Kurnool District News
-
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీన కుట్ర?
ఎమ్మిగనూరుటౌన్: ఎన్నికల ముందు చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కార్మికులను ఆదుకుంటానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా అందే రూ. 24 వేల సాయాన్ని కూడా అటకెక్కించాడు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆర్థికంగా కుదేలైంది. అలాంటి ఈ సంస్థలోకి ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ సొసైటీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టేందుకే అధికారపార్టీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని స్థానిక చేనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైడబ్ల్యూసీఎస్కు దేశంలోనే గుర్తింపు ఎమ్మిగనూరులో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 సంవత్సరంలోనే వైడబ్ల్యూసీఎస్ను స్థాపించారు. అప్పట్లో 60కిపైగా చేనేత వస్త్ర దుకాణాలను నడిపి 600 మందికి పైగా సభ్యులతో సొసైటీ నడిపారు. వైడబ్ల్యూసీఎస్ బ్రాండ్తోనే దుప్పట్లు, దోమతెరలు, టవళ్లు, చీరలు తదితర జనతా వస్త్రాలను ఉత్పత్తి చేయిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చేనేత వస్త్ర దుకాణాలు నెలకొల్పి సొసైటీని లాభాల బాటలో నడిపించారు. ఇలా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు సొసైటీని సందర్శించారు. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న వైడబ్లూసీఎస్కు ఎమ్మిగనూరులో కోట్లాది రూపాయల విలువైన దుకాణాలు, భవనాలు, భూములున్నాయి. అలాంటి సొసైటీని నష్టాల ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదన చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరిలోనే ప్రతిపాదనలు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎమ్మిగనూరు పరిధిలోని 12 డిపోలు, అవుట్లెట్లు తెలంగాణలోని 1, కర్ణాటకలోని మూడు అవుట్లెట్లను ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు గత జనవరి నెలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఓ అధికారి హ్యాండ్లూమ్స్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చేనేత పరిశ్రమ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే విలీన ప్రతిపాదనలు అని అధికారులు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే సొసైటీలోని మెజారిటీ సభ్యులతో విలీన అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు చేనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ విలీన ఆమోదాన్ని వ్యతిరేకించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తులను కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ 31న సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన విలీనాన్ని వ్యతిరేకించాలని వైడబ్ల్యూసీఎస్ సభ్యులు నిర్ణయం -
డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్
వెల్దుర్తి: బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాళ్లగడ్డ గ్రామం కుర్ర రమేశ్. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం హైవే 44పై మండల పరిధిలోని సూదేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కుర్ర రమేశ్ను వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అతని వద్ద అనుమానాస్పద మత్తుపదార్థాలు లభించడంతో ఎస్ఐ బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, వ్యవసాయశాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సమన్వయంతో పంచనామా చేశారు. 20గ్రాముల గంజాయి, ఎమ్డీఎమ్ఏ(నిషేధిక మత్తు పదార్థం–పార్టీ డ్రగ్) మత్తు పదార్థాలుగా గుర్తించారు. నిందితుడు కుర్ర రమేశ్ను విచారించగా బెంగళూరులోని వంశీ అను వ్యక్తి చెప్పిన మేరకు హైదరాబాద్లోని పార్టీ కోసం డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వెలుగోడులో దారుణం ● పదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. సీపీ నగర్ ప్రాంతంలో కార్పెంటర్ పని చేసే వృద్ధుడు చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయమాట లు చెప్పి సమీపానికి రప్పించుకున్నాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం ఎమ్మిగనూరురూరల్: భర్త, మామ వేధింపులు తాళలేక భారతి(30) అనే మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన భారతి(30)తో తొమ్మిది ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గ్రామం సమీపంలోని పొలంలో గుడిసెవేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప భారతిని వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఒంటిపై పెట్రోల్పోసుకొని భారతి నిప్పంటించుకున్నారు. మంటలతో బయటకు కేకలు వేస్తు రావటంతో అక్కడ ఉన్న వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. తమ కుమార్తెను భర్త, మామలు కాల్చిచంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: గుంతకల్–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాములు వెల్లడించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదానికి గురైడా అన్నది తెలియరాలేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే గుంతకల్ రైల్వే పోలీసులకు లేదా సెల్ నంబర్: 9247575606ను సంప్రదించాలన్నారు. జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 15 ఏళ్ల బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. చదువులో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. మొబైల్ ఫోన్లో పిల్లల్లో దుష్ప్రభావం చూపుతుందని, పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చూడాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కళల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి దోహదమన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జనార్దన్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ వెంకటరావు, ఆర్బిటర్ సుజాత, 150 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
అమరావతి పేరిట హైడ్రామా
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. శేషవాహనంపై శ్రీరంగనాఽథుడు జూపాడుబంగ్లా: తర్తూరు వెలసిన శ్రీలక్ష్మిరంగనాథస్వామి శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పట్టువస్త్రాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకెళ్లి శేషవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ రథంపై స్వామివారిని ఉంచారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి స్వామివారికి సాష్టాంగనమస్కారాలు చేసుకొన్న అనంతరం భక్తులు జయజయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి గ్రామోత్సవ రథాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి శేషవాహనోత్సవానికి ప్రత్యేక ఉంది. ప్రజలు, రైతులు పొలంగట్లవెంట తిరిగేటప్పుడు నాగశేషుని నుంచి తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా శేషవాహనం రోజున స్వామివారికి మల్లెపూలలను సమర్పించి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి. నేడు హనుమద్వాహనసేవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం స్వామి వారికి హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వరరెడ్డి, చైర్మన్ నారాయణరెడ్డి, ఈఓ సాయికుమార్ తెలిపారు. -
ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మోసాలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: ప్రముఖ కళాశాలలు, విశ్వ విద్యాలయాల పేరుతో ఫోన్కాల్స్, వాట్సప్ మెసేజ్లు, ఫేక్ వెబ్సైట్ల ద్వారా సంప్రదిస్తూ మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్, బీటెక్ పేరుతో అడ్మిషన్ గ్యారెంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను డబ్బులు అడిగి సైబర్ గాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయని, ఏ కళాశాల సీటు కోసమైనా అధికారిక సీటు వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఎవరైనా అడ్మిషన్ గ్యారెంటీ పేరుతో మోసపోయి ఉంటే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
వివాహ పరిచయ వేదికలతో ఉపయోగం
● కురువ సంఘం నేతలుకర్నూలు(అర్బన్): వివాహ పరిచయ వేదికలతో ఉపయోగం ఉందని కల్లూరు తహసీల్దార్ కే ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ మంజుల అన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్లో జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక, హిందూపురం, అనంతపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కురువ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల ను బాగా చదివించి మంచి ప్రయోజకుల ను చేయాలన్నారు. గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షులు కేఏ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మందికి వివాహాలు జరిగాయన్నారు. సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 2003 నుంచి కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు 2500 మందికి వివాహాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం కార్యదర్శి అనితాలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు, కోశాధికారి కేసీ నాగన్న, పరిచయ వేదిక కన్వీనర్ ఎల్లయ్య, కల్లూరు సహకార సొసైటీ అధ్యక్షులు పర్ల శేఖర్, నాయకులు కేటీ ఉరుకుందు, కత్తి శంకర్, పిల్లిగుండ్ల నాగన్న, అల్లబాబు, నాగరాజు, బూదురు లక్ష్మన్న, తవుడు శ్రీనివాసులు, బీ రామకృష్ణ, కే వెంకటేశ్వర్లు, తిరుపాలు, దివాకర్, గోపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఆప్కోలో విలీనం చేయొద్దు
ఎమ్మిగనూరుటౌన్: అధికారపార్టీ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుట్టారంగయ్య, డాక్టర్ కేఎస్ రఘు,పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆశయాలకు తూట్లు పొడిచి సొసైటీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని కోరారు. చేనేతలపై ప్రేమ ఉంటే వైడబ్ల్యూసీఎస్ను అభివృద్ధి చేయా లే కాని నష్టాల ఊబిలో ఉన్న ఆప్కోలో విలీనం చేయరాదన్నారు. అధికారపార్టీ నాయకులు సొసైటీకి సంబంధించిన విలువైన అస్తులను కొల్లగొట్టేందుకే విలీన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ను కాపాడుకునేందుకు తమ పార్టీ అవసరమైతే పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు రాము, నాగేంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కర్నూలు(అర్బన్): మైనార్టీ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహా పర్వీన్ హెచ్చరించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ మైనార్టీ బాయ్స్ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్లో వసతి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా అవసరమైన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, ఆకు కూరలు వాడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: బ్యాంకుల దగ్గర చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వి. శ్రీనివాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ప్రమీల అనే మహిళ కెనరా బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకొని స్కూటీలో పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆమె కళ్లుగప్పి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. తర్వాత చోరీ విషయం తెలుసుకున్న బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ముర్రవాడ భార్గవి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్లను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి దొంగలు కర్ణాటక రాష్ట్రం భద్రావతి ప్రాంతానికి చెందిన శంకర్ బోవి, కార్తీ బోవిగా గుర్తించారు. ఆదివారం మంత్రాలయం రోడ్డులోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గర వారిని అదుపులోకి తీసుకొని 13 గ్రాముల బంగారు చైన్, 17 గ్రాముల బంగారు నెక్లెస్, చోరీలకు ఉపయోగించే బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. -
రైతులను మభ్యపెట్టడానికే అసెంబ్లీలో రాజధాని తీర్మానం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: అమరావతి ప్రాంత రైతులను రాజధాని పేరుతో మరోసారి మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రాబాబు ఆసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్మాణం పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాటాలు చేసిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం లాభం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్లాట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చాలా మంది రైతులకు తెలియదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదన్నారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే తిర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు పాల్గొన్నారు. -
ఆప్కోలో విలీనం చేస్తే పోరాటం
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే పోరాటానికి దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో లాభాల్లో ఉన్న వీవర్స్ సొసైటీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్లను కలసి శనివారం ఆమె వినతిపత్రాన్ని ఇచ్చారు. ఎమ్మిగనూరు అంటే చేనేతలు..చేనేతలు అంటే ఎమ్మిగనూరు అనేలా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీవర్స్ సొసైటీనే కారణమన్నారు. మాచాని సోమప్ప 1938లో ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి సొంత ఆస్తులను ఇచ్చారన్నారు. దీని ద్వారా సుమారు 200 మంది మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీకి 16 అవుట్లేట్లు ఉన్నాయని, విలీనం చేస్తే వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీన విలీనానికి సంబంధించిన సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాదు, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడ చేనేత మళ్లి పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్ వీల్ పనిచేయకపోవడంతో డ్రై వర్ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం కండిషన్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. యాగంటి సందర్శన బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమా మహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎస్పీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ అందజేశారు. -
కుట్టు శిక్షణ!
కర్నూలు(అర్బన్): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీ, ఈబీసీ తదితర సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉచిత కుట్టు శిక్షణ ప్రహసనంగా మారింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మిషన్ను అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా ప్రచారాలు నిర్వహించి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ, ఈబీసీ కులాలతో పాటు కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, బలిజ కులాలకు చెందిన వేల మంది మహిళలు కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్నారు. సీయుఆర్డీ (సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ), ఎస్ఏపీఈ (సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్) సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలను నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ 15వ తేది నుంచి ప్రారంభమైన శిక్షణ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి అయింది. ఒక్కో కేంద్రంలో రెండు బ్యాచ్ల ప్రకారం శిక్షణను ఇచ్చారు. 45 రోజుల నుంచి 90 రోజుల్లోగా మొత్తం 360 గంటలు శిక్షణ తీసుకోవాల్సి ఉందని, 75 శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికెట్ అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. శిక్షణ పూర్తి అయిన వెంటనే కుట్టు మిషన్తో పాటు సర్టిఫికెట్ను అందిస్తారనే నమ్మకంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆరు వేల మందికి పైగా మహిళలు ఆయా కేంద్రాలకు వెళ్లి కుట్టు శిక్షణ పొందారు. అయితే శిక్షణ పూర్తి చేసుకొని ఆరేడు నెలలు గడచిపోయినా నేటికీ కుట్టు మిషన్ల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక! ఉమ్మడి జిల్లాలోని ఆయా కేంద్రాల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మిషన్లు అందించాలంటే, తప్పక తాము నిర్వహించే పరీక్ష పాస్ కావాలని, అలాగే ఒక్కో అభ్యర్థి రూ.600 చెల్లించాలని మెలిక పెట్టినట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కర్నూలులోని శిక్షణ కేంద్రానికి శిక్షణ తీసుకున్న దాదాపు నలభై, యాభై మంది మహిళలు వచ్చి పరిపరి విధాలుగా ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లోని కేంద్రాలకు రెగ్యులర్గా వచ్చి శిక్షణ తీసుకునేందుకు ప్రతి రోజు అప్పట్లో బస్సు, ఆటో చార్జీలకు కనీసం రూ.100 వరకు ఖర్చు చేసుకున్నామని వారంటున్నారు. గతంలో చెప్పిన విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్తో పాటు కుట్టు మిషన్ను అందించాల్సి ఉండగా, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తామని, అందుకు రూ.600 చెల్లించాలని చెప్పడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. తాము చెల్లించే డబ్బులకు ఎవరు గ్యారెంటీ ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ముందుగానే శిక్షణ పూర్తి అయిన అనంతరం పరీక్ష ఉంటుందని, ఫీజు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని ఎందుకు చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైనర్, డిజిటల్ అసిస్టెంట్లకు అందని వేతనాలు ఉమ్మడి జిల్లాలోని 47 కేంద్రాల్లో మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించేందుకు ఒక ట్రైనర్, వారి హాజరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఒక డిజిటల్ అసిస్టెంట్ను ఏర్పాటు చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనాలను అందించాలని నిర్ణయించారు. ఆయా కేంద్రాల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిన వీరిలో పలువురికి నేటికీ పూర్తి స్థాయిలో వేతనాలను అందించనట్లు తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల వీరికి వేతనాలను అందించలేక పోతున్నట్లు సమాచారం. శిక్షణ పొందిన మహిళల ఆందోళన పలు ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమకు కుట్టు మిషన్లు ఎప్పుడు ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే తమకు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రతి రోజు క్రమం తప్పకుండా కేంద్రానికి వెళ్లి శిక్షణ తీసుకున్నామంటున్నారు. ఎలాంటి ఇతర పనులకు వెళ్లకుండా శిక్షణ పూర్తి చేసుకున్న తమకు సర్టిఫికేట్, కుట్టు మిషన్లు అందించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రాల శిక్షణ పొందిన కర్నూలు 24 3108 నంద్యాల 23 3024 మొత్తం: 47 6132 శిక్షణ పూర్తయినా అందని మిషన్లు తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక పరీక్ష పాస్ అయితేనే మిషన్లు ఇస్తారంట! తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు ఉమ్మడి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 6వేల మంది మహిళలు తమకెలాంటి సమాచారం లేదంటున్న బీసీ కార్పొరేషన్ అధికారులు -
అప్పులు వద్దని.. చంద్రబాబు ఏం చేస్తున్నారు?
ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప తదితరులు పాల్గొన్నారు. ● మొక్కజొన్న, ఉల్లి పంటలకు అంతంతమాత్రం ధరలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇటీవలి వరకు మురిపించిన వేరుశనగ ధర నేల చూపులు చూస్తోంది. శనివారం మార్కెట్కు వేరుశనగ 2,047 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.4,682, గరిష్ట ధర రూ.8,340 లభించగా.. సగటు ధర రూ.6,899 నమోదైంది. ● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్లో మాత్రం కనిష్ట ధర రూ.1,430, గరిష్ట ధర రూ.1,760 లభించగా.. సగటు ధర రూ.1,739 నమోదైంది. ● కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కనిష్ట ధర రూ.3,270, గరిష్ట ధర రూ.7,669 లభించగా.. సగటు ధర రూ.7,547 పలికింది. ● ఉల్లిగడ్డల ధర దయనీయంగా ఉంది. మార్కెట్కు 2,371 క్వింటాళ్లు రాగా.. లభించిన ధర రూ.220 మాత్రమే. గరిష్ట ధర రూ.1,119 పలికినా ఎక్కువ మంది రైతులకు రూ.220 నుంచి రూ.500లోపే ధరలు లభించడం గమనార్హం. ● మార్కెట్లో మిర్చి ధర అంతంతమాత్రమే. బ్యాడిగ రకం మిర్చికి గరిష్టంగా లభించిన ధర రూ.23,786 మాత్రమే. మిగిలిన రకాలకు ధర నామమాత్రంగానే ఉంది. -
అరటి రైతు ఆశలు మట్టిపాలు
కృష్ణగిరి: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి అరటి రైతు ఆశలు మట్టిపాలయ్యా యి. గాలీవానకు అరటి తోటలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది. కృష్ణగిరి మండలం బాపనదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల రామాంజినేయులకు 10 ఎకరాల్లో అరటి తోటలు ఉన్నాయి. పెట్టుబడుల రూపేణ రూ.20 లక్షలు సాగు చేయగా ఇటీవల గెలలు కూడా వచ్చాయి. తన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశించిన ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోగా, వడగండ్ల వర్షానికి పంట చాలా వరకూ నేలమట్టమయ్యింది. తమ గోడు పట్టించుకునే వారెవ్వరని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తగిన న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యణే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రజలకు అందించే సేవలతోనే గుర్తింపు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలకు అందించే ఉత్తమ సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించి నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ యాజమా న్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారి అభీష్టం మేరకే వారు కోరుకున్న ప్రాంతాల్లో నియమిచామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్గా ఉద్యోగాలు పొందిన ఎస్ గణేష్ (ఎంపీపీ ఆళ్లగడ్డ), ఆర్ నరేంద్రకుమార్ (ఎంపీపీ కల్లూరు), వీ అభిషేక్ (ఎంపీపీ కౌతాళం)కు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
యువకుడి దారుణహత్య
సి.బెళగల్: పాత కక్షలతో కె.సింగవరం గ్రామంలో ఓ యువడిని శనివారం దారుణంగా హత్య చేశారు. ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున (27)కు అదే గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు శనివారం ఘర్షణ పడి బోయ మల్లికార్జునను చేతులు, కాళ్లతో కొట్టడమే గాక వేటకొడవలితో కుడి కాలును నరికారు. తీవ్ర రక్తస్రావమై బోయ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయొద్దు
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుకఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని ఆప్కోలో ప్రభుత్వం విలీనం చేసేందుకు ప్రయత్నించడం తగదని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం వీవర్స్ సహకార సొసైటీని పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించారన్నారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇలా చేస్తే కోట్లాది ఆస్తులున్న సొసైటీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చేనేత అంటే ఒక గుర్తింపు ఉన్న సొసైటీని అభివృద్ధి చేయాలని సూచించారు. లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది, సంఘంలో సభ్యుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సభ్యులకు ముడిసరుకులు ఇప్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం పెంచాలన్నారు. ఎమ్మిగనూరులో తయారయ్యే చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదన విరమించుకోకపోతే పార్టీలకు అతీతంగా పోరాడేందుకు చేనేత కార్మికులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు శివప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, చేనేత మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన 108 అంబులెన్స్ సేవలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కొత్తగా 600 కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇందులో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. ఇటీవల కాలంలో యువత సంఖ్య విపరీతంగా గణనీయంగా అధికమవుతోంది. వీరిలో 30 శాతం వరకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజీ విభాగంలో గత ఏడాది ఓపీ 7,942 మంది, ఇన్పేషంట్లుగా 1,892 మంది చికిత్స పొందగా, 3,190 మంది డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో పాటు నంద్యాల, ఆదోనిలలోనూ డయాలసిస్ కేంద్రాలు ఉన్నా యి. మొత్తం ప్రతి ఏటా 4వేల మందికి పైగా రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరందరూ డయాలసిస్ చేయించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్లో ఉచితంగా ఆసుపత్రికి వచ్చి వెళ్లేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ సేవలు తీసేశారు. దీంతో డయాలసిస్ చేయించుకునేవారు బస్సులు, అద్దె వాహనాల్లో ఆసుపత్రులకు ఖర్చులు పెట్టుకుని రావాల్సి వస్తోంది. ఇందుకు గాను ఒక్కొక్కరికి ప్రయాణఖర్చులు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా అవుతోంది. బాధితుడితో పాటు సహాయకులు కూడా ఒకరు ఉండాల్సి రావడంతో ఆ రోజుకు వారు చేసే పని వదులుకోవడమో లేక సెలవుపై రావడమో చేయాల్సి వస్తోంది. ఈ రకంగా కూడా వారు నష్టపోతున్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పీఠాధిపతి సుబుధేంద్ర ఆధ్వర్యంలో మూలరాముల విగ్రహాలకు విశిష్ట పూజలు గావించారు. వేడుకల్లో భాగంగా శ్రీమఠంలో విశిష్ట ప్రసిద్ధి చెందిన మూడు విగ్రహాలకు శ్రీమూల రాములు, శ్రీ దిగ్విజయరామ, శ్రీజయరామ దేవుళ్ల ఉత్సమూర్తులకు గంధ లేపనం సమర్పించారు. శ్రీ మూల రామదేవుడికి తైల అభ్యంగణ, తులసి పూజ, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాయర మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, ఆలంకరణ గావించి మంగళహారతి చేశారు. ముందుగా శ్రీమఠంలో పీఠాధిపతికి పసుపు జలాలతో, నారీకృత నీరాజనం నిర్వహించా రు. వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతులు, భక్తులు సంతోషంగా ఉండాలని పీఠాధిపతి అనుగ్రహ సందేశాన్ని అందించి ఆశీర్వదించారు. -
‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ
నందవరం: నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, రచయిత గద్వాల సోమన్న రచించిన 93వ పుస్తకం ‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ శుక్రవారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. సెయింట్ పాల్స్ విద్యా సంస్థల అధినేత గోనె ఆశీర్వాదం సతీమణి డి. వైలెట మ్మ, ఇంజనీర్ డా.పి. మనోజ్కుమార్, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చలర్ ఎం.ఎల్ హరిప్రసాద్, వివిధ విద్యాసంస్థల కరెస్పాండెంట్స్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని గుండ్లూరు సుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. అత్యల్ప కాలంలోనే 93 పుస్తకాలు ముద్రించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషి గాను ప్రముఖులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, డయాన రంజిత, రిబ్కా, తదితర విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణంలో ఈగల్ ఐజీ
దేవనకొండ: కప్పట్రాళ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో రాష్ట్ర ఈగల్ ఐజీ రవికృష్ణ దంపతులు పాల్గొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఫ్యాక్షన్కు మారుపేరుగా ఉన్న కప్పట్రాళ్ల గ్రామాన్ని గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన రవికృష్ణ దత్తత తీసుకుని రూపురేఖలు మార్చిన విషయం విధి తమే. స్వయంగా రవికృష్ణ దంపతులు గ్రామానికి చేరుకుని ఆలయంలో సీతారాములకు ప్ర త్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రప్రభుత్వం అమలు చేయతలపెట్టిన వీబీజీ రామ్ జీ కొత్త పథకం మే నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొత్త పథకం ఏప్రిల్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు అందాయి. ఎన్క్యూఏఎస్ బృందం తనిఖీ దేవనకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం తనిఖీ చేసింది. బృందం సభ్యులు డాక్టర్ అజయ్కుమార్, డాక్టర్ రవి ఆసుపత్రిలోని ప్రసవ గది, రక్త నమూనా పరీక్ష కేంద్రం, ఓపీడీ, ఐపీడీ విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు విజయ్భాస్కర్, కళ్యాణ్, సీహెచ్ఓ భాగ్యలక్ష్మి ఉన్నారు. మెడికల్ షాపులో చోరీ డోన్ టౌన్: పట్టణంలోని పాతపేటలో ఉన్న ఓ మెడికల్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడి, షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్స్లో ఉన్న రూ.6 వేల నగదును ఎత్తుకెళ్లారు. దుకాణం యజమాని రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం షాపు మూసివేసి వెళ్లగా, శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు విరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
నంద్యాల(అర్బన్): ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం పెద్దకొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. అయ్యలూరు మెట్టకు చెందిన శంకర్(45) ఇటుకల లోడ్తో పెద్దకొట్టాల మీదుగా కొత్తపల్లె గ్రామానికి వెళుతున్నాడు. పెద్దకొట్టాల చర్చి వద్ద మట్టి కుప్పపై ట్రాక్టర్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు డ్రైవింగ్ సీటులో ఉన్న శంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
డ్రోన్ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు కల్చరల్: డ్రోన్ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు అన్నారు. ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎం కర్నూలు సంయుక్త భాగస్వామ్యంతో రాయలసీమ యూనివర్సిటీలో 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలప్మెంట్ పోగ్రాం శుక్రవారం ముగిసింది. ఐదు రోజుల సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు వీసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపాళ్లు విశ్వనాథ్ రెడ్డి, వెంకట సుందరానంద, పోగ్రామ్ కో–ఆర్డినేటర్లు శరత్కుమార్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి కర్నూలు: నగర శివారులోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాశీం బాషా (45)కు ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. వీరు ప్రస్తుతం కర్నూలు శివారులోని మాంటెస్సోరి ఇండస్ స్కూల్లో చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కొడుకు సొహైల్కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని ద్విచక్ర వాహనంపై బనగానపల్లె నుంచి శుక్రవారం కర్నూలుకు వచ్చాడు. పాఠశాలలో తన పిల్లలను చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై ఎన్హెచ్ 44 మీదుగా కర్నూలు నగరంలోకి వస్తుండగా కృష్ణానగర్ రావూరు ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జిపైన వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాశీం బాషా ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ ఊడి పక్కనే పడింది. తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టు పక్కల ఉన్నవారు గుర్తించి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ట్రాఫిక్ పోలీసులు మార్చురీకి తరలించారు. మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆలోచన సామర్థ్యం పెంచుకోవాలి
