోకపోతే న్యాయపోరాటంతో సమాధానం చెబుతామన్నారు. సతీష్ బలవన్మరణానికి కారకులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం మేల్కొనాలన్నారు. -
చెరువును కొల్లగొడుతున్నా పట్టించుకోరా?
● అధికారుల అండతోనే మట్టి దందా ● గంజిహళ్లి చెరువులో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి ● వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును అక్రమార్కు లు కొల్లగొడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి విమర్శించారు. అనుమతులకు మించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన గంజిహళ్లి గ్రామ చెరువును పరిశీలించారు. తవ్వకాలను అడ్డుకుని అక్కడ ఉన్న టిప్పర్లు, యంత్రాలను బయటకు పంపించేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లాభాపేక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలన్నారు. ఇటుక బట్టీలకు చెరువు మట్టిని తరలించడం దారుణమన్నారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించిన తమ పార్టీ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాసామ్వానికి విరుద్ధమన్నారు. రెండు వారాల క్రితం రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి చెరువును సందర్శించి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా కాసులకు కక్కుర్తి పడి అధికార పార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై ఏఏ అధికారుల ప్రమేయం ఉందో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మట్టి దందాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బీఆర్ బసిరెడ్డి, కేవీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, గంజిహళ్లి తిరుమాలరెడ్డి, ఎస్బీ మన్సూర్, భాస్కర్ రెడ్డి, ఇమ్రాన్, చికెన్ రాజా, మహేష్ రెడ్డి, తోలు రాముడు, మాణిక్యరెడ్డి, డాక్టర్ శివరాం, కబేర్ నాయుడు, పులికొండ, గిడ్డయ్య, భరత్ రెడ్డి, అశోక్, లక్ష్మన్న తదితరులు ఉన్నారు. -
పీఆర్ ఈఈ పోస్టుకు త్రిముఖ పోటీ
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ కర్నూలు ఈఈ పోస్టుకు ముగ్గురు డీఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేశ్వరరెడ్డి గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో పాణ్యం పీఆర్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి ఇన్చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతులకు సంబంధించిన డీపీసీ పూర్తయిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో డీఈఈలుగా విధులు నిర్వహిస్తూ ఈఈలుగా పదోన్నతి పొందనున్న ముగ్గురు ఇక్కడకు ఈఈగా వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడపలో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ శివసాగర్రెడ్డి, జమ్మలమడుగు డీఈఈ రాఘవరెడ్డి, అనంతపురం జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీరాములు తమకున్న రాజకీ య, అధికార పరిచయాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఒక డీఈఈ మాత్రం జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) బ్యాక్లా గ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27 గ్రూపు –4 పోస్టులు, 11 క్లాస్ –4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను వెబ్సైట్ www.kurnool.a p.gov.in, www.nandyal.ap.gov.in వెబ్సైట్తో పాటు కార్యాలయ నోటీసు బోర్డులో కూడా ఉంచామన్నారు. వివరాలకు 08518 – 277864 నెంబర్ను సంప్రదించవచ్చన్నారు. అర్హులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను అందించాలన్నారు. అలాగే ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన ప్రకటనలో సవరణ చేశామన్నాన్నారు. టైపిస్టు పోస్టుకు టైపు రైటింగ్ ఇంగ్లిష్ మరియు తెలుగు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకున్నా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్లర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా అర్హులేనన్నారు. టైపిస్టు పోస్టుకు ఉద్యోగం పొందిన వారికి కంప్యూటర్ ప్రొఫెషనరీ టెస్ట్(సీపీటీ) నిర్వహిస్తామన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గత నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పరీక్షలకు జిల్లాలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,735 మంది విద్యార్థుల్లో 7,202 మంది హాజరు కాగా 6,381 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా స్థాయిలో కమ్మర పవన్ కళ్యాణ్ 117 మార్కులతో ఫస్ట్ ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 195వ ర్యాంకు), మేడం చేతన్రెడ్డి 116 మార్కులతో రెండో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 249వ ర్యాంకు), భాష్యం శశావత్ 116 మార్కులతో తృతీయ ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 252వ ర్యాంకు) సాధించారన్నారు. అంగన్వాడీల నిర్వహణలో అలసత్వం వద్దు కర్నూలు(అర్బన్): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మహి ళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ హెచ్చరించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్లో 62 శాతం నెగిటివిటీ వచ్చిన కోడుమూరు ప్రాజెక్టు పసుపుల –2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం పసుపుల 1, 3 కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లోని రిమార్కులపై సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. తప్పులను సరి చేసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ముక్తార్బాషాకు డీఆర్ఓగా పదోన్నతి రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్బాషాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజిలో గత నాలుగేళ్లుగా ఆయన సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతిపై కడప డివిజన్ సిద్దవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు. -
కల్లాల నిండా కన్నీళ్లే!
పాణ్యం: ‘ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేరు. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యం వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యాపారులు రావడం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆలమూరు, గోనవరం గ్రామాల్లో పర్యటించి రబీలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం బస్తా రూ.1,900 వరకు, రబీలో రూ.1,800 వరకు తగ్గకుండా విక్రయించారు. ఎగుమతులు లేకపోయినా ధరల స్థిరీకరణతో అప్పటి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. కొనుగోలు జరిగిన నెల రోజుల వ్యవధిలోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ధాన్యం కొనండి అని రైతులు పిలుస్తున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కల్లాల్లో ధాన్యం ఆరబోసుకుని వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు కానీ.. యూరియాకు ధరలు మాత్రం పెంచేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో టీడీపీ నేతలు టీవీల ముందు కాకుండా రైతుల వద్దకు వచ్చి చెప్పండి. ఆనాడు ఆర్బీకేలను విమర్శించిన టీడీపీ నేతలు నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన విధానాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు అనుకూల మీడియాలో మాట్లాడి రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా.. రైతులకు చేసిందేమి లేదు’ అని కాటసాని విమర్శించారు. మొక్కజొన్న సంగతేంటి.. పక్క రాష్ట్రంలో మొక్క జొన్న క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.1500 పలుకుతుందని కాటసాని అన్నారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత మోతాదులో కొన్నారో ప్రజలకు చెప్పాలి. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గ్రామాల్లో సంచులు ఇవ్వడం తప్ప.. ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జొన్న, మిరప ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఉల్లి, టమాట పంటలకు ధర లేక రైతులు రోడ్లపై పారబోశారు. మామిడికి నేటికి ధర కనిపించడం లేదు’. అని చెప్పారు. ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు.. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైతులకు డీజిల్ అందక పంట కోతలు కూడా ఆలస్యమయ్యాయి. ప్రజలకు గ్యాస్ సిలిండర్లు అందక ఎన్నో కష్టాలు పడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్త పింఛన్ల రెండేళ్లు అయినా ఇవ్వలేదు. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. నేడు టన్ను ఇసుక ధర రూ. 900 టీడీపీ నాయకులే బహిరంగంగా అమ్ముతున్నారు. సామాన్యుడు వాగులో మట్టిని తరలిస్తున్నా తీసుకెళ్లి పోలీస్స్టేషనలో వేస్తున్నారు. మద్యం డోర్ డెలివరీ కూటమి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మాత్రం వందశాతం పక్కాగా అమలు చేస్తున్నారని కాటసాని ఎద్దేవా చేశారు. ఒక్కో గ్రామానికి 4 నుంచి 8 వరకు బెల్ట్షాప్లు నిర్వహిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క ఫోన్ కాల్తో ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్షాప్లు నిర్వహించలేదు’. అని కాటసాని అన్నారు. రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కాటసాని వెంట మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మల్లు జయచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ రామలక్ష్మయ్య, సుమంత్రెడ్డి, మధురెడ్డి చాంద్బాషా, ఉప్పు విజయభాస్కర్, గోపాల్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత ఇసుకను అమ్ముకుంటున్న టీడీపీ నేతలు
● పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికర్నూలు(సెంట్రల్): పాణ్యం నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుకను అమ్ముకుంటున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు వారికే కొమ్ము కాస్తుండడంతో ప్రజలకు ఇసుక దొరకడంలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ నూరుల్ ఖమర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుక రవాణాను అడ్డుకొని డంపుల్లో దాచుకొని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామ రైతులకు భూ సంబంధిత, సాగునీటి, పంట నష్టపరిహారం సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విషయాన్ని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు జేసీ స్పందిస్తూ విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కాటసాని వెంట పెద్దటేకూరు నాయకులు హనుమంతరెడ్డి, దొడ్డిపాడు గ్రామ నాయకులు ఉన్నారు. -
శనగ రైతుకు అందని ‘మద్దతు’
● అదనపు కొనుగోళ్ల ప్రతిపాదనను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంకర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధర లభించక శనగ రైతులు భారీ ఎత్తున నష్టాలు మూట కట్టుకున్నారు. క్వింటా శనగలకు మద్దతు ధర రూ.5875 ఉండగా మార్కెట్లో రూ.5000 లోపే ధర లభిస్తోంది. మద్దతు ధరతో శనగలు అరకొరగా కొనుగోలు చేసి.. చేతులు దులపుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అరకొరగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్ కొనుగోలు చేసింది. శనగల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. నాఫెడ్ జిల్లాకు 12,880 టన్నుల శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా.. నెలన్నర క్రితమే ఈ మేరకు కొనుగోలు చేయడం పూర్తి అయింది. అదనంగా కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం కేంద్రానికి పంపింది తప్ప ప్రత్యేక చర్యలు లేవు. నెలన్నర క్రితం అదనంగా శనగల కొనుగోలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికి దాదాపు 1100 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కాని రెండు నెలలవుతున్నా... నగదు జమ కాకపోవడం పట్ల రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పదేళ్ల ప్రేమను చిదిమేశారు. కులం పేరుతూ దోషించారు.. ఊరు వదిలేంత వరకు వదిలేది లేదని హెచ్చరించారు. సెల్ఫోన్ లాక్కుని రోజంతా ముప్పుతిప్పలు పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఓ జీవితాన్ని కాలరాశారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే ఖాకీలు జులం ప
కర్నూలు(సెంట్రల్): రెండురోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు సతీష్ మృతికి కారణమైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ప్రయత్నించారు. అయితే వారిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకొని జులుం ప్రదర్శించారు. సీఐ శేషయ్య వారిపై చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 3న కర్నూలు నగరంలోని శ్రీరామ్నగర్కు చెందిన సతీష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మూడు రోజుల ముందు అతను 15 ఏళ్లుగా ప్రేమించిన ప్రియురాలిని వదిలివేయాలని ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, త్రీటౌన్ పోలీసులతో కలసి తీవ్రంగా వేధించాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసినా, మాట్లాడినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో యువకుడు తన ప్రేమ విఫలమవుతుందనే ఆందోళనతో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్లాలని బంధువులకు అప్పగించారు. అయితే బంధువులు ఆత్మహత్యకు కారణమైన గట్టు తిలక్ను అరెస్టు చేయాలని, మూడో పట్టణ పోలీసులపై విచారణ చేయాలని కోరుతూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ అవు ట్ గేటు దగ్గర అంబులెన్స్లో ఉన్న శవాన్ని బయటకు తీసి స్ట్రెక్చర్పై కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లారు. వీరిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. సీఐ శేషయ్య, పోలీసులు ర్యాలీగా వెళ్లకూడదని, నిరసన వ్యక్తం చేయకూడదని హాస్పిటల్ అవుట్ గేటు దగ్గర అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బలవంతంగా స్ట్రెక్చర్పై ఉన్న శవాన్ని అంబులెన్స్లో ఎక్కించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అడ్డువచ్చిన వారిపై దాడి చేసి బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించారు. బంధువులు అంబులెన్స్ ముందుకు వెళ్లకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, సతీష్ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమపైనే పోలీసులు దాడి చేయడం హేయమని, తమకు న్యాయం చేయమని కోరితే దాడి చేయడం అన్యాయమన్నారు. గట్టు తిలక్ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడిపై కేసు నమోదుకు వెనుకంజ కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్లో వేధింపులు సూసైడ్ నోట్ లభ్యమైనా చర్యలకు ససేమిరా కలెక్టరేట్ ఎదుట నిరసనకు సిద్ధమైన కుటుంబ సభ్యులు అడ్డుకుని జులం ప్రదర్శించిన త్రీటౌన్ పోలీసులు -
ఏసీబీ వలలో తహసీల్దార్, సర్వేయర్
● లంచం తీసుకుంటుండగా సర్వేయర్ను పట్టుకున్న అధికారులు ● ఫోన్లో డబ్బులు తీసుకురావాలని చెప్పి దొరికిపోయిన తహసీల్దార్ బనగానపల్లె: లంచం తీసుకుంటున్న బనగానపల్లె తహసీల్దార్ ఆర్. రాజీవ్రెడ్డి, మండల ఇన్చార్జ్ సర్వేయర్ షేక్ హుస్సేన్బాషాను సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి బనగానపల్లె పట్టణంలోని నివాసం ఉంటున్నారు. ఇతనికి బనగానపల్లె సమీపంలో మూడు ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఇది చుక్కల భూమి కావడంతో సమస్యను తొలగించుకునేందుకు 2023లో సర్వేయర్ ద్వారా ప్రయత్నించారు. అయితే లంచం విషయంలో బేరం కుదరలేదు. దీంతో ఇన్చార్జ్ సర్వేయర్ షేక్హుస్సేన్బాషా ఇటీవల రైతు నారాయణరెడ్డిని మళ్లీ సంప్రదించారు. సంప్రదింపుల తరువాత తహసీల్దార్తో చర్చించి రూ.1.50 లక్షలకు సర్వేయర్ డిమాండ్ చేశారు. చివరకు రూ.80 వేలకు అంగీకారం కుదిరింది. ముందుగా రూ.50 వేల ఇచ్చి మిగిలినది పనిపూర్తి అయిన తర్వాత ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టంలేని రైతు నారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.50 వేల మొత్తాన్ని తీసుకునేందుకు సబ్స్టేషన్ వద్దకు రావాలని సర్వేయర్ కోరాడు. నారాయణరెడ్డి అక్కడికి వచ్చి సర్వేయర్కు డబ్బులు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. అక్కడి నుంచే సర్వేయర్తో తహసీల్దార్కు ఫోన్లో మాట్లాడించడంతో ఆయన డబ్బులు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సర్వేయర్, తహసీల్దార్ ఇద్దరూ కలిసి రైతు నారాయణ రెడ్డి నుంచి మొత్తాన్ని తీసుకున్నట్లు తమ విచారణలో తెలినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. డీఎస్పీ వెంట సీఐలు రాజాప్రభాకర్, కృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ రాజీవ్రెడ్డి గత 20 రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్ నుంచి పదోన్నతిపై బనగానపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. -
రైతు ఉసురు తీసిన అప్పులు
సి.బెళగల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని క్రిష్ణదొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి(46) తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు, గత కొంతకాలంగా మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, ఉల్లి, మిరప, శనగ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా పంటల సాగుకు పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చులు రావడంతో పాటు సరైన దిగుబడులు రాలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తెలిసిన వారు, బంధువుల దగ్గర దాదాపు రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఈ క్రమంలో పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని గత రెండు రోజులుగా మదనపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం అనంతరం కుటుంబ సభ్యులు గమనించినా అప్పటికే మరణించాడు. ఎస్ఐ వేణుగోపాల్రాజు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. -
రేషన్ డీలర్లపై ముప్పేట దాడి
డోన్: అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు దౌర్జన్యాలు, బెదిరింపులే కాకుండా అధికారులతో వేధింపులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారుల్లో కొందరు టీడీపీ నేతలకు జీహుజూర్ అంటూ గులాం గిరి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాలపై దాడులు చేసినా ఎలాంటి తప్పు లు దొరకపోవడంతో చివరకు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లో నుంచి రేషన్ బియ్యం తెచ్చి కాటా తక్కువ ఉన్నట్లు చూపించడమే కాక వారి స్టేట్మెంట్ను రికార్డు చేసి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. రెండు రోజుల క్రితం ఇదే తరహాలో డోన్ మండలం వలసల గ్రామంలో తూకంలో తేడా లంటూ డీలర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాల్లో ఆకస్మి క తనిఖీల్లోనూ రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నా రు. తాజాగా సోమవారం డోన్ పట్టణంలో వైఎస్సా ర్సీపీ మద్దతుదారు డీలర్ను ఇలాగే వేధించారు. పట్టణంలోని సీ3–231–2019 షాప్ దుకాణం తనిఖీలో మల్యాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ధర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికారుల సమక్షంలోనే స్టాక్ రికార్డులు పరిశీలించడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. రేషన్ దుకాణాన్ని వైఎస్సార్సీపీ వర్గీయుడు వదులుకునేలా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి యంత్రాంగం దాడుల పేరు తో బెదిరింపులకు పాల్ప డటం, మాట వినని డీలర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు టీడీపీ నేతలు యత్నిస్తుండటంతో డీలర్లు బెంబేలెత్తుతున్నారు. సగానికి పైగా డీలర్షిప్ వదిలేశారు.. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో 52, బేతంచెర్ల మండలంలో 45, డోన్ మండలంలో 72 మంది చౌకదుకాణ డీలర్లు ఉండగా.. టీడీపీ నేతలు, అధికారుల వేధింపులు తాళలేక 50 శాతం మంది డీలర్షిప్ను వదులుకున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసుల వేధింపులు తాళలేక డీలర్షిప్ వద్దనుకున్న వారు అధికంగా ఉన్నారు. మరో 30 మంది తమ సప్పెండ్ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చు కున్నారు. ఇక లాభం లేదు అనుకుని సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జి రబ్బానీపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి కాటా (తూకం) వేయకుండానే రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలను తరలిస్తున్నారు. చౌక దుకాణాలకు చేరిన వెంటనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల సహాయంతో రెవెన్యూ అధికారులు ఆ దుకాణాలను తనిఖీ చేసి బస్తాలను తూకం వేయడం ద్వారా కేజీ నుంచి 2 కేజీల వరకు ప్రతి బస్తాకు తక్కువ ఉన్నాయని కేసులు రాస్తూ వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గోడౌన్ నుంచి దుకాణానికి చేరేలోగా బస్తాకు అర కేజీ తూకం తగ్గుతుండటంతో రెవెన్యూ అధికారులు డీలర్ తొలగింపునకు సులువైంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తీవ్ర వేధింపులు డీలర్షిప్ వదులుకునే వరకు ఒత్తిళ్లు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలంటూ భయపెడుతున్న వైనం సగానికిపైగా దుకాణాలను వదులుకున్న డీలర్లు -
నేటి నుంచి లా సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 3 సంవత్సరాల లా 6వ సెమిస్టర్, 5 సంవత్సరాల లా 6, 8, 10 సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెగ్యులర్ 316 మంది, సప్లిమెంటరీ 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. స్థానిక ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ఈనెల 14వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయి లో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు చక్రాల వాహనాలు పంపిణీ కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని 70 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్, జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికలో వికలాంగులకు మంజూరైన మూడు చక్రాల వాహనాలను జేసీతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల చైర్మన్ నారాయణస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఎప్పటిలానే అధికారిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. క్వింటా పత్తి రూ.9615 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం పత్తి ధర రూ.9,615గా నమోదైంది. సోమవారం రైతులు 758 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.9,615, మధ్య ధర రూ.9,300, కనిష్ట ధర రూ.5,525 పలికింది. అదేవిధంగా వేరుశనగ 173 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,600, మధ్య ధర రూ.6,869, కనిష్ట ధర రూ.4,609 నమోదైంది. ఆముదాలు 32 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.6,056, మధ్య ధర రూ.6038, కనిష్ట ధర రూ.5,342 పలికింది. అరటి తోట దగ్ధం ● రూ.2 లక్షల ఆస్తి నష్టం ఓర్వకల్లు: చేతికొచ్చిన అరటి తోట దగ్ధమైన బ్రాహ్మణపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కానుగల దేవరాజు అనే రైతు తమకున్న రెండెకరాలలో గత కొంతకాలంగా అరటి పంటను సాగు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న అరటి తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుకొని సుమారు 200 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేశారు. నెల రోజుల్లో కోత కోయాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.2 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇతరులు నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అత్యవసర వైద్యం..పెద్ద కష్టం
● ఐవీఆర్ఎస్లో రోగుల పెదవి విరుపు ● కర్నూలు పెద్దాసుపత్రికి కింద నుంచి నాలుగవ స్థానంకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలపై ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రికి కింది నుంచి నాలుగో స్థానాన్ని కేటాయించారు. ఏకంగా 32.49శాతం మంది రోగులు వైద్యసేవలపై వ్యతిరేక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయా ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవలపై కొంత కాలంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్(అభిప్రాయ సేకరణ) తీసుకుంటోంది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 67.51శాతం మంది అనుకూలంగా 32.49శాతం వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఆసుపత్రుల అధికారులకు తాకీదులు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో 71.20 శాతం అనుకూలంగా, 28.86శాతం మంది వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆదోనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 71.49శాతం అనుకూలంగా, 28.51శాతం వ్యతిరేకంగా, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి 72.73శాతం అనుకూలంగా 27.27శాతం మంది వ్యతిరేకంగా చెప్పా రు. ఈ విషయమై ఆయా ఆసుపత్రుల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి తాకీదులు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు వైద్యసేవలను మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభించారు. రోగుల తీవ్ర అసంతృప్తి ముఖ్యంగా వైద్యులు, స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల సమయపాలన సరిగ్గా లేదు. కొందరు వైద్యులు ఓపీల్లో సైతం ఉండటం లేదు. ముఖ్యంగా సూపర్స్పెషాలిటీ విభాగాల్లో ఎక్కువ శాతం పీజీ వైద్యులే ఉంటున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓపీలో కేవలం ఒకరిద్దరు పీజీ వైద్యులతో నడిపిస్తున్నారు. రక్తపరీక్షలు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వ్యాధినిర్ధారణ పరీక్షల నివేదికలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆపరేషన్లు సకాలంలో జరగకపోవడం, మందులు, వైద్యపరీక్షలు సగం బయటే తీసుకోవాలని చెప్పడం వంటి అంశాలూ రోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. రోగుల ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
సమాధులపల్లె భూములు ఆక్రమిస్తే చర్యలు
కల్లూరు: కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలోని సమాధుల పల్లెలో సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాల గ్రామ కంఠం భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆ భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ కంఠం భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు చదును చేయడంతో విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. భూములు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును తూర్పారబడ్డారు. ఈ మేరకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఆదివారం హెచ్చరిక బోర్డును పాతారు. ఇది ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 382లోకి అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులో పేర్కొన్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవతోనే ప్రభుత్వ కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
చాలా ఉపయోగపడింది
10వ తరగతి ఫలితాల్లో 566 మార్కుల సాధనకు సాక్షి పత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి సబ్జెక్టు సరళమైన రీతిలో, త్వరగా అర్థం చేసుకునేలా ఉంది. నేను అన్ని సబ్జెక్టులు పూర్తిగా చదివాను. పలు ప్రశ్నలకు సంబంధించిన డౌట్స్ మా సారొళ్లు చెప్పారు. వారి ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మాలాంటి పేద విద్యార్థులు మెటీరియల్ అందించి మంచి మార్కులు సాధించడానికి దోహదపడిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – మనోహర్, పాములపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థి -
చంద్రబాబు ప్రభుత్వానికి తాగునీటి ఎద్దడి కనిపించదా?
● ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హాలహర్వి: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హాలహర్విలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని మల్లికార్జునపల్లి, నిట్రవట్టి, కొక్కరచేడు, శ్రీధర్హాల్, సిద్ధాపురం, సిరుగాపురం గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కొత్త పింఛన్ల ఊసే కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ, మండల కన్వీనర్ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి అర్ధగేరి శ్రీనివాసులు, కో కన్వీనర్లు మల్లికార్జున, ఉసేని, మండల కార్యదర్శి గోపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
చేనేతపురి.. ప్రగతి అధోగతి
● ఎమ్మిగనూరులో నిలిచిపోయిన అభివృద్ధి పనులు ● పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ఎమ్మిగనూరుటౌన్: అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తాం అని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కి 23 నెలలవుతున్నా అభివృద్ధి పనులు చేయలేకపోయారు. కోట్ల రూపాయల్లో ఉన్న పెండింగ్ బిల్లులను మంజూరు చేయలేదు. ఫలితంగా కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ఫలితంగా ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రూ.3 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో అట్టహాసంగా అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. గత మున్సిపాలిటీ పాలక వర్గం ఆమోదించిన పలు అభివృద్ధి పనులను సైతం పోటీ పడి మరీ ప్రారంభించారు. అందులో సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. అయితే గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా వాటిని విడుదల చేయలేదు. దీంతో కొన్ని సీసీ, బీటీ, డ్రైన్ల నిర్మాణాలు ప్రారంభించినా వాటిని మధ్యలోనే నిలిపేశారు. దీంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సత్వరం మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపాం. అందుకు సంబంధించి బిల్లులు ప్రాసెస్ చేస్తున్నాం. కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నది వాస్తవమే. ప్రస్తుతం మంచినీటిపైప్ లైన్లు, డ్రైనేజీ పనులకు ప్రాధాన్యతనిస్తున్నాం. రోడ్ల పనులు కూడా చేపడతాం. – గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఎమ్మిగనూరు పట్టణంలోని గంజిళ్ల రోడ్డు ఇది. దీని నిర్మాణానికి రూ.99 లక్షలతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. వెనువెంటనే రోడ్డు పనులను టెండర్ ద్వారా దక్కించుకొన్న కాంట్రాక్టర్ గుంతలు పడ్డ రోడ్డుపై కంకర పరిచి వదిలేశాడు. నెలలు గడుస్తున్నా ఆయా పనులు మాత్రం ముందుకు కొనసాగలేదు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు చేయలేనంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఫలితంగా గోతులమయమైన ఈ రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. -
అనాథకు ఆత్మీయ బంధువుల్లా..
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రమేష్ శెట్టి (80) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు బేతంచెర్లలోని ‘ఆ నలుగురు’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వన్నూర్ బాషాకు సమాచారం ఇచ్చారు. వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం బృందం సభ్యులు గ్రామానికి చేరుకుని రమేష్ శెట్టికి సొంత కుటుంబ సభ్యుల్లా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి వెల్దుర్తి: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ సురేంద్ర(38) మృతి చెందాడు. ఈ దుర్ఘటన మదార్పురం గ్రామంలోని ఇటుకల బట్టీలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. ఉలిందకొండకు వెళ్లేందుకు కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ చాకలి సురేంద్ర లోడింగ్లో ఉన్న లారీని రివర్స్ చేశాడు. ఈ సమయంలో 11కెవీ విద్యుత్ లైన్ కలిగిన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఓ వైరు లారీ టైర్లను ఆనుకుంటూ వేలాడింది. ఏం జరిగిందోనని చూసుకునేందుకు లారీ డ్రైవర్ కిందకు దిగే ప్రయత్నంలో విద్యుత్ సరఫరా ఉన్న వేలాడిన వైరుపై ఓ కాలు ఉంచాడు. భూమిపై మరో కాలు మోపడంతోనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న డోన్ ఏడీఏ సుబ్బన్న, వెల్దుర్తి ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది, ఎస్ఐ నరేశ్ బృందం సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సురేంద్రకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ టైర్లపై వేలాడిన 11కేవీ విద్యుత్ వైరుమృతిచెందిన లారీ డ్రైవర్ సురేంద్ర -
నాటుసారా తయారీదారులపై ‘పిడి’కిలి
● కడప సెంట్రల్ జైలుకు తరలించిన ఎకై ్సజ్ అధికారులుకర్నూలు: నాటుసారా దొంగచాటుగా తయారుచేసి వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై ఎకై ్సజ్ అధికారులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. పత్తికొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్దికెర గ్రామానికి చెందిన సాతుపాటి కృష్ణ, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కల్లూరు మండలం కొల్లంపల్లి తండా వాసి తెలుగు రామదాసులపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ఎకై ్సజ్ అధికారులు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్బంధ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి జారీ చేశారు. నాలుగు నెలల వ్యవధిలో సాతుపాటి కృష్ణ, తెలుగు రామదాసుపై నాలుగు చొప్పున సారా రవాణా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తెలిపారు. నాటుసారా రవాణా, విక్రయాలు మానేస్తే మెప్మా, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి తెలిపారు. పాత నేరస్తులు సారా వృత్తిని మాని ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సిందిగా ఆమె సూచించారు. దొంగచాటుగా వ్యాపారం సాగిస్తున్న మరికొంతమందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు జాబితా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు రామదాసు సాతుపాటి కృష్ణ -
కనుమరుగువుతున్న లక్ష్యం!
