దేవుడంటే బాబుకు నమ్మకమే లేదు
బొమ్మలసత్రం: తిరుమల పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అన్నారు. పట్టణంలోని గుడిపాటిగడ్డ వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూప్రసాదాన్ని రాజకీయానికి వాడుకోవడం తగదన్నారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుదాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