కర్నూలు సిటీ: పోటీ ప్రపంచంలో విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ట్రిపుల్ఐటీ డీఎంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కృష్ణహాల్లో పరిశ్రమ–విద్యా సంస్థల సమావేశం నిర్వహించారు. ఇన్ఫోసిస్ ఏవీపీ అండ్ సీనియర్ ఇండస్ట్రి ప్రిన్సిపాల్ అశోక్కుమార్, హెచ్సీఎల్ గువి హెడ్ హెచ్ఆర్ కంచన్ ఖేడ్కర్, వోల్వో ఇండియా హెచ్ఆర్ అరవింద్ వారియర్, టీసీఎస్ సీనియర్ డీవీ లీడ్ అర్జున్ నాగ్ తదితర నిపుణులు హాజరై ఏఐ, సంబంధిత రంగాల్లో పరిశ్రమల అంచనాలు, కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు విభిన్న ఆలోచనలతో ప్రత్యేకత కలిగి ఉండాలన్నారు. ఇంటర్న్షిప్లు, హ్యాకథాన్లు, సర్టిఫికేషన్స్, వాస్తవ ప్రాజెక్టుల ద్వారా అనుభవం పొందవచ్చని వివరించారు. ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్లు, కంప్యూటర్ నెట్వర్క్ వంటి ప్రాథమిక అంశాల్లో ప్రావీణ్యం సాధించడంపై సూచనలు చేశారు. ఇంటర్వ్యూ అంచనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రిపుల్ఐటీ డీఎం ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విద్య.. ఉద్యోగానికి భరోసా
● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు ఏప్రిల్ 4వ తేదీతుది గడువు ● పది విద్యార్థులకు చక్కటి అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు ఇలా.. ఉజ్వల భవిష్యత్కు బాటలు.. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాలిసెట్ ఇలా.. పాలిసెట్ 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లభించే కోర్సులు... పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. నంద్యాల జిల్లాలో 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 60, మెకానికల్ 120, ఈసీఈ 120, ఎలక్ట్రికల్ 120 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.పాలిటెక్నిక్ చదివితే చిన్న వయస్సులోనే ఉద్యోగావ కాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉ పాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శైలేంద్రకుమార్, పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
● దేవుడి మాన్యం భూముల్లో అక్రమ తవ్వకాలు ● మట్టి ట్రాక్టర్ల అతి వేగాన్నిప్రశ్నించినందుకు హత్యకు కుట్ర ● ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని బాధితుడి ఆరోపణ ఆత్మకూరురూరల్: వడ్ల రామాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శేషిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గ్రామంలో పల్లెపాడు ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగస్వామికి చెందిన ట్రాక్టర్లు ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ గ్రామంలో వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని డ్రైవర్లకు వేగం తగ్గించాలని చెప్పాలని సింగస్వామికి శేషిరెడ్డి చెప్పాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తమ్మలూ రు ముర్తుజా వెంటనే శేషిరెడ్డికి ఫోన్ చేసి ‘మమ్మల్ని అడిగే వాడివా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ బెదిరించాడు. ఈ విషయంపై పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో శేషిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ముర్తుజా నేరుగా ట్రాక్టర్తో శేషిరెడ్డి ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు నిలుచున్న ఆయనను ట్రాక్టర్తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే చంద్రమౌళీశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కూడా తగిలేలా వెళ్లింది. వెంటనే వారు తేరుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ట్రాక్టర్ శేషిరెడ్డి ఇంటి ప్రహరీని ఢీకొంది. శేషిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామానికి బిత్తర పోయి తేరుకునేలోగా ముర్తుజా అక్కడ నుంచి ట్రాక్టర్తో పరారయ్యాడు. శేషిరెడి వెంటనే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు శేశాడు. ఈ మేరకు సీఐ మహేశ్వరరెడ్డి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. పోలీసులు గాలించి ముర్తుజాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్రమ మైనింగ్ను పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని వడ్లరామాపురం గ్రామస్తులు కోరుతున్నారు. చంపాలనే ట్రాక్టర్తో ఢీకొట్టాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వెళ్తున్న ట్రాక్టర్లను కాస్త నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే నన్ను చంపాలనే ట్రాక్టర్తో ఢీ కొట్టారు. ముర్తుజా నన్ను చంపుతానని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. ఇంట్లోకి పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ముర్తుజాపై తగిన చర్యలు తీసుకోవాలి. దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు ఆపాలి. – శేషిరెడ్డి, బాధితుడు -
వైఎస్సార్సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం
బొమ్మలసత్రం: గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగాన్ని చూశా రని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, జాన్వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హ యాంలో క్రిస్టియన్లకు పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డాక్టర్ బీఅర్ అంబే డ్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకుల చేతిలో కీలు బొమ్మ ల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్సీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారన్నారు. అక్రమ సంపాదన కోసం అన్ని రకాల చట్ట వ్యతిరేక పనులకు నేతలు తెరలేపారని, రాష్ట్రంలో జూదాన్ని ప్రోత్సహించటం సరికాదన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో కోవిడ్ సంభవించినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఇంత ఆదాయ వనరులు ఉన్నా టీడీపీ ప్రభుత్వం అప్పుల దిబ్బలా రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనలో క్రిస్టియన్లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపి తిరిగి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ సెక్రటరీ విల్సన్పాల్, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మనోజ్ కుమార్, పట్టణాధ్యక్షులు ఇమ్మానియేలు, రవిప్రకాష్, కరుణాకర్, ప్రేమ్కుమార్, కిరణ్ పాల్గొన్నారు. -
రాయల్టీ పేరుతో నిలువుదోపిడీ
● సుధాకర్ ఇన్ఫ్రా సిబ్బందికి మైనింగ్ అధికారుల వత్తాసుపాములపాడు: ఎస్ఆర్ ఎంసీ కెనాల్ వేస్ట్ బిల్కు (రాళ్ల మట్టి)ను తరలిస్తున్న వారిని సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సిబ్బంది దోచుకుంటోంది. ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్నామని, రోడ్డుపై కంకర, ఇసుక, మట్టి తదితరం తరలించే వాహనాల నుంచి రాయల్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులను నియమించి దందాకు పాల్పడుతున్నారని వాహన యజమానులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని కంబాలపల్లి గ్రామం వద్ద బిల్కు లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లను అడ్డుకున్నారు. సుధాకర్ ఇన్ఫ్రా చెందిన వ్యక్తుల వెంట మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రషీద్ అహ్మద్ ఉన్నారు. ట్రిప్పర్ డ్రైవర్ల వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వెంకటేష్, కో ఆప్టెడ్ సభ్యుడు ముర్తుజాఅలీ, మరి కొందరు వాహన యజమానులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికే బిల్కు తరలించడానికి ఇరిగేషన్ శాఖకు చలానా చెల్లించామని, రాయల్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు రాయల్టీ చెల్లించవద్దని జీఓలో కనబరిచిన విషయాన్ని కూడా చూపించారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశా మని వాహన యజమానులు తెలిపారు. స్థానిక రైతు లు శ్రీశైలం ముంపులో భూములు కోల్పోయామని అందులో తమ ఆస్తులు ఉన్నాయని, పరిహారం అప్ప ట్లో అరకొరగా ఇచ్చారని, ఇప్పుడు బిల్కు తరలిస్తే వేలల్లో వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. దీంతో డ్రైవర్ల నుంచి తీసు కున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి, అధికారులు, రాయల్టీ వసూలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
జిల్లాలో చేతి పంపుల వివరాలు...
సమ్మతగేరి ఎస్ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల అక్కడున్న చౌడు భూముల్లో బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల గ్రామంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఎస్ఎస్ ట్యాంకు నుంచి 25 రోజులకు పైగా నీటిని విడుదల చేయడం లేదు. గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. – సీహెచ్ మల్లికార్జున, చిన్నహ్యాట, హోళగుంద మండలం జిల్లాలోని అన్ని ఎస్ఎస్ ట్యాంకుల్లో దాదాపు 50 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేది నుంచి ఎల్ఎల్సీకి నీరు విడుదల కానుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే టీబీ డ్యాం అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు కూడా నీటి విడుదలపై లేఖ రాశారు. పూర్తి స్థాయిలో నీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. ప్రస్తుత వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తరాదని ప్రతి రోజు క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్ష చేస్తున్నాం. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. – సీహెచ్ మనోహర్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్● సమ్మతగేరి ఎస్ఎస్ ట్యాంకు నుంచి హొళగుంద మండలంలోని సమ్మతగేరి, కోగిలతోట, ముద్దటమాగి, ఎల్లార్తి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, బీజీ హళ్లి గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఎస్ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ● హాలహర్వి మండలం చింతకుంట హెడ్వర్క్స్ నుంచి 14 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్లో నీటి మట్టం ఐదు అడుగులకు పడిపోవడంతో చాలా గ్రామాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్ పరిధిలోని కొక్కరచేడు, శిరిగాపురం, టి.చాకిబండ, బేవినహాల్, శ్రీధరహాల్, ఎంకే పల్లి, మేదేహాల్ గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల ప్రజలకు ఎల్ఎల్సీ నీరే ఆధారం. ఆయా నియోజకవర్గాల్లోని ఎస్ఎస్ ట్యాంకులను ఎల్ఎల్సీ నీటితో నింపితే, వేసవిలో నీటి కొరతను నివారించేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర డ్యాంలో కొనసాగుతున్న గేట్ల పనుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 10వ తేది నుంచి ఎల్ఎల్సీకి నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే నీటి సరఫరా నిలిపివేయక ముందే ఆయా ఎస్ఎస్ ట్యాంకులను నింపుకున్నా, ప్రస్తుతం పలు ట్యాంకుల్లో నీరు అడుగంటడంతో అనేక గ్రామాలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామాల ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుండగా.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆయా గ్రామాల్లోని బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. కరువుకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. బాపురం రిజర్వాయర్ నీటిపై ఆధారపడిన నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలోని ప్రజలు కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం, పది రోజులకు ఒకసారి ఇక్కడ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం గ్రామాల ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. ఎల్ఎల్సీ, తుంగభద్ర నది నీటిపై మొత్తం 26 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 248 గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లో రోజు రోజుకు నీటి మట్టాలు పడిపోతుండడం వల్ల నిర్దేశించిన గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొంది. రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై నోరు మెదపని కూటమి ప్రభుత్వం వేసవిలో జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 141 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తుగానే అంచనా వేసి తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.8.48 కోట్లు అవసరవుతాయని ఈ ఏడాది జనవరి 5న ప్రభుత్వానికి తెలియజేశారు. 13 మండలాల్లోని 79 గ్రామాలకు రూ.6.14 కోట్లతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అలాగే ఆరు మండలాల్లోని 26 జనవాసాల్లో పశువులకు నీటిని అందించేందుకు రూ.44.17 లక్షలు, బోర్ల ఫ్లష్సింగ్కు రూ.19.65 లక్షలు, బోర్ల డీపెనింగ్కు రూ.1.44 కోట్లు, ఓపెన్ వెల్స్ డీపెనింగ్కు రూ.17.80 లక్షలు, రెండు ఎస్ఎస్ ట్యాంకులు నింపేందుకు రూ.8 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇంజీనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. అయితే నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అందిస్తున్న నీటి వివరాలు ● ఎల్ఎల్సీ: 18 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 180 హ్యాబిటేషన్లకు ● హెచ్ఎల్సీ: గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 7 హ్యాబిటేషన్లకు ● హెచ్ఎన్ఎస్ఎస్(ఆలూరు బ్రాంచ్ కెనాల్ ): 1 హ్యాబిటేషన్కు ●టీబీ రివర్ ఇంటెక్వెల్స్, ఇతర సోర్సులు: 29 హ్యాబిటేషన్లకు ● జీడీపీ, కొత్తపల్లి రిజర్వాయర్: 15 హ్యాబిటేషన్లకు ● కేసీ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్: 16 హ్యాబిటేషన్లకు మొత్తం చేతి పంపులు: 4235 పూర్తిగా పనికిరాకుండా పోయినవి: 1338 ఉపయోగంలో ఉన్నవి: 2700 పనిచేయనివి: 197 క్రాష్ ప్రోగ్రామ్లో మరమ్మతు చేసినవి: 126 మరమ్మతు చేయాల్సినవి: 75గార్లదిన్నెలో ఎండుతున్న గొంతులు! ఎమ్మిగనూరుసెంట్రల్: గార్లదిన్నె గ్రామంలో ప్రజలు బిందెడు నీటికి అష్టకష్టాలు పడుతున్నారు. మూడు రోజుల కొకసారి తాగునీరు సరఫరా చేస్తుండటంతో పడరాని పాట్లు పడుతున్నారు. అల్వాల సమ్మర్ స్టోరేజీ నుంచి పెసలదిన్నె మీదుగా 25 ఏళ్ల కిందట గార్లదిన్నె వరకు పైపులైన్ ఏర్పాటు చేశారు. పైపులైన్లు పాతవి కావడంతో తుప్పు పట్టి నీరు రంగుమారి వస్తోందని, కుళాయిల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోందిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీరు కూడా దొరకడం లేదని, ఎండా కాలంలో గొంతులు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రతిరోజు శుభ్రమైన నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గొంతెండుతున్న పశ్చిమ పల్లెలు ఎస్ఎస్ ట్యాంకుల్లో అడుగంటుతున్న నీరు ఈ ఏడాది జనవరి 10 నుంచి నిలిచిపోయిన ఎల్ఎల్సీ నీటి సరఫరా దాదాపు 141 గ్రామాల్లో నీటి సమస్య ఉంటుందని గుర్తించిన అధికారులు రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై నోరు మెదపని ప్రభుత్వం -
బంగారు తేరుపై ఆది దంపతుల విహారం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకులు జరిపించారు. స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, సభ్యులు ఏఈవో, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా జనగణన
కర్నూలు(సెంట్రల్): పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో జనగణన–2027 ప్రక్రియ నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. జి.పుల్లయ్య కాలేజీలో ఫీల్డ్ ట్రైనర్లకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణలో బోధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ముందుగా హౌస్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని కచ్చితంగా గుర్తించి ఎటువంటి పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయలన్నారు. ఫీల్డ్ ట్రైనర్లుగా ఉన్న ఉపాధ్యాయులు తమ కింద పనిచేసే ఎన్యూమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెన్సస్ అధికారి దీపక్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2025 జూలై నెలలో చేపట్టిన వీఏఏల బదిలీలపై 35 మంది హైకోర్టును ఆశ్రయించడంతో వీరితో పాటు ఆప్షన్ పెట్టుకున్న 106 మంది వీఏఏలకు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ చేపట్టారు. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్లో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా పాల్గొన్నారు. ‘సాక్షి’లో వీఏఏల బదిలీల కౌన్సెలింగ్కు సంబంధించి మళ్లీ అక్రమాలు శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తమైంది. 106 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పొగను 8 నిమిషాల్లో నియంత్రించాం కర్నూలు(సెంట్రల్): మరమ్మతుల్లో భాగంగా పొగ వచ్చిందని, దానిని ఎనిమిది నిమిషాల్లో నియంత్రించాయని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరమ్మతుల సమయంలో ఇలా పొగ రావడం చాలా సాధారణమని పేర్కొన్నారు. దానిని అంతర్గత భద్రతా బృందాలు పూర్తిగా నియంత్రించాయని, ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగలేదని తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి శ్రీశైలం ప్రాజెక్టు: సున్నిపెంటలోని అక్కమహాదేవి సెంటర్ సమీపంలో ఎం. నవీన్ (46) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సున్నిపెంట సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. నవీన్ అప్పుల భారంతో మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి తూలిపడి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అతని తల్లి సరోజమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పీఆర్ ఎస్ఈగా జి.ప్రభాకర్రెడ్డి కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కర్నూలు పర్యవేక్షక ఇంజనీరుగా జి.ప్రభాకర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పదోన్నతుల్లో భాగంగా అనంతపురం పీఆర్ఐ డివిజన్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న ఐ.వేణుగోపాల్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈగా ప్రభాకర్రెడ్డి ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అహోబిలం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బా ధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది. -
గ్యాస్ అక్రమ నిల్వలపై విజి‘లెన్స్’
కర్నూలు: జిల్లాలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు విస్తృతం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కలసి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి చౌడేశ్వరి ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న 10 గ్యాస్ ఏజెన్సీలు, 88 హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వలను గుర్తించి 201 కేసులు నమోదు చేశారు. లబ్దిదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా చేయకుండా కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన సబ్సిడీ గ్యాస్ను వ్యాపార అవసరాలకు హోటల్ నిర్వాహకులు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6ఎ కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
మళ్లీ అక్రమాలు!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించిన 106 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీకి పెద్దపీట వేయాలి. రాజకీయ నేతల సిఫార్సులు, ముడుపులకు అవకాశం ఇవ్వరాదు. కానీ వీఏఏల బదిలీల్లో లోలోపల ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా యూనిట్గా జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా కౌన్సెలింగ్ నిర్వహించే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గతేడాది జూలైలో జరిగిన బదిలీల్లో కర్నూలు, నంద్యాల డీఏఓలు కుమ్మకై ్క సీనియారిటీకి పాతర వేశారు. సిఫార్సు లేఖలు, ముడుపులకు పెద్దపీట వేశారు. సిఫార్సు లేఖ లేకపోతే తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. ఫలితంగా అర్హులు మారుమూల ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు మండలాలకు బదిలీ అయ్యారు. అనర్హులు దగ్గరి మండలాల్లో నియమితులయ్యారు. వీరందరూ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఎక్కడ పనిచేసే వారు అక్కడే కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మళ్లీ కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీలు గురువారం చేపట్టనున్నారు. వీఏఏల బదిలీల్లో మళ్లీ అక్రమాలే.. నిబంధనల మేరకు వీఏఏలను ఖాళీ పోస్టుల్లోనే నియమించాలి. అయితే ముడుపులు దండుకొని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లీవ్ వేకెన్సీల్లో సైతం పోస్టింగ్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులకు.. వీఏఏలకు కర్నూలులో పనిచేసే ఓ ఏఓ మధ్యన ఉండి ముడుపుల బాగోతం నడుపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది వీఏఏలు మెటర్నటీ లీవ్లో ఉన్నారు. మరికొందరు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇటువంటి ఖాళీల్లో ఎవరినీ నియమించరాదు. కానీ ముడుపుల మహిమ వల్ల ఇటువంటి లీవ్లు భర్తీ కానున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీవ్ వేకెన్సీలు భర్తీ చేయడం వల్ల కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, కోసిగి, హొళగుంద, హలహర్వి, మంత్రాలయం తదితర మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యథావిధిగా ఖాళీలు మిగిలిపోయే పరిస్ధితి ఏర్పడింది. పనిలోపనిగా కొందరు వీఏఏలను మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తంగా 2025 జూలైలో జరిగిన అక్రమాల కంటే తాజాగా జరుపుతున్న బదిలీల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలు వీఏఏల బదిలీలపై దృష్టి సారించి అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీఏఏల బదిలీల్లో ముడుపులు, సిఫార్సులకు పెద్దపీట లీవ్ వేకెన్సీలు కూడా భర్తీకి రంగం సిద్ధం కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఖాళీల భర్తీ వట్దిదే నేడు వీఏఏల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ అబాసుపాలవుతున్న వ్యవసాయ శాఖ గతేడాది చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీల్లో అబాసుపాలైన వ్యవసాయ శాఖ ప్రస్తుతం గ్రామ స్థాయిలో వీఏఏల బదిలీల్లో సైతం పెద్ద ఎత్తున ముడుపులు దండుకొని అపఖ్యాతిని మూట కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులు, ఏడీఏల బదిలీల్లో రూ.లక్షలు ముడుపులు చేతులు మారాయి. కూటమి పార్టీల నేతలకు బదిలీల పర్వం కాసుల పంట పండించింది. తాజా బదిలీల్లోనూ అక్రమాలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
● పది మందికి గాయాలు నంద్యాల(అర్బన్): ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు టైర్ పగలడంతో డివైడర్ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నంద్యాల మండలం చాబోలు గ్రామ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పగలడంతో డివైజర్ను దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. అనంతరం బస్టాండ్కు తరలించి సొంత ప్రాంతాలకు వెళ్లేలా సౌకర్యం కల్పించారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో మంటలు కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ మండల కేంద్రానికి సమీపంలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గుట్టపాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా, లేదంటే మరే ఇతర కారణంతో సంభవించిందా అనే విషయమై స్పష్టత రాలేదు. మరోవైపు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు కోరగా.. ఉత్పత్తి ప్రక్రియలో ఇలాంటి ఘటనలు సాధారణమని, ఉత్పత్తి సమయంలో కొంత భాగం పక్కకకు వెళ్లడంతో పొగలు వ్యాపిస్తాయని యాజమాన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
బనగానపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని డోన్కు చెందిన మేరీ భర్త విల్సన్ (32)ను ప్రియుడు మధుతో కలిసి ఈ నెల 15న రాత్రి హత్య చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. నిందితులు మేరీ, మధు, వీరికి సహకరించిన నంద్యాలకు చెందిన మహమ్మద్, అశోక్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు పంపారు. కేసు వివరాలను బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐ వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం నంద్యాలకు చెందిన మేరీకి డోన్కు చెందిన విల్సన్తో వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి పదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరి కుటుంబం డోన్ నుంచి నంద్యాలలోని బోగ్గులైన్కు మారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ స్థితిలో మూడు నెలల క్రితం నంద్యాల మండలం బాపూజీ నగర్కు చెందిన మధుతో మేరికి వివాహేతర సంబంధం ఏర్పడగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మేరీ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ నెల 15న మధు, అతని స్నేహితులు రఫీ, అశోక్ కలిసి విల్సన్కు అతిగా మద్యం తాగించారు. ఆటోలో బనగానపల్లె నుంచి కై పకు వెళ్లే రహదారిలో ప్లాట్లలోకి తీసుకెళ్లి బెల్టుతో విల్సన్ మెడకు బిగించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు హంతకుల గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 24న కై ప వీఆర్ఓ ద్వారా లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. -
ముగిసిన రాతిదూలం పోటీలు
బనగానపల్లె రూరల్ : మండలంలోని నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో జ్యోతి మహోత్సవాల సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా నిర్వహించిన న్యూకేటగిరీ విభాగం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో వరుస స్థానాల్లో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షరరెడ్డి వృషభాలు, అదే జిల్లా రాయవరంకు చెందిన అక్షరరెడ్డి వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామానికి చెందిన గోవర్థన్రెడ్డి ఎద్దులు, నంద్యాల జిల్లా చిన్నకానల గ్రామానికి చెందిన చెన్నరెడ్డి వృషభాలు, కోటకందుకురుకు చెందిన నరసింహారెడ్డి ఎద్దులు, సోమయాజులపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, నరసయ్యయాదవ్ వృషభాలు, రోళ్లపాడుకు చెందిన ప్రభాకర్రెడ్డి, గుల్లదుర్తి గ్రామానికి చెందిన శశికాంత్ వృషభరాజములు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40 వేలు, రూ.30వేలు,రూ.20వేలు,రూ.15వేలు, రూ.10వేలు, రూ.8 వేలు బహుమతులతో పాటు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ పీవీ కుమార్రెడ్డి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా జుబేదాబీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన జుబేదాబీ ఎన్నికయ్యారు. గురువారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అన్ని మండల సమాఖ్యల నుంచి అధ్యక్షురాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా జుబేదా బీ, ఉపాధ్యక్షురాలుగా కె.మల్లేశ్వరి(కోడుమూరు), కార్యదర్శిగా బి.రాజేశ్వరి (ఆదోని), ఉప కార్యదర్శిగా గ్రేసమ్మ(మంత్రాలయం), కోశాధికారిగా జి.అరుణ(కర్నూలు) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి అభినందించారు. బెట్టింగ్ అప్పు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నెకు చెందిన చాకలి ప్రవీణ్ క్రికెట్ బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఇతడు కర్నూలు బాలాజీ నగర్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి వ్యాపారంలో వచ్చిన డబ్బంతా పోగొట్టుకుని అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్ను ఎంచుకున్నాడు. కర్నూలు శివారులోని బి.క్యాంప్ హౌసింగ్ బోర్డు కాలనీలో సిరిగిరి శ్యామలమ్మ అనే వృద్ధురాలు ఈనెల 10వ తేదీన ఇంటి ముందు మనవరాలిని ఆడిస్తుండగా మోటర్సైకిల్పై వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పీఎస్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి బుధవారం మధ్యాహ్నం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని టీవీ టవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు నేరం అంగీకరించాడు. అతని నుంచి 30 గ్రాముల బంగారు పుస్తెల గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ శేషయ్య తెలిపారు. -
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లెరూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చౌడేశ్వరిదేవి రాయబారాది జ్యోతి రథ మహోత్సవాలు బుధవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్వామి వార్ల విగ్రహాలకు వసంతోత్సవ పూజలు నిర్వహించి తిరిగి ఆలయాలకు చేర్చారు. ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో ప్రమాదం హాలహర్వి: అక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సరదాగా గడుపుదామనుకున్న ఆ యువకుడిపై మృత్యువు వల విసిరింది. రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని కబ ళించింది. హాలహర్వి నుంచి ఆలూరుకు వెళ్లే మార్గంలో బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన వడ్డె వెంకటేష్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీకి చెందిన వడ్డె వెంకటేష్ (19), శ్రీనివాసులు బళ్లారిలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వెంకటేష్ అక్క పుట్టినరోజు కావడంతో వేడుకల్లో పాల్గొనేందుకు ఇద్దరూ బైకుపై బళ్లారి నుంచి ఆదోనికి బయలుదేరారు. బాట మారెమ్మవ్వ ఆలయ సమీపంలోకి రాగానే అగ్రహారం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాద విషయం తెలుసుకున్న పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. -
చెవిలో పూలతో నిరసన
కర్నూలు(సెంట్రల్): ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్తో ఒరిగేదేమీ లేదంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్కుమార్ హాజరై మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేయడం దారుణమన్నారు. మంత్రి లోకేష్ ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేయడం అన్యాయమని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల తడాఖా ఏమిటో తెలుస్తుందని హెచ్చరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఫుడ్ పాయిజన్ కలకలం
నంద్యాల(అర్బన్): పట్టణ శివారులోని నందమూరినగర్ వద్ద ఉన్న బుడగ జంగాల కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 60 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని తెచ్చుకొని తినడం వల్లే ఫుడ్పాయిజన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. వివరాలు.. పట్టణ సమీపంలోని బుడగజంగాల కాలనీలో దాదాపు 210 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఓ పెళ్లిలో మిగిలిన ఆ హారాన్ని తెచ్చుకొని పలు కుటుంబాలు తిన్నాయి. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో దాదాపు 60 మంది ఆసుపత్రులకు పరుగు లు తీశారు. చిన్న పిల్లలు సైతం ఫుడ్ పాయిజన్కు గురి కావడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. తక్షణమే కాలనీకి వెళ్లి బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్ఓ, ఫుడ్సేఫ్టీ అధికారి వెంకటరాముడు, పలు శాఖల అధికారులు కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. గతంలో పలు మార్లు మిగులు అన్నాన్ని తెచ్చుకొని తిన్నామని, ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. మిగులు ఆహారం తినడం వల్లే ఫుడ్పాయిజన్ అయ్యిందని, తాగునీటి శ్యాపింల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. -
కొత్త ఆశలు!
సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లు–2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్లమెంట్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనపై ఆ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని బిల్లులో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం పూర్తవడం, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, ఆపై పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేయడమే తరువాయి. 2029 సార్వత్రిక ఎన్నికలు కొత్తగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతోనే జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలులో పెరగనున్న 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీల చొప్పున ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంతా భావించారు. అయితే 50శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్లమెంట్కు 3 చొప్పున మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఈ లెక్కన 20 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టంతో ప్రస్తుతం ఉన్న 2 ఎస్సీ స్థానాలు 3కు పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్తో మొత్తం నియోజకవర్గాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 20 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2027 మార్చికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కొత్త జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగనుంది. 1.60లక్షల ఓట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. 1 లేదా 2 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానం కచ్చితంగా పెరుగుతుంది. అయితే రాష్ట్రంలోని పెద్ద జిల్లాలో కర్నూలు ఒకటి. ఆ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక ఎంపీ స్థానం చొప్పున రెండు జిల్లాల్లో పెరగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో కలిపి మరో ఎంపీ స్థానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉండొచ్చు. నియోజకవర్గం ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న మిగిలే ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య కర్నూలు 2,70,942 1,60,000 1,10,942 పాణ్యం 3,22,494 1,60,000 1,62,494 పత్తికొండ 2,19,639 1,60,000 59,639 కోడుమూరు 2,41,767 1,60,000 81,767 ఎమ్మిగనూరు 2,43,067 1,60,000 83,067 మంత్రాలయం 2,05,429 1,60,000 45,429 ఆదోని 2,57,529 1,60,000 97,529 ఆలూరు 2,53,927 1,60,000 93,927 మొత్తం 20,14,794 12,80,000 7,34,300 ఆళ్లగడ్డ 2,32,676 1,60,000 72,676 శ్రీశైలం 1,96,116 1,60,000 36,116 నందికొట్కూరు 2,18,047 1,60,000 58,047 నంద్యాల 2,73,938 1,60,000 1,13,938 బనగానపల్లి 2,41,179 1,60,000 81,179 డోన్ 2,27,351 1,60,000 67,351 మొత్తం 17,21,013 9,60,000 4,29,307 కొత్తగా పెరిగే నియోజకవర్గ కేంద్రాలపై సర్వత్రా చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటర్ల వివరాలునియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కసరత్తు పునర్విభజనతో కొత్తగా పెరిగే నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్నూలు అర్బన్, రూరల్ రెండు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత పెద్ద నియోజకవర్గం పాణ్యం. 3.22 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇది రెండుగా విడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆలూరు నుంచి 93,927 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆలూరు నుంచి దేవనకొండ విడిపోయి కొత్త నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వెల్దుర్తి కేంద్రంగా ఓ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే నంద్యాలలో కూడా 1,13,938 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా నంద్యాల అర్బన్, రూరల్ అయ్యే అవకాశం ఉంది. బనగానపల్లిలో 81,179 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కూడా కోవెలకుంట్ల కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నుంచి ఓ మండలం కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో రాజకీయంగా ఎమ్మెల్యేలు కావాలని ఆశపడేవారు మరింత ఉత్సాహంతో పనిచేస్తే రాజకీయ పార్టీలు వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. -
ఫేక్ డాక్యుమెంట్తో మ్యుటేషన్
కర్నూలు(సెంట్రల్): ఆస్పరి మండలం కై రుప్పలలో ఫేక్ డ్యాకుమెంట్లతో రెవెన్యూ అధికారులు మాయజాలం చేశారు. గ్రామానికి చెందిన విజయమోహన్ అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి పేరిట ఆయనకు తెలియకుండానే మ్యుటేషన్ చేశారు. ఆయన తన కుమారులకు భూ మి భాగ పరిష్కారాల సమయంలో జరిగిన మోసా న్ని తెలుసుకున్నారు. న్యాయం కోసం రెండేళ్లుగా కలెక్టరేట్, పత్తికొండ ఆర్డీఓ, ఆస్పరి తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఊరులో లేని విషయాన్ని పసిగట్టి పన్నాగం విజయమోహన్ స్టేట్ బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ తరువాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. కై రుప్పలలో సర్వే నంబర్ 70లో అతనికి 1.54 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.30లక్షలకు పైగా పలుకుతోంది. ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కొందరు పన్నాగం పన్నారు. గ్రామ వీఆర్వోగా పని చేసిన ఎస్టీ వీరన్న ఇందులో కీ లక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి ద్వారా కథ నడిపించి రా త్రికి రాత్రే భూమిని ఆమె పేరిట బదలాయించారు. గుడ్డిగా మ్యుటేషన్ చేసిన తహసీల్దార్ మ్యుటేషన్ చేసే సమయంలో రెవెన్యూ అధికారులు కనీసం నిబంధనలు పాటించలేదు. ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్ ఈసీ చూడలేదు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వలేదు. వీఆర్వో, ఆర్ఐ, త హసీల్దార్ గుడ్డిగా సంతకాలు చేశారంటే వారికి భారీ గా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి రెండేళ్లుగా పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓఆర్ కేసు కూడా పెండింగ్లో ఉంది. ఎలా మోసం చేశారంటే..! కురువ లక్ష్మి అదే గ్రామానికి చెందిన చిన్న వీర న్న వద్ద నుంచి సర్వే నంబర్ 52లో 1.33 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్ను సర్వే నంబర్ 70లో విజయమోహన్కు చెందిన 1.54 ఎకరాలను కొల్లగొట్టేందుకు వినియోగించారు. డాక్యుమెంట్లో సర్వే నంబర్, విస్తీర్ణం స్థానాల్లో వైట్నర్తో రుద్ది సర్వే నంబర్ 70కి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణాలను నమోదు చేశారు.ఆ ఫేక్ డ్యాకుమెంట్తో 2024 జూలై 24న ఆస్పరి తహసీల్దార్తో మ్యుటేషన్ చేయించారు. -
నేడు విద్యుత్ టారిఫ్ విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2026–27 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ రిటైల్ సప్లయ్ టారిఫ్ను కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ) ఈ నెల 25న విడుదల చేయనుంది. ఇప్పటికే డిస్కమ్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టారిఫ్లపై ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. అయితే దీనిపై ఏపీఈఆర్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వినియోగదారుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు 2024–25 సంవత్సరానికి సంబంధించి ట్రూ అప్/డౌన్పై కూడా ఏపీఈఆర్సీ నిర్ణయాన్ని బుధవారం వెలువరించనుంది. డిస్కమ్లు నిర్వహణ వ్యయం పెరిగిందనే కారణంతో ట్రూ అప్ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీలు కావాలని ఆశపడుతున్న రాజకీయ ఆశావహులకు శుభవార్త. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (పునర్విభజన) చట్టాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కసరత్తు -
సీసీ రోడ్డును రద్దు చేయండి
● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై జేసీకి సర్పంచ్ ఫిర్యాదుకర్నూలు(సెంట్రల్): కర్నూలు రూరల్ మండలం నిడ్జూరులో ప్రభుత్వ నిధులతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యప్రకాష్ తన ఇంటి కంపౌండ్ నుంచి సీసీ రోడ్డు, మురుగు కాల్వ వేయించుకుంటున్నారని, తక్షణమే ఆ పనులను రద్దు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ మాధవి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆయనే నేరుగా తన ఇంటి కంపౌండ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేయించుకుంటు న్నారని, గ్రామంలో పలు కాలనీల్లో గుంతలమయం అయిన రోడ్లు ఉన్నాయని, వాటిలో సీసీ రోడ్డు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్షణమే ఆ పననులను రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
అక్రమంగా ఇసుక డంపులు
ఎమ్మిగనూరుసెంట్రల్: టీడీపీ నాయకుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రీచ్లు, వంకల నుంచి ఇసుకను తీసుకవచ్చి దందా సాగిస్తున్నారు. ట్రాక్టర్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఉచితంగా ఇసుక అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఇసుక కొని ఇళ్లను నిర్మించుకోలేని దుస్థితి సామాన్యులకు ఏర్పడింది. అక్రమ ఇసుక డంపుల వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసినా టీడీపీ నేతల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. -
ప్రజ్వలించిన భక్తి వెలుగులు
బనగానపల్లె రూరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నందవరం చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం కనులపండువగా సాగింది. చౌడేశ్వరిదేవి రాయబారాది వసంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన కార్యక్రమం సోమవారం ఉదయం ముగిసింది. ముందుగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భాస్కరయ్య ఆచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన తొగట వీర క్షత్రియులు, అమ్మవారి భక్తులు ముందుగానే గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణానికి చేరుకు న్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నెయ్యి, గోధమ పిండి, వివిధ సుగంధ ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసుకొని వెలిగించుకొని తలపై పెట్టుకొని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గీతాలు ఆలపిస్తూ, మేళ తాళాలతో చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై మొదట సర్కార్ జ్యోతితో భక్తులు నడిచిన తరువాత మిగిలిన భక్తులు వరుసగా నిప్పులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది దాదాపు 545 జ్యోతులతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం అమ్మ వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బనగానపల్లె, నంద్యాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీస్లు ఏర్పాటు చేశారు. దేవస్థానంతో పాటు పలు అన్నదాన సంస్థలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి, అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, భూపాలుడు, కల్పన ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం 545 జ్యోతులతో ఊరేగింపు ఆకట్టుకున్న తొగట వీరక్షత్రియుల నృత్యాలు జ్యోతులను తిలకించేదుకు తరలివచ్చిన భక్తజనం -
గుడిసె దగ్ధం
● రూ.6 లక్షల ఆస్తి నష్టం గోనెగండ్ల: వేముగోడు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ఓ గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నా రు. అయితే వెంకటేష్ ఉపాధి నిమి త్తం కుటుంబంతో కలిసి గత ఆరు నెలలుగా కర్నూలులో నివాసముంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవారు. సోమవారం తెల్లవారు జామున అతని గుడిసె దగ్ధమైంది. బీరువాలో భద్రపరిచిన రూ.2 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, పది ప్యాకెట్ల బియ్యం, వంట సామగ్రితో పాటు బట్టలు ఇతర వస్తువులు కాలిపోయాయని, దీంతో మొత్తం దాదాపు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పు పెట్టాటని ఆరోపిస్తున్నాడు. గుడిసెకు నిప్పంటించిన వ్యక్తిపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెంకటేష్ తెలిపారు. నాపరాళ్ల ట్రాక్టర్ బోల్తా ● బండలు మీద పడి వ్యక్తి దుర్మరణం కృష్ణగిరి: ఎరుకల చెరువు గ్రామ సమీపంలో సోమవారం ఉద యం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన బురిడి ప్రసాద్(32), బి. మధు కలసి ఆర్డర్పై ఎరుకలచెరువు, పి. కోటకొండ గ్రామాలకు నాప రాళ్ల బండలను ట్రాక్టర్లో తరలిస్తున్నారు. మార్గమధ్యలో ఎరుకల చెరువుకు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీపై పడుకున్న బుడిగి ప్రసాద్ నాపరాళ్ల బండల కింద పడిపోయాడు. రహదారి వెంట గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జేసీబీతో నాప రాళ్ల బండలను తొలగించారు. అప్పటికే ప్రసాద్ మృతి చెందా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి సీహెచ్సీ మార్చురీకి తరలించారు. మృతుని భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల పోలీస్స్టేషన్లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్వరరెడ్డి, రాంబాబు సోమవారం ఉదయం నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల బందోబస్తుకు బైక్పై కోవెలకుంట్ల మీదుగా బయలుదేరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు ముదిరెడ్డి సుబ్బారెడ్డి కారును వేగంగా నడుపుతూ మండలంలోని పొట్టిపాడు మెట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డికి కాలు విరగగా, రాంబాబు తలకు గాయాలయ్యాయి. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆదోని పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు
ఆదోని సెంట్రల్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ (ఎన్బీఏ) న్యూఢిల్లీ సంస్థ నుంచి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. చిన్నపురెడ్డి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయి నిపుణుల బృందం గత ఏడాది డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు కళాశాలను సందర్శించారన్నారు. విద్యా ప్రమాణాలు, బోధన విధానాలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు మొదలగు వాటిని సమగ్రంగా పరిశీలించారని తెలిపారు. అనంతరం డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సుకు 2026 జనవరి నుంచి 2028 డిసెంబర్ వరకు ఎన్బీఏ సంస్థ అక్రిడేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో విద్యార్థులు, అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. -
హత్య చేసి.. శవానికి నిప్పంటించిశ్రీ
● గుర్తు తెలియని యువకుడి దారుణహత్య ఎమ్మిగనూరురూరల్: కలుగొట్ల పంచాయతీ పరిధిలోని పొలంలో గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట గ్రామానికి వెళ్లే దారిలోని శ్రీ మహలక్ష్మీ పత్తి జిన్నింగ్ మిల్లు ఎదురుగా ఉండే ఓ రైతు పొలంలో గుర్తు తెలియని 30 ఏళ్ల యువకుడిని చంపేసి, మృతదేహం కాళ్లు చేతులు కట్టేసి, దుప్పటిలో చుట్టి మొక్కజొన్న పొలం దగ్గరకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువకుడి ముఖం సగం వరకు కాలిపోయి ఉంది. కుడి చేతికి ఉంగం, ఎడమ చేతికి వాచ్, మె డలో పూసలదండ ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎీస్పీ ముర్రవాడ భార్గవి, రూరల్, టౌన్ సీఐలు చిరంజీవి, శ్రీనివాసులు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డిలు పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి 48 గంటలు అయివుండవచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లైయితే డీఎస్పీ 9121101109, రూరల్ సీఐ 9121101146కు సమాచారం ఇవ్వాలన్నారు. -
పంటలు ఎండుతున్నాయ్.. కాపాడండి!
● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్కు విన్నవించిన రైతులు పగిడ్యాల: ‘పంటలు ఎండిపోతున్నాయ్.. కాపాడండి’ అంటూ సోమవారం జిల్లపాడు, శాతనకోట, సుల్తానాపురం, మల్యాల గ్రామాల రైతులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్ను ఆశ్రయించి మొరపెట్టారు. ఎత్తిపోతల నీరు తమ పొలాలకు రావాలంటే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ చేయా లని అభ్యర్థించారు. రెండు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా ఎత్తిపోసే నీరంతా దిగువకు వెళ్తున్నాయని ఎగువ తూములకు పారడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సాగునీరు రాకపోతే పంట చేతికి రాదని డీఈకి వివరించారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ.. 0 నుంచి 120 కి.మీ. వరకు కేసీ కాలువ వెంట తనిఖీ చేస్తున్నామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆన్లైన్లోనే వాహన రిజిస్ట్రేషన్ నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లోనే సాగుతుందని జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వాహన కొనుగోలు దారులు ప్రభుత్వం ఇచ్చిన రసీదును తీసుకొని, అందులో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలన్నారు. టెంపర్వరీ రిజిస్ట్రేషన్ ఫీజు, పర్మినెంట్ ఫీజు, పోస్టల్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు, రోడ్డు సేఫ్టీ, సర్వీస్, నంబర్ ప్లేట్ ఫీజులు వాహనాన్ని బట్టి మారుతాయన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలని షోరూం యజమానులు చెప్పిన మాటలు నమ్మవద్దని సూచించారు. నాటుకోళ్లు మృత్యవాత ఎమ్మిగనూరుసెంట్రల్: బోడబండ గ్రామంలో పైరాజ్యం తిక్కయ్యకు చెందిన 30 నాటుకోళ్లు, ఉలువ అడవిరాముడుకు చెందిన నాలుగు కోడి పుంజులు, రెండు నాటు కోళ్లు మృత్యవాత పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషపూరిత ఆహారం పెట్టడంతో నాటుకోళ్లు మృత్యవాత పడ్డాయని వారు ఆరోపించారు. దాదాపు రూ. 30 వేలు నష్టపోయామని బాధితులు తెలిపారు. -
మల్లన్న సేవలో సినీ హీరో శ్రీకాంత్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకున్న సినీ హీరో శ్రీకాంత్ దంపతులు ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్ద సినీ హీరో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామి వారి శేషావస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. సినీ హీరో శ్రీకాంత్తో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు. పత్తిలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు ఎమ్మిగనూరుసెంట్రల్: పత్తి సాగులో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సీఐసీఆర్ ఫార్మర్ డైరెక్టర్ ప్రసాద్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు శివనారాయణ, సహాయ పరిశోధన సంచాలకులు జాన్సన్, కెవీకె సమన్వయకర్త రాఘవేంద్రచౌదరి, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం బనవాసి కృషి విజ్ఞానకేంద్రంలో జిల్లాలో స్థిరమైన పత్తి ఉత్పత్తిపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న ధోరణులు, సరఫరా సమస్యలను అధిగమించాలంటే నాణ్యమైన పత్తి ఉత్పత్తి ద్వారానే సాధ్యమన్నారు. స్థిరమైన పత్తి ఉత్పత్తి కోసం అధిక సాంధ్రత పద్ధతి, సమగ్ర పోషక నిర్వహణ, దగ్గరగా విత్తుకునే పద్ధతి, సమగ్ర పురుగు నిర్వహణ వంటి సాంకేతిక పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. యువకుడి దుర్మరణం గోనెగండ్ల: వేముగోడు గ్రామంలో జరిగిన ఓ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు అందించిన సమాచారం మేరకు.. వేముగోడు గ్రామానికి చెందిన రవి ప్రకాష్ రెడ్డి అనే రైతు తన పొలంలో బావి తవ్విస్తున్నాడు. పనులు చేపట్టిన క్రాంటాక్టర్ ఎక్స్క్టవేటర్తో బావి తవ్విస్తూ మట్టిని ట్రాక్టర్తో బయటకు తరలిస్తున్నాడు, సాధిక్ బాషా(16) అనే యువకుడు ట్రాక్టర్ పనికి వచ్చాడు. ట్రాక్టర్లో మట్టి వేసుకొని వెళ్తుండగా ఇంజన్, ట్రాలీకి మధ్య ఉన్న ఇనుప రాడ్ విరిగి పోవడంతో ట్రాలీ వేగంగా వచ్చి అక్కడే ఉన్న షాదిక్కు తగిలింది. దీంతో అతను తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి మాబాషా ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
పండగ వేళ ప్రయాణ ఇక్కట్లు
ఉగాది, రంజాన్ పండగలు ముగియటంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పండగ రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆదివారం బస్టాండ్లో కర్నూలు, ఆదోని ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులకు బస్సులు లేక గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఒక వైపు ఎండ వేడిమి లెక్క చేయకుండా బస్సుల కోసం రోడ్డుపైకి వచ్చి వేచి ఉండాల్సి వచ్చింది. బస్సు వచ్చినా సీటు కోసం మహిళలు, పురుషులు, పరుగులు పెడుతూ కనిపించారు. పలువురు అధికారులపై మండిపడ్డారు. ఊర్లకు ఎలా అంటూ వాపోయారు. – ఎమ్మిగనూరురూరల్కర్నూలు బస్సు ఎక్కేందుకు తోసుకుంటున్న ప్రయాణికులుసీటు కోసం ప్రయాణికుల పాట్లు -
ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం
ఓర్వకల్లు: మెకానిక్ వద్దకు తీసుకొచ్చిన 18 బైకులు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఓర్వకల్లులోని ఓ మెకానిక్ షెడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. తిప్పాయపల్లె గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓర్వకల్లు బస్టాండ్ సమీపాన మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చి, రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఓ బైక్ నుంచి మంటలు వ్యాపించి మొత్తం 18 దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. సమీపంలోని ట్యాంకర్ ద్వారా నీటితో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. దుండగుల దుశ్చర్య అనే విషయాలు తెలియరాలేదు. పొగాకు రైతు మృతి ఓర్వకల్లు: పండించిన పొగాను కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గుండెపోటుతో రైతు షఫీఖాన్(55) మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో ఆది వారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షఫీఖాన్ అనే వ్యక్తి గ్రామంలో కొందరి రైతుల వద్ద 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 10 ఎకరాల్లో పొగాకు సాగుచేశాడు. ఈ ఏడాది పొగాకు బాగా అమ్ముడు పోతుందని, అప్పులు తీరిపోతాయని ఆశించాడు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, పొగాకు కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయానికి, వివిధ అవసరాలకు రూ.10 లక్షలు అప్పుచేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య నజిమాబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. రీసర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): రీసర్వేతో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. సీఆర్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రీసర్వే తప్పులను సరిచేసుకోవడానికి అన్నదాతలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. చాలా చోట్లా విస్తీర్ణాన్ని ఎక్కువ, తక్కువ చేసి చూపుతున్నారని, ఇలా ఎందుకు జరిగిందో కూడా అధికారులు సరైన సమాధానాలు చెప్పడంలేదన్నారు. ముఖ్య ంగా జాయింట్ ఎల్పీఎంలు, ఇనామ్ భూమల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం అన్నదాతలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే పోరాటాలకు పిలుపునిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, బి.శ్రీనివాసరావు, మహేష్ పాల్గొన్నారు. -
సంగమేశ్వరంలో పారిశుద్ధ్య పనులు
కొత్తపల్లి: జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయంలో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టారు. ట్రాక్టర్ డోజర్తో బురదను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఆలయంలోని బురద నీటిని మోటర్ల ద్వారా బయట కు పంపింగ్ చేశారు. గర్భాలంయలో బురద తొలగించి పూర్తిస్థాయిలో సంగమేశ్వరుడిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తామని పురోహితుడు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య ఆదోని రూరల్: బైచిగేరి గ్రామానికి చెందిన చాకలి వీర హుసేని(25) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చాకలి శాంతితో ఏడేళ్ల క్రితం వీర హుసేనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తతో, మామ తిక్కన్న, అత్త రాములమ్మతో గొడవపడిన శాంతి మూడేళ్లుగా కాపురానికి రాకుండా దూరంగా ఉంది. పెద్దలు పలుమార్లు పంచాయతీ చేయగా కాపురానికి రాకపోవడంతో భర్త చాకలి వీర ఉసేని మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉన్న తీర్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
25న హుండీల లెక్కింపు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25న హుండీల్లో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు మధ్య హుండీలను తెరిచి లెక్కిస్తామని చెప్పారు. కుందూలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం జమ్మలమడుగు రూరల్: పెద్దముడియంలోని కుందూ నదిలో శనివారం గల్లంతైన గొడుగు సురేష్ (41) మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన గొడుగు సురేష్ అనే వ్యక్తి పెద్దముడియంలో జరుగుతున్న ఎడ్ల పోటీలను తిలకించడానికి శనివారం వచ్చాడు. మధ్యలో కుందూ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా అతని జాడ కనిపించలేదు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పెద్దముడియం పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన బోయ శ్రీనివాసులు (36) కోడుమూరుకు చెందిన మంజులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిమీద శ్రీనివాసులు బైక్పై వెంకటగిరి గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో అల్లినగరం గ్రామానికి చెందిన బోయ గిరి తన ఆటోలో కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కోడుమూరు శివారులో ప్రమాదవశాత్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు తరలిస్తుండగా బోయ శ్రీనివాసులు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధికి రాజకీయ గ్రహణం
డోన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. కనీసం గత ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కూడా ముందుకు రావడం లేదు. రాజకీయ కక్షతో పట్టణంలో దాదాపు రూ. 3 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులు అలంకార ప్రాయంగా మారాయి. టీడీపీ నేతల మధ్య విభేదాలతో అధికారులు చేతులు కట్టుకుని చోద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న పనులతో పలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా మాకేందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రీడలతో పాటు టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయల వ్యయంతో పార్కులు, రెస్టారెంట్లు, రహదారులను నిర్మించింది. డోన్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్యాపిలి మండలం వెంగలాంపల్లె, డోన్ మండలం వెంకటాపురం తుమ్మలచెరువు ప్రాంతాలను టూరిజం, బోటు షికారు కేంద్రాలుగా, ప్యాపిలి మండలం బోయ వాండ్లపల్లె వాల్మీకి గుహలు, బేతంచెర్ల మండలం ఎర్రజ్వాల గుహలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టణ శివారులో నగరవనం, నియోజకవర్గంలో పచ్చదనం ఉట్టిపడేట్లు పది పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే డోన్ రైల్వేస్టేషన్కు వెళ్లే బుగ్గన శేషారెడ్డి మార్గ్లో రూ.3 కోట్లతో క్లబ్హౌస్ను నిర్మించారు. అత్యంత ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ క్లబ్హౌస్లో మినీ ఫంక్షన్హాల్, రెస్టారెంట్, క్యారమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడేందుకు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివక్ష చూపుతుండటంతో వీటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.3 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు కుట్ర.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వెచ్చించిన ఈ క్లబ్హౌస్ నిర్వహణను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసమే విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికార పార్టీలోని రెండు వర్గాలు ఈ క్లబ్హౌస్ నిర్వహణ కోసం పోటీపడుతుండటంతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో రూ. 3 కోట్ల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. అధికార పార్టీ నేతల తీరును చూసి ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో నిర్మించిన క్లబ్హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను డోన్ యూనియన్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని భావించాం. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పోటీ పడుతుండటం దుర్మార్గమైన చర్య. ప్రజల ఆశయాల మేరకు మాజీ మంత్రి బుగ్గన సహకారంతో నిర్మించిన ఈ భవనాలను త్వరలోనే ప్రారంభించాలి. – సప్తశైల రాజేష్, మున్సిపల్ మాజీ చైర్మన్, డోన్ వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటకం, పట్టణాభివృద్ధి పనులు రెస్టారెంట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మినీ ఫంక్షన్హాల్ నిర్మాణం చిన్న చిన్న పనులతో ప్రారంభోత్సవానికి సిద్ధం టీడీపీ నేతల విభేదాలతో జాప్యం చేస్తున్న అధికారులు రెండేళ్లు గడుస్తున్నా నిరుపయోగం -