వ్యాక్సిన్ సరఫరా చేసే రెండు వాహనాలు ఇవి. మరమ్మతులకు గురైన వీటిని కొన్ని నెలలుగా జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయం పక్కన నిలిపి ఉంచారు. సంరక్షణ లేకపోవడంతో ఎంతో విలువైన ఇవి ఎండకు ఎండి, వానకు తడిచి మరింత పాడైపోయాయి. ఆ వాహనాలకు చుట్టూ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఒక మొక్క పెరిగి వృక్షమయ్యింది. కొంత కాలానికి మొక్కలు ఏపుగా పెరిగి వాహనాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. వీటి లక్ష్యం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. – కర్నూలు(హాస్పిటల్) -
గరుడ వాహనంపై పాండురంగడు
● ఎనమిదవ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలుకోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఎనమిదవ రోజు ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, సంజీవాచార్యులు, పవనాచార్యులు పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణంలో గరుడవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా కొనసాగింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడసేవను పురష్కరించుని ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులు నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. సోమవారం గజ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. -
థ్యాంక్యూ సాక్షి
నాకు పదో తరగతిలో 590 మార్కులు రావడం ఆనందంగా ఉంది. మా నాన్న ఖాజామొహిద్దీన్ పాత టైర్ల షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా అమ్మ గృహిణి. మాది నిరుపేద కుటుంబం. సాక్షి యాజమాన్యం మా పాఠశాలలో పదో తరగతి మెటీరియల్ను పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు సాక్షి మెటీరియల్తోనే 590 మార్కుల స్కోరింగ్ సాధ్యమైంది. డాక్టర్ కావడం నా కల. – షేక్ అనీషాతబసుమ్, ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అయ్యే సమయంలో సాక్షి మీడియా ఉచితంగా ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఉపయోగపడింది. నేను 519 మార్కులు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మెటీరియల్లో ఉన్న అత్యధిక ప్రశ్నలు రావడంతోనే అధిక మార్కులు వచ్చాయి. ఇందుకు కారణమైన సాక్షికి ధన్యవాదాలు. – మహేష్బాబు, ఆలూరు టెన్త్ పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్ వారు ఉచితంగా అందించిన స్టడీ మెటీరియల్ నాకు ఎంతో ఉపయోగపడింది. ఉపాధ్యాయులు మంచి నోట్సు అందించారు. దీంతో పరీక్షల్లో 577 మార్కులు సాధించా. స్కూల్ టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – కె.గౌతమి, ఆదోని మున్సిపల్ హైస్కూల్ ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ● ఆ మెటీరియల్ చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సాక్షి మెటీరియల్ అందుకున్న విద్యార్థినులతో ఉపాధ్యాయులు(ఫైల్)కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో దానిని చదివిన వారు ఉత్తమ ఫలితాలను సాధించారు. చాలా మందికి 500పైగా మార్కులు వచ్చాయి. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్తోనే ఇదంతా సాధ్యమైందని వారు తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వ సాధారణ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల భోధనలో అత్యంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నిపుణుల బృందం ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్ను తయారు చేసి విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి స్టడీ మెటరియల్ ఇవ్వలేదు. కేవలం పీడీఎఫ్ రూపంలో ఉన్న మెటీరియల్ను టీచర్లకు ఇస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల నిపుణులతో స్టడీ మెటీరియల్ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల బోధనతో పాటు స్టడీ మెటిరియల్ తోడు కావడంతో విద్యార్థులు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా సర్కార్ బడుల్లోని విద్యార్థులకు మార్కులు వచ్చాయి. సాక్షి మీడియా గ్రూప్ ఇచ్చిన మెటీరియల్ అత్యుత్తమ మార్కుల సాధనకు ఉపయోపడినట్లు విద్యార్థులు తెలిపారు. -
స్కూల్లో సెకెండ్ ప్లేస్లో నిలిచాను
పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్ యాజమాన్యం స్టడీ మెటీరియల్ ఇచ్చారు. గణితం, సైన్స్ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ఇచ్చిన సూచనలతో పాటు, స్టడీ మెటీరియల్ను చదడంతో సైన్స్ 100 మార్కులకుగాను 93, గణితంలో 99 మార్కులు వచ్చాయి. మొత్తంగా 561 మార్కులు సాధించి స్కూల్లో సెకెండ్ ప్లేస్లో నిలిచాను. – ధరణి, మద్దికెర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను హలహర్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాశాను. 600 మార్కులకుగాను 553 మార్కులు సాధించాను. సాక్షి మీడియా గ్రూప్ యాజమాన్యం ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. నేను అత్యధిక మార్కులు సాధించాను. – ప్రవీణ్కుమార్, మేదేహల్ గ్రామం, హాలహర్వి మండలం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయుల బోధన, సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. నాకు 550 మార్కులు వస్తాయనే అనుకోలేదు. ఆ మార్కుల సాధనకు సాక్షి స్టడీ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ మెటీరియల్లో చాలా సులభమైన అంశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం కలిగింది. – గౌస్ బాషా, ఆలూరు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల -
హోరాహోరీగా గుర్రపు బండి పోటీలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోవెలకుంట్ల– ముదిగేడు ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం నిర్వహించిన గుర్రపుబండి పరుగు పందెం పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని బనగానపల్లె, ఆత్మకూరు, బండిఆత్మకూరు, కోవెలకుంట్ల మండలాలకు చెందిన ఎనిమిది గుర్రాలు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత పది కిమీ దూరాన్ని బనగానపల్లెకు చెందిన రాజా గుర్రపు బండి 19.28 నిమిషాల్లో పరిగెత్తి మొదటిస్థానంలో నిలిచి రూ. 10వేల బహుమతి కై వసం చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన రసూల్ గుర్రం 20.18 నిమిషాల్లో చేరి ద్వితీయస్థానంలో రూ. 5వేలు, కోవెలకుంట్లకు చెందిన పెద్దయ్య గుర్రం 20.50 నిమిషాల్లో చేరి మూడవ స్థానంలో నిలిచి రూ. 3వేలు బహుమతిని దక్కించుకున్నాయి. పాండురంగస్వామి ఆలయ కమిటీ, కోవెలకుంట్లకు చెందిన పృద్వీరాజ్, పెద్దయ్య ఆర్థిక సహకారంతో గుర్రపుబండి యజమానులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి, కరిమద్దెల మురళీకృష్ణ, పెనుగొండ రాజశేఖర్, చెన్నకృష్ణుడు, లక్ష్మినాగేంద్రబాబు, రాంమోహన్రెడ్డి, రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విరాళం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి అదే గ్రామానికి చెందిన డేరంగుల బాలాంజనేయు లు, నాగార్జున కుటుంబ సభ్యులు రూ.1,50,116 విరాళాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ మేరకు విరాళం అందజేసిన దాత కుటుంబ సభ్యులను సత్కరించారు. నిర్వాసితులకు బాబు ద్రోహం నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 39 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరలేదని, 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి లష్కర్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రహంతుల్లా, నాగేంద్రుడు, నారాయణ, మురళి, మౌలలి, రాజు, తదితరులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి అరిగెల శిరీష(37) ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త రామకృష్ణకు వెన్నెముక ఆపరేషన్ కావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. శిరీష కూడా అనారోగ్యం బారిన పడి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. మనస్తాపానికి గురై శనివారం రసాయన పౌడర్ను నీటిలో కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే బేతంచెర్ల ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య బనగానపల్లె: పట్టణంలోని మంగళవారం పేటకు చెందిన చైతన్యరెడ్డి (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రైల్వేస్టేషన్కు రెండు కిలో మీటర్ల దూరంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు నంద్యాల రైల్వే స్టేషన్ ఎస్ఐ కుమారి తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దోపిడీ దొంగ అరెస్ట్ బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తిని బెదిరించి రూ. 20 వేలు దోచుకున్న దొంగను ఆదివారం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన వెంకటస్వామి గత నెల 22వ తేదీ టీవీ కొనేందుకు రూ. 20 వేల నగదుతో బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోరుమామిళ్లకు చెందిన షేక్షఫి స్కూటీపై వచ్చి సుధాకర్ను ఢీకొట్టి చంపుతానని బెదిరించి రూ. 20 వేల నగదు లాక్కుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం షేక్షఫిని బస్టాండ్ సమీపంలో గుర్తించి అరెస్ట్ చేశారు. రూ. 20 వేల నగదు, స్కూటీని స్వాధీ నం చేసుకున్నారు. అమ్మవారికి పల్లకీ సేవ శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అలగనూరు.. గట్టెక్కని మరమ్మతులు
● ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చని టీడీపీ నేతలు ● సాగునీరు లేక పొలాలను బీడుగా పెట్టుకుంటున్న రైతులుగడివేముల: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట కుంగిపోయినా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది ఎకరాలు బీడుగా మారాయి. మిడుతూరు మండలం అలగనూరు గ్రామం సమీపంలోని కేసీ కెనాల్ 119 కి.మీ దగ్గర రిజార్వాయర్ నిర్మాణానికి 1987లో రూ.3.06 కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. దీనిని 1993 వరకు ఎవరూ పట్టించుకోలేదు. జైకా నిధులతో కేసీ కెనాల్ ఆధునికీకరించే పనుల్లో భాగంగా రూ.59.90 కోట్లతో అలగనూరును చేపట్టారు. పనులు ఆలస్యమైనా 2004లో పూర్తయ్యాయి. రిజర్వాయర్ కెపాసిటీ మూడు టీఎంసీలు కాగా.. 2017 –18 ఒక్కచోట కట్ట బలహీన పడి కుంగింది. అప్పటి ప్రభుత్వం కుంగిన ప్రాంతంలో తాత్కాలికంగా ఇసుకసంచులు వేసి నీటిని నిల్వచేశారు. కాలక్రమేణా మరింత బలహీన పడిపోవడంతో రిజర్వాయర్లో నీటిని నింపడం ప్రమాదకరంగా మారింది. రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రిజర్వాయర్ కట్టకు 2017లో కుంగినప్పుడే శాశ్వత మరమ్మతులు చేసుంటే బాగుండేది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3.12 కోట్లు మంజూరు చేసింది. అయితే కట్ట కుంగిన ప్రాంతం మరింత పెరగడంతో రూ.18 కోట్ల దాకా ఎస్టిమేషన్ పంపారు. అంతలోనే ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కట్ట కుంగిన ప్రాంతాన్ని గత ఏడాది నంద్యాల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి రూ.36 కోట్లకు ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇంతవరకు రిజర్వాయర్కు నిధు లు కేటాయిస్తామని చెప్పడమే తప్ప స్పష్టమైన ప్రకటన రాలేదు. నాటి తప్పిదమే.. 2017లోని ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కుంగిన వెంటనే మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్లో నీరు ఉంటే గడివేముల, బూజునూరు, చిందుకూరు, గడిగరేవుల, కొరటమద్ది, పులిమద్ది గ్రామాలకు చెందిన పొలాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. బోర్లతో పంటలు పండించుకునే అవకాశం ఉంది. సాగునీరు రాకపోవడంతో రిజర్వాయర్ కింద ఉంటే గ్రామాల్లోని వందలాది ఎకరాలు బీడుగా మారాయి. రిజర్వాయర్లో నీరు నిల్వ లేకుండా పోవడంతో పశువులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. త్వరగా నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేయిస్తే ప్రజలకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందుతుంది. –సర్వేశ్రెడ్డి, ఆళ్లగడ్డ గ్రామం ఇదీ సమస్యకోర్టు కేసుల కారణంగా రిజర్వాయర్ ఎర్త్ బండ్ చాలా కాలం పాటు ఆగిపోయింది. లోతైన కొండ గట్టు పోర్షన్లో నేల స్థాయి కంటే తక్కువ పొరల కుదింపు జరుగలేదు. ఈ రిజర్వాయర్ పనులు జరుగుతున్న సమయంలో గడివేముల నుంచి రోళ్లపాడు గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును తొలగించకుండా, ఎలాంటి ట్రెంచెస్ వేయకుండానే నిర్మాణం చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. నిపుణుల కమిటీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. రోడ్డు ఉన్న ప్రాంతం, గతంలో ఇక్కడ ఉండే చెరువులోకి నీరు వచ్చేందుకు ఉండే వాగు మట్టిని తొలగించక పోవడంతోనే బండ్ కుంగిందని తెలుస్తోంది. రిజర్వాయర్ లోపల వైపునకు 2.5 కి.మీ నుంచి 2.65 కి.మీ, 2.75 నుంచి 2.85 కి.మీ, 2.9 కి.మీ నుంచి 3.00 కి.మీ, 3.15 నుంచి 3.25 కి.మీ వరకు, పైభాగంలో 2.65 కి.మీ నుంచి 2.75 కి.మీ వరకు బండ్ కుంగింది. దిగువ భాగంలో కూడా కొన్ని చోట్ల నీరు సీపేజ్ అవుతున్నట్లు అప్పటి ఇంజినీర్లు గుర్తించారు. -
గల్లంతైన బాలిక మృతి
ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ చెరువులో గల్లంతైన బాలిక ఆఫ్రిన్ మృతిచెందారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు.. చిన్నారి మృతదేహాన్ని ఆదివారం బయటకు తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామం నుంచి శ్రీ అల్లిపీరా స్వామి ఉరుసులో పాల్గొనేందుకు తల్లి రజియా బేగం, ఏడేళ్ల కుమార్తె ఆఫ్రిన్లు కలసి వచ్చారు. దర్గాకు వెళ్లే ముందు పవిత్రంగా కాళ్లు, చేతులు కడుకందామని శనివారం గుడేకల్ చెరువు కు వెళ్లారు. కాలుజారి తల్లీబిడ్డ లోతైన చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు ప్రాణాలు తెగించి తల్లి రంజియాబేగంను కాపాడగలిగారు. చిన్నారి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆదివారం ఉదయం విగతజీవిగా ఆఫ్రిన్ కనిపించడంతో తల్లి గుండెపగిలెలా రోదించారు. భర్తను కోల్పోయిన రజియా ఇప్పుడు కుమార్తెను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి తరలించారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పొగాకు కంపెనీ నిర్లక్ష్యానికి రైతు బలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిఓర్వకల్లు: పొగాకు కంపెనీ నిర్లక్ష్యంతో రైతు ఖాజామొహిద్దీన్ మృతి చెందాడని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. రైతు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక జీపీ ఐ పొగాకు కంపెనీ యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో ఆత్మకూరు, ఆళ్లగడ్డ, అలంపూరు వంటి దూర ప్రాంతాలకు దిగుబడులు తీసుకురమ్మనడం దారుణమన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు వందల కి.మీ ప్రయాణించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒప్పందం మేరకు స్థానికంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించాలన్నారు. మృతుడు ఖాజామొహిద్దీన్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పాణ్యం జెడ్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ రంగనాఽథ్గౌడు, వైఎస్సార్సీపీ నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులు శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, అయ్యపురెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈనెల 2వ తేదీన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గుట్టపాడు గ్రామానికి చెందిన రైతు మహబూబ్బాషాను పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి పరిహారం అందించాలని కోరారు. చికిత్స పొందుతూ రైతు మృతి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓర్వకల్లుకు చెందిన రైతు షేక్ ఖాజామొహిద్దీన్(56) చికిత్స పొందుతూ కోలేక మృతి చెందాడు. మృతుడు ఓర్వకల్లు ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ ఉస్మాన్బాషా సోదరుడు. గత నెల 30వ తేదీన జోగులాంబ అలంపూరులోని పొగాకు కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్లో దిగుబడి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ వంతెనపై వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ ఖాజామొహిద్దీన్కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి కుదుట పడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. అక్కడి వైద్యుల సల హా మేరకు మృతుని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. -
‘పెట్రో’ కష్టాలు
కోసిగి: పెట్రోల్ దొరకక వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ లేకపోవడంతో కోసిగిలో మూడు రోజులుగా హెచ్పీ, నయారా పెట్రోలియం బంకులు మూతపడ్డాయి. కేవలం ఇండియన్ పెట్రోలియం బంక్లో మాత్రమే పెట్రోల్ను పోస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలతో ప్రజలు బారులుదీరాల్సి వస్తోంది. వేసవికాలం కావడంతో ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో కనీస తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి కోసిగిలో ఉన్న మూడు పెట్రోలియం బంక్లలో పెట్రోల్, డీజిల్ సమస్యలు లేకుండా చూడాలని వాహనదారులు కోరారు. పీఐయూ డీఈఈగా సతీష్కుమార్ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పీఐయూ ( ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ) కర్నూలు సబ్డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఆర్ సతీష్కుమార్కు పూర్తి అధనపు బాధ్యతలు అప్పగిస్తు పీఆర్ ఈఎన్సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. పీఐయూ రెగ్యులర్ డీఈఈగా విధులు నిర్వహించిన ఎస్ మహేశ్వరరెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే సతీ ష్కుమార్కు డీఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఈఈగా సతీష్కుమార్ నియమితులు కావడంపై సహచర డీఈఈలు, ఏఈ, ఏఈఈలు, కార్యాలయ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేడు పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నూ ప్రజలను ఫిర్యాదులను స్వీరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఆదివారం రాత్రి 8 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ ఏడాది డ్యాంలో కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటుకు సంబంధించి ఎల్లెల్సీకి జనవరిలో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు తాగునీటి అవసరాల నిమిత్తం ఏప్రిల్ 3న విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు నీటిని వదిలిన అధికారులు ఆదివారం తిరిగి బంద్ చేశారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తజనం తరలివచ్చింది. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. -
‘నీట్’కు 97.54 శాతం హాజరు
● జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,928 మంది విద్యార్థులకు గాను 4,807 మంది (97.54శాతం ) హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలోని కేంద్రం వద్ద పోలీసుబంద్బస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. -
పిచ్చి రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు!
● కొత్త పింఛన్లు రాలేదని రాయండి ● ‘సూపర్సిక్స్’అమలు కాలేదని ప్రచురించండి ● ఒక పత్రికపై జయమనోజ్రెడ్డి ధ్వజం ఆదోని అర్బన్: పిచ్చి రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఒక పత్రికపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు జయమనోజ్రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో విజిలెన్స్ విచారణ జరుగుతోందని ఆరోపణలు రావడంపై రెండు రోజుల క్రితమే తన తండ్రి చట్టపరంగా ఎదుర్కోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారన్నారు. అలాంటిది ఏకపక్షంగా ఒక పత్రిక రాయడంపై మండిపడ్డారు. రాసే ముందు తన వివరణ తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పటివరకు రెండేళ్లయినా అభివృద్ధి చేయలేదని, అయినా ఆ పత్రిక రాయలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథిపై ఆరోపణలు వస్తే వాటిని పక్కదోవ పట్టించేందుకు అవాస్తవాలు రాస్తున్నారన్నారు. సూపర్సిక్స్ పథకాలు అమలుకాక, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ పత్రికకు కనపడటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కొత్త పింఛన్లు ఇవ్వలేదని, దానిపై రాయాలని సూచించారు. అభివృద్ధి కనిపించదా? తన తండ్రి హయాంలో ఆదోనిలో జరిగిన రోడ్ల వెడల్పు, అభివృద్ధి గురించి ఆ పత్రికకు కనిపించదా అని జయమనోజ్రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కళాశాల నిర్మాణం దాదాపు రూ.450 కోట్లతో చేపట్టినా, టీడీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసినా ఎప్పుడూ ఆ పత్రిక రాసింది లేదన్నారు. ఆదోనికి డిగ్రీ కళాశాల తెచ్చింది తన తండ్రే అని, శాశ్వత భవనం లేదని, ప్రభుత్వం నిర్మించాలని రాయొచ్చు కదా అని ప్రశ్నించారు. వాటి గురించి రాస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు కదా అన్నారు. తాము ఎప్పుడూ ఇక్కడే ఉంటామని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ స్వభావం ఎలాంటిదో ఇక్కడున్న 2.50 లక్షల మంది ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ జీవన్సింగ్ పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కర్నూలు యార్డు సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఆర్ జయలక్ష్మి చెప్పారు. ఆదివారం స్థానిక మార్కెట్యార్డులో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తెలుగు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మార్కెట్యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు బంగి శ్రీధర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, సురేష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేషగిరి శెట్టి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీలలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు బంగి శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరు కలిసికట్టుగా ఉంటు హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటరత్నం, కోశాధికారి డీసీ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు బీ శ్రీరాములు, ఉపాధ్యక్షులు పీవీ కిరణ్, అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఈశ్వర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
దేవుడి మాన్యం సర్వేకు ఎమ్మెల్యే అడ్డంకులు
● నదికై రవాడి గ్రామస్తుల ఆందోళననందవరం: దేవుడి మాన్యం సర్వేకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని నదికై రవాడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంజనేస్వామి ఆలయానికి 23.97 ఎకరాల మాన్యం భూమి ఉందని, వాటిని అక్రమంగా అనుభవిస్తున్నారన్నారు. ఆక్రమదారులతో రెవెన్యూ , దేవాదాయ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేవుడి మాన్యం రీ సర్వేకు హాజరు కావాలని గ్రామపెద్దలకు నోటీసులు ఇచ్చి శనివారం అధికారులు రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు వెంకటేష్, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గ్రామస్తులమంతా ఉదయం 9 గంటలకు దేవుడి మాన్యం సర్వేకు వచ్చామని మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు రాకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోందన్నారు. అధికారులు స్పందించకపోతే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మధ్యాహ్నం 2 గంటలకు మండల సర్వేయర్ అక్బర్బాషా, సర్వే సిబ్బంది హాజరు కావడంతో వారితో గ్రామస్తులు వాగ్వాదం చేశారు. సర్వే అధికారి అక్బర్బాషా మాట్లాడుతూ.. గ్రామస్తులకు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తమవేనని, సర్వేకు దేవాదాయ శాఖ అధికారులు రాలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం నదికై రవాడి దేవుడి మాన్యం సర్వేలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. సర్వే కోసం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్వాహబ్, ఆదోని డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లులు, ఆర్ఎస్డీటీ మహేస్కుమార్, మండల సర్వేయర్ అక్బర్ బాషా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో సర్వేకు హాజరు కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో దేవుడి మాన్యం సర్వే వాయిదా పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ సుధాకర్రెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మూడు రోజుల పాటు సర్వేను వాయిదా వేయమని కోరినట్లు తెలిపారు. -
జిల్లావ్యాప్తంగా మెగా కార్డెన్ సెర్చ్
కర్నూలు: ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా కార్డ్డెన్ సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఎమ్మిగనూరు సబ్డివిజన్లోని లచ్చుమర్రి, ఆదోని సబ్ డివిజన్లోని కపటి, కర్నూలులోని జొహరాపురం, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. మొత్తం 165 వాహనాలను తనిఖీ చేసి 53 వాహనాలకు పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించారు.పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్: 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. -
చెరువులో బాలిక గల్లంతు
● స్నానానికి వెళ్తూ జారిపడిన తల్లీబిడ్డ ● తల్లిని రక్షించిన స్థానికులు ● బాలిక కోసం గాలింపు చర్యలు ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ గ్రామంలో అల్లీపీరస్వామి ఉరుసుకు కుటుంబంతో వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ చెరువులో గల్లంతైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రజియా తన కుమార్తె ఆఫ్రిన్(7)తో శుక్రవారం సాయంత్రం బంధువులతో గుడేకల్లుకు చేరుకుంది. రాత్రి దర్గా సమీపంలో నిద్రపోయి శనివారం ఉదయం చెరువు దగ్గర స్నానం చేసేందుకు బంధువులతో కలసి వెళ్లారు. చెరువు దగ్గర సిమెంట్ దిమ్మైపె రజియా, ఆఫ్రిన్ నడుస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి ఇద్దరూ చెరువులో పడిపోయారు. అయితే అక్కడే స్నానాలు చేస్తున్న కొందరు వెంటనే రజియాను రక్షించి బయటకు తీసుకురాగా, బాలిక జాడ కనిపించ లేదు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించటంతో రూరల్ సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫైర్ అధికారి ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ముర్రవాడ భార్గవి చెరువు దగ్గరకు చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రజియా భర్త సిద్దూసాబ్ చనిపోగా తన ముగ్గురు కమార్తెలను పోషిస్తూ జీవనం సాగిస్తుంది. చివరి అమ్మాయి ఆఫ్రిన్ చెరువులో పడి మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలిపిస్తోంది. సాయంత్రం వరకు బాలిక జాడ కనిపించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. దైవ దర్శనం కోసం విషాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
టీడీపీ నేతలు భూ కబ్జాదారులు
కల్లూరు: ఖాళీ భూమి కనిపిస్తే చాలు టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలో ఉన్న సమాధుల పల్లెలో రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చదును చేశారు. విషయం తెలుసుకున్న కాటసాని శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని విమర్శించారు. అధికార పార్టీ నేతలమంటూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. బస్తిపాడు గ్రామ పరిధిలోని సమాధుల పల్లెలో ఉన్న గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఎలా ఆక్రమిస్తారని మండిపడ్డారు. సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాలను టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను, కబ్జాలను కచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను ప్రజలకే స్వాధీనం చేస్తామన్నారు. కబ్జాదారులకు వత్తాసు పలికే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఎన్నికల్లో గెలవడం కోసం తనపై అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేశారని, ఎవరు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల తరఫున పోరాటం చేస్తుందన్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు అక్రమించేస్తున్నారు రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమి ఆక్రమణను అడ్డుకుంటాం ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
ఘనంగా ప్రసాదం పంపిణీ
కౌతాళం: కౌతాళంలో మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సఫ్రాలుట్న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని డప్పువాయిద్యాలు, బ్యాండుమేళాల మధ్య దర్గాకు తీసుకొచ్చి ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. అనంతరం ధర్మకర్త ప్రసాదం పంపిణీ ప్రారంభించడంతో భక్తులు ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ సీఐ యుగంధర్ గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. దర్గాను దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ జిల్లా అడిషనల్ ఎస్పీ జి.హుసేన్పీరా ఫ్యాక్షన్ జోన్ సీఐ పార్థసారథి, కౌతాళం సీఐ యుగంధర్తో కలిసి ఖాదర్లింగస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాధిపతి ఖాదర్బాషా చిస్తీలు ఘన స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కారించి దర్గా ఫొటో అందజేశారు. కొనసాగుతున్న కౌతాళం దర్గా ఉత్సవాలు -
‘పచ్చని’ పెళ్లి పిలుపు
అవుకు(కొలిమిగుండ్ల): సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా పెళ్లి అంటే వారి స్థాయికి తగ్గట్లుగా శుభలేఖలు అచ్చు వేయించి పంచుతుంటారు. ధనవంతులు పెండ్లి పత్రిక అందంగా, ఖరీదుగా ఉండేలా చూసుకుంటారు. కానీ వీటన్నిటింటికీ భిన్నంగా అవుకు మండలం మెట్టుపల్లెలో శుక్రవారం బ్యాగులో మొక్కలు ఉంచి బంధువులు, గ్రామస్తులను ఆహ్వానించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేకల వెంకటేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు ఉపేంద్రరెడ్డి వివాహం సందర్భంగా ఆయన సోదరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది గణేష్రెడ్డి ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులపై పెళ్లి వివరాలు ముద్రించారు. వాటిలోనే మొక్కలను పెట్టి ఊర్లో బంధువులు, మిత్రుల ఇంటింటికీ వెళ్లి అందిస్తూ తమ సోదరుడి వివాహానికి రావాలని కోరుతున్నారు. తప్పకుండా మొక్కలను మీ ఇళ్ల వద్ద నాటుకోవాలని సూచిస్తుండటం విశేషం. -
సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులు నిర్ణీత సమయానికి వస్తున్నారా?, షిఫ్ట్ సమయం ముగిసే వరకు అందుబాటులో ఉంటున్నారా? అని పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి సేవలను డిజిటలైజ్ చేసే క్రమంలో నెక్ట్స్ జనరేషన్ ఈ–హాస్పిటల్ వెబ్సైట్లో రోగులకు సంబంధించిన వివరాలు, రిపోర్టులు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్ఎంఓలు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి కర్నూలు(హాస్పిటల్): కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు నర్సులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో మాట్లాడుతూ.. రోగి ఆసుపత్రికి వచ్చిన సమయం నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి అంశాన్ని కేసు షీట్లో క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. రోగి ఏ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు. వారికి అందించిన వైద్యసేవలు, నిర్వహించిన పరీక్షల వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. వైద్యసేవల్లో పారదర్శకతను పెంచేందుకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి స్టాఫ్నర్సు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, హెడ్నర్సులు, స్టాఫ్నర్సులు పాల్గొన్నారు. -
తెలుగుగంగ కాలువలో పడిన టిప్పర్
● మట్టిని ఓవర్లోడ్ చేసుకొని వెళ్తుండగా ఘటన ● తెలుగు గంగ కట్టకు పొంచి ఉన్న ముప్పు మహానంది: మట్టిని ఓవర్లోడ్ చేసుకుని వస్తున్న టిప్పర్ అదుపు తప్పి తెలుగుగంగ కాల్వలో పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కృష్ణనంది సమీప ంలోని పొలాల నుంచి ఇటీవల నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. శు క్రవారం కృష్ణనంది నుంచి తెలుగుగంగ కట్టమీదు గా మహానంది, నంద్యాల వైపు వస్తున్న టిప్పర్ అ దుపు తప్పి గంగ కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కట్ట వెంట భారీగా టిప్పర్లు మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి, గ్రావెల్ను వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. గాజులపల్లె, కృష్ణనంది సమీపంలోని కొన్ని పంట పొలాల్లో మట్టిని తరలించేందుకు అధికారపార్టీ నేతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు మండలాలకు చెందిన కీలక నేతలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలిసింది. అన్ని అనుమతులు ఉన్నాయంటూనే తెలుగుగంగ కట్ట వెంట భారీగా టిప్పర్లను తరలిస్తుండటం వల్ల కట్టకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే పలు చోట్ల కట్ట బలహీనంగా ఉండి, గండ్లు పడిన విషయం తెలిసిందే. కృష్ణనంది నుంచి వచ్చేవి, గాజులపల్లె నుంచి తరలించేవి తెలుగుగంగ కట్టమీదుగా అయ్యన్ననగర్ వరకు వచ్చి అక్కడి నుంచి నంద్యాల, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. తెలుగుగంగ కాల్వ కట్టమీదుగా ఎలాంటి భారీ వాహనాలు వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారపార్టీకి చెందిన వారు కావడంతో సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయల్టీ చెల్లింపుతో సహా అన్ని రకాల అనుమతులు ఉంటే ప్రధాన రహదారుల వెంట తీసుకెళ్లవచ్చు కదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని శాఖల అధికారులకు మామూళ్లు ముట్టాయని, విజిలెన్స్, మైనింగ్శాఖల అధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారపార్టీకి చెందిన ఓ వర్గం నేతలు పేర్కొంటున్నారు. -
యువకుడి ఆత్మహత్య
పెద్దకడబూరు : బాపులదొడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మారుతి వివరాల మేరకు.. బాపులదొడ్డికి చెందిన గిడ్డగాని వీరారెడ్డి(43) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీనికితోడు కొన్ని రోజులుగా భార్య పుట్టింటికి పోయి కాపురానికి రాలేదు. మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది గతనెల 29వ తేదీన(బుధవారం) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కల్లులో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హోటల్లో షార్ట్సర్క్యూట్
బేతంచెర్ల: పట్టణంలోని నగర పంచాయతీ సమీపాన ఉన్న మహబూబ్ హోటల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్టు సర్క్యూట్ జరిగి రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన హోటల్ నిర్వాహకు డు రసూల్గురువారం రాత్రి 11 గంటల సమ యంలో హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున హోటల్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికు లు వెంటనే ఆయనకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వెళ్లి చూడగా హోటల్లోని ఫ్రిజ్ లో షార్టు సర్క్యూట్ జరిగి పక్కనే ఉన్న వంట సామగ్రి, కుర్చీలు, టేబుల్స్, 15 వేల నగదు, బియ్యం బస్తాలు, మిక్సి, గ్రైండర్ కాలిపోయా యి. సుమారు రూ. 2.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. గ్యాస్ సిలిండర్ల దగ్గరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టీ రాయించాడు.. సరుకులు పట్టుకెళ్లాడు మద్దికెర: మోసానికి కాదేది అనర్హం అంటున్నా రు కొందరు కేటుగాళ్లు. ఎదుటివాడికి ఎలాంటి అనుమానం కలగకుండా మాయమాటల తో నమ్మించి చీటింగ్ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొందరు వారి వలలో పడి లబోదిబోమంటున్నారు. తాజాగా మద్దికెరలో ని ఓ దుకాణాదారుడికి కేటుగాడు రూ. 40వేలు టోకరా వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మద్దికెరలోని ఓ కిరాణ దుకాణానికి వచ్చాడు. దాదాపు రూ. 1.50 లక్షలు విలువ చేసే సరుకుల పట్టీ రా యించాడు. వ్యాపారి ఆ పట్టీ ప్రకారం సరుకు లు ప్యాక్ చేసి పెట్టారు. అందులో దాదాపు రూ.40 వేలు విలువ చేసే సిగరెట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకున్నాడు. ఆటో తీసుకొచ్చి డ బ్బులు చెల్లించి సరుకులు తీసుకెళ్తానని నమ్మించి సిగరెట్లు వెంట పట్టుకెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో మోసపోయానని గమనించి లబోదిబోమనడం దుకాణాదారుడి వంతైంది. పతకాలు సాధించాలి కర్నూలు (టౌన్) : అథ్లెటిక్స్లో జిల్లాకు పతకాలు తీసుకురావాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. శుక్ర వారం స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో ఉ మ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు.పోటీలను ప్రారంభించిన ఆయన ఎంపిక పోటీల్లో రాణించిన క్రీడాకారులు ఈనెల 5 వ తేదీ గుంటూరు నాగర్జున యూనివర్సీటీ క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో విక్టర్, పీడీలు లక్ష్మయ్య, అథ్లెటిక్స్ కోచ్ కాశీరావు, జనార్దన్, మల్లేష్ పాల్గొన్నారు. గడ్డివాములు దగ్ధం నందవరం: మండల పరిధిలోని హెచ్.బాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బోయ మునెప్ప గారి రామన్న అనే రైతు తన వాముదొడ్డిలో రెండు గడ్డి వాములు వేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి రైతుకు స మాచారం అందించారు. ఆర్పేందుకు ప్రయత్నించేలోపు అవి పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని ఆయన కోరారు. చిన్న నేలటూర్లో .. గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్ననేలటూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతోనే ఇలా జరిగిందని బాధిత రైతు ఈడిగ లక్ష్మన్న వాపోయాడు. గడ్డి వాముల దగ్ధంతో బాధితుడికి రూ. 1.50 లక్షలు నష్టం వాటిల్లింది. ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్ పరిధిలోని కుప్పగల్–కోసిగి రైల్వేస్టేషన్ మధ్యలో కి.మీ.నంబర్ 516/17–19 అప్ ట్రాక్ మధ్యలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఆదోని రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య తెలిపారు. ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎడమచేతికి చక్రం ఆకారంలో పచ్చబొట్టు ఉందని, నలుపు రంగు లోయర్, బ్లూ రంగు ఫుల్ డ్రాయర్, కాఫీ కలర్ టీ షర్ట్ ధరించాడని చెప్పారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అనుమతులు లేని విత్తనాలు సీజ్
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శ్రీసాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో శుక్రవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ సహాయ సంచాలకుడు ప్రవీణ్, ఏఓ మోహన్, ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏఓ శివశంకర్ బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఎటువంటి అనుమతి లేకుండా విక్రయించేందుకు సిద్ధం చేసిన రూ. 25,35,142 విలువైన 2,482 విత్తన ప్యాకెట్లు, రూ. 1,91,000 విలువ చేసే బయో మందులను సీజ్ చేశారు. మొత్తం రూ. 27,26,142 విలువైన విత్తనాలు, బయో మందుల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం శ్రీ మైత్రీ ఆగ్రోస్ ఏజెన్సీ, చంద్ర ట్రేడర్స్లోనూ వారు విత్తనాలను తనిఖీ చేశారు. -
క్రీడాకారుల గోడు పట్టదా?
కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు క్రీడాకారుల గోడు పట్టడం లేదని క్రీడా సంఘాల జేఏసీ చైర్మన్ నాగరత్నమయ్య మండిపడ్డారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 25 ఏళ్లుగా క్రీడాకారులకు సేవలు అందిస్తున్న సాయ్ హాస్టల్ను తరలించరాదన్నారు. ఈ అంశంపై శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిసూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ మరమ్మతుల పేరుతో సాయ్ హాస్టల్ను కర్నూలు నుంచి తిరుపతికి తరలించడం వల్ల జిల్లా క్రీడారంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో అన్ని క్రీడా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి హాస్టల్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అలాగే సాయ్ అధికారుల మొండి వైఖరి వీడకపోతే తాము ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల రెండవ వారంలో చలో బెంగుళూరు – సేవ్ కర్నూలు సాయ్ స్పోర్ట్స్ హాస్టల్ పేరుతో రీజినల్ సెంటర్ను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
భద్రత, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. స్థానిక సి.క్యాంపు సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం సాగించిన దీర్ఘకాల పోరాట ఫలితంగా 8 గంటల పని హక్కును సాధించుకున్న చారిత్రాత్మక రోజు మేడే అన్నారు. సమాన హక్కులు, గౌరవ ప్రదమైన జీవితం కోసం కార్మికులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశ అభివృద్ధిలో కార్మికులు, కర్షకులు ప్రధాన స్తంభాలని వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. కార్మికులకు తగిన గౌరవం, భద్రత, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్మికుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ట్రేడ్ యూనియన్ అధికార ప్రతినిధి కటారి సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రామాంజనేయులు, బబ్లూ గోల్డ్ శీను, నగర మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, ట్రేడ్ యూనియన్ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ
కౌతాళం: అక్రమార్కులకు ‘ఉపాధి’ అన్న శీర్షిక ఏప్రిల్ 30న గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కౌతాళం మండలంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ నిధులు కొల్లగొట్టిన తీరుపై శుక్రవారం ఆదోని డివిజన్ ఏపీడీ లోకేశ్వర విచారణ చేపట్టారు. కౌతాళం ఎంపీడీఓ కార్యాలయంలో వివరాలు సేకరించారు. ఎంబుక్ లేకుండా పనిచేయని 98 పనులకు చెక్ మెజర్మెంట్ చేయడంపై ఏపీడీని వివరణ కోరారు. ఎంబుక్ లేనివి ఎంపీడీఓతో డీలిట్ చేసినట్లు ఎంబుక్ ఉన్న వాటికి మాత్రమే బిల్లులు చేసినట్లు ఈసీ వ్యక్తిగతంగా హజరై రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు ఏపీడీ తెలిపారు. నీట్ సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్ కర్నూలు(సెంట్రల్): ఈనెల 3న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సందేహాలు, సలహాల కోసం కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా 08518–277305 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో 95 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేశారు. -
కార్మికుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికర్నూలు: కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. కర్నూలు అర్బన్ ముజఫర్ నగర్లో ఉన్న ఏపీఎస్బీసీఎల్ లిక్కర్ గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిపారు. వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భీమేశ్వర్ రెడ్డి, శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకలకు కాటసాని రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మే డే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లక్ష్మీపురం గ్రామం పరిధిలో భారత్ గ్యాస్ డ్రైవర్స్ అండ్ హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా కాటసాని హాజరై వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. 28వ వార్డు మాజీ కార్పొరేటర్ నారాయణరెడ్డి, నాయకులు అయ్యప్ప, పాలకొలను రమేష్, ఏపీఎస్బీసీఎల్ హమాలీ యూనియన్ కార్మికులు మల్లికార్జున, వలి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. పీఠాధిపతి పట్టాభిషేకం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల 14వ పట్టాభిషేక మహోత్సాలు వైభవంగా నిర్వహించారు. తొలుత ఊంజల మండపంలో యజ్ఞ యాగాలు చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలో బ్రహ్మర్చిత శ్రీమూలరామదేవర పూజ, అదే విధంగా షోడశా బాహు శ్రీనరసింహా పూజను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నిర్వహించారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వాములకు విశేష పూజలు చేపట్టి మహా మంగళహారతులు ఇచ్చారు. పరమ పావన శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల అభినందన కార్యక్రమం శ్రీమఠం మేనేజర్, సిబ్బంది, శిష్యబృందం, భక్తులతో, మంత్రాలయం నివాసులు ఘనంగా చేపట్టారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతిని గజమాలతో, పూలతో శ్రీమఠం అధికారులు సన్మానించారు. మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు రచించిన పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం భక్తులు పీఠాధిపతికి తులభారం నిర్వహించారు.కార్యక్రమంలో మేనేజర్–2 వెంకటేష్జోషి, శ్రీమఠం ఇంజినీర్ సురేష్ కోనాపూర్, శ్రీమఠం సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లమలలో స్తంభించిన రాకపోకలు
మహానంది: నల్లమల ఘాట్రోడ్డులో రెండు గ్రానైట్ లారీలు ఢీకొని నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి తాడిపత్రి వైపు రెండు గ్రానైట్ లారీలు వస్తూ ఒకటి గిద్దలూరు పరిధిలోని ఘాట్రోడ్డులో నిలిచిపోయింది. వెనుక ఉన్న లారీ డ్రైవర్ సాయం తీసుకునేందుకు ఆపాడు. ఆగిన లారీ కింది వైపుకు వస్తున్న వెనుక ఉన్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ రమేష్ స్వల్పంగా గాయపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండుటెండలో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న మహానంది, గిద్దలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీలను పక్కకు తప్పించారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
5న ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా
కర్నూలు(సెంట్రల్): ఉపాధి కార్యాలయంలో ఈనెల 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ఫార్మ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, స్కిల్ టెస్టులు నిర్వహిస్తారన్నారు. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయని.. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫార్మసీ–డీ/బీ/ఎం/ఎం ఫార్మసీ పాసై 18–30 సంవత్సరాల మధ్య వయస్సు యువతీ యువకులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 5వ తేదీన ఉపాధి కార్యాలయంలో 10 నుంచి 5 గంటల మధ్య ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు www.ncs.gov.in, www.empoyment.ap.gov.in అనే వెబ్సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదేళ్ల బాలుడికి డెంగీ ఆలూరు రూరల్: స్థానిక సిద్దేశ్వర కాలనీకి చెందిన ఓ బాలుడికి డెంగీ పాజిటివ్ నమోదైనట్లు మలేరియా నివారణ ఆదోని ప్రాంతీయ అధికారి మంజునాథ్ తెలిపారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐదేళ్ల బాలుడికి గత నెల 27న తీవ్ర జ్వరం రావడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 28న వైద్య పరీక్షల్లో బాలుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారించారు. అయితే మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలుడి ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మలేరియా అధికారిగా వెంకటేశులు కర్నూలు(హాస్పిటల్): జిల్లా మలేరియా నియంత్రణ అధికారిగా టి.వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ ఎంటమాలజిస్టుగా పనిచేస్తున్న ఆయనకు ఇన్ఛార్జి మలేరియా అధికారిగా బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలో ఎంటమాలజిస్టులను మలేరియా అధికారులుగా నియమించనున్నారు. అప్పటి వరకు ఈయనే ఆ పోస్టులో కొనసాగనున్నారు. జిల్లా మలేరియా అధికారి నూకరాజు గురువారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా మారిన విషయం విదితమే. అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశులు హెల్త్ అసిస్టెంట్గా, హెల్త్ సూపర్వైజర్గా, సబ్ యూనిట్ మలేరియా అధికారిగా, అసిస్టెంట్ మలేరియా అధికారిగా, సీనియర్ ఎంటమాలజిస్టుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు. హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్లుగా కేఎంసీ వైద్యులు కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజి వైద్యులు నియమితులయ్యారు. ఇందులో కళాశాల వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద, పెథాలజి హెచ్ఓడీ డాక్టర్ బాలేశ్వరి, జనరల్ సర్జరి ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ ఉన్నారు. వీరు ముగ్గురూ మూడు సంవత్సరాల పాటు యూనివర్సిటీకి సెనెట్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అభినందించారు. అటవీ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్గా సెల్వం కర్నూలు కల్చరల్: అటవీ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్గా 2012 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి సి.సెల్వం నియమితులయ్యారు. పలువురు కన్జర్వేటర్లకు స్థానచలనం కలిగింది. కర్నూలు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా విధులు నిర్వహిస్తున్న 2010 బ్యాచ్ ఐఎఫ్ఎస్ బీవీఏ కృష్ణమూర్తిని విశాఖపట్నం ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీఎఫ్డీసీ లిమిటెడ్ ఆర్ఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి ఎస్వీ జూలాజికల్ పార్క్ క్యురేటర్గా విధులు నిర్వహిస్తున్న సి.సెల్వంను నియమించారు. నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న 2020 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అనురాగ్మీనాను తిరుపతి ఎస్వీ జూలాజికల్ పార్క్ క్యురేటర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి పీసీసీఎఫ్ కార్యాలయంలో ఐటీ వింగ్ డిప్యూటీ సీఎఫ్గా విధులు నిర్వహిస్తున్న 2019 బ్యాచ్ ఐఎఫ్ఎస్ సి.చైతన్య కుమార్ రెడ్డిని నియమించారు. -
దూరమెరగని దాహం
వేసవికాలం ప్రారంభం నుంచి పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. అధికారులు, పాలకులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు వదులుకొని కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరుబావుల నుంచి నీళ్లు తెచ్చుకొని గొంతుతడుపుకుంటున్నారు. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో మంచినీటి పథకాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మండుటెండలో మహిళలు, చిన్నారులు తోపుడుబండ్లు తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రతకు అద్దంపట్టే ఈ దృశ్యాలు చూసైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. –నందవరం -
మతసామరస్యానికి ప్రతీకలు దర్గాలు
● ఖాదర్లింగస్వామి సన్నిధిలో కాటిగి పీఠాధిపతి కౌతాళం: మతసామరస్యాలకు దర్గాలు ప్రతీకలుగా నిలుస్తాయని కర్ణాటక రాష్ట్రంలోని కాటిగి తలెకాన మఠం పీఠాధిపతి వీరభద్రస్వామి అన్నారు. కౌతాళంలో జగద్గురు ఖాదర్లింగస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాదిపతి ఖాదర్బాష చిస్తీలు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజలు కులమతాలకు అతీతంగా ఖాదర్లింగస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దర్గాలో పంచాంగ పఠనం చేస్తున్నారన్నారు. ఇలాంటి సంప్రదాయాలు అన్ని చోట్ల ఉండటం ఎంతో అవసరం అన్నారు. -
మనోజ్ కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: తిరుణాల సందర్భంగా ఉయ్యాలవాడ గ్రామంలో హత్యకు గురైన వడ్డె మనోజ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం దారుణ హత్యకు గురైన మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులను గురువారం మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్రెడ్డితో పాటు కాటసాని పరామర్శించారు. ముందుగా మనోజ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం హత్యకు గల కారణాలను మనోజ్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, లలితమ్మను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన ఎరుకలి వంశీ, ఆయన కుటుంబ సభ్యులు కలిసి తమ ఇంటివద్దకు వచ్చి మనోజ్ కుమార్ను దారుణంగా హత్య చేశారని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మనోజ్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు బొమ్మన నాగేశ్వరెడ్డి, రామిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పల్లె మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ మాదన్న, నాగరాజు, శివశంకర్రెడ్డి, డీలర్ నారాయణ, వెంకటరాముడు, గాజుల లక్ష్మినారాయణ, తలారి శివకుమార్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాచ్డాగ్ కమిటీలతో వాగులు, వంకల పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): వాచ్ డాగ్ కమిటీల ద్వారా వాగులు, వంకలను పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంకాలం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వాచ్డాగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఐదు చోట్ల అక్రమంగా హంద్రీని అక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వీరిలో అర్హులు ఉంటే టిడ్కో గృహాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కల్లూరు మండలంలో మొత్తం 337 మంది నివాసితులు ఉండగా 79 మందిని ఇప్పటికే ఖాళీ చేయించామన్నారు. ఖాళీ చేసిన వారిలో 120 మందికి టిడ్కో గృహాలు ఇచ్చామన్నారు. సమావేశంలో తహసీల్దార్లు ఆంజనేయులు, రవికుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
డాక్టర్నవుతా..
