Kurnool District News
-
కర్నూలు డీడీఓగా అశ్వినీకుమార్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా డ్వామాలో విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.అశ్వినీకుమార్ను కర్నూలు డీడీఓగా నియమించారు. కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న జీవీ రమణారెడ్డిని కర్నూలు జిల్లా పరిషత్ సీఈఓగా నియమించిన విషయం విదితమే. అలాగే అనంతపురం నుంచి జి.శివశంకర్ను పత్తికొండ డీడీఓగా నియమించారు. ఈ నేపథ్యంలో అనంతపురం డీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగశివలీలను కర్నూలు డ్వామా ఏఓగా నియమించారు. స్వీయ గణనలో పాల్గొనాలి కర్నూలు(సెంట్రల్): స్వీయ గణనలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భారతదేశ జనగణన –2027లో భాగంగా డిజిటల్ విధానం ద్వారా కలెక్టర్ తన మొబైల్లో స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జనగణనకు సంబంధించి ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వయ గణనలో ప్రతి కుటుంబం పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వీయ గణన పక్రియ సులభమైనదని, వేగవంతమైనదని, దానిని పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే www.se.census.gov. in పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు. పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకం ● సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ కర్నూలు: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మేకల మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి హోంగార్డులకు శుక్రవారం ‘ప్రత్యేక పరేడ్’ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డులు ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. రోడ్డు భద్రతపై కూడా హోంగార్డులు అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు.అనంతరం నిర్వహించిన దర్బార్లో హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ ప్రసాద్, హోంగార్డ్స్ ఇన్చార్జి ఆర్ఐ పోతుల రాజు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మహిళలకు సముచిత స్థానం కల్పించిన జగనన్న
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయమనోహారికర్నూలు(టౌన్): 2019 సంవత్సరం మే 30వ తేదీ నుంచే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్ట సభల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు సముచిత గౌరవం కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మించి మహిళలకు సీట్లు, పదవులు కేటాయింన ఘనత జగనన్నదేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పదవి, హోంమంత్రి పదవి, మహిళా సంక్షేమ శాఖలను మహిళలకే కేటాయించారన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాణించాలని జగనన్న ఐదేళ్ల క్రితం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అమ్మ ఒడి, చేదోడు, ఆసరా, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చారన్నారు. మోసగించడం చంద్రబాబు నైతం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మహిళలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి ఇంటింటికి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని హడా వుడి చేశారన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలు జగనన్నకు రుణపడి ఉంటారన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం వైఎస్ జగన్ పాలన డార్క్ డేస్ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ మేయర్, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుక, సిట్రా సత్యనారాయణమ్మ ఖండించారు. జగనన్న పాలనంతా మహిళలకు గోల్డెన్ డేస్ అన్నారు. జగనన్న పాలన గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను, మహిళా ఉద్యోగులను వేధించడం, దారుణంగా కొట్టడం వంటి ఘటనలు ఈ ప్రభుత్వంలో కోకొల్లలు అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దిశ చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చిన ఘనత జగనన్నదే అన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు కార్పొరేటర్లు మునెమ్మ, నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ నాయకులు హేమలత, కమలా, కాంతమ్మ, లలితమ్మ,షేకూన్, స్వర్ణలత, విజయ లక్ష్మీ, రమిజాబీ పాల్గొన్నారు. -
నేడు కొత్త కోర్టులు ప్రారంభం
● హాజరుకానున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కర్నూలు: జిల్లాకు కొత్తగా మంజూరైన న్యాయస్థానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కర్నూలులో నూతనంగా 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, జిల్లాకు చెందిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ.హరిహరినాథ శర్మలు ప్రారంభించనున్నారు. కొత్త కోర్టుల ప్రారంభానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి వారం రోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రస్తుతానికి రెండు కోర్టులను కర్నూలు, నాలుగు కోర్టులను నంద్యాలలో, నందికొట్కూరులో ఒకటి తయారు చేయించారు. కర్నూలులో మరో అదనపు జిల్లా కోర్టు, మరో రెండు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రారంభం కోసం భవనాల అన్వేషణ జరుగుతోంది. త్వరలో కొత్తగా మంజూరైన అన్ని కోర్టులను ప్రారంభించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం నందికొట్కూరులో కొత్త కోర్టు ప్రారంభించి ఆ తర్వాత కర్నూలు జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తుల వర్క్షాప్ తర్వాత సాయంత్రం కొత్త కోర్టులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గం సంయుక్తంగా నిర్వహించనున్నారు. -
మసీదు పత్రాలను అందిస్తేనే గౌరవ వేతనాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మసీదులకు సంబంధించిన పత్రాలను ఈ నెల 30వ తేదిలోగా అందజేస్తేనే ఆయా మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు విడుదలవుతాయని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయిదా సబీహా పర్వీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మసీదు కమిటీ ప్రెసిడెంట్ లేదా ముత్తవలి ఆయా డాక్యుమెంట్లను జిల్లా వక్ఫ్బోర్డు కార్యాలయంలో అందించాలన్నారు. మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదుకు సంబంధించిన స్థలం పత్రాలను కచ్చితంగా సమర్పించాలన్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆదేశాలను ఆయా మసీదులకు చెందిన వారు తప్పక పాటించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కంటి ఆపరేషన్ల వివరాల నమోదు తప్పనిసరి కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో ఇకపై నిర్వహించే కంటి ఆపరేషన్లను తప్పనిసరిగా వెబ్పోర్టల్లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎంహెచ్ఓ తన ఛాంబర్లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేది నుంచి దృష్టిలోప నివారణ వెబ్ పోర్టల్లో ఆపరేషన్ చేసిన రోగుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ హిమబిందు, ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం కర్నూలు(అర్బన్): అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు జంక్ ఫుడ్తో నష్టాలను, హెల్తీ ఫుడ్తో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించాలని ఐసీడీఎస్ ఆర్జేడీ రోహిణి తెలిపారు. శుక్రవారం కర్నూలు అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా ఉత్సవాలను నిర్వహించారు. అర్బన్ సీడీపీఓ అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోహిణి మాట్లాడుతూ మొదటి ఆరు సంవత్సరాల్లో పిల్లల మెదడు అభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి సారించడం పోషణ్ పక్వాడా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 19న అక్షయ తృతియ రోజున బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున బాల్య వివాహ రహిత భారత్ ప్రచారంలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1800–102–7222 లేదా చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోషక విలువలపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ సౌజన్య, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సంజామలలో 44.8
నిర్మానుష్యంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతం కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత ఉమ్మడి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమైంది. బయట తిరగడం పక్కనపెడితే.. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో హీట్వేవ్ కొనసాగుతోంది. సంజామలలో ఈ నెల 16న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు నమోదైంది. 17న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఎండల తీవ్రతతో ఈ మండలం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 183 చలివేంద్రాలు ఏర్పాటు చేశారట! ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా.. పాదచారులకు తగిన ఉపశమన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ఎరువులు, పురుగుమందులు, విత్తన షాపుల ఎదుట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా.. చలి వేంద్రాలు, చలువ పందిళ్లు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. జిల్లా మొత్తం మీద ప్రభుత్వం, లోకల్ బాడీస్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి 183 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 10 శాతం వరకు పనిచేయడం లేదు. చలివేంద్రాల ఏర్పాటులో అంకెలగారిడీ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని 9 పాంత్రాల్లో 12 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు వంటి పట్టణాల్లో చలువ పందిళ్ల జాడ లేకపోవడం గమనార్హం.మండలం ఉష్ణోగ్రత ఆళ్లగడ్డ 44.5 బనగానపల్లి 43.7 రుద్రవరం 43.7 కొత్తపల్లి 43.6 కోడుమూరు 43.6 వెల్దుర్తి 43.6 మంత్రాలయం 43.5 నంద్యాల రూరల్ 43.5 చాగలమర్రి 43.4 కర్నూలు 43.4 ఉయ్యాలవాడ 43.3 కోవెలకుంట్ల 43.3 గూడూరు 43.1 దొర్నిపాడు 43.1 కల్లూరు 43.1 చిప్పగిరి 43 మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలురానున్న రోజుల్లో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు, వడగాలుల తీవ్రత నంద్యాల జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 నుంచి 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంజమల మండలంలో కొనసాగుతున్న హీట్వేవ్ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సంజామలలో 44.8.. ఆళ్లగడ్డలో 44.4 డిగ్రీలు నమోదు అధికమైన విద్యుత్ వినియోగం గిర్రున తిరుగుతున్న విద్యుత్ మీటర్లు 0 -
సమష్టి పోరు
రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు. రాయలసీమ గురించి జగనన్న రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు మేలు చేసే విధంగా జగనన్న చేస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కోసం నిలిపివేయడం దారుణం. రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుందాం. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రజలు, రైతుల గురించి ఆలోచిస్తున్న జగనన్నకు మద్దతుగా ఉద్యమ బాట పడదాం. – బుట్టా రేణుక, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాట్లాడుతున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులుకర్నూలు(టౌన్): చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైతులంటే ఆయనకు గిట్టదు. తాగునీరు, సాగునీటి విషయంలో సీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇక పోరుబాట తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీమ ప్రాంత పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే సీమలో నీళ్లు పారాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం అమరావతి జపం సాగుతోందన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు.. సీమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట తప్పదని నేతలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు– సమాలోచన’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి, మద్దూరు సుభాష్ చంద్రబోస్, పార్టీ నేతలు షరీఫ్, కిషన్, రాఘవేంద్ర, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, నరసింహులు యాదవ్, రామాంజనేయులు, మహిళా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, సిట్రా సత్యనారాయణమ్మ, గాజుల శ్వేతారెడ్డి, సిద్దారెడ్డి రేణుకా, అరుణ, మంగమ్మ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు. 1995 సంవత్సరం నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎం అయిన దివంగత వైఎస్సార్ వల్లే ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులతో నీళ్లు పారాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నా ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. వేదావతి, గుండ్రేవుల కోసం ఉద్యమిద్దాం. లిఫ్ట్ పనులు సాధించుకుందాం. సీమకు అన్యాయం జరుగుతున్నా రాయలసీమ టీడీపీ నేతలకు పౌరుషం లేదా?. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుదాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ ప్రాంతానికి చెందిన 26వేల మంది రైతులు త్యాగం చేశారు. ఊళ్లు ఖాళీ చేశారు.. గూడు కోల్పోయారు. మరి అమరావతిలో 28వేల మంది రైతుల త్యాగం మాత్రమే చంద్రబాబుకు కనిపిస్తుందా. సీమ రైతులది త్యాగం కాదా. సీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం జగనన్న రూ.900 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. 10 శాతం పనులతో మొత్తం లిఫ్ట్ పూర్తవుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని లిఫ్ట్ పనులు నిలిపేశావు. లిఫ్ట్ వల్ల 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. – ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏడారి చేసే కుట్రలు చేస్తున్నారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తెలంగాణ సీఎం అడిగారని పనులు నిలిపివేయించారు. సీమ ద్రోహి చంద్రబాబు. సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై పోరాటం చేద్దాం. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతం అంటే చిన్న చూపు. సీమలో పుట్టిన చంద్రబాబుకు చీము నెత్తురు లేదు. దివంగత నేత వైఎస్సార్ రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఆచరణలో చూపిస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఏ మాత్రం సాధ్యం కాదన్నారు. గురు శిష్యులు కలిసి రాయలసీమ రైతాంగాన్ని దగా చేశారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే రాయలసీమకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. సీమకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాంత రైతులు, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుడితే ఆ పనులు నిలిపివేసి చంద్రబాబు ద్రోహిగా నిలిచారు. సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. – డాక్టర్ మధుసూదన్, ఎమ్మెల్సీ సీమ ప్రాంతానికి న్యాయం జరిగిందంటే ఒక్క వైఎస్సార్ కటుంబంతోనే. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44వేలకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపి వేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుదాం. లిఫ్ట్తో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్తెలంగాణ సీఎంకు సీమ ప్రాంతంలో జరుగుతున్న లిఫ్ట్ పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడు గిఫ్గ్గా ఇచ్చారు. సీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. జగనన్న హయంలో మంజూరైన లా యూనివర్సిటీని కూడా తరలించారు. హైకోర్టును లేకుండా చేశారు. తెలంగాణ కోసం 6 జిల్లాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. – బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిరెండేళ్లలో చంద్రబాబు నాయుడు 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం ప్రారంభించారా?. 10 పైసలు ఖర్చు చేసి వంద రూపాయిల బిల్డప్ తప్ప ఆయన చేసిందేమీ లేదు. రాయలసీమ వ్యక్తి అయిన చంద్రబాబు ఎప్పుడూ అమరావతి జపమే చేస్తున్నాడు. సీమ ప్రాంత ప్రజలు ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – వై.సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా సిగ్గు పడాలి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. సీమ ప్రాంత రైతులను దగా చేశారు. రైతులంటే ఎందుకంత కోపం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే లిఫ్ట్ పనులు నిలిపి వేసి చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం సీమ ప్రజలను నాశనం చేస్తావా? ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు. హంద్రీనీవా అంటే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు రైతులకు ఏం చేశాడో చెప్పాలి. – కంగాటి శ్రీదేవి, పత్తికొడ మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. సీమలోని రైతులు, ప్రజల దాహార్తి పట్టదా. భావి తరాల కోసం మనందరం పోరాడుదాం. ప్రాజెక్టులను సాధించుకుందాం. – ఎస్వీ విజయ మనోహరి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద సీమ ప్రజలకు, రైతుల కోసం జగనన్న లిఫ్ట్ పనులు ప్రారంభిస్తే వాటిని తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు నిలిపివేసి సీమకు అన్యాయం చేస్తున్నారు. సీమలోని టీడీపీ నాయకులు రాయలసీమ ప్రాజెక్టు సాధనకు కలిసి రాకుంటే పుట్టగతులుండవు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం సాగిస్తాం. – రాజీవ్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయ కర్త కర్నూలును రాజధానిగా కొనసాగించి ఉంటే బెంగళూరు, చైన్నె తరహాలో అభివృద్ధి సాధించేది. సీమ ప్రాంతాన్ని వైఎస్ కుటుంబం తప్ప ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగనన్న ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించుకుందాం.గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై ప్రజలను, రైతులను చైతన్యం చేద్దాం. ఇక సీమ రైతులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – తలారి రంగయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతుంది. రాయలసీమలో భూమి మంచిదే. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో రిజర్వాయర్లు నిర్మించారు. జగనన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీమ రైతుల త్యాగం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను అవమానిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది. – వంగాల భరత్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి చంద్రబాబు సీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు అమరావతి జపం చేస్తున్న టీడీపీ నేతలు సీమ ప్రాంత అభివృద్ధి పూర్తిగా విస్మరించారు కర్నూలులో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ సదస్సు గళం వినిపించిన సీమ ప్రాంత ముఖ్య నేతలు -
మృత్యు పంజా!
చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలంలో క్షతగాత్రులుకర్నూలు (హాస్పిటల్): అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన భార్య, అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మృతిని కళ్లారా చూసి గుండెపగిలేలా రోదిస్తున్న వ్యక్తి ఒకరు.. చెట్టంతా కు మారుడు, ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి లోకం వీడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు.. తీవ్రంగా గాయపడి హహాకారాలు చేస్తున్న క్షతగాత్రు లను చూసి చీకట్లో మృత్యువు వికటాట్టహాసం చేసింది. అందరూ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వా హనం గమ్యానికి చేరువైంది. ఇంతలో ఉలిక్కిపాటు. రెప్పపాటులో ఘోరం. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ చీకట్లు.. ఆర్తనాదాలు. ఘటనా స్థలం రక్తసిక్తం. కొందరు అప్పటికే ప్రాణం విడిచారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులపై మృత్యువు పంజా విసిరింది. మలుపులో మాటు వేసి లారీ రూపంలో ఎనిమిది మందిని మింగేసింది. కొందరు గాఢ నిద్రలోనే కన్నుమూశారు. సమీపంలోని పల్లె ప్రజలు మృత్యుకేకతో ఉలికిపడ్డారు. మరి కొద్ది నిమిషాల్లో దైవ స్మరణలో తరలించాల్సిన వారిలో కొందరు విగతజీవులుగా మారగా.. మరి కొందరు క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు గూడ్స్ వాహనంలో మంత్రాలయం వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఫయాస్ మిల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. క్షతగ్రాతుల భాష అర్థం కాక వైద్యుల సతమతం.. చిలకలడోణ రోడ్డు ప్రమాద క్షతగాత్రులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ హాహాకారాలు అక్కడి వారిని కలిచి వేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో అమృత(11), తేజస్విని(15), దీక్షిత(16), వర్షిత(19), శుభ (34), జయమ్మ(60), ధన్యశ్రీ(14), దీపక్(16), ప్రతాప్(14), సునీత(20), భారతి(40), సునీల్కుమార్(25) ఉన్నారు. వీరిలో తేజస్విని, శుభల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరికి కాళ్లు, చేతులు విరగ్గా, మరికొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో 12 నుంచి 15 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. వారు బాధతో అల్లాడిపోయారు. చికిత్స సమయంలో వారు వారికి వచ్చిన కన్నడ భాషలో నొప్పిగా, బాధగా ఉందని, ముట్టుకోవద్దని విలపించారు. మరోవైపు క్షతగాత్రులు ఏమి చెబుతున్నారో అర్థం గాక.. కన్నడ భాష అర్థం కాని వైద్యులు, సిబ్బంది చికిత్స అందించడంలో సతమతమయ్యారు. కన్నడ భాష స్వల్పంగా తెలిసిన వారు దగ్గరుండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారులు బాధతో విలవిలలాడి కొద్దిసేపు మూర్చపోయారు. చాలా మందికి అంతర్గతంగా అవయవాల్లో గాయాలు ఉండటంతో వారు కదలలేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. క్షతగ్రాతులను కలెక్టర్ సిరి పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.మృతులు తల్లీబిడ్డ వీణ, నిషిత (ఫైల్), ప్రమాదంలో బయటపడిన వీణ భర్త రాజేష్ ఎమినిమిది మంది మృత్యువాత, 12 మందికి తీవ్రగాయాలు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అందరూ కర్ణాటక రాష్ట్ర వాసులే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం -
నోటీసులు ఇవ్వకుండా శ్రీహరిని అరెస్టు చేయడమేంటి?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్యకర్నూలు (టౌన్): పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీహరి ఒక జర్నలిస్టుగా పనిచేశారన్నారు. మీడియా ఇన్చార్జ్గా పనిచేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. ‘అసలు నోటీసులు ఇచ్చారా.. భయభ్రాంతులు చేయడం కోసమే కదా.. ఆటవిక పాలనలో ఉన్నామా..? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున అంబేడ్కర్కు దండలు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు అర్హుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభు త్వం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. శ్రీహరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అతన్ని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అవకాశం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
తల్లిదండ్రులు ప్రోత్సహించారు
సాఫ్ట్వేర్ ఇంజినీరు అవ్వడమే లక్ష్యం. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నా. ఇంటర్ ఫస్టియర్లో 470 మార్కులకు 459 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం మరింత బాగా చదివి మంచి మార్కులు సాధిస్తాను. జేఈఈ, ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వారితోపాటు చదువు చెప్పిన గురువులకు కూడా నా వందనాలు. – మాదినేని లహరి, ఇంటర్ ఫస్టియర్, కర్నూలు మాది మధ్యతరగతి కుటుంబం. కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం స్వస్థలం. మా నాన్న నన్నూరి రుద్రన్న ఓ చిరుద్యోగిగా పని చేస్తూ నన్ను, మా అన్నను చదివిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి అన్న ఉద్యోగం చేస్తున్నా రు. మా నాన్న ఐఏఎస్ సాధించాలనుకున్నా...ఆర్థిక ఇబ్బందులతో ఆ వైపుగా వెళ్లలేకపోయారు. నాకు ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 989 మార్కులు వచ్చాయి. నాన్న కలను సాధించేందుకు ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నాను. – నన్నూరి హాసిని, కర్నూలు రూరల్ మండలం రేమట గ్రామం -
బాలుడి గొంతులో చిక్కుకున్న గోలి
● గోలిని తీసి ప్రాణం కాపాడిన ఆదోని వైద్యురాలు ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి ఈర న్న, ఉష దంపతుల నాలుగేళ్ల కుమారుడు హన్విత్ ఇంటి దగ్గర ఆడుకుంటూ గోలిని మింగేశాడు. అది గొంతులో చిక్కుకుని నొప్పి వస్తూ గాలి తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని చూసి వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు ప్రసూన వెంటనే బాలుడి పరిస్థితిని చూసి ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల సమయంలోనే శస్త్ర చికిత్స లేకుండా, కుట్లు, కోతలు లేకుండా గోలిని సులభంగా బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
కొట్టేసిన ఫోన్లు పట్టేశారు
కర్నూలు: రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. బాధితులు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు విడతల్లో రూ.3.70 కోట్ల విలువ చేసే 1,873 సెల్ఫోన్లను రికవరీ చేయగా, తాజాగా నాలుగో విడత రూ.1.10 కోట్ల విలువ చేసే 529 సెల్ఫోన్లను రికవరీ చేశారు. బాధితులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఎస్పీ చేతుల మీదుగా రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్రావు, శివశంకర్, మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు. మొబైల్ పోగొట్టుకుంటే.. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీస్ వెబ్సైట్ http://kurnoolpolice.in/mobiletheft లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు ఫారం నింపాలి. పేరు, జిల్లా, పోలీస్స్టేషన్ పరిధి, మొబైల్కు సంబంధించిన ఐఎంఈఐ–1, ఐఎంఈఐ–2 నెంబర్లతో పాటు బిల్లులు ఆన్లైన్లో సమాచారం పొందుపరిస్తే సాంకేతికత ఆధారంగా ట్రాక్ చేసి ఎక్కడుందో పోలీసులు గుర్తిస్తారు. -
అమ్మ కష్టాన్ని చూసి చదివా
మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను. – అన్నపురెడ్డి మరియమ్మ, నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా మా స్వస్థలం గూడూరు. మా అమ్మ, నాన్న పైగేరి అరుణమ్మ, బి.భాస్కర్కు నేను ఏకై క కూతురుని. నాన్న పదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో బైపీసీలో చేరి 460 మార్కులకుగాను 452 సాధించాను. డాక్టర్ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నా. – బెక్కెం సౌమ్య భారతి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి -
పనులు సర్వేశ్వరుడికెరుక!
ఇంజినీర్ల కొరత.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం వార్షిక బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది. అందులో ఇంజినీరింగ్ విభాగానికి బడ్జెట్ అగ్రభాగం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఏటా సుమారు రూ.వంద కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజినీరింగ్ విభాగంలో కొంత మందిదే హవా జరుగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొరత స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఉండాలి. గతంలో ఎస్ఈ పోస్టు మంజూరైనప్పటికీ దేవస్థాన ఈఓతో సమానమైన హోదా ఉంటుందని గతంలో పనిచేసిన ఈవోలు ఆ పోస్టును తొలగించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఇద్దరు ఉండాలి. వీరికి బీటెక్ అర్హత ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సప్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–1, డ్రాఫ్ట్మెన్–2 ఉండాలి. అలాగే ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేకాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్, ఫ్టిర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో ఎస్ఈ పోస్టు లేదు. అలాగే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లులో ఒకరికి మాత్రమే బీటెక్ అర్హత ఉంది. మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు డిప్లొమా అర్హత ఉంది. నలుగురు డీఈఈలకు గాను ఎవరూ లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరి కొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఒకే ఒక్క డ్రాఫ్ట్మెన్.. ఇంజినీరింగ్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టు డ్రాఫ్ట్మెన్. క్షేత్రంలో హెడ్ డ్రాఫ్ట్మెన్ ఒకరు, ఇద్దరు డ్రాఫ్ట్మెన్ ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్క డ్రాఫ్ట్మెన్ మాత్రమే ఉన్నారు. టెండర్ ప్రతిపాదనలను పరిశీలించడం, తనిఖీ చేయడం, రేట్ కోడింగ్ తనిఖీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తీసుకోవడం, బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం, పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవడం, టెక్నికల్ ఎవాల్యువేషన్, కండీషన్లు ప్రకారం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారా.. లేదా? తదితర ముఖ్యమైన విధులు డ్రాఫ్ట్మెన్ నిర్వహిస్తారు. ఈయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతుంటారని పలువురు కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. పెద్దల ఆశీస్సులు ఆయనకే.. శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉంటే ఒకరికి బీటెక్ క్వాలిఫికేషన్ ఉండగా మరొకరికి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది. రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడితో బీటెక్ ఇంజినీర్కు ట్రాన్స్పోర్టు విభాగం తప్ప ఎటువంటి పనులు కేటాయించ లేదు. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న అతనికి కూటమి పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఆయనకు సివిల్ పనులు, వాటర్ విభాగం, ఎలక్రిక్టకల్ పనులు, సైట్ అలాట్మెంట్లు, మెటీరియల్ పరిమిషన్లు..ఇంకా అన్ని పనులు అప్పగించారు. ఆ సింహానికే అన్ని పనులు అంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ఇద్దరు ఏఈలకు డీఈఈగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఒకరికి సివిల్ (డిప్లమో మెకానికల్ అర్హత, ఆ తరువాత దూర విద్య ద్వారా డిప్లొమా సివిల్ చేశాడని సమాచారం), ఐటీఐ ఎలక్ట్రిషియన్ అర్హత ఉన్న మరొకరికి ఎలక్ట్రికల్ డీఈఈగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్రంలో జరుగుతున్న ఎలక్ట్రికల్, వాటర్ సప్లై పనులు ఈయనే పర్యవేక్షిస్తుంటాడు. అయితే ఎటువంటి అర్హతలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
సారథీ.. నోరు అదుపులో పెట్టుకో..
● వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హెచ్చరికకర్నూలు(టౌన్): మంత్రి పదవి ఇవ్వలేదని పక్క పార్టీలోకి వెళ్లి ఇప్పుడు వైఎస్సార్సీపీ ఉగ్రవాదుల పార్టీ, ఐఎస్ఐ అంటూ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కొలుసు పార్థసారథి ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సారథీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని హెచ్చరించారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసి రూ.20 వేలకోట్లు ఖర్చుచేస్తే అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనను అన్ని వర్గాల ప్రజలు, మేధావులు హర్షిస్తున్నారని చెప్పారు. ఇది మింగుడుపడని చంద్రబాబుకు కుట్రలకు తెరతీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీ మంత్రులకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ముందు నుంచి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తోందని చెప్పా రు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, పార్టీ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ మాట్లాడుతూ హౌసింగ్ మంత్రి పార్థసారథికి రాజకీయ భిక్ష పెట్టింది జగనన్న అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్, పార్టీ నాయకులు బబ్లూ, కంటూ, పాషావలీ, పత్తాబాషా పాల్గొన్నారు. -
రోగి కడుపులో అతి పెద్ద కణితి
● విజయవంతంగా తొలగించిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): ఓ రోగి కడుపులో ఏర్పడ్డ అతి పెద్ద క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్ వివరాలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతానికి చెందిన జి.మత్తయ్య(75)కు చాలా ఏళ్లుగా కడుపులో గడ్డ(కణితి) ఉంది. ఈ నెల 6న ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం చేరాడు. జనరల్ సర్జరీ మొదటి యూనిట్ వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి రెట్రోపెరిటోనియల్ లైపోసోర్కోమా అనే ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కడుపులో ముప్పావు భాగాన్ని ఆక్రమించేంత పెద్దగా ఉంది. ఈ అతి పెద్ద కణితి అతని ఎడమ మూత్రపిండాన్ని పక్కకు జరిపింది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఈ నెల 15న ఆయనకు మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ హరచరణ్తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అజమ్ముల్ హుసేన్, పీజీలు ఉన్నారు. అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ్రామ్ సహకరించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
వృద్ధాశ్రమం సందర్శన
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద అశ్రితాశ్రమం, పల్లె ప్రియాంక సేవా సమితి వృద్ధుల ఆశ్రమాన్ని హైకోర్టు జడ్జి ఎన్. హరినాథ్రెడ్డి బుధవారం సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాశ్రమం సందర్శించడంతో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడంతో రోగాల దూరమవుతాయన్నారు. ఈయన వెంట నందికొట్కూరు సివిల్ జడ్జి శోభారాణి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, శివరాముడు, శోభారాణి, మండ్లెం రామిరెడ్డి, సురేష్, లక్ష్మీనారాయణ, జార్జి, తదితరులు పాల్గొన్నారు. -
పేదింట్లో విరిసిన విద్యాకుసుమం
కోడుమూరు రూరల్: కోడుమూరు మండలం బైన్దొడ్డి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు కురువ ఈరన్న, పద్మావతిలు ఉన్న ఊర్లో పనులు లేక హైదరాబాద్కు వలసవెళ్లి అక్కడే భవన నిర్మాణ కార్మి కులుగా పనులు చేస్తున్నారు. అయితే తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదన్న ఉద్దేశంతో తండ్రి ఈరన్న తమ కుమార్తె ఇంద్రజను కోడుమూరు కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థిని ఇంద్రజ ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 455 మార్కులకు 450 మార్కులు సాధించి సత్తా చాటింది. భవిష్యత్లో డాక్టర్ కావాలన్నదే తన కల అని, అందుకోసం కష్టించి చదువుకుంటానని విద్యార్థిని ఇంద్రజ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షలకు 8281 మందికి 7470 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూర్ రావూస్ డిగ్రీ కళాశాల, ఎస్ఎమ్ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షల్లో కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 3575 మందికి 3381 మంది విద్యార్థులు హాజరు కాగా 194 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వంకలోకి దూసుకెళ్లిన లారీ పత్తికొండ రూరల్ : మండల పరిధిలోని అటికెలగుండు గ్రామ సమీపంలోని మలుపులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. బనగానపల్లె నుంచి ఆదోనిలోని రైస్మిల్లుకు వడ్ల లోడుతో లారీ బయల్దేరింది. దేవనబండ–ఆటికెలగుండు మలుపు దగ్గర అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం హమాలీలతో వడ్లను వేరే లారీలోకి మార్చారు. సుళువాయిలో గడ్డివాములు దగ్ధం హొళగుంద: సుళువాయి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్ఠం సంభవించింది. గ్రామానికి చెందిన హరిజన పెద్ద ఈరన్న, వెండికట్ట వసంతకుమార్, బసాపురం రమేశ్, చాకలి పరుశురాం అనే రైతులు వరిగడ్డిని కొని ఎస్సీ కాలనీ సమీపంలో నిల్వ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుండి గడ్డివాములకు మంటలు అంటుకుని కాలిపోయాయి. స్థానికులు ఆలూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే కాలి బూడిదయ్యాయి. కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ విడుదల చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలస్టులు రూ.1250 ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. www.cfmr.ap.gov.in అనే సైట్లో లాగిన్ అయి హెడ్ అకౌంట్ 8342–00–120–01–03–001, డీడీఓ కోడు 2703 0802 003 నందు ప్రీమియం చెల్లించేలాని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య ప్యాపిలి: పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు (29) అలియాస్ బిట్టు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. రామాంజనేయులు కొద్ది సంవత్సరాల క్రితం గుడిపాడుకు చెందిన మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి రెండు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మద్యం సేవించే అలవాటు ఉన్న రామాంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన రెండు చేతులను కోసుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన బంధువులకు విషయం చెప్పింది. బుధవారం వారు ఇంటి వద్దకు వచ్చి చూడగా లోపల గడియ పెట్టినట్లు గుర్తించి వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. రామాంజనేయులు మృతి చెంది ఉండటంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి పదవులు దక్కాయి. ఆదోనికి చెందిన కె. షౌకత్ తబ్రేజ్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా నియమించారు.ఆ లూరుకు చెందిన రామిరెడ్డిని పార్టీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా, గుడమరెల్ల సుధాకర్ను ఆలూరు నియోజకవర్గం బూత్ కమిటీ విభాగం అధ్యక్షులుగా నియమించారు. ఆదోనికి చెందిన ఉప్పర నారాయణకు ఆదోని మున్సిపల్ విబాగం ఉపాద్యక్షులుగా నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ, వక్ఫ్, ఎండోమెంట్ భూములను అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి రిజిస్ట్రేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ, వక్ఫ్, ఎండోమెంట్ భూముల రిజిస్ట్రేషన్లపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ఆదాయాభివృద్ధిలో వెనుకబడిన కోడుమూరు, కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సబ్ రిజిస్ట్రార్ బజారి, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది● వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రచురణ పూర్తి కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రచురించడం పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాలు, 484 గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఓటరు జాబి తా ఆధారంగా ఎస్ఈసీ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఓటరు జాబితా పబ్లికేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాలో మొత్తం గ్రామీణ ఓటర్లు 12,51,580 మంది ఉండగా, వీరిలో పురుషులు 6,21,834 మంది, మహిళా ఓటర్లు 6,29,614 మంది, ట్రాన్స్జెండర్స్ 123 మంది ఉన్నారన్నారు. అత్యధికంగా కర్నూలు మండలంలోనే పురుష ఓటర్లు 38,566 ఉండగా, మహిళా ఓటర్లు 39,001 మంది ఉన్నారన్నారు. అత్యల్పంగా గూడురు మండలంలో పురుష ఓటర్లు 9898 కాగా, మహిళా ఓటర్లు 9971 మంది ఉన్నారని డీపీఓ వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 7,780 మంది అధికంగా ఉన్నారు. -
‘సీమ’ రగులుతోంది!
రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుపై ‘సీమ’ నేతలు ఉద్యమబాట పట్టారు. ‘సీమ’ ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఆపేసిన ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పూర్తి చేయాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు, తిరుపతి, కడప, అనంతపురంలో సభలు నిర్వహించారు. నేడు కర్నూలు కేంద్రంగా మరో సమావేశానికి సిద్ధమయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఆవశ్యకత, ప్రభుత్వ వంచన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపేయడంపై ఫిబ్రవరి నుంచి ‘సీమ’ రగులుతోంది. తెలంగాణ రైతులు, ప్రాంత ప్రయోజనాల కోసం చంద్రబాబుతో తాను మాట్లాడి ప్రాజెక్టును ఆపేశానని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ‘సీమ’ నివ్వెరపోయింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన వ్యక్తి ఇలా మరోసారి రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఏంటనే చర్చ మొ దలైంది. రేవంత్రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందా? లేదా? అనేది చర్చించాల్సింది పోయి రాయలసీమ ప్రాజెక్టుపై టీడీపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. ఈక్రమంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ‘సీమ’ త్యాగాలకు విలువ ఏముంది బాబూ! శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు కోల్పోయింది, గ్రామాలు ఖాళీ చేసింది ‘సీమ’ ప్రజలే. ‘సీమ’ త్యాగాలతోనే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత జల ప్రయోజనాలను అన్ని ప్రాంతాలు అనుభవిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కృష్ణాజలాలపై రెండు రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఈక్రమంలో త్యాగం చేసిన సీమకే తీవ్ర అన్యాయం జరుగుతోంది. అది కూడా సాక్షాత్తూ రాష్ట్రం ప్రభుత్వం చేయడం మరింత శోచనీయం. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడుకు 44వేల క్యూసెక్కుల నీరు అందాలంటే ప్రాజెక్టులో 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 800 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలు తోడేస్తుంటే శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులకు వచ్చే సరికి తెలంగాణ వంద టీఎంసీలుపైగా తోడేస్తుంది. ఒకవేళ శ్రీశైలంలో వరద ప్రవాహం తగ్గితే కేవలం తెలంగాణ మాత్రమే నీటిని తోడుకుంటుంది. ‘సీమ’కు చుక్క నీరు అందని పరిస్థితి. జగన్ ముందు చూపే.. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్తో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా రోజూ 8 టీఎంసీలు తరలిస్తోంది. మరోవైపు కర్నాటకలో ఆల్మట్టిడ్యాం సామర్థ్యాన్ని 129 టీఎంసీల నుంచి, 229 టీఎంసీలకు అక్కడి ప్రభుత్వం పెంచుతోంది. తెలంగాణ, కర్నాటక చర్యలతో శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గిపోయే ప్ర మాదముంది. ఈ పరిణామాలను బేరీజు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాయలసీమలిప్ట్కు శ్రీకారం చుట్టారు. తెలంగాణతో పాటు మనం కూడా 800 అడుగుల నుంచే నీటిని తోడుకునేలా రూ.3,850 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణానికి ఉపక్రమించారు. రూ.1200కోట్లకు పైగా పనులు చేసి రూ.990కోట్ల విలువైన బిల్లులు కూడా చెల్లించారు. రాయలసీమ ఎత్తిపోతలతో ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం అవుతుంది. 800 అడుగుల నుంచే తోడుకోవచ్చు కాబట్టి నెల ముందే సాగునీరు రైతులకు అందుతుంది. ముందస్తు పంటలు సాగు చేసుకోవచ్చు. హంద్రీ–నీవా ఫేజ్–2కు రాయలసీమ లిఫ్ట్ నుంచి నీరు ఇస్తారు. మల్యాల ద్వారా ఫేజ్–2కు నీరు పంపాల్సిన అవసరం లేదు. హంద్రీ–నీవా నీరు మొత్తాన్ని కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే వాడుకోవచ్చు. కర్నూలు జిల్లాలో హంద్రీ–నీవా పరిధిలో 79,300 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి సాగునీరు అందుతుంది. అలాగే మరిన్ని చెరువులకు నీరు అందించొచ్చు. నంద్యాల జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడంతో నెల నుంచి రెన్నెళ్లు ముందుగానే సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 800 అడుగులకు తగ్గినా అవసరమైతే నీటిని తోడుకోవచ్చు. ఇది తాగు, సాగునీటి వనరుల కల్పనకు దోహదపడుతుంది. భవిష్యత్తులో కర్నూలు, నంద్యాల జిల్లాలో నీటినిల్వ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు పెంచుకుని మరింత ఆయకట్టును స్థిరీకరించుకోవచ్చు.ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు ఆపేసిన టీడీపీరాయలసీమ లిఫ్ట్ పూర్తయితే జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఈర్ష్యతో టీడీపీ నేతలు మహబూబ్నగర్లోని టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసులు వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. అయితే ఎన్జీటీలో వాదనలు వినిపిస్తూనే పనులు ఆపకుండా భారీ భద్రత మధ్య అప్పటి ప్రభుత్వం 50శాతం పైగా పనులు చేసింది. ఎన్జీటీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టిందని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. అదే సమస్య అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు ఎన్జీటీ అనుమతులు తీసుకోలేకపోతోందో సమాధానం చెప్పాలి. ఏకమవుతున్న ‘సీమ’ జిల్లాల నేతలు, ప్రజలు నేడు కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో సమావేశం ఇప్పటికే పోతిరెడ్డిపాడు, కడప, తిరుపతి, అనంతపురంలో ‘గ్రేటర్’ నేతల సభలు, సమావేశాలు హాజరుకానున్న మాజీ మంత్రి శైలజానాథ్, అనంత వెంకట్రామిరెడ్డి -
పువ్వుల నవ్వులు.. పచ్చని నేస్తాలు..!
ప్రకృతితో మమేకమైతే జీవితంలో సంతోషం విరబూస్తుంది. గొడ్డలితో నరికినా నీడనిస్తూ, ఫలాలను అందిస్తూ చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచడం చెట్లకే చెల్లు. కర్నూలు నగర శివారు, వెంకయపల్లె ఎల్లమ్మకు వెళ్లే దారిలోని చెట్లు(గోల్డెన్ ట్రంపెట్) సరిగ్గా నెల రోజుల క్రితం ఒళ్లంతా పూలతో నవ్వులు చిందించాయి. పసుపు పచ్చని పూలు గాలికి రాలిపడుతూ ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఇవే చెట్లు నేడు పచ్చని ఆకులతో చల్లని నేస్తాలుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నెల రోజుల క్రితం పువ్వులతో నిండిన చెట్లు ప్రస్తుతం ఆకుపచ్చని ఆకులతో ఆహ్లాదాన్ని పంచుతూ.. -
సంజామల ‘మండిపోతోంది’
● 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు(అగ్రికల్చర్): సూర్య ప్రతాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలిలో తేమ మధ్యాహ్న సమయంలో 30 శాతం వరకు ఉంటే వడగాలుల తీవ్రత అంత తీవ్రంగా ఉండదు. అయితే 10 శాతం లోపునకు పడిపోవడంతో నిప్పులకొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం ఏకంగా మండిపోతోంది. ఇక్కడి హీట్వేవ్ను రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్గా ప్రకటించింది. సంజామల మండలంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ మండలంలో వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో 43 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి ఏప్రిల్ మాసం మధ్యలోనే 44.6 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
భక్తిశ్రద్ధలతో దేవర
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని సోగనూరు గ్రామంలో శ్రీమారెమ్మవ్వ, శ్రీసుంకులమ్మవ్వ దేవర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. దేవర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంభాలతో అమ్మవార్ల దేవాలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బంధువులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
కర్నూలు(అర్బన్): అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి బుగ్గనతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సమ సమాజం, సమానత్వం కోసం ఆయన అనేక రూపాల్లో పరితపించి ఆచరణలో పెట్టారన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు అహ్మద్ ఆలీఖాన్, మాజీ డీవీఎంసీ సభ్యులు గద్ద రాజశేఖర్, నాయకులు గోల్డ్మెన్ శ్రీనివాసులు, కటారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో డ్రోన్ పరిశ్రమ పూర్తి
● పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ఓర్వకల్లు: చింతలపల్లె గ్రామం వద్ద నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమ మూడు దశల్లో పూర్తవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. చింతలపల్లె, పాలకొలను గ్రామాల వద్ద ఏపీఐఐసీ వారు సేకరించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతలపల్లె గ్రామం వద్ద దాదాపు 300 ఎకరాలలో నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమను మొదట 150 ఎకరాలల్లో అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం 100 ఎకరాల్లో, పిదప 50 ఎకరాలో పరిశ్రమను పూర్తి చేయాలని తెలిపారు. అంతకు ముందు ముచ్చుమర్రి గ్రామం వద్ద ఓర్వకల్లు జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమకు నీటి సరఫరా చేసే పైపులైన్ నిర్మాణ పణుల పురోగతి గూర్చి సంబంధిత ఇంజినీర్లతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డిఓ సందీప్కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాదమా.. డయల్ 101 కర్నూలు: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే డయల్ 101కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఎన్.అవినాష్ జయసింహ తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు కర్నూలు నగరం ఫైర్స్టేషన్ ఆవరణలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీ వరకు వివిధ రూపాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి డీటీసీ శాంతకుమారి, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ, స్టేట్ ట్రైనింగ్ సెంటర్ జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అగ్నిప్రమాదాల పట్ల అవగాహనకు అగ్నిమాపక శాఖ ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. వైభవంగా వసంతోత్సవాలు ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు. కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు గంజర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాటసాని ఇంటి వద్దకు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో సత్యనారాయణ, మద్దిలేటి, గోరంట్ల, మారెళ్ల కిట్టు, నాగేష్ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారి భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలు నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, గని రామలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీరివ్వలేని చంద్రబాబు ప్రభుత్వం
● దోచుకో.. దాచుకో అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి లేదు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: తీవ్రమైన ఎండలతో మంచినీరు దొరకక, గొంతులు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీరు ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్ , పవన్కు ‘దోచుకో.. దాచుకో’ అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఆలూరులో 20 రోజులకు ఒక సారైనా తాగునీరు రావడం లేదన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలంలోని మొలగవల్లి, కురుకుంద, హులేబీడు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామాల్లో నెల తరబడి మంచినీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు తాళం వేశారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి ఏదైనా చేస్తామని చెప్పి వెవెళ్లారన్నారు. గత పదేళ్లుగా కురుకుంద గ్రామస్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో పక్కనే ఉన్న హెబ్బటం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో కనీసం చలనం లేదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలూరు నియోజకవర్గంలో యాభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపు లైన్లు మార్చాలని గత జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు ఎస్టిమేట్ వేసి వినతిపత్రం ఇచ్చారన్నారు. అలాగే బాపురం, చింతకుంట రిజర్వార్ల సామర్థ్యం పెంచాలని కోరానన్నారు. డీఆర్సీ మీటింగ్లో కూడా చాలా సార్లు తాగునీటి సమస్యపై ప్రస్తావించినా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. ఇటీవలే తాగునీటి సమస్య తీర్చాలని జిల్లా కలెక్టర్ సిరికి విన్నవించామన్నారు. ఆలూరు నియోజవర్గంలో తాగునీరు, రోడ్ల సమస్యలపై ఓర్వకల్లుకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీని కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆలూరు చెరువు నిరుపయోగంగా ఉందని, ఎస్ఎస్ ట్యాంక్గా మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చెరువు కబ్జాకు గురైందన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్కు గ్రామాల్లో తాగునీరు, రోడ్ల సమస్యలు కనిపించడం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలకే పరిమితంగ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి తిరగడం కాదని, తాగునీరు, రోడ్లు సమస్య తీర్చాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇన్చార్జ్ పదవి పోతే వారు ఇక్కడ ఉండబోరన్నారు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పక్కనే ఎల్ఎల్సీ పారుతున్నా.. ఎస్ఎస్ ట్యాంకులు సామర్థ్యం పెంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్ద ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్ సృజన ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాన్ని విస్మరించిందన్నారు. నగరడోణ రిజర్వార్కు బిల్లు చెల్లిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయన్నారు. -
అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కర్నూలు(అర్బన్): ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్గుప్తా అన్నారు. విశ్వ మేధావి అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహించారు. సాంఘీక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దక్కాలని కృషి చేశారన్నారు. డీవీఎంసీ సభ్యుల నిరస ఇదిలాఉంటే వేదికపై సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, కేవలం తమను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారే తప్ప కూర్చునేందుకు సీట్లు ఉండటం లేదని డీవీఎంసీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. డీవీఎంసీ సభ్యులు మాలతీ, సురేష్గౌడ్, సురేంద్ర, యోగేష్నాయక్ తదితరులు వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మాజీ మంత్రి మారెప్ప, మాజీ మేయర్ బంగి అనంతయ్య, గోన నాగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నాగమణి, పోతురాజు రవికుమార్, వివిధ సంఘాల నాయకులు రెడ్డిపోగు రాజ్కుమార్, సోమసుందరం, కాసారపు వెంకటేశ్వర్లు, రాగిరి చంద్రప్ప, కై లాస్నాయక్ పాల్గొన్నారు. -
ఉగ్ర భానుడు
● కోడుమూరు, సంజామల మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాపై బానుడు విరుచుకుపడుతున్నాడు. మంగళవారం ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. ఏప్రిల్ మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. అత్యధిక మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్కుమార్ తెలిపారు. -
సీమజోన్లో 25 మంది సీఐల బదిలీ
● ఉమ్మడి జిల్లాలో 15 మందికి స్థానచలనం ● వీఆర్లో ఉన్న ఇద్దరికి పోస్టింగులు బదిలీ అయిన సీఐలు కర్నూలు: రాయలసీమ జోన్ కర్నూలు, అనంతపురం రేంజ్ల పరిధిలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 25 మంది సీఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఇందులో ఒకరు సత్యసాయి, మరొకరు వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. అలాగే అనంతపురం రేంజ్లో వీఆర్లో ఉన్న ఒకరికి చెన్నూరు యూపీఎస్, కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న మరొకరిని మంత్రాలయం పీఎస్కు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న మరో ఇద్దరు అనంతపురం రేంజ్కి బదిలీ అయ్యారు. పేరు ప్రస్తుత సర్కిల్ బదిలీ అయిన సర్కిల్ జి.వి.నాగరాజరావు కర్నూలు టూటౌన్ ఆళ్లగడ్డ యూపీఎస్ ఎం.శ్రీధర్ ఫ్యాక్షన్ జోన్, కర్నూలు కర్నూలు టూటౌన్ ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ యూపీఎస్ కౌతాళం యూపీఎస్ ఎన్.అశోక్ కుమార్ కౌతాళం యూపీఎస్ నందికొట్కూరు వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైం సెల్, కర్నూలు డి.మస్తాన్ వలి సోషల్ మీడియా అండ్ సీసీఎస్–2, సైబర్ క్రైం సెల్, కర్నూలు కర్నూలు కె.శ్రీనివాస నాయక్ సీసీఎస్–2, కర్నూలు ఆస్పరి, కర్నూలు దస్తగిరి బాబు వీఆర్, కర్నూలు మంత్రాలయం పి.రామాంజులు మంత్రాలయం పులివెందుల ట్రాఫిక్ వి.సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ డీటీసీ, నంద్యాల డి.హాజీవలి డీటీసీ, నంద్యాల సీసీఎస్,వైఎస్సార్ కడప జి.మారుతి శంకర్ కొత్తచెరువు, సత్యసాయి జిల్లా కర్నూలు వన్టౌన్ ఎం.పార్థసారధి కర్నూలు వన్టౌన్ ఫ్యాక్షన్జోన్, కర్నూలు ఎ.గంగాధర్ వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం కె.ఉలసయ్య వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం -
వైభవోపేతం.. వసంతోత్సవం
ఆళ్లగడ్డ: మహా పుణ్యక్షేత్రం అహోబిలం సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం దేవాలయం ఎదురుగా ఆకర్షణీయంగా నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవంలో భాగంగా ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
గొర్రెలను తప్పించబోయి..
కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెలుతుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్ధీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవా రం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై గొర్రెలు ఎదురయ్యా యి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యు లు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. గాయపడిన ఖాజా మోహిద్దీన్, షహీన్ షా -
శ్రీశైలం ఘాట్లో చిరుత కలకలం
శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు. -
దూసుకొచ్చిన కారు
పత్తికొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అదుపు తప్పి బంకు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కెఎ 05ఎఎన్ 7939 నంబరు గల కారు పత్తికొండ పట్టణానికి సమీపంలో మలుపు దగ్గర అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బంకు పైకి దూసుకెళ్లింది. దీంతో బంకులో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పక్కన నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వసం అయ్యాయి. అలాగే పెండ్లిమాన్తండాకు చెందిన రేక్యనాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అర్బన్ సీఐ జయన్నకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. బంకు యాజమాని లక్ష్మణస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నిప్పుల వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై బానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నెల 12న నంద్యాల జిల్లాలో గరిష్టంగా 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం సంజామలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంజామల మండలంలో కావడం గమనార్హం. ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీలు, కోవెలకుంట్లలో 43.3, ఉయ్యలవాడలో 43.3, గూడూరులో 43, బనగానపల్లిలో 42.8, కర్నూలులో 42.8, కోడుమూరులో 42.7, గోస్పాడులో 42.7, నంద్యాల రూరల్లో 42.7, పాణ్యంలో 42.6, మంత్రాలయంలో 42.5, చాగలమర్రిలో 42.5, కొలిమిగుండ్లలో 42.4, రుద్రవరంలో 42.4, కొలిమిగుండ్లలో 42.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతోది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బతో వృద్ధుడు మృతి పగిడ్యాల: నెహ్రూనగర్లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కొంతలపాడు నాగన్న(70) ఆదివారం నీటి మునక పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతకు సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. స్థానిక ఆర్ఎంపీని ఇంటికి పిలిపించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా అప్పటికే మరణించాడన్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని వెలగటూరు రస్తాలో జుర్రేరు వాగుకు చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన బాలకృష్ణ(32) అదివారం చేపలు పట్టుకునేందుకు బైక్పై జుర్రేరు వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టుకునే తరుణంలో ప్రమాదవశాత్తు వాగు నీటి గుంతలో మునిగిపోయాడు. గుంత లోతుగా ఉండటంతో పాటు పూడిక పేరుకు పోవడంతో అందులో చిక్కుకుపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకోగా ఒడ్డున బైక్, చెప్పులు ఉండటంతో నీటిలో పడి పోయి ఉంటాడని భావించి ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వాగులో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి
హొళగుంద: వారాల తరబడి మంచినీళ్లు ఇవ్వకుండా అధికారులు ఏం చేస్తున్నారని ఖాళీ బిందెలతో మహిళలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 15 రోజులుకుపైగా హొళగుందలోని 8వ వార్డు పింజరిగేరికి మంచినీరే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా అక్కడికెళ్లి అధికారులను నిలదీశారు. తమ కాలనీకి మంచినీరు రాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాదనకు దిగారు. సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ విజయలలిత చెప్పడంతో ఆందోళన విరమించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు. కూలిపోయిన రోడ్డు వంతెన గట్లు గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువపై రోడ్డు వేయడానికి వంతెన నిర్మించగా రెండు వైపులా గట్లు కూలిపోయాయి. దీన్ని గమనించిన ఓ ప్రయాణికుడు ప్రమాదకరంగా ఉందని చెప్పేందుకు కట్టెకు ఎర్రటి గుడ్డ చుట్టి పాతి వెళ్లి పోయాడు. గాజులదిన్నె గ్రామ స్టేజీ వద్ద ఈ రోడ్డు వంతెన మీదుగా ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన గట్లు లేవని ప్రయాణిస్తే వాహనాలు కాలువలోకి పడే అవకాశం ఉంది. ఈ దారి గుండా వాహనాల్లో వెళ్లే టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాదాన్ని చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు, ప్రయాణికులు అంటున్నారు. -
తపాలా శాఖలో పార్సిల్ బుకింగ్ కౌంటర్లు
కర్నూలు(అర్బన్): తపాలా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు తక్కువ ఖర్చుతో పార్సిల్ పంపించే సౌకర్యాన్ని కల్పించినట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక హెడ్ పోస్టాఫీసులో నూతన పార్సిల్ బుకింగ్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు డివిజన్ పరిధిలోని కర్నూలు ప్రధాన తపాల కార్యాలయం, ఆదోని, కర్నూలు బీ క్యాంప్, ఎమ్మిగనూరు, డోన్ తపాలా కార్యాలయాల్లో పార్సిల్ బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించామన్నారు. ప్రైవేటు పార్సిల్ సంస్థల కంటే తక్కువ మొత్తం చార్జీలతో పోస్టల్ శాఖలో ఈ సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కర్నూలు(అర్బన్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారన్నారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఆయా కుల సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆమె కోరారు. 21న ఎమ్మిగనూరులో జాబ్మేళా కర్నూలు(సెంట్రల్): 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఈనెల 21న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, పీజీ, బీటెక్ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల్లోపు యువతీ, యువకులు ఆర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు naipunyam.a p.gov.in అనే వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెచ్ఈఈవోలకు పదోన్నతులు కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్(హెచ్ఈఈఓ)లకు డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్(డెమో)గా పదోన్నతులు లభించాయి. వీరిలో ఇద్దరు పదోన్నతిపై కర్నూలుకు బదిలీ అయ్యారు. కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్(ఎం)లో పనిచేస్తున్న కె.ధర్మేంద్ర పక్కనే ఉన్న ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్కు, కాకినాడలోని పీఓడీటీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.నరేంద్రశేషును కర్నూలులోని మేల్ ట్రైనింగ్ సెంటర్కు బదిలీ చేశారు. -
ఎస్పీ పీజీఆర్ఎస్కు 112 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు మోసం, ఉద్యోగాల పేరుతో మోసం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తులు రాయించుకుని పిల్లలు తమ పోషణ పట్టించుకోవడం లేదని వృద్ధులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
ఎన్హెచ్ 40లో ‘క్యూఆర్ కోడ్’ సేవలు
● స్కాన్ చేస్తే పెట్రోల్ బంక్లు, పంక్చర్ షాపుల వివరాలు కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, ఇ–చార్జింగ్ స్టేషన్లు వంటి వసతులు ఎక్కడ ఉన్నాయి అనే ఆందోళన ప్రయాణికుల్లో సహజంగా ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గం 40వ నెంబర్ జాతీయ రహదారిలో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సౌకర్యార్థం వినూత్నంగా క్యూఆర్ కోడ్ సేవలు అమలులోకి వచ్చాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి కడప వరకు విస్తరించి ఉన్న 189 కిలోమీటర్ల మేర రహదారిలో క్యూఆర్ కోడ్ ఆధారిత సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులకు ఇకపై ఒక డిజిటల్ గైడ్లా మారనుంది. సోమవారం (13వ తేదీ) నుంచి 40వ జాతీయ రహదారిలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్టు హెడ్ వి.మదనమోహన్ విలేకరులకు తెలిపారు. ఒక్క స్కాన్తో అన్ని వివరాలు హైవే వెంట ప్రయాణించేటప్పుడు స్మార్ట్ బోర్డులను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయగానే మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ప్రధానంగా అత్యవసర సేవా కేంద్రాలు, జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబర్ 1033, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలు, సమీపంలోని పోలీస్స్టేషన్ నెంబర్లు ఇట్టే తెలిసిపోతాయి. 189 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ, బాధ్యతలు, కాలపరిమితి, టోల్ప్లాజాల మేనేజర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నెంబర్లు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, పంక్చర్ షాపులు, ఇ–చార్జింగ్ స్టేషన్ల లొకేషన్ల వివరాలు కూడా ఒక్క స్కాన్తో తెలుసుకోవచ్చు. -
గ్రామంలోకి భారీ వాహనం
● ఒక ట్రాన్స్ఫార్మర్, 10 విద్యుత్ స్తంభాలు నేలమట్టం పత్తికొండ రూరల్: గాలిమరలకు సంబంధించిన భారీ వాహనం హోసూరు గ్రామంలోకి రావడం, విద్యుత్ తీగలను బలంగా లాగడంతో ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, 10విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మొలగవల్లి రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటుగా దీనికి అనుసంధానంగా వరుసగా ఉండే విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఊరిబయట జరిగిన ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
నీడ, నీరు కరువే..
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే నెలలో ఎండలు, వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఈ సమయంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే 2–3 డిగ్రీలకు పైగా అధికంగా అంటే 43 డిగ్రీల వరకు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటికే నంద్యాల రూరల్, కౌతాళం, ఆళ్లగడ్డ, ఆలూరు, కర్నూలు, కల్లూరు, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల చివరిలోపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, మే నెలలో 45–47 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల బెడద తీవ్రతరమవుతున్నా ఉపాధి కూలీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘ఉపశమనం’ కాగితాల్లోనే! ● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సురక్షిత మంచి నీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశించింది. ● ప్రతి గంటకు నీటిని తాగే విధంగా వాటర్ బెల్ పద్ధతిని అమలు చేయాలి. ● గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే తాటాకు 8, ఈతాకు తదితరాలతో పని ప్రదేశంలో పందిళ్లు వేయాలి. ● ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్స సామాగ్రిని(ఫస్ట్ ఎయిడ్ బాక్స్) పని ప్రదేశంలో సిద్ధంగా ఉంచాలి. ● ఆరోగ్య శాఖ సహకారంతో పని ప్రదేశాల్లో ఏఎన్ఎం సేవలను ఉపయోగించుకోవాలి. ●ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ●ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి వెళ్లి 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలి. ● అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తిరిగి పని కొనసాగించాలి. ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు ● జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాలి. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 16శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. ● అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రతకు కారణమవుతోంది. ● ఈసారి ఎల్నినో ప్రభావం కూడా భయపెడుతోంది. మామూలుగా వేసవి మే నెల చివరితో ముగుస్తుంది. అయితే ఎల్నినో ప్రభావంతో సారి ఆగస్టు వరకు ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలా.. గత వైఎసార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో వేసవి ఉపశమన చర్యలు పక్కాగా అమలయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఎండల నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్ సరఫరా చేసింది. షేడ్స్ కింద నీళ్లు తాగి కొద్ది సేపు సేదతీరడం, భోజనం చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం విశేషం. ప్రస్తుతం ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 28వేలు, నంద్యాల జిల్లాలో 24వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. నిప్పుల కొలిమిని తలపించే ఎండల్లో పనులు చేస్తున్నప్పటికీ ఉపశమన చర్యలు లేకపోవడం గమనార్హం. ఉదయం 9 గంటలకే వడగాలుల తీవ్రత పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పటైన తర్వాత 2025లో ఉపాధి కూలీల కోసం షేడ్స్ సరఫరా చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎక్కడా పని ప్రదేశంలో నీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలే లేవు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల జాడే లేకుండాపోవడం గమనార్హం. ఉపాధి కూలీలకు నీడ సదుపాయం వెతికినా కనిపించదు. వాటర్బెల్ పాటించకపోవడం కూలీల ప్రాణం తీస్తోంది. -
ఊరు నీరడుగుతోంది
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీరందిస్తామని సర్కారు ప్రకటించడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. దీంతో వేసవి కాలం ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తింది. పలు గ్రామాల్లో ప్రజలు తమ దాహం తీర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ గ్రామంలోని చల్లా కాలనీలో ప్రధాన తాగునీటి పైపు లైన్ వెళ్తుంది. అయితే, అక్కడ నివసించే 50 కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాయి. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కారు రావడంతో కుళాయి కనెక్షన్ల ఏర్పాటు అంశం అటకెక్కింది. రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు కనిపించిన అధికారులను, పాలకులను కలిసి పనులు వదులుకొని సుదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని, తమ ఇళ్ల ముందే పైపులైన్ వెళ్తుందని కుళాయి కనెక్షన్లు ఇచ్చి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చల్లా కాలనీవాసులు వాపోతున్నారు. – సంజామల -
ఆర్యూలో నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉదయం 90.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్నాయుడు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. సోమవారం వర్సిటీ వీసీ వెంకట బసవరావు, కమిటీ సభ్యులు భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. నల్లమలలో కారు బోల్తా మహానంది: నల్లమలలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మద్యం వ్యసనం మానుకునేందుకు పాణ్యం వద్ద పసురు, అంత్రాలు వేస్తున్నారని తెలుసుకుని గుంటూరు పట్టణానికి చెందిన ముగ్గురు కారులో బయలుదేరి వచ్చారు. వచ్చిన పని చూసుకొని నంద్యాల, గాజులపల్లె మీదుగా తిరిగి వెళ్తున్నారు. గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్కారు బస్సు కదలనంటోంది!
ఊడుతున్న చక్రాలు..పనిచేయని స్టీరింగ్లు, పొలాలు, చెరువుల్లోకి దూసుకెళ్తున్న వాహనాలు కొన్ని..పొగలు కక్కుతున్నవి మరికొన్ని..కాలం చెల్లినవి ఇంకొన్ని వెరసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే ఏదో తెలియని భయం. ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనేవారు ఇప్పుడా పరిస్థితి లేదు. బస్సులు ఎక్కడ మొండికేసి మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. కూటమి సర్కారు కాలం చెల్లిన బస్సులు, పాతవాటికి ౖపైపెన మరమ్మతులు చేసి తిప్పుతుండటమే దీనికి ప్రధాన కారణం. సోమవారం కడప నుంచి కర్నూలుకు బయలు దేరిన కడప డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. ఇంజన్ బెల్ట్, బెరింగు పోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో ఈ బస్సులోని 60 మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముందుగానే టికెట్లు తీసుకొని ఉండటంతో చేసేది లేక కడప వైపు నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఎక్కి వెళ్లారు. మహిళలకు, దివ్యాంగులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు ముందుగా బస్సుల కండీషన్పై దృష్టిసారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – చాగలమర్రి -
ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ చెప్పారు. కళాశాలలో ఆదివారం జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. ఈ సదస్సుకు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో సాధారణ వ్యాధులు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, మెటబాలిక్ డిస్ ఫంక్సన్, క్యాన్సర్ చికిత్స మొదలైన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ వైద్యులు, వైద్య విద్యార్థులు వైద్య కాన్ఫరెన్స్లు, సీఎంఈలలో పాల్గొని వైద్య రంగంలో వస్తున్న ఆధునిక విజ్ఞానాన్ని తెలుసుకుని అప్డేట్ కావాలన్నారు. కార్యక్రమంలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరాములు, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, విశ్వభారతి మెడికల్ కాలేజి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రవికళాధర్రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్లు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మోహన్రెడ్డి, డాక్టర్ సాయిసంపత్కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు అక్షరాభ్యాసం
శ్రీశైలం ప్రాజెక్టు: హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సున్నిపెంటలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. చెంచు గిరిజనుల ఆరాధ్య దైవమైన బయన్న స్వామి ఆలయంలో 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పీఠాధిపతి శివరుద్ర స్వామి, వేద పండితులు చందు స్వామి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అంతిరెడ్డి అరవింద రెడ్డి ఆధ్వర్యంలో బయన్న స్వామి ఉత్సవాల సందర్భంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బయన్న స్వామి ఆలయ నిర్వాహకులు కుడుముల మూగెన్న, సామాజిక సేవకుడు వట్టి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించకూడదు
నార్కోటిక్ డ్రగ్స్ (మత్తును కలిగించే ఔషధాలు) వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం నేరం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వాటి విక్రయాలపై నిఘా ఉంచాము. నిద్ర, ఆందోళన, డిప్రెషన్ సమస్యలకు రెగ్యులర్గా మందులు వాడుతున్న వారు తాజాగా డాక్టర్ రాసిన చీటిని తీసుకొచ్చి మందుల దుకాణాల్లో చూపించి కొనుగోలు చేయాలి. అది కూడా ప్రిస్కిప్షన్లో వైద్యులు సూచించిన మాత్రలు మాత్రమే విక్రయించాలి. –హరిహరతేజ, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషద నియంత్రణ శాఖ, కర్నూలు -
శ్రీమఠంలో స్వర్ణ రథోత్సవం
శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం భక్తుల మధ్య బంగారు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులను బంగారు రథం నుంచి ప్రహ్లాదరాయలు ఆశీర్వదించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు నేతృత్వంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామదేవత మంచాలమ్మకు కుంకుమార్చన, శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందవనానికి, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు గావించారు. శ్రీమఠం కారిడార్లో, కల్పతరు క్యూకాంపెక్స్లో, పరిమళ ప్రసాదం కౌంటర్లల్లో, అన్నపూర్ణ భోజనశాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. – మంత్రాలయం -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
కర్నూలు (టౌన్): భవన నిర్మాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైందని మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, టెక్నికల్ డీజీఎం ఓటుల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ ప్రెవేట్ సమావేశ హాలులో భారతి సిమెంట్ ఆధ్వర్యంలో సిమెంట్ వినియోగంపై బిల్డర్స్ మీట్ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారువుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యతతో కలిగి ఉంటుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం ఉందన్నారు. కార్యక్రమంలో కంపెనీ డిప్యూటీ మేనేజర్ ఇక్బాల్ బాషా, ఉదయ్కిరణ్, టెక్నికల్ ఇంజినీర్లు పాల్గొన్నారు. మహానందిలో సండే సందడి మహానంది: సెలవు రోజు కావడంతో ఆదివారం మహానంది ఆలయంలో భక్తుల సందడి కొనసాగింది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం స్థానిక కల్యాణ మండపంలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
‘గుండు’రగండులు
పట్టణంలోని సయ్యద్ అల్లాబకాష్ వలీ ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 130 కేజీల గుండు, ఇసుక సంచి, 75 కేజీల చంద పందెం పోటీలు అలరించాయి. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ పోటీలకు యువకులు పోటా పోటీగా పోటీపడి గుండు, ఇసుక, చందలను ఎత్తారు. ఇందులో ప్యాపిలి మండలం గోసానిపల్లెకు చెందిన చందు గుండు పందెంలో ప్రథమ, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి సుధాకర్ ద్వితీయ, ఇసుక సంచి పందెంలో సుధాకర్ ప్రథమ, చందు ద్వితీయ, చంద పందెంలో పుల్లగుమ్మి సుధాకర్, శివలు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలకు నిర్వాహకులు వెండి పఽతకాలు బహూకరించారు. యువకుల ఈలలు, కేరింతల మధ్య అత్యంత ఉత్సహభరితంగా పోటీలు అలరించాయి. గుండు, ఇసుక, చంద పందాలలో ప్యాపిలి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారే విజేతలుగా నిలవడం విశేషం. కార్యక్రమంలో నిర్వాహకులు ఖాజా, రాజ, ఇమామ్ హుసేన్, ఫైల్మాన్ పాల్గొన్నారు. – బేతంచెర్ల -
ఆందోళన తగ్గదు...నిద్ర రాదు!
కర్నూలు(హాస్పిటల్): ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విద్యార్థులకు చదువు, యువతకు నిరుద్యోగం, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్థిక సమస్యలు, ఇతర ఒత్తిళ్లు, ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక సమస్యలకు గురై నిద్రలేమితో బాధపడుతున్నారు. వీరికి చికిత్స అందించే వైద్యులు రెగ్యులర్ మందులతో పాటు నిద్ర, ఒత్తిడి, ఆందోళన తగ్గించే మందులు సైతం సూచిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,150 దాకా రిటైల్ మెడికల్ షాపులు, 550 దాకా హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏటా దాదాపు రూ.300 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఔషధ నియంత్రణ శాఖ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. వీరు ఆయా దుకాణాల్లో ఫార్మాసిస్టుల వివరాలతో పాటు ఔషధాల క్రయ విక్రయాల గురించి తరచూ ఆరా తీస్తుంటారు. ఇదే సమయంలో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారా, కాలం తీరిన మందు లు ఏమైనా విక్రయిస్తున్నారా అని కూడా పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు గత సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్షాపులపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజల్లా వచ్చి ప్రిస్కిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు అడిగి కొని మరీ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో పలు దుకాణదారులకు నోటీసులు అందడమే గాక కొన్ని రోజుల పాటు సస్పెన్షన్కు కూడా గురి అయ్యారు. దీంతో అధిక శాతం మెడికల్షాపుల్లో ఏడాది నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా నిద్రమాత్రలు, మత్తును కలిగించే నొప్పి మాత్రలు, ఆందోళన, డిప్రెషన్ మాత్రలు విక్రయించడం లేదు. వాటిని రెగ్యులర్గా వాడే రోగులైతే తాజాగా వైద్యులను కలిసి ప్రిస్కిప్షన్ రాయించుకుని రావాలని సూచిస్తున్నారు. రోగులకు ఖర్చు తడిసి మోపెడు మత్తును కలిగించే మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఇది రెగ్యులర్గా వాడే రోగులకు కూడా కఠిన తరం చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా వైద్యుల ప్రిస్కిప్షన్ తెస్తేనే చాలా దుకాణాల్లో ఈ మందులు ఇస్తున్నారు. ప్రతిసారీ వైద్యుల వద్దకు వెళ్లాలంటే ఆ రోజు సమయంతో పాటు డాక్టర్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా కలిసి భారం తడిసి మోపెడవుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దురలవాట్లకు బానిసలైన వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా రెగ్యులర్గా మందులు వాడే వారికి ఇది శరాఘాతంగా మారింది. పెరిగిపోతున్న మానసిక సమస్య బాధితులు తాజా ప్రిస్కిప్షన్ లేకుండా మందులివ్వని దుకాణాలు ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళ్లాలంటే కష్టమంటున్న బాధితులు లిక్కర్కు లేని ఆంక్షలు ఈ మందులకు ఎందుకని ప్రశ్నమద్యానికి లేని ఆంక్షలు ఔషధాలకెందుకు? ప్రస్తుతం వీధి వీధిలో మద్యం దుకాణాలు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. మద్యానికి కొనేందుకు ఎలాంటి ప్రిస్కిప్షన్ అవసరం లేదు. దీనికితోడు ఔషధాల కంటే పదింతలు మత్తును ఇవి కలిగిస్తాయి. మద్యానికి బానిసలై చాలా మంది జీవితాలు ఛిద్రమవుతున్నాయి. కొందరి ఆరోగ్యం దెబ్బతింటుండగా, మరికొందరు ప్రమాదాల్లో గాయపడుతుండగా, ఇంకొందరు మరణిస్తున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. అయినా, మద్యం విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. నిద్ర, ఒత్తిడి, ఆందోళన తగ్గించే మాత్రలు వాడటం వల్ల ఆ రాత్రికి రోగులకు నిద్రపట్టడమే గాక వారి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ ఔషధాలపై ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు పెట్టడం లేదని రోగులు ప్రశ్నిస్తున్నారు. మద్యం విక్రయాలపై లేని ఆంక్షలు ఒత్తిడిని తగ్గించే మందులపై ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెడ్ల సంఘాలన్నీ సంఘటితమవ్వాలి
● రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డిఉయ్యాలవాడ: రెడ్డి కులంలో చాలా సంఘాలు ఉన్నాయని, సంఘాలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డి అన్నారు. ఈనెల 11వ తేదీన మహానందిలో చేపట్టిన ‘ఉరిమే ఉయ్యాలవాడ’ యాత్ర ఆదివారం ఉయ్యాలవాడకు చేరుకుంది. ఉయ్యాలవాడ బస్టాండు ఆవరణలో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డిల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బీసీఎస్సార్ ఎయిడెడ్ పాఠశాలలో మాజీ గ్రామ సర్పంచ్ పోచా రాధాక్రిష్ణారెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బీఆర్ కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డిలు మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ప్రభుత్వం తరుపున నిర్వహించాలని పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉయ్యాలవాడలో నరసింహారెడ్డి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి, వర్థంతిలను ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. విగ్రహ ప్రతిష్ట కోసం నేతలు స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం జాహ్నవిరెడ్డి, జేఏసీ మహిళా నాయకురాలు సరోజారెడ్డి, ఏపి మహిళా అధ్యక్షురాలు సుహాసినిరెడ్డి, కర్ణాటక రెడ్డి సంఘం జనసంఘ్ కోఆర్డినేటర్ మాధవరెడ్డి, లెక్కల కొండారెడ్డి, కావలి రెడ్డి ఫౌండేషన్ కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్లు పల్లె మహేశ్వరరెడ్డి, బుడ్డా విష్ణువర్ధన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పల్లె సుబ్బారెడ్డి, మండల రెడ్డి సంఘం నాయకులు మారంరెడ్డి లక్ష్మిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, గండా శివారెడ్డి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
17న నంద్యాలలో కార్మికుల మహాప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): సీఐటీయూ రాష్ట్ర 17వ మహాసభల్లో భాగంగా ఏప్రిల్ 17వ తేదీన నంద్యాలలో కార్మికుల మహాప్రదర్శన ఉంటుందని, దానిని విజయంతం చేయాలని సీఐటీయూ న్యూసిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు వై.నగేష్, ఆర్.నరసింహులు కోరారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్లో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర మహాసభలకు సభాధ్యక్షుడిగా వి.నాగేశ్వరరావు, ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎలమరం కరీం, సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కె.హేమలత, ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబా, కోశాధికారి సీహెచ్ నరసింగరావు, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎంఏ. గఫూర్ హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లాలని కోరారు. కార్యక్రంలో కోశాధికారి సాయిబాబా, ఉపాధ్యక్షుడు సుధాకరప్ప, నాయకులు మహ్మద్రఫీ, ప్రభాకర్ పాల్గొన్నారు. మూర్వకొండ బురుజు వద్ద గుర్తుతెలియని మృతదేహం పగిడ్యాల: మూర్వకొండ బురుజు వద్ద మునక భూముల్లో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైతులు గుర్తించారు. శ్రీశైలం బ్యాక్వాటర్ పూర్తిగా తగ్గిపోవడం వలన రైతులు నువ్వుల పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో నువ్వుల విత్తనం వేసేందుకు పొలం వద్దకు చేరుకోగా అక్కడ కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఇన్చార్జ్ ఎస్ఐ ఓబులేసు, ఏఎస్ఐ శేషయ్య, కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద సెల్ఫోన్ను గుర్తించి సీజ్ చేశారు. అయితే మృతుడు ఎవ్వరన్నది గుర్తించలేదు. బ్యాక్వాటర్లో కొట్టుకుని వచ్చి ఉండొచ్చని శరీరంపై ఎలాంటి గాయాలు లేనందున అనుమానా స్పద మృతిగా భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పొలాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో హార్వెస్టర్ ఆపరేటర్ మృతి చాగమర్రి: విద్యుదాఘాతంతో హార్వెస్టర్ ఆపరేటర్ మృత్యువాత పడ్డాడు. ఎస్ఐ ఎం.రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మల్లెవేముల గ్రామానికి చెందిన వంగల విజయ కిషోర్(22) హార్వెస్టర్ ఆపరేటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కొలుములపేట గ్రామ పొలాల్లో చిన్న సుబ్బారెడ్డి పొలంలో హార్వెస్టర్తో సజ్జ పంట కోత చేపట్టారు. కాగా పొలంలో వెళ్లిన 11కేవీ విద్యుత్ తీగలు హార్వెసర్టకు అడ్డుగా ఉండటంతో తప్పించే ప్రయత్నంలో కిషోర్ విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాద సమయంలో హార్వెస్టర్పై ఉన్న బాలుడు ఇస్మాయిల్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణాలు నిలిచాయి. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రైతులు వాపోయారు. అయితే పొలాల్లో పంట కోత సమయాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నప్పుడు విద్యుత్శాఖ అధికారుల అనుమతితో ఎల్సీ తీసుకోవాలని ఏఈ వెంకట కృష్ణయ్య తెలిపారు. నందికొట్కూరు రూరల్: మే 17వ తేదీన నంద్యాలలో బేడబుడగ జంగం ఎస్సీ పునరుద్ధరణ కోసం జరిగే సభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని బేడబుడగ జంగం కాలనీలో ఎస్సీ పునరుద్ధరణ పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అల్ప సంఖ్యాక కులాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శంకర్, వెంకటేశ్వర్లు, శేఖర్, అలేకం, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
20న బసవేశ్వర విగ్రహ ప్రతిష్ట
హొళగుంద: వీరశైవ లింగాయత్ల ఆరాధ్య దైవం శ్రీ బసవేశ్వరస్వామి విగ్రహానికి ఈ నెల 20న బసవ జయంతి రోజున ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. కొల్లాపురం నుంచి వచ్చిన విగ్రహాన్ని వీరశైవ లింగాయత్లు హొళగుంద పురవీధుల గుండా భజన చేస్తూ ఊరిగించారు. స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలో ప్రతిష్టాపన కట్టపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 20న కర్ణాటకకు చెందిన గురువుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉపాధ్యాయులు రూ.65 వేలు విరాళంగా అందజేశారు. ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో నీటి ప్రవాహం తగ్గింది. టీబీ డ్యాం నుంచి పవర్ కెనాల్ (ఎల్లెల్సీ)కు 1,805 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆంధ్ర వాటా కింద దాదాపు 700 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీరు వరకు ప్రవహిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగేవాడి, కూరిగనూరు, సూగూరు, గుండ్లకెరే, కరూరు, కరుగోడు, మోకా తదితర ప్రాంతాల్లో ఈ నీటిని వాగులు, వంకలు, చెరువులకు, పొలాల్లో పైర్లకు తరలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాగునీటి అవసరాల కోసం ఈ నెల 3న ఎల్లెల్సీకి నీటిని విడుదల చేశారు. ఈ నెల 18 లేదంటే 20వ తేదీన బంద్ చేసే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఆమె వివరించారు. 14న అంబేడ్కర్ జయంతి కర్నూలు(అర్బన్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతరం అక్కడే జయంతి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఆయా కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆమె కోరారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్మెంట్లలో తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. -
మండుతున్న ఎండలు
గోనెగండ్ల: ఎండ తీవ్రత ఉదయం 7 నుంచే ప్రారంభమై సాయంత్రం 5 గంటలైనా తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఆరు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆదివారం గోనెగండ్లలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే మే నెలలో తీవ్రత ఎంత ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. భానుడి భగభగలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై భానుడు విశ్వరూపం చూపుతున్నారు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల రూరల్లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డలో 42.7, బనగానపల్లెలో 42.3, గూడూరులో 42.1, కర్నూలులో 42.1, మంత్రాలయంలో 42. కౌతాళంలో 42.0 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
యువతకు మూడువేల మోసం!