నిధులు నిలిపివేయడం అన్యాయం
గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం క్లబ్హౌస్లో ఫర్ని చర్, జిమ్, స్నూకర్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పరికరాల కొనుగోలుకు రూ.18 లక్షలను మంజూరు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపును అన్యాయంగా నిలిపేసింది. దీంతో క్రీడాకారులకు, చిన్నారులకు క్లబ్హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కరకు రాని చుట్టంగా మిగిలిపోయింది. – పోసు్ట్రపసాద్, వైఎస్సార్సీపీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వం స్పోర్ట్స్ క్లబ్, క్లబ్హౌస్ను కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వీటిని ప్రారంభించకపోవడం ముమ్మాటికీ రాజకీయ కక్షగానే ప్రజలు చూస్తు న్నారు. ప్రజోపకరమైన అభివృద్ధి పనులను వినియోగంలోకి తెస్తే బాగుంటుంది. – జాకీర్హుసేన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, డోన్ డోన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు చేశారు. పూర్తయిన వాటిని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించలేదంటే ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షగా భావిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన విధానాలను మానుకొని సత్వరమే ప్రజలకు ఈ భవనాలను అందుబాటులోకి తేవాలి. లేదంటే క్రీడాకారులతో పాటు పట్టణ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. – రంగనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, డోన్ -
మీకోసం ‘కరువు’ మాట!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్నది కరువు కాలం.. వర్షాలు పడే పరిస్థితి లేదు.. ముందుగానే హెచ్చరిస్తున్నాం.. కరువు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఈ మాటలు రైతులకు చెప్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రైతన్న మీకోసం అంటూ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి ఆగష్టు వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులతో చెప్పిస్తోంది. ఇందు కోసం కరపత్రాలను సైతం ముద్రించి రైతులకు అందిస్తోంది. ‘మేం ముందుగానే హెచ్చరిస్తున్నాం.. కరువు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆదుకోవాలంటే సాధ్యం కాదని’ హెచ్చరిస్తోంది. ‘పంచమ’ వంచన రైతన్న– మీకోసం కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో 16, 17, 18 తేదీల్లో తూతూమంత్రంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని 410 రైతుసేవా కేంద్రాల పరిధిలో రోజుకు 90 ఇళ్ల(అంటే 30 క్లస్టర్లు)ను సందర్శించాల్సి ఉంది. రైతులతో వ్యవసాయ సిబ్బంది చర్చించాల్సి ఉంది. అయితే వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు రైతులకు చంద్రబాబు సందేశం ఉన్న కరపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగడం వరకే పరిమితం అయ్యారు. ఉగాది, రంజాన్ ఆదివారం సెలవులు కారణంగా 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులు అధికారులకు విరామం వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి పంచ సూత్రాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఉత్పన్నమయ్యే కరువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలియచెప్పేందుకే ఈ కార్యక్రమమని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. వ్యవసాయానికి గడ్డుకాలమే! ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవచ్చు అని రైతులకు కొందరు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్లో విత్తనం వేసుకోవడం ఆలస్యం అవుతుందని, పంటకాలం మారిపోయి దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో నేలలోని తేమను త్వరగా ఆవిరై మొక్కలు ఎండిపోయి పచ్చదనం అంతరించి పోతుందని హెచ్చరిస్తున్నారు. కరువు వస్తే ప్రాజెక్టుల్లో నీటిమట్టం అడుగంటిపోతుంది. చెరువుల్లో చుక్క నీరు ఉండదు. వర్షాధార పంటలకే కాదు... నీటి ఆధారిత పంటలైన వరి సాగుకు గడ్డుకాలం ఏర్పడుతుందని రైతులు పెదవి విరుస్తున్నారు. రైతుల అనుమానాలు ఇవీ.. కరువు వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోందని, అయితే అందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంచినీటికి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు జిల్లాలో చెరువులను నింపలేదని గర్తుచేసుకుంటున్నారు. కరువు వస్తే 75 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తామని హామీ ఇవ్వడం లేదని, రైతులకు విరివిగా సాయం అందిస్తామని మాట రావడం లేదని, ఇవేం సమావేశాలు అని విమర్శిస్తున్నారు. నిరసనలు.. నిలదీతలుచంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా రైతుల కోసం చేసింది ఏమీ లేదు. 2024–25లో అన్నదాత సుఖీభవ ఎత్తేసి 2025–26లో అరకొరగా అమలు చేసింది. మొంథా తుపాన్ వచ్చి పంటలు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. ఇటీవల రైతుభరోసా కింద సాయం అందించినా కౌలు రైతులను పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిపొందిన వారిలో 21,841 మంది రైతులకు మొండిచెయ్యి చూపారు. ‘మేం అసైన్డ్ భూములను అనుభవిస్తున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల రైతుభరోసా ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు’ అని టీడీపీ నేతలు, అధికారులను పలుచోట్ల మహిళలు నిలదీశారు. మొక్కజొన్న, సజ్జ, కొర్ర, ఉల్లి, వేరుశనగ, మినుము ఇలా అన్ని పంటలకు ధరలు లేవని, ఏం చేస్తున్నారని కొందరు రైతులు నిరసన తెలిపారు. మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేసిన దాఖలాలే లేవని మండిపడ్డారు. వచ్చే ఖరీఫ్లోనూ యూరియా కోసం కష్టాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రైతన్న– మీకోసంలో అధికారుల కొత్త పల్లవి ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందస్తు హెచ్చరిక వర్షాలు పడవని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాల నిర్వహణ -
బీజేపీ అధ్యక్షులపై చర్యలు తీసుకోవాలి
ఆదోని అర్బన్: మోసానికి పాల్పడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి, అవని గోల్డ్ ఎండీ వెంకటేశ్వర్లుపై జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు రాంబట్ల ప్రశాంత్ కోరారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవని గోల్డ్ ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయని, అందులో 160 ఎకరాలను 2013లోనే అమ్మేశారని తెలిపారు. అవని గోల్డ్ భూములను ఇప్పిస్తానని తన వద్ద ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు రూ. 25 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు అవని గోల్డ్ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీ, డైరెక్టర్లు తనకు అగ్రిమెంటు రాసిచ్చారని వివరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి 50 ఎకరాలు అడిగారని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తాను విచారణ చేయగా 2013లోనే అవని గోల్డ్ భూములన్నీ అమ్మేశారని, వారిని నిలదీయడంతో ఈరోజు.. రేపు అని కాలయాపన చేస్తూ తనను మోసం చేశారన్నారు. ఈ మేరకు కేసు పెట్టానని తెలిపారు. ఈనెల 9వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఈనెల 18వ తేదీన ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు, అవినీగోల్డ్ సంస్థ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదు అయిందన్నారు. -
ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌల వివరాలు సేకరించాలి
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): గ్యాస్నకు ప్రత్యామ్నాయంగా సోలార్, ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు, ఏజెన్సీల వివరాలు, అవసరమయ్యే బడ్జెట్ వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఇందుకోసం అవసరమైన పవర్ పాయింట్ప్రజెంటేషన్ను సిద్ధం చేయాలన్నారు. ఆదివారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి గ్యాస్ సరఫరా, కొరత, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్, జిల్లా అధికారలతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సరఫరా, కొరత పరిస్థితి, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జేసీ నూరుల్ ఖమర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..జిల్లాలో సోలార్, ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌల సరఫరా ఏమాత్రం ఉందని, హైదరాబాద్, బెంగళూరులలో ఉన్న కంపెనీలు, వాటి తయారీ సామర్థ్యం వివరాలను సేకరించాలని కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజను ఆదేశించారు. గ్యాస్ సరఫరా కంటే ముందు కిరోసిన్ను వంట ఇంధనం కోసం వాడేవారని, అందుకు సంబంధించిన కిరోసిన్ స్టౌల డేటా కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. క్వింటా వేరుశనగ రూ.8,070 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 2,348 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.8,070 ధర పలికిందని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ.3,481, మధ్యస్థ ధర క్వింటా రూ.6,970 పలికినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆముదాలు 121 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,483, గరిష్ట ధర రూ.5,974, కందులు 8 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో క్వింటా కనిష్ట ధర రూ.4,230, గరిష్ట ధర రూ.6,720 పలికింది. -
డిస్కౌంట్ పేరుతో వల
తమ దుకాణంలో మెడిసిన్పై 20 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇటీవల కొన్ని మందుల దుకాణాలు బాహాటంగానే ప్రకటించుకుంటున్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ దుకాణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చోట్ల మందులు కొన్న వినియోగదారులు నేరుగా ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడిగి మరీ మందులు కొంటున్నారు. వాస్తవంగా బ్రాండెడ్ మందులపై రిటైల్ విక్రయదారులకు 18 శాతం వరకు మార్జిన్ ఉంటుంది. మరికొన్నింటిపై ఆఫర్ల మేరకు ఇంకా కొద్దిమేరకు ఎక్కువ లాభాలు వస్తాయి. కానీ జనరిక్, ప్రాపగండ కమ్ డిస్ట్రిబ్యూషన్(పీసీడీ) మందులపై రిటైలర్లకు 50 నుంచి 70శాతం వరకు లాభాలు ఉంటాయి. ఈ లాభాలను వినియోగదారులకు ఆయా దుకాణాలు ఇవ్వాల్సి ఉన్నా అధిక శాతం దుకాణాలు ఇవ్వడం లేదు. అడిగిన వారికి మాత్రం 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. అధిక శాతం దుకాణాలు వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్పై ఉన్న మందులు గాకుండా మా వద్ద ఉన్న మందులు కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందంటూ రోగులను నమ్మించి మరీ అంటగడుతున్నాయి. ఆయా మందులపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చినా అదనంగా 50 శాతం దుకాణదారులకు లాభం మిగులుతుంది. ఈ కారణంగా పీసీడీ మందులను అధికంగా విక్రయిస్తూ భారీగా డిస్కౌంట్లు ప్రకటించి వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయమై డ్రగ్ కంట్రోల్ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర విక్రయిస్తేనే చర్యలు ఉంటాయి గానీ తక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పి ఊరుకుంటున్నారు. -
డిమాండ్కు సరిపడేంత సరఫరా
జిల్లాలో తగినన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల సిలిండర్లు నిల్వ ఉన్నాయి. వీటికి అదనంగా మరో 7 వేల సిలిండర్లు వచ్చాయి. ప్రతిరోజు సగటున సుమారు 10 వేల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. – నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు -
ఏమాత్రం బెధరకుండా!
● కర్నూలుకు చెందిన శ్రీనివాసులు ఇటీవల పెద్దాసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ మందుల దుకాణంలో ఐవీ కిట్ను కొనుగోలు చేశాడు. 20 శాతం డిస్కౌంట్ ఇచ్చి రూ.329 బిల్లు వేశారు. వీటి విలువ గురించి తెలిసిన అతను వెనక్కి ఇచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరిక్ మందుల దుకాణంలో వాటిని కొనుగోలు చేయగా రూ.70కే ఇచ్చారు. దీనివల్ల అతనికి రూ.250 ఆదా అయ్యింది. శ్రీనివాసులుకు మందుల గురించి తెలుసు కాబట్టి మోసపోలేదు. .. అయితే జిల్లాలో మందుల వ్యాపారం గురించి తెలియక డిస్కౌంట్ పేరుతో రోజూ వేలాది మంది మోసపోతున్నారు. ఆఫర్ పేరిట అ‘ధనం’ వసూలు! ఆశ చూపి ముంచేస్తున్న మందులోళ్లు పీడీసీ మందులే అధికం బ్రాండెడ్ కంటే వీటి ధరలు ఎక్కువ మోసపోతున్న వినియోగదారులు -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ఆదివారం ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీలో ఏర్పాటు చేసి క్యాంపులో అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా ఎంపిక చేసిన వారందరూ రిపోర్ట్ చేసుకున్నారు. కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులు ఏఈ అర్డర్లు పొందిన వారిలో అత్యధిక శాతం మంది మొదటి రోజు క్యాంపులో రిపోర్ట్ చేయలేదు. మొదటి రోజు కావడం రిపోర్ట్ చేసుకునేందుకు కొంత ఆలస్యమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన క్యాంపును ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి జి.లాలెప్ప పరిశీలించారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్యూలో డ్రోన్ టెక్నాలజీపై అవగాహన ● నేటి నుంచి 27 వరకు నిర్వహణ కర్నూలు కల్చరల్: ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎమ్ కర్నూలు సంయుక్త భాగస్వామ్యంతో రాయలసీమ యూనివర్సిటీలో సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలపలప్మెంట్ పోగ్రామ్ను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం సమన్వయకర్త ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ తెలిపారు. వర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు మార్గదర్శకాల ప్రకారం వర్సిటీలో కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎమ్ కర్నూలుకు చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు డ్రెన్ టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఇందులో పాల్గొనే గిరిజన యువతకు రిజిస్ట్రేషన్ ఫీజులో పూర్తి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీడీఎమ్ కర్నూలుకు చెందిన కృష్ణనాయక్, డాక్టర్ రవికుమార్లు సదస్సు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమనీయం.. కల్యాణోత్సవం ఆస్పరి: పిడకల సమరం అనంతరం కై రుప్పలలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్ర స్వామి, కాళికాదేవి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో గంగపూజ, ప్రభాత సేవ, అభిషేకాలు, హోమం, ప్రత్యేక పూజలు చేశారు. కాళికాదేవి, వీరభద్రస్వామి, పార్వతీ సమేత పరమేశ్వరున్ని పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామంలో సోమవారం సాయంత్రం మహా రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నదాన పథకానికి విరాళాలు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తులు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అదివారం కర్నూలుకు చెందిన లక్ష్మయ్య అన్న ప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 విరాళాన్ని ఏ ఈ ఓ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అలాగే శ్రీకాళహస్తికి చెందిన కె . వెంకట సుబ్బారెడ్డి అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 విరాళాలను పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు. -
శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ ను సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. పది గడ్డివాములు దగ్ధం హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు. మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. -
సంగమేశ్వరుడి పూజకు వేళాయె!
ఆలయానికి బురదలోనే వెళ్తున్న భక్తులుకొత్తపల్లి: శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో వెలిసిన ప్రాచీన సంగమేశ్వరుడు జలాధివాసం వీడారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం బయటపడింది. ఆలయంలో చుట్టూ ఒండ్రు బురద పేరుకుపోయింది. గర్భగుడిలో, ఆలయ ముఖమండపంలో బురద నీటితో నిండి ఉంది. అయినా శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాచీన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. బురదలోనే ఒకరి వెంట ఒకరు నడుస్తూ ప్రాచీన ఆలయానికి వెళ్లి స్వామికి పూజలు చేశారు. చుట్టూ నీరు మధ్యలో సంగమేశ్వరాలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. పండుగ సెలవులు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఉంది. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివ లింగానికి, లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయం చుట్టూ బురద, రాళ్లు, రప్పలు ఉన్నాయని, ప్రమాదానికి ఆస్కారముందని, అంతా శుభ్రం చేసే వరకు ఆలయం లోపలికి ఎవరూ రావద్దని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. -
హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడటం చంద్రబాబు విజన్కు అద్దం పడుతుందోని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలే అజెండాగా పని చేస్తున్నారని విమర్శించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రెండేళ్లగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్ర బాబు కనీసం స్పందించండం లేదన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు దోచుకోవడం, వారు అభివృద్ధి చెందడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి పోరాటం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. గత ఖరీఫ్లో ప్రారంభమైన యురియా సమస్య నేటికీ తీర లేదన్నారు. ఇప్పటికీ రైతులు యురియాను బ్లాక్లో కొంటున్నారంటే దానికి చంద్రబాబు విజనే కారణమన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చేప్పుకునే చంద్రబాబు ఎక్కడ ఇచ్చారో అధికారికంగా విడుదల చేయాలన్నారు. కేవలం అనుబంధ సంస్థలకు, బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టి రాస్ట్రాలన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు తప్ప టీడీపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, కృష్ణారెడ్డి, వైఎస్సాపీపీ రాష్ట ప్రచార వింగ్ సెక్రటరీ బాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెల్డింగ్ చాంద్, పిన్నాపురం సర్పంచ్ ఎల్లకృష్ణయ్య, నాయకులు బాబి, మున్నా, స్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణం
ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్మెంట్స్కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్మెంట్స్ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. మద్యం మత్తులో చెరువులోకి దిగి.. ● కంబాలపాడు చెరువులో మునిగి డోన్ వాసి మృతి కృష్ణగిరి: అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి సమీపంలోని చెరువులోకి ఈతకు దిగి మృత్యుఒడిలోకి చేరిన ఘటన మండలంలోని కంబాలపాడు గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణంలోని చిగురుమాను పేటకు చెందిన ఎరుకల రాజేష్ (25) శనివారం ఉదయం మద్యం సేవించి తమ ఇంటి దైవమైన కంబాలపాడు చెరువు కట్టపై ఉన్న గంగమ్మకు మొక్కు తీర్చుకునేందుకు కోడిపుంజుతో స్నేహితులు ఎరుకల సతీష్, ఎరుకల మల్లికార్జున, ఎరుకల ఆశోక్తోపాటు మరికొందరితో ఆలయం చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి వంట చేసుకుంటున్న సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. మద్యం మత్తులో ఉన్న రాజేష్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గాలించి బయటకు తీసుకొచ్చి డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా..మృతుడికి భార్య ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
అల్లాహు అక్బర్
కర్నూలు సంతోష్నగర్ ఈద్గాలో నమాజ్ చేస్తున్న ముస్లింలురంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ‘అల్లాహు అక్బర్... లా ఇలాహ్ ఇల్లల్లా’ అంటూ తక్బీర్ చదువుకుంటూ ఈద్గాలకు చేరుకున్నారు. ఈద్గాలకు వెళ్లలేని వారు మసీదులకు వెళ్లి నమాజ్ చేశారు. ఈద్గా, మసీదుల్లో నమాజ్ చేయించిన ఖాజీలు, మౌల్వీల ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేశారు. సర్వ మానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్ను వేడుకున్నారు. నమాజ్, దువా అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం పండుగ రావడంతో శుభాలు జరగాలని కోరుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం మున్ముందు కొనసాగించాలని మతపెద్దలు సూచించారు. ిముస్లింలు, హిందువులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.దువా చేస్తున్న యువకుడు -
వైభవంగా రాయబార మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. జిల్లెల గ్రామరస్తాలో ఉన్న అమ్మవారి పొలిమేర కుంట వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. రాయబార మహోత్సవంలో పాల్గొన్న భక్తులు -
ఫలించిన ఎస్పీ వ్యూహం
● ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం ● అర్ధరాత్రిలోపే దోర్నాల, మున్ననూరు చెక్పోస్టులు దాటిన వేలాది వాహనాలు శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం రథోత్సవం అనంతరం ట్రాఫిక్ జామ్ లేకుండా తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేక వ్యూహంతో పోలీసులు వాహనాల క్రమబద్ధీకరణలో ఈ ఏడాది పట్టు సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ఉగాదికి అధిక సంఖ్యలో శ్రీశైలంకు వాహనాలు చేరుకున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 6 వేలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు, టూరిస్ట్ బస్సులు, 15 వేలకు పైగా ఫోర్ వీలర్స్ వచ్చినట్లు అంచనా. ఉత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభమైనప్పటికీ ఈ నెల 10 నుంచే వాహనాల తాకిడి ప్రారంభమైంది. గతంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. బందోబస్తుకు పోలీసుల సంఖ్య పెంచడం, క్షేత్రంలో ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాలను గుర్తించి అక్కడ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం, డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ను పర్యవేక్షించడం, కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు జారీ చేయడం, బ్లూ కోర్టు సిబ్బంది నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండటం వంటి చర్యలు చేపట్టారు. రథోత్సవం రోజు గురువారం ఎస్పీ క్షేత్ర స్థాయిలో బ్లూ కోర్టు వాహనంలో క్షేత్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఆ సమయంలో అటు మున్ననూరు, ఇటు దోర్నాల చెక్పోస్టు నుంచి ఒక్క వాహనం కూడా శ్రీశైలం వైపు రాకుండా అడ్డుకున్నారు. గతంలో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో నిర్వహించే రథోత్సవం అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావాలంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు అయ్యేది. అలాంటిది ప్రస్తుతం ఎస్పీ ట్రాఫిక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శ్రీశైలంలో ఉన్న అన్ని పార్కింగ్ ప్రదేశాలు రాత్రి 9.30 గంటలకే దాదాపు ఖాళీ అయ్యాయి. ఘాట్ రోడ్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా రాత్రి 11.30 గంటలకు అన్ని వాహనాలు దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టులను దాటాయని ఎస్పీ ధ్రువీకరించుకుని గెస్ట్హౌస్కు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
కేసీ రైతుల ఆందోళన
● ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్ నందికొట్కూరు: పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీటి సరఫరా నిలిపేస్తే ఎలా అంటూ కేసీ ఆయకట్టు రైతులు అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద మల్యాల, శాతనకోట రైతులు ఆందోళన చేపట్టారు. ఓ వైపు హంద్రీ నీవాకు నీటిని విడుదల చేస్తున్నా అధికారులు కేసీ కెనాల్కు ఎందుకు నిలుపుదల చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందన్నారు. కేసీ కెనాల్ కింద మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ పంటలు సాగు చేశామని, మొక్కజొన్న కంకులు గింజ పడుతున్న సమయంలో సాగునీరు వెంటనే అందించకపోతే ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో ఆందోళన చేపడితే రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పి మోసం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సాగు నీరు అందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మల్యాల, శాతనకోట రైతులు గోవిందు, నాగరాజు, షాలు, రషీదు, నరసింహ, అబ్దుల్ రహిమాన్, గోకారి, షేక్షావలి, వెంకటరెడ్డి, చిన్నన్న, మౌలాలి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, బిచ్చన్న, ఆంజనేయులు, శేఖర్, వెంకటేశ్వర్లు, ఠాగూరు నాయక్, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
● కాల్షియం కార్బైడ్ వద్దు ● ఇథిలీన్ వాయువు ఎంతో మేలు ● ఉద్యానశాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): మామిడి.. ఫలాల్లో రారాజు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఏడాది మామిడి పంట తక్కువగా ఉంది. మొదట్లో పూతతో ఊరించిన మామిడి తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులతో 80 శాతంపైగా రాలిపోయింది. మామిడి మార్కెట్లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మామిడిని ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇవీ సూచనలు.. ● కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతుల గురించి రైతులు, వ్యాపారులు తెలుసుకోవాలి. ● ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగిస్తే అటువంటి పండ్లకు డిమాండ్ వస్తుంది. ● ప్రకృతి సిద్ధంగా పండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథలీన్తో మామిడిని మాగించాలి. ఇది రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. ● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టేందుకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. ● అవసరమైతే 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ● మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాల్లో ఉంచాలి. ● పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచితే సహజ సిద్ధంగా మాగుతాయి. ● కార్బైడ్ వాడని పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగులు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. కొంత దూరం వరకు పండ్లు మాగినట్లుగా కమ్మని వాసన వస్తుంది. ● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. ● పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. ఫ్రిజ్లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కార్బైడ్తో మాగిస్తే శిక్ష ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడంతో అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాసీ్త్రయంగా నిర్థారణ అయింది. -
పదవ తరగతి విద్యార్థి దుర్మరణం
కోవెలకుంట్ల:కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లి కార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె మండలం రామతీర్థంకు చెందిన లాజరయ్య కు ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్ద కుమారుడు కిషోర్ (16) బనగానపల్లెలో మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. బంధువుల ఇంటి నుంచి బియ్యం ప్యాకెట్ల తీసుకెళ్లేందుకు వచ్చి ట్రాక్టర్ ఇంజిన్పై కూ ర్చొని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని జ్యోతి స్కూల్ సమీపంలో ప్రమాదశాత్తు ఇంజిన్పై నుంచి జారి కింద పడటంతో ట్రాలీ టైర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి ఈనెల 7వ తేదీన నిర్వహించే కుంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఉద్యో గి కొబ్బరి కాయలు సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు. -
ఇంటర్ వరకూ ఉచితం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. నూతన భవనాలు, విశాలమైన తరగతి గదులు, మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభ కనబరిస్తే సీటు దక్కుతుంది. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల -
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయ్..!