● పాణ్యం గురుకుల పాఠశాల విద్యార్థిని టి.సాయిశ్రీకి 596 మార్కులు ఎమ్మిగనూరు రూరల్: పాణ్యం గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన తనకంటి సాయిశ్రీ 596 మార్కులు సాధించారు. పట్టణానికి చెందిన టి.చక్రపాణి, టి.పద్మావతిలకు టి.సాయిశ్రీ, టి.సాయిరాఘవేంద్ర సంతానం. చక్రపాణి ఓ ప్రైవేట్ కాలేజీలో చిరుద్యోగి. సాయిశ్రీ పాణ్యం గురుకుల పాఠశాలలో చదవగా, కుమారుడు సాయి రాఘవేంద్ర ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమార్తెకు 596 మార్కులు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఎంత కష్టమైనా ఇక మీదట కూడా ఉన్నత చదువులు చదివిస్తామని తల్లిదండ్రులు తెలిపా రు. విద్యార్థిని సాయిశ్రీ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంటర్లో బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ సీటు సాధిస్తానన్నారు. డాక్టర్ అయిన తర్వాత తల్లిదండ్రులకు అండగా నిలుస్తానన్నారు. తాను 596 మార్కులు సాధించటానికి పాఠశాల అధ్యాపకుల కృషి ఎంతో ఉందన్నారు. -
13 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులు/ టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నియామకపత్రాలను అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నా రు. ఈ నేపథ్యంలోనే రికార్డు అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాలను కూడా చేపడుతున్నారు. సమయపాలన పాటించకపోతే చర్యలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు పారదర్శక సేవలు అందించాలని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి టీవీ భాస్కర్నాయుడు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు గ్రామాలు, వార్డుల్లో పర్యటించే సమయంలో కార్యాలయంలోని మూమెంట్ రిజిస్టర్లో తప్పక నమోదు చేయాలన్నారు. ఆయా సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కాకుండా అదనంగా ఒక్క రూపాయ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫించన్ల పంపిణీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తామన్నారు. 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు కర్నూలు(సెంట్రల్): 22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు గురువారం ఆమె కాన్ఫరెన్స్ హాలులో పలువురు రైతులకు 22ఏ జాబితా నుంచ తొలగించిన భూములకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 22ఏ జాబితాలో ఉన్న భూములను సాధారణ భూములుగా మార్చేందుకు వీలుంటుందని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చిరంజీవి, ఆర్డీఓ కె.సందీప్కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
కర్నూలు(సెంట్రల్): విద్యార్థులు లక్ష్యం ముందుకు సాగినప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్వయంగా కలెక్టర్ విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యవైపు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలే కానీ దుర్వినియోగం చేయరాదన్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన షైనింగ్స్టార్స్ షేక్ అబ్దుల్ రహిమాన్, కల్పి ముఖేష్, సెట్టప్ప దీపిక, అలీహ సుల్తానా, బీరేపల్లి మౌళ్య, కూరపాటి హేమంతి, పింజరి దౌలసాబ్, షేఖ్ ఆఫ్రిన్, గుడిసే చంద్రనతో పాటు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సురేష్బాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీసీ లోకరాజు పాల్గొన్నారు. -
గుడిసైపెకి దూసుకెళ్లిన లారీ
● వృద్ధురాలి దుర్మరణం బొమ్మలసత్రం: నంద్యాల శివారులోని చి న్న చెరువుకట్టపై ఐఛర్ లారీ అదుపుతప్పి గుడిసైపెకి దూసుకెళ్లడంతో సుంకమ్మ (83) అనే వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది. ట్రాఫిక్ సీఐ చాంద్బాషా తెలిపిన వివరాల మేరకు.. వేకువజామున బియ్యంలోడ్తో వస్తున్న ఐఛర్ వాహనం చెరువుకట్టపై వస్తుండగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గుడిసైపెకి దూసుకెళ్లింది. గుడిసెలో నిద్రిస్తున్న సుంకమ్మను ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవివెల్దుర్తి: మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్ నగరం గ్రామంలో బుధవారం ఆమె మామిడి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వాతావరణ మార్పులతో సీజన్లో పూతరాక, వచ్చిన పూత రాలి, నిలిచిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు తెలిపారు. ప్రస్తుతం మామిడి పండ్ల బాక్స్ ధర హోల్సేల్ మార్కెట్లో రూ.300 నుంచి రూ.400లు పలుకుతోందని, గత ప్రభుత్వంలో అదే బాక్స్ ధర రూ.1500 నుంచి రూ.2వేలు వచ్చిందని వారు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధర లభించకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు లభించాయని తెలిపారు. వెంటనే మామిడి ఎగుమతి అవకాశాలను పెంచాలన్నారు. మామిడి పండ్ల నిల్వ సదుపాయం కల్పించి, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. మామిడి రైతులకు వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్ నగరం దేశాయ్ సమీర్కుమార్ రెడ్డి , మామిడి పండ్ల తోటల రైతులు పాల్గొన్నారు. -
గొడ్డలితో నరికి హత్య
ఆదోని అర్బన్: మండలంలోని గణేకల్ గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి (55)పై అదే గ్రామానికి చెందిన వెంకటేష్ మంగళవారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఘటనపై తాలూకా సీఐ నల్లప్ప తెలిపిన వివరాలు.. హనుమంతరెడ్డి వలస వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. భార్య రామలింగమ్మ ప్రవర్తనపై వెంకటేష్ గ్రామంలో దుష్ప్రచారం చేస్తున్నాడని తెలుసుకుని అర్ధరాత్రి అతడిని నిలదీసేందుకు వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహం చెందిన వెంకటేష్ గొడ్డలితో దాడి చేశాడు. గొడ్డలి వేటుకు హనుమంతరెడ్డి కుప్పకూలిపడిపోయాడు. విషయం తెలుసుకున్న పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన హనుమంతరెడ్డిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి కర్నూ లు ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు సంతానం. మృతుడి భార్య రామలింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ కేసు నమోదు చేసుకోగా, తాను దర్యాప్తు చేపడుతున్నట్లు తాలూకా సీఐ నల్లప్ప చెప్పారు. నిందితుడు వెంకటేష్పై గతంలోనూ ఓ హత్య కేసు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని గోదాములో భద్రపరచిన ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) భద్రతకు సంబంధించి సీసీ టీవీ పర్యవేక్షణ, ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలన్నారు. ఇన్చార్జ్ డీఆర్వో చిరంజీవి, ఎన్నికల విభాగం సూపరిటెండెంట్ మురళి పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా అహోబిలేశుని రథోత్సవం
ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. పండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాలు మధ్య శ్రీ జ్వాలానరసింహుడి రథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. శ్రీ అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన బుధవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలానృసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. ఈ సందర్భంగా గోవిందా నామస్మరణతో నల్లమల ప్రాంతం మార్మోగిపోయింది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలానృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పండితుల ఆధ్వర్యంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలతో ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పల్లకీలో కొలువుంచారు. దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేసిన రథంపై జ్వాలానరసింహస్వామి ఉభయ దేవేరులతో అధిష్టించారు. అనంతరం కొబ్బరికాయ సమర్పించి హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా జరిగింది. -
‘వరి’గిన పైరు
బనగానపల్లె: బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షానికి దిగుబడులు చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలి గింజలు రాలిపోయాయి. దీంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్బీసీ వ్యవసాయ బోర్ల కింద వేల ఎకరాల్లో రబీలో వరి పంటను సాగు చేశారు. గత 15 రోజులుగా పంట దిగుబడులు కల్లాలకు చేరుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో గత కొద్ది రోజులుగా నెలకొన్న డీజిల్ సమస్య వల్ల పంటకోత యంత్రాలు నిలిచిపోవడంతో నూర్పిడిలో ఆలస్యం అయ్యిందని రైతులు వాపోయారు. దీనికి తోడు అకాల వర్షం, ఈదురు గాలులతో ఉహించని విధంగా వరి పంటకు నష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు షుగర్లెస్ రకం వరి పంటను సాగు చేశారు. 75 కిలోల ఒడ్ల బస్తా రూ.1500–1550కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం వర్షానికి తడవడం వల్ల నాణ్యత లోపం సాకుతో వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరికి గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరతున్నారు. నేలవాలిన కొర్ర కోడుమూరు రూరల్: భారీ ఈదురు గాలులు కొర్ర రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కో డుమూరు మండలంలో గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద ఆరుతడి పంటగా 300కు పైగా ఎకరాల్లో కొర్ర పంట సాగు చేశారు. ప్రస్తుతం కొర్ర పంట దిగు బడి దశకు రావడంతో రైతులు కోతలకు కోసేందుకు సిద్ధమవుతున్నా రు.ఈ నేపథ్యంలో మంగళవారం సా యంత్రం నుంచి రాత్రి వరకు వీచిన భారీ ఈదురుగాలులకు కొర్ర పైరు నేలవాలి భారీగా గింజలు రాలిపోవడ ంతో తీవ్రనష్టంవాటిల్లినట్లు రైతులు వాపోయారు. -
గోవుల అక్రమ తరలింపు అడ్డగింత
వెల్దుర్తి: ఎండాకాలంలో, గాలి ఆడని స్థితిలో కంటైనర్లో ఆవులు, ఎద్దులను కర్కశంగా తరలిస్తున్న లారీని బుధవారం కర్నూలు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. వివరాలు.. షాద్నగర్ నుంచి బెంగళూరు, కర్ణాటకకు కంటైనర్లలో అక్రమంగా ఆవులు, ఎద్దులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు హైవే–44పై కాపు కాశారు. ఉలిందకొండ సమీపంలో రెండు కంటైనర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆపకపోవడంతో వెంట పడి వెల్దుర్తి హనుమాన్ జంక్షన్ వద్ద ఓ కంటైనర్ను ఆపగలిగారు. డోర్లు మూసివేసి, గాలి తగలని స్థితిలో కంటైనర్లో 40 వరకు ఆవులు, ఎద్దులను కట్టిపడేసి ఉంచడం చూసి సమీప పోలీసులకు సమాచారం అందించారు. మండు వేసవిలో ఊపిరాడని స్థితిలో ఉన్న మూగజీవాలను చూసి వారు ఆగ్రహించారు. సీఐ యుగంధర్ కంటైనర్ను పోలీస్స్టేషన్కు తరలించి, పరిశీలించారు. లారీ పత్రాలు, తరలింపు పత్రాలు సైతం సరిగా లేకపోవడంపై ఆవులు, ఎద్దులను కర్నూలు గోశాలకు తరలించారు. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ సభ్యులు మాట్లాడుతూ.. దాదాపు 10 కంటైనర్లలో ఒకే నంబర్ ప్లేట్తో అక్రమంగా ఆవులు, ఎద్దులను ప్రమాదకర పరిస్థితులలో తరలిస్తున్నట్లు ఆరోపించారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
● పంట మార్పిడి ద్వారా ప్రయోజనం ● సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యం ● మిల్లెట్స్, పప్పు ధాన్యాలతో ఆదాయం ● వైఎస్సార్ సెంటినరీ హాల్లో జెడ్ఆర్ఈఏసీ సమావేశం నంద్యాల(అర్బన్): ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసార పెంపుతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. రైతులు మిశ్రమ పంటలను అవలంభించి ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలన్నారు. బుధవారం వైఎస్సార్ సెంటినరీ హాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథి కలెక్టర్ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 3.35 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక సాగు విధానాలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందించి, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వా రా వారి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. భూమి సంరక్షణ, తక్కువ కాలంలో అధిక దిగుబడి సాధించే పంటల ఎంపిక, తక్కువ నీరు, ఎరువులతో అధిక లాభాలు అందించే విధానాల పై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ చెరుకూరిశ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలన్నారు. బహుళ పంటల సాగు, మిశ్రమ పద్ధతుల ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యంత కీలకమన్నారు. రసాయనాల ప్రభావం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఎన్జీరంగ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయంలో సమస్యలను గుర్తించి ఆ దిశగా పరిశోధనలు, విస్తరణ అంశాలను బలోపేతం చేయాలన్నారు. ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జా న్సన్ మాట్లాడుతూ..మిల్లెట్స్ వినియోగాన్ని ప్రోత్సహి ంచాలన్నారు. అంతకుముందు వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలను రైతులకు వివరించారు. నాలుగు జిల్లాల వ్యవసాయాధికారులు వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, రవి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
క్యూ కాంప్లెక్స్కు చంద్రగ్రహణం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లాలంటే నరకయాతన పడాల్సిందేనా? ఏన్నాళ్లిలా? ఈశ్వరా.. పరమేశ్వరా అంటూ భక్తులు వేడుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానంలో రేకుల షెడ్డులో క్యూ కంపార్ట్మెంట్లు ఉండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులను గంటల తరబడి కంపార్ట్మెంట్లలో ఉంచడంతో ఉక్కపోతతో చంటిపిల్లలు, వృద్ధులు, మహిళలు అనుభవించే అవస్థలు ఆ పరమేశ్వరుడికే ఎరుక. సామాన్య భక్తుల అవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండేళ్లు గడస్తున్నా ఇంతవరకు నూతన క్యూ కాంప్లెక్స్పై నిర్ణయం తీసుకోకపోవడంతో హిందూ ధర్మంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఇట్లే అర్థమవుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీశైల మహాక్షేత్రంలో పరమేశ్వరుడి రూపంలో మల్లికార్జున స్వామి, పార్వతీదేవిగా భ్రమరాంబాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది, రద్దీ రోజుల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీగిరికి తరలివస్తారు. శ్రీగిరికి తరలివచ్చిన భక్తుల్లో ఎక్కువ శాతం సామాన్య భక్తులే. సామాన్య భక్తులు ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. శ్రీశైల దేవస్థానంలో ఉచిత క్యూలైన్ ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల కోసం 17 కంపార్ట్మెంట్లు 28,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 17 కంపార్ట్మెంట్లలో 7,200 మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది. అలాగే క్యూలైన్ (స్టాండింగ్) 2,900 మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది. మొత్తం 10,100 మంది ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే శీఘ్ర (రూ.150), అతిశీఘ్ర (రూ.300) క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు 13,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎనిమిది కంపార్ట్మెంట్లలో 3,360 మంది భక్తులు, క్యూలైన్ (స్టాండింగ్) 1900 మంది మొత్తం 5,300 మంది భక్తులు దర్శనానికి వేచిఉండే అవకాశం ఉంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం 1200 మంది వేచిఉండేలా నాలుగు క్యూలైన్లు, ఆలయంలో లోపల 1700 మంది వేచిఉండేలా నాలుగు ప్రత్యేక క్యూలైన్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 25 కంపార్ట్మెంట్లలో 15,500 మంది భక్తులు వేచిఉండేందుకు అవకాశం మాత్రమే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే.. శ్రీశైల దేవస్థానంలో ఉన్న కంపార్ట్మెంట్లు రేకుల షెడ్డులే కావడంతో భక్తులు ఆయా కంపార్ట్మెంట్లలో ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది ఉత్సవాల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో గంటల తరబడి క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి. రేకులషెడ్డు కంపార్ట్మెంట్లలో భక్తుల అవస్థలు ఆ పరమేశ్వరుడికే ఎరుక. శ్రీశైల దేవస్థానంలో ఉన్న రేకులషెడ్డు క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు పడుతున్న కష్టాలను చూసిన అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ఓప్పించి రూ.75 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అటు తరువాత క్యూ కాంప్లెక్స్కు టెండర్లు సైతం పిలిచారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో టెండర్ల ప్రక్రియ అర్ధాంతరంగా అగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు క్యూకాంప్లెక్స్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. ఆ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే కుట్రతో ఇంతవరకు నూతన క్యూ కాంప్లెక్స్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో భక్తుల అవస్థలు ఎండలకు రేకుల షెడ్లలో గంటల తరబడి నరకయాతన రూ.75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్కు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన రెండేళ్లైనా క్యూ కాంప్లెక్స్ను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
కర్నూలు రేంజ్ నూతన ఎఫ్ఆర్ఓగా ప్రియాంక
కర్నూలు కల్చరల్: కర్నూలు రేంజ్ నూతన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా బి.ప్రియాంక నియమతులయ్యారు. ఆమె బుధవారం రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2013లో ఎఫ్ఆర్వోగా ఎంపికై న ఆమె ప్రొద్దుటూరులో ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత నంద్యాల, తిరుపతి, పీలేరు రేంజ్లలో విధులు నిర్వహించారు. కర్నూలు రేంజ్ ఇన్ఛార్జి ఎఫ్ఆర్వో తేజస్వి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆమె కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి, డీఎఫ్వో పి.శ్యామలను మర్యాదపూర్వకంగా కలిశారు. అందరి సహకారంతో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తానన్నారు. 1న ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు కర్నూలు(టౌన్): స్థానిక బి.క్యాంపు క్రీడా మైదానంలో మే 1వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.సుబ్బరత్నాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మే 5, 6 తేదీలలో గుంటూరులోని నాగార్జున యూనివర్సీటీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు లక్ష్మయ్య(89194 09232)ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
రమణీయం.. వెండి రథోత్సవం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం భక్తుల మధ్య శ్రీ మఠం ప్రాంగణంలో వెండి రథంపై ప్రహ్లాదరాయలు విహరించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు నేతృత్వంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గ్రామదేవత మంచాలమ్మకు కుంకుమార్చన గావించారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీమఠం కారిడార్లో భక్తుల రద్దీ, కల్పతరు క్యూ కాంపెక్స్లో, పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజనశాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠంలో ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు కోసం కారిడార్లో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆదేశాలతో శ్రీమఠం అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అలంకరణలో గ్రామదేవత మంచాలమ్మ, చలువ పందిట్లో సేదతీరుతున్న భక్తులు -
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● మే 3వ తేదీన 16 కేంద్రాల్లో నిర్వహణ కర్నూలు(సెంట్రల్): వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు మే 3వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె నీట్ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నీట్ పరీక్షకు 16 కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,928 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు 1.30 గంటల్లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో చిరంజీవి, నీట్ పరీక్ష కోఆర్డినేటర్ పాయల్ ప్రియదర్శి పాల్గొన్నారు. టూర్ ప్యాకేజీల ముసుగులో మోసాలు కర్నూలు(టౌన్): వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ట్రావెల్ ఏజెన్సీల పేరుతో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలంటూ ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా, వాట్సప్ల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని, అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి సంప్రదింపులను నిలిపివేయడం, నకిలీ వెబ్సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసం చేస్తున్నారన్నారు. ఏ ట్రావెల్ ఏజెన్సీ అయినా ప్రజలు ముందుగా ధృవీకరించుకోవాలని, అధికారిక వెబ్సైట్, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలన్నారు. అనుమానాస్పదంగా తక్కువ ధరల పేరుతో వచ్చే ప్యాకేజీల ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే గంట లోపు 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే www.cybercrime.gov.in నేషనల్ సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షల్లో 13 మంది డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం నాలగవ సెమిస్టర్ పరీక్షల్లో 84 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. ఓర్వకల్ జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 8 మంది, డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 3, డోన్ వైష్ణవి డిగ్రీ కళాశాల, నంద్యాల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13 మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేశామన్నారు. నీటిని పొదుపు చేస్తాం ● టీబీ బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి హొళగుంద: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు(ఎల్–నినో) వచ్చే అవకాశాలు ఉండవచ్చని, నీటిని పొదుపు చేద్దామని టీబీ బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై టీబీ బోర్డు ఎస్ఈ నారాయణనాయక్, ఎస్డీఓలు, సెక్షన్ ఆఫీసర్లతో కలసి బుధువారం ఆయన పర్యటించారు. కాలువలో నీటి పరిమాణం, గట్ల పరిస్థితి పరిశీలించారు. హొళగుంద సెక్షన్లో 180 కి.మీ. నుంచి 187 కి.మీ. వరకు, అలాగే 193 కి.మీ. వద్ద కాలువ ఎడమ గట్టు అధ్వానంగా ఉండడంతో గ్రావెల్ వేసి బాగు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 11 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయని, ఎల్–నినో ప్రభావం ఏర్పడితే ఈ పొదుపు చేసిన నీటిని తాగునీటికి వాడుకోవొచ్చన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేర నీటిని వదులుతామని చెప్పారు. ప్రజలు కూడా ఎల్–నినోను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే నీటి పొదుపును చేసుకోవాలని సూచించారు. -
తాపీ పనికి వెళ్లి బాలుడి మృతి
వెలుగోడు: వెలుగోడు పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందాడు. స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన నూరుల్లా కుమారుడు నౌమన్ (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో బుధవారం మోతుకూరు గ్రామానికి తాపీ పనికి వెళ్లాడు. పని మధ్యలో టీ తాగి గ్లాస్ను పడేసేందుకు వెళుతూ ఇంటిపైన ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మౌలానా కుటుంబం నిరుపేద కావడంతో చదువుతో పాటు పనికి వెళ్లినట్లు తెలుస్తోంది. తండ్రి బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తుండగా, కుటుంబానికి అండగా ఉండాలనుకున్న కుమారుడు తాపీ పనికి వెళ్లి అకాల మరణం పొందడం స్థానికులను కలచివేసింది. కుమారుడి మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి
కర్నూలు(సెంట్రల్): జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని ఏపీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు ఈఎన్రాజు, ఐజేయూ జాతీయ సమితి సభ్యు లు ఎన్.వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోటలో రిపోర్టర్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వి.కోట రిపోర్టర్ హత్యకు నిరసనగా డీపీఆర్ఓ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.లెనినిబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై అనేక కథనాలు రాసి వారి హృదయాల్లో స్థానం సంపాదించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, ఉదయం వాకింగ్కు వెళ్లిన అతన్ని శ్రీగంధం మాఫియా దారుణంగా హత్య చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మన్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలన్నారు. నాయకులు చంద్రశేఖర్, వైవీ కృష్ణారెడ్డి, కె.శ్రీనివాసగౌడ్, కె.నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి తండ్రీకుమారుడి దుర్మరణం
● హెచ్చరిక బోర్డుల్లేని ఎన్హెచ్ – 340సీ రోడ్డుపై ప్రమాదం ● బ్యాంకు పనిపై వెళుతుండగా ఘటన జూపాడుబంగ్లా: బ్యాంకు పని నిమిత్తం వెళ్తూ హైవేలో డివైడర్ను ఢీకొట్టడంతో తండ్రి రంగన్న అలియాస్ రాజేష్ (32) అతని రెండేళ్ల కుమారుడు విశ్వక్రాణా తలలు పగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రాజేష్ ఆరేళ్లుగా పాములపాడు మండలం రుద్రవరంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కర్నూలులోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బుధవారం బ్రాహ్మణకొట్కూరు బ్యాంకులో పని నిమిత్తం రెండేళ్ల కుమారుడు విశ్వక్రాణాను తీసుకొని రుద్రవరం నుంచి ఏపీ 40 కేవీ 0071 నంబర్గల బైక్పై బయలుదేరాడు. జూపాడుబంగ్లా సమీపంలో కేసీ కాల్వ బ్రిడ్జి దాటి పోలీసుస్టేషన్ సమీపిస్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డుమధ్యనున్న డివైడర్ను ఢీకొట్టింది. రాజేష్, కుమారుడు విశ్వక్రాణా ఎగిరి డివైడర్పై పడటంతో తలలు నరుక్కపోయాయి. వారు అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకొన్న నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం, జూపాడుబంగ్లా ఎస్ఐ మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. నెత్తుటి మడుగులో రోడ్డుపై పడిఉన్న మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య శీరిష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబుసభ్యులకు అప్పగించారు. మృతుడు నడిపిన బైక్ పెద్దగా డ్యామేజ్ కాకపోవటం, తండ్రి, కుమారుడు ఒకేలా మృతిచెంది ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
213 మంది విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం జరిగిన రెండు, 6వ సెమిస్టర్ పరీక్షల్లో 213 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గవ సెమిస్టర్కు 2,522 మందిలో 2,307 మంది హాజరయ్యారన్నారు. 6వ సెమిస్టర్కు 782 మందిలో 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో 4, చాగలమర్రి ఎస్వీ ఆర్ట్స్, కామర్స్ జూనియర్ కళాశాల కేంద్రంలో 3, ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కళాశాల కేంద్రంలో 2, కర్నూలు ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో 2, కర్నూలు డిగ్రీ కళాశాల, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేశామన్నారు. ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్ వద్ద మంగళవారం 20 క్యూసెక్కుల నీరు మాత్రమే పారుతోంది. బుధవారం నాటికి నీటి విడుదల పూర్తి గా నిలిచిపోనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాలకు ఈనెల 1వ తేదీ నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల చేపట్టడం తెలిసిందే. బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటనలో సవరణ కర్నూలు(అర్బన్): ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగుల) బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటనను సవరించినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టుల్లో బధిరుల కేటగిరికి సంబంధించి 55 శాతం, ఆపైన వికలత్వం ఉంటేనే అర్హులని ప్రకటన ఇచ్చామన్నారు. అయితే రెండు చెవుల్లో శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ 60 డీబీ నుంచి 70 డీబీ వరకు లోపం ఉన్న వ్యక్తులు మాత్రమే అర్హులన్నారు. ఈ కేటగిరికి చెందిన దివ్యాంగులు సవరణను గమనించాలని ఆమె పేర్కొన్నారు. పత్తి విత్తనాలకు హెచ్టీ పరీక్షలు కర్నూలు(అర్బన్): వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గోడౌన్లను తనిఖీ చేసి పత్తి విత్తనాలకు హెచ్టీ పరీక్షలను నిర్వహించారు. తనిఖీల్లో కమిషనరేట్ (గుంటూరు) ఏడీఏ డి.ప్రవీణ్, ఏఓ జి.మోహన్ కుమార్, కర్నూలు ఏడీఏ ఎన్.సాలురెడ్డి, ఆగ్రోనామిస్ట్ ఏడీఏ రాజశేఖర్, కల్లూరు మండల వ్యవసాయ అధికారి డి.విష్ణువర్దన్రెడ్డి పాల్గొన్నారు. కల్లూరు మండలం లక్ష్మిపురం గ్రామంలోని శ్రీరామ అగ్రిజెనెటిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్లో 14 హెచ్టీ పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే శ్రీరామ్ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్లో 20 పరీక్షలు నిర్వహించగా, అక్కడ కూడా 20 నెగిటివ్ వచ్చాయన్నారు. సహజ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్లో రికార్డ్సు అప్డేట్ చేయనందున రూ.62,29,914 విలువైన పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశామన్నారు. క్వింటా వేరుశనగ రూ.6,860 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 186 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా క్వింటా ధర రూ.6,860 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,690, మధ్యస్థ ధర రూ.6,136 పలికిందన్నారు. అదేవిధంగా ఆముదాలు 14 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,570, మధ్యస్థ ధర రూ.5,772, గరిష్ట ధర రూ.5,880 పలికిందన్నారు. మొక్కజొన్న 10 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.1,400లతో వ్యాపారులు కొనుగోలు చేశారు. -
వెండి గంట వితరణ
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు వెండి గంటను విరాళంగా అందించినట్లు ఈఓ రామక్రిష్ణ తెలిపారు. వివరాల మేరకు.. వెలుగోడు మండలం పలస రాము, ప్రత్యూష దంపతులు తమ ఇలవేల్పు స్వామి వారికి 30 తులాల వెండితో తయారు చేసిన గంటలను అందించినట్లు తెలిపారు. గంట విలువ రూ.72 వేలు ఉంటుందని వెల్లడించా రు. దాతల కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు. ఆలయ అర్చకులు నారాయణస్వామి, తదితరులు ఉన్నారు. డోన్ రూరల్: పట్టణ సమీపంలోని రైలు పట్టాల వద్ద సుమారు 70 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం డోన్–దొరపల్లె మధ్య, డోన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ట్రాక్కు పక్కన 10 మీటర్ల దూరంలో మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నలుపు రంగు ష్టర్ ధరించి, 5‘5‘ అడుగుల ఎత్తు, నలుపు వర్ణం, తల, గడ్డంపై అంగుళం మేర తెల్లటి వెంట్రుకలు ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75608 శ్రీనాథ్ రెడ్డి రైల్వే సీఐ, కర్నూల్ లేదా 92475 75610 బిందుమాధవి రైల్వే ఎస్ఐ, డోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బనగానపల్లె: మండలంలోని నందివర్గం పోలీ సు స్టేషన్ పరిధిలోని నందవరం గ్రామానికి చెందిన షేక్ మహాబూబ్ హుస్సేన్ (32) సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ భూపాలుడు మంగళవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. షేక్ మహబూబ్ హుస్సేన్ బనగానపల్లెలోని భారత్ గ్యాస్లో పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటి నుంచి బైక్పై బనగానపల్లెకు వెళుతుండగా బైక్ అదుపు తప్పడంలో తీవ్రగాయాలపాలై ఆపస్మారక స్థితిలో రహదారి పక్కలో పడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం ఎవరూ గుర్తించలే దు. దీనికి తోడు ఎండ తీవ్రత అధికం కావడంతో అక్కడిక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బన గానపల్లె ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కర్ణాటకలో హొళగుంద వాసి హత్య హొళగుంద: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఈ నెల మొదటి వారం నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై హొళగుంద పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదైనటు్ల్ సమాచారం. ఈ స్థితిలో సోమవారం కంప్లీ తాలూకా సమీపంలోని దరోజి అనే ప్రాంతం వద్ద నిర్మానుష్య ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో పడి ఉన్న తీరును బట్టి దాదాపు 20 రోజుల క్రితమే హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హొళగుంద పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం. -
న్యాక్ ర్యాంకింగ్ సాధనకు కృషి చేయాలి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీకి మెరుగైన న్యాక్ ర్యాంకింగ్ సాధించేలా కృషి చేయా లని వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఉద్యోగులకు సూచించారు. వర్సిటీ సెనేట్ హాల్లో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో న్యాక్ ర్యాంకింగ్ సాధనకు సంబంధించి గత రెండు రోజులుగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో వీసీ పాల్గొని దిశానిర్దేశం చేశా రు.వర్సిటీ అభివృద్ధి, వసతులు, నైపుణ్యాభివృద్ధి కా ర్యక్రమాలు, అధ్యాపకుల శిక్షణ, వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు, తదితర అంశాలపై సమగ్రంగా నివేదికలు తయారు చేయాలన్నారు. ప్రొఫెసర్ పాల్ క్లీ, ప్రొఫెసర్ రవిచందన్ కంచర్ల న్యాక్ కమిటీల రూపకల్పన గురించి వివరించారు. రెక్టార్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, ప్రిన్సిపాళ్లు సి.విశ్వనాథ రెడ్డి, సుందరానంద పుచ్చ, అకడమిక్ అఫైర్స్ డీన్ సీవీ కృష్ణారెడ్డి, ఎగ్జామినేషన్స్ డీన్ ఎన్.నరసింహులు, ఐక్యూఏసీ డైరెక్టర్ భరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
భూ రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సిరి ఓర్వకల్లు: ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని, సర్వేకు ముందు ప్రతి రైతుకు నోటీసులు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ విడత రీసర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న రీ సర్వేను పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. రీ సర్వే ప్రక్రియలో పొలం సరిహద్దుల నిర్ధా రణ, భూముల రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలన్నారు. వేసవికాలంలో భూములను ఖాళీగా ఉంచకుండా పీఎండీఎస్ పద్ధతిలో వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
తడికెల షెడ్డు తప్ప నీరేదీ?