● నిరుద్యోగ భృతి అందక యువకుల ఆందోళన ● ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులు గడివేముల: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి యువతను దగా చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఎన్నో హామీలు గుప్పించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నట్లు కాకి లెక్కలు చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య 10 లక్షల మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, తదితర పెద్ద పెద్ద చదువులు చదివిన యువకులు ప్రైవేట్ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబ పరిస్థితులు బాగా లేక వందలాది మంది నిరుద్యోగులు కూలి పనులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో కూడా ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడం విచారకరం. -
నష్టపోతున్నాం
మేం 18 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.30 వేల వరకు పెట్టాం. కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2400 ఉంటే దళారీలు.. రూ.1500 ధరతో అడుగుతున్నారు. తెలంగాణలో అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్లలో పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాకు రూ.900 వరకు నష్టపోతున్నాం. ఇప్పటికై న చంద్రబాబు ప్రభుత్వం చొరువ తీసుకొని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – తిరుమలేశ్వరరెడ్డి, మొక్కజొన్న రైతు, రేమడూరు గ్రామం, కల్లూరు మండలం -
ఎక్కడి బిల్లులు అక్కడే!
చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,200 ఇప్పటికి పెండింగ్లో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.1,800 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.1,400 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. రెండేళ్లలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు రూ.220 కోట్ల వరకే. ఉద్యోగుల ఆర్థిక బకాయిలకు సంబంధించి ట్రెజరీ నుంచి వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం ఎపుడో అనేది ప్రశ్నార్థకం అయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వెతలు అన్ని ఇన్నీ కావు. 2024 జూన్లో పదవీ విరమణ చేసిన వారికి 10 నెలల సెలవు వేతనం, గ్రాడ్యుటీ, కమిటేషన్ తదితర ఆర్థిక బెనిఫిట్స్ వందలాది మందికి ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో పెట్టినప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు రొడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. -
జిల్లా వ్యాప్తంగా మెగా కార్డెన్ సెర్చ్
● సరైన పత్రాలు లేని 48 వాహనాలు స్వాధీనంకర్నూలు: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో శనివారం మెగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. కర్నూలు సబ్ డివిజన్ బి.తాండ్రపాడు గ్రామ శివారులోని ప్రజానగర్ కాలనీ(టీవీ9 కాలనీ), పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలోని తుగ్గలి మండలం మారెళ్ల గ్రామం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలోని కడివెళ్ల గ్రామం, ఆదోని సబ్ డివిజన్ పరిధిలో ఆదోని టూటౌన్ ప్రాంతాల్లోని సమస్యాత్మక కాలనీల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదాపు 400 వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, భార్గవి తదితరులు పోలీసు బృందాలకు నాయకత్వం వహించారు. -
జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
కర్నూలు(అర్బన్): సమాజానికి మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక బిర్లా సర్కిల్లోని పూలే దంపతుల విగ్రహాలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్తో కలిసి ఎంపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక సంక్షేమ భవన్ ఎదురుగా జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన అధ్యక్షతన ఏర్పాటు సభకు పెద్ద సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాల నేతలు హాజరై ఫూలేకు ఘనంగా నివాళులర్పించారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నప్పటికి తన సతీమణి సావిత్రీబాయి ఫూలేకు చదువు నేర్పించి, ఆమె ద్వారా సమాజంలోని మహిళలకు విద్యను అందించే కార్యక్రమాలు చేపట్టారన్నారు. బాల్య వివాహాలు, కుల వివక్షత వంటి సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జీవిత చరిత్రపై పలు బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలకు చెందిన విద్యార్థినీలు చేసిన నృత రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్హుసేన్, బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పాలెగార్ సత్యనారాయణరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు ఫూలేసమాజంలోని అట్టడుగు వర్గాల కోసం అనేక ఉద్యమాలు, త్యాగాలు చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక బిర్లాగేట్ సర్కిల్లోని ఫూలే దంపతుల విగ్రహాలకు వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అక్కిమి హనుమంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుంకన్న, గడ్డం రామకృష్ణ, సిట్రా సత్యనారాయణమ్మ, బెస్త శ్రీనివాసులు, భారతి, రాఘవేంధ్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యేల గైర్హాజరు పట్ల ఆగ్రహం జిల్లాలో మంత్రితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమానికి హాజరు కాకపోవడం పట్ల బీసీ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ఓట్లు మాత్రమే వీరికి కావాలి తప్ప, ఆయా వర్గాలకు చెందిన మహానేతల జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు కూడా వీరికి తీరిక లేదని మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ నిర్మిస్తే.. టీడీపీ పేరు మార్చుకుంటోంది!
● స్వర్ణ గ్రామాలుగా గ్రామ సచివాలయాలు చిప్పగిరి: పేర్లు మార్చవచ్చు కానీ, కట్టిన భవనాలను మార్చలేరనే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల్లోనే లక్షలాది రూపాయలు వెచ్చించి సచివాలయ వ్యవస్థకు కొత్త రూపు తీసుకొచ్చింది. మండల కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగులను నియమించి సేవలు ఇంటి తలుపు తట్టేలా పాలన సాగించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలనలో కొత్తదనం చూపడం పక్కనపెడితే.. క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయాలకు పేరు మార్పుతో ప్రజల్లో నవ్వుల పాలయ్యేందుకు సిద్ధమైంది. స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు గ్రామ సచివాలయాల పేర్లు మార్చే దిశగా చర్యలు చేపట్టడం విమర్శలకు తా విస్తోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టి పేర్లు మార్చుకుంటే బాగుంటుంది కానీ, ఎవరో కట్టించిన నిర్మాణాలకు వీళ్లు పేర్లు మార్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ఎదురు చూస్తున్నాం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 12వ వేతన సవరణ కమిషన్ వేయడంతో పాటు మధ్యంతర భృతి ఇవ్వాలనేది ప్రదానమైన డిమాండ్. దీనికోసమే ఎదురు చూస్తున్నాం. పెండింగ్లో ఉన్న డీఏలతో పాటు నాలుగు విడతల సరండర్ లీవ్లు, డీఏ, పీఆర్సీ అరియర్స్ కూడా చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రధానమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. – వి.జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్, కర్నూలు -
వరి రైతులకు ‘మద్దతు’ కరువు
పాణ్యం: రబీలో వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి ?2,389గా నిర్ణయించింది. రైతులకు 75 కేజీల బస్తాకు రూ. 1,776 నుంచి రూ. 1,791 వరకు లభించాలి. అయితే మార్కెట్లో రూ.1,600 కూడా అందడం లేదు. మద్దతు ధర కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టమే మిగిలింది! ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రబీ సీజన్లో వరి సాగు చేశారు. విత్తనం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను కష్టాలు వెంటాడాయి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వకపోవడంతో దొరికిన చోట రూ.500 వెచ్చించి బస్తా చొప్పున తీసుకున్నారు. అధిక ధరతో యురియాను కొనుగోలు చేసి పంటను కాపాడుకున్నారు. ఎకరానికి రూ. 30వేలకు పైగానే ఖర్చు రాగా దిగుబడి మాత్రం 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వచ్చింది. పంట వచ్చిన వారం రోజులు మాత్రమే బస్తా రూ. 1900 వరకు పలికింది. ఇరవై రోజుల నుంచి రూ.1600తో కూడా కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు కష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చదువు మాటున గం‘జాయ్’
● అడ్డదారి తొక్కిన విద్యార్థులు ● 8 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు ● మొత్తం 3.1 కేజీల గంజాయి స్వాధీనం కర్నూలు: బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన కొందరు విద్యార్థులు దారి తప్పారు. తొలుత గంజాయి తాగేందుకు అలవాటు పడ్డారు. స్నేహితుల సలహా మేరకు గంజాయి రవాణాను ఆదాయ వనరుగా మార్చుకుని పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యారు. కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్ కాలనీ వాటర్ ట్యాంకు దగ్గర జోరుగా గంజాయి వ్యాపారం సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి శనివారం దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయా లు సాగిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పొట్లాల రూపంలో ఉన్న 3.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నాలుగు నెలలుగా వ్యాపారం.. నందికొట్కూరు హాజీ నగర్కు చెందిన షేక్ అక్బర్ బాషా ప్రస్తుతం కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కర్నూలు పాతబస్తీలోని ఛత్రీబాగ్లో నివాసముంటున్న తెలుగు సాయి, బంగారుపేటకు చెందిన షికారి చరణ్, వాల్మీకి శ్రీనివాసులు, మునగాలపాడుకు చెందిన మల్లెపోగు జయసింహ, కర్నూలు అరోరా నగర్కు చెందిన తమ్మిడిపల్లి పెద్దరంగస్వామి, శ్రీరాం నగర్కు చెందిన తొగరి మౌలి కిషోర్, బండారి శాంతివర్ధన్ జట్టుగా ఏర్పడి కొంతకాలంగా వీకర్ సెక్షన్ కాలనీని అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రవీణ్ పగాడియా రంజిత్తో పరిచయం పెంచుకుని కిలో రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి దానిని 100 గ్రాములుగా పొట్లాలు కట్టి రూ.400 నుంచి రూ.500కు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మొదట అక్బర్ బాషా, తెలుగు సాయి, షికారి చరణ్ ఈ వ్యాపారం సాగించారు. మిగిలినవారు మొదట తాగేందుకు అలవాటు పడి ఆ తర్వాత అక్బర్ బాషా నుంచి కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి మిగిలినవారు కూడా వ్యాపారులుగా మారారు. చదువుకుంటూనే.. మునగాలపాడుకు చెందిన మల్లెపోగు జయసింహ ఐటీఐ చదువుతున్నాడు. అలాగే కర్నూలు శ్రీరాం నగర్కు చెందిన బండారి శాంతివర్ధన్ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాదులో ఎయిర్ హోస్ట్ శిక్షణ పొందుతున్నాడు. కర్నూలు అరోరా నగర్కు చెందిన తమ్మిడిపల్లె పెద్దరంగస్వామి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరంతా మొదట గంజాయి మత్తుకు అలవాటు పడి ఆ తర్వాత వ్యాపారులుగా మారి పోలీసుల నిఘాకు అడ్డంగా దొరికి కట కటాలపాల య్యారు. అరకు, ఒడిశా నుంచి బస్సు, రైలు మార్గం గుండా కర్నూలుకు గంజాయి రవాణా అవుతున్నట్లు వారు విచారణలో అంగీకరించారు. కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీనివాస రెడ్డి, వీఆర్వో సతీష్ల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
జీడీపీకి ఎల్లెల్సీ నీరు
గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువ నీటిని అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లోకి మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్కు చేరిన నీటిని 50 క్యూసెక్కుల నీరు ఎస్కేప్ చానల్ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్కు మళ్లించారు. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎల్లెల్సీ ద్వారా నీటి ని జీడీపీలోకి మళ్లించినట్లు ఏఈ మహమ్మద్ అలీ శుక్రవారం తెలిపారు. అలాగే జీడీపీ కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
నంద్యాల(అర్బన్): సరదాగా ఈతకు వెళ్లి చెక్ డ్యాంలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని పొ న్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షేక్ మోదిన్కుమారుడు షేక్ సోహేల్ గురువారం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న కేసీ కెనాల్ చెక్డ్యాంలో ఈతకు వెళ్లాడు. లోతు గమనించని సోహేల్ డ్యాంలో దూకడంతో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరని కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం సోహేల్ శవమై తేలాడు. ఈ మేరకు మృతుడి తల్లి షేక్ షబానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బాలికపై అత్యాచారయత్నం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రోడ్డులో యనకండ్ల వాగు వంతెన వద్ద ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన గౌండ పని చేసే రవితేజ నంద్యాల రోడ్డులోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్న స్విమ్మింగ్పూల్ వద్దకు సరదాగా ఈతకు వెళ్లాడు. సమీపంలోని రౌండ్ల వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతు రు, ఎనిమిదేళ్ల కుమారుడిని వెంట తీసుకుని పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడంతో వారు నడుచుకుంటూ బయల్దేరారు. అయితే స్విమ్మింగ్పూల్ నుంచి ఇంటికి బయల్దేరిన రవితేజ మార్గమధ్యలో బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక వెంట ఉన్న తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. ఈ మేర కు గాయపడిన బాలికను స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్పన తెలిపారు. యువకుడికి దేహశుద్ధి పోలీసులకు అప్పగింత -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యా లు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యకు, చెల్లెలుకు తేడా తెలియని వ్యక్తి రాధాకృష్ణ అని, చేతిలో పేపరు, టీవీ చానల్ ఉంది కదా అని ఏది చెబితే అది రాసి, ఏమంటే అది మాట్లాడి వైఎస్సార్సీపీపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపీడీకి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అందరి నోట్లో మావిగన్ చర్చ జరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు పిచ్చి ప్రేలాపన మాటాలు మాట్లాడుతున్నారన్నారు. తాము ఎర్రనాయుడు గురించి మాట్లాడవచ్చు అయితే తమకు సంస్కారం ఉందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, వెంటనే రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. -
పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
● ఇంటి స్థలం తమదే అంటూ బెదిరింపు ● కన్నీటి పర్యంతమైన శివమ్మబాయి నందికొట్కూరు: టీడీపీ నాయకులు దౌర్జన్యం శ్రుతిమించి పోయింది. స్థలాలను కబ్జా చేసేందుకు పేదలను బెదిరిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతో శుక్రవారం జంగంపాడు గ్రామంలో శివమ్మ బాయి కన్నీటి పర్యంతమవుతూ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తమకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఈ స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పూరి గుడిసె వేశారని తెలిపారు. ఈ స్థలం కోసం ఇద్దరు గొడవపడి గ్రీవెన్స్కు వెళ్లారని, అధికారులు పరిశీలించి పూలు నాయక్పై ఈ స్థలం ఉందని తేచ్చి చెప్పారన్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇంటి స్థలాన్ని రద్దు చేయాలని అధికారులతో నోటీసు పంపారన్నారు. తన భర్త పూలునాయక్ పక్షవాతం రోగంతో మంచానికే పరిమితమయ్యారని, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
అరటి రైతుల ఆక్రందన
తుగ్గలి : ఏ పంట సాగు చేసినా రైతును కుదిపేస్తున్నాయి. లాభాలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడు. ఈ క్రమంలో అరటి రైతు కూడా చేరాడు. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు దెబ్బతీస్తుంటే.. మరో వైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ధరలు పాతాళానికి పడి పోయి అరటి రైతుకు శాపమైంది. పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం 150 ఎకరాల్లో అరటి పంట సాగైంది. పంట సాగు కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అడిగే వారు లేక, మార్కెటింగ్ సౌకర్యం లేక తోటల్లోనే అరటిని వదిలేసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు టన్ను రూ.20 వేలకు పైగానే ధర ఉంది. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కోతకు వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు. కొనుగోళ్లకు ముందుకురాని వ్యాపారులు.. అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని పరస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు. -
అప్పు తీర్చేదెట్లా
నేను తువ్వదొడ్డి గ్రామం వద్ద 8 ఎకరాలు ఏడాదికి రూ.1.76 లక్షల చొప్పున కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశా. తొలి ఏడాది రూ.22 లక్షలు, రెండో ఏడాది రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. తొలి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం జరిగింది. లక్షన్నర మాత్రమే చేతికొచ్చింది. ఇప్పుడు కొనేనాథుడే లేడు. కోత కూలీల ఖర్చులు కూడా రావని పంటంతా వదిలేశా. సాగుకు అయిన రూ.30 లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం. – ఆర్ సుంకన్న, కౌలు రైతు, రామకొండ -
ఉత్తమమైనది హోమియో వైద్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దికర్నూలు: హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కబర్ది మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించడానికి ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి మాట్లాడుతూ..చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు మహదేవ్రావ్, డాక్టర్ పీవీ హరినాథ్, కర్నూలు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ చంద్రుడు, వైద్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా శివరామచంద్రరావు
కర్నూలు: కర్నూలు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా న్యాయవాది ఎం.శివరామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం ఉదయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక స్తోమతలేని నిందితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవల్లో భాగంగా క్రిమినల్ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తారు. గడచిన రెండు సంవత్పరాల నుంచి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా పనిచేసి పలు కేసుల్లో తన వాదనలు వినిపించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టువారు ఇచ్చిన నోటిఫికేషన్లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ధరఖాస్తు చేసుకోవడంతో శివరామచంద్రరావును ఎంపిక చేసి నియమించారు. -
అప్పుడు రూ. 20 వేలు.. ఇప్పుడు రూ. 4 వేలే
నేను రూ.50వేలు కౌలుతో 4 ఎకరాలు తీసుకుని అరటి పంట సాగు చేశా. రూ.10 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. పంట బాగానే పండినా ధరల్లేవు. యుద్ధంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను రూ.20 వేలకు పైగా ధరలు యుద్ధం కారణంగా ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. పంట కోనుగోలుకు వ్యాపారులు ఎవరూ రాక దిక్కుతోచడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఆకుల శ్రీనివాసులు, కౌలు రైతు, తుగ్గలి -
త్వరలో నూతన అదనపు కోర్టులు ఏర్పాటు
నంద్యాల(వ్యవసాయం): నంద్యాలలో నాలుగు నూతన అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది తెలిపారు. శుక్రవారం కోర్టు కాంప్లెక్స్లోని నాలుగు కోర్టులకు సంబంధించిన గదులను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోర్టు కాంప్లెక్స్లో తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టులకు అవసరమైన వసతులు అన్ని ఉన్నాయన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు రూ. 21 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈనెల 18, 19 తేదీలలో నంద్యాలలో నాలుగు కోర్టులు, నందికొట్కూరులో ఒక కోర్టు, కర్నూలులో రెండు కోర్టులను హైకోర్టు జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి హైకోర్టు అనుమతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, రెండవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కర్రి లక్ష్మి, ఆర్డీవో విశ్వనాఽథ్, తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, జయకృష్ణ, శివశంకర్ రెడ్డి, ఏపీపీ రాజేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి, గౌరీ శంకర్ తదితర కోర్టు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికర్నూలు(సెంట్రల్): తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్వెల్స్ తరచూ పాడవడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఎస్ఎస్ ట్యాంకులు, మైనర్ ఇరిగేష్ ట్యాంకులను నింపుకున్నామన్నారు. మార్చి 20వ తేదీ నుంచి ట్యాంకులు, చెరువులను నింపడం ప్రారంభమైనందున ఆగస్టు చివరి వరకు నీటి కొరత ఉండబోదన్నారు. నీటి వనరులు ఉన్నా కొన్ని చోట్ల కొరత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ప్రతి ప్రాంతానికి సమానంగా నీటి సరఫరా జరగాలన్నారు. ఎక్కడైనా పక్షపాతం, నిర్లక్ష్యం జరిగితే సహించబోనని హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి గ్రామాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయని, క్రమం తప్పకుండా వాటిని పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించాలని డీపీఓను ఆదేశించారు. పత్రికల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రతి కూల వార్తలు రెండు, మూడు సార్లు వస్తే మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల నివారణపై దృష్టి సారించాలన్నారు. తాను కోసిగి పర్యటనలో ఒక బాల్య వివాహాన్ని ఆపినట్లు చెప్పారు. కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తడిచెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేసినట్లు కనిపించడంలేదన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పరిషత్ సీఈఓ రమణారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరరావు, ఐసీడీఎస్ విజయ, డీపీఓ భాస్కర్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. -
బినామీ పేర్ల నమోదును అరికట్టండి
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: ప్రభుత్వ భూముల్లో బినామీ పేర్ల ప్రక్రియను తక్షణమే అరికట్టాలని, నిజమైన రైతులకు మాత్రమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ విద్యాసాగర్ను కలిసి భూముల అన్యాక్రాంతమవుతున్న అంశంపై సమగ్రంగా చర్చిరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మండలంలోని చింతలపల్లె, గుట్టపాడు, ఓర్వకల్లు గ్రామాల్లో భూములు బినామీ పేర్లమీద నమోదవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014– 2019 వరకు భూములను సాగు చేసుకున్న రైతులు, అప్పట్లో అర్జీలు సమర్పించిన వారు, కోర్టులను ఆశ్రయించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన రైతులను గుర్తించాలని సూచించారు. ఓర్వకల్లు గ్రామ రెవె న్యూ పరిధిలో 440–488 సర్వే నంబర్లలో సుమారు 48 సర్వే నంబర్లలో బినామీ పేర్ల మీదుగా ఎంట్రీలు జరుగుతున్నాయని ఆరోపించారు. చింతలపల్లె గ్రామంలో కూడా బినామీ వ్యక్తుల పేర్లు నమోదు జరుగుతోందన్నారు. ఇప్పటికై న బినామీ పేర్లమీద నమోదు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా, నిజమైన లబ్దిదారులకు మాత్రమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాటసాని వెంట జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, చేట్ల అనిల్కుమార్, బి.ప్రభుకుమార్ పాల్గొన్నారు. -
లోకాయుక్త డీడీగా రిటైర్డ్ జిల్లా జడ్జి బి. సునీత
కర్నూలు(సెంట్రల్): లోకాయుక్త డిప్యూటీ డైరక్టర్గా రిటైర్డ్ జిల్లా జడ్జి బి.సునీత నియమితులయ్యారు. ఈమె చార్జి తీసుకున్న రోజు నుంచి ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ సీజన్కు విత్తనాల కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు విత్తనాలు కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాల కోసం పంపించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టి అరకొరగా కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 12,674 క్వింటాళ్లు, రబీ సీజన్కు 9480 క్వింటాళ్లు కేటాయించింది. వేరుశనగ కర్నూలు జిల్లాకు 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2136 క్వింటాళ్లు, కొర్ర కర్నూలు జిల్లాకు 76 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 27 క్వింటాళ్లు, మినుములు నంద్యాల జిల్లాకు 40 క్వింటాళ్లు చొప్పున కేటాయించింది. కర్నూలు జిల్లాలో కూడా మినుము సాగవుతున్నప్పటికీ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పచ్చ రొట్ట ఎరువుల విత్తనాలైన దయంచ కర్నూలు జిల్లాకు 1,681 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 5,685 క్వింటాళ్లు, సన్హెంప్ విత్తనాలు కర్నూలు జిల్లాకు 4 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 76 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు కర్నూలు జిల్లాకు 190 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 1516 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. లేఖ రచన విజేతలకు బహుమతులు కర్నూలు(అర్బన్): తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధై అఖర్ లేఖ రచన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించినట్లు కర్నూ లు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తపాల శాఖ ఫిలాటెలీ(స్టాంపుల సేకరణ) లేఖ రచనను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తోందన్నారు. ధై అఖర్ లేఖ రచన పోటీలను నాలుగు విభాగాలలో నిర్వహించామన్నారు. 2025–26 సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో కర్నూలు డివిజన్కు చెందిన ముగ్గురు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచారన్నారు. షేక్ మెహనాజ్ మొదటి బహుమతిగా రూ.25 వేలు, వై.సింధు రెండవ బహుమతిగా రూ.10 వేలు, సీ.పుల్లయ్య మూడవ బహుమతిగా రూ.5 వేలు అందుకున్నారన్నారు. నేడు మూడు మండలాలకు ఎల్లో అలర్ట్ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. ఈ నెల 11న నంద్యాల జిల్లాలోని పలు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం వెలుగోడులో 44.5, ఆత్మకూరులో 44.8, కొత్తపల్లిలో 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బనగానపల్ల్లెలో 42.3, నంద్యాల రూరల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 41.9, చాగలమర్రిలో 41.9, సంజామలలో 41.8, రుద్రవరంలో 41.7, కర్నూలులో 41.4, గడివేములలో 41.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోసారి ఏహెచ్ఏల సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఏహెచ్ఏ ఉద్యోగాలు పొందారనే ఆరోపణలపై మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక శాఖలో అప్పటికే అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే అటెండర్లు, గోపాలమిత్రలు తదితరులకు ఏహెచ్ఏ పోస్టుల భర్తీలో వెయిటేజీ మార్కులు ఇచ్చింది. ఒకవైపు ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు అదే సమయంలో డిప్లమా కోర్సులు పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు అనుమానాలు ఉన్నాయి. కొందరు ఏహెచ్ఏలపై లోకాయుక్తతో పాటు హైకోర్టులో కేసులు కూడా వేశారు. రాష్ట్రం మొత్తం మీద 1,200 మంది ఈ విధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏహెచ్ఏల వెయిటేజీ మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా ఇచ్చారు. దీనిని పూర్తి చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత జిరాక్స్ ప్రతులను తీసుకొని డైరెక్టరేరేట్కు పంపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. డైరెక్టరేట్ నుంచి ధృవపత్రాలు సంబంధిత కాలేజీలు, యూనివర్సిటీలకు పంపనున్నట్లు సమాచారం. -
