breaking news
Kurnool District News
-
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
● రూ.2.93 లక్షల ఎరువులపై స్టాప్సేల్స్కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరంలోని వివిధ ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. కల్లూరు మండల వ్యవసాయ అధికారి పరిధిలోని సాయికృప ఏజెన్సీస్, విజయలక్ష్మి ఏజెన్సీస్, కర్నూలు మండల పరిధిలోని మన గ్రోమర్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా యూరియా స్టాక్ వివరాలు, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. ఈ–పాస్లో ఉన్న స్టాక్, షాపులో ఫిజికల్గా ఉన్న స్టాకు వివరాలను తనిఖీ చేశారు. సాయికృప ఏజెన్సీస్లో సోర్స్ సర్టిఫికెట్ ఓ పామ్లో ఇంక్లాజన్ కానందున రూ. 2.93 లక్షల విలువ కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. ప్రయివేటు డీలర్ షాపుల్లో యూరియా లేదు. మన గ్రోమర్ సెంటరులో ఇంతవరకు ఎంత యూరియా వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. స్టాక్ ఎంత ఉందనే వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... యూరియాతో సహా ఎరువులకు సంబంధించిన రికార్డులు పకడ్బందీగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో కర్నూలు ఏడీఏ ఎన్.సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
‘సహకార’ విజేత కర్నూలు
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) సహకార ఉత్సవ్ 3.0 పేరుతో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్ర బ్యాంకు టీం అద్భుతమైన ప్రతిభ కనపరిచింది. విజయవాడలో జరిగిన పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకుల టీములతో పాటు నాబార్డు, ఆర్సీఎస్, ఆప్కాబ్ టీములు కలిపి మొత్తంగా 16 టీములు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా టీం అద్భుతంగా రాణించి ఛాంపియన్గా నిలిచింది. సహకార ఉత్సవ్ 3.0 క్రికెట్ పోటీల్లో కప్పును ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణయ్య చేతుల మీదుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ పి.రామాంజినేయులు, టీం కెప్టెన్ విజయసింహా రెడ్డి అందుకున్నారు. సహకార ఉత్సవ్ 3.0 విజేత అయిన కర్నూలు టీం సభ్యులను ఆప్కాబ్ ఎండీ రామకృష్ణయ్య, కర్నూలు డీసీసీబీ సీఈఓ రామాంజినేయులు అభినందించారు. కర్నూలు టీమ్లో ఎస్.విజయసింహా రెడ్డి, బి.నారాయణరెడ్డి, ఎస్.సొహైల్, జి.శ్రీనివాసులు, పులి సాయిప్రసాద్, టి.శంకర్, బి.సుకుమార్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, ఎల్.రవికుమార్ రెడ్డి, టి.మనోజ్, ఎన్.వీర మహేష్ ఉన్నారు. -
ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
డోన్ టౌన్: ఉడుములపాడు సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి వైపు నుంచి డోన్కు వస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సూదేపల్లెకు చెందిన జానకిరామ్, అమకతాడుకు చెందిన రమేష్ నాయుడులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వారిని చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జానకిరామ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతి
● ఇద్దరికి గాయాలుఆస్పరి: నాపరాళ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆస్పరి మండలం బిణిగేరి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బనగానపల్లె నుంచి ఆదోనికి నాపరాళ్ల లోడుతో ఆదోనికి వెళ్తున్న ట్రాక్టర్ను బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్స బిణిగేరి సమీపంలో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి అందులో ఉన్న బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన ముద్దవరం చిన్న మద్దిలేటి (35) అక్కడకక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నాగేశ్వరరావు, కూలీ లక్ష్మీ నరసింహ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బిణిగేరి గ్రామస్తులు అక్కడికి చేరుకుని నాపరాళ్ల కింద పడిన ఇద్దరిని బయటకు తీసి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. -
అహోబిలం మఠం అర్చకుడి మృతి