ఆలూరు: వేసవిలో తాగునీటి కోసం ప్రజలు, ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో మేజర్, మైనర్ పంచాయతీలలో, ప్రధాన కూడళ్లలో, కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో కనీసం 6 చలివేంద్రాలకు తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో పచ్చ తోరణాలు కట్టి వాటిని ప్రారంభించారు కానీ తర్వాత వాటి నిర్వహణ మరిచారు. చలివేంద్రాల్లో నీరు అందుబాటులో ఉంచకపోవడంతో పని మీద బయటికి వచ్చిన వారు దాహార్తి తీర్చుకునేందుకు హోటళ్లు, కూల్డ్రింక్స్ షాపుల్లో నీటిని కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో ఎల్లార్తి రోడ్డు సమీపంలో మర్రితాత మఠం వద్ద తడికెలతో షెడ్డు వేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు కానీ నీటి కుండలను ఉంచడం మరిచారు. దూరం నుంచి చలివేంద్రాన్ని చూసి గొంతు తడుపుకుందామని వెళ్లిన వారు అక్కడ నీరు లేకపోవడంతో దాహార్తితో నిరాశగా అలాగే వెనుదిరుగుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత పొలంలో పైపుల దగ్ధం
కోవెలకుంట్ల: మండలంలోని కంపమల్లకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సోముల వెంకటేశ్వరరెడ్డి పొలంలో సాగునీటిని మళ్లించే పైపులు మంగళవారం మంటల్లో కాలిపోయాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చిన్న సుబ్బారెడ్డి పొలంలో మొక్కజొన్న కోత పనులు పూర్తి కాగా మిగిలిన వ్యర్థాలకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న వెంకటేశ్వరెడ్డి పొలం వైపు వ్యాపించాయి. పొలం గట్టున ఉంచిన పైపులు మంటల్లో కాలిపోయాయి. పక్కనే కోత దశలో ఉన్న వరి, కొర్ర పంటలవైపు మంటలు వ్యాప్తి చెందే సమయంలో పసిగట్టి హుటాహుటినా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. లేని పక్షంలో చేతికందే పైర్లు మంటల్లో కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లేదని రైతు వాపోయారు. రాజకీయ కక్షతోనే టీడీపీ నేత ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బాల్య వివాహాల నివారణ కమిటీల బలోపేతం
కర్నూలు (అర్బన్): జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు క్షేత్రస్థాయి కమిటీలను బలోపేతం చేయాలని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి.శారద సూచించారు. ఆమె మంగళవారం నగర శివారులోని బి.తాండ్రపాడు డీఆర్డీఏ శిక్షణ కేంద్రంలో బాల్య వివాహాల నివారణపై పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. యువతికి 18 సంవత్సరాలు, యువకుడికి 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు కమిటీలు శ్రద్ధ చూపాలన్నారు. బాల్య వివాహాల వల్ల అనేక రకాల అనర్థాలు, ఇబ్బందులు, శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. చిన్న వయసులో వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహ నిషేధ అధికారులైన పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, మహిళా పోలీసులు తమ పరిధిలో బాల్య వివాహాల నిర్మూలనకు కచ్చితంగా జీఓ నంబర్ 31 ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో అర్బన్, సెమీ అర్బన్ పిల్లలు, గ్రామస్థాయిలో తల్లిదండ్రులు చదివించుకోలేని స్థితిలో ఉన్న బాలల వివరాలను తమ దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిని సీడబ్ల్యూసీ ముందు హాజరుపరచి వారికి విద్య, వసతి, పునరావాసం కల్పించేందుకు జిల్లాలోని పత్తికొండ, పెద్దపాడులోని బాలసదన్లో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ హ్యుమనైజేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.ఉమ మాట్లాడుతూ.. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల పుట్టబోయే పిల్లలు అనారోగ్యం, తక్కువ బరువు, అంగ వైకల్యంతో పుడతారన్నారు. కొన్ని సందర్భాల్లో మాతృ, శిశు మరణాలు కూడా సంభవించే ప్రమాదాలు ఉంటాయన్నారు. దిశ సీఐ మస్తాన్ వలి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆపదలో ఉన్న సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
నృత్యం.. నవరసభరితం
● నృత్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువతీ యువకులు ● నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవంకర్నూలు కల్చరల్: నృత్యం కేవలం శరీర కదలిక మాత్రమే కాదు.. భావాల వ్యక్తీకరణ.. సంస్కృతుల కలయిక.. శాసీ్త్రయ నృత్య రీతులు భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలు. నవరసాల్లో ఒదిగిన ఈ నాట్య కళ మనిషి సర్వోతముఖ వికాసానికి సాధనం. ఈ కళ సాధనతో ఏకాగ్రత, ఆత్మస్థైర్యం, పట్టుదల, జ్ఞాపక ఽశక్తి పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. నృత్యకారుడు జీన్ జార్జెస్ నొవెర్రి జన్మదినం ఏప్రిల్ 29 సందర్భంగా ఏటా ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. సర్వ సంపన్నం.. నాట్య కళ మనసులోని భావాలను వెల్లడించేందుకు ప్రదర్శనా రూపంగా ఎంచుకున్న కళ నృత్యం. హావభావాలకు లయ, సంగీతం జోడించి మరింత ఆహ్లాదంగా కంటికింపు కలిగేలా నృత్యాన్ని సృష్టించారు పూర్వీకులు. సామాజిక దృక్పథాన్ని, పురాణ ఇతిహాసాలను మంచి చెడులను ప్రచారం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నృత్య కళాకారులు, నృత్య శిక్షకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ జిల్లాకు గుర్తింపు తెస్తున్నారు. ఆధునిక నృత్య రీతులు అదుర్స్ శాసీ్త్రయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడితో పాటు ఆధునికమైన అనేక నృత్యరీతులు ప్రచారంలోకి వచ్చాయి. బెల్లీ, గంగ్నమ్, సల్సా, జుంబా, ట్వెర్కింగ్, సాంబా, మాంబో వంటి ఆధునిక నృత్య రీతులకు చిన్నారులు, కుర్రకారు దాసోహం అంటున్నారు. జిగేల్ మనే నియాన్ దీపాల వెలుగులు, లౌడ్ స్పీకర్లకే చిల్లులు పడతాయా అన్నట్లుగా హోరెత్తే శబ్దాలు, లోకాన్ని మరిచిపోయి డీజేలు సృష్టిస్తున్న సంగీత హోరులో యువతరంగాలు ఊగిపోతున్నారు. శిక్షణా సంస్థలకు డిమాండ్ జిల్లాలో నృత్య శిక్షణ కేంద్రాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం, సాయంకాలం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత, నృత్య కళాశాల రాయలసీమలోనే ఏకై క శిక్షణ కేంద్రం. ఇక్కడ సంగీతంతో పాటు శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళాశాలలో వివిధ జిల్లాల విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం, కోడుమూరు ఇలా అన్ని పట్టణాల్లో నృత్య శిక్షణ కేంద్రాలు వెలిశాయి. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో కూడా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. శాసీ్త్రయ నృత్యంతో పాటు ఆఽధునిక, పాశ్చాత్య నృత్య రీతులకు అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. సరదాగా నేర్చుకునే వారు ఆధునిక రీతులపైనే ఆసక్తి చూపుతున్నారు. టీవీ గేమ్ షోల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే ఎక్కువ మంది స్వల్ప కాలిక కోర్సుల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. పెరుగుతున్న ఆసక్తి నృత్యం కొందరికి సర్వస్వం. మరికొందరికి జీవనోపాధి. ఇంకొందరికి సరదా. మొత్తం మీద సంప్రదాయ నృత్య కళలకు ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అదే సమయంలో ఆధునిక నృత్యాలపై ఆసక్తి పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెరుగుతున్న నృత్య శిక్షణ కేంద్రాలే దీనికి నిదర్శనం. ఆసక్తిగా నేర్చుకుంటున్న వారి లో చిన్న పిల్లలు, యువత, ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యోగులు, గృహిణులు సైతం ఉత్సాహంగా నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. గేమ్స్ షోల ప్రభావంతో నృత్యం నేర్చుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వీరిలో ఆధిక శాతం స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నృత్య శిక్షణ కేంద్రాల వివరాలు ఉమ్మడి జిల్లాలో నృత్య శిక్షణ కేంద్రాలు: సుమారు 200 కర్నూలు నగరంలో..: 25 కోర్సుల వివరాలు: ప్రభుత్వ నృత్య కళాశాలలో: 4 ఏళ్ల సర్టిఫికెట్ కోర్సు 2 ఏళ్ల డిప్లొమా కోర్సు ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో: సంప్రదాయ నృత్యం : ఏడాది కోర్సు పాశ్చాత్య నృత్యం: 3 నెలలు -
శ్రీశైల క్షేత్రంలో కియోస్క్ మిషన్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆమర మంగళవారం ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి లడ్డూప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్లను ప్రారంభించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి పూజాధికాలను జరిపి మిషన్లను ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు దర్శనాలు, ప్రసాదాలు, కేశఖండన టికెట్లు పొందవచ్చని, దేవస్థాన వివిధ పథకాలకు విరాళాలు అందించవచ్చన్నారు. సీఆర్వో ఆఫీసు, మల్లికార్జున సదన్, గంగా సదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం, గంగాధర మండపం వద్ద మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరూర్ వైశ్య బ్యాంకు వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మిషన్లను దేవస్థానానికి విరాళంగా అందించినట్లు వెల్లడించారు. -
ఘనంగా ఖాదర్లింగ స్వామి ఉరుసు
కౌతాళం: మతసామ ర స్యానికి ప్రతీకగా కౌతాళంలో వెలసిన జగద్గురు ఖా దర్లింగ స్వామి 322వ ఉరుసు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ప్రత్యేక ఫాతేహా ల అనంతరం స్వామి సమాధిని సుగంధ ద్రవ్య లు, పానీయాల తో శుభ్రం చేశారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్బాష చిష్తీ, వారి శిష్యరిక బృందం స్వామివారి సమాధిని శుభ్రం చేశారు. ప్రత్యేకంగా తెచ్చిన చద్దర్ను స్వామి సమాధిపై వేసి పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహాలు నిర్వహించి నగార వాయించారు. ఖాదర్లింగస్వామి శిష్యులు, గ్రామ ప్రముఖులు, వే లాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని ధర్మకర్త తెలిపారు. గుల్షన్ కమిటీ అధ్యక్షుడు మున్నపాషా తదితరులు పాల్గొన్నా రు. ఉరుసు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేడు గంధం కార్యక్రమం, గురువారం ఉరుసు ఉత్సవం ఉంటుందని ధర్మకర్త తెలిపారు. బాలిక అదృశ్యం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం గ్రా మానికి చెందిన షేక్నూర్ బాషా, షేక్ యాస్మీన్ల కూమార్తె షేక్ సమీనా (17) సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి కనుబడుటలేదని ఎస్ విజయ్కుమార్ తెలిపారు. ఆయన తెలి పిన వివరాల మేరకు.. షేక్ నూర్ బాషాకు ఇద్దరు కుమారులు, ఇద్దరూ కుమార్తెలు సంతానం. వీరు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె షేక్ సమీనా (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల వచ్చిన రిజల్ట్స్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అ య్యింది. కాగా,కూతురు ఎక్కువగా ట్యాబ్ చూస్తుండటంతో తల్లి మందలించినది.దీంతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోంది. తిరిగి ఇంటికి రాలేదని,ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
దాహం.. దాహం
కౌతాళం: వేసవిలో గ్రామాల ప్రజల గొంతులెండుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండల పరిధిలోని ఎరిగేరి గ్రామంలో ప్రజలు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. జంగాల కాలనీకి వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండడంతో నీటి కోసం యుద్ధం తప్పడం లేదని స్థానికులు మారెమ్మ, జంబులమ్మ, లక్ష్మి, మూకన్న, రాములమ్మ, జంబమ్మ తదితరులు తెలిపారు. జంగాల కాలనీ ఆదోని రోడ్డులో గ్రామం చివరన ఉందని, ఈ కాలనీకే నీటి కష్టాలు అధికంగా ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, గ్రామ నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వారానికోసారి మాత్రమే నీరు వస్తాయని, నాలుగు బిందెలు కూడా దొరకడం లేదని, గంట సేపు మాత్రమే నీరు వదిలితే అందరికీ ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. తాగునీరు లేక ఫిల్టర్బెడ్ వద్ద నుంచి నీరు తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోపారు. ఉన్నతాధికారులు స్పందించి కాలనీకి తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలలో చిరుతల సంచారం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. కళాశాలకు సెలవులు వచ్చి విద్యార్ధులు హాస్టళ్లలో లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం రాత్రి సమయంలో రెండు చిరుతలు ఒకదాని వెంట మరొకటి రావడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించి భయభ్రాంతులకు గురయ్యాడు. చిరుతల తరువాత ప్రాంగణంలోకి పెద్దపులి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. సీసీ ఫుటేజీలో దృశ్యాలను గమనించారు. అలాగే ఆ ప్రాంతంలో వాటి పాదముద్రలు సేకరించారు. కళా శాల ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో చిరుతలు కళాశాల ప్రాంగణంలోకి వచ్చాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ప్రజలు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర
కర్నూలు(టౌన్): పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు రోడ్డెక్కుతుంటే టీడీపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రభుత్వం నిర్వహించే పెట్రోల్ బంకు, అలాగే పాతబస్టాండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పెట్రోలు బంకులు మూతపడ్డాయన్నారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పెట్రోలు, డీజీల్ సంక్షోభంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాతబస్టాండ్ వద్దకు ఖాళీ డీజిల్ డ్రమ్ములతో తరలివచ్చారు. ప్రజల ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తెలియజేసేందుకు కారును తోసుకుంటూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ తెలంగాణలో పెట్రోలు, డీజిల్ సమస్య లేదని, మన రాష్ట్రంలో మాత్రం అర్ధరాత్రి వరకు బంకుల వద్ద వినియోగదారులు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. డీజిల్ దొరక్క రైతులు వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. విజనరీ ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు హయాంలో ప్రజలకు అడుగడుగునా సమస్యలేనన్నారు. ఏపీలోనే ఎందుకు ఈ పరిస్థితి అని తెలుసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కూటమి నాయకులు డీలర్లతో కుమ్మకై డ్రమ్ములతో డీజిల్ తరలించి రైతులకు లీటర్పై రూ.10 అధిక ధరతో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వారం రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం విహారయాత్రలు, సింగపూర్ అంటూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా చంద్రబాబు సంక్షోభాన్ని నివారించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రమైన కరోనా సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగించాడన్నారు. పార్టీ నేతలు షరీఫ్, గడ్డం రామకృష్ణ, నరసింహులు యాదవ్, తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, రామాంజనేయులు, మాజీ కార్పొరేటర్లు క్రిష్ణకాంత్ రెడ్డి, షేక్ అహమ్మద్, షేక్ యూనుస్ బాషా, బబ్లూ, గోల్డ్ శ్రీను, కటారు కోండ సాయికుమార్, మహిళా నేతలు భారతి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాలయంలో కర్ణాటక వాసి మృతి
మంత్రాలయం రూరల్ : మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకు సమీపంలో కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా, కాకారగొల్ల తాలూకా, కె.కొడిహాళ్ళి గ్రామాని చెందిన హాలేశి (49) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. మృతుని దగ్గర ఉన్న నెంబర్ సహాయంతో కుటుంబ సభ్యులకు ఎస్ఐ సమాచారం అందించారు. అదే విధంగా మాజీ సర్పంచ్ తెల్ల బండ్ల భీమయ్యకు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శ్రీమఠం ఆసుపత్రి అంబులెన్స్లో తరలించి పంచాయతీ ఫ్రిజర్ బాక్సులో ఉంచే ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు వచ్చాక వారికి అందజేస్తామని తెలిపారు. -
● పట్టుబడిన మద్యాన్ని అమ్మేసిన ఎక్సైజ్ పోలీసులు ● వాహనాల తనిఖీల్లో వెలుగులోకి ● 379 క్వాటర్ బాటిళ్లు, కారు స్వాధీనం ● కేసు నుంచి అధికారులను తప్పించేందుకు రంగంలోకి టీడీపీ నేతలు
డోన్: మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులే కాసులకు కక్కుర్తి పడ్డారు. పట్టుబడిన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మూడో కంట పడకుండా సరుకు ఊరు దాటించాలనుకుని చివరకు పోలీసులకు చిక్కడంతో కిక్కు దిగి దిక్కులు చూస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారు. ఈనెల 26వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చాకిరేవుమిట్ట వద్ద డోన్ అర్బన్ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్కుమార్ రెడ్డి వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టుబడింది. అయితే పోలీసుల విచారణలో అందరూ అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న 379 కర్ణాటక మద్యం సీసాలు ఒక కేసులో ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేసినవిగా గుర్తించారు. కారులో ఉన్న ప్యాపిలి మండలం పీఆర్ పల్లెకు చెందిన సోమనాథ్ను పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ నుంచి కర్ణాటక మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలిపాడు. స్వయంగా ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ మద్యాన్ని కొనుగోలు చేసిన అనంతరం స్వగ్రామానికి కారులో తరలిస్తున్నట్లు అంగీకరించడంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే సమాచారం ఉన్నతాధికారులకు చేరడంతో విచారణ వేగవంతం చేశారు. ఎకై ్సజ్ అధికారుల తీరు వివాదాస్పదం.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎకై ్సజ్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మద్యం షాపుల ఏర్పాటులో వివక్ష చూపడం, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్న వాటిని కూడా మామూళ్లకు కక్కుర్తిపడి పట్టణంలో ఏర్పాటు చేయించడం చర్చనీయాంశమైంది. గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను కూడా పట్టణంలోనే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏర్పాటు చేయించడం కూడా వివాదాస్పదంగా మారింది. నెలనెలా మామూ ళ్లు దండుకుంటూ ఎమ్మెల్యే కోట్ల వర్గానికి వంత పాడుతూ తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అధికార పార్టీ అసమ్మతి నేత, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు బాహాటంగానే ఆరోపణలు చేసిన సంగతి విధితమే. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు ఒక్కో బెల్టుషాపునకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి గ్రామంలో 3 నుంచి 10 బెల్టుషాపుల వరకు ఏర్పాటు చేయించారు. ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం తరలిస్తూ డోన్ అర్బన్ పోలీసులకు పట్టుపడిన కారు ఉన్నతాధికారులను తప్పించే యత్నం.. సీజ్ చేసిన కర్ణాటక మద్యం ఎకై ్సజ్ స్టేషన్ నుంచి బయటకు ఎలా వచ్చింది, ఎవరి పాత్ర ఉంది అనే విషయా లపై లోతుగా విచారణ చేస్తున్నాం. నిందితుడు ఎకై ్సజ్ ఉన్నతాధికారులపై చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంద నేది విచారణలో బహిర్గతం కానుంది. దోషులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. – శ్రీనివాసులు, డీఎస్పీ, డోన్ డోన్ ఎకై ్సజ్ సీఐ వరలక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నా ం. ఆ మేరకు ఆమెను సరెండర్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర ఉందని తేలితే చర్యలు తప్పవు. – రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, నంద్యాల జిల్లా సివిల్, ఎకై ్సజ్ ఉన్నతాధికారుల విచారణలో నిజనిజాలు వెల్లడవుతాయని గట్టిగా విశ్వసిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించేందుకే కొందరు కుట్రపన్నారనిపిస్తోంది. వాస్తవాలు విచారణలో వెల్లడి అయ్యేంత వరకు మాట్లాడటం భావ్యం కాదు. – వరలక్ష్మి, ఎకై ్సజ్ సీఐ, డోన్ -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇంధన కొరత
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి: రాష్ట్రంలో ఇంధన కొరతకు పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారన్నారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పెట్రోల్ బంకులు మూతపడితే ప్రజల ఆందోళన వల్లే ఇంధన కొరత ఏర్పడిందని మంత్రి నాదెండ్ల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా ఆయిల్ దిగుమతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. పెట్రోలు, డీజిల్ కొరతతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. విలేకరుల సమావేశంలో బుసినే చంద్రశేఖర్ శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుంతు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఇద్దరికి గాయాలుఆస్పరి: రోడ్డు ప్రమాదంలో సతీష్ (28) అనే యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిన్నహోతూరు గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆస్పరి సీఐ శ్రీనివాసుల నాయక్ తెలిపిన వివరాలు మేరకు.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్కు చెందిన డ్రైవర్ శ్రీనికేత్తో పాటు సతీష్, సాయకృప అనే యువకులు బళ్లారిలో ఒక శుభకార్యానికి డెకరేషన్ వేసేందుకు వెళ్లారు. పని ముగించుకుని మినీ ట్రాలీ వాహనంలో బళ్లారి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని చిన్నహోతూరు గ్రామ సమీపంలో వెనుక నుంచి మినీ ట్రాలీ వాహనం ఢీకొట్టింది. అందులో ఉన్న సతీష్ అక్కడికక్కడే మృతి చెండారు. డ్రైవర్ శ్రీనికేత్, సాయి కృప అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కు
● అందుకే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ● ప్రజల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన కాటసాని కల్లూరు: డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం మొదలైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంకును స్వయంగా కాటసాని పరిశీలించారు. అక్కడ వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత ఉందన్నారు. మూడు రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కనీసం చలనం లేదన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రమంత్రిని సంప్రదిస్తే, ఎక్కడా సరఫరాలో లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారన్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. 70 శాతం బంకుల్లో నోస్టాక్ బోర్డులా? నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని ప్రచారం జరుగుతుండడంతో డీలర్లు స్టాక్ ఉంచేస్తున్నారని కాటసాని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారన్నారు. రాష్ట్రంలో 4,510 బంక్లు ఉండగా 70 శాతం బంకులు నోస్టాక్ బోర్డు పెట్టారన్నారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు. సరఫరాలో సంక్షోభం లేదన్నారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే ఈ పరిస్థితి ఉందంటే ఇందులో కచ్చితంగా ప్రభుత్వం, డీలర్లు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. కాటసాని వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఉలిందకొండ రమణారెడ్డి, సుంకన్న తదితరులు ఉన్నారు. -
మలేరియా అంతమయ్యిందా?
● ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదుకాని ఒక్క కేసూ ● అయినా పెరుగుతున్న రక్తపరీక్షలుకర్నూలు(హాస్పిటల్): జ్వరమా అయితే మలేరియా కావచ్చు..వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోండి. ఇది ఒకప్పటి ప్రభుత్వ నినాదం. మలేరియా కేసులు విస్తృతంగా ఉన్న సమయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మలేరియా విభాగం సిబ్బంది రక్తపరీక్షలు అధికంగా చేశారు. కానీ ఇప్పుడు మలేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నారు. అయితే జ్వరాల కేసులు పెరగడం, అదే స్థాయిలో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించడంపై అనుమానాలు ఉన్నాయి. మలేరియా కేసులు మాత్రం బయటపడకపోవడం చర్చనీయాంశమైంది. పెరుగుతున్న రక్తపరీక్షలు జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 అర్బన్హెల్త్ సెంటర్లు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. వీటన్నింటిలో మలేరియా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రక్తపరీక్షల సంఖ్య పెరుగుతున్నా కేసులు మాత్రం నమోదు కావడం లేదు. రోగుల్లో మలేరియా లక్షణాలు కనిపిస్తున్నా కాదని సిబ్బంది తేల్చేస్తున్నారు. రోగికి వచ్చింది వైరల్ జ్వరాలని చెప్పి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరం పది కేసులు నమోదు కాగా ఈ యేడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంవత్సరం రక్తపరీక్షలు మలేరియా కేసులు 2018 2,36,704 18 2019 2,49,187 7 2020 1,93,586 14 2021 2,56,395 16 2022 3,16,178 6 2023 4,18,850 4 2024 4,86,151 17 2025 7,06,836 10 2026 3,18,538 0 (ఇప్పటివరకు) -
న్యాయ సేవల వాహనంతో హక్కులపై చైతన్యం
కర్నూలు: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవల వాహనాన్ని ప్రారంభించారు. ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్యం కలిగించడం కోసం ఏపీ స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్యాట్రన్ ఇన్ చీఫ్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రతి జిల్లాకు న్యాయ సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగించే సాధనంగా ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి మారుమూల ప్రాంతాల్లో బలహీన వర్గాలకు న్యాయాన్ని ఈ వాహనం చేరువ చేస్తుందన్నారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, న్యాయవాదులు, ట్రైనీ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే మేలు
మలేరియాను ప్రారంభదశలో గుర్తించి చికిత్స అందిస్తే మేలు. నిర్లక్ష్యం చేస్తే అది ప్లీహము, కిడ్నీ, కాలేయం, మెదడు, రక్తకణాలను దెబ్బతీసి ప్రాణాంతకం చేస్తుంది. తీవ్ర తలనొప్పి, తీవ్ర చలిజ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. మలేరియా వ్యాధి నిర్ధారణ కాకపోయినా లక్షణాలు అవే ఉంటే అందుకు అనుగుణంగా చికిత్స అందించి ఇతర అవయవాలు దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంది. –డాక్టర్ ఎం.మహేశ్వరరెడ్డి, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదుకు ఆదేశించండి
● అడిషనల్ ఎస్పీకి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే వినతికర్నూలు: పత్రికా స్వేచ్ఛ పేరుతో వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఆదేశించాలని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వినతి వినతిపత్రం ఇచ్చారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తన అనుచరులతో సోమవారం ఆమె కర్నూలులోని డీపీఓకు వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కార్యాలయంలో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాను కలసి వినతిపత్రం సమర్పించారు. మహిళలపై నీచపు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పత్తికొండ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పత్తికొండ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాధాకృష్ణ అరాచకానికి చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇదేమిటని ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు గ్రహణం పట్టిందని విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా ఉండాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. -
ఇద్దరు మహిళా దొంగలు అరెస్ట్
బొమ్మలసత్రం: రైలులో ప్రయాణికులకు మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించే ఇద్దరు మహిళా దొంగలను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ కుమారి తెలిపిన వివరాల మేరకు.. నందివర్గం గ్రామానికి చెందిన మనీష కుటుంబీకులతో ఆదివారం రాత్రి తిరుపతి నుంచి బయలుదేరిన రైలులో బనగానపల్లె చేరుకున్నారు. రైలు దిగిన తర్వాత 15 గ్రామాలు బంగారు చైన్ ఉన్న బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యూపీ రాష్టానికి చెందిన కుసమ్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కిరణ్ దేవీలను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారు చైన్ చోరీ వెలుగులోకి వచ్చింది. చైన్ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు. బ్లాస్టింగ్ చేస్తూ బిహార్ వాసి దుర్మరణం ఓర్వకల్లు: బ్లాస్టింగ్ నిర్మాణ పనుల్లో భారీ పేలుడు సంభవించడంతో ఓ బిహార్ వాసి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం ఓర్వకల్లు వద్ద కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్లితే.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ప్రాంతంలో స్థాపిస్తున్న పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా నిమిత్తం ఏపీఐఐసీ వారు పైపులైను నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం జైరాజ్ స్టీల్ ప్లాంట్ సమీపంలో ఓపెన్ బ్లాస్టింగ్ విధానంలో బండరాళ్లను పగులగొట్టి కాల్వను తవ్వుతున్నారు. సోమవారం బ్లాస్టింగ్కు విద్యుత్ తీగలను అమర్చుతున్న సమయంలో ఒక్కసారిగా విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న బిహార్కు చెందిన పురేంధర్ ఠాగూరు (60) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిప్తున్నట్లు తెలిపారు. పేలుడుకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. తహసీల్దార్ రామనాథరెడ్డి మృతి నంద్యాల(న్యూటౌన్): సత్యసాయి జిల్లా ఎం.గూడూరు మండల తహసీల్దార్ రామనాథరెడ్డి సోమవారం నంద్యాల పట్టణంలో ఎన్జీఓ కాలనీ ఆయన నివాస గృహంలో మృతి చెందారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల డీటీగా, ఆర్ఐగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై సత్యసాయి జిల్లా గూడూరు తహసీల్దార్గా మూడేళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో సెలవుపై నంద్యాలకు వచ్చిన ఆయన కోలుకోలేక మృతి చెందాడు. రెవెన్యూ ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన పార్థీవ దేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనుమానాస్పదంగా యువకుడి మృతి రుద్రవరం: నర్సాపురం గ్రామానికి చెందిన జయన్న(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పెద్దరాముడు, మరియమ్మ ఏకై క కుమారుడు జయన్న వ్యవసాయకూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని చర్చి వెనుక భాగంలోనే వారి కుటుంబం ఉండటంతో రాత్రి సమయాల్లో చర్చి ప్రాంగణం, పైభాగంలో నిద్రించేవాడు. ఇందులో భాగంగా ఈ నెల 23 గురువారం రాత్రి భోజనానంతరం చర్చి పైభాగాన నిద్రించిన ఆ యువకుడు శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో కింద పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నట్లు ఎస్ఐ జయప్ప తెలిపారు. టీడీపీ కార్యకర్తలకే ‘ఉపాధి’ పనులు చాగలమర్రి: మండలంలోని శెట్టివీడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలకే ఉపాధి పనులు ఇస్తున్నారని గ్రామానికి చెందిన తలారి నరసింహుడు ఆరోపించారు. గ్రామానికి చెందిన కూలీలు సోమవారం పనికి వెళ్లి హాజరు వేయాలని ఫీల్డ్ అసిస్టెంట్కు ఫోన్ చేయగా ఆమె భర్త టీడీపీ నాయకుడు బాషా మాట్లాడారన్నారు. ‘మీకు ఉపాధి హామీ పని లేదు.. హాజరు లేదు.. మస్టర్లు లేవు.. ఇది మా ప్రభుత్వం.. మేం చెప్పినట్లు వినాల్సిందే.. ఎవరికై నా వెళ్ళి చెప్పుకోండి’ అని ఫోన్ కట్ చేశాడన్నారు. ఈ విషయాన్ని పంచాయితీ కార్యదర్శి, ఈసీ, టీఏలకు తెలిపినా వారు అలాగే సమాధానం ఇచ్చారన్నారు. టీడీపీ నాయకుల అండదండలతో గ్రామంలో లేని వారి పేరు మీద జాబ్కార్డులు పొంది, హాజరు నమోదు చేసుకొని డబ్బులు దండుకుంటన్నారని ఆయన ఆరోపించారు. -
ఉన్నత శిఖరానికి చేరువై..
● ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరిన దివ్యాంగురాలు మధు తనూజ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న దివ్యాంగురాలు మధు తనూజ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని అరుదైన ఘనత సాధించింది. వికలాంగుల జిల్లా స్థాయి పోటీల్లో 200 మంది పాల్గొనగా అందులో 20 మంది ఎంపికయ్యారు. ఆ 20 మందిలో బేతంచెర్ల మండలం నుంచి మధు తనూజ ఒక్కరే ఎంపికయ్యారు. రన్నింగ్, షాట్పుట్, లాంగ్ జంప్ వంటి శారీరక ప్రతిభ ఆధారంగా ఎంపికై న విద్యార్థిని గండి కోటలో 45 రోజుల శిక్షణలో పాల్గొని అక్కడ నుంచి ఎంపికై న 15 మందిలో స్థానం సంపాందించింది. అనంతరం లడఖ్లో 15 రోజుల శిక్షణకు హాజరైంది. ఈనెల 15వ తేదీన బయలు దేరి 25 తేదీన తోటి బృందం సభ్యులతో కలిసి మధు తనూజ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకొని మరో మైలు రాయి సాధించింది. ఈ సందర్భంగా మధు తనూజను తల్లిదండ్రులు నాగేంద్ర, లక్ష్మీదేవి, జెడ్పీ హైస్కూలు హెచ్ఎం శేషాచలం, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేసి అభినందలు తెలిపారు. -
హత్యకేసు నిందితులను జిల్లా బహిష్కరణ చేయాలి
ఎదుర్కోల్లు నిర్వహిస్తున్న దృశ్యంకర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన వడ్డె మనోజ్కుమార్ (23)ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఎరుకలి వంశీ, అతని తల్లిదండ్రులు, బంధువులను జిల్లా బహిష్కరణ చేయాలని కర్నూలు జిల్లా వడ్డెరాజుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్బండ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వడ్డె మనోజ్కుమార్కు 45 రోజుల క్రితమే పెళ్లి అయ్యిందని, ఇంతలోనే అతన్ని హత్య చేయడంతో భార్య వెంకటేశ్వరి తీవ్ర దుఃఖంలో ఉండిపోయిందన్నారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మరోవైపు నిందితుల్లో వెంకటలక్ష్మీ వీఆర్వోగా, శ్రీరాములు లైన్మన్గా పనిచేస్తున్నారని, వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
పీజీఆర్ఎస్కు 121 ఫిర్యాదులు
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 121 ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం, భార్యాభర్తల తగాదాలు, పొలం గట్ల తగాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చారు. చట్టపరిధిలో విచారణ జరిపి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జడ్జిగా గిరిధర్ బాబు కర్నూలు (అర్బన్): నంద్యాల సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (రైల్వేస్)గా ఎస్.గిరిధర్ బాబును నియమించారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి వేసవి సెలవులు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎమ్ఈడీ, ఎమ్పీఈడీ, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 15వ తేదీన పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.4 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.4 లక్షల విరాళాలు అందించారు. సోమవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్కు చెందిన ఈశ్వర్ ప్రకాష్ వశిష్ట రూ.1,25,000 విరాళాన్ని, అలాగే నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎ.సతీష్కుమార్ రూ.1,10,116 విరాళాన్ని, హైదరాబాద్కు చెందిన ఆర్.చంద్రశేఖరరాజు రూ.1,00,116 విరాళాన్ని, కొండూరు ఆధ్య పేరు మీద రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్జైల్ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచిత లాయర్ను నియమించడం జరుగుతుందన్నారు. అనంతరం ఖైదీలకు డాక్టర్ ప్రవీణ్ వైద్య పరీక్షలు చేశారు. ఆయన వెంట సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య, సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసులు ఉన్నారు. శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం సహస్రదీపార్చన సేవ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. -
వేలం పాటలో తగ్గిన ఆదాయం
కౌతాళం: వేలం పాటల్లో కౌతాళం మేజర్ పంచాయతీ ఆదాయం తగ్గింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదాల అనంతరం సోమవారం ఎంపీడీఓ స్వర్ణలత ఆధ్వర్యంలో బండిమెట్ట వేలం పాట నిర్వహించారు. బొగటమ్మ రూ.8,15,000లకు పాటను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.11,75,000కు వేలం పోయింది. గతేడాదితో పోలిస్తే పంచాయతీకి సుమారు రూ.3.60 లక్షల ఆదాయం తగ్గింది. కాగా, ఈనెల 10వ తేదిన బండిమెట్టతో పాటు ఇతర వాటికి వేలం పాట నిర్వహించారు. బండిమెట్ట వేలం పాటను రూ.17,27,000 పోగా.. డబ్బులు వెంటనే కట్టలేదన్న సాకుతో కూటమి నేతలు వేలం పాటను వాయిదా వేయించారు. సోమవారం జరిగిన వేలం పాటలో బండిమెట్టను గతేడాది కన్న తక్కువ పాడి దిక్కంచుకోవడం విశేషం. కార్యక్రమంలో కార్యదర్శి యోగేశ్వరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సీఐ యుగంధర్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
కమనీయం.. అహోబిలేశుని కల్యాణం
ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తుండగా.. దేదీప్యమానమైన విద్యుద్దీపకాంతుల వెలుగులో వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహుడు, భూనీల మహాలక్ష్మీల పరిణయ వేడుక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో సోమవారం వైభవంగా జరిగింది. అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మూలమూర్తులను సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు భూనీలా సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచారు. అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలతో అలంకరించారు. శ్రీ సుదర్శన హోమం నిర్వహించి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. ముత్యాల తలంబ్రాల కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్, సీఏఓ పార్థసారథి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలకం
పాణ్యం: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం కీలకమని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేలచంద్ర జోసెఫ్జార్జ్ అన్నారు. సోమవారం పిన్నాపురంలో గ్రీన్కో సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తిలో ఈ ప్లాంట్ ప్రత్యేకమైనది, ప్రపంచలోనే అతి పెద్ద సమీకృత పునరుద్పాదక ప్రాజెక్టు అన్నారు. దేశంలోని ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఉత్పత్తి ఎంతో అవసరమన్నారు. ఒక విద్యుత్ ప్రాజెక్టు నెలక్పొడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో పాటు ఫారెస్ట్ శాఖ సహకారం కూడా అవసరమన్నారు. కర్ణాటక శరావతిలో 125 ఎకరాల్లో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నారు. గ్రీన్కో సంస్థ ఏపీతో పాటు రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పి దేభాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మంత్రి వెంట కర్ణాటక చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ చెర్మన్ రాజేగౌడ, అడిషినల్ సీఎస్ గౌరవ్గుప్తా, గ్రీన్కో ఎండీ చలమశేట్టి అనిల్మహేష్, గ్రీన్కో ప్రతినిధులు, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ శివశంకర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
12 మంది కూలీలకు గాయాలు
● పనుల కోసం బొలెరోలో గిద్దలూరు వెళ్తుండగా ప్రమాదంమహానంది: ఊర్లో పనులు లేక ప్రకాశం జిల్లాకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాహనం మాట్లాడుకుని పొద్దున్నే పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఈ క్రమంలో మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన సుమారు 20 మంది వ్యవసాయ కూలీలు గిద్దలూరు, కృష్ణంశెట్టిపల్లె గ్రామాల్లో పసుపు పంటల్లో పనులకు బయల్దేరారు. గిద్దలూరు మార్గంలోని చింతమాను టర్నింగ్ వద్ద బొలేరో అదుపు తప్పి కిందపడటంతో సుమారు 12 మందికి గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గాజులపల్లెకు చెందిన మరియమ్మ, సుంకమ్మ, విజయలక్ష్మీ, మహాలక్ష్మీ, సావిత్రి, పుష్పావతి, లక్ష్మీదేవి, పద్మావతి, మరియమ్మ, ఎలిశమ్మలతో పాటు మరికొంత మంది ఉదయం బొలేరో వాహనంలో బయల్దేరారు. చింతమాను టర్నింగ్ మలుపు వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో మహాలక్ష్మీ, జూటూరు సావిత్రి, పుష్పావతిలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు వివరాలు సేకరించారు. గాయపడిన వారందరిని స్థానికులు 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుంకమ్మ, విజయలక్ష్మీ -
ఉపాధి నిధుల దుర్వినియోగంపై నేడు వైఎస్సార్సీపీ ధర్నా
కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఈ నెల 27వ తేదీన (నేడు) కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పీఎన్ అస్లాం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మార్చిందన్నారు. ఉపాధి నిధులను టీడీపీ నేతలు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిలోని అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. మహిళల స్వయం సమృద్ధికి కృషి కర్నూలు(టౌన్): మహిళల స్వయం సమృద్ధి, సాధికారతకు కేడీఎస్ఎస్ఎస్ కృషి చేస్తోందని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ అన్నారు. ఆదివారం కర్నూలు శివారులోని కర్నూలు డయాసిస్ సాంఘిక సేవాసంస్థ (కేడీఎస్ఎస్ఎస్) ఆధ్వర్యంలో 70 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసఫ్ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా మహిళాభ్యుదయం కోసం భాగస్వాములవుతున్నామన్నారు. త్వరలోనే నూతన రంగాల్లో సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కెడీఎస్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.6,970 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 474 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.6,970 ధర పలికిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. క్వింటా కనిష్ట ధర రూ.4,170, మధ్యస్థ ధర రూ.6,147 వచ్చిందన్నారు. మొక్కజొన్న 17 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటాకు రూ.1,120 ధర లభించిందన్నారు. -
భక్తి.. సామరస్య దీప్తి
● రేపటి నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసుకౌతాళం: ఖాదర్లింగ స్వామి.. హిందు, ముస్లింల ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం కౌతాళంలో ఉరుసును వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం ప్రారంభమై మే 2వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణానికి చెందిన ఖాదర్లింగ స్వామి అమీనూద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించేందుకు కౌతాళానికి వచ్చారు. ఈయన లింగాన్ని ధరించడాన్ని గ్రామంలో ఉన్న కొందరు అభ్యంతరం చెప్పగా వారిలో ఇళ్ల నుంచి బావిలోకి వెళ్లిన లింగాలను తిరిగి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజిసున్తన్నారు. ఆయన గ్రామస్తులు ఇచ్చిన స్థలంలోనే సమాధి అయ్యారు. అక్కడే ఖాదర్లింగస్వామి దర్గా నిర్మించారు. భక్తుల సహకారంతో దర్గా ఆవరణలో 2023లో మసీద్ నిర్మాణం పూర్తి చేశారు. దర్గా గోపురం 60 అడుగులతో ఎంతో సుందరంగా ఉంది. దీని లోపలి భాగంలో నూతనంగా గ్లాస్ ఫిట్టింగ్తో వివిధ రంగులతో ప్రత్యేక హాదిసు ఆయాత్లు (ఉర్దూలో) గ్లాసుల్లో అమర్చారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సహకారించాలి. – సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, దర్గా ధర్మకర్త -
అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది
ఈ పథకాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నాటికి అసలు చెల్లిస్తే గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలోనే ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులు రూ.60 లక్షల వరకు చెల్లించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలవారీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. – కే తులసీదేవి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద లబ్దిపొందిన వారికి రికవరీ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా పథకాల కింద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలు జరగక, తీసుకున్న వాహనాలకు అద్దెలు లభించక అనేక మంది లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాయిదాలు సరైన సమయానికి చెల్లించలేక పోతున్నారు. ఈ రుణాలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలి. – కాసారపు వెంకటేష్, మాల సంఘాల జేఏసీ కన్వీనర్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ఇంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం తగదు. గతంలో ఎప్పుడు ఇలా వసూలు చేసింది లేదు. ఆయా పథకాల ద్వారా పెట్టుకున్న వ్యాపారాలు జరగక ఎస్సీ లబ్ధిదారులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. మానవతా ధృక్పథంతో ప్రభుత్వం ఈ రుణాల రికవరీపై పునరాలోచించాల్సి ఉంది. – చిటికెల సామెల్, మాజీ డీవీఎంసీ సభ్యులు ● -
ఉదయం 9.30 గంటలకే పీజీఆర్ఎస్
కర్నూలు(హాస్పిటల్): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు జిల్లా అంతటా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లను ఆదివారం స్టేషన్కు రప్పించి వారి నేర చరిత్ర వివరాలను ఆరా తీసి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెడు నడత కలిగిన వ్యక్తులను తీవ్రంగా హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ సూచనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేణుమాధవా..! ● వైభవంగా నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు ఆళ్లగడ్డ: అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాలు పరవశంగా కొనసాగుతున్నాయి. భక్తుల గోవిందా నామస్మరణలతో ఎగువ అహోబిల క్షేత్రం మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రతభాత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించి జ్వాలా నరసింహుడిని వేణుగాపాలస్వామి అలంకారంలోను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణి, సత్యభామలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన నరసింహస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి స్వామి వారు పొన్నచెట్టు వాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. -
అడవి రక్షణకు ఫైర్లైన్స్
అటవీ రేంజ్ల వారీగా వివరాలు.. కర్నూలు ఆదోని సెక్షన్లు :2 బీట్లు: 6 సెక్షన్లు: 3 బీట్లు: 11 అటవీ విస్తీర్ణం : 15,276.21 హెక్టార్లు అటవీ విస్తీర్ణం: 19,851.95 హెక్టార్లు మండలాలు : వెల్దుర్తి, సి.బెళగల్, కర్నూలు మండలాలు: కోసిగి, కౌతాళం, మంత్రాలయం, కోడుమూరు, కల్లూరు, ఓర్వకల్లు గూడూరు, నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, ఆదోని, హోళగుంద, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి, తుగ్గలి, మద్దికెర ఈస్ట్, చిప్పగిరి.కర్నూలు కల్చరల్: వేసవి కాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడువులను కాల్చి వేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జంతు జాతులను కాపాడుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నారు. అరుదైన వృక్షాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారు. పక్షులు, ఇతర జీవుల దాహార్తి తీర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిప్పు రాజుకున్నా.. మంటలు వ్యాప్తి చెందకుండా అర్పివేసేందుకు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. వారు అప్రమత్తంగా ఉంటూ పరిిస్థితులను పరిశీలించేలా ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టంగా నిఘా వేసివి కాలంలో నేపథ్యంలో అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అడువులను అగ్నికీలల నుంచి కాపాడేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టంగా నిఘా పెడుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా పలువురు అధికారులకు విధులు కేటాయించింది. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా కట్టడికి గ్రామాల్లో కళాజాతా బృందాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక బృందాలు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెట్రోలింగ్ చేయడంతో పాటు అడవిలో పరిస్థితులను గమనిస్తుంటారు. వారికి కావాల్సిన నీళ్ల బాటిళ్లు, బూట్లు, డ్రెస్, సేఫ్టీ కిట్స్ను అందించారు. కర్నూలు సిటీ ఫారెస్ట్, సోమయాజుల పల్లె ఫారెస్ట్ ప్రాంతాల్లో వీరు పెట్రోలింగ్ చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో రాజుకునే మంటలను ఎస్ఎన్పీపీ శాటిలైట్ సహకారంతో డీఎఫ్ఓలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఫైర్లైన్స్లో ఎండుటాకుల తొలగింపు అడవుల్లో మంటలను అందుపు చేయడానికి వీలుగా అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంటలు వ్యాపించకుండా అర్పేందుకు వీలుగా ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు డివిజన్లో కర్నూలు నగరవనం, సోమయాజుల పల్లె ప్రాంతాల్లో 12 కి.మీ., ఆదోని డివిజన్లో 18 కి.మీ. మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చేశారు. 8 నుంచి 10 మీటర్లు వెడల్పుతో ఒకే వరుసలో చెట్లను, ఎండుటాకులను తొలగిస్తున్నారు. దీంతో మంటలు ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. సాసర్ పిట్ల ఏర్పాటు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం నీటి ఎద్దడి లేదు. అయినప్పటికీ వేసవి కారణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లో కర్నూలు డివిజన్లో 17, ఆదోని డివిజన్లో 21 సాసర్ పిట్లను గుర్తించారు. ఇంకా అవసరమైన చోట్ల పిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బందిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారికి ఫైర్ బ్లోయర్స్ అందించాం. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారు వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటారు. అడవికి ఎవరూ నిప్పు పెట్ట కూడదు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలి. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – పి.శ్యామల, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీ శాఖ అధికారి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు ఫైర్ వాచర్లతో నిరంతర పర్యవేక్షణ పటిష్టంగా 45 కి.మీ.ఫైర్ లైన్స్ ఏర్పాటు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు రూ.10 లక్షల నిధులు -
ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల మధ్య ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రత్యేక ఆలంకరణలో మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి మహామంగళహారతులు గావించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది. -
ఇంధనం.. ఇంకెంత దూరం!
ఉమ్మడి జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకులు మూతపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. డీజిల్ సరఫరాలో జాప్యంతో రవాణా రంగం స్తంభించిపోతోంది. ఆదివారం కూడా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆటో వాలాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. మరో వైపు వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయి. పంట నూర్పిళ్ల యంత్రాలు, ట్రాక్టర్లకు డీజిల్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, నెట్వర్క్గత నాలుగైదు రోజుల ఉంచి కోడుమూరుతో పాటు చుట్టూ పక్కల ఎక్కడా కూడా పెట్రోల్ లభించడం లేదు. స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్ కావాలంటే బంకుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. చివరకు పెట్రోల్ దొరకక బండిని తీయడం లేదు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ను అన్ని బంకుల్లో అందుబాటులో ఉంచాలి. – వీరేష్రెడ్డి, వ్యాపారి, కోడుమూరు -
ప్రమాదకరంగా ఈత
● సుంకేసుల క్రస్టు గేట్ల దగ్గర చిన్నారుల ఈత ● పట్టించుకోని అధికారులు కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ దగ్గర ప్రమాదకరమైన ప్రదేశంలో చిన్నారులు ఈత కొడుతున్నారు. ఇటీవలే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం రోజున బ్యారేజీ దగ్గర సరగాగా గడిపేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఈత సక్రమంగా రాక..ఈత వచ్చిన పెద్ద పెద్ద గుంతల్లో చిక్కుకోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బ్యారేజీ క్రస్టు గేట్ల నుంచి విడుదల చేసే నీటితో దిగువన గుంతలు ఏర్పడి లోతు ఎక్కువగా ఉండి నీరు నిల్వ ఉంటుంది. గేట్లకు సమీపంలో ఏ ఒక్కరు కూడా ఈతకు కానీ, సరదాగా కూడా వెళ్లకూడదు. అయితే ఆదివారం 25, 26 గేట్లకు దిగువన చిన్న పిల్లలతో కలిసి ప్రమాదకరమైన ప్రదేశంలో ఈత చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలోకి ఇతరులు ఎవరూ వెళ్ళకుండా చూడాల్సిన బ్యారేజీ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే క్రస్టు గేట్ల వరకు వెళ్ళుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా బ్యారేజీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
గడ్డకట్టని రక్తం!
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఎవ్వరికై నా దెబ్బతగిలి రక్తగాయమైతే వెంటనే రక్తస్రావం జరుగుతుంది. కాసేపు అదిమి పట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా జబ్బుతో బాధపడే వారికి గాయమైందంటే రక్తస్రావం ఆగదు. నిరంతరంగా రక్తస్రావం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. రక్తస్రావం అధికం కావడంతో బాధితుల వ్యథ అంతా ఇంతా కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిమోఫీలియాతో బాధపడే వారి సంఖ్య 135 వరకు ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 90 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి బాధితుల బాధలు విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక నెలకు రూ.10వేల ప్రత్యేక పింఛన్ ఇచ్చి ఆసరా కల్పించారు. అప్పటి నుంచి ఈ బాధితులు ప్రతి నెలా ఠంఛనుగా పింఛన్ తీసుకోవడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తీరుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఈ ప్రత్యేక పింఛన్ను ప్రస్తుత ప్రభుత్వం సైతం తీసివేయలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి నెలా పింఛన్ను బాధితులు అందుకుంటున్నారు. హిమోఫీలియా అంటే... హిమోఫిలియా అనేది అరుదైన జబ్బు. ఇది జన్యుపరంగా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే ప్రొటీన్లు (గడ్డకట్టే కారకాలు) తగినంత ఉండవు. ఈ కారణంతో వారికి ఏదైనా గాయమైతే రక్తస్రావం ఆగకుండా జరుగుతుంది. చిన్నగాయమైనా సరే రక్తస్రావం ఆగదు. అయితే కొందరిలో ఎలాంటి గాయాలు లేకున్నా అంతర్గతంగా కూడా రక్తస్రావం అవుతుంది. దీనిని బ్లీడర్స్ డిసీస్ అని కూడా పేర్కొంటారు. అధికంగా మగపిల్లలే బాధితులు జన్యుపర వ్యాధి అయిన హిమెఫిలియా సాధారణంగా వారసత్వంగా వస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా ప్రధానంగా మగపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో జన్యువు ఎక్స్ క్రోమోజోముపై ఉంటుంది. ఇది తల్లివాహకంగా పనిచేస్తుంది. వ్యాధికి కారణాలు సాధారణంగా ప్రతి మనిషి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టేందుకు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అనే రసాయనాలు ఉంటాయి. హిమోఫిలియా బాధితుల్లో మాత్రం ఇలాంటివి ఉండవు. ఇవే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9. రక్తస్రావ సమయంలో ఈ ఫ్యాక్టర్స్లో ఏది కోల్పోతే దానిని తిరిగి రోగికి ఎక్కించాల్సి ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో హిమోఫీలియా బాఽధితులకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందిస్తున్నాము. వారికి అవసరమైన పరీక్షలతో పాటు చికిత్స, మందులను ఉచితంగా ఇస్తున్నాము. జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డైస్)లో ప్రత్యేకంగా ఐసీహెచ్హెచ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్ ఫిజీషియన్తో పాటు చిన్నపిల్లల వైద్యులూ ఉన్నారు. బాధిత చిన్నారులకు అవసరమైన పరీక్షలు, కౌన్సిలింగ్ వారు అందిస్తారు. –డాక్టర్ విజయానందబాబు, హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం, జీజీహెచ్, కర్నూలు వేధిస్తోన్న అరుదైన హిమోఫీలియా జబ్బు ఉమ్మడి జిల్లాలో 135 మంది బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స కేంద్రంపెద్దాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఫర్ హిమోగ్లోబినోపతీస్, హిమోఫిలియా(ఐసీహెచ్హెచ్) టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లను 2020లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖపట్టణం, ఈస్ట్గోదావరి, గుంటూరుతో పాటు కర్నూలులోనూ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు కేంద్రం పక్కనున్న జిల్లా సత్వర చికిత్స కేంద్రం (డైస్)లో ఇది కొనసాగుతోంది. ఇక్కడ తలసీమియాతో పాటు సికిల్సెల్, హిమోఫిలియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. -
శస్త్రచికిత్సల్లో అనెస్తీషియా కీలకం
కర్నూలు(హాస్పిటల్): శస్త్రచికిత్సల సమయంలో అనెస్తీషియా వైద్యులు అందించే సేవలు కీలకమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆసుపత్రిలోని మోర్టాన్ సెమినార్ హాలులో ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్’ అనే అంశంపై జోనల్ సీఎంఈ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలన్నీ అనెస్తీషియా విభాగంపై ఆధారపడి ఉంటాయన్నారు. నొప్పుల నివారణకు అనెస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. అనంతరం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ గురించిన పలు అంశాలపై నిపుణులైన వైద్యులు సైన్స్ సెషన్స్ ద్వారా వివరించారు. జోనల్ సీఎంఈ కో–ఆర్డినేటర్, పాథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ విశాల, డాక్టర్ రామశివనాయక్, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కోసిగి: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికై నట్లు బీచ్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి వలకలదిన్నె వెంకటేష్ తెలిపారు. ఆదోని నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడకారులు హాజరైయారన్నారు. ఇందుల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రస్థాయికి 6 మంది పురుషులను, ఆరుగురు మహిళా క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారు మే 7 నుంచి 10 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో జరిగే 13వ రాష్ట్రస్థాయిలో బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. దేశ అభివృద్ధిలో జనగణన కీలక పాత్ర కర్నూలు (టౌన్): దేశ అభివృద్దిలో జనగణన కీలక పాత్ర పొషిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు 5 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వీయ జనగణనలో ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. జనగణన సిబ్బంది ఫోన్ నంబర్ తప్ప ఇతర వివరాలు, ఓటీపీలు అడగబోరని, వేలిముద్రలు, ఐరిస్ సేకరించరని తెలిపారు. ప్రజలు సందేహాల నివృత్తి కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం ఉందన్నారు. నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ.. మే 1 నుంచి ఇంటింటా జనగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈఐడీ నంబర్ చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిరంజీవి, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇంచార్జీ ఎస్. ఇజ్రాయేలు, ఎస్ఈ రమణ మూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ రఘ. డిఎస్ డీవో భూపతిరావు పాల్గొన్నారు. అనంతరం 5 కే రన్లో విజేతలకు రూ. 5 వేలు,. రూ. 3 వేలు, రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు. ఆకుమల్లలో అ‘పూర్వ’ సమ్మేళనం సంజామల: వారంతా చిన్నపిల్లలైపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడిగా గడిపారు. ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002–2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్బాబురావ్, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, వెంకటస్వామి, దామోదర్, లక్ష్మిదేవి, శ్రీనివాసరెడ్డిని సన్మానించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జి. నాగరాజు, వై. నాగరాజు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, మధుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ మల్లికార్జున రెడ్డి, ఆకుమల్ల ఉపసర్పంచ్ హజీపీరన్, వీఆర్ఓ రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ గఫార్ బాషా, నాగరాజు, సుబ్బు, రాజేష్, పద్మావతి పాల్గొన్నారు. -
నాపరాతి పరిశ్రమపై డీజిల్ ఎఫెక్ట్
● డీజిల్ లేక నిలిచిపోయిన ట్రాక్టర్లు ● కార్మికుల ఉపాధిపై ప్రభావంకొలిమిగుండ్ల: డీజిల్ సరఫరాలో జాప్యంతో నాపరాతి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. నియోకవర్గంలో కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో వ్యవసాయం తర్వాత నాపరాతి గనులపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది ఉన్నారు. నాపరాతి గనుల్లో వెలికితీసిన రాళ్లను ఎక్కువ భాగం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డీజిల్ సమస్య వేధిస్తుండటంతో యజమానులు ట్రాక్టర్లను ఇళ్ల వద్దనే ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొలిమిగుండ్ల మండలంలోనే 600కు పైగానే ట్రాక్టర్లు ఉన్నాయి. డీజిల్ లభించక పోవడంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్డెక్కడం లేదు. బంక్లకు డీజిల్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చినా క్షణాల్లో వాహనాలు బారులు దీరుతున్నాయి. నాపరాతి గనుల్లో పనులు చేసేందుకు డీజిల్తో నడిచే కోత మిషన్లను ఉపయోగిస్తున్నారు. డీజిల్ లేక గనులు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. గనుల్లో పని చేసే కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రవాణ సాగిస్తుండేవి. డీజిల్ కొరత వల్ల ఎక్కడక్కడ నిలిచిపోయాయి. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సొంత కార్లు ఉన్న యజమానులకు డీజిల్ లేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాక పోకలు సాగిస్తున్నారు. డీజిల్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామానికి చెందిన ఎలకంటి చిన్న ఓబులేసు ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ రామాంజీనాయక్ విచారణ చేపట్టారు. ఈనెల 23 వ తేదిన పొలం విషయంలో చిన్న ఓబులేసుపై పాతమాడుగుల గ్రామానికి చెందిన పెద్దవెంకట స్వామి, చిన్న వెంకట స్వామి, రాజులు కర్రలతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పై ముగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో ఆదివారం ఆత్మకూరు రూరల్ సీఐ సరేష్కుమార్ రెడ్డి, ఎస్ఐ జయశేఖర్తో కలిసి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పాతమాడుగుల గ్రామంలో విచారణ చేపట్టారు. స్వయంగా ఆయన సమస్యాత్మక పొలాన్ని పరిశీలిచారు. చుట్టపక్కల రైతులను, గ్రామస్తులను విచారించారు. కోడి పందేల నిర్వాహకుల అరెస్టు ప్యాపిలి: పోతుదొడ్డి గ్రామంలో కోడి పందేల నిర్వాహకులను ప్యాపిలి ఎస్ఐ నాగార్జున ఆదివారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన పెనుగొండ రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి అవుకు(కొలిమిగుండ్ల): పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ముఖేష్ (36) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గతంలో అవుకు మోడల్ స్కూల్లో ఏడేళ్ల పాటు ఇంగ్లిష్ పీజీటీగా పనిచేసిన ఆయన, రెండేళ్ల క్రితం బదిలీపై వెలుగోడు మోడల్ స్కూల్కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి నంద్యాలలో నివసిస్తున్నారు. ముఖేష్ భార్య స్వర్ణరేఖ ఉప్పులపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ముఖేష్ తండ్రి వెంకట కృష్ణయ్య కూడా ఏడాదిన్నర క్రితం ఆకుమల్లలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గుండెపోటుతోనే మరణించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పెద్దకడబూరు: నౌలేకల్లు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ ఈ మారుతి తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన బోయ ఆంజనేయ కుమారుడు నందవరం తిక్కన్న (42) ఆదివారం తమ బంధువుల పెళ్లి సంబంధం చూసేందుకు కోసిగి వెళ్లారు. కార్యక్రమం అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా నౌలేకల్లు గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొంది. ఎమ్మిగనూరు సంతలో ఎద్దులను కొనుగోలు చేసిన కౌతాళం మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన రైతులు బొలెరో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిక్కన్న తీవ్రంగా గాయ పడంతో పెద్దతుంబళం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెట్రోల్, డీజిల్ కొరత లేదు!