విత్తన కేంద్రాల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తన కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పీఎల్ వరలక్ష్మి సూచించారు. శుక్రవారం కల్లూరు మండల పరిధిలోని వివిధ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు పరిధిలోని ఏపీ సీడ్స్ గోదాముల్లో వివిధ విత్తనాల ప్రాసెసింగ్ను గమనించారు. విత్తనాల నాణ్యతను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మహాలక్ష్మి జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాల్లో హెచ్టీ పరీక్షలు నిర్వహించారు. అగ్రో లైఫ్లో ప్రైవేటు లిమిటెడ్ పురుగు మందుల గోదామును తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏఓ విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. -
గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం
గత ఏడాది వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, పైప్లైన్లు తదితర నీటి సమస్యలను తీర్చేందుకు రూ.2 కోట్లను రిజర్వులో ఉంచుకున్నాం. అప్పట్లో రిజర్వులో ఉంచుకున్న మొత్తంతోనే జెడ్పీటీసీల ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.కోట్లలో ఉన్న స్టాంప్ డ్యూటీ లక్షలకు పడిపోయింది. జెడ్పీకి సొంత ఆదాయ వనరులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడం చాలా బాధాకరం. – యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్థానిక సంస్థలకు నిధులు విడుదలయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీని జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – పోచా జగదీశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, జూపాడుబంగ్లా -
మారని చేనే‘తల రాత’
కర్నూలు(అగ్రికల్చర్): నష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం లేదు. ఘన కీర్తిని సొంత చేసుకున్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కో పరం చేయడానికి చర్యలు చేపట్టింది. దీంతో తమ తల రాతలు మారబోవని చేనేత కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఏర్పాటు అయ్యింది. ఈ సంఘాన్ని మురార్జీదేశాయ్ స్వయంగా వచ్చి పరిశీలించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం వ్యవస్థాపకుడు మాచాని సోమప్ప నాటి జవహర్లాల్ నెహ్రూతో గుంతకల్లులో సమావేశమై చేనేత వస్త్రాల ఉత్పత్తి, విశిష్టతను వివరించారు. ఈ సొసైటీకి ఇంటర్నేషనల్ అవార్డుతో పాటు పలు నగదు పురస్కారాలు కూడా దక్కాయి. ఎంతో ఘనకీర్తిని గడించిన ఎమ్మిగనూరు చేనేత సహకర సంఘం ఒకప్పుడు 2000 మంది సభ్యు లతో ఏటా కోట్ల రూపాయల టర్నోవర్తో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం రూ. 6 కోట్లు నష్టాల్లో ఉంది. ఆర్థిక వెసులుబాటు ఇవ్వకుండా.. నష్టాల్లో ఉన్న సంఘాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మొదటి దశలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం షో రూముల్లో ఆప్కో ఉత్పత్తులు ఉంచి విక్రయించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సంఘాన్ని ఆప్కో పరం చేసే కుట్రదాగి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండేళ్లలో ఆప్కో తమ షోరూములకు కొత్త సరుకు అనేదే పంపిన దాఖలాలు లేవు. లేని అప్కో ఉత్పత్తులను ఎమ్మిగనూరు సంఘం షోరూముల్లో ఉంచి విక్రయిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నష్టాల్లో ఉన్న సంఘానికి ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు మాత్రం లేవు. ఆధిపత్య పోరు సంఘంలో 59 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతభత్యాలకే రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపితే సంఘానికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 59 మందిలో 18 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. పాలకవర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం రిటైర్డ్ అయిన వారిని కూడా కొనసాగిస్తుండటంతో సంఘంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రిటైర్డ్ అయిన వా రిని కొనసాగించడం అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పాలక వర్గాలు, సంఘం సెక్రటరీల మధ్య ఆధిపత్య పోరు కూడా సంఘం నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమవుతోందనే విమర్శలు ఉన్నాయి. తగ్గిపోయిన ఉత్పత్తులు ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు 2000 మంది సభ్యులతో కళకళలాడిన సంఘంలో నేడు 500 మంది కూడా సభ్యులు లేరు. ఇందులో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నది 200 మంది వరకే. ఇందువల్ల ఉత్పత్తులు పడిపోయాయి. ఆధునిక యుగంలో కొత్త కొత్త డిజైన్లతో రాణించాల్సి ఉండగా... నేటికి సంప్రదాయ వస్త్రాలైన దోవతులు, పంచలు, టువాళ్లు, దోమతెరలకే పరిమితం అయ్యింది. నాగరికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో సంప్రదాయ వస్త్రాలకు ఆదరణ తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసింది. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆధునాతన పరికరాలను సరఫరా చేసింది. ప్రత్యేకంగా డిజైనర్లను కూడా నియమించింది. ఫలితంగా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తులు పెరిగాయి. సంఘానికి వివిధ రూపాల్లో ఏడాదికి రూ.60 లక్షల వరకు ఆర్థిక చేయూత దక్కింది. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం ఐదేళ్లు అందించింది. రూ.6 కోట్ల నష్టాలు! ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నష్టాల్లో కూరుకపోయింది. 2024–25 ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ సంఘానికి ఉన్న నష్టాలు రూ.6 కోట్లు. 2025–26 సంవత్సరంలో ఆడిట్ చేస్తే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 16 అవుట్లెట్స్ (షోరూములు) ఉన్నాయి. ఒక షోరూం ద్వారా రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ. 2500 మాత్రమే. 16 షోరూములలో రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ.40 వేలు మాత్రమే. అంటే నెలకు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరగుతోంది. గణనీయంగా పడిపోయిన చేనేత వస్త్రాల ఉత్పత్తి చేనేత కార్మికులను ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కో పరం చేసేందుకు అడుగులు తొలి దశలో ఆప్కో ఉత్పత్తుల అమ్మకాలు మలి దశలో విలీనం చేసేందుకు కసరత్తు -
రామళ్లకోటలో అరటి తోట దగ్ధం
వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోట గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట పరిసరాల్లోని అరటితోట దగ్ధమైంది. గురువారం బాధిత రైతు గ్రామానికి చెందిన పెద్ద మాధవస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఎకరా పొలంలోని అరటి పంట 2వ దఫా కోతకు వచ్చింది. బుధవారం దండ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్తో రేగిన నిప్పు రవ్వలకు మంటలు చెలరేగి పంటకు వ్యాపించాయి. అరటి బోదెలు, గెలలు అంటుకుంటూ వెళ్లి దాదాపు 4 టన్నుల అరటి కాయల దిగుబడి, చెట్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న వెళ్లిన బాధిత రైతు కుటుంబం మంటలను ఆర్పి మిగిలిన కాస్త పంటను కాపాడుకున్నారు. అపస్మారకస్థితిలో మహిళ ఎమ్మిగనూరురూరల్: ఆదోని రోడ్డు ఎస్ఎంల్ డిగ్రీ కాలేజీ, ఎల్లీల్సీ కాలువ మధ్యలో గురువారం తెల్లవారుజామున రక్తగాయాలతో ఓ మహిళ అపస్మారకస్థ్థితిలో కనిపించింది. పట్టణంలోని మైనార్టీ కాలనీకి చెందిన షఫీయాబీ(38) బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఆదోని రోడ్డు పై రక్తగాయాలతో కనిపించింది. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ కైలాస్, పైలెట్ గజేంద్ర అపస్మారకస్థితిలో ఉన్న మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో మహిళ ఆచూకీ గుర్తించిన వారు బంధువులకు సమాచారం అందించారు. అసుపత్రికి చేరుకున్న షఫీయాబీ బంధువులు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఎరువుల వ్యాపారి ఆత్మహత్య పాణ్యం: నంద్యాలకు చెందిన ఓ ఎరువుల వ్యాపారి అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాణ్యంలోని ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి ఆచూకీ గుర్తించారు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల ఎన్జీఓస్ కాలనీకి చెందిన ద్వారం వెంకటసుబ్బారెడ్డి(40) నూనెపల్లె లోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం వరకు షాప్లో ఉన్న అతను బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం పాణ్యం ఎస్సార్ర్బీసీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్య లు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. మృతదేహం పక్కన పురుగు మందు, ఆహారం డబ్బాలు ఉండడంతో పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు. వలసబాటలో మృత్యుఒడికి.. ఎమ్మిగనూరురూరల్: గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం కాటవారిపాలెంలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామానికి చెందిన సురేష్(21) మృతి చెందగా, జగన్ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. వివరాలు.. ఏనుగుబాల గ్రామానికి చెందిన బజారి, శంకరమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం బజారి చనిపోయాడు. సురేష్ డిగ్రీ వరకు చదువుకున్నా ఉపాధి లేకపోవటంతో తల్లితో పాటు గుంటూరు జిల్లాకు మిరప కోత పనులకు వెళ్లాడు. కాటవారిపాలెంలో గురువారం పనులు చేస్తుండగా పిడుగు పడటంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న జగన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స కోసం సత్తనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
‘ఆయుష్’ పెరుగుతోంది
హోమియోపతి ఏకై క లక్ష్యం ఆరోగ్య పునరుద్ధరణ. అంటే మనిషి చైతన్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండటం. దీనినే సిమిలియా సిమిలర్గా హనిమన్ వర్ణించారు. ఈ విధానంలో వ్యక్తి శారీరక, మానసిక వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకుని అవే లక్షణాలు కలిగిన హోమియో మందును ఎన్నుకుని చికిత్స చేస్తారు. ఈ వైద్యవిధానంలో వ్యాధి నివారణ శాశ్వతంగా, సమూలంగా, సత్వరంగా జరుగుతుంది. – డాక్టర్ భారతీదేవి, ప్రభుత్వ హోమియో వైద్యురాలు, వెల్దుర్తి డిస్పెన్సరీ దయాల్బాగు రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ద్వారా కర్నూలు నగరంలోని ధర్మపేటలో 40 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ క్లినిక్ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం ధర్మపేటలో ఇంటింటికి తిరిగి పేదలకు ఒక్క రూపాయి ఫీజుతో వైద్యం అందిస్తున్నాం. ప్రతి రెండవ శనివారం ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే దాదాపు 500 మందికి ఉచితంగా వైద్యం చేస్తున్నాం. – డాక్టర్ కె.భాస్కరరెడ్డి, హోమియో వైద్యులు, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): అవి మందులా అనిపించదు. నోట్లో వేసుకోగానే కమ్మగా, తియ్యగా, నాలుకపై ఇలాగే కరిగిపోతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా వీటిని సులభంగా వాడే అవకాశం ఉంది. ఇతర వైద్యవిధానాల వలే దుష్ప్రభావాలు ఇందులో ఉండవు. అదే హోమియోపతి వైద్యవిధానం. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులకు, మొండిరోగాలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా రోగులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య విధానానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ క్రిస్టియన్ ప్రెడరిక్ సామ్యుల్ హనీమన్ మొదటిసారిగా హోమియో విధానాన్ని కనుగొన్నారు. ఆయన జన్మించిన ఏప్రిల్ 10న వరల్డ్ హోమియో డేగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12 రెగ్యులర్తో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కింద మరో 10 హోమియో డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరీలో ప్రతిరోజూ 50 నుంచి 70 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లోపతి వైద్య విధానాలు ఉన్నచోటే వీటిని ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ వైద్యంగా హోమియో మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, డోన్లలో ఓపీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జిల్లాలోని అన్ని డిస్పెన్సరీలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుండగా ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితం. ఇటీవల కాలంలో హోమియో రంగంలో ప్రైవేటు వైద్యులు, కార్పొరేట్ కంపెనీలు క్లినిక్లు ఏర్పాటు చేయడంతో ఈ వైద్యానికి మరింత ప్రచారం, ఆదరణ పెరిగింది. మొండి వ్యాధులకు చక్కని పరిష్కారంకొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, మొండి రోగాలకు హోమియో చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇతర వైద్య విధానాల్లో నయం కాని కొన్ని వ్యాధులకు రోగులు హోమియోలో చికిత్స పొంది పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పి, సయాటికా, మోకాళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, పలు రకాల అలర్జీలు, తరచూ వచ్చే చీముగడ్డలు, గజ్జి, తామర, ఎగ్జిమా, చెవిలో చీము కారడం, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, స్టాన్సిలైటిస్, నాజిల్ పాలిప్స్, గ్యాస్ట్రబుల్, మలబద్దకం, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, గాల్బ్లాడర్లో రాళ్లు, పసిరికలు, అమీబియాసిస్, నరాల సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్ తలనొప్పి, డిప్రెషన్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, ప్రీమెన్ర్ట్సువల్ సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు హోమియో మందులు బాగా ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. హోమియోకు పట్ల ప్రజల్లో ఆదరణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 22 ప్రభుత్వ డిస్పెన్సరీలు అన్ని చోట్లా ఉచితంగా చికిత్స, మందులు దీర్ఘకాలిక, మొండి రోగాలకు మెరుగైన వైద్యం నేడు వరల్డ్ హోమియో డే -
నయన మనోహరం వెండి రథోత్సవం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం భక్తులు స్వామి వారి దర్శనార్థం కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనం దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క, వెండి రథోత్సవాల పై ప్రహ్లాదరాయలు కొలువుంచి ఊరేగింపు నిర్వహించారు. వెండి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న దృశ్యం -
విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలో పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రాసెసింగ్ యూనిట్ల తనిఖీలకు జిల్లా వ్యవసాయ అధికారి సంబంధిత ఏవో, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్రెడ్డి కల్లూరు మండల పరిధిలోని సహజ క్రాప్ సైన్సెస్, మార్క్యివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. సహజ క్రాప్ సైన్సెస్లో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాలకు సంబంధించి మూడు లాట్లతో హెచ్టీ పరీక్షలు నిర్వహించారు. అయితే హెచ్టీ లేదని తేలింది. మహంకాలేశ్వర సీడ్స్లో మొక్కజొన్న విత్తనాల ప్రాసెసింగ్ను పరిశీలిచారు. 2026–27 సంవత్సరానికి బీటీ పత్తి విత్తన ధరలు ఖరారు కానందున ఇంకా ప్యాకింగ్ చేయని పరిస్థితి. ప్రాసెసింగ్ యూనిట్లలో రికార్డులను క్షుణంగా పరిశీలించారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి
● జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టంపై తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు బార్ అసోసియేషన్ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు ధర్నా చేపట్టారు. నిరసన అనంతరం కోర్టు విధులు కూడా బహిష్కరిస్తూ న్యాయవాదికి మద్దతుగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది ఓంకార్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదులపై ఇటీవల కాలంలో భౌతిక దాడులు అధికమయ్యాయన్నారు. న్యాయవాదులు న్యాయం కోసం కోర్టుల్లో ప్రజల పక్షాన వాదన చేస్తుంటే కేసు విషయంలో కక్షలు, కుతంత్రాలతో కొంతమంది దుండగులు నేర ప్రయత్నాలు చేయడం, హత్య చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని విమర్శించారు. పీలేరు సంఘటనను న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఆ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తేవడం జరిగిందని గుర్తు చేశారు. ఏపీలో కూడా న్యాయవాదులపై దాడులు, హత్యల నివారణకు తక్షణమే రక్షణ చట్టం తేవాలని కోరారు. వైస్ ప్రెసిడెంట్ మద్దిలేటి, రాజేష్, హుసేన్, ప్రసాద్, సురేష్, షఫి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకే ముప్పు.. న్యాయం కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్న తరుణంలో వారిపై దాడులు, హత్యలు జరిగాయని, వీటిని అరికట్టకపోతే న్యాయ వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో యువ న్యాయవాది యల్లయ్యపై దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేయడాన్ని ఐలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. -
పీఎం మోదీతో సమావేశానికి ఆర్యూ విద్యార్థి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తికి అరుదైన అవకాశం లభించింది. ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ –2026’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశానికి ఎంపికై ంది. ఈ మేరకు గురువారం వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు శివకీర్తిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘మైభారత్ బడ్జెట్ క్వెస్ట్ –2026’ పోటీల్లో ఫైనల్ రౌండ్కు శివకీర్తి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. దేశ యువతలో కేంద్ర బడ్జెట్ 2026–27 ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించడం ద్వారా విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ క్విజ్తో పాటు వ్యాసరచన పోటీల్లో దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అందులో తొలి రెండు దశలను విజయవంతంగా అధిగమించి శివకీర్తి ఫైనల్ రౌండ్కు అర్హత సాధించిందన్నారు. ఈనెల 12, 13 తేదీల్లో జరిగే ఫైనల్ రౌండ్లో పాల్గొంటుందన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్. భరత్ కుమార్ శివకీర్తిని అభినందించారు. -
కలెక్టర్ గారూ.. గొంతులెండుతున్నాయ్!
కలెక్టర్ వాహనాన్ని అడ్డగించిన డి.బెళగల్ గ్రామస్తులుకోసిగి: ‘మేడమ్.. ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు.. కుళాయిలకు నీళ్లు రావడం లేదు.. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. పనులు మానుకుని తోపుడు బండ్లపై నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు’ అంటూ డి.బెళగల్ గ్రామస్తులు కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు నీటి కోసం మండు వేసవిలో అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. కుళాయిలకు నీరు సరఫరా కాగా నిరుపయోగంగా మారాయి. గ్రామ శివారులో ఉన్న గుమ్మీల వద్ద ట్యాంక్కు నీరు ఎక్కడం లేదు. మహిళలు పనులు మానుకుని దూర ప్రాంతాల నుంచి తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలోని చెరువు, చెక్డ్యామ్లను పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గురువారం గ్రామానికి చేరుకున్నారు. ఆమె పరిశీలించి వాహనంలో తిరిగి వెళ్తుండగా వాహనాన్ని ఆ గ్రామ ప్రజలు అడ్డగించారు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు. అలాగే దొడ్డి గ్రామంలో ప్రజలు ఆమెను కలిసి తాగునీటి సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ మేరకు సంబంధిత నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెండు నెలలుగా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం పనులు మానుకుని తోపుడు బండ్లపై తెచ్చుకుంటున్నాం జిల్లా కలెక్టర్ వాహనం అడ్డగించిన డి.బెళగల్, దొడ్డి గ్రామస్తులు -
విదేశాలకు జిల్లా మామిడి దిగుబడులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండించిన మామిడి కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇక్కడ పండించిన బంగినపల్లి రకం మామిడిని కృష్ణ జిల్లా పామర్రులోని కోసూరు బాలాజీ ఆగ్రో పుడ్ ప్రయివేటు లిమిటెడ్ ద్వారా ఎగుమతులు చేయనున్నట్లు తెలిపారు. గురువారం కోసూరు బాలాజీ ఆగ్రో ఫుడ్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధి శ్రీనివాసరావుతో కలసి ఓర్వకల్ మండలం గుడుంబాయి తండాలోని మామిడితోటలను పరిశీలించారు. తోటల్లోని మామిడి ఎగుమతులకు తగిన నాణ్యతతో ఉందని గుర్తించారు. ఎక్స్పోర్టు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు జిల్లా ఉద్యాన అధికారి వివరించారు. కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ టన్నుకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎగుమతులకు అవకాశం ఉండాలంటే తగిన ఫ్రూట్కేర్ యాక్టివిటీస్ చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఈ పద్ధతులు పాటిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● స్పాట్ కేంద్రం వద్ద నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసనకర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన సమస్యల సాధనలో భాగంగా మలి దశ ఉద్యమాన్ని తీవ్ర తరం చేసేందుకు గురువారం పదవ తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.హృదయరాజు, అప్టా రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇన్చార్జి కె.ప్రకాష్రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ నెల 25, 26, 27 తేదిల్లో విజయవాడలో రిలే నిరహాక్షలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు. -
చేపల పెంపకంపై ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): చేపల పెంపకం, మార్కెటింగ్ తదితరాలపై 7వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు మే నెల 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. కర్నూలు బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్టీసీ)లో 146వ జట్టులో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధిలో రాణించే విధంగా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ నెల 29లోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరు కావాలని కోరారు. వివరాలకు కర్నూలు నగరం బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. 11న మహాత్మా జ్యోతిబాపూలే జయంతి కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాన్ని 11వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా షరీన్ నగర్ వద్ద, బిర్లా గేట్ సర్కిల్ వద్ద ఉన్న పూలే విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పిస్తామన్నారు. అనంతరం బిర్లాగేట్ సర్కిల్లో సభ నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖాధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు. 10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10 నుంచి మే నెల 7వ తేదీ వరకు డిగ్రీ రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసిహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు వెల్లడించారు. మొత్తం 48 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెగ్యులర్ 7282 మంది, సప్లిమెంటరీ 10,372 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. నిప్పుల కొలిమి ● దొర్నిపాడులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దొర్నిపాడులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గోస్పాడులో 42.8, ఆళ్లగడ్డలో 42.7, రుద్రవరంలో 42.6, చాగలమర్రిలో 42.3, నంద్యాల రూరల్లో 42.3, అవుకులో 42.2, బనగానపల్లిలో 42.2, కౌతాలంలో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్న సమయంలో గాలిలో తేమ 10 శాతానికి పడిపోతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ● పార్టీకి 11వ వార్డు ఇన్చార్జ్, మాజీ కౌన్సిలర్ రాజీనామాఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ తగిలింది. గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి 11 వార్డు ఇన్చార్జ్ జహంగీర్, మాజీ కౌన్సిలర్ దౌలత్బీలు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. తాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నానని, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నిజమైన కార్యకర్తలును గుర్తించడం లేదన్నారు. సమస్యలు చెప్పటానికి ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. ఫోన్ చేస్తే స్పందన ఉండటం లేదని, రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, ఎమ్మెల్యే తీరు నచ్చకనే బయటకు వస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తన చుట్టూ ఉన్న ఇద్దరు, ముగ్గురు మాటలు నమ్మకుంటు వెళ్తే పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. తనతో పాటు త్వరలో మరికొందరు పార్టీని వదిలేందుకు సిద్ధపడుతున్నారన్నారు. -
బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి
కర్నూలు: బాలలకు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలలు, న్యాయచట్టంపై గురువారం అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల నేరస్తుల్లో నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. బాల నేరస్తులను సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పిలుపునిచ్చారు. జువైనెల్ జస్టిస్ యాక్ట్ గురించి చైర్మన్ కమ్ ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ టి.అపర్ణ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవల కోసం శాశ్విత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకటహరినాథ్ పలు రంగాలకు సంబంధించి ఎలాంటి సేవల్లో లోపం కాని, నష్టం కాని, అన్యాయం కాని జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్లో వినతిపత్రంతో పాటు తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా తక్కువ సమయంలో న్యాయం చేస్తామని తెలిపారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు మాట్లాడుతూ పిల్లల కేసుల పట్ల ఎలా విచారణ చేయాలో పోలీసులకు తెలియజేశారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ బాషా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, తదితరులు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి కింద పడి ..