నంద్యాల(న్యూటౌన్): కార్పొరేట్ తరహా వసతులతో ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా ఈనెలాఖరు 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. విద్యార్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్సైట్ను సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం 5వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ఇలా.. దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 01–09– 2014 నుంచి 31–08–2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ తెగల విద్యార్థులు అయితే 01–09–2012 నుంచి 31–08–2016 మధ్య పుట్టిన వారు అర్హులు. మోడల్ స్కూళ్లలో సౌకర్యాలు.. ● నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ● ఆరో తరగతి నుంచి ఇంటర్మీడిమెట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ● విశాల తరగతి గదులు, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య ● నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్ఎంఎంఎస్, ఐఎంఓ, ఐఏప్వో లాంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ● స్పోకెన్ ఇంగ్లిష్, హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక శ్రద్ధ, అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం, ఆధునిక పరికరాలతో కూడిన సైన్స్ ల్యాబ్లు ● ఎల్సీడీ ప్రొజెక్టర్ విద్యా బోధన ● ఇంటర్లో అందుబాటులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ● 9వ తరగతి నుంచి అకాడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష -
గ్యాస్కు బదులు విద్యుత్ స్టౌలు మేలు
కర్నూలు(సెంట్రల్): ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు గ్యాస్కు బదులుగా ఇండక్షన్ లేదంటే విద్యుత్ స్టౌలను వినియోగించేలా అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఎల్పీజీ గ్యాస్ అంశంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ బదులుగా మట్టి, కట్టెల పొయ్యిలువాడొద్దని సూచించారు వాటి ద్వారా మహిళలకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకావం ఉంద న్నారు. అడవులు నరికివేతకు గురికాకుండా ఇండక్షన్, విద్యుత్ స్టౌలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో వాటిని వాడుకోవడం మంచిదన్నారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు అపోహలకు గురై ఎక్కువ మోతాదులో సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారన్నా రు. గతంలో జిల్లాలో ప్రతిరోజు 9 వేల సిలిండర్లు మాత్రమే అవసరం ఉండేదని, ప్రస్తుతం 11వేల సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీ లు సిలిండర్లను దారి మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్లో కమర్షియల్ ట్యాక్స్ జేసీ నీరజ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్, డీఎస్ఓ రాజారఘువీర్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ పాల్గొన్నారు. నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 21న శనివారం నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్ష రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి శుక్రవారం తెలిపారు. అన్ని పరీక్షలు ముగిశాక ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. -
జీడీడీపీ లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): జీడీడీపీ(గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రొడక్ట్)లక్ష్యాల సాధనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీడీపీ లక్ష్యాల సాధనపై శుక్రవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని రెట్టింపు పనితీరు రాబట్టేలా పనిచేయాలన్నారు. జీడీడీపీ లక్ష్యాల సాధన కోసం అన్ని నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకత పెంపు ద్వారా జీడీడీపీ ఉందని తెలిపారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ భారతి, ఐసీడీఎస్పీడీ విజయ, డీసీహెచ్ఎస్ జఫ్రూళ్ల, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి, డీఈఓ సుధాకర్, డీటీఓ రామచంద్రరావు పాల్గొన్నారు. -
ఉగాది మహోత్సవాలకు పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీహోమం జరిపించారు. అనంతరం యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృదం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిపించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని పసుపు, సున్నం, సుగంద ద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. అనంతరం చండీశ్వరస్వామికి ఆలయ మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూల స్నాన కార్యక్రమాలు జరిపించారు. అవభృదంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామికి శుద్ధజలం, పంచామతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళం మొదలైన వాటితో స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రిశూల స్నానం కార్యక్రమంలో భాగంగా మల్లికాగుండం జలాన్ని తలపై ప్రోక్షించడంతో పాపాలన్ని హరించి శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సకల శుభాలు ప్రసాదించే భ్రమరాంబా.. ఉగాది మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీభ్రమరాంబాదేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. అలాగే అశ్వవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల విహారం ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆశీనులను చేయించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. -
అంబరాన్నంటిన మట్టి సంబరం
కల్లూరు: శ్రీ చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అంబరాన్ని అంటాయి. కల్లూరులోని అమ్మవారి ఆలయం వద్ద ఉదయాన్నే జ్యోతుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొక్కుబడులు ఉన్న రైతులు తమ ఎడ్లను రంగులతో, పూలమాలతో అలంకరించుకుని అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. రజకులు తమ గాడిదల (గార్ధభాలను) బండ్లను పూలతో, రంగులతో అలంకరించుకుని డప్పులు, మేళాతాళాలు, డ్రమ్స్, డిజేలతో ఉత్సాహంగా కేరింతలు, నృత్యాలు వేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బురదలో అలంకరించిన ఎడ్లు, గాడిదలతో ప్రదక్షిణలు చేశారు. బురదలో చిన్నారులు, యువకులు ఒంటి నిండి బురద చేసుకుని ఉత్సహంగా వేడుకలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న బురదలో తిరగడం వల్ల చర్మవ్యాధుల నుంచి అమ్మవారు కాపాడతారని భక్తుల విశ్వాసం. ఎద్దులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. సంబరాన్ని తిలకించేందుకు కర్నూలుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
గ్యాస్ కష్టాలు బారులుదీరి
ఇరాన్ యుద్ధం గ్యాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. సిలిండర్ల సరఫరాలో జాప్యమవుతుండటంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు వరుసగా రావడం, ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కొందరికి బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా ఓటీపీ వచ్చిన వారికే సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శిరివెళ్ల గ్యాస్ స్టాక్ పాయింట్ వద్ద వినియోగదారులు సిలిండర్లను క్యూలో ఉంచి తమ వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించారు. సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన తాము గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలో నిలవాల్సి వచ్చిందని వాపోయారు. – శిరివెళ్ల -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరుడు జలాధివాసం వీడుతున్నాడు. 8 నెలలుగా కృష్ణాజలాల్లో ఆలయం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగుల నుంచి 840 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం ప్రాచీన సంగమేశ్వరాలయ ప్రాంగణంలో మోకాలిలోతు నీరు ఉంది. మరో 2 రోజుల్లో ఆలయంలో నీరు పూర్తిగా పోతుందని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. నీరు తగ్గడంతో ప్రాచీ న సంగమేశ్వర గర్భాలయ ద్వారానికి ఆలయ పురోహితుడు ఉగాది పర్వదినం సందర్భంగా మా మిడి తోర ణం కట్టారు. పక్కన ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మోకాలిలోతులో ఉన్న వేపధారు శివలింగానికి కృష్ణాజలాలతో అభిషేకం నిర్వహించి, మంగళహారతి ఇచ్చారు. నీరు మొత్తం ఆలయం నుంచి పోయిన తర్వాత బురద తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పురోహితులు చెప్పారు. -
గ్రామసీమల్లో వ్యవసాయ పనుల సందడి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ పనులు ప్రారంభించడానికి తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని అత్యంత శుభదినంగా అన్నదాతలు భావిస్తారు. దీంతో గురువారం ఉగాదిని పురస్కరించుకొని గ్రామసీమల్లో వ్యవసాయ పనుల సందడి నెలకొంది. పరాభవ నామ సంవత్సరం మొదటి రోజునే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గూడూరు, ఆదోని, దేవనకొండ, వెల్దుర్తి, పెద్దకడుబూరు, సి.బెళగల్, మంత్రాలయం తదితర మండలాల్లో ఉదయమే వృషభాలను నీటితో శుభ్రంగా కడిగి అలంకరించి పొలంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు చేపట్టారు. పరాభవ నామ సంవత్సరంలో కుటుంబంలో ఎవ్వరి పేరుతో బలం బాగుందో పంచాంగం ద్వారా తెలుసుకొని వారి ద్వారా వ్యవసాయ పనులు మొదలుపెట్టడం విశేషం. పరాభవ నామ సంవత్సరానికి గురువు రాజు అయినందున అన్ని శుభాలే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మొదలైన చౌడేశ్వరి రాయబారాది ఉత్సవం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి గణపతి పూజ, సాయంత్రం అంకుర్పాణ, పంచాగ శ్రవణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం ఎస్ఐ భూపాలుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్స్లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్ తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది. మునీర్ 1వరకు స్వగ్రామంలో, 2 నుంచి 10వరకు గుత్తి సెయింట్ మేరీ, ఇంటర్, బీటెక్ ఇడుపులపాయలో చదివాడు. తర్వాత గేట్ పరీక్షలకు ప్రిపేరైన ఈ విద్యార్థి జియో మాటిక్స్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని మునీర్ తెలిపారు. కొడుకు ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. -
నేడే పిడకల సమరం
● ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో కొనసాగుతున్న సంప్రదాయం ● పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు ఆస్పరి: ఉగాది పండుగకు ఆస్పరి మండలంలో ఓ ప్రత్యేకత ఉంది. పండగ మరుసటి రోజు మండలంలోని కై రుప్పల గ్రామంలో ప్రేమికులను గెలిపించేందుకు పిడకల సమరం జరుగుతుంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరుగుననున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్, గ్రామపెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకను తిలకించేందుకు మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. మొక్కుబడిగా భక్తులు పిడకల సమర్పణ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు నగలు, పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించడం సర్వసాధారణం. అయితే కై రుప్పల గ్రామంలో అందుకు భిన్నంగా భక్తులు వీరభద్రస్వామికి పిడకలు సమర్పించి మొక్కుబడి తీర్చుకుంటారు. స్వామివారి సన్నిధిలో శుక్రవారం జరిగే పిడకల సమరానికి నుగ్గులు సిద్ధం చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు వారికి తోచిన విధంగా పిడకలను ఆలయ ఆవరణలో రాశులుగా పోసి మొక్కుబడి తీర్చుకుంటారు. నేపథ్యమిది .. విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వీరభద్ర స్వామిని అవమాన పరచాలని నిశ్చయించుకొని తమకు అందుబాటులో ఉన్న పిడకలతో స్వామితో పాటు ఆయన వర్గీయులపై దాడి చేస్తారు. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగుతారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడి, ప్రతిదాడి రణ రంగాన్ని తలపించింది. తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి నిమ్న కులానికి చెందిన కాళికాదేవిని, అగ్రవర్ణానికి చెందిన వీరభద్రస్వామికి వివాహం చేశారని పెద్దలు చెబుతారు. ప్రాణాలకు తెగించి తమ కోసం పోరాడిన తమ వర్గీయుల కోరికలను వీరభద్రస్వామి, కాళికాదేవి తీర్చారట. ఈ నేపథ్యంలోనే ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు స్వామి, అమ్మవారి భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తుంది. కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి సమరం ఇలా సాగుతుంది పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి తదితర గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచి తమ ఇంటిలో ఉన్న పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు. -
నాణ్యత బ్యాగోలేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు. ఇందులో మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు తదితరవి ఉండేవి. ఇవన్నీ నాణ్యంగా ఉండేవి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పేరు మార్చి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో కిట్లు ఇచ్చింది. అయితే, నాణ్యతను విస్మరించడంతో విద్యా సంవత్సరం పూర్తికాకముందే చంద్రబాబు సర్కారు ఇచ్చిన వస్తువులు చిరిగిపోతున్నాయి. ఇందుకు ఈ చిత్రాలే నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోయినా పిల్లల వీపులపై నేటికీ జగనన్న బ్యాగులే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి పిల్లల చదువు, వారికి అందించే వస్తువులపై నాటి, నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అవగతమవుతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుచెదరని నాణ్యత.. జగనన్న బ్యాగులతో బడికి -
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు
కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. – దినేష్గౌడ్, కౌన్సిలర్, డోన్ డోన్ మున్సిపల్ చరిత్రలో కమిషనర్ ప్రసాద్గౌడ్ అత్యంత అవినీతి పరునిగా పేరుగాంచారు. అనేక మందిని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలను, అక్రమ దుకాణాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సత్వర విచారణ జరగాల్సిందే. – సుంకయ్య, సీపీఐ కౌన్సిలర్, డోన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ డ్రైవర్ను ప్రైవేటు వాహనానికి వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విషయం మామూలు వ్యవహారం కాదు. కమిషనర్ నుంచి డ్రైవర్ వేతనాన్ని మొదటి నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఉన్నతాధికారులపై ఉంది. – బుర్రు రమాదేవి, కౌన్సిలర్, డోన్ -
బ్లాక్లో మద్యం.. పట్టుకోండి చూద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు. ఉగాది పండుగ సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ వైన్షాప్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 8 మంది వివిధ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు. గురువారం కూడా వైన్షాపుల వద్ద బహిరంగంగానే బ్లాక్లో విక్రయాలు జోరుగా సాగాయి. -
వివాహిత ఆత్మహత్య
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లీలావతి (30 భర్త మధు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు భార్య వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో రెండురోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన లీలావతి ఈనెల 18న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు. -
అధి‘కారు’లా.. మజాకా!
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక సబ్ట్రెజరీ అధికారి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అఽధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోన్ ఎంపీడీఓ, కమిషనర్ ప్రభుత్వ సొమ్మును కాజేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి కారు అద్దెకు తీసుకోకుండా ఇతరుల కారులో పర్యటించారని ఉన్నతాధికారులు అభియోగం మోపారు. కాసులకు కక్కుర్తి పడి ప్రతి నెల వేలాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి వాహనాల అద్దె రూపంలో కొల్లగొడుతున్నందున ఎంపీడీఓకు చెల్లించాల్సిన వాహనాల అద్దెను నిలిపివేయాలని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓతో పాటు డోన్ ట్రెజరీ అఽధికారికి సిఫారసు చేశారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో డోన్ ఎంపీడీఓ కంటే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ రెండాకులు ఎక్కువే చదివారని చెప్పవచ్చు. ప్రతి నెల తాను పర్యటనలు జరిపేందుకు రూ.35 వేలు తీసుకుంటూ డ్రైవర్ జీతం మిగిల్చుకునేందుకు కక్కుర్తి పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తాను పర్యటనలు జరిపే కారుకు ఎల్లో బోర్డు పెట్టుకోకుండా, డ్రైవర్ను నియమించుకోకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగి అయిన రూ.50వేల వేతనం తీసుకుంటున్న ఇమామ్ అనే ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ కారు డ్రైవర్గా వాడుకుంటున్నారు. అయితే డ్రైవర్ జీతంతో పాటు కారు అద్దె కింద ప్రతి నెల రూ.35 వేలను ఆయన మున్సిపల్ సాధారణ నిధుల నుంచి తన ఖాతాలోకి వేసుకుంటున్నారు. సీఎం సభకు రూ.6 లక్షలు ఖర్చు.. గత వారం డోన్ మండలం కొత్తబురుజు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సభకు డోన్ మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు కమిషనర్ ప్రసాద్గౌడ్ నిధులను కొల్లగొట్టేందుకు సర్వసభ్య అజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఈ విషయంపై శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు నిలదీయగా, ‘మీలో ఒక్కరైనా ఒక్కపూట తమ వర్కర్లకు భోజనం పెట్టారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం సభకు జిల్లా కలెక్టర్ భోజన వసతులు ఏర్పాటు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా రూ.6 లక్షలు సభ అనుమతి లేకుండా ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. దీంతో కంగుతిన్న కమిషనర్ ‘మీకు ఇష్టమైతే ఆమోదించండం, లేకపోతే లేదు’అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పాలకవర్గానికి మధ్య విబేధాలు సృష్టించడం, అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం తప్ప ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన ధ్యాస కమిషనర్కు లేదు. అతని అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలి. – మల్లికార్జునరెడ్డి, కౌన్సిలర్ ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ డ్రైవర్తో కమిషనర్ బిల్లులు స్వాహా అద్దె వాహనం లేకుండానే ప్రజా సొమ్ము కొల్లగొట్టిన ఎంపీడీఓ అధికారుల కక్కుర్తిపై ప్రజలు విమర్శలు నిధులు రికవరీ చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్ -
మల్లన్నను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దడల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ బాషణ చేశారు. -
నయన మనోహరం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం మల్లన్న రథోత్సవం కనుల పండువగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం స్థానాచార్యులు రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చారు. రథానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అధికారులు కూష్మాండబలి సమర్పించారు. ప్రత్యేక హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కన్నడ భక్తులు ‘సిరిగిరి మల్లయ్య.. మహాత్మ మల్లయ్య’ అని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య భక్తిపూర్వకంగా రథంపైకి అరటిపండ్లు, ఖర్జూరాలు, కలకండ విసిరి భక్తి చాటుకున్నారు. రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు నిర్వహించారు. ఉత్సవంలో కర్ణాటక జాంజ్, వీరగాసీ, కన్నడ జానపద డోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, గొరవయ్యల, నందికోలు నృత్యాలు అలరించాయి. రథోత్సవ దర్శనంతో సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కొర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రాజరాజేశ్వరీ అలంకారం ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీభ్రమరాంబాదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భక్తులకు కటాక్షించారు. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు. ఈ దేవిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో చెప్పారు. నేడు ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాలకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమ్మవారు భ్రమరాంబాదేవి నిజాలంకరణ అలంకారం, స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ ఆలయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ఉగాది మహోత్సవాలు ముగుస్తాయి. శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం స్వామిఅమ్మవార్ల దర్శనంతో పులకించిన భక్తులు రమావాణీ సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భ్రమరాంబాదేవి కటాక్షం ఉగాది మహోత్సవాలకు నేడు పూర్ణాహుతి -
వైభవంగా కంబగిరి స్వామి ఉత్సవం
ఉయ్యాలవాడ: మండలంలోని సుద్దమల్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ కంబగిరి స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం స్వామి కి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయి ద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహ కంబగిరి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. సాయంత్రం అల్లూ రు, సుద్దమల్ల గ్రామస్తులు తేరుబండ్లతో ఆలయానికి చేరు కుని వృషభరాజములచే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండల ప్రజలతో పాటు ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, జమ్మలమడుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మండలంలో ఆయా గ్రామాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. రైతులు పండితులు సూచించిన దిశకు వెళ్లి పొలాల్లో సేద్యపు పనులు ప్రారంభించారు. అలాగే ఉయ్యాలవాడలో కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థకంగా వైఎస్సార్పీ నాయకులు పేదలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. -
వైద్యం అందక.. ‘ఓపి’క లేక!