కర్నూలు కల్చరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజువారీ సగటున 2,36,000 లీటర్లు పెట్రోల్ వినియోగం జరుగుతుండగా ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందన్నారు. అదనంగా ట్రాన్సిట్లో 6,39,000 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిల్వలతో ఆరు రోజుల వరకు సరఫరా కొనసాగించవచ్చన్నారు. డీజిల్ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదన్నారు. మొత్తం కలిపి 11 లక్షల లీటర్లు డీజిల్ అందుబాటులో ఉండటంతో సుమారు 4 రోజుల సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. సాధారణ ధరలకే సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దన్నారు. పెట్రోల్, డీజిల్ను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయం
కర్నూలు: మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని, చట్టబద్ధమైన సమస్యలు ఉంటే వాటికి ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు శనివారం కర్నూలు బి.క్యాంప్లో ఉన్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ను లీలా వెంకటశేషాద్రి సందర్శించారు. మాజీ సైనికుల సమస్యలను చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ న్యాయవాదితో పాటు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ, పారా లీగల్ వలంటీర్ మధుసూదన్, మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నగరడోణ @ 44.8
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి బయట తిరిగేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో 44.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళితే తప్పక టోపీలు ధరించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు అధికంగా తీసుకోవాలని సూచించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు కర్నూలులో 8, ఆదోని నందు 5, మంత్రాలయం 1, పత్తికొండ 3, ఎమ్మిగనూరులో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7735 మంది విద్యార్థులకుగాను 7202 మంది హాజరుకాగా 533 మంది గైర్హాజరయ్యారు. ఎస్పీతో సివిల్ జడ్జి మర్యాదపూర్వక భేటీ కర్నూలు: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీసెస్ ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)గా ఎంపికై న బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్ శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజామ్ను ఎస్పీ అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి అల్లాబకాష్ హెడ్ కానిస్టేబుల్గా సేవలందిస్తుండగా కుమారుడు న్యాయ వ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని ఎస్పీ కొనియాడారు. 28 నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసు ● మే2 వరకు నిర్వహణ కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు కౌతాళంలో ఈనెల 28నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి ఉరుసు పోస్టర్లను దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చీష్తీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 28న మంగళవారం స్వామి సమాధిని సుగంధ, అత్తర్ పానియాలతో (గుసుల్) శుభ్రచేస్తారని,, 29న బుధవారం గంధం, 30న గురువారం ఉరుసు ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు ఇప్పటికే దర్గా పరిసరాల్లో షామియాలను ఏర్పాటు చేశారు. దర్గాను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
మోహినీ అలంకరణలో సింహరూపుడు
● వైభవంగా కొనసాగుతున్న నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులను కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి జగన్మోహినీ అలంకరణలో దర్శనమిచ్చారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన గావించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ గావించారు. అనంతరం వివిధ పుష్పాలంకరణ గావించిన పూల పల్లకీని అధిరోహించి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడవీధుల్లో విహరిస్తూ శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూసితుడై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముట్టడి
● 15 రోజులుగా నీరందడం లేదని ఆగ్రహం ● పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని మహిళల హెచ్చరిక హొళగుంద: ™èlÐ]l$ M>ÌS-±ÌSMýS$ ÐéÆ>ÌS ™èlÆý‡ºyìl Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]l-yýl…Ìôæ§ýl° çߟâýæ-VýS$…-§ýlÌZ° 5, 6Ð]l ÐéÆý‡$z-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l$íßæ-âýæË$ Rêä ¼…§ðlÌS™ø ç³…^éĶæ$¡ M>Æ>Å-ÌS-Ķæ*°² Ð]l¬rt-yìl…-^éÆý‡$. AMýSPyýl A«¨-M>-Æý‡$-ÌñæÐ]lÆý‡* ÌôæMýS-´ù-Ð]l-yýl…™ø M>Æ>Å-ÌSĶæ$… ÌZç³Ìôæ O»ñæu>-Ƈ$$…_ °Æý‡çܯ]l ™ðlÍ-´ëÆý‡$. ÑçÙĶæ$… ™ðlË$-çÜ$-MýS$¯]l² DK-ï³-B-ÈŠ-ీyýlz, {V>Ð]l$ {ç³™ólÅ-M>-«¨M>Ç ^èl{MýS-Ð]lÇ¢ AMýSP-yìlMìS Ð]l_a Ð]l$íßæ-âýæÌS™ø Ð]l*sêÏ-yýlyé-°MìS {ç³Ä¶æ$-†-²…^èlV> ÐéÆý‡$ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. VýS™èl 15 Æøk-Ë$V> ™èlÐ]l$ M>ÌS-±-ÌSMýS$ Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. {糆 Æøþ ±â¶æ$Ï Ð]lÝë¢Ä¶æ$° G§ýl$Æý‡$ ^èl*çÜ*¢ Æ>{†â¶æ$Ï °{§ýl´ù-MýS$…yé gêVýSÆý‡×æ ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. Ð]l$…_-±Æý‡$ CÐ]lÓÆ> A…r* DK-ï³B-Èz™ø ÐéV>Ó§ýl… ^ólÔ>Æý‡$. ±â¶æ$Ï C糚yýl$ Ð]lÝë¢Æ‡$$, A糚yýl$ Ð]lÝë¢Ä¶æ$° VýS…rÌS ™èlÆý‡-ºyìl G§ýl$Æý‡$ ^èl*yýl-yýl…, Ððl*sêÆý‡$Ï ÐólíÜ º…§Šæ ^ólçÜ$¢-¯é²Ð]l$° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. Mö…§ýlÆý‡$ M>ÌS-±-ÐéçÜ$Ë$ yîlï³-K™ø ¸ù¯ŒSÌZ Ð]l*sêÏyìl çÜÐ]l$-çÜů]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…_-±sìæ çÜÐ]l$çÜÅ E¯é² A«¨-M>-Æý‡$Ë$ çܵ…¨…^èl-yýl…-Ìôæ§ýl-°, B…§øâýæ¯]lË$ ^ólÝë¢-Ð]l$¯é²Æý‡$. ±â¶æ$Ï Ð]l§ýl-ÌS-MýS´ù™ól ç³…^éĶæ$¡ M>Æ>ÅÌS-Ķæ*-°MìS ™éâýæ… ÐólÝë¢Ð]l$° òßæ^èlaÇ…^éÆý‡$. మంచినీరు అందక ప్రజలు అల్లాడుతున్న దృశ్యాలు టీడీపీ నాయకులకు, ఆ పార్టీ ఇన్చార్జ్కు కనపడదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హొళగుంద పక్కనే ఎల్లెల్సీలో నీటి ప్రవాహం ఉందని, ఎస్ఎస్ ట్యాంకులో కూడా మంచినీరు నిల్వ ఉందని, అయినా ప్రజలకు అందించలేక పోతున్నారన్నారు. ఖాళీ బిందెలతో పంచాయతీ, ఇతర కార్యాలయాలను మట్టడించే స్థితికి ప్రజలు వచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు. ప్రజల సమస్యలు చెబితే టీడీపీ నేతలు, నాయకులు పరిష్కరించాలి గాని ఎదురుదాడి చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికై నా ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి -
ఆర్టీసీ బస్సులో దివ్యాంగ బాలుడికి జరిమానా
● మహిళా కండక్టర్పై కేసు నమోదు ● తనిఖీ అధికారుల అత్యుత్సాహం కర్నూలు సిటీ: మహిళలకు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం ఉన్నా తనిఖీ అధికారుల అత్యుత్సాహం చూపారు. దివ్యాంగ బాలుడికి జరిమానా జరిమానా వేయడంతోపాటు మహిళా కండక్టర్పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు డిపో–2కు చెందిన బస్సు శనివారం ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు వచ్చే సమయంలో కండక్టర్ టికెట్లు ఇస్తున్నారు. స్టేజ్ రాకముందే రీజినల్ ప్రొద్దుటూరు స్క్వాడ్ అధికారులు బస్సును నిలిపారు. స్టేజ్ రాలేదు, టికెట్లు ఇవ్వడం పూర్తికాలేదని తనిఖీ ఆఫీసర్లకు మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. తనిఖీలు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఐదేళ్ల దివ్యాంగ బాలుడు టికెట్ తీసుకోలేదని బాలుడి తల్లికి రూ.100 జరిమానా వేశారు. ఆ తరువాత కండక్టర్పై సైతం కేసు నమోదు చేశారు. దివ్యాంగ బాలుడికి జరిమానా విధించడపై ప్రయాణికులు నిలదీశారు. బే స్టేజ్ (స్టేజ్ రాకముందే)లో తనిఖీలు చేస్తూ కండక్లర్లపై కేసులు నమోదు చేస్తూ మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.రాజ్యలక్ష్మి తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 30 కిలోల వెండి పట్టీలు స్వాధీనం ● మధ్యప్రదేశ్ వెళ్లి దొంగలను పట్టుకొచ్చిన డోన్ పోలీసులు డోన్ రూరల్: వారం రోజుల్లో డోన్ పోలీసులు భారీ చోరీ కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. మధ్యప్రదేళ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.66.62 లక్షల విలువైన 30.200 కిలోల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున డోన్ మండలంలోని యు.కొత్తపల్లి వద్ద ఉన్న న్యూ భారత్ డాబా వద్ద మధురై నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మువాజ్ ఖాన్కు చెందిన వెండి పట్టీలు ఉన్న బ్యాగ్ అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన చోటు దవార్(20), రాజేశ్ చోహన్ (32), మన్సూర్ ఖాన్(32) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐలు శరత్ కుమార్, నరేంద్ర కుమార్, సీసీఎస్ సీఐ సురేష్ కుమార్, బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధర్మపురి ప్రాంతానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఏపీ, తెల్లంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
కృష్ణగిరి: మండల పరిధిలోని ఎరుకుల చెరువు గ్రామంలో గౌండ పని చేస్తూ కరెంట్ షాక్కు గురై వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మనుగొండ రాజమోహన్(44)మృతి చెందాడు. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. రాజమోహన్ తన చిన్నాన్న కుమారుడితో కలిసి ఎరుకుల చెరువులోని సూర్యనారాయణ ఇంటి గౌండ పనికి వెళ్లాడు. ప్లాస్టింగ్ పని ముగించుకుని ప్లాసింగ్ చేసేందుకు వేసుకున్న సారువ కట్టెలపై నుంచి దిగే సమయంలో జారి కరెంట్ తీగలకు తగిలాడు. దీంతో షాక్కు గురై కింద పడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని వెల్దుర్తి సీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సుజాత, కుమారుడు సుమంత్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి నందికొట్కూరు రూరల్: బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఏబీఎం చర్చి వద్ద శనివారం ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి నందికొట్కూరుకు వెళ్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో అద్దె బస్సును బ్రహ్మణకొట్కూరు ఏబీఎం చర్చి వద్ద కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన సయ్యద్ యూసుఫ్ (63) ఎక్కుతున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో యూసుఫ్ కింద పడ్డాడు. అతనిపై బస్సు వెనుక టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. యూసూఫ్ పని నిమిత్తం బ్రాహ్మణకొట్కూరు వచ్చినట్లు సమాచారం. మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో ధరల ఉల్లంఘన, కల్తీ నివారణ కోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు బృందాలుగా ఏర్పడి శనివారం బార్లు, మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం బాటిళ్ల స్కానింగ్ను నిశితంగా పరిశీలించారు. ప్రతి బాటిల్ను సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేయాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 51 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 38 దుకాణాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. -
రేడియో టవర్ ఎక్కి యువకుడి హల్చల్
● యువకుడి ప్రాణాలు కాపాడిన టూటౌన్ సీఐఆదోని అర్బన్: పట్టణంలోని మర్చంట్స్ క్లబ్ పక్కనే ఉన్న ఆలిండియా రేడియో టవర్ ఎక్కి శనివారం చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన యువకుడు సురేంద్ర హల్చల్ చేశారు. సీఐ రాజశేఖర్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడిని కిందకు వచ్చేలా చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. నేమకల్ గ్రామానికి చెందిన నాగేశ్వరిని ప్రేమించి సురేంద్ర పెళ్లి చేసుకున్నాడు. మద్యం మత్తులో భార్యను కొట్టడంతో ఆమె సహించలేక పుట్టింటికి వెళ్లారు. భార్యను పిలిచినా రాకపోవడంతో శనివారం ఆదోని పట్టణంలోని ఆల్ ఇండియా రేడియో టవర్ పైకి ఎక్కాడు. నా భార్య వస్తేనే దిగుతా.. లేదంటే దూకేస్తానంటూ కేకలు వేయడంతో స్థానికులకు భయబ్రాంతులు గురయ్యారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ రామనాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడైన సురేంద్ర ఫోన్ నంబర్ను తెలుసుకుని సీఐ రాజశేఖర్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ధైర్యం చెప్పి నీవు కిందకు దిగితే నీ భార్య నాగేశ్వరితో మాట్లాడిస్తాను అని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సురేంద్ర వెంటనే టవర్పై నుంచి కిందకు దిగొచ్చాడు. దాదాపు 2 గంటల వరకు టవర్పైనే ఉండడంతో సీఐ రాజశేఖర్రెడ్డి సురేంద్రకు తాగేందుకు నీరు ఇచ్చి, స్టేషన్కు తీసుకెళ్లారు. నాగేశ్వరి, వారి తల్లిదండ్రులను ఆలూరు పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
మలేరియా నిర్మూలనే లక్ష్యం
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వ్యాప్తంగా 2,030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వర ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక డాక్టర్స్ కాలనీలోని రాయలసీమ నర్సింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వరప్రసాద్ మాట్లాడుతూ మలేరియాను నిర్మూలించాలనే నినాదంతో పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమల ద్వారా కలిగే మలేరియా... ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వల్ల వస్తుందని, జ్వరంతో పాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మలేరియా నియంత్రణ అధికారి నూకరాజు మాట్లాడుతూ మురుగునీటిలో ఉత్పత్తయ్యే దోమల మూలంగా బోధకాల వ్యాధి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి ప్రకాష్రాజు, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ చంద్రకళ, సీనియర్ ఎపిడమాలజిస్టు వెంకటేశ్వర్లు, ఏఎంఓ ఎస్.విజయకుమార్, ఎంపీహెచ్ఎస్ అస్లాం, రఘు, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధుర ఫలం.. ప్రియం
● నిరాశపరిచిన బంగినపల్లి దిగుబడులు ● గతేడాది కంటే పెరిగిన ధరలు ● వంద పండ్లు రూ. 5 వేలు పైమాటే! బనగానపల్లె: వేసవి వచ్చిందంటే మార్కెట్లో ఫలరాజు మామిడి పండ్లు కళకళలాడుతాయి. మామిడి పండ్లలో బంగినపల్లి బేనిషాన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది బంగినపల్లి తినాలంటే సామాన్యులు జేబులు తడమాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిగుబడులు తగ్గడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. బేనిషాన్ మామిడి తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో విస్తరించాయి. ఏటా సగటున 51.896 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో బనగానపల్లె ప్రాంతంలో 650 ఎకరాల్లో, డోన్ 2,439, వెల్దుర్తి 892 బేతంచర్ల 587, ప్యాపిలి 805, కల్లూరు 496, ఓర్వకల్లు 1122, కోడుమూరు 238, వెలుగోడు 214, రుద్రవరం 215 ఎకరాలతో పాటు తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది ప్రధానంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, మిరప పంటను ఆశించే తేనే మంచుపురుగు మామిడి చెట్లకు పట్టడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. 15–20 రోజుల ముందే పూత రావడం, వేసవి తాపంతో అధికంగా రాలిపోవడం, ఈ క్రమంలో కొందరు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో పూత నిల్వలేదు. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. పది రోజులుగా బేనిషాన్ మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. వ్యాపారులు కిలో వంద రూపాయలకు, వంద పండ్లు రూ 5 వేల నుంచి 6 వేలకు విక్రయిస్తున్నారు. గతేడాది ఇదే సైజ్ పండ్లు వంద రూ.3 వేల నుంచి 4 వేలకు లభించాయి. ఈ ఏడాది బంగినపల్లె ప్రియం కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నవాబులు పాలనలో విస్తరించిన తోటలు బనగానపల్లె ప్రాంతంలో సుమారు 120 ఏళ్ల క్రితం బంగినపల్లి బేనిషాన్ మామిడితోటల పెంపకానికి అప్పటి నవాబులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మామిడి పండ్లలో బేనిషాన్ రకాన్ని రాజుగా, మలుగువ మంత్రిగా, దిన్పసన్ సేనానిగా పిలిచేవారు. పేర్లను బట్టి బంగిపల్లి మామిడికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పవచ్చు. ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో మామిడితోటల సాగుకు నవాబులు ప్రత్యేకంగా బావులు తవ్వించి తోటలను విస్తరించారు. బేనిషాన్ మామిడి పండు కాంతివంతంగా కనిపిస్తూ రుచి అద్భుతంగా ఉంటుంది. మాగిన తరువాత పది రోజుల పాటు నిల్వ ఉన్నా చెడిపోదు. వినియోగదారులు ఈ రకాన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతవాసులు వేసవి కాలంలో ఇక్కడ లభించే బంగినపల్లి రకం మామిడిని తమ బంధువులు, స్నేహితులు ఎక్కడ ఉన్నా ఏటా పంపుతూ అభిమానాన్ని చాటుకుంటారు. మాకు 30 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరం తేనే మంచుపురుగు ఆశించడంతో పాటు వేసవితాపం ఎక్కువ కావడంతో పూత రాలిపోయి దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో ధరలు పెరుగుతాయి. – అబ్దుల్హమిద్ మామిడితోట యజమాని ఈ సంవత్సరం మామిడిపండ్ల దిగుబడి తగ్గి ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ విధంగా దిగుబడులు తగ్గడం ఐదేళ్లలో ఇదే ప్రథమం. దిగుబడి తగ్గడం వల్ల సైజును బట్టి కిలో వంద వరకు ధర ఉంది. వంద మామిడి పండ్లు 4 – 5 వేల వరకు విక్రయిస్తున్నాం. – ఖాజాహుస్సేన్ మామిపండ్ల వ్యాపారి -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 19వ తేదీ సాయంత్రం భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడైన భర్త బోయ మీనుగ రాముడును అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బోయ మీనుగ రాముడు మద్యానికి బానిసైన భార్య నరసమ్మతో గొడవపడేవారు. దీంతో ఆమె భర్తను వదలి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె ప్రసవం కోసం ఈనెల 19న ప్రభుత్వాసుపత్రికి నరసమ్మ వెళ్లగా భర్త రాముడు అక్కడికి వచ్చి అందరు చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పులే హత్యకు కారణమని విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సజ్జ రైతుల ఆందోళన
● కంపెనీ ఒప్పందంతో 200 ఎకరాల్లో సాగు ● దిగుబడులు కొనుగోలు చేయని వైనం చాగలమర్రి: డి.కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతులు హైదరాబాద్కు చెందిన సూపర్ సీడ్స్ కంపెనీ చేతిలో మోసపోయి లబోదిబోమంటున్నారు. సంబంధిత కంపెనీ ఒప్పందం మేరకు గ్రామానికి చెందిన 20 మంది రైతులు 200 ఎకరాల్లో బాజ్రా–99 రకం సజ్జ పంట సాగు చేశారు. క్వింటాకు రూ.4,400 ప్రకారం పంట కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కోతలు పూర్తయి ఎకరానికి 23 బస్తాల ప్రకారం దిగుబడి వచ్చింది. రైతులు దిగుబడిని కంపెనీకి విక్రయించేందుకు ఆర్గనైజర్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడినా స్పందన లేదు. కంపెనీ ఎండీ నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 3,800ల క్వింటాళ్ల దిగుబడిలో ఆర్గనైజర్ శ్రీనివాసరెడ్డి 1,200 క్వింటాళ్లను చాగలమర్రిలోని గోదాముకు తరలించి నట్లు చెబుతున్నారు. మిగిలిన రైతులకు చెందిన ధాన్యాన్ని కలాల్లోనే నిల్వ ఉంచారు. అకాల వర్షాలు వస్తే దిగుబడి తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు పెద్ద ఈశ్వరరెడ్డి, విక్రమ నరసింహారెడ్డి, దస్తగిరిరెడ్డి, సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, నాగరాజు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ చూపి కంపెని అధికారులతో మాట్లాడి సజ్జలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ది ప్రధాన పాత్ర
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో పీఎండీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ధర్తీ మాతా బచావ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పీడీఎంఎస్ విత్తనాల కిట్లను అందజేశారు. ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన అనంతరం రైతు పీడీఎంఎస్ విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎండీఎస్ అంటే వర్షాధారిత ప్రాంతాలలో, భూమిలో తేమ లేనప్పుడు విత్తనాలు వేసే విధానమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా వేసవిలో భూమి ఖాళీగా ఉన్నప్పుడు, వర్షాలు పడటానికి ముందే (మే –జూన్ సమయంలో) 30 రకాల నవధాన్యా లు, ఇతర విత్తనాలను కలిపి పొలంలో చల్లుతారన్నారు. ఈ విత్తనాలు వర్షం పడగానే మొలకెత్తి, భూమికి అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీ ఎల్ వరలక్ష్మీ, డిపిఎం మాధురి, సహాయ వ్యవసాయ సంచాలకులు సాలురెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఎఓ విష్ణువర్ధన్రెడ్డి, హార్టికల్చ ర్ ఆఫీసర్ నరేష్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు కర్నూలు (సెంట్రల్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని డీఎస్ఓ ఎం.రాజారఘువీర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కర్నూ లు నగరంలోని పలు పెట్రోల్ బంకులను పరిశీలించారు. నిల్వలు ఉండి వాహనదారులకు విక్రయించకపోతే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంకుల యజమానులను హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 24లోగా ఫీజు చెల్లించాలి కర్నూలు సిటీ: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలకు నిర్దేశించిన గడువులోపు ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజుల చెల్లింపు ప్రక్రియ శుక్రవారం మొదలైందని, ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఫీజు గడువు తెలియజేయాలన్నారు. ఉదయమే దిగుబడులు తీసుకురావాలి కర్నూలు(అర్బన్): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మార్కెట్యార్డుకు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఉదయం 9 గంటల్లోపు తీసుకు రవావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలియజేసిన సమయానికే వ్యాపారులు కూడా టెండర్ వేయాలన్నారు. నేటి నుంచి ఫ్యాఫ్టో రిలే దీక్షలు కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నేటి(శనివారం)నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం కర్నూలు డీఈఓ ఆఫీస్ ఆవరణలో ఫ్యాఫ్టో నాయకులు విడుదల చేశారు. దీక్షల్లో భాగంగా ఆదివారం ఫ్యాఫ్టో కర్నూలు కమిటీ కూర్చోనుందని జిల్లా కమిటీ చెర్మన్ ఎం.మధుసూదన్ తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఫ్యాఫ్టో నాయకులు బి.నవీన్ పాటిల్, రవికుమార్, మరియానందం, ఇస్మాయిల్, యోగేశ్వరుడు, నరేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నేడు పాలిసెట్ ఆదోని సెంట్రల్: పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష శనివారం జరుగుతుందని ఆదోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోనిలో 1500 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు , మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే ఎంపీడీఓలకు పదోన్నతులు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డికర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గతంలో ఎంపీడీఓగా విధుల్లో చేరిన వారు ఎంపీడీఓగానే పదవీ విరమణ చేసేవారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల డివిజినల్ స్థాయిలో డీఎల్డీఓ పోస్టులను క్రియేట్ చేయడంతో పీఆర్లో పదోన్నతుల పర్వం ప్రారంభం అయ్యిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ప్రజలు 542 రకాల సేవలను పొందగలుగుతున్నారన్నారు. 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో 2007, 2008 సంవత్సరాల్లో దాదాపు 9 శాఖలకు చెందిన నిధులు, విధులు, అధికారాలను పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించారన్నారు. కాలక్రమేణ కొన్ని మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా 2016 తరువాతి నుంచి విడుదల కావడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ముఖ్యంగా జిల్లా పరిషత్ అవసరాలకు అనుగుణంగా విడుదల కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దామాషాలో విడుదల చేయడం లేదన్నారు. భూగర్భ ఖనిజ శాఖ వసూలు చేసి రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధికి జమ చేసిన రాయల్టీకి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు విడుదల చేస్తున్న గ్రాంట్ల మధ్య ఎక్కువ శాతం వ్యత్యాసం ఉందన్నారు. దీని వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నాయన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి స్టాంప్ డ్యూటీకి సంబంధించిన సర్దుబాటును కూడా సకాలంలో చేయడం లేదని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పెండెన్సీపై 2022 నుంచి రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి చేస్తూ వస్తే గత ఆర్థిక సంవత్సరం కొంత మేర పెండెన్సీ తగ్గిందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం నెరవేరాలంటే, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993లో పార్లమెంట్లో ఆమోదం పొందిందన్నారు. అప్పటి నుంచే దేశంలో మూడంచెల వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం పరిపాలన సాధ్యమైందన్నారు. డీపీఓ జీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సౌకర్యాలు కల్పిస్తు, వారి మనోభావాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. -
సెలవులు ప్రకటించాలి
ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పెద్ద పిల్లలందరూ ఇళ్ల వద్ద ఉంటే చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం కూడా తగ్గిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలి. – బీ రేణుక, కోశాధికారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) అంగన్వాడీ కేంద్రాలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేసవిలో కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – జేలలితమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయూసీ) అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భవతుల ఫీడింగ్కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వర్కర్లు, హెల్పర్లకు వేర్వేరుగా 15 రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. – పీ విజయ, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ -
యువకుడి దారుణ హత్య
ఓర్వకల్లు: మండల పరిధిలోని ఉయ్యాలవాడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఈడిగోటి లలితమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్కు గత నెల ఓర్వకల్లు మండలం చింతలపల్లెకి చెందిన వెంకటేశ్వరితో వివాహమైంది. రెండేళ్లుగా వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని జంపాల ఈశ్వరయ్య నగర్లో ఉంటూ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామంలో జరిగే ఉత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చారు. ఉత్సవాల్లో పోలీసుల అనుమతితో గురువారం రాత్రి డీజే ఏర్పాటు చేయగా పాటల విషయంలో గ్రామానికి చెందిన వంశీ, మనోజ్ సోదరుడైన మధుబాబుతో గొడవ పెట్టుకున్నాడు. గమనించిన మనోజ్ సర్దిచెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకొంది. కోపోద్రికుడైన వంశీ పొడవాటి కత్తిని తీసుకుని, కుటుంబసభ్యులతో కలిసి మనోజ్ ఇంటివద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో కరెంట్ పోవడంతో అరుగుపై కూర్చొన్న మనోజ్ను పక్కకు ఈడ్చి గొంతుపై కత్తితో పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మనోజ్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా, డీజే ప్రదర్శనకు అనుమతినిచ్చిన పోలీసులు బందోబస్తు నిర్వహించకుండా, యువకుల మధ్య గొడవలో జోక్యం చేసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. కేవలం 100 మీటర్ల దూరంలో యువకుడి హత్య జరుగుతున్నప్పటికీ ఖాకీలు అడ్డుకోకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమంటూ స్థానికులు మండిపడుతున్నారు. వడ్డెర సంఘం నాయకుల అందోళన వడ్డెర సంఘం నేతలు వందలాది మందితో కలిసి మృతదేహాన్ని వంశీ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. హంతకుడైన వంశీని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో వంశీతో పాటు, లక్ష్మీనారాయణ, రేణుక, వెంకటలక్ష్మి, శ్రీరాములు అనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
86,730
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల వివరాలు...అంగన్వాడీ కేంద్రాలు 1,88644,627కర్నూలు(అర్బన్): అధిక ఉష్ణోగ్రతలతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్టకష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలీచాలని గదులు రాష్ట్రంలోని దాదాపు అన్ని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీ చాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆర్థికంగా చితికి పోతున్న కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. బియ్యం, కంది పప్పు, ఆయిల్ మినహా మిగిలిన సరుకులన్ని ( ఆకుకూరలు, కూరగాయలు, గ్యాస్ ) బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రూ.2 ఇస్తోంది. రెండు రూపాయలతో పౌష్టికాహారం పెట్టడం ఎలా సాధ్యమని అంగన్వాడీ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉప్పు, చింతపండు, కారం, వెల్లుల్లి, ఆకుకూరలు తదితర వాటి ధరలన్ని పెరిగి పోయాయని వారంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లోనే పిల్లలను ఉంచుకోవాలని చెబుతున్న ప్రభుత్వం సాయంత్రం సమయాల్లో పిల్లలకు అందించే స్నాక్స్ను మరిచి పోయింది. మెనూ చార్జీలు పెంచాలని, పనిభారాన్ని తగ్గించాలని, వేతనాలను పెంచాలనే పలు డిమాండ్లతో ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వివిధ రూపాల్లో పోరాటాలను కొనసాగిస్తున్నారు. తీవ్ర ఉక్కపోత ... ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ఉక్కపోత తాళలేక ఏడుస్తుంటే, వారిని సముదాయించలేక ఆయాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయం అంగన్వాడీ కేంద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇళ్లకు దూరంగా ఉన్న కేంద్రాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు వారు ఇబ్బంది పడుతున్నారు.భోజనం చేస్తున్న చిన్నారులుగర్భిణులు18,992ఐసీడీఎస్ ప్రాజెక్టులు 09బాలింతలు15,3463–6 సంవత్సరాల మధ్య వయస్సు చిన్నారులు0–3 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ముందస్తు చొరవ తీసుకున్న ప్రభుత్వాలు జిల్లాలో ఉక్కపోతతో అల్లాడిపోతున్న చిన్నారులు -
కనీస వేతనం ఇవ్వకపోతే మరో సుదీర్ఘ సమ్మె