ఆదోని రూరల్: తాటి చెట్టుపై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో ఈసంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పెద్దతుంబలం గ్రామానికి చెందిన ఉసేని (35) తాటికాయలు కోసి విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగా బుధవారం గ్రామ సమీపంలో ఉన్న తాటి చెట్టును ఎక్కి తాటికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే చికిత్స నిమిత్తం బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా ఉసేనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కౌసల్య వివాహం ఈనెల 12న ఆదివారం అదే గ్రామానికి చెందిన యువకుడితో జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు తండ్రి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. -
చంద్రబాబుకు ఊడిగం చేసుకోండి
● మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: ‘ఏబీఎన్ రాధాకృష్ణా.. చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసుకోండి. మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏబీఎన్ రాధాకృష్ణపై కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ చానల్లో ఈ నెల 4న వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యనాలు చేయడం దారుణామన్నారు. జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాడం చాలా బాధాకరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు తిరిగి మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేయడం చూశాం గాని ఒక పత్రిక, చానల్ యజమాని ఇలా మాట్లాడటం మొదటిసారి అన్నారు. మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారం ఎవరు ఇచ్చారు? తనకు సంస్కృతి ఉందని, అలాగే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, అసభ్య పదజాలం వాడటం లేదని కాటసాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుందనే ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు తన ‘పచ్చ’ మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘మావిగన్’ అంశంపై మాట్లాడాలని, మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు భార్యల గురించి మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలను గౌరవించాలని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని పురణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జోనల్ విభాగం అధ్యక్షులు గాజుల శ్వేతారెడ్డి, జనరల్ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, భీమేశ్వర్రెడ్డి, బస్తిపాడు రమణారెడ్డి, సుంకన్న, సాయి, హేమలత పాల్గొన్నారు. -
రాధాకృష్ణవి ‘చెత్త’పలుకులు
ఆలూరు రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకొని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మావిగన్ను ప్రతిపాదించారన్నారు. ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేని రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరోపని లేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ఈనాడు ఎల్లో మీడియా కూటమి కుల పిచ్చితో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారన్నారు. అమరాతి పేరిట చంద్రబాబు అండ్ బ్యాచ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. అమరాతి ప్రజల రాజధానిగా కాకుండా కమ్మ రాజధానిగా మారుతోందన్నారు. కారుకూతలు కూసిన రాధాకృష్ణ రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు ఆందోళనలు కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీనీ నాయకులు చిన్న ఈరన్న, రామాంజినేయులు, ఎస్కే గిరి, వెంకటేషులు, ఎల్లప్ప, లక్ష్మిరెడ్డి, ఉరుకుందు, మారెప్ప, ఈరన్న, కో–ఆప్షన్ మెంబర్ బాషా పాల్గొన్నారు. -
తనిఖీలు విస్తృతం చేయండి
కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో కల్తీల నిరోధానికి తనిఖీలు విస్తృతం చేసి శాంపిల్స్ సేకరించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో జాతరలు, పండుగల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించే అవకాశమున్నందున నిరంతరం నిఘాతో పాటు దాడులు కొనసాగించాలన్నారు. పాత కేసులలో దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. నాటుసారా తయారీదారులకు బెల్లం విక్రయాలు జరుపుతున్న వ్యాపారులపై నిఘా ఉంచి బైండోవర్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, రాముడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీవై రామయ్య
కర్నూలు (సెంట్రల్): వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ మేయర్ బీవై రామయ్యను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎగుమతులు లేకనే ఉల్లి ధర పతనం కర్నూలు(అగ్రికల్చర్): ఎగుమతులు లేకపోవడం వల్లే ఉల్లిగడ్డల ధర తగ్గుతోందని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం శ్రీసాక్షిశ్రీలో ధర లేని ఉల్లి.. రైతు తల్లడిల్లి శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆమె వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎగుమతులను కేంద్రం నిలిపివేయడం వల్లే ధరలు పడిపోయాయని వ్యాపారులు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం ఉల్లి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. ఇక్కడ పండించిన ఉల్లి ప్రధానంగా పశ్చిమ బెంగాల్కు తరలుతుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్తో పాటు పలు దేశాలకు ఎగుమతి అవుతుంది. ఎగుమతులు ఉంటేనే ఉల్లికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే బుధవారం ఉల్లి ధరలు మరింత పడిపోయాయి. మార్కెట్కు 1,390 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.314, గరిష్ట ధర రూ.989 లభించగా.. సగటు ధర రూ.689 మాత్రమే నమోదైంది. ఆర్జేడీ వెబ్సైట్లో తాత్కాలిక సీనియారిటీ జాబితా కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు, సమాన హోదాల నుంచి గ్రేడ్–2 హెచ్ఎం పదోన్నతులకు సవరించిన తాత్కాలిక సీనియారిటీ జాబితా ఆర్జేడీ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు తమ సర్వీస్ వివరాలు, సీనియారిటీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధార పత్రాలతో కడప ఆర్జేడీ మెయిల్ rjdrekadapa@aprchooed u.in ద్వారా ఈ నెల 11వ తేదిలోపు సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు. స్పాట్ కేంద్రం వద్ద నేడు నిరసన కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాఫ్టో) ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నేడు(గురువారం) టెన్త్ స్పాట్ కేంద్రం వద్ద నిరసన తెలుపనున్నట్లు ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ ఎం.మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భాస్కర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమానికి ఫ్యాఫ్టో రాష్ట్ర కో–చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ప్రకాష్రావు, జి.హృదయరాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. క్వింటా వేరుశనగ రూ.7,410 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు బుధవారం 197 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా ధర గరిష్టంగా రూ.7,410 పలికిందని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,570, మధ్యస్త ధర రూ.5,893 నమోదైందన్నారు. ఆముదాలు 33 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,870, గరిష్ట ధర రూ.5,900 పలికిందన్నారు. 14న ట్రాఫిక్ పీఎస్లో వాహనాల వేలం కర్నూలు: ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కర్నూలు నగర పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 31 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, కోర్టు ఆదేశాల ప్రకారం బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించామన్నారు. వేలం దక్కించుకున్న వాళ్లు అదే రోజు మొత్తం డబ్బు చెల్లించి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. -
మూల్యాంకనం..అసౌకర్యం!
● ప్రైవేట్ స్కూల్లో పది స్పాట్ కేంద్రం ● ఒకే ఫ్లోర్లో ఒకవైపు తరగతులు... మరోవైపు మూల్యాంకనం ● ఉపాధ్యాయులకు అరకొరగా బెంచీల ఏర్పాటు ● నిబంధనలకు విరుద్ధంగా స్పాట్ కేంద్రంలోకి సెల్ఫోన్ల అనుమతి కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం అసౌకర్యాల మధ్య సాగుతోంది. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. కర్నూలు నగరంలోని ఏక్యాంపులోని మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం స్కూల్లో స్పాట్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి 1,88,742 సమాధాన పత్రాలు వచ్చాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు 494, చీఫ్ ఎగ్జామినర్లు 107, స్పెషల్ అసిస్టెంట్లు 231 మంది మొత్తం 832 మందిని నియమించారు. స్పాట్ నిర్వహించేందుకు ఇంత వరకు సరైన కేంద్రమే లేదు. ప్రతి ఏటా ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రైవేటు స్కూళ్లలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఏక్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో కేంద్రం ఏర్పాటు విషయం ఆ స్కూల్ యాజమాన్యానికి తెలియజేయకుండానే ప్రకటించారు. తర్వాత స్కూ ల్ యాజమాన్యం తమకు ఇబ్బంది అవుతుందని చెప్పినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఆ స్కూల్ భవనంలోని ఓ ఫ్లోర్లో ఒక వైపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఉక్కపోతతోనే మూల్యాంకనం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు మూల్యాంకనం...మరో వైపు క్లాసులు పది స్పాట్ కేంద్రానికి కేటాయించిన ఫ్లోర్లోనే ఓ వైపు సమాధాన పత్రాల మూల్యాంకనం మరోవైపు ఆ స్కూల్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉపాధ్యాయులకు రూంలు సరిపోకపోవడంతో హాల్లో ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ సరైన బెంచీలు కూడా లేవు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల మూల్యాంకనం చేసేటప్పుడు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపాధ్యాయులు పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. అలాంటి ఒకే ఫ్లోర్లో తరగతులు, మూల్యాంకనం ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక బెంచీపై ఇద్దరు కూర్చోవాల్సి ఉండగా ..ముగ్గురు, నలుగురు కూర్చొని మూల్యాంకనం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కేంద్రంలోకి ఎలాంటి సెల్ఫోన్లు తీసుకురాకూడదు. కానీ స్పాట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు వారి పక్కనే సెల్ఫోన్లు పెట్టుకొని వాటిలో మాట్లాడుతూ మూల్యాంకనం చేస్తున్నారు. మరికొందరు సమాధానాలను సైతం సెల్ఫోన్లలో చూసి కరెక్షన్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై డీఈఓ ఎల్.సుధాకర్ను వివరణ కోరగా మూల్యాంకన కేంద్రం కోసం సొంత భవనం లేదని, అలాగే స్పాట్ సెంటర్లోకి ఉపాధ్యాయులు సెల్ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చామని, ఎవరైనా తెచ్చుకుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. -
ఎస్సార్బీసీకి నీటి విడుదల బంద్
● ఆయకట్టు రైతుల ఆందోళనబనగానపల్లె: ఎస్సార్బీసీకి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో 1.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో 58వేల ఎకరాలు ఉండగా రబీలో 12 వేల ఎకరాల్లొ మొక్కజొన్న, 16వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరికొన్ని పంటలను ఇతర విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం వరి వెన్ను, మొక్కజొన్న కంకిదశలో ఉంది. ఈనెల చివరి వరకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలోని మొత్తం పంటలన్నీ చేతికి వచ్చే అవకాశం ఉంది. గోరుకల్లు రిజర్వాయర్లో నీరు ఉన్నప్పటికీ ఎస్బార్బీసీకి విడుదల నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మే చివరి వరకు నీటిని ఇచ్చేవారని, ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అర్థకం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. -
కనీస గౌరవం లేదా?
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి కర్నూలు (టౌన్): మహిళలపై కనీస గౌరవం లేకుండా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి అన్నారు. కర్నూలులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనను తీసుకువచ్చారని, దీనిపై ప్రజలు, మేధావులు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని అయితే వేల కోట్లు దోపిడీ చేసుకోవచ్చుననే దురాశతో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతి రాజధానికి జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో దోపీడీకి వ్యతిరేకమన్నారు. భార్యకు, చెల్లికి తేడా తెలియని దౌర్భాగ్యస్థితిలో జర్నలిస్టు రాధాకృష్ణ ఉండటం సిగ్గుచేటైన విషయమన్నారు. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్ ఖండించకపోవడం దారుణమన్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్ రాధాకృష్ణ ఉపసంహరించుకొని బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. -
ప్రాణం తీసిన మనస్పర్థలు
● కర్నూలులో విద్యార్థి హత్య కర్నూలు: స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారి తీసింది. కర్నూలు బిర్లాగడ్డలో నివాసముంటున్న జగత్ గణేష్, పసుపుల సుజాత దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చివరివాడైన బోయ కిరణ్ (17) గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణా నగర్కు చెందిన అస్లాం, ఇస్మాయిల్లతో కిరణ్కు మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్నేహితులు బడే సాహెబ్, రాజారెడ్డి, వినయ్తో కలసి మంగళవారం రాత్రి అస్లాం, ఇస్మాయిల్ల ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. ఘర్షణ తీవ్రమై ఒకరినొకరు కొట్టుకున్నారు. అస్లాం, ఇస్మాయిల్ కలసి కిరణ్ను బలంగా కిందికి తోసి కాలుతో కొట్టడంతో తలకు బలమైన గాయాలై సొమ్మసిల్లి పడిపోగా వెంట వెళ్లిన స్నేహితులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పాత కక్షల కారణంగానే అస్లాం, ఇస్మాయిల్ కలసి తన కుమారుడిపై దాడిచేసి హత్య చేశారని తల్లి పసుపుల సుజాత ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ ఎస్ఐ గోపీనాథ్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహానికి మార్చురీ కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్నేహితుల మధ్య ఉన్న మనస్పర్థలే ఘర్షణకు దారితీయడంతో కిరణ్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఖబడ్దార్.. ఒళ్లు దగ్గర పెట్టుకో!
కల్లూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారి పెళ్లాలను చెల్లెలుగా అనుకొని వారికి సంబంధాలు చూడాలని వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణా ఖబడ్దార్... ఒళ్లు దగ్గర పెట్టుకో అని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కర్నూలు నగరంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి శాంతియుతంగా నిరసన చేశారు. ఆంధ్రజ్యోతి పత్రులను దహనం చేశారు. సిగ్గుమాలిన చర్య వైఎస్సార్సీపీ జోనల్ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, అరుణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మహిళలు ఏబీఎన్ రాధాకృష్ణా చెత్త పలుకుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజమని నినాదాలు చేశారు. చానల్, పేపర్కు యజమానిగా ఉన్న వ్యక్తి ఇటువంటి మాటాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. సాధారణంగా పత్రికల్లో కథనాలు, వార్తాలు సమాజానికి మేలుకోలుపే విధంగా ఉండాలని, ఏబీన్ రాధాకృష్ణ మాత్రం మహిళల గురించి నీచంగా మాట్లాడారన్నారు. ఇంట్లో మహిళలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి దినప త్రిక టీడీపీకి కరపత్రికగా మారిందని విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను, నాయకులు పోలీసులు అడుకోవడం దారుణమన్నారు. నిరసనలో తాజా మాజీ కార్పొరేటర్లు సుదర్శన్రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తిరుపాల్, గోపాల్రెడ్డి, శివారెడ్డి, సాయి, హేమలత, మహేశ్వర్రెడ్డి, యూనస్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అదిలాబాద్ అదనపు జిల్లా జడ్జిగా జిల్లా వాసి
కర్నూలు: కర్నూలు కు చెందిన న్యాయ వాది బి.సి.శశికుమార్ అదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈనెల 9వ తేదీ బాధ్యతలు చేపట్టనున్న శశికుమార్ పది సంవత్సరాల నుంచి కర్నూలులో సీనియర్ న్యాయవాది సీపీ మద్దిలేటి వద్ద జూనియర్ లాయర్గా పనిచేశారు. 2025 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిల్లా జడ్జి పోస్టుల పోటీ పరీక్షకు హాజరై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనను అదిలాబాద్ జిల్లా అదనపు జడ్జిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలోనే కాక ఉమ్మడి ఏపీలో పేరున్న రంగస్థలం నటుడైన స్వర్గీయ బీసీ కృష్ణకు బి.సి.శశికుమార్ కుమారుడు. జిల్లా జడ్జి పోస్టుకు ఎంపికై నందుకు ఆయనను పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందించారు. ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో జడ్జి పోస్టు సాధించడం విశేషం. జననీ బ్యాంకు బాధితురాలు ఆత్మహత్యాయత్నం కోవెలకుంట్ల: కోవెలకుంట్లలోని జననీబ్యాంకు బాధితురాలు బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న సూరమ్మ రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ. 20 లక్షలు డిపాజిట్ చేసింది. అధిక వడ్డీల ఆశ చూపి ఖాతాదారుల నుంచి లక్షలాది రూపాయాలు డిపాజిట్లు చేయించుకున్న బ్యాంకు గత ఏడాది బోర్డు తిప్పివేసింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు సీఈఓ రమణతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఏడాది గడిచినా డిపాజిట్ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం, డిపాజిట్ చేసేందుకు ప్రోత్సహించిన మహిళల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. దీంతో మనస్థాపం చెందిన సూరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుమారుడి షాపులో పనిచేస్తున్న గుమాస్త ఇంటి వద్దకు వెళ్లగా అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్లను దారి మళ్లించారు
● ప్రత్యేక బృందాల తనిఖీలో బట్టబయలు ● 115 గ్యాస్ సిలిండర్లు సీజ్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో భారీగా గ్యాస్ సిలిండర్లు దారి మళ్లిన విషయం బట్టబయలైంది. స్వయగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైనా ప్రత్యేక బృందాలు ఆ శాఖ పనితీరును తేటతెల్లం చేశాయి. బుధవారం ప్రత్యేక బృందాలు నిర్వహించిన సోదాల్లో నగరంలోని వివిధ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో 115 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఏఎస్ఓ కార్యాలయంలో డీఎస్ఓ ఎం.రాజారఘువీర్ వెల్లడించారు. నగరంలోని 156 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. పట్టుబడిన సిలిండర్లను సీజ్ చేశాక సంబంధిత వ్యక్తులు, సంస్థలపై 103 సిక్స్–ఏ కేసులను నమోదుచేసినట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వినియోగించరాదన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వినియోగిస్తే సంబంధిత సంస్థ లేదా వ్యక్తి హోటళ్లు, ఇతరాత్రాలకు సంబంధించిన సంస్థలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను దారి మళ్లిస్తే తీవ్రమైన చర్యలతో పాటు ఏజెన్సీని రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష
కర్నూలు : పోలీసు శాఖలోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కళాశాలలో నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలు బుధవారం ముగిశాయి. ఔట్డోర్ పరీక్షల్లో భాగంగా డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేరస్తుల పరిశీలన వంటి అంశాలపై మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్టు) నిర్వహించారు. రాయలసీమ జోన్ పరిధిలో ఏఎస్ఐలు, మొత్తం 72 మంది ఔట్ డోర్ పరీక్షకు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమూషి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ తదితరులు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. డీటీసీ ప్రిన్సిపాల్ హుసేన్ పీరా, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, డీఎస్పీలు శ్రీనివాసులు, కరీం, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శ్రీశైలం తెలుగు వర్సిటీ డీన్గా బాబురావు
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పొట్టి శ్రీరాములు చరిత్ర సంస్కృతి పురావస్తు శాఖ పీఠాధిపతి (డీన్)గా ప్రొఫెసర్ భూక్యా బాబురావు బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు ఈ నెల 1న తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు మునిరత్నం నాయుడు నుంచి ఉత్తర్వులను ప్రధాన కార్యాలయంలో అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 1999లో సహాయ ఆచార్యులుగా శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తూ 2021లో ఆచార్యులుగా పదవి పొందడంతో పాటు పీఠాధిపతిగా పనిచేశానని అన్నారు. రెండవసారి శ్రీశైలం పీఠాధిపతిగా అవకాశం కల్పించిన వర్సిటీ ఉపాధ్యక్షులు రిజిస్టార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ గడువు పొడిగింపు కర్నూలు(హాస్పిటల్): బీఎస్ఎన్ఎల్ ఫ్రీడల్ ప్లాన్ ఆఫర్ (4జీ సిమ్ కేవలం రూ.1..కే)ను ఈ నెల 30వ తేది వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్రీడల్ ప్లాన్ లేదా ఆజాది కా ఆఫర్ ద్వారా వినియోగదారులకు ఉచితంగా 4జి సిమ్ను ఇస్తూ కేవలం రూ.1 రీఛార్జి ద్వారా 30 రోజుల పాటు ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చన్నారు. ఈ ఆఫర్ కొత్తగా సిమ్ తీసుకునే వారికి, బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యే వారికి వర్తిస్తుందని తెలిపారు. వినియోగదారులు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం లేదా రిటైలర్ను సందర్శించి ఈ ఆఫర్ను పొందాలని ఆయన పేర్కొన్నారు. నేడు న్యాయవాదుల నిరసన కర్నూలు : అన్నమయ్య జిల్లా పిలేరు బార్ అసోసియేషన్ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ గురువారం న్యాయవాదులు నిరసన తెలపనున్నారు. కోర్టు విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించినట్లు కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే పత్తికొండ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా నేడు కోర్టు విధులకు గైర్హాజరు అవుతున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు మరో ప్రకటనలో వెల్లడించారు. యువతి అదృశ్యం నందికొట్కూరు: జూపాడుబంగ్లా మండలం పి. లింగాపురం గ్రామానికి చెందిన అవిజ చిన్న నాగన్న కూతురు స్వాతి అదృశ్యమైంది. పట్టణంలోని ఓ ప్రవేట్ కళాశాలలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఈ అమ్మాయి ప్రతి రోజు ఇంటి ను ంచి వచ్చి తిరిగి వెళ్లేది. మంగళవారం సాయంత్రం ఇంటికి రాలేదని బుధవారం స్వాతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామచంద్రయ్య తెలిపారు. బావిలో పడి బాలుడి మృతి సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో ఓ బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాధిత కుటుంబంలో ఈ ఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని తెలుగు (బెస్త) వీధిలో నివాసం ఉండే తెలుగు మద్దిలేటి, రంగవేణి దంపతుల ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతనం మొదటి కుమారుడు మధు (13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ చివర చెరువు దగ్గరున్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం గాలించారు. బావి గట్టుపై కుమారుడి దుస్తులు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున స్థానికులు, మత్స్యకార జాలర్లు, పోలీసుల సాయంతో బావిలో గాలించారు. 11 గంటల సమయంలో బాలుడి మృతదేహం బయటపడింది. ఈతకు వెళ్లి కుమారుడు మృతి చెందడంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువుల బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాలు అమలు చేయాలి కోవెలకుంట్ల: ఎస్సీ, ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి దళితులకు అండగా నిలవాలని మాలమహానాడు గ్రేటర్ రాయలసీమ అధ్యక్షుడు కోగిల ప్రసాద్ అన్నారు. బుధవారం కోవెలకుంట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా ఏ హక్కులు ఉన్నాయో వాటిని యథావిధిగా అమలు చేయాలన్నారు. ఎస్సీ కులంలోని 59 ఉప కులాలకు అన్ని విధాలా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
‘మహా’ దోపిడీ
మహానంది: మహానంది దేవస్థానంలో టోల్ గేట్ల నిర్వహణ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. దేవస్థానం నిర్ణయించిన అధికారిక ధరల కంటే అత్యధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో టెండర్లను దక్కించుకున్న వారికి లేని తెలివితేటలు తమకు మాత్రమే ఉన్నాయన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రము ఖ పుణ్య క్షేత్రమైన మహానంది ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి సైతం ఇక్కడికి వస్తుంటారు. మహానందిలో మహానంది నుంచి నంద్యాల వెళ్లే మార్గంతో పాటు మహానంది నుంచ గాజులపల్లె వెళ్లే మార్గంలో రెండువైపులా ఉభయ టోల్గేట్లు ఏ ర్పాటు చేశారు. గత ఏడాది వీటి నిర్వహణకు వేలాలు నిర్వహించగా రూ. 1,68,00,003 కోట్లు ఆదాయం వచ్చింది. తాజాగా ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.1,91,00,007 ఆదా యం లభించింది. నూతన టెండర్ ధరలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దేవస్థానం నిబంధనల మేరకు జీపు , కారు, ట్రాక్టర్ల వంటి నాలుగు చక్రాల వాహనాలకు, ఆటో లకు రూ. 80 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్ దక్కించుకున్న వ్యక్తి అతి తె లివి ప్రదర్శిస్తున్నారు. మహానంది దేవస్థానం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తుఫాన్ వాహనంలో వచ్చే భక్తుల నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారు. ఇందుకోసం సొంతంగా రూ. 80కు బదులు రూ.100 పేరుతో టికెట్లు ముద్రించి వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇలా అనధికార వసూళ్లకు పా ల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దేవస్థానం అధికారులను సంప్రదించగా దేవస్థానం నిబంధనల మేరకు మాత్రమే వసూలు చేయాలని అధిక మొత్తంలో వసూ లు చేస్తే టెండర్లైసెన్స్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆలూరు రూరల్: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆలూరు సమీపంలోని హైవే 167లో బుధవారం 12 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని హులేబీడు గ్రామానికి చెందిన ప్యాసింజర్ ఆటో ఆలూరు నుంచి హులేబీడుకు వెళ్తోంది. గుంతకల్లు నుంచి ఆదోనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆలూరు సమీపంలో ఆటోను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా ప్రైవేటు ట్రావెల్ బస్సు వచ్చింది. దీనిని తప్పించే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ ఆటోను ఢీకొట్టడంతో ఆ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. వారిని 108 ఆంబులెన్స్లో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మునెప్ప (59) అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు సంతానం. ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మన్మథ విజయ్ విలేకరులకు వెల్లడించారు.ప్రమాదానికి గురైన ఆటో , కారణమైన ఆర్టీసీ బస్సు -
భూముల రీసర్వేపై ప్రత్యేక చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నందికొట్కూరు: భూములకు సంబంధంచిన రీసర్వే వేగవంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మిడుతూరు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. భూ రీసర్వేపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తండ్రి చనిపోతే భాగ పరిష్కరాలు చేసుకున్న కుమారు ల పేర్లు రికార్డులలో ఉండకుండా తండ్రి పేరే ఉంటుందని ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మ్యుటేషన్స్ చేయడంలో వీఆర్వోలు అలసత్వం చేస్తునట్లు తెలుస్తోందని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీవెన్స్లో ఎక్కువ భూ సమస్యలే ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ఒకే కుటుంబంపై 25 ఎకరాల భూమి! గతంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన మహిళా ఉద్యోగి చింతలపల్లెలో రెండు ఎకరాలను తన పేరు మీద ఆన్లైన్ చేసుకొని అమ్మేశారని, అలగనూర్ గ్రామ పొలిమేరలో భర్త పేరుతో, బంధువుల పేరుతో సుమారు 20 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి స్థానికులు తెచ్చారు. అసైన్ కమిటీ రిజిష్టర్ను చించేశారని కొందరు తెలిపారు. సుంకేసుల గ్రామంలో సుమారు 25 ఎకరాల భూమిని ఒకే కుటుంబంపై ఆన్లైన్లో నమోదు చేశారని కలెక్టర్ తెలియజేశారు. వచ్చే బుధవారం 15వ తేదీన భూ సమస్యలను పరిష్కరించేందుకే తహసీల్దార్ కార్యాలయానికి వస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 29 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో రైతులకు చెందినవి ఎంత, ప్రభుత్వ భూములెన్నీ తేల్చాల్సి ఉందన్నారు. సమీక్ష సమావేశంలో తహసీల్దార్, ఆర్ఐ జహంగీర్బాషా, సర్వేయర్ కృష్ణుడు, వీఆర్వోలు పాల్గొన్నారు, అనంతరం మురికి కుపాలుగా తలపిస్తున్న రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. సీసీ రోడ్లు వేయాలని స్థానిక మహిళలు కోరారు. ఎంపీడీవో దశరథరామయ్య, ఏవో సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి ఇంట విషాదం
● విద్యుత్ షాక్తో వరుడి సోదరుడు మృతి కొలిమిగుండ్ల:పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై వరుడి సోదరుడు మృతి చెందాడు. మండలంలోని మదనంతపురం గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన సుద్దల గంగశివుడు(32) కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. సొంత చిన్నాన్న గంగన్న కుమారుడు పెళ్లి ముహూర్తం కావడంతో బుధవారం పనుల్లో బిజీ అయ్యారు. బంధువులందరూ గ్రామానికి చేరుకున్నారు. ఉదయమే పెళ్లి పందిరి వేయాలని గంగశివుడు బంధువులతో కలిసి ఊరి శివారులోని టెంకాయ చెట్టు వద్దకు వెళ్లాడు. మిగిలిన వాళ్లు కింద ఉండగా ఆ యువకుడు చెట్టు పైకి ఎక్కాడు. చెట్టు పైభాగానే 11 కేవీ విద్యుత్ తీగలు ఉండటంతో వాటికి టెంకాయ పట్ట తగిలి విద్యుత్ షాక్కు గురై చెట్టుపైనే పడిపోయాడు. నిచ్చెన సాయంతో బంధువులు పైకి ఎక్కి చూడగా అప్పటికే విగత జీవిగా మారిపోయాడు. మృతదేహాన్ని తాళ్ల సాయంతో కిందకు దించారు. పెళ్లి సందడి ఉన్న ఇంట్లో ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయి విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య సరస్వతి, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
తీరని కష్టాలు!