కర్నూలు పెద్దాసుపత్రిలో రోగుల సహనానికి పరీక్ష ● డాక్టర్ పరీక్షించడానికి ఒకరోజు ● వైద్య పరీక్షలకు మరోరోజు ● చికిత్సకు ఇంకో రోజు ● ముందే అస్వస్థత.. ఆపైన అవస్థ! ● కోడుమూరు మండలానికి చెందిన సుంకులమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత బుధవారం సర్జరీ విభాగానికి వెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. స్కానింగ్ వద్ద సిబ్బంది ఈ రోజుకు టోకన్లు అయిపోయాయి...23వ తేదీ రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. ● గూడూరుకు చెందిన రామాంజనేయులు జ్వరంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చాడు. జనరల్ మెడిసిన్ వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. రక్తపరీక్షలు చేయించుకుని వచ్చేసరికి మధ్యాహ్నం 3.30 గంటలు దాటింది. అప్పటికే వైద్యులు ఓపీలో లేకుండా వెళ్లారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఎవ్వరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు. ● మంత్రాలయానికి చెందిన తిక్కన్న కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. కొంత కాలం పాటు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గత బుధవారం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రం వద్ద అతనికి 23వ తేదీ రావాలని సూచించారు. అప్పటి వరకు డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. .. ఇలాంటి అనుభవం ఆసుపత్రిలో నిత్యం వందలాది మందికి ఎదురవుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న వైద్య విధానం చాలా మంది రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దాసుపత్రిని నమ్ముకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓపీ టికెట్ తీసుకునేటప్పటి నుంచి చివరకు మందులు తీసుకుని ఇంటికి వెళ్లే వరకు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధానం వల్ల చాలా మంది రోగులు మధ్యలోనే వెనుదిరిగి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన అధిక శాతం చిన్నచిన్న వ్యాధులకు స్థానిక ఆర్ఎంపీలచే వైద్యం చేయించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 నుంచి 3,500 మంది దాకా ఓపీ చికిత్సకు రోగులు వస్తున్నారు. వీరిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి తగ్గక మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వస్తున్న వారే ఉన్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఓపీ టికెట్లు ఇచ్చేందుకు గతంలో రెండు, మూడు కౌంటర్లు మాత్రమే ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో వాటిని భారీగా పెంచారు. డిజిటల్ ఓపీ విధానాన్ని ప్రవేశపెట్టి రోగులకు త్వరగా ఓపీ టికెట్ అందేలా చూశారు. ఈ విధానంతో ప్రస్తుతం ఓపీ టికెట్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. అయితే ఓపీ విభాగాల వద్ద వైద్యులకు చూపించుకోవడానికి సోమ, మంగళ, బుధవారాల్లో అధికంగా క్యూ ఉంటోంది. అక్కడ చికిత్స చేయించుకున్న వైద్యులు రాసిన వైద్యపరీక్షల చీటీలు తీసుకుని డయాగ్నోస్టిక్ బ్లాక్కు వస్తే అక్కడ అప్పటికే వందల మంది క్యూలో ఉంటున్నారు. ఎక్స్రే, వివిధ రకాల రక్తపరీక్షలు, మూత్రపరీక్షల కోసం ఒక్కొక్కరు కనీసం గంటసేపు వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చిన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలను అదే రోజు చేయకుండా రెండు రోజుల తర్వాత రావాలని చెబుతున్నారు. అప్పటికే నిర్వహించిన రక్తపరీక్షల నివేదికలు మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్యలో ఇస్తున్నారు. వీటి కోసం ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం ఒకరిపై ఒకరు పడ్డ విధంగా తీసుకోవాల్సి వస్తోంది. తీరా నివేదికలు తీసుకుని ఓపీ విభాగాల వద్దకు వెళితే అప్పటికే వైద్యులు వెళ్లిపోయి ఉంటున్నారు. క్యాజువాలిటికీ వెళితే మళ్లీ ఓపీకే వచ్చేవారం రావాలంటూ సెలవిచ్చి పంపిస్తున్నారు. ఎక్స్రే ఫిల్మ్ల నివేదికలు మరుసటి రోజు ఇస్తున్నారు. ఇవి తీసుకోవడానికి ఒకరోజు, వాటిని తీసుకుని వైద్యుల వద్ద చికిత్సకు మరోరోజు రావాల్సి వస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఎక్కడ! ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు ఓపీ చికిత్స అందించాలని స్వయానా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పలుమార్లు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆదేశించారు. అయినా ఓపీలో వైద్యులు ఉండటం లేదు. అధిక శాతం ఉదయం 12 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు. ఆ తర్వాత ఒకరిద్దరు పీజీలు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటలకు సైతం పీజీలే ఉంటున్నారు. 3.30 గంటల తర్వాత చాలా మంది ఓపీలో ఉండటం లేదు. ఈ సమయంలో వైద్యపరీక్షల నివేదికలు తీసుకుని వచ్చిన రోగులకు వైద్యులు కనిపించక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఆయా ఓపీల్లో వైద్యులు, వైద్యపరీక్ష కేంద్రాల్లో సిబ్బంది ఉన్నారా లేరా అని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఎంఆర్ఐ కోసం రోజుల తరబడి! ఆసుపత్రిలో ఎంఆర్ఐను గత 8 ఏళ్లుగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 25 నుంచి 30 వరకు మాత్రమే ఎంఆర్ఐలు తీయగలుగుతున్నారు. ఓపీ విభాగంలో వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఇక్కడకు వచ్చిన రోగులకు మూడు, నాలుగు రోజుల తర్వాత రావాలని సమయం ఇస్తున్నారు. వారు చెప్పిన రోజులో ఎంఆర్ఐ తీయించుకున్నాక నివేదిక కోసం మరో రెండు రోజులు ఆగి రావాల్సి వస్తోంది. ఇలా ఎంఆర్ఐ పరీక్ష కోసమే వారం రోజులు పడుతోంది. ఆ నివేదిక తీసుకుని వైద్యుల వద్దకు వెళితే మొదట్లో చూసిన డాక్టర్లు ఉండటం లేదు. నిన్ను చూసిన డాక్టర్ లేరు...ఫలానా రోజు రావాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇలాంటి విధానం వల్ల రోగులు నిత్యం వేదనకు గురవుతున్నారు. -
నేడు పంచాంగ శ్రవణం
ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం ఉదయం 10.30గంటలకు దేవస్థాన అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథాంగహోమం, రథాంగపూజ, రథాంగబలిహారణలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి -
● పెద్దాసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ● 2.5 గ్రాముల రక్తమున్నా శస్త్రచికిత్స విజయవంతం చేసిన వైద్యులు
బాలుడికి ప్రాణం పోశారు కర్నూలు(హాస్పిటల్): కడప జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు అరుదైన జబ్బు కారణంగా రక్తపు వాంతులు, తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న బాలునికి సైతం మేమున్నామంటూ భరోసానిచ్చి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు ఇక్కడి వైద్యులు. బుధవారం ఈ కేసు వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘కడప జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని రాజుపల్లి గ్రామానికి చెందిన శివ, ఆదిలక్ష్మిల కుమారుడైన పెంచలయ్య(15) రెండు నెలలుగా నల్లటి మలం(మెలినా), రక్తపు వాంతులు,(హీమాటెమేసిన్), తీవ్ర బలహీనతతో బాధపడుతున్నాడు. కడపలో వైద్యులకు చూపించగా డియోడినమ్లో రక్తస్రావం కలిగించే పుండ్లు(డియోడినమ్ అల్సర్స్) ఉన్నట్లు గుర్తించారు. జనవరిలో అతనికి ఎండోస్కోపి ద్వారా ప్యాడ్లాక్ క్లిప్ అమర్చినా రక్తస్రావం పూర్తిగా ఆగలేదు. ఆ సమయంలో అతనికి హీమోగ్లోబిన్ స్థాయి 2.5 గ్రాములు మాత్రమే. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆ బాలుడిని గత నెల 17వ తేదీన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం వైద్యులు పరీక్షించి ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్(ఏపీసీ)ద్వారా చికిత్స చేసినా రక్తస్రావం తగ్గకపోవడంతో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు గత నెల 26న ప్రాక్సిమల్ ఇలియమ్ భాగంలో ఎంటెరోటమి చేసి ఎండోస్కోపి నిర్వహించారు. ఇందులో యాంజియో ఎక్టేసియా(రక్తనాళాల అసాధారణ విస్తరణ)ను గుర్తించి, దానిపై కూడా ఏపీసీ చికిత్స అందించారు. అదే సమయంలో డియోడినల్ అల్సర్ నుంచి రక్తస్రావం కొనసాగుతుండటంతో ఎండోస్కోపి నిర్వహించిన తర్వాత, ఎక్స్ప్లోరేటరి లాపరోటమి చేశారు. గ్యాస్ట్రో డియోడినల్ ఆర్టరి(జీడీఏ)ను లిగేషన్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. దాదాపు 8 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. డిశ్చార్జ్ సమయానికి అతనిలో హిమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాములకు పెరిగింది’ అని వివరించారు. ఈ క్లిష్టమైన కేసును శస్త్రచికిత్స విభాగం యూనిట్–2 చీఫ్ డాక్టర్ ఆర్. రామకృష్ణనాయక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స అందించడంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు హెచ్ఓడీ డాక్టర్ మోహన్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్కుమార్రెడ్డి, డాక్టర్ సందీప్రెడ్డి, డాక్టర్ అర్షియా, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ గీత శ్రావణి కీలక పాత్ర పోషించారు. -
ముస్లింలకు ఇఫ్తార్ విందు
డోన్ రూరల్: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సుభాన్ స్వగృహంలో బుధవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్ బాషా, పాతపేట అబ్దులా, రియాజ్, ఫరెస్ట్ మౌలాలి, మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మెన్ జాకిర్ హుసేన్, ప్యాపిలి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, ఎద్దుపెంట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, పారిశ్రామికవేత్తలు ప్రశాంత్, క్వాలిటీ అబ్దులా పాల్గొన్నారు. -
జిల్లా వాసులకు ఉగాది పురస్కారాలు
కర్నూలు కల్చరల్: జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు.సాహిత్య, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేస్తున్న కురాడి చంద్రశేఖర కల్కూరకు ‘కళా రత్న’ (హంస) పురస్కారం, సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న నంద్యాలకు చెందిన డాక్డర్ వీడీవీ రమణమూర్తి, గాయకుడు, సంగీత దర్శకుడు విశ్వనాథ్ రామ అయ్యర్ (కర్నూలు), సాహిత్యంలో గద్వాల సోమన్న (కర్నూలు), నాటక రంగంలో నీలం ఓంకార స్వామి (కర్నూలు), సూక్ష్మ చిత్రాలులో శివ కేశవ మచాని (కర్నూలు), సామాజిక సేవలో బీసీ రాజమోహన్ రెడ్డి (నంద్యాల), సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ అబ్బాయి కాంత్ (నంద్యాల) లకు ‘ఉగాది’ పురస్కారాలు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో వారికి పురస్కారాలు అందించనున్నారు. రిటైర్డ్ ఏజేసీ మృతి కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా డీఆర్వో, అడిషనల్ జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రామస్వామి గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చి వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో నగరంలోని అమ్మా హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రామస్వామి జిల్లా అధికారులకు ఎంతో సుపరిచితులు. ఈనేపథ్యంలో ఆయన మృతి సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు నివాళి అర్పించారు. కర్నూలు ఆర్డీఓ కె.సందీప్కుమార్, కర్నూలు అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రమేష్బాబు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2025–26 సంవత్సరానికి అర్హులైన విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగులు) బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శా ఖ సహాయ సంచాలకులు రయీస్ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. గ్రూపు–4 పో స్టులు 9, క్లాస్–4 పోస్టులు 8 ఖాళీగా ఉన్నా యన్నారు. ప్రతి పోస్టుకు విద్యార్హత, కేటగిరీలలో ఖాళీల వివరాలు, నమూనా దరఖాస్తుతో కూడిన వివరాలకు వెబ్సైట్ www.kurnool. ap.gov.in, www.nandyal.ap.gov.inలో పొందుపరిచామన్నారు.వివరాలకు 08518–277864 నెంబర్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గంటల్లోపు సహా య సంచాలకులు, విభిన్న ప్రతిభావంతు లు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్, కర్నూలులో అందజేయాలన్నారు. శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో ఎట్టకేలకు శ్రీశైలంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రే ట్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిఫార్సును ప్రభుత్వం అంగీకరించడంతో హైకోర్టు రిజిస్టర్ వీఎస్ఎస్ శ్రీనివాస శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జెస్కు హైకోర్టు రిజిస్టార్ నుంచి ఉత్తర్వులు అందాయి. కాగా అనేక సంవత్సరాలుగా శ్రీశైలంలో క్యాంప్ కోర్టు మాత్రమే ఉంది. అది కూడా నెలలో రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం మాత్రమే సీనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం దేవస్థానం టోల్గేట్ సమీపంలో ఐటీడీఏ మ్యూజియం పక్కనే బసవనంలో ఉన్న భవనంలో తాత్కాలిక క్యాంప్ కోర్టును నిర్వహిస్తున్నారు. -
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
కల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్పొరేటర్ల పదవి కాలం ముగియడంతో పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ శాలువ కప్పి సన్మానించారు. కల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కాటసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా ఐక్యతతో ఐదేళ్ల పాలన దిగ్విజయంగా అందించామన్నారు. కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ ఒత్తిడిలకు తలొగ్గకుండా పార్టీలో ఉండి వార్డులను అభివృద్ధి చేశారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత పట్టుదలతో పని చేసి మరోసారి మేయర్ పీఠాన్ని దక్కుంచుకుందామన్నారు. మేయర్ రామయ్య మాట్లాడుతూ ఐదేళ్లలో రూ. 800 కోట్లతో కర్నూలు నగరంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామన్నారు. పారిశుద్ధ్యంలో కర్నూలు నగరం మెరుగైన ర్యాంకు సాధించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునిసిపలిటీ స్టాండింగ్ కమిటీకి రెండు సార్లు ఎన్నికల జరిగాయన్నారు. ఐక్యంగా ఉండడంతో స్టాండింగ్ కమిటీలో రెండు సార్లు తామే గెలిచామన్నారు. మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్ ఎస్. రేణుక, కార్పొరేటర్లు నాగలక్ష్మీరెడ్డి, అరుణ, దండు లక్ష్మీకాంతరెడ్డి, పల్లె శారద, నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, సాన శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, గాజుల శ్వేతారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని విక్రమసింహారెడ్డి, సాంబశివరావు, కో ఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి తదితరులను కాటసాని దంపతులు సత్కరించిన వారిలో ఉన్నారు. -
పేదల గుడిసెలు కూల్చివేత
● రోడ్డున పడిన 64 కుటుంబాలు ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ప్రభుత్వాసుప్రతి ప్రహరీ గోడ పక్కన మున్సిపల్ స్థలంలో పేదల గుడిసెలను బుధవారం తొలగించారు. ఉదయం 6 గంటలకే మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. గుడిసెల్లో ఉన్న వారు అందోళనకు దిగారు. ప్రొక్లెయిన్లను, అధికారులను అడ్డుకోవటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హైకోర్టు ఉత్వర్వులు ఉన్నాయని, తామేమీ చేయలేమని, ఇంత ముందే గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. బాధితులు వినపించకోకుండా గుడిసెలను తొలగించరాదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి హైకోర్టు ఉత్తర్వులను ఎవరూ అడ్డుకోవటానికి లేదని, ప్రొక్లెయిన్లతో 64 గుడిసెలను తొలగించారు. పండుగ పూట రోడ్డున పడేశారు! ‘పిల్లలతో పండగ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు..పండగ పూట రోడ్డున పడేశారు.’ అంటూ బాధితులు అవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న తాము ఖాళీ చేయాలంటే ఎలా అని రోదించారు. తమ పిల్లలకు పదో తరగతి పరీక్షలు ఉన్నాయని చెప్పినా అఽధికారులకు కనికరం కూడా లేకుండా పోయిందన్నారు. మొత్తం 64 గుడిసెలను తొలగించటంతో పిల్లపాపాలతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంత మంది అద్దె ఇళ్లు వెతుక్కోగా, మరి కొందరు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు. కాగా.. బాధితులు బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. -
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
● జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ శ్రీశైలంటెంపుల్: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. బుధవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో మహిళా జన్సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గృహహింస, బలవంతపు శ్రమ, వృద్ధ మహిళలపై దౌర్జన్యాలు వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. మహిళా భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంగన్వాడీ, ఆరోగ్య, విద్యా శాఖలు సమన్వయంతో బాలికల అరోగ్యం, పోషణపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లాలో మహిళల భద్రత కోసం, రక్షణ కోసం తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సబ్ రిజిస్ట్రార్ల నియామకం
కర్నూలు(సెంట్రల్): కల్లూరు, కోసిగి సబ్ రిజిస్ట్రా ర్లుగా ఎం.రాముడు, ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇందులో కల్లూరు సబ్ రిజిస్ట్రార్గా వచ్చిన మద్దిరాముడు అవుకు, కోసిగి సబ్ రిజిస్ట్రార్గా వచ్చిన ఎం.శ్రీనివాసులు నంద్యాల డీఆర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసేవారు. వీరిద్దరికీ సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిలో ఒకరిని కల్లూరుకు, మరొకరిని కోసిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్ మంగళవారం బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తించారు. జాకెట్ తెచ్చిన తంటా ● ఘర్షణలో ఇద్దరికి గాయాలు గుత్తి రూరల్: ఓ మహిళకు చెందిన జాకెట్ పక్కింట్లో కనిపించడంతో గొడవ చోటు చేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు.. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలోని శివాలయం వద్ద నివాసముంటున్న సుంకులమ్మ మంగళవారం ఉతికేసిన తన నాలుగు జాకెట్లను ఇంటి బయట ఎండలో ఆరవేసింది. అయితే అవి కనిపించకుండా పోయాయి. కాసేపటి తర్వాత ఆ జాకెట్లు పక్కింట్లో ఉన్న శాంతమ్మ, నందిని వద్ద కనిపించడంతో సుంకులమ్మ నిలదీసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సుంకులమ్మ సోదరులు లక్ష్మన్న, రాము అక్కడకు చేరుకుని సోదరి పక్షాన మాట్లాడారు. ఆ సమయంలో మాటామాట పెరగడంతో లక్ష్మన్న, రాముపై కర్రలు, ఇనుప రాడ్లతో శాంతమ్మ, నందిని, చిన్నవీరప్ప, ఉరుకుందు, చిన్ని, వంశీ దాడి చేసి గాయపరిచారు. ఘటనలో తలలు పగిలి తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న, రామును వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న , రాము -
టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడి, అక్రమ అరెస్టు ను ఖండిస్తూ కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని కల్లూ రు అర్బన్ ఇందిరమ్మ కట్ట దగ్గర ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, చంద్రబాబు ప్రజలకు శ్రీరంగ నీతు లు చెప్పి వారు మాత్రం అచరించరని విమర్శించారు. చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో కామ క్రీడలు నిర్వహిస్తే దానిని తప్పు అని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ నాయు డు తీరును వ్యతిరేకిస్తూ తిరుపతిలో శాంతియుత నిరసన తెలియజేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించి, అనంతరం పోలీసు కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళ తో ఉన్న వీడియోలో బీఆర్ నాయుడు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారన్నారు. ఆ వీడియోను టీడీపీ నాయకులు ఫేక్ అని, దాంట్లో తప్పేముందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు చేతకానితనంతోనే బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలకు అనర్హులని విమర్శించారు. టీటీడీ చైర్మన్గా భక్తి భావంతో ఉండేవారిని నియమించాలన్నారు. కూటమి ప్రభుత్వం, నాయకుల తప్పులను ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించా రు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఆరో పించారు. బీఆర్ నాయుడుని తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రతిష్టతను దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నర సింహులు, సాన శ్రీనివాసులు, లక్ష్మీకాంతరెడ్డి, నాగ లక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, మిద్దె చిట్టెమ్మ, అరుణ, గాజుల శ్వేతారెడ్డి, నాయకులు రంగప్ప, చిన్న, మీదివేముల ప్రభా కర్రెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, గోపాల్రెడ్డి, పెద్దపాడు శ్రీధర్రెడ్డి, శివశంకర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమలత, శివారెడ్డి, సత్యంరెడ్డి, సాయి పాల్గొన్నారు. -
తెలుగుగంగ .. భద్రత బెంగ
● ప్రధాన కాల్వను వెంటాడుతున్న గండ్లు ● ఆందోళన చెందుతున్న రైతులు బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాల్వకు ఇటీవల తరచుగా గండ్లు పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చిన్న దేవళాపురం, నారాయణాపురం, జీసీ పాలెం, లింగాపురం, రామాపురం గ్రామాల పరధిలో ప్రధాన కాలువ గట్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల ఇరవై రోజుల వ్యవధిలోనే రెండు సార్లు గండి పడింది. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం కేవలం రెండు వేల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్లో కాల్వకు అధిక క్యూసెక్కులు విడుదల చేయాల్సి వస్తోంది. దీంతో కాల్వ గట్టు సామర్థ్యంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల శిథిలమైన కాల్వ గట్టును పటిష్ట పరచకపోతే గండ్లు పడే అవకాశం లేకపోలేదు. మరో వైపు కొందరు రైతులు తమ పొలాలకు నీళ్లు మళ్లించుకునేందుకు కాల్వ గండ్లు కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా అండర్ టన్నెళ్లు, సూపర్ పాసేజ్ ప్రాంతాల్లో గండి కొట్టి సమీపంలోని చెరువులు, కుంటలు నింపుకుంటున్నారు. దీంతో ప్రధాన కాల్వ గట్టు దెబ్బతిని గండ్లు పడే అవకాశం ఉంది. భారీ గండ్లు పడితే పంట పొలాలను నీళ్లు ముంచెత్తే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయడంతో పాటు గట్టును పటిష్ట పరచాలని రైతులు కోరుతున్నారు. -
దాతృత్వానికి ప్రతీక రంజాన్
నంద్యాల(అర్బన్): పవిత్ర రంజాన్ మాసం దానధర్మాలకు, దాృత్వానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక జుమ్మా మసీదులో ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత ఇఫ్తార్ విందు స్వీకరించారు. రాష్ట్రం, దేశం, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక దువా చేశారు. అనంతరం శిల్పారవి మాట్లాడుతూ ముస్లింలు నెలరోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు ఉండి అల్లా స్మరణలో గడపడం విశేషమన్నారు.అంతేకాకుండా పేదలకు తమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, నంద్యాలలో మతసామరస్యం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ముస్లిం బాలికల మదరసా అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేశారు. ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి -
కొండలు తవ్వేస్తున్నారు!
● అధికారపార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్ దందా ● చోద్యం చూస్తున్న అధికారులుడోన్: అధికారపార్టీ నాయకులు బరితెగించారు. ఏకంగా కొండలు తవ్వి గ్రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. డోన్ మండలంలోని రేకులకుంట, వెంకటనాయునిపల్లె, మల్లెంపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లో కొండలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన వీటిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడింది. పగలు రాత్రి తేడాలేకుండా ఆ కొండలను ప్రొకై ్లన్లతో తవ్వి మొరుసు ట్రాక్టర్లలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, గృహనిర్మాణ అవసరాలకు, రైల్వే డబ్లింగ్ పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీల అనుమతులు, రెవెన్యూ అధికారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇవేవి లేకుండా గ్రావెల్ అక్రమ త్రవ్వకం నిరాటకంగా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
పాములపాడు: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన బోయ అమర్ తాగుడుకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. దీనిపై భార్య శ్యామల మందలించడంతో ఈ నెల 14న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెంది రాత్రి ఇంట్లో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే కర్నూలు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ షేక్షావలి తెలిపారు. మృత దేహానికి కర్నూలులోనే పంచనామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మిషన్లో పడి.. ఆదోని అర్బన్: ప్రమాదవశాత్తూ వేరుశనగకాయల కోత మిషన్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు బోయ వీరేంద్ర (32) వ్యవసాయం చేస్తూ కూలీ పనికి పోయేవాడు. మంగళవారం మిషన్కు వేరుశనగకాయల కట్టె వేసే పనికెళ్లాడు. చేతికి టవాల్ కట్టుకుని వేరుశనగకాయల కట్టెను మిషన్లో వేస్తుండగా టవాల్ను లాక్కొని ఆ వ్యక్తిని కూడా మిషన్ లోపలికి లాక్కొంది. దీంతో కొట్టుమిట్టాడుతూ వీరేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పల్లవి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి. వీరేంద్ర మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో – బైక్ ఢీ ● ఒకరు దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలో ప్రవహించే లోలెవల్ కాలువ (ఎల్లెల్సీ) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆటో – మోటార్ బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనీకి చెందిన నారాయణ, భార్య లీలమ్మ, కుమార్తె జాహ్నవి, మరో వ్యక్తి కలసి ఆటోలో ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి పెద్దకడుబూరు మండలం గంగులపాడు గ్రామానికి చెందిన గోవిందప్ప అనే వ్యక్తి మోటార్ బైక్పై గ్రామానికి వెళ్తున్నాడు. ఎల్ఎల్సీ కాలువ సమీపంలో బైక్ ఆటోను ఢీ కొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న నారాయణ(59) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, లీలమ్మ, జాహ్నవి, మరొకరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నారాయణ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. క్వింటా వేరుశనగ రూ.8,670 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 2,423 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా ధర గరిష్టంగా రూ.8,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,560, మధ్యస్త ధర రూ.7,500 నమోదైందన్నారు. అదేవిధంగా ఆముదాలు 54 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,737, మధ్యస్త ధర రూ.5,903, గరిష్ట ధర రూ.5,911 నమోదైంది. కందులు 4 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,112 లభించింది. రైలు కింద పడిగుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్ శివారు ఈద్గా సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రైల్వేట్రాక్పై మృతదేహం పడి ఉన్నట్లు స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పరిశీలించారు. ప్రమాదంలో ముఖం శిథిలమై ఉండటం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. నలుపు, తెలుపు రంగు హాఫ్ షర్టు, సిల్వర్ కలర్ వీ నెక్ టీషర్టు, కుడిచేతిపై ఢమరుకం, త్రిశూలం పచ్చబొట్టు, ఎడమ చేతిపై రతి అనే అక్షరాలు ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు 9247575608 (సీఐ), 9247575610 (ఎస్ఐ)కు సమాచారం అందించాలన్నారు. -
ఎక్కడికక్కడ ఖాళీ సిలిండర్లు
శిరివెళ్ల: హిందూ ముస్లింలకు అతి పెద్ద పండుగలు ఉగాది, రంజాన్. సరిగ్గా పండుగల వేళ గ్యాస్పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బుక్ చేసిన రెండు, మూడు రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. మండల కేంద్రంలో ఏ ఇంటి ముందు చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. బండి రాగానే ఆత్రుతతో సిలిండర్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. మొన్నటి వరకు దోసె రూ.30 ఉండగా.. నేడు రూ. 40లకు విక్రయిస్తున్నారు.ఫొటోలు : వడ్డె శ్రీనివాసులుమేము గాయత్రీ ఎస్టేట్లో 2023 నుంచి ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నడుపుతున్నాం. రూ.1000లకు లభించే గ్యాస్ బండ ఇప్పుడు రూ.2వేలు పెట్టినా దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో హోటల్ మూసేద్దామనుకుంటున్నా. మా హోటల్పై పలువురు ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ఉపాధి కోల్పోతారు. – రంగ ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నిర్వాహకుడు, కర్నూలు గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్లో కొనాల్సి వస్తోంది. వంట నూనెల ధర కూడా మండుతోంది. యుద్ధానికి ముందు సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.162 ఉండగా నేడు రూ.185లకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. వంట నూనెల కృత్రిమ కొరతను అడ్డుకోవాలి. – అరుణ, నంద్యాల చెక్పోస్టు ఏరియా, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న దృశ్యంఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న యువకుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వంట గ్యాస్ కొరత బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయం అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధర అడ్డగోలు ధరలపై నియంత్రణ కరువు పండుగలు, శుభకార్యాల వేళ అవస్థలు -
ఇల కై లాసం.. దేవీ అభయం!
గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యంశ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగిరిలో భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఎనిమిది భుజాలతో శోభిల్లుతూ భక్తులను కటాక్షించారు. శంఖం, చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం ధరించి అభయమిచ్చారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కై లాసవాహనాన్ని అదిష్టించిన స్వామిఅమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. మహాదుర్గగా అలంకీకృతులైన భ్రమరాంబాదేవిని, కై లాసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ఉత్సవం నిర్వహించి రాజగోపురం మీదుగా క్షేత్రప్రధాన వీధుల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రపురవీధుల్లో కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. ఈ గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, కళాకారుల వేశాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, జానపద డోలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నె తీసుకువచ్చాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవోలు, అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు. నేడు వీరాచార విన్యాసాలు.. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, శ్రీభ్రమరాంబాదేవికి మహాసరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండప్రవేశం నిర్వహిస్తారు. శివదీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాసాల కార్యక్రమానికి దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్ట బందోబస్త్ చేపట్టింది. కనుల పండువగా కొనసాగుతున్న ఉగాది మహోత్సవాలు మహాదుర్గగా శ్రీశైల భ్రామరి దర్శనం కై లాస వాహనంపై ఆది దంపతుల విహారం కన్నడ భక్తులతో పోటెత్తిన శ్రీశైలం నేడు ప్రభోత్సవం, నందివాహనసేవ, వీరాచార విన్యాసాలు శ్రీగిరికి పోటెత్తుతున్న కన్నడ భక్తులు శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలను తిలకించి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ కన్నడ భక్తులు పరవశించిపోతున్నారు. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది కన్నడ భక్తులు చంటి ప్లిలతో, మహిళలు, వృద్ధులు సైతం నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. తప్పెట దరువులతో, రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ ‘మల్లన్న.. నీ దర్శనానికి వచ్చాం..’ అంటూ కన్నడ భక్తులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. క్షేత్రానికి చేరుకు న్న కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ పూజా వేళలను మార్పులు చేసి వేకువజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● నలుగురికి గాయాలు ● గొర్రెల మందను తప్పించబోగా ఘటనపాణ్యం: ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తమ్మరాజుపల్లె–సిమెంట్నగర్ గ్రామాల మధ్య ఘాట్ దిగే చోట జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీ 39ఏజీ 5899 నంబర్ గల నందాల్య డిపో ఆర్టీసీ బస్సు బేతంచెర్ల నుంచి 55 మంది ప్రయాణికులతో నంద్యాలకు వస్తుంది. తమ్మరాజుపల్లె–సిమెంట్నగర్ గ్రామాల మధ్య ఘాట్ చివరి మలుపు వద్ద దిగే క్రమంలో ఒక్క సారిగా గొర్రెల మంద ఎదురొచ్చింది. ఆ గొర్రెలను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘాటనలో బేతంచెర్లకు చెందిన రాణి, ఉసేన్బీ, కమల, నాగలక్ష్మీ అనే ప్రయాణికులకు గాయాలు కావడంతో 108వాహనంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తలించారు. నంద్యాల డిపో మెనేజర్ మాధవిలత ఈ ఘటనపై ఆరా తీశారు. -
పండుగకు వచ్చి అనంతలోకాలకు
● గోనెగండ్లలో విషాదం ● బైక్ను ఢీకొన్న లారీ ● ఇద్దరు దుర్మరణం గోనెగండ్ల: ఉగాది పండుగ కోసం ఊరికొచ్చిన కొన్ని గంటల్లోనే రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. గోనెగండ్లలో లారీ– బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లలోని మొట్టివీధికు చెందిన మద్దక్క, అచ్చమ్మ కుటుంబాలు స్థానికంగా పనులు లేకపోవడంతో రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం తెలంగాణకు వలసవెళ్లాయి. ఈనెల 19న ఉగాది పండుగ ఉండటంతో మంగళవారం తెల్లవారుజామున వారు సొంతూరుకు వచ్చారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి సరుకుల కోసం మద్దక్క కుమారుడు మునిస్వామి (31), అచ్చమ్మ కుమారుడు మొండి వీరేష్ (17) బైక్పై గంజిహళ్లి రోడ్డు నుంచి బస్టాండ్ దగ్గరకు వెళ్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి అతివేగంగా వస్తున్న లారీ గోనెగండ్ల హైస్కుల్ సమీపంలో వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైర్ కింద పడిపోయిన మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరేష్కు తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ చంద్రబాబు దర్యాప్తు చేపట్టారు. మునిస్వామికి భార్య సిమ్రాన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అచ్చమ్మకు వీరేష్ ఒక్కగా నొక్క కుమారుడు. పండుగ కోసం వచ్చి మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబా లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ము నిస్వామి, వీరేష్ ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవార ని చావులోనూ అలాగే వెళ్లారని రోదించారు. రోడ్డు ఆక్రమణతోనే ప్రమాదాలు ఎమ్మిగనూరు–కర్నూలు రోడ్డు గోనెగండ్లలో దాదాపు 80 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ రోడ్డులో నిత్యం వాహనాల రాక పోకలు సాగుతుంటాయి. అయితే, రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాదారులు తమ అంగళ్ల ముందు ఆనకట్ట మాదిరిగా ఎత్తుగాా మట్టి వేయడం, తోపుడు బండ్లు పెట్టడం చేస్తున్నారు. దీంతో 80 అడుగుల రోడ్డు కాస్త 20 అడుగుల రోడ్డుగా మారింది. దీంతో బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో తరచుగా ప్రమాదా లు జరుగుతున్నాయి. లారీ వేగంగా వచ్చినప్పుడు మునిస్వామి, వీరేష్లు పక్కకు వెళ్లడానికి స్థలం లేకపోవడం కూడా ప్రమాదానికి ఓ కారణమని స్థానికులు అంటు న్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని రోడ్డుకు ఆనుకొని వెలసిన ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. మృతిచెందిన మునిస్వామి, వీరేష్ -
హొళగుందలో అకాల వర్షం
హొళగుంద/ఆలూరు రూరల్: మండల కేంద్రంతో పాటు గజ్జహళ్లి, వందవాగిలి తదితర గ్రామాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. వర్షంతో పాటు కొద్దిపాటి ఈదురుగాలులు వీయడంతో మామిడి పిందెలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిరప తడిసి పోయాయి. ఈ సమయంలో ఆదోని నుంచి హొళగుంద సబ్స్టేషన్కు కొద్ది సేపు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పగలంతా వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగింది. ఈ ఏడాది తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద రబీకి నీరివ్వకపోవడంతో వరిసాగు చేయక పోవడంతో పంట నష్టం చోటు చేసుకోలేదు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్లు పడటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు సాయంత్రం కురిసిన వానతో వాతావరణం చల్లబడి ఊరట చెందారు. రాజమండ్రి ఆర్డీఓగా ఆర్.శివరాముడు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిపిన పలువురు డీఆర్వోలు, ఆర్డీఓల బదిలీల్లో భాగంగా కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న ఆర్.శివరాముడు రాజమండ్రి ఆర్డీఓగా బదిలీ అయ్యారు. ఆయన వాస్తవానికి ఫిబ్రవరి 24న కడపలోని తెలుగు గంగ ప్రాజెక్టు యూనిట్–2 ఎస్డీసీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన ఆ పోస్టులో ఇంత వరకు చేరలేదు. ఈనేపథ్యంలో మంగళవారం జరిపిన బదిలీల్లో కడప నుంచి రాజమండ్రి ఆర్డీఓగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ప్రాణం తీసిన స్పీడ్బ్రేకర్
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ ఒక ప్రాణం తీసింది. స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా వేయడంతో బైక్పై కూర్చొన్న ఫక్కీరెడ్డి భాస్కర్రెడ్డి భార్య ఫక్కీరెడ్డి పద్మావతమ్మ(58) కింద పడి ఈ నెల 14న కోమాలోకి వెళ్లారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందారు. ఇష్టానుసారంగా స్పీడ్బ్రేకర్ వేయడంతోనే తన భార్య మృతి చెందారని ఫక్కీరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. కానిస్టేబుల్ సస్పెన్షన్ ఆదోని అర్బన్: స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామకృష్ణను సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గార్డెనియా విల్లాస్లో రాఘవేంద్ర అనే బాధితుడు ఇంటి దగ్గర కానిస్టేబుల్ రామకృష్ణ ప్రహరీని పగలగొట్టి భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో రామకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పంపారు. -
ప్లీజ్.. నన్ను తాకొద్దు..
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మొక్కను సెన్సిటివ్ ప్లాంట్ లేదా టచ్ మీ నాట్ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో మాత్రం అత్తిపత్తి, ముట్టుకుంటే మాడి అని కూడా పిలుస్తారు. దీని ఆకులను తాకినప్పుడు లేదా కదిపినప్పుడు క్షణాల్లో ముడుచుకపోతాయి. అందుకే దీన్ని సిగ్గుపడే మొక్క అనే పేరుతో పిలుస్తారు. ఇది దక్షిణ, మధ్య అమెరికాకు చెందినప్పటికీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలుపు మొక్కగా వ్యాపించింది. ఇది తరచుగా పొడినేల లేదా బీడు భూముల్లో పెరుగుతుంది. ప్రస్తుతం అధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడంతో కనుమరుగవుంది. పొలా ల్లో ఎక్కడ చూసి విచ్చల విడిగా కనిపించేది. దొర్నిపాడులోని ఓ స్కూల్లో మైదానంలో ఈ మొక్కలు కనిపించాయి. – దొర్నిపాడు -
అదుపు తప్పిన కారు
రుద్రవరం: మండల పరిధిలోని ముత్తలూరు మెట్ట సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం వైపు నుంచి ఆళ్లగడ్డకు వేగంగా వెళ్తున్న కారు ముత్తలూరు మెట్ట వద్ద మలుపు తిరుగుతూ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు తెలంగాణ వాసులు కాగా, దెబ్బతిన్న కారును యంత్రం ద్వారా ట్రక్కులోకి చేర్చుకొని తీసుకెళ్లారు. ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు వెల్దుర్తి: పట్టణంలోని ఓ వైన్షాపు వద్ద సోమవారం జరిగిన వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కృష్ణగిరి మండలం టి.గోకులపాడుకు చెందిన గోవిందు కత్తిపోటుకు గురయ్యాడు. గోవిందుకు, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఇటీవల విభేదాలు తలెత్తాయి. గోవిందు రెచ్చగొట్టడంతో వైన్షాప్ వద్దకు చేరుకున్న బోయ సురేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిపై పొడిచాడు. రక్తగాయాలైన గోవిందు స్థానిక సీహెచ్సీలో ప్రథమ చికిత్స పొందాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. -
డ్రగ్స్కు అడ్డాగా ఏపీ
ఆలూరు రూరల్: చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి డ్రగ్స్కు ఏపీ అడ్డగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడటం అత్యంత దారుణమన్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఆలూరు నియోజకవర్గంలో సైతం గుట్టుగా గంజాయి సాగు జరుగుతోందన్నారు. గంజాయి, కల్తీ మద్యం అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతోందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడ్డ యువత అరాచకాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారన్నారు. గత ఆదివారం ఆలూరు–ఆస్పరి మండలాల పరిధిలోని చిన్నహోతూరు, మరకట్టు, మూసానహల్లి గ్రామాల మధ్య అడవిలో పేకాట స్థావరాలపై జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్టు చేసి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే నియోజకవర్గంలో పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
విశ్రాంత డీఆర్వో జి.పుల్లయ్య మృతి
కర్నూలు(సెంట్రల్): విశ్రాంత డీఆర్వో జి.పుల్లయ్య మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్తో పోరాడుతూ సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన గతంలో కర్నూలు డీఆర్వోగా, తహసీల్దార్గా పనిచేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నంద్యాల డీఆర్వోగా వెళ్లారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా డీఆర్వోగా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో కర్నూలులోనే ఉంటున్న ఆయన క్యాన్సర్తో పోరాడుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.నాగరాజు, లక్ష్మీరాజు తదితరులు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి ఆస్పరి: బిణిగేరి గ్రామ సమీపంలో సోమ వా రం ట్రాక్టర్ కింద పడి మహేష్ బాబు (24) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు మేరకు.. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామం నుంచి నాపరాళ్ల లోడుతో డ్రైవర్ శేఖర్తో పాటు మహేష్ బాబు ఆదోని మండలం పెద్దహరివాణంకు అన్లోడు కోసం వెళ్తున్నారు. బిణిగేరి గ్రామం సమీపంలో డ్రైవర్ శేఖర్ దగ్గర కూర్చున్న మహేష్ బాబు జారి కింద పడ్డాడు. దీంతో వెనుక టైర్లు ఎక్కడంతో మహేష్బాబు అక్కడక్కడే మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నంద్యాల(అర్బన్): పంటల సాగులో రైతులు వైవిధ్యం పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ అన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో సోమవారం పంటల వైవిధ్యం అనే అంశంపై జిల్లాలోని ఏఈఓలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ఎకరం వరి పంటకు ఇచ్చే నీటితో సుమారు 2–3 ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను సాగు చేయాలని సూచించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి మాట్లాడుతూ సీమ ప్రాంతంలో సుమారు 45 శాతం మెట్ట భూమి సాగులో ఉందని, అందులో పంట వైవిద్యాన్ని పాటించాలన్నారు. బెట్టను తట్టుకొనే వంగడాలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గిరిజారాణి, డాక్టర్ అశోక్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
భారీగా మద్యం పట్టివేత
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణం వెంకటాపురం కాలనీలో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ సుధీర్బాబు తెలిపారు. ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం డంప్ చేసినట్లు పక్కా సమాచారం రావటంతో దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఆంజనేయులు సైన్యంలో చేరి రిటైర్ట్ అయ్యాడని, చౌకధరతో తెచ్చిన మద్యాన్ని అధికర ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారన్నారు. మొత్తం 100 బాక్సులు తెచ్చినట్లు, అందులో 50 బాక్సులు విక్రయించగా మిగిలినవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మద్యాన్ని సైన్యం నుంచి తెచ్చుకున్న చెక్కపెట్టెలో రైలులో తీసుకువస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వీటి విలువ దాదాపు రూ. 6 లక్షలు పైగా ఉంటుందన్నారు. నిందితుడిపై ఇదే స్టేషన్లో మూడు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మద్యం బాటిల్స్పై అరుణాచలం స్టిక్కర్లు ఉన్నాయని, వీటిని అక్కడే నుంచే తెచ్చాడా, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చాడా అనేది విచారణ తరువాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ కేసును ఛేదించడంతో ఎకై ్సజ్ అిసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, కర్నూల్ సీఐ చంద్రవాస్, ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో సంగమేశ్వరుడి దర్శనం
కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో సంగమేశ్వరుడు జలాధివాసం వీడనున్నాడు. సోమవారం జలాశయం నీటిమట్టం 843 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం తగ్గడంతో సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం క్రమేపీ కృష్ణమ్మ ఒడిని వీడుతోంది. ప్రస్తుతం ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ కింది భాగం వరకు నీటి మట్టం ఉంది. దీంతో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో సంగమేశ్వరాల యం జలాధీవాసం వీడనుంది. కాగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న కన్నడ భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు రావడం విశేషం. ఆయల పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివలింగానికి కర్ణాటక భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. -
ఎంపీగా పుట్టా మహేష్ అనర్హుడు
కర్నూలు(టౌన్): డ్రగ్స్ లేకుండా చేస్తా అని ప్రచారం చేసి, చివరకు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆ పదవికి అనర్హుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల చంద్రబాబు పాలనలో అరాచకాలు, మహిళలపై దాడు లు, వేధింపులు పెరిగిపోయాయన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై ఐదు రౌండ్ల కాల్పులు జరపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేయడంతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడన్నారు. అదే పార్టీకి చెందిన కిరణ్ రాయ ల్, కూన రవికుమార్ మహిళలను వేధిస్తు న్నా అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ తమను వేధిస్తున్నాడని ఆ పార్టీ మహిళా నాయకురాళ్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి కారణమైందన్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేసి, దౌర్జన్యం చేసి, మహిళలను సైతం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. కర్నూలులో అర్ధరాత్రి మద్యం సేవించిన మంత్రి టీజీ భరత్ అనుచరులు మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేయ్యలేదా.. దాడికి యత్నించలేదా? ఎలాగోలా మద్యం మత్తులో ఉన్నవారిని స్టేషన్కు తరలిస్తే అక్కడ వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కుర్చీలో కూర్చోబెట్టి టీ తాగించి పంపించారన్నారు. విద్యా రంగ సమస్యలు పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ వీడియో గేమ్స్, క్రికెట్ చూడటం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఈ రాష్ట్రానికి సుపరి పాలన ఒక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. -
ఆడపడుచు అనుగ్రహం కోసం
● శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు ● మల్లన్న దర్శనానికి బారులుదీరిన భక్తులు శ్రీశైలంటెంపుల్: తమ ఇంటి ఆడపడుచు అనుగ్రహం కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి శ్రీశైల భ్రమరాంబ దేవికి భక్తిశ్రద్ధలతో మొక్కు లు తీర్చుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉత్సవాల కంటే ముందుగానే శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. సోమవారం ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు నాలుగు విడతలుగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. -
బ్యాడిగ మార్కెట్కు పోటెత్తిన వాహనాలు
హాలహర్వి: ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ బ్యాడిగ మిరప మార్కెట్కు మిరప తరలింపు జోరందుకుంది. జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని మండలాలతో పాటు హాలహర్వి మండలంలోని గూళ్యం, నిట్రవట్టి, సిద్ధాపురం తదితర గ్రామాల నుంచి రైతులు తమ పంట దిగుబడులను టిప్పర్లు, మినీ వాహనాల్లో తరలిస్తున్నారు. ఆలూరు మీదుగా ఈ వాహనాలు వెళ్తూ హాలహర్విలో రోడ్డు పక్కన ఆపడంతో సందడి నెలకొంది. కాగా.. ఎకరాలో పంట సాగుకు రూ.80 వేల నుంచి రూ.1.20లక్షల వరకు వెచ్చించారు. బ్యాడిగ రకం మిరప ఎకరాకు 6–10 క్వింటాల దిగుబడి వస్తుంది. సీడు మిరప ఎకరాకు 15–20 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గుంటూరు మార్కెట్కు వెళ్లడానికి దూరం కావడంతో పాటు.. ఖర్చులు ఎక్కువవుతుండటంతో సరైన ధర లభించదని, వెంటనే టెండర్లు పాడి డబ్బు వెంటనే ఇస్తున్న కారణంగా బ్యాడిగకు వెళ్లి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సీడ్ మిరప ధర క్వింటా రూ.15వేల నుంచి రూ.20 వేలు ఉండగా.. బ్యాడిగ మిరప ధర క్వింటా రూ.42వేల నుంచి రూ.53 వేలు పలుకుతోంది. -
ప్రమాదమని తెలిసినా..