కర్నూలు(అర్బన్): తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని లేదంటే మరో సుదీర్ఘ సమ్మె చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్నారు. అంగన్వాడీ యూనియన్ల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గురువారం స్థానిక అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సీ క్యాంప్ సెంటర్ నుంచి అర్బన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు జే లలితమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి గోపాల్ మట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తప్పారని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు, నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీలపై అదనపు భారాన్ని తగ్గించాలని, సర్వేలు, పెన్షన్ల పంపిణీ, బీఎల్ఓ డ్యూ టీలు వేయరాదన్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా వేసవి సెలవులు ఇస్తుంటే ఇక్కడ అమలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని, సెలవులను మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ నాయకులు ఆర్ నరసింహులు, కే సుధాకరప్ప, మహమ్మద్ రఫీ, బాలదర్గమ్మ, చౌడేశ్వరి, నాగమణి, విజయ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో ప్రత్యేక హోటళ్లు
ఆధునిక కాలంలో చాలా మంది బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో అప్పట్లోలాగా ఇప్పుడు చద్దన్నం తయారు చేసుకుని తినే సమయం, ఓపిక ఇప్పటి వారికి లేదు. అందుకే ఇలాంటి వారి కోసం రెడీమేడ్గా చద్దన్నం అంది స్తున్నాయి హోటళ్లు. ఇటీవల కాలంలో కర్నూలు నగరంలో అవుట్ డోర్ స్టేడియం, వెంకటరమణ కాలపీ, బి.క్యాంపులోని సిల్వర్జూబ్లీ కాలేజి వద్ద ‘మన చద్దన్నం’ పేరుతో వరి అన్నంతో పాటు కొర్రలు, సామలు, అరికెలు, జొన్నలు, రాగులతో చద్దన్నం, పొంగలి తయారు చేసి మట్టిపాత్రలో వడ్డిస్తున్నారు. ఇందులో మునగాకు సూపు, మునగాకు చట్ని, వేరుశనగ, మిరియాలు, లవంగాలు, మిర్చి విత్తనాలతో కూడిన పౌడర్, ఉల్లి, క్యారెట్, బీట్రూట్ తురిమిన సలాడ్ను కలిపి ఇస్తున్నారు. దీంతో పాటు అవిశగింజెలు లడ్డు, డ్రైఫ్రూట్ లడ్డూలను తయారు చేసి ఇస్తున్నారు. ప్రతిచోటా రోజూ వంద మందికి పైగా ఈ చద్దన్నం తింటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి నల్గొండకు చెందిన ఓ వారు ప్రాంచైజీ రెండు రోజుల పాటు శిక్షణ, పరికరాలు ఇచ్చి వెళ్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వీరి చద్దన్నంకు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రజలు చిరునామా తెలుసుకుని వచ్చి తింటున్నారు. నగరంలో చద్దన్నం పదార్థాల విక్రయశాల -
డిగ్రీ పరీక్షలకు 22 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షలకు 214 మందికి 196 మంది విద్యార్థులు హాజరు కాగా 18 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 31 మందికి 27 మంది హాజరు కాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. స్కూళ్లకు వేసవి సెలవులు కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లారు. విద్యా సంవత్సరం చివరిగా నిర్వహించే సమ్మెటివ్–2 పరీక్షలు ఈ నెల 16వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షల మూల్యాంకనం నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేసి, ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేశారు. సెలవులు ప్రకటించిన తరువాత సమ్మర్ క్యాంపు పేరుతో ప్రత్యేక తరగతుల పేరుతో స్కూళ్లలో క్యాంప్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో(హాస్టల్స్ మినహా)చదువుతున్న విద్యార్థులకు బియ్యంతో పాటు కోడి గుడ్లు, చిక్కీలను పంపిణీ పంపిణీ చేశారు. కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల యాజమాన్యాల కింద పని చేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం సీనియారిటీ జాబితాలను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.doekrnl13.blogspot.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీలోపు(పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు(ఉమ్మడి జిల్లా) ఆఫీస్లో సా యంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో ఇవ్వాలన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోరని డీఈఓ వెల్లడించారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య డోన్ రూరల్: ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడు గురువారం ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ధీరజ్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడం, పెళ్లి కాకపోవడంతో మనస్తాపం చెందాడు. డోన్ పట్టణంలోని తన మేనమామ ఇంటికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి దేవనకొండ: మండలంలోని గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన కౌశిక్(12) గురువారం ఈతకు వెళ్లి బావిలో చిక్కుకుని మృతిచెందాడు. కౌలుట్ల, వరలక్ష్మీ దంపతుల కుమారుడైన కౌశిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘పొరుగు’ మద్యాన్ని కట్టడి చేయాలి
● పంచలింగాల చెక్పోస్టులో తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ కర్నూలు: జిల్లాలోకి పొరుగు రాష్ట్రాల మద్యం కాకుండా నిరంతరం తనిఖీలు చేస్తూ కట్టడి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. గురువారం కర్నూలు శివారు హైదరాబాదు రోడ్డులో ఉన్న పంచలింగాల ఎకై ్సజ్ చెక్పోస్టును జిల్లా అధికారి సుధీర్ బాబుతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ ఐదుగురు సిబ్బంది రెండు షిఫ్టులలో విధులు నిర్వహిస్తుంటారు. అక్కడున్న రికార్డులను డిప్యూటీ కమిషనర్ తనిఖీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్పిరిట్ ట్యాంకర్లు జిల్లాలోకి వస్తే ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని, అలాగే అనుమానిత వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. షిఫ్ట్ విధానంలో అప్రమత్తంగా ఉంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి అక్రమ రవాణాపై కూడా గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, తదితరులు కూడా డీసీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని అనుమానిత వాహనాలను కూడా తనిఖీ చేశారు. లా సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సుల 3, 5, 7, 9 సెమిస్టర్, డిగ్రీ 6వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. -
బారులు తీరిన కష్టాలు
● పెట్రోల్, డీజిల్ అందక వాహనదారుల ఇబ్బందులుఎమ్మిగనూరురూరల్/సెంట్రల్: పెట్రోల్, డీజిల్ అందకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గత ఐదు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంక్లు మూతపడగా, మరికొన్ని ఉన్నదాంట్లోనే వంతులవారీగా ఇస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమానులతో వాహనచోదకులు వాగ్వాదానికి దిగుతున్నారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో జీఎం, మంత్రాలయం రోడ్డులోని రిలయన్స్, ఎంజీ పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. దీంతో వాహనదారులందరూ శివ సర్కిల్లోని పెట్రోల్ బంక్, కర్నూలు రోడ్డులోని పెట్రోల్ బంక్ దగ్గరకు పరుగులు తీశారు. వాహనదారులను అదుపు చేయలేక పెట్రోల్ బంక్ నిర్వాహకులు కొద్దిసేపు పంిపిణీని నిలుపుదల చేశారు. ఎన్నిరోజులు ఈ కష్టాలని చంద్రబాబు ప్రభుత్వంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా డీజిల్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డీజిల్ దొరక్కపోవడంతో ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో మీద తెచ్చిన ఫైనాన్స్ను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పాలకులు చర్యలు తీసుకుని డీజిల్ను అందుబాటులోకి తీసుకురావాలి. – ఉరుకుందు, ఆటో డ్రైవర్, ఎమ్మిగనూరు -
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
● మత్తు వ్యసనాల నిర్మూలన ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ పిలుపుకర్నూలు: కర్నూలును మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు ఈగల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. రాజ్విహార్ సెంటర్లో కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు, ఎకై ్సజ్, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్, డ్రగ్ ఫ్రీ సొసైటీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలందించారు. రాజ్విహార్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈగల్ టీమ్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని యువత నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. యువతను మత్తు వ్యసనాల నుంచి కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ హరిహర తేజ, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చద్దన్నంకు ఆదరణ బాగుంది
చద్దన్నం హోటల్ను నేను గత ఫిబ్రవరిలో ప్రారంభించాను. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చద్దన్నం పదార్థాలను విక్రయిస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరుసటి రోజుకు కావాల్సిన చద్దన్నం తయారీకి సిద్ధమవుతాం. ఉదయం పొంగలి తయారు చేసుకుని రెడీమేడ్గా ప్రజలకు అందిస్తున్నాం. చద్దన్నంకు ప్రజల నుంచి ఆదరణ బాగుంది. – నారాయణమ్మ, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు నేను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రెండు వారాలుగా నాకు, నా భార్యకు చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాను. ఇందులో ముఖ్యంగా అరికెలు, సామలతో చేసిన పదార్థాలు, కారాలు తీసుకుంటున్నాను. నేను రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఆరోగ్య రీత్యా చద్దన్నం రుచులు ఎంతో బాగుంటాయి. –జి. శ్రీరాములు, ప్రైవేటు ఉద్యోగి, కర్నూలు నేను రెండు నెలల క్రితం చద్దన్నం హోటల్ను ప్రారంభించాను. మా వద్ద వరి చద్దన్నంతో పాటు రాగులు, జొన్నలు, అరికెలు, కొర్రలతో చేసిన చద్దన్నాలు, కినోవా, రెడ్రైస్, సామలు, కొర్రలతో చేసిన పొంగలి తయారు చేస్తున్నాం. వీటికితోడుగా మునగాకు, కరివేపాక చట్ని, సూప్లు, ఉల్లి,క్యారెట్, బీట్రూట్లతో తురిమిన మిక్స్, ఆయుర్వేదిక్ కారం పొడి, మజ్జిగ అందిస్తున్నాం. రోజుకు వంద మందికిపైగా వస్తున్నారు. – బాల లక్ష్మి, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు మేము కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉంటున్నాం. రెండు వారాలుగా చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాం. ఒక్కోరోజు ఒక్కో పదార్థాన్ని మధ్యాహ్న భోజనంగా పార్శిల్ తీసుకుంటున్నారు. ఒక పార్శిల్ ఒకరికి సరిపోతుంది. నూనె, మసాలాలు ఉండవు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. వేసవిలో ఇలాంటి ఆహారం ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – రామకృష్ణ, లెక్చరర్, కర్నూలు -
గొప్ప మహనీయుడు భగీరథ మహర్షి
● మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికోసిగి: గంగను భూమిపైకి తీసుకువచ్చిన భగీరథ మహర్షి గొప్ప మహనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలన్నారు. కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామంలో గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భగీరథ మహర్షి గొప్ప మహానీయుడని, ఆయన అడుగు జాడల్లో అందరూ నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీమోహన్ రెడ్డి, వైఎస్సా సీపీ డాక్టర్ల విభాగం జిల్లా నాయకుడు దశరథ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బెట్టన గౌడ, నాడుగేని నాగరాజు, బసిరెడ్డి, కాంట్రాక్టర్ నాగరాజు, గ్రామ ఉప్పర సంఘం నాయకులు పాల్గొన్నారు. -
నేరగాళ్లపై పీడీకిలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్కర్నూలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఫోక్సో కేసులలో 60 రోజుల లోపు చార్జి షీట్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం ఊడుతుంది! డయల్ 112 కాల్స్పై నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగం ఊడుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలని, రాత్రి గస్తీలు, విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలని సూచించారు. రాత్రివేళల్లో గస్తీ తిరిగే పోలీసు బృందాలు మొబైల్ చెక్ డివైజ్ పరికరంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించాలని, అది నేర పరిశోధనకు బాగా పనిచేస్తుందన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలని, గట్టిగా పనిచేయకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రొబేషనరీ ఎస్ఐలు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
వీఓఏలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఏఓ)కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో 908 వీఏఓలకు శ్యామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు వీఏఓలు అందించే సేవలు చాలా ఉంటాయని, వారికి అవసరమైన సాంకేతికను అందిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉండడంతో 5జీ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమలో డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. మల్లన్న సేవలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు గౌతమ్రాజు, దాసు తదితరులు ఉన్నారు. -
నేడు సీక్యాంప్ రైతుబజార్ బంద్
కర్నూలు(అర్బన్): నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ను ఈ నెల 24వ తేదీన ( శుక్రవారం ) బంద్ చేస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలలో ఒక రోజు రైతు బజార్ను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నందున ఈ బంద్ను నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పనులు చేపడుతున్న దృష్ట్యా ఎలాంటి వ్యాపారాలు జరగబోవన్నారు. యథాతథంగా శనివారం రైతు బజార్ పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. ఇద్దరు విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డా.ఎన్.బి లోకరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు కేజీబీవీల్లో చదివిన షేక్ ఆఫ్రీన్ ఒకేషనల్ గ్రూప్ కంప్యూటర్ సైన్స్లో 990 మార్కులు సాధించారని, పంచలింగాల కేజీబీవీకి చెందిన గుడిసె చందన ఒకేషనల్ గ్రూప్ అకౌంటెన్సీ–టాక్సేషన్లో 987 మార్కులు సాధించారని పేర్కొన్నారు. వీరిద్దరూ షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికయ్యారన్నారు. కోవెలకుంట్ల: గతేడాది ఆగస్టు నెలలో జరిగిన చైన్స్నాచింగ్ కేసులో దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ హనుమంతునాయక్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సత్యసాయిబాబా ఆలయ సమీపంలో నివా సం ఉంటున్న లక్ష్మీకుమారి గతేడాది ఆగస్టు 24వ తేదీన ఇంటి పక్కన మహిళలతో వాకింగ్కు వెళ్లింది. ఆ సమయంలో మహిళల వద్దకు గుర్తు తెలియని 35 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి వారి వెనుకనే వాకింగ్ చేస్తున్నట్లు నటించి వారిని దాటే వెళ్లే సమయంలో లక్ష్మికుమారి మెడలో ఉన్న నల్లపూసలదండ, బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తాడు. కొంతదూరంలో మరో వ్యక్తి బైక్తో సిద్ధంగా ఉండగా ఆ బైక్ ఎక్కి ఇద్దరు అక్కడి నుంచి గుంజలపాడు గ్రామం వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని చేధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షేక్ తహలిబ్ ఉసేన్, షేక్ దిల్వర్ చోరికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్ చే సి నల్లపూసలదండ, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దొంగలను కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. -
పోలీసు శాఖలో బదిలీలు
కర్నూలు : పోలీసు శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా బుధవారం 15 మంది ఏఎస్ఐలు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 93 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 133 మందిని బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాతో కలసి కౌన్సెలింగ్ నిర్వహించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను పూర్తి చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పూర్తిచేసుకున్న పోలీసులకు నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టారు. గతంలో పనిచేసిన పోలీస్స్టేషన్లు కాకుండా సొంత మండలం, నియోజకవర్గం మినహాయించి ఇతర పోలీస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న వాటిని బోర్డుపై చూపించి ఐదు ఆప్షన్లు ఇచ్చి కోరుకున్న స్థానాలకు నియమిస్తూ బదిలీ చేశారు. బదిలీ అయినవారు ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ విధుల నుంచి వెంటనే వైదొలిగి కేటాయించిన స్టేషన్లో బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెసేజ్ ద్వారా కౌన్సెలింగ్కు పిలుపు... బదిలీలకు సంబంధించిన జాబితా ముందుగానే సిద్ధం చేసి శాంతి భద్రతలు, ట్రాఫిక్, మహిళతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారికి కమ్యూనికేషన్ విభాగం ద్వారా ముందురోజు మెసేజ్ రూపంలో సమాచారం పంపారు. ఉదయమే సిబ్బంది అంతా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లతో పాటు వివిధ విభాగాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. అనారోగ్యం, స్పౌజ్ కేసులకు ప్రాధాన్యత కల్పించారు. పోలీసు సిబ్బందికి కోరుకున్న చోటుకే నియమించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు సిబ్బంది తరఫున ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీపీఓ ఏఓ విజయలక్ష్మితో పాటు సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. -
ఆసుపత్రిలో మాయమై ... శ్మశానంలో ఖననమై
ఆత్మకూరురూరల్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆపై కనిపించకుండా పోయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా.. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి చెందిన సుగులూరి శేఖర్(47)అనారోగ్యంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఈనెల 13 వ తేదీన చేరారు. ఆయన భార్య జయమ్మ మందులు తీసుకు రావడానికి బయటకు వెళ్లివచ్చిలోపు శేఖర్ కనిపించ లేదు. ఎంత వెతికినా ఆయన ఆచూకీ చిక్కక పోవడంతో జయమ్మ స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 18 న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు శేఖర్ ఫొటోతో కరపత్రాలు ముద్రించి గోడలకు అతికించా రు. స్థానిక శ్మశాన వాటికలో పనిచేసే ఓ వ్యక్తి ఆ ఫొటోను చూసి తమ వద్దకు అనాథ శవంగా రాగా అంత్యక్రియలు చేసినట్లు శేఖర్ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో బుధవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఎలా చనిపోయాడో తెలుస్తుందని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. -
కాలేయానికి కష్టం!
శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది కలిగినా అవి మనకు హెచ్చరిక చేస్తాయి. కానీ కాలేయం మాత్రం తనకు ఎంత ఇబ్బంది కలిగినా ఓర్పు, సహనంతో పనిచేసుకుంటూ పోతుంది. ఇదే మనుషుల పాలిట శాపంగా మారుతోంది. పసిరికలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించే సమయానికి కాలేయానికి గణనీయమైన నష్టం జరిగి ఉంటోంది. ఈ కారణంగానే ఈ అవయవాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం (జీర్ణకోశవ్యాధుల విభాగం)లో ప్రతిరోజూ ఓపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ విభాగానికి రోగు ల తాకిడి అధికమైంది. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇందులో జీవనశైలి సమస్యలు,ఆహారం విషతుల్యం కావడం,ఇన్ఫెక్షన్లు, మద్యపానం తదితర కారణాల తో కాలేయం దెబ్బతిని చికిత్స కోసం వచ్చే వారు అధికమవుతున్నారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు ప్రతిరోజూ 1,500 మంది దాకా వివిధ రకాల జీర్ణకోశ వ్యాధుల తో వస్తుండగా అందులో పావు భాగం మద్యపానం కారణంగా కాలేయ సమస్యలకు గురైన వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం, హెపటైటిస్–బి,సి వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయం దెబ్బతింటోంది. కొంపముంచుతున్న మద్యపానం సరదాగా స్నేహితులతో ప్రారంభమయ్యే మద్యపా నం అలవాటు కొన్నాళ్లకు వ్యసనమై కాలేయానికి పెనుముప్పుగా మారుతోంది.వ్యసనపరులకు ప్రతి రోజూ మద్యం ముట్టనిదే రోజు గడవని పరిస్థితి ఉంటోంది.ఈ కారణంగా శరీరంలో ముందుగా కాలేయం,దాంతో పాటు గుండె,రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. కొందరిలో బీపీ,షుగర్ వ్యాధులూ వస్తున్నాయి. కాలేయ సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్న వారిలో 25 శా తం మద్యపానం వల్లేనని నిర్ధారణ అవుతోంది. ప్ర భు త్వం నాణ్యమైన మద్యం పేరుతో దుకాణాలు పెంచి విచ్చలవిడిగా సరఫరా చేస్తోంది. వ్యసనపరులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం తాగి ఒళ్లుగుల్ల చేసుకుంటూ కాలేయ వ్యాధుల భారిన పడుతున్నారు. కాలేయ వ్యాధి లక్షణాలు కాలేయ సమస్యలతో బాధపడే వారిలో కాళ్లు, చీలమండలాల్లో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపునొప్పి, మూ త్రం రంగులో మార్పు, పొట్టుచుట్టూ దురద, ఎరు పు చర్మం, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవ్వరిలోనైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే నయం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరాక తీసుకుంటే ఫలితం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంవత్సరం ఓపీడీ ఎండోస్కోపిలు కాలేయ సమస్యల మద్యపానంతో 2021 12,131 3,024 940 13 2022 14,065 3,700 1,062 36 2023 14,837 5,965 1,303 41 2024 17,578 6,104 1,450 61 2025 18,612 7,115 1,518 65 2026 5,790 1,824 495 19 (ఇప్పటివరకు)కాలేయ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెద్దాసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగంలో ఇటీవల పెరిగింది. చికిత్స కోసం వచ్చే వారికి అవసరమైన వైద్యపరీక్షలు, మందులు, చికిత్స ఉచితంగా అందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెపటైటిస్–బి,సి వ్యాధులతో బాధపడే వారికి ఖరీదైన మందులను ఉచితంగా ఇస్తున్నాము. కాలేయం దెబ్బతినకుండా ఉండాలంటే మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. – డాక్టర్ జి.మోహన్రెడ్డి, హెచ్ఓడీ, గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలుగత రెండు దశాబ్దాల్లో కాలేయ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ల్యాపరోస్కోపిక్ సర్జరీల ద్వారా చిన్నకోతలతో ట్యూమర్లు తొలగించడం, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకోవడం సాధ్యమవుతోంది. దేశంలో లివర్ డోనర్ కొరత ఉన్న నేపథ్యంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతో కీలకంగా మారింది. –డాక్టర్ ఎస్.జె.జానకిరామ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు ప్రమాదంలో ప్రధాన అవయవం ఒకవైపు ఫ్యాటీ లివర్, మరోవైపు హెపటైటిస్ వేధింపు మద్యపానమే అసలు సమస్య జిల్లాలో పెరుగుతున్న కాలేయ బాధితులు -
నీరు వదలకపోతే నేనే వస్తా!
● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిఆదోని అర్బన్: ‘ఎండాకాలంలో నీరు వదలకపోతే ప్రజలు ఎలా జీవించేది.. తమాషా చేస్తున్నారా.. నీరు వదలకపోతే నేనే అక్కడికి వచ్చి కూర్చుంటా... వెంటనే నీరు వదలండి.. లేదంటే ట్యాంకర్లను అయినా పంపండి’ అంటూ అధికారులపై ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీవాసులు వారం రోజులైనా నీరు వదలడంలేదని బిందెలు పట్టుకుని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి స్వగృహానికి బుధవారం వచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన మాజీ ఎమ్మెల్యే... తన దగ్గరకు ఎందుకు వస్తారు, ఎమ్మెల్యే ఉన్నారు కదా అక్కడికి వెళ్లండి అని సమాధానం చెప్పారు. దీంతో కాలనీవాసులు ‘ఎమ్మెల్యే ఎక్కడున్నాడు.. యాడుంటారో మాకు తెలియదు... మాకు మీరే ఎమ్మెల్యే మీరే అన్నీ’ అని చెప్పడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. నీరు వదలాలని, లేదంటే ట్యాంకర్లను అయినా పంపాలని ఆదేశించారు. నీరు వదలకపోతే నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను అని హెచ్చరించారు. వెంటనే నీరు వదిలి తన ఫోన్ చేయాలన్నారు. అధికారులకు ఫోన్ చేసిన గంటలోనే సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రజలు తమ దాహార్తిని తీర్చిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. -
పెద్దపాడు సంజీవయ్య బాలసదన్ హాస్టల్ తనిఖీ
కర్నూలు : నగర శివారులోని పెద్దపాడులో ఉన్న దామోదరం సంజీవయ్య బాలసదన్ హాస్టల్ను న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్ లోని అపరిశుభ్ర పరిస్థితులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజన వస తి సదుపాయాల గురించి విచారించగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, గుడ్లు అందరికీ సరఫరా చేయడం లేదని విద్యార్థులు జడ్జికి విన్నవించారు. దీంతో అక్కడి సిబ్బందిపై లీలా వెంకటశేషాద్రి ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లలకు సరైన సమయంలో నాణ్యమైన భోజనం, అందరికీ గుడ్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
‘ఎల్నినో’ను సమర్థంగా ఎదుర్కొందాం
కర్నూలు(అర్బన్): రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం అని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సాలురెడ్డి అన్నారు. పసుపుల ఆర్ఎస్కేలో బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలురెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా నిలకడైన వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. ఘన జీవామృతం, విత్తనాల పెల్లైటెజేషన్ ప్రాముఖ్యతను ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రాజేశ్వర్, జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం మాధురి వివరించారు. డీఆర్సీ ఏఓ రంగారెడ్డి, హెచ్ఓ నరేష్కుమార్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రుఫస్ రోనాల్డ్, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మంఠంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.3,25,96,854 సమకూరింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశానుసారంగా హుండీ లెక్కింపునకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక సారి కౌటింగ్ హాల్లోనికి ప్రవేశించిన తరువాత ఎవరినీ ఏ కారణంతోనూ బయటకు అనుమతించలేదు. హుండీ లెక్కింపునకు ఆలస్యముగా వచ్చే వారికి ప్రవేశం లేదు అని సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. నగదు రూపేణా రూ. 3,15,62,354, నాణేల రూపంలో రూ.10,34,500 వచ్చినట్లు వివరించారు. అలాగే 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్–2 వెంటేష్ జోషి,ఇంజనీర్ సురేష్కోనాపూర్ తెలిపారు. అక్రమంగా యూరియా అమ్మితే చర్యలు కర్నూలు(అర్బన్): ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కడైనా యూరియా అమ్మకాలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశాల మేరకు కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని పలు పరిశ్రమల్లో యూరియా నిల్వలు, విక్రయాలు నిర్వహిస్తున్నారా అనే అంశంపై సివిల్ సప్లైస్ డీఎం, ఇండస్ట్రియల్ ఆఫీసర్, కార్మిక శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు యూరియాను అక్రమంగా నిల్వ ఉంచుకోరాదని, విక్రయాలు జరపరాదని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు జరిగాయని, వాటిలో ఇంకా మొద లు కాని పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ అయ్యారు. బుధవారం జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,338 మందికి 7,525 మంది విద్యార్థులు హాజరు కాగా 807 మంది గైర్హాజరయ్యారు. ఓర్వకల్ జడ్పీహెచ్ కేంద్రంలో ముగ్గురు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల, కోడుమూరు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి కర్నూలు(అర్బన్): నగరంలో ఏర్పాటు చేయనున్న సఖీ నివాస్ ( వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ) కోసం మానవ వనరుల సరఫరా నిమిత్తం నమోదిత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి, సాధికారత అధికారి పి. విజయ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం ఆరు పోస్టులకు అర్హత కలిగిన సంస్థలు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులలు అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం కర్నూలు కలెక్టరేట్లోని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. 24 న హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్) : ఈ నెల 24 వ తేదీ స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్–19 విభాగంలో బాల బాలికల జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 9, 10 తేదీల్లో కదిరి పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొనదలచిన క్రీడాకారులు వెంట వయస్సు ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని సూచించారు. బైక్లు ఢీ.. వ్యక్తి మృతి పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రామం వద్ద బ్రిడ్జిపై బుధవారం ఎదురెదురు గా బైక్లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వెలుగోడు ద్వారకా నగర్కు చెందిన సయ్యద్నూర్ (46) బైక్పై వెలుగోడుకు బయలుదేరాడు. బానుముక్కల గ్రామానికి చెందిన జాకీర్ వెలుగోడు నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. బ్రిడ్జి వద్దకు రాగానే సయ్యద్నూర్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో నూరు మృతిచెందగా జాకీర్కు గాయాలయ్యాయి. మృతుడికి భార్య సయ్యద్ రమిజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తగ్గిన వేరుశనగ ధర ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధర క్వింటం రూ.6,670కు పడిపోయింది. బుధవారం మార్కెట్కు వేరుశనగ దిగుబడులు 190 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం ధర గరిష్టంగా రూ.6,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటం రూ.5,490, మధ్యస్థ ధర రూ.6,080 పలికినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆముదాలు 34 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,870, మధ్యస్థ ధర రూ.5,890, గరిష్ట ధర రూ.5,910, కందులు కేవలం రెండు క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,520 పలికిందన్నారు. బావిలో పడి వివాహిత మృతి నందవరం: ప్రమాదవశాత్తూ బావిలో పడి వివాహిత మృతి చెందాడు. మండల పరిధిలోని ఇబ్రహీంపురం గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన కురవ మల్లేశ్వరి (45) బుధవారం బట్టలు ఉతకడానికి స్థానిక బావి వద్దకు వెళ్లింది. బట్టలు ఉతికే సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడిపోయింది. బంధువుల పెళ్లి నిమిత్తం నదికై రవాడి గ్రామానికి వెళ్లిన ఆమె భర్త మల్లికార్జున మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య మల్లేశ్వరి కనిపించకపోడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎక్కడా కనిపించకపోవడంతో బావి వద్దకెళ్లి చూడగా గట్టుపై బట్టలు, చెప్పులు కనిపించాయి. అనుమానంతో గ్రామస్తుల సాయంతో ట్రాక్టర్ల ద్వారా బావిలోని నీరు తోడించగా భార్య మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