ప్రజలకు వంట గ్యాస్ కష్టాలు తీరడం లేదు. మంగళవారం హొళగుందలో భారత్ గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆదోని నుంచి హొళగుందకు 12 గంటల సమయంలో సిలిండర్ల వాహనం రావడంతో వినియోగదారులు ఎగబడ్డారు. బుకింగ్ చేసుకుని డెలివరీ మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే సిలిండర్లు లభించాయి. గతంలో మెసేజ్ రాని వారికి కూడా సిలిండర్లు అందేవని ప్రస్తుతం ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గంటల తరబడి వేచి చూసినా కొందరికి సిలిండర్లు దొరక్కపోవడంతో నిరాశతో ఇంటి దారి పట్టారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉండగా రవాణా చార్జీ కింద అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. బ్లాక్లో వ్యాపారం చేసుకునే కొందరు పదుల సంఖ్యలో సిలిండర్లను బుకింగ్ చేసుకుని తీసుకెళ్తున్నారని, దీనివల్ల గ్యాస్ సమస్య వస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – హొళగుంద -
ఆదోని ఎమ్మెల్యే అవినీతి చిట్టా!
ఆదోని అర్బన్: ఎమ్మెల్యే పార్థసారథికి రూ.10 లక్షలు ఇచ్చింది వాస్తవమే. ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. దీన్ని మరిపించేందుకే మసీదులో అవినీతి జరిగిందని చెబుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 17 అవినీతి ఆరోపణల చిట్టాకు ఎమ్మెల్యే సమాధానమివ్వాలని జామియా మసీదు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌది రావూఫ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఫ్యాక్టరీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పార్థసారథి మసీదులో అవినీతి జరిగిందని సోమవారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విదేశాల నుంచి తన బంధువులకు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని నిరూపిస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు. మసీదుకు రూ.వెయ్యి ఇస్తే రూ.10 రసీదు ఇస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారని, ఒక్కరి వద్దనైనా రసీదు చూపించాలన్నారు. తన సొంత డబ్బుతో మసీదుకు కొంతమేర ఖర్చు చేస్తున్నానని స్పష్టం చేశారు. కోర్టు అనుమతి తెస్తే ఎన్నికలు జరుపుదామని సవాల్ విసిరారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు ఇచ్చినందుకే తాను నిర్మిస్తున్న భవనాన్ని పునాది దశలో, టాప్ దశలో ఆపలేదని, మరింత డబ్బు అడగ్గా తాను ఇవ్వనందుకే మున్సిపల్ అధికారులు, పోలీసులతో కలిసి అడ్డుకుంటున్నారన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఈ 17 అవినీతి ఆరోపణల చిట్టాకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాత్రనక, పగలనకా కష్టపడి ఎన్నికల్లో గెలిపిస్తే మాపైనే అస్త్రం ఉపయోగిస్తావా అని వాపోయారు. -
గ్రామాల్లో ఆర్ఎంపీల సేవలు ఎనలేనివి
నంద్యాల(వ్యవసాయం): గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్ఎంపీలు పరిమితుల మేరకు ప్రాథమిక వైద్యం అందించాలని మూడవ జిల్లా జడ్జి లోక్ఆదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా సూచించారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఆర్ఎంపీలకు ఆరోగ్య విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఆర్ఎంపీలు విలువైన సేవలు అందిస్తున్నారన్నారు. కష్టతరమైన కేసులను ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయాలన్నారు. సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ లాంటి అంశాలపై స్వచ్ఛంద సంస్థల ద్వారా శిక్షణ పొంది నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, రెడ్క్రాస్ చైర్మన్ దస్తగిరి, ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డి భాస్కర్ పాల్గొన్నారు -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఓర్వకల్లు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని హుసేనాపురం మంగళవారం చోటుచేసుకొంది. వివరాలు.. గ్రామంలో కర్నూలు– కడప జాతీయ రహదారి పక్కన గల ఓ హో టల్ యజమాని వద్ద ఇనుప నిచ్చెనను కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో విద్యు త్ మరమ్మతుల నిమిత్తం తీసుకెళ్లారు. పని ముగించుకొన్న తర్వాత నిచ్చెనను హోటల్ యజమానికి అప్పగించేందుకు గ్రామానికి చెందిన దాసరి మహే ష్ (33) ఆటోలో ఎత్తి పంపారు. హోటల్ వద్ద నిచ్చెనను దించే సమయంలో విద్యుత్ తీగలకు తగలడంతో మహేష్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయా డు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మీనాక్షితో పాటు, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
కర్నూలు: కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఇన్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి డీపీ స్వామన్న (74) తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. మిడుతూరు మండలం మాసాపేట గ్రామానికి చెందిన ఈయన మోకాళ్ల నొప్పులతో కొంతకాలంగా బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు కర్నూలుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రి ఇన్గేట్ నుంచి బుధవారపేట జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే కోలుకోలేక మృతిచెందడంతో మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రంలో భద్రపరిచారు. అతని కుమారుడు కిరణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
దాహం.. దాహం
కోసిగి: స్థానిక రైల్వే గేటు సమీపంలోని సిద్దరూఢ కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలనీవాసుల కోసం పంచాయతీ అధికారులు దొరల జిల్లా ఎదురుగా తాగునీటి మినీ గుమ్మీని ఏర్పాటు చేశారు. ఆ ట్యాంక్కు రెండు రోజులకోసారి నీటిని వదులుతున్నారు. ఆ నీరు కూడా సక్రమంగా వదలక పోవడంతో తాగునీటి సమస్య తీవ్రమైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. నీటిని ఎప్పుడు వదులుతారో తెలియకపోవడంతో ఖాళీ బిందెలను వరుస క్రమంలో ఉంచి వెళుతున్నారు. నీటి కోసం పనులు మానుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించినా తాగునీటి సక్రమంగా వదలడం లేదని ఆ కాలనీ వాసులు ఆరోపించారు. వేసవి కావడంతో నీటి సమస్య తీవ్రంగా మారిందని, అధికారులు తగు చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు. -
రక్తదానానికి ముందుకు రావాలి
కర్నూలు కల్చరల్: రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సెనేట్ హాల్లో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో పాటు శస్త్రచికిత్సలు, తలసేమియా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు. రక్తదానంపై అపోహలు తొలగిపోయే విధంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించాలన్నారు. శిబిరంలో 27 మంది రక్తదానం చేసినట్లు, 87 మంది బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకున్నారని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి.నాగరాజు పేర్కొన్నారు. రెక్టార్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ బి.విజయ్కుమార్ నాయుడు, డాక్టర్ కె.మాధవీ శ్యామల, వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెంకటరత్నం, డాక్టర్ బి.విజయుడు, డాక్టర్ ఎస్.నాగచంద్రుడు, బి.శివప్రసాద రెడ్డి, కర్నూలు రెడ్క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భార్యను గొడ్డలితో నరికిచంపిన భర్త
బనగానపల్లె: మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని నందవరం గ్రామంలో కుటుంబ తగాదాలతో భర్త కాళ్ల వెంగన్న భార్య వెంకటలక్ష్మమ్మ (60)ను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి కథనం మేరకు.. వెంగన్న దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికీ వివాహాలయ్యాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి. భార్య వెంకటలక్ష్మమ్మను హతమార్చాలనుకున్న భర్త వెంగన్న రెండు రోజుల క్రితం రాత్రి ఇంట్లోనే గొడ్డలితో ఆమెను నరికిచంపారు. రాత్రంతా ఇంట్లోనే ఉండి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ స్థితిలో మంగళవారం తెల్లవారుజామున ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటిలోపలికి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో వెంకటలక్ష్మమ్మ మృతదేహం కనిపించింది. కుమారుడు కాళ్ల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
● మత్స్యకారున్ని చంపి కృష్ణానదిలో వేసినట్లు ఆనవాళ్లు ● భయాందోళనలో మత్స్యకారులు కొత్తపల్లి: మండల పరిధిలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని శవం లభ్యమైంది. మంగళవారం సంగమేశ్వరం సమీపంలోని బిలం కాంచమ్మ గుడి కింది భాగంలో గోపాదం ప్రాంతంలో కృష్ణానదిలో కుళ్లిన స్థితిలో ఓ మత్స్యకారుడి శవం కనిపించింది. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ సురేష్కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ అక్కడికి చేరుకొని నదిలోని శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారు మాట్లాడుతూ.. లభ్యమైన శవం వైజాగ్ చెందిన మత్స్యకారునిదా, ఇక్కడి ప్రాంతం వారిదా అని తెలియాల్సి ఉందన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి ఉండడం, ఒంటిపై దెబ్బలు ఉన్నట్లు గుర్తించామన్నారు. హత్యగా కేసునమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్ఐ వెల్లడించారు. నదిలో మృతదేహం లభ్యమైన ఘటనతో కృష్ణానది వెంట ఉన్న మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఏడాదిలో కనీసం మూడైనా జరగడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ వైపు నుంచి కొందరు మధ్యవర్తులు పనిలేని యువకులకు, మధ్య వయస్సు వారికి నెలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇక్కడి అలివి వలల దళారులకు అప్పజెప్పడం, వారితో చేపలవేట పేరుతో వెట్టిచాకిరీ చేయిస్తూ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కొంత మంది మత్స్యకారులు అనుకోవడం గమనార్హం. ఎవరైనా డబ్బులు అడిగినా, పని చేయలేక పారిపోవాలని ప్రయత్నించినా ఇలా హత్యచేసి కృష్ణానదిలో పడేసి ప్రమాదంగానో, ఆత్మహత్యగానో చిత్రీకరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే సంబంధిత అధికారులు ఇలాంటి ఘటనలను ఎందుకు నిషేధించలేక పోతున్నారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా హత్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠిన శిక్ష విధించాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
ఎకై ్సజ్ ట్రైనీ ఎస్ఐలకు శిక్షణ
కర్నూలు: ఎకై ్సజ్ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) మచ్చా సుధీర్బాబు ఎకై ్సజ్ ట్రైనీ ఎస్ఐల కు సూచించారు. గ్రూప్–2 ద్వారా ఎకై ్సజ్ శాఖలో ఎస్ఐలుగా ఎంపికై న 8 మంది జిల్లాలోని వివిధ ఎకై ్సజ్ స్టేషన్లలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్నారు. వారికి మంగళవారం మద్దికెర మండలం సుబ్బరాయుడుపల్లె శివారులోని ఈత వనంలో కల్లు పరిపాలన విధానాల గురించి శిక్షణ ఇచ్చారు. కల్లు దుకాణాల లైసెన్స్లలో రకాలు, లైసెన్స్దారులకు ఈత వనంలో చెట్ల కేటాయింపు, వాటి నుంచి కల్లు సేకరించే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈత వనం సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, కొత్త లైసెన్స్లు జారీ చేసేటప్పుడు తీసుకోవలసిన చర్యలు, కల్లు దుకాణాల లైసెన్స్ రెన్యువల్ విధానం, కల్తీ కల్లు అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు, కల్తీ కల్లు గుర్తించే విధానం తదితర వాటి గురించి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఎకై ్సజ్ చట్టాలు, అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై దాడులు, కేసుల నమోదు తదితర అంశాలపై ఎకై ్సజ్ ఎస్ఐల పర్యవేక్షణలో వారం రోజులుగా శిక్షణ పొందారు. ఇందులో భాగంగా శిక్షణ అభ్యర్థులకు ఈత చెట్లు గీసే విధానం గూర్చి కల్లు దుకాణాల లైసెన్స్దారుల చేత ఆచరణాత్మకంగా చూపించారు. ఏఈఎస్ రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్ర సాద్, స్వర్ణలత, సబ్ ఇన్స్పెక్టర్లు రెహన, రాజేష్తో పాటు జిల్లాకు కేటాయించిన ఏడుగురు శిక్షణ ఎకై ్స జ్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నిరుపేద కుటుంబానికి చేయూత
అవుకు(కొలిమిగుండ్ల): పట్టణంలోని కుమ్మరిదిడ్డి వీధికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎస్ఐ అశోక్ మంగళవారం నిత్యావసర సరుకులు అందజేశారు. దాసరి లక్ష్మీదేవి కుమారుడు, కోడలు ఇద్దరు మృతి చెందారు. మనువరాలు భువనేశ్వరిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. లక్ష్మీదేవి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్ఐ ఆ ఇంటికి చేరుకొని పది కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను స్వయంగా అందించారు. భువనేశ్వరి చదువుకునేందుకు భరోసా కల్పించారు. కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని ఎస్ఐ సూచించారు. 10న జూనియర్ హాకీ పోటీలు కర్నూలు (టౌన్): స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 10వ తేదీన హాకీ కర్నూలు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల విభాగంలో జూనియర్ హాకీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడు దాసరి సుధీర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2007 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఫొటో, ఆధార్కార్డుతో హాజరు కావాలని, వివరాలకు 99665 65317 సెల్ నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ–నామ్లో టెక్నికల్ సమస్యల వెల్లువ కర్నూలు(అగ్రికల్చర్): ఈ–నామ్లో వెర్షన్ మారినప్పుడు ముందుగా ట్రయల్ నిర్వహించి సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించిన తర్వాతే అమలు చేయాలి. అయితే ఎలాంటి ట్రయల్ లేకుండా అమలు చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమై రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ–నామ్లో కొత్తగా 2.0 వెర్షన్ వచ్చింది. ఈ వెర్షన్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుండటం వల్ల రెండు, మూడు రోజులుగా మాన్యువల్లో పాత పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మంగళవారం ఈ–నామ్ 2.0 వెర్షన్ ద్వారా కొనుగోలు చేశారు. ఇందులో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. పలువురు రైతులు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర కోట్ చేసి ఉంటే తక్కువ ధర చూపటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ, కందులు, శనగలు తదితర పంటలకు వ్యాపారులు ఎక్కువ ధర వేశారు. అయితే ఈ– నామ్లో తక్కువ ధర ఉండటంతో రైతుల ఆందోళన అంతా, ఇంతా కాదు. ఈ–నామ్ సాంకేతిక సమస్యలతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వేరుశనగలో కర్నూలు మార్కెట్కు వచ్చిన లాట్కు రేటు వేస్తే అది ఎమ్మిగనూరులో చూపడం గమనార్హం. ట్రయల్ లేకుండా అమలు చేయడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బాల్య వివాహం అడ్డగింత ఆదోని రూరల్: మండలంలోని సుల్తానాపురం గ్రామంలో బుధవారం జరగనున్న బాల్య వివాహాన్ని ఆదోని శక్తి టీం మెంబర్లు రాజేశ్వరి, నాగరాజు, హెడ్కానిస్టేబుల్ నాయక్, సూపర్వైజర్ గొల్ల సావిత్రి, వీఆర్వో కృష్ణ మంగళవారం అడ్డుకున్నారు. ఈ నెల 8వ తేదీన గ్రామంలో నాగేంద్ర అనే యువకుడికి మైనర్ బాలికతో వివాహం జరగనుందని పక్కా సమాచారం రావడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యు లు మాట్లాడుతూ.. బాలిక ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి బతుకుదెరువు కోసం కడప జిల్లా మంగమ్మపేటకు వెళ్లారన్నారు. ఆమె తల్లిదండ్రులు శుక్రవారం సుల్తానాపురం గ్రామంలో వివా హం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, బాలిక వయస్సు 18 ఏళ్లు లోపు ఉండడంతో బాల్య వివాహం చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి జైలు శిక్ష పడుతుందని అవగాహన కల్పించారు. బాలికకు 18 ఏళ్లు పూర్తయ్యే వరకు వివాహం చేయరాదని సూచించారు. వరుడు నాగేంద్ర, అతని తల్లికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చి బాల్యవివాహాన్ని రద్దు చేశారు. -
బస్సెక్కినా ఎండదెబ్బ!
అద్దం లేకుండా దర్శనమిస్తున్న ఆర్టీసీ బస్సు కిటికీసా్థనిక ఆర్టీసీ డిపోలోని ఓ డొక్కు బస్సులో ప్రయాణం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుకు ఒకవైపు కిటికీకి అద్దం లేకుండా రాకపోకలు సాగిస్తోంది. వేసవికాలం కావడంతో బస్సుకు అద్దం లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు దాదాపు మూడు గంటల పాటు ప్రయాణం సాగించాల్సి ఉంది. సీట్లలో కూర్చొన్న ప్రయాణికులకు పగటివేళ నేరుగా ఎండ తాకుతుండటంతో సీట్లలో కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు రద్దీగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో అలాగే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. – కోవెలకుంట్ల -
కర్మాగారాల్లో భద్రత తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని కర్మాగారాల్లో పటిష్టమైన భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కర్మాగారాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూపు మీటింగ్ను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఫ్యాక్టరీల విభాగం డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి జిల్లాలో ఉన్న కర్మగారాల్లో స్థితిగతులను కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో మునిషిపల్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, పీసీబీ ఈఈ పీవీ కిశోర్కుమార్రెడ్డి పాల్గొన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారాలు కర్నూలు(అర్బన్): ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ ద్వారా కళాజాత ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పి.విజయ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కర్నూలు, కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని సచివాలయాల పరిధిలో కళాజాత బృందాలు పాటలు, నాటికలు, నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాయన్నారు. కౌమార గర్భాల విషయంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా రెండవ స్థానంలో ఉండడంతో ప్రతి మండలంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రచార రథం ద్వారా ‘బేటీ బచావో–బేటీ పడావో ’ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తుండటంతో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ కర్నూలు ప్రాజెక్టు సీడీపీఓ అనురాధ, సూపర్వైజర్లు జరీనా, సుజాతచ వరలక్ష్మి, డీసీపీఓ శారద తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు ఇక నుంచి ముఖహాజరు కర్నూలు (అగ్రికల్చర్): ఉపాధి కూలీలకు ఇక నుంచి ముఖహాజరు వేసేందుకు చ్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని నాగులవాగు వంకలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి గ్రామంలో వెంటనే ఉపాధి పనులు ప్రారంభించాలని, ఏదైనా గ్రామంలో పనులు కల్పించలేదని ఫిర్యాదులు అందితే సంబంధిత ఏపీఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి 30 మంది కూలీలకు కచ్చితంగా ఒక మేట్ను ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రతిరోజూ ముఖ హాజరు వేయించాలని ఆదేశించారు. లక్ష్యాలకు దూరంగా ఉన్న నందవరం, పెద్దకడుబూ రు, ఆదోని, ఆలూరు, దేవనకొండ, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు, ఎమ్మిగనూరు మండలాల ఉపాధి సిబ్బంది లక్ష్యాలను రెండు రోజుల్లోపు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు పీడీ మాధవీలత కూడా పాల్గొన్నారు. -
సీఎంకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు
మాది వెల్దుర్తి మండలం నార్లాపురం. మా తండ్రి పుల్లయ్య, వెంకట రంగమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు సంతానం. మాకు వారసత్వంగా 33 ఎకరాల పొలం ఉంది. ఒక్కొక్కరికి 5.5 ఎకరాలు వస్తుంది. అయితే 2009 వరకు మా తల్లి కురుపాటి వెంకట రంగమ్మ పేరిట 9 ఎకరాలు, నా పేరిట 5 ఎకరాల పొలం ఉండేది. 2009లో మా అమ్మ చనిపోవడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నా పేరిట ఉన్న 5 ఎకరాలు, మా అమ్మ పేరిట ఉన్న 9 ఎకరాలను తొలగించి మా నలుగురు అన్నదమ్ముల పేరిట మ్యుటేషన్ చేశారు. దీంతో అప్పటి నుంచి నా భాగం కోసం కలెక్టరేట్, వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం, సీసీఎల్ఏ కమిషనర్కు అమరావతికి వెళ్లి ఫిర్యాదు అందజేశాం. కర్నూలు ఆర్డీఓ కనీసం బాధితులకు ఆర్ఓఆర్ కేసు కింద నోటీసులు కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తిరగని కార్యాలయం లేదు, కలవని అధికారి లేరు. దిక్కుతోచని స్థితిలో ఉన్నా. – కురుపాటి పుల్లయ్య -
ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలి
కర్నూలు: ఆరోగ్య సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్లో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కబర్ధితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉద్యోగ రీత్యా అనేక ఒత్తిళ్లకు లోనవుతారని, వారు ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మూసాహిద్ చౌదరి, డాక్టర్ సాత్వికతో పాటు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సరయు రెడ్డి, శశికిరణ్, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ లక్ష్మి, ఏరియా జనరల్ మేనేజర్ ఖాదర్ బాషా, క్యాంప్ ఇన్చార్జి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. షుగర్, బీపీ, డెంటల్ పరీక్షలు, గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఎకో టెస్టులతో పాటు సంపూర్ణ రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యపరంగా అందించాల్సిన సేవలను సూచించారు. -
మహిళలను కించపర్చడానికి సిగ్గులేదా రాధాకృష్ణా
● మాట్లాడుతున్న ఎస్వీ మోహన్రెడ్డికర్నూలు(టౌన్): రాధాకృష్ణ ఒక పేపర్కు అధినేతగా కాకుండా చంద్రబాబుకు బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడని, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త పలుకు పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల భార్యలను కించపరిచే విధంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. జర్నలిస్టు ముసుగులో సమాజానికి మీ వల్ల ఏం ఉపయోగమో తేలీదు కానీ, చంద్రబాబు ఇంట్లో పనిచేసే బంట్రో తు కూడా ఇంతలా దిగజారి వ్యవహరించడన్నారు. మహిళల పట్ల సంస్కార హీనంగా మాట్లాడటం రాధాకృష్ణ నీచబుద్ధిని చాటుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టరు అంటేనే మహిళ లు తన్నే పరిస్థితులు వస్తాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు అన్ని వర్గాల ప్రజలు, మేధావుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ వైద్య కళాశాలల పరిస్థితే అమరావతికి వస్తుందనే అక్కసుతోనే జగనన్నపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచితంగా మాట్లాడారన్నారు. మరో 150 సంవత్సరాలు గడిచినా అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎప్పుడు కూడా అమరావతి రాజధానికి వ్యతి రేకం కాదని, ఆ పేరుతో రూ.వేల కోట్ల దోపీడీని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశాడన్నారు. ఇప్పటికైనా రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. -
పకడ్బందీగా ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష
కర్నూలు: పోలీసు శాఖ సర్వీసులోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో మంగళవారం సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు 72 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేర స్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనపరిచిన వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తారు. డీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ పీరా, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ డీఎస్పీలు శ్రీనివాసులు, బాలస్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్తో సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కడుపు మంటతోనే రాధాకృష్ణ చెత్త పలుకులు
● చంద్రబాబు కోసం మహిళలనుకించపరిచిన వ్యక్తిని క్షమించం ● మావిగన్కు వస్తున్న స్పందన జీర్ణించుకోలేకపచ్చమీడియా కారుకూతలు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: మావిగన్కు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కడుపుమంటతోనే ఏబీఎన్ రాధాకృష్ణ చెత్త పలుకులు పలికారని ఆలూరు ఎమ్మె ల్యే విరూపాక్షి విమర్శించారు. సభ్యసమాజం తలదించేకునేలా ఏబీఎన్లో రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులపై రాసిన రాతలను ఆయన తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రమైన చిప్పగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం చంద్రబాబును మోసేందుకు, ఆయన మొప్పుకోసం జర్నలిజం ముసుగులో ఏబీఎన్ ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంటే ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు తన పచ్చమీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబును మోసేందుకు మహిళలను కించపరిచిన వ్యక్తిని క్షమించమని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులోని ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల పై పోలీసుల దాడికి యత్నించడం వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వైఎస్సార్సీపీ నేతలపై అసభ్యకర రాతలు రాసిన రాధాకృష్ణను క్షమించేది లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో భూ కబ్జాలకు పాల్పడతూ.. వేల కోట్లు దోచుకుంటున్నారని చెప్పారు. ప్రజలు, అమరావతి రైతుల దృష్టిని మళ్లించేందుకే తన అనుకూల మీడియాలో పిచ్చిరాతలు రాయిస్తున్నారన్నారు. -
జగన్మాతా.. నమోస్తుతే!
శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుంభో త్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, కుంభహారతి, సాత్వికబలి, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్విక బలిని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం అమ్మవారి కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించారు. అమ్మవారికి ఏకాంత పూజల అనంతరం సాత్వికబలికి సిద్ధం చేసిన ఐదు వేలకుపైగా కొబ్బరికాయలు, 20 వేల గుమ్మడికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు పూజలు జరిపించారు. అనంతరం వాటిని అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. తొలి విడత సాత్వికబలి ముగిసిన తర్వాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు చేసి సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చివరగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహా నివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంభహారతి.. సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అన ంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయ లు,కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. కుంభోత్సవ పూజ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతు లు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవో, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శుభగాత్రి..గిరిజాపుత్రి!
మహాశక్తి పీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి రూపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. అయితే, ఎప్పుడూ ఆమె నిజరూపంలో కనిపించరు. ప్రత్యేక అలంకరణలో మాత్రమే భక్తులకు అనుగ్రహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు అది కూడా కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారు నిజరూపదర్శనంలో అగుపిస్తారు. నేడు వార్షిక కుంభోత్సవం సందర్భంగా భక్తులకు ఆ దర్శన భాగ్యం లభించనుంది. ఒకప్పుడు చెంచుల ఉత్సవంగా ఉన్న ఈ కుంభోత్సవం నేడు సకల జనులదిగా మారడం విశేషం. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ఆలయపు జానపద ఆచారాల్లో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. గతంలో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమ్మవారి ఆలయం మూసివేసేవారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత గుడి తెరచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమలతో పూజించేవారు. ముందుగానే అమ్మవారి గర్భాలయం తెరచినప్పటికీ ముఖమండపంలోని శక్తియంత్రం వెనుకాల వండిన అన్నం పెద్ద రాశిగా పోసి ఒక దున్నపోతును తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి దాని తల నరికేవారు. తర్వాత ఆ తలను అన్నపురాసిపై దేవి విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంచేవారు. అలాగే నాలుగు మేకపోతులను బలిఇచ్చి అన్నపు రాశికి నాలువైపులా వాటి తలలను ఉంచి అవి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఉంచేవారు. కాలక్రమేణ చెంచుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికితోడు జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలు, జంతుప్రేమికుల విన్నపం మేరకు దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయశాఖ చట్టం చేసింది. దీంతో జంతుబలి నుంచి సాత్వికబలి దిశగా కుంభోత్సవం మారింది. ప్రస్తుతం సాత్వికబలిలో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు, తమ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కుంభోత్సవం రోజు పూజలు ఇలా కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యధావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జపపారాయణలు చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకం జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. నిజరూప దర్శనంఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరింపబడి ఉంటుంది. అయితే, సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు, 9 రకాల పిండివంటలతో మహానివేదన గావించాక ఈ ఉత్సవం ముగుస్తుంది. కుంభోత్సవం రోజు సాయంత్రం ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు చీరను ధరించి సీ్త్ర వేషంలో అమ్మవారికి హారతి తీసుకువస్తాడు. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులను నిర్వహించే ఉద్యోగి సీ్త్ర వేషాన్ని ధరిస్తాడు. స్వామిఅమ్మవార్ల సహస్రదీపాలంకరణ సేవా మండపం నుంచి భాజాభజంత్రీలతో ఈ హారతి తీసుకుని రావడం జరుగుతుంది. దీనికే కుంభహారతి అని పేరు. ఈ హారతి తెచ్చేటప్పుడు సీ్త్ర వేషధారి ముఖం కనపడకుండా చీరకొంగుతో ముసుగువేస్తారు. కుంభహారతి గర్భాలయం వద్దకు చేరుకున్న వెంటనే అర్చకులు గర్భాలయ ద్వారాలు తెరచి ఆ వేషధారి అమ్మవారికి హారతిని సమర్పించి అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారిని మొదటగా దర్శించుకునేది ఈ సీ్త్ర వేషధారే. శ్రీశైల భ్రమరాంబాదేవికి నేడు వార్షిక కుంభోత్సవం దక్షిణాచార సంప్రదాయంతో జంతు బలులు నిషేధం నాటి చెంచుల ఉత్సవం.. నేడు సకల జనుల ఉత్సవం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో అమ్మవారికి సాత్వికబలి అమ్మవారి నిజరూపదర్శనంతో పులకించనున్న భక్తజనం -
ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. -
ఉపాధి కల్పనపైనే ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్ ● తప్పిన ప్రమాదం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. 15 క్వింటాళ్ల పత్తి దగ్ధం ఆదోని అర్బన్: అమ్మకానికి తెచ్చిన 15 క్వింటాళ్ల పత్తి సోమవారం ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో కాలిపోయింది. విద్యుత్ తీగ నుంచి వచ్చిన మంటలు పత్తికి అంటుకుని ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పి వేశారు. పత్తి కాలిపోవడంతో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని హానువాల్ గ్రామానికి చెందిన బారికి రాజు అనే రైతు తెలిపారు. తగలబడిన పత్తి ఎన్ని క్వింటాళ్లు ఉందో తెలుసుకుని ఇన్సూరెన్స్ వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని యార్డు సెక్రటరీ గోవిందు తెలిపారు. ఘటన స్థలాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరిశీలించారు. లారీ దగ్ధం ఆదోని రైల్వేస్టేషన్ నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్న లారీ సోమవారం దగ్ధమయ్యింది. ఆదోని పట్టణ శివారులోని బైపాస్లోని నూతన బ్రిడ్జిపై ఈ దృశ్నాన్ని సూచి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.లారీలో బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని యజమాని షాషావలి తెలిపారు. ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు శిక్ష ● హాల్లో కూర్చోబెట్టిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మంత్రాలయం రూరల్: ఫీజులు చెల్లించలేదని పరీక్ష రాయకుండా విద్యార్థులను హాల్లో కూర్చోబెట్టారు. మంత్రాలయంలోని ఓ ప్రవేట్ స్కూల్ (పరిమళ విద్యా నికేతన్)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎంఈఓ–2 రాఘన్న.. పాఠశాలను తనీఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యహక్కు చట్ట ప్రకారం ముందస్తు ఫీజు ఎలా వసూలు చేస్తారన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. ఏడుస్తూ ఎనిమిదో వతరగతి తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఫీజు చెల్లించారు. -
1,178 ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
● 188 కేసులు నమోదు కర్నూలు: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీటీసీ శాంతకుమారి ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1,178 కాంట్రాక్టు క్యారేజీ బస్సులను తనిఖీ చేసి 188 కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆరు బస్సులను సీజ్ చేశారు. రూ.35,12,130 నగదు జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రైవ్ను కొనసాగిస్తామని డీటీసీ శాంతకుమారి తెలిపారు. -
తర్తూరు జాతరకు వెళ్లొస్తుండగా..
● రుద్రవరం వద్ద ఆటో బోల్తా ● ఒకరు దుర్మరణం..పలువురికి గాయాలు పాములపాడు: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో జరిగే తిరునాలకు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఆత్మకూరు మండలం నాగలూటి గూడెం చెందిన ఆరుగురు ఆటోలో తర్తూరు తిరునాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆటోను డ్రైవర్ పులిచెర్ల బయ్యన్న వేగంగా నడుపుతూ రుద్రవరం వద్ద ఎన్హెచ్ 340సీ ఫ్లైఓవర్ వంతెనపై డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో అందులోని వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైదశాలకు తరలించగా నిమ్మల బయమ్మ అనే మహిళ మృతి చెందారు. గుర్రప్ప, అంకమ్మ అనే మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. -
మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
కర్నూలు: కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. గత నెల 17వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవారికి చెందిన వెండి వస్తువులు అపహరించారు. దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ, నరసింహశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు సునీల్ కుమార్, ధనుంజయ, అఖిల్లతో కలసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి 20 రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా పక్కా ఆధారాలతో మహారాష్ట్ర ముఠానే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర పూణెకు చెందిన అర్జున్ పూనం కుంబ్హర్, మహారాష్ట్రలోని చించ్వడ్కు చెందిన అక్షయ్ జైసింగ్ ఠాకూర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తమ సహచరులు జర్నల్, అమిత్, బజరంగిలతో కలసి ఈ నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. గూగుల్ మ్యాప్లో గుర్తించి దోపిడీ... నిందితులు ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి మొత్తం ఐదుగురు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించారు. అలాగే టోల్గేట్లలోని సీసీ ఫుటేజీ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మిగిలిన మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేసి మిగిలిన వెండి ఆభరణాలు కూడా రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఆలయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా కాల్వబుగ్గ ఆలయ పరిసరాలు గుర్తించి చోరీ సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన పోలీసులు నాలుగు కిలోల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
రాలిపోయిన ఆశలు
2024లో ఎకరాకు సగటున 6–8 టన్నుల దిగుబడి వచ్చింది. 2025లో 2–3 టన్నుల వరకే దిగుబడి పరిమితమైంది. ఈ సారి మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్ల తామర విజృంభించింది. దీనికి తోడు తేనెమంచు పురుగులు చుట్టుముట్టి తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే మొత్తం రాలిపోయింది. మామిడిలో కనిపించని పిందె, కాయలుకర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల వచ్చినా మార్కెట్లో మామిడి కనిపించని పరిస్థితి. మామూలుగా మార్చి రెండో వారం నుంచే మధుర ఫలం నోరూరిస్తుంది. మే నెల వరకు మామిడి మార్కెట్ను తనవైపు తిప్పుకుంటుంది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి గల్లంతవడం రైతులతో పాటు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే బేనిసా మామిడి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి. దీనినే బంగినపల్లి మామడిగా వ్యవహరిస్తారు. మొదటిసారి ఈ బేనిసా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం ఎకరాకు సగటున 4 టన్నులు వస్తుంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 53వేలకు పైగా టన్నుల దిగుబడి రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక తోటల్లో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మామిడి కూడా లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా పూత వచ్చింది. ఈ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 95 శాతంపైగా రాలిపోయింది. దాదాపు 10వేల ఎకరాల్లో అస్సలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో ఎకరాకు అర్ధ టన్ను వరకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లబోదిబోమంటున్న వ్యాపారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్, కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెళగల్, హాలహర్వి, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాల్లో తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్లతామర, తేనెమంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగుమందులు పిచికారీ చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండాపోయింది. కాయలు లేక వెలవెలబోతున్న చెట్లను చూసి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామిడి పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్లతామర. నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏప్రిల్ నెలలోనూ కనిపించని మధుర ఫలం ముంచిన నల్లతామర, తేనేమంచు పురుగులు దాదాపు 10 వేల ఎకరాల్లో కనిపించని కాయలు పంట లేక టన్ను ధర రూ.లక్షకు పైనే.. లబోదిబోమంటున్న వ్యాపారులు -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● రాష్ట్రంలో పోలీసులు పేరుకు మాత్రమే ● శాంతిభద్రతలను గాలికి వదిలేశారు ● ప్రతిపక్షనేతను తిట్టేందుకే అనితకు మంత్రి పదవి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం బొమ్మలసత్రం: ‘అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నార’ని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణి హాజరుకాగా ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూర్య నారాయణరెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాల నుంచి ఆవిర్భవించిందన్నారు. 2024 ఎన్నికల్లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడి 22 నెలలు గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను గర్భిణి చేసి 5 సార్లు కడుపు తీయించటం దారుణమన్నారు. జరిగిన అన్యాయంపై బాధితురాలు ప్రశ్నిస్తే కర్రతో నడిరోడ్డుపై దాడి చేశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించటంతో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత ప్రతిపక్షనేతను తిట్టేందుకే సరిపోయారని నియోజకవర్గం దాటి గంజాయి తరలివెళ్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. పీఏని అడ్డుగా పెట్టుకొని ఆమె వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. పవన్వి అన్ని ప్రగల్భాలే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలికి వదిలేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి సరిపోయారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే తాటా తీస్తామని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో మత్తుపదార్థాల విక్రయాలు జరగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవించి పట్టుబడితే అతనిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తిరిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి సర్కారు నీరుగార్చిందన్నారు. ఈ బిల్లును టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసా, మాజీ డైరెక్టర్ సునీతా అమృతరాజ్, జెడ్పీటీసీలు దివ్య, ఖలీమున్నీసా, ఎంపీపీలు వెంకటేశ్వరమ్మ, హుస్సేన్బీ, శారదమ్మ, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఏ‘మనీ’ చెప్పాలి?
నగదు లేక ఖాళీగా ఉన్న ఏటీఎం కేంద్రం కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచి ఉంచినా డబ్బు అంతంతమాత్రమే ఉండటంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నగదు కొరతతో కర్నూలులోని కలెక్టరేట్, గాయత్రీఎస్టేట్, బుధవారం పేట, పెద్దాసుపత్రి, యూకాన్, సెంట్రల్ ప్లాజాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ఈ దుస్థితి ఏర్పడింది. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
కర్నూలు అభివృద్ధికి కార్పొరేటర్ల కృషి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): కర్నూలు నగర అభివృద్ధికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఎంతో కృషి చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నగరపాలకసంస్థకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్లు ఖర్చు చేసి కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. నగరంలోని 52 వార్డుల్లో గడపగడపకు వెళ్లి 2021 నుంచి 2026 వరకు ప్రజల సమస్యలు పరిష్కారించామన్నారు. రూ. 28 కోట్లతో నూతన నగరపాలక కార్యాలయం, రూ.28 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు పైపులైన్ పనులు చేశారన్నారు. రాష్ట్రంలోనే అద్భుతంగా మున్సిపల్ పార్కులు అభివృద్ధి చేసి క్రీడా వసతులు కల్పించినట్లు చెప్పారు. అలాగే 2023లో స్వచ్ఛతలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కర్నూలు కార్పొరేషన్ నిలవడం వెనుక ప్రతి కార్పొరేటర్ కృషి ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న వారందరికీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తారని జగనన్న హయంలో కర్నూలు మహిళా కార్పొరేటర్లు నిరూపించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. ఐదేళ్ల పాటు నిజాయితీగా పనిచేశారని, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు షరీఫ్, నరసింహులు యాదవ్, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
జీడీపీలో మట్టి తోడేళ్లు!
● టీడీపీ నేతల అండ ● యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపుగోనెగండ్ల: టీడీపీ నేతల అండతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం జేసీబీలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల సమీపంలోని తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 20 రోజుల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిని పలు గ్రామాల్లోని ఇళ్లు, వెంచర్లు నిర్మించే వారికి అమ్ముతున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1300 దాకా వసూలు చేస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. జీడీపీ ఎగువ ప్రాంతంలో మట్టిని తవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే టీడీపీ నేత అండ ఉండటంతో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి మాయం అవుతోందని, గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. గుంతలమయం అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నుల్లోనే ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులే అక్రమ ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్కు రూ.200 ఇవ్వాలని ఆ నాయకులు వసూలు చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వడంతో జీడీపీ ఎగువ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతాలను రైతులు తమ పశువులను మేపించేందుకు వెళ్తుంటారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్తుంటారు. గతంలో గుంతలు పడిన ప్రదేశంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇప్పుడు కూడా మట్టి మాఫియా కోసం జేసీబీతో గుంతలు గుంతలు తవ్వడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలకు ఉన్నతాధికారుల నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారం రోజులుగా మా సిబ్బందిని రాత్రి 12 గంటలకు వరకు కాపాలగా పెట్టాం. అయినా తప్పించుకొని తెల్లవారు జామున 3 గంటల సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ కళ్లుగప్పి తరలింపు రాత్రిపూట అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండడంతో ఉదయం చూడగానే పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ప్రాజెక్టు సిబ్బంది నలుగురు కాపలాగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి -
మరణంలోనూ వీడని బంధం
● మూడు గంటల వ్యవధిలోనే గూళ్యంలో దంపతుల మృతి ● మృతుల కుటుంబానికి ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం. ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి సోమవారం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, యమునాసాబ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి హర్ధగేరి శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి యల్లప్ప, పార్టీ నాయకులు రామిరెడ్డి, వీరేషప్ప, మండల కార్యదర్శి గోపాల్కృష్ణ, స్థానిక నాయకులు బసవరాజు, శేఖన్న, లింగప్ప, సుంకన్న, కుమార్స్వామి, కార్యకర్తలు ఉన్నారు. -
విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని ఈఈలు, డీఈఈ, ఏడీఈలను విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిటిషనర్లకు ఇచ్చే ఎండార్స్మెంట్ను స్పష్టంగా ఇవ్వడం లేదని, అందువల్ల సంతృప్తి శాతం తగ్గుతోందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఒక సర్వేయర్ ఐదుగురు పిటిషనర్లకు సంబంధించి సర్వే చేసినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వనందున అతని ఇంక్రిమెంట్లు కట్ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ఖమర్, డీఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులకు కలెక్టర్ ఫోన్ 1100 కాల్ సెంటర్ ద్వారా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ ఎ.సిరి స్వయంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి నందవరం మండలం షేక్రియాజ్బీ, ఎమ్మిగనూరు మండలం తార్నాద్, గోనెగండ్ల మండలం బోయ బుడ్డన్న, కల్లూరు మండలం లక్ష్మికాంతరెడ్డితో వారు పెట్టుకున్న అర్జీల వివరాలు తెలుసుకున్నారు. ఆయా అర్జీలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సంబంధిత తహసీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బేతంచెర్ల: స్థానిక చౌడేశ్వరీ దేవి తిరుణాల సందర్భంగా శేషారెడ్డి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం పాలపండ్ల విభాగం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, ఆలయ కమిటీ సభ్యులు గౌరి హుస్సేన్రెడ్డి, మల్లు సుబ్బారెడ్డి పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడు జతల వృషభాలు పాల్గొనగా.. పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలు వీరే.. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జూపల్లె ప్రభాకర్రెడ్డి ఎడ్లు నిలిచాయి. తృతీయ స్థానంలో డోన్ మండలం సీసంగంతల మదన్మోహన్రెడ్డి, నాలుగో స్థానంలో దువ్వూరు వీరన్న యాదవ్, డోన్ కృష్ణమోహన్ల ఎడ్లు సంయుక్తంగా నిలిచాయి. ఐదో స్థానంలో బేతంచెర్లకు చెందిన సయ్యద్ నూర్, ఆరో స్థానంలో ఉంగరానిగుండ్ల వెంకటేశ్వర్లు ఎడ్లు నిలిచాయి. విజేతలకు దాతల సహకారంతో రూ. 50 వేల నుంచి రూ. 5 వేల వరకు నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రఘురామిరెడ్డి, శేఖర్రెడ్డి, మద్దయ్య, రామస్వామి, అన్నారావు, నాగభూషణంరెడ్డి పాల్గొన్నారు. -
నగదు కొరత!
● మూతపడుతున్న ఏటీఎంలుకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు మూత పడుతున్నాయి. ఐదారేళ్లుగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ తాగినా, పల్లీలు కొన్నా.... ఫోన్పేను వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో 90 శాతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఆర్బీఐ నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి నగదు రావడం లేదు. గతంలో వారానికి కనీసం ఒకసారి నగదు వచ్చేది. ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ.500 నోట్లు వచ్చేవి. ఆర్బీఐ నుంచి జిల్లాల్లోని కరెన్సీ చెస్ట్లకు నగదు సరఫరా దాదాపు నెల రోజులుగా లేకుండా పోయింది. గతంలో పెట్రోలు బంకులు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగేది. నేడు ఇందులో కూడా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో నగదు సర్క్యులేషన్ తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎంతమేర ఉన్నప్పటికీ చేతిలో అవసరాలకు కొంత నగదు ఉంచుకోవడం సర్వసాధారణం. చేతిలో రూ.1000, రూ.2000 ఉంచుకునేందుకు కూడా నగదు లభించడం లేదు. నగదు లేకపోవడంతో జిల్లాలోని ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఏటీఎంలో రూ.500 నోట్లు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ నోట్లు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఏటీఎంలు మూత పడుతున్నాయి. బ్యాంకులు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చారు. నగదు లభ్యతను బట్టి బ్యాంకులు ఏటీఎంల్లో పెడుతున్నాయి. పలు బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు పడిపోవడంతో ఏటీఎంలను మూసేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 153 ఉన్నాయి. ఇందులో బ్రాంచీల ఆధ్వర్యంలో 63, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 90 పనిచేస్తున్నాయి. వీటిలో 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో అత్యధిక ఏటీఎంలు పనిచేయడం లేదు. కలెక్టరేట్లోని ఎస్టీఐ ట్రెజరీ బ్యాంకు ఏటీఎం కొద్ది రోజులుగా మూత పడింది. దీంతో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు ప్రధానంగా రూ.500 నోట్లు సరఫరా పెరిగితేనే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంది. -
వైఎస్సార్సీపీలో ప్రత్యేక గుర్తింపు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్సీపీలో నాయకులు, కార్యర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, వారికి కొన్ని పదవులు ఇచ్చారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్రెడ్డి తెలిపారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే పదవులు పొంది వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సంబంధిత నాయకుల మొబైల్ నంబర్లకు లింకులు వెళ్లాయని, వారు దానిని క్లిక్ చేస్తే వివరాలు వస్తాయన్నారు. అందులో పేరు, ఫొటో తదితర వివరాలను సరిచూసుకొని ఆమోదం తెలిపితే కార్డులను ప్రింట్కు పంపుతామన్నారు. ఫోన్ నంబర్ తప్పుగా ఉంటే లింక్ రాదని, అ లాంటి వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించి సరైన మొబైల్ నంబర్ను ఎంటర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
హొళగుందలో దాహం కేకలు
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) నీటిని కడ్లమాగి వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిల్వ ఉంచినా హొళగుంద గ్రామంలోని ఫిల్టర్బెడ్ సరఫరా కావడం లేదు. దీంతో మంచినీటి ఎద్దడి తలెత్తింది. పంచాయతీ వారు ట్యాంకర్ ఏర్పాటు చేసినా నీరు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా మంచినీటి కోసం పనులకు, పొలాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఫిల్టర్బెడ్కు సక్రమంగా నీరు రావడం లేదని పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్ చెప్పారు. -
ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు
నంద్యాల(అర్బన్): కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఆదివారం జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఈత పోటీల్లో నంద్యాల వాసి కాశీపురం ప్రభాకర్రెడ్డి నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. జగ్గయ్య పేట మున్సిపాలిటీ సౌజన్యంతో డ్రిమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 50 ప్లస్ మాస్టర్స్ కేటగిరిలో 25 మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో ప్రభాకర్రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండు రాష్ట్రాల్లోని 29 జిల్లాల నుంచి 300 మందికి పైగా స్విమ్మర్లు పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన నాలుగు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ లేకపోయినా కేసీ కెనాల్లో ప్రాక్టీస్ చేసి పోటీల్లో సత్తా చాటారు. వివాదాస్పద స్థలం పరిశీలన ఉయ్యాలవాడ: పెద్దయమ్మనూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణకు కారణమైన వివాదాస్పద స్థలాన్ని ఆదివారం అధికారులు పరిశీలించారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం సంబంధించి జెడ్పీటీసీ సభ్యురాలు పుణ్య లక్ష్మీదేవి, గ్రామ మాజీ సర్పంచ్ కసాని నారాయణమ్మ సొంత స్థలంలో వేయడంతో టీడీపీ వర్గీయులు మహిళా ప్రజా ప్రతినిధులపై శనివారం దాడి చేసిన విషయం విధితమే. ఈ మేరకు తహసీల్దార్ ప్రసాద్బాబు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్బాబు, స్థానిక ఎస్ఐ రామిరెడ్డి పెద్దయమ్మనూరు గ్రామానికి చేరుకుని స్థలం వివాదానికి సంబంధించిన డాక్మెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నాయకులతో స్థలం వివాదానికి సంబందించి ఆన్లైన్లో పరిశీలన చేసి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అంత వరకు ఇరువర్గాల వారు ఎలాంటి ఘర్షణలకు పాల్పడరాదని సూచించారు.