మహానంది: పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకర మని ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వేలాది కిలో మీటర్ల దూరం నుంచి చిన్న చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో కూర్చుని ప్రయాణాలు చేస్తున్నారు. ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం, మహానంది, ఉరుకుంద ఆలయాలకు వస్తున్నారు. అందులో చాలా మంది చిన్న చిన్న వాహనాల్లో ఇలా పరిమితికి మించి కూర్చు ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. మహానందిలో ఆదివారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది. -
గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం
● జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్నాయక్ కర్నూలు(అర్బన్): గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం చేస్తామని గిరిజన ప్రజా సమాఖ్య (జీపీఎస్) జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్యా శంకర్నాయక్ అన్నారు. కర్నూలు నగర శివారుల్లోని గిరిజన భవన్లో గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజునాయక్, రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ గిరిజన సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వడిత్యా శంకర్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాది గిరిజన కుటుంబాలకు కనీస సదుపాయాలు లేవన్నారు. కనీసం రేషన్, ఆధార్కార్డులు కూడా లేని పరిస్థితి కొనసాగుతుండడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో సుగాలి, చెంచు, ఎరుకల, యానాది, నక్కల వంటి అనేక గిరిజన జాతులు ఉన్నప్పటికీ వారికి సముచిత రాజకీయ ప్రాతినిఽథ్యం లేదన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచే ప్రతిపాదన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. శ్రీశైలం దేవస్థానంలో గిరిజన సత్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీపీఎస్ గౌరవాధ్యక్షుడు కేజీ నాయక్, రాయలసీమ ఉద్యమ నేత సీమ కృష్ణ, సందీప్నాయక్, రామ్ బాలాజీ నాయక్, నాగస్వామి నాయక్, సుధాకర్నాయక్, శివనాయక్, వెంకటశివ నాయక్, బాలనాయక్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
వినియోగదారుల రక్షణ చట్టంతో మోసాలకు అడ్డుకట్ట
కర్నూలు(సెంట్రల్): కేంద్రం ప్రభుత్వం 2019లో తెచ్చిన వినియోగదారుల రక్షణ చట్టంతో వ్యాపారులు చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.రాజారఘువీర్ తెలిపారు. ఆదివారం వినియోగదారుల కోర్టులో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన దినాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో చిన్న వస్తువును కొనుగోలు చేసినా బిల్లును తీసుకోవాలని సూచించారు. తద్వారా ఆ వస్తువు నకలిదీ అయినా, నాణ్యత లేకున్నా మోసాన్ని నివారించేందుకు వీలు ఉంటుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్కుమార్, సభ్యురాలు నజ్మా కౌసర్ మాట్లాడుతూ.. వినియోగదారుల సేవలు లేదా వస్తువు కొనుగోలు మోసం జరిగితే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలని సూచించారు. 1915 అనే టోల్ నంబర్కు నేరుగా వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదు చేయవచ్చున్నారు. మరో కమిమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాతూ.. ఆన్లైన్ కొనుగోళ్లలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, బిల్లులు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, నదీంహుస్సేన్, శివమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
వీరశైవానికి ప్రతీకలు కన్నడిగులు
ఆత్మకూరురూరల్: నల్లమల అడవుల మీదుగా సాధారణ నడకతో ప్రయాణించడమంటేనే అది ఒక సాహసం. ఆ పర్వతప్రాంతంలో శిఖరాలు అధిరోహిస్తు లోయల్లోకి దిగడం సాధారణ స్థితిలోనే ప్రాణాంతకం. అలాంటిది నాలుగు అడుగుల కృత్రిమ కాళ్లను (కర్రకాళ్లు) కట్టుకుని కొండ ఎక్కడం కాని, లోయలలోకి దిగడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. అయితే ఉగాది పరిశకు హాజరయ్యేందుకు కన్నడిగులు పాదయాత్రతో అధిక మంది నల్లమల మీదుగా నడుస్తుండగా కొందరు మాత్రం ప్రత్యేకంగా మరగాళ్లతో వస్తుంటారు. నాగలూటి వద్ద మెట్లు ఎక్కేటప్పుడు, భీముని కొలను వద్ద శిఖరం ఎక్కడం, దిగడం మరగాళ్లతో నడవడం కష్టసాధ్యమైనది. ఏమాత్రం జారినా 80 అడుగుల లోయల్లో పడిపోవాల్సిందే. కొందరు సహచరులు మరగాళ్లతో నడిచే వారిని తాళ్లతో కట్టి బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తారు. ఇంతటి ప్రమాదకర ప్రయాణం చేసే వీరిని చూస్తే మధ్య యుగాలలో వీరశైవ మతం అవలంభించే వారు గుర్తుకొస్తారు. వారు తమ మొక్కులను భీకరంగా మొక్కే వారు. అంతే భీకరంగా వాటిని తీర్చుకునే వారు. కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీశైలంలో మహాశివుడికి తమ తలలను తెగ నరుక్కుని ఆత్మార్పణ గావించుకునే వారు. ఆ పరంపరలో తమ శరీరాలను కష్టపెట్టే మహాభక్తి నేటి తరాల్లో కూడా ఇలా కనిపిస్తూ ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తోంది. -
నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం
కల్లూరు: నిరక్షరాస్యత నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు మండలం చిన్నటేకూరు, తడకనపల్లె గ్రామాలోని పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వయోజనులు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగశేషాచలరెడ్డి, ఎపిఎం పుష్పావతి, తదితరులు పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.9,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం 3,574 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటాకు గరిష్టంగా రూ.9,290 ధర లభించిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ. 3,461, మధ్యస్థ ధర క్వింటా రూ.7,120 పలికినట్లు పేర్కొన్నారు. ఆముదాలు 88 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ. 2,520, మధ్యస్థ ధర క్వింటం రూ.5,811,గరిష్ట ధర రూ.5,904 , కందులు 6 క్వింటాళ్లు వి క్రయానికి రావడంతో వాటిలో క్వింటం కనిష్ట ధర రూ.6,520, మధ్యస్థ ధర రూ.6,869, గరిష్ట ధర రూ.7,029 పలికిందన్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామ సమీపంలో ఆదివారం స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరా లు మేరకు.. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలకు చెందిన విరూపాక్షి, రామకృష్ణతో పాటు మరో 16 మంది వ్యక్తులు చిన్నహోతూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతుండగా దాడు లు చేసి అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకుని 17 సెల్ఫోన్లు, 8 బైకులు సీజ్ చేశామన్నారు. ఎక్క డైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్ప డితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. -
● రూ. 7 లక్షలు విలువజేసే ఏడు వాహనాల స్వాధీనం
మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు కర్నూలు (టౌన్): వెూటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను (ఒకరు మైనర్) పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14 వ తేదీ వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి కర్నూలు మార్కెట్ యార్డు వద్ద మోటారు సైకిల్ను పార్కింగ్ చేశారు. యార్డులోకి వెళ్లి వచ్చేలోపు వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వెంకటరమణకాలనీకి చెందిన కార్తీక్ స్థానికంగా ట్రెండ్ మచ్చాలో సేల్స్బాయ్గా పనిచేస్తున్నాడు. తన మోటార్ సైకిల్ను షాపు వద్ద పార్కింగ్ చేయగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ విక్రమసింహరెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, సిబ్బంది మురళీధర్, సుబ్బారాయుడు, గోవింద్లు టీమ్లుగా ఏర్పడి అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. కర్నూలు నగరంలోని బాపూజీ నగర్కు చెందిన మల్లెపోగు చెన్నయ్య, సమీప బంధువు ఒక మైనర్ బాలుడు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే ఆరు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
స్పర్శ దర్శనం కోసం సాహసం
శ్రీశైలం: మల్లన్న దర్శనార్థమై శ్రీశైలం వచ్చిన కన్నడిగులు ఆదివారం క్యూలైన్లలో ప్రమాదకర పరిస్థితుల్లో సహసం ప్రదర్శించారు. సుమారు 20 అడుగుల పైగా ఎత్తుకు కట్టిన క్యూల గ్రిల్స్ పైకి ఎగబాకి పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి పక్కనే ఉన్న మరో క్యూలోకి కిందికి దూకారు. ఆదివారం రాత్రి వరకే స్పర్శ దర్శనం ఉండడంతో సోమవారం నుంచి అలంకార దర్శనం మాత్ర మే ఏర్పాటు చేయడంతో ఎలాగైనా స్వామివార్లను స్పర్శ దర్శనం చేసుకోవాలని సంకల్పంతో ఈ సాహసానికి పాల్పడ్డారు. ఆదివారం వేకువ జాము నుంచి ఉచిత ప్రత్యేక దర్శన క్యూలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. త్వరగా దర్శనం చేసుకోవాలని తలంపుతో కొంతమంది ఒక క్యూ నుంచి మరో క్యూలోకి వెళ్లేందుకు సాహసం చేశారు. ఉచిత ప్రత్యేక దర్శన శీఘ్ర దర్శన క్యూ షెడ్లలో ఉన్న ఇనుప గ్రిల్ పట్టుకొని పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి మరో క్యూలోకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంత ఎత్తు నుంచి ఎవరైనా ప్రమాదవశాత్తు కింద పడితే అంతే సంగతులు. మరోవైపు 500 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్ల క్యూల వద్ద టికెట్ల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ పోలీసు బందోబస్తు ఉండటంతో పోలీసులు చొరవ తీసుకొని తోపులాటను అడ్డుకున్నారు. కానీ క్యూ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాక లోపల బందోబస్తు పోలీసులు తెల్లవారుజాము సమయంలో లేకపోవడంతో కొందరు యువకులు అత్యుత్సాహంతో ఎత్తైన క్యూలలోకి ఎక్కి దిగారు. -
హామీలు అమలు చేయకుండా శ్రమదోపిడీ
కర్నూలు(సెంట్రల్): ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి ఆరోపించారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ అధ్యక్షతన ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు చాలీచాలనీ వేతనాలు ఇస్తూ రోజుకొక యాప్తో వేధిస్తోందని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలి కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణపాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్నగర్లో నివాసం ఉంటున్నారు. గాయత్రీ ఎస్టేటులోని అర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. తండ్రి జయరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రమణ్యేశ్వరుడికి వెండిపడిగెలు వితరణ పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామికి ఆదివారం రెండు వెండి పడిగెలు భక్తులు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు 500 గ్రామలు, బండిఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య 485 గ్రాముల వెండి పడిగెలు ఇచ్చారని తెలిపారు. -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధికసంఖ్యలో భక్తులు శ్రీగిరి తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది మహోత్సవాలు సోమ వారం ఉదయం 9 గంటలకు దేవస్థాన ఈఓ, ఉభ య దేవాలయాల ప్రధానార్చకు లు, స్థానాచార్యులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో మొదటిరోజు సోమవారం భ్రమరాంబాదేవికి మహాలక్ష్మీ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకీకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు గ్రామపురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ఆదోని సెంట్రల్: రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమాసం. కఠోర ఉపవాస దీక్షలతో పగలు, రాత్రి తేడా లేకుండా అల్లా స్మరణలో గడుపుతారు. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రాత్రి లైలతుల్ ఖదర్. దీన్నే ’బడీరాత్’ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే ముస్లింల ఆరాధ్య దైవ గ్రంథం దివ్యఖురాన్ అవతరించిందని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలకు, ఖురాన్ పఠనానికి, దానధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను తమ ప్రత్యేక ప్రార్థనలతో అల్లా క్షమిస్తారని నమ్మకం. దీంతో రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడుపుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా మసీదులున్నాయి. నేడు లైలతుల్ ఖదర్ సందర్భంగా వాటిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇషా నమా జ్ తర్వాత జరిగే ఈ ప్రార్థనల్లో ఆధ్మాతిక వేత్తల ప్రసంగాలు, పవిత్ర ఖురాన్ పఠనం, జికర్, తహజు ద్ నమాజ్ చేస్తూ రాతంత్రా జాగరం చేస్తారు. -
రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన
మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులు కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సిబ్బంది పనిభారంతో సతమతవుతున్నారు. ఒక బాధ్యతతో నాలుగైదు విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవులో వెళ్లాలన్నా కుదరకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. దీంతో రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, పత్తికొండ రెవెన్యూ సబ్డివిజన్లలో ఇన్చార్జ్ అధికారులు ఉన్నారు. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదోని సబ్కలెక్టర్ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో ఈ బాధ్యతలను హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–3 సబ్ కలెక్టర్ అజయ్ చంద్రశేఖర్కు అప్పగించారు. పత్తికొండ ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన తన బాధ్యతలను సబ్ కలెక్టర్ కొండయ్యకు అప్పగించి వెళ్లిపోయారు. తహసీల్దార్ల స్థానంలో డీటీలకు బాధ్యత కర్నూలు, ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో చాలా తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిప్పగిరి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, కోడుమూరు,, పెద్దకడబూరు, కౌతాళం, హొళగుంద, హాలహర్వి, కృష్ణగిరి మండలాలకు తహసీల్దార్లు లేరు. వారి స్థానంలో డీటీలకు బాధ్యతలు అప్పగించారు. పత్తికొండ డివిజన్లో పత్తికొండ, తుగ్గలి, ఆలూరు తప్ప మిగతా అన్ని మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఒక్క ఎమ్మిగనూరుకు మాత్రం నందవరం తహసీల్దార్కు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన నందవరం, ఎమ్మిగనూరు మండలాలకు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతులు లేనట్టేనా? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రెవెన్యూలో పదోన్నతుల ఫైల్ కదలడంలేదు. ఈ క్ర మంలో రిటైర్మెంట్లు, సస్పెన్షన్ల ద్వారా ఏర్పడుతు న్నా ఖాళీల పోస్టులను ఇన్చార్జ్లకు అప్పగించి చే తులు దులుపుకుంటున్నారు.జిల్లాలో మొత్తం రెండు ఆర్డీఓ,11 తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్లకు సబ్ కలెక్టర్/ఆర్డీఓ, డిప్యూ టీ తహసీల్దార్లకు తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లు/ఆర్ఐలకు డిప్యూటీ తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్/ఆర్ఐలుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కారుణ్య నియమకాల ద్వారా భర్తీ చేయవచ్చు. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అడ్హక్ పదోన్నతులకు బ్రేక్! ఇటీవల కర్నూలు జిల్లాలో ఖాళీగా 11, నంద్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 10 తహసీల్దార్ పోస్టులకు అడహక్ పదోన్నతుల కోసం కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఎల్ఏకు నివేదించారు. మొదట అక్కడ అడహక్ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా అడహక్ పదోన్నతులకు రెడ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ పద్ధతిలోనే తహసీల్దార్ పదోన్నతులను ఇవ్వనున్నట్లు సీసీఎల్ఏ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. అయితే అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో పదోన్నతులపై దృష్టి సారించడంలేదు. దీంతో ఇన్చార్జ్లతో పాలన ముందుకు సాగడం లేదు. ఒకవైపు రీసర్వే.. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుట్టలు గుట్టలుగా వినతులు వస్తున్నాయి. ఇన్చార్జ్లుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతల్లో పనిచేయాలని వీరిని అనధికారికంగా ఒత్తిడి వేయడంపై ఆవేదన చెందుతున్నారు. కొందరు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించలేక అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో చాలా మంది అధికారులు సెలవులో వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజ్లు, వాట్సాప్ లింక్ల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు పంపించి బ్యాంకు వివరాలు, ఓటీపీ తీసుకొని డబ్బులు దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, కార్డు వివరాలు, ఓటీపీలను చెప్పరాద ని హెచ్చరించారు. తెలియని యాప్లు ఇన్స్టాల్ చేయడంతో మొబైల్లోని డేటా దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీశైలం చేరుకున్న పుదుచ్చేరి సీఎం శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్ర మం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు రూ. 64.32 కోట్లు కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ పన్ను వసూళ్లు ముమ్మరం చేసినట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ. 64. 32 కోట్లు, నీటి పన్ను రూ. 6.74 కోట్లు వసూళ్లు అయినట్లు తెలిపారు. నగరంలోని పలు వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతిరోజూ 3 వేల నుంచి 3,500 ఓపీ రోగులు, 1200 నుంచి 1500 ఐపీ రోగులు చికిత్స పొందుతున్నారు. వాస్తవంగా ఇది 1,050 పడకల ఆసుపత్రి. గత ప్రభుత్వంలో దీని సామర్థ్యాన్ని 1,500 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముందుకు సాగుతుండగా ఎన్నికలు సమీపించాయి. దీంతో ఈ అంశం అటకెక్కింది. అయినా కూడా అప్పట్లో 1,500 పడకలకు అవసరమైన బడ్జెట్ను ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. కానీ ఇప్పుడు కేవలం 1,050 పడకలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు. నిధుల లేమితో ఆసుపత్రి ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ నిధులు సైతం ఆగిపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సిందే! ప్రైవేటు ఆసుపత్రుల్లో మాదిరిగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కూడా ఆరోగ్యశ్రీ(డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం ద్వారా ఇక్కడ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఉచితంగా వైద్యం అందించే కేంద్రం. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటేనే ఉచిత వైద్యం అనే రీతికి తీసుకొచ్చారు. ఈ ఆసుపత్రిలో దాదాపుగా 90 శాతం రోగులు ఆరోగ్యశ్రీ కార్డుపైనే చికిత్స పొందుతున్నారు. ఈ కార్డు లేకపోతే వారు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొన్ని వ్యాధులకు ఆసుపత్రిలో ఉన్న మందులు ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అధికారులే బయట కొనుగోలు చేసి రోగులకు అందించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కార్డులేని వారు ఆ మందులను డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేయలేని ప్రభుత్వానికి చెందిన నాల్గవ తరగతి ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే చిరుద్యోగులు, వ్యాపారులు చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఆసుపత్రిలో ఇలాంటి రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స మాత్రమే ఉచితం. ఖరీదైన మందులు, ఇన్ప్లాంట్స్, స్టెంట్స్, ఆపరేషన్కు అవసరమయ్యే ఇతర పరికరాలు కొనుగోలు చేయాల్సిందే. ఇతర రాష్ట్రాల వారికి మరీ ఇబ్బంది కర్నూలు మీదుగా రెండు జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో క్షతగాత్రులను ఈ ఆసుపత్రికే చికిత్స నిమిత్తం తీసుకొస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉంటే వారు చికిత్సకు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే వారి వద్ద ఎవ్వరూ లేకపోతే ఆసుపత్రి అధికారులు ఉచితంగా వైద్యం అందేలా చేస్తున్నారు. వారి వద్ద ఎవ్వరైనా ఉంటే మాత్రం జేబు నుంచి కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రిపై, వైద్యులపై నమ్మకంతో ఎక్కువ మంది చికిత్స కోసం వస్తుంటారు. వారి ఆరోగ్య కార్డులు ఇక్కడ చెల్లుబాటు కావు. ఈ కారణంగా ఇలాంటి వారు సైతం వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు మినహా, ఖరీదైన మందులు, ఆపరేషన్కు అవసరమైన సర్జికల్స్, పరికరాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. లేకపోతే వారి రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు తెగేసి చెబుతున్నారు. ఉచితం కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు? ప్రభుత్వ ఆసుపత్రి అంటే దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం అందించాలి. భారత పౌరులకు ఇది ప్రాథమిక హక్కు. మనిషికి ప్రభుత్వాలు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ రాష్ట్రానికై నా వర్తిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, అది కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి ఉచితంగా వైద్యం చేస్తామని కొర్రీలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి, ఇతర రాష్ట్రాల వారికి ఉచితంగా వైద్యం ఎలా చేయాలో ఆయా రాష్ట్రాల పాలకులు, అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందించే పరిస్థితి లేదనడం ఎంతవరకు న్యాయమని రోగులు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముందులు కొనాల్సిందే! ఆపరేషన్లకు ఖర్చు తడిసిమోపెడు ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి, ఉద్యోగులకు తిప్పలు తెలంగాణ, కర్ణాటక వాసులకు ఇంకా ఇబ్బంది వైద్యుల చికిత్స మాత్రమే ఇక్కడ ఉచితం ప్రభుత్వ ఆసుపత్రి అంటే కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ఉచిత వైద్యం అందించే ఆరోగ్య కేంద్రం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందుతోంది. అది లేని వారి జేబుకు భారీ చిల్లు పడుతోంది. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలు మాత్రమే ఉచితం. మందులు, ఆపరేషన్కు అవసరమైన ఇన్ ప్లాంట్స్, స్టెంట్స్ వంటివన్నీ కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిగ్గా కేటాయించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో ‘బాబూ.. పెద్దాసుపత్రికి వెళ్లొద్దు’ అని ప్రజలు అంటున్నారు. మాది తెలంగాణ రాష్ట్రం. కర్నూలు జిల్లా సరిహద్దులోని రాజోలి గ్రామం. నాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మా తరతరాలుగా వైద్యం కోసం కర్నూలుకే వస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, నాకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదంటున్నారు. నాకు నడుములో వెన్నుపూసలు అరిగిపోవడంతో ఆపరేషన్ అవసరమైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉచితంగా వైద్యం చేయలేమని, హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. మేము పేదవారం. హైదరాబాద్కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత మాకు లేదు. వైద్యం చేయాలని డాక్టర్లను వేడుకుంటున్నా వినడం లేదు. – కె.శివమ్మ, రాజోలి, తెలంగాణ రాష్ట్రం ఆసుపత్రిలో రోగులకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి వైద్యుల సేవలు, ఆసుపత్రిలో ఉన్న మందులు అందిస్తున్నాం. ఆపరేషన్కు అవసరమైన ఇన్ప్లాంట్స్, స్టెంట్స్ వంటివి రోగులే కొనుగోలు చేయాలని చెబుతున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇలాంటివి ప్యాకేజీలో వస్తాయి కాబట్టి మేమే కొనుగోలు చేసి ఇస్తాం. కార్డు లేకపోతే అందరికీ కొనుగోలు చేసి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి బయట కొనుగోలు చేసుకుని తెస్తే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
లోక్ అదాలత్లో 41వేల కేసులు పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు. రైతు త్యాగం మరువరానిది తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. -
శ్రీగిరి మల్లయ్య యుగే యుగే!
● శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు ● నేటితో ముగియనున్న స్పర్శదర్శనం ‘హే..మల్లయ్య...హే.. శ్రీగిరి మల్లయ్య యుగే యుగే’.. అంటూ కన్నడ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. కంబి(పల్లకీ)లు మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. పల్లకీల ముందు తప్పెట దరువులకు రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు. కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని తరలివస్తున్న కన్నడ భక్తులతో శనివారం శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. మల్లన్న స్పర్శదర్శనం నేటితో (ఆదివారం) ముగియడంతో కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీగిరి చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. – శ్రీశైలం టెంపుల్ కంబి(పల్లకీ)ని మోసుకుంటూ.. -
జిల్లాలో ముగిసిన సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను నలుగురు సభ్యులు కలిగిన సెంట్రల్ టీం తనిఖీలు చేపట్టింది. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. వెల్దుర్తి, మద్దికెర, దేవనకొండ, కర్నూలు, తుగ్గలి మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. ఉపాధి నిధులతో చేపట్టిన పండ్ల తోటలను కూడా పరిశీలించారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ల పురోగతిని అధ్యయనం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలతతో సమావేశమయ్యారు. తమ పర్యటనకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తాము చేపట్టిన తనిఖీలపై నివేదిక ఇస్తామని ప్రకటించారు. కాగా ఆదివారం నుంచి సెంట్రల్ టీమ్ ప్రతినిధులు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. -
ఎలక్ట్రీషియన్ మృతి
ఎమ్మిగనూరురూరల్: గువ్వలదొడ్డి గ్రామంలో ఎలక్ట్రీషి యన్ దుర్గాప్రసాద్ (28) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. గ్రామా నికి చెందిన మునిస్వామి, పద్మావతిల కుమారుడు దుర్గాప్రసాద్(28) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఆరేళ్ల క్రితం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన బేగంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గౌతంనంద్ (2) అనే బాలుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఐదు నెలలుగా బేగం పుట్టినిల్లు రాళ్లదొడ్డికి వెళ్లిపోయింది. భార్య పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12వ తేదీ ఇంట్లో గదిలో గడియ వేసుకుని నిద్రించి శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. త లుపులు బద్దలకొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
కర్నూలు (టౌన్): ప్రత్యేక అవసరాలు కలిగిన మహిళలు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఎంపవర్మెంట్ ఆఫ్ డెఫ్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళా సమాన అవకాశాలతో ముందుకు రావాలన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని రాణించాలన్నారు. మహిళలు తమ హక్కులు తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. డెఫ్ సంస్థలు సత్యవాణి, సయ్యద్ గౌస్ పాషా, సుబాల్ బాషా, తేజస్విని, ధరణీకుమారి, లక్ష్మీ, షేక్ రిజ్వానా బేగమ్, తేజేశ్వరి, సౌజన్య, సుబ్బమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నెలాఖరు వరకే ఎస్సార్బీసీకి నీటి విడుదల పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదల ఉంటుందని ఈఈ కిష్టన్న తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్బీసీ ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రసుత్తం గోరుకుల్ల జలాశయంలో 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడా నీటిని వృథా చేయరాదన్నారు. ఈనెల చివరి నాటికి గోరుకల్లు వద్ద నీటిని నిలిపివేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆయా బ్లాక్ కింద సాగు చేసుకునే రైతులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం అందిస్తామన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్ బిల్లుల నకిలీ సందేశాలను నమ్మొద్దు కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ మరిన్ని వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించాలని కొందరు వినియోగదారులకు సందేశాలు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలియజేస్తుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ఫ్రీ నెం.1912 లేదా 1800 425 155333కు కాల్ చేయవచ్చని, లేదా 91333 31912 నెంబరుకు చాట్ చేయవచ్చని సూచించారు. యువకుడు ఆత్మహత్య బనగానపల్లె: పట్టణంలోని తెలుగుపేటలో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు పది నెలల క్రితం వడ్డే చెంచయ్య తన కుమారుడు వడ్డె హేమంత్కుమార్ (19) కోసం ఫైనాన్స్ ద్వారా బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో ఫైనాన్స్ సిబ్బంది బైక్ను తీసుకెళ్లారు. ఈ విషయంలో తండ్రి, కుమారుడు తరచూ ఘర్షణ పడుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన హేమంత్కుమార్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి కొత్తపల్లి: ఓ గిరిజన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన చదరంపెంట గూడెం వాసి అయిన నిమ్మల పెద్ద అంకన్న అనే గిరిజన వృద్ధుడు సాయంత్రం స్నానం చేసి దుస్తువులు శుభ్రం చేసుకునేందుకు గూడెంకు పక్కనే ఉన్న గొరిసెల కాల్వకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో అటవీలోంచి ఓ ఎలుగుబండి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో అంకన్న కుడి, ఎడమ చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి బారి నుంచి అంకన్న బయటపడి గూడెం చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అంకన్నకు అటవీశాఖ నుంచి ఆర్థిక సహాయం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
నంద్యాల: పట్టణ శివారులో కర్నూలు బైపాస్ రహదారిలో కుందూనది వంతెన కింద శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నంద్యాల త్రీటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం కుందూనది బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు పట్టణంలోని నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వీధికి చెందిన పెయింటర్ హారిఫ్ (38)గా గుర్తించారు. మృతుడికి భార్య హమీద, కొడుకు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి తనతో ఘర్షణ జరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని మృతుడు భార్య చెబుతుండగా.. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపేశారని మృతుడి సోదరి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
జై మల్లన్న.. జైజై భ్రమరాంబ!
● ఆడపడుచు దర్శనానికి తరలివస్తున్న కన్నడిగులు ● నల్లమల మీదుగా శ్రీగిరి వైపు అడుగులు ఆత్మకూరు: శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసిన శ్రీభ్రమరాంబదేవి కన్నడిగులకు ఆడపడుచుగా కొలువుదీరి ఉందని భక్తుల విశ్వాసం. ఉగాది ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా సంప్రదాయం కొనసాగుతోంది. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివభక్తురాలైన భ్రమరాంబ కర్ణాటక ప్రాంతానికి చెందినవారని స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడ్ని వరించారు. శివుడు ఓ భ్రమరాన్ని (తుమ్మెదను) చూపించి, అది నిలిచిన చోటుకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో అమ్మవారు భ్రమరాన్ని అనుసరించారు. ఆ తుమ్మెద శ్రీశైలం వద్ద ఆగింది. అక్కడికి వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి.. స్వప్నంలో కనిపించింది తానేనని చెప్పడంతో అమ్మవారు వివాహమాడారు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కన్నడిగురాలైన భ్రమరాంబదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఏటా శ్రీశైలానికి సారె తెస్తారు. వందల కి.మీ. దూరం నుంచి శ్రీశైలం మహాక్షేత్రానికి కన్నడ సంప్రదాయరీతిలో మిరియాలపట్టు, ముత్తైదు సౌభాగ్యాలతో కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమలు, నూతన పట్టుచీరలు, రవికెలు, కొత్త చాటతో అమ్మవారికి చీర, సారె మహిళల నెత్తిపై పెట్టుకుని తమ ఆడపడుచు శ్రీభ్రమరాంబదేవి సమర్పిస్తారు. అమ్మవారికి మొక్కులు తీర్చి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు. వందల కి.మీ పాదయాత్రగా.. ఉత్సవాలకు దాదాపు 20 రోజుల ముందుగానే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. బళ్లారి, రాయచూరు, గుల్బర్గా, సోలాపూర్, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి వందల కి.మీ నడుస్తూ శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం నుంచి నల్లమల మీదుగా అటవీ మార్గంలో రాత్రి సైతం టార్చ్లైట్ల వెలుతురులో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నాగలూటి వద్ద వీరభద్రుడికి మొక్కులు చెల్లించి మెట్ల మార్గంలో నడక మొదలు పెడుతున్నారు. నాగలూటి వద్ద మహారాష్ట్ర బృందం చేపట్టిన అన్నదానంతో ఆకలి తీర్చుకుని శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. కై లాస ద్వారం చేరుకుని వడివడిగా శ్రీగి చేరి భ్రమరాంబకు జై.. మల్లన్నకు జై అంటూ నినదిస్తున్నారు. -
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపె దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ, అగ్రిప్రతిష్ఠాపన, నిత్యహవనములు జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 18న వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మొత్తం 37,331 మంది విద్యార్థుల కోసం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరిటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించి తగిన శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచినట్లు చెప్పారు. సెల్ఫోన్లు నిషేధం పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్ఎస్, మంచినీరు, మందులతో కూడిన ఉచిత వైద్య శిబిరాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపితే చాలని సూచించారు. ప్రశ్నపత్రాలను 34 పోలీసు స్టేషన్లలో భద్రపరిచామన్నారు. వీటిని ప్రతి రోజు ఉదయం 8 నుంచి 8.30గంటల మధ్య కేంద్రాలను చేరుస్తామన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలు లేదని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు. నేడు అక్షరాంధ్ర అభ్యాసకులకు పరీక్షలు అక్షరాంధ్ర కార్యక్రమంలో విద్యను అభ్యసించిన వారికి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,62,235 మంది పరీక్షలు రాసేందుకు అనువుగా మొత్తం 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లుగా పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లను నిమించినట్లు చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్లో వయోజన విద్యా శాఖ డెప్యూటీ డైరక్టర్ చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ విజయ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హాల్టిక్కెట్ చూపితే విద్యార్థులకు ఉచిత ప్రయాణం విలేకరుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి -
వివాదాలకు ‘బలి’అవుతూ!
కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్ కుమార్ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్కుమార్తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి నిర్బంధం తెలంగాణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్ను స్టేషన్కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్ను కర్నూలు అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్తో రాజీ సంప్రదింపులు చేశారు. శాంతి కోసం పొట్టేలు బలి వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్హెచ్ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్స్టేషన్కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్లో వంటలు చేయించి స్టేషన్ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్టాపిక్గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరుపై విమర్శల వెల్లువ పరిస్థితులు అనుకూలించేందుకు శాంతి పేరుతో స్టేషన్కు పొట్టేలు బలి రక్త తర్పణం చేసి విందు చేసుకున్న సిబ్బంది పోలీసు శాఖలో హాట్ టాపిక్గా మారిన ఘటన ముడుపుల విషయంలో క్రైం పార్టీ పోలీసులపై వివాదం ఇదే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్లో సీఐ మధుసూదన్గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు.