దొర్నిపాడు: ప్రముఖ పుణ్యక్షేత్రం అహో బిలం మఠం అర్చకు లు కిడాంబి లక్ష్మీనరసింహ చార్య (63) ఆదివారం చైన్నెలో గుండెపోటుతో మృతి చెందారు. ఎగువ అహోబిలంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, పతిత్రోత్సవాల్లో అర్చకులుగా ఈయన వ్యవహరించేవారు. మఠం పీఠాధిపతి, అర్చకులు, సిబ్బంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి అదృశ్యం మద్దికెర: స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి లక్ష్మీ కాంత్ శనివారం అదృశ్యమయ్యాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం ఇంటికి వచ్చి పుస్తకాలు ఉంచి స్నేహితుల ఇంటి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు సురేంద్ర, మీనా ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ అభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. గుర్తు తెలియని శవం లభ్యం కోడుమూరు రూరల్: గూడూరు సమీపంలోని పొలాల్లో ఆదివారం సాయంత్రం 40 సంవత్సరాలు పైబడిన ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని విధంగా మారి దుర్వాసన వస్తోంది. కాగా చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవ్వరైనా చంపి పడవేశారా అన్న కోణంలో గూడూరు ఎస్ఐ రాజ కుళ్లాయప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దూది పరుపుల గోదాములో అగ్ని ప్రమాదం ● రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఆదోని బైపాస్ రోడ్డు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న దూది పరుపులు తయారు చేసే గోదాములో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించి యజమాని దూదిపరుపుల బాషా, చుట్టు పక్కల వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.వీలుకాకపోవడంతో అగ్ని మాపక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే మంటల్లో దూది పరుపులు తయారు చేసేందుకు నిల్వ ఉంచిన దూది మొత్తం కాలిబూడిద కావడంతో రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. అండర్–14 క్రికెట్ ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోక్రాంతినగర్లోని సబ్ సెంటర్లో అండర్–14 బాలుర క్రికెట్ లీగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 90 మంది హాజరైనట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోవిందరెడ్డి, దేవేంద్రగౌడ్, అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ రమేష్బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మరో ఇద్దరు రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్లో నివాసముండే రౌడీషీటర్లు వడ్డే రేవంత్ కుమార్ (షీట్ నెం.387), వడ్డే శివకుమార్ (షీట్ నెం.388)లపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. కిరాయి హంతకుడు, 19 కేసుల్లో నిందితుడిగా ఉండి ఈనెల 11న జిల్లా బహిష్కరణకు గురైన వడ్డే రామాంజినేయులు అలియాస్ అంజికి ముగ్గురు కుమారులు సంతానం. తండ్రితో పాటు ముగ్గురు కుమారులపైన నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. వీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనల మేరకు వారి క్రిమినల్ రికార్డులను నిశితంగా పరిశీలించి కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దవాడు తులసికుమార్పై శనివారం బహిష్కరణ ఉత్తర్వులు జారీ కాగా వడ్డే రేవంత్కుమార్, వడ్డే శివకుమార్పై ఆదివారం జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిపై హత్యలు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు, జులుం, హత్యాయత్నం.. ఇలా పలు రకాల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 14వ తేదీన శరీన్ నగర్లో సుంకన్న హత్య కేసులో తండ్రితో పాటు వీరు జైలుకు వెళ్లారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఈనెల 5వ తేదీన తండ్రితో కలసి అదే కాలనీకి చెందిన అభిషేక్ను బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి వడ్డే రామాంజినేయులు, వడ్డే తులసికుమార్ ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు కుమారులు వడ్డే రేవంత్ కుమార్, వడ్డే శివకుమార్లపై కూడా జిల్లా బహిష్కరణ వేటు వేయడంతో వారిని కూడా జిల్లా జైలుకు తరలించనున్నారు. అరాచక శక్తులుగా మారితే పీడీ యాక్ట్: విక్రాంత్ పాటిల్, ఎస్పీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో జిల్లాలో ఇప్పటివరకు ఐదుగురిని జిల్లా బహిష్కరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతాం. మంచిగా మారి గౌరవ ప్రద జీవితాన్ని గడపాలి. వడ్డే శివకుమార్ వడ్డే రేవంత్ కుమార్ -
క్రికెట్ మ్యాచ్ గెలిచి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ● మరొకరికి గాయాలు ఎమ్మిగనూరురూరల్: క్రికెట్ మ్యాచ్ గెలి చి ఆదోనికి తిరిగి వెళ్తుండగా ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాల కృష్ణ(34) అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యా యి. ఆదోని పట్టణం నారాయణపురం గుంత కాలనీకి చెందిన బాలకృష్ణ(34) స్నేహితులతో కలసి ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా వీవర్స్ కాలనీలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు వెళ్లారు. సచిన్ లెవెన్ క్రికెట్ టీమ్ మ్యాచ్ అడి గెలు పొందారు. రాత్రి ఎమ్మిగనూరు నుంచి బైక్పై బాలకృష్ణ(34), వెంకటేష్ వెళ్తున్నారు. బనవాసి పారం సమీపంలోని స్మార్ట్ సిటీ ఎదరుగా ఉండే రోడ్డు దగ్గర డివైండర్ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్లో ఉన్న బాలకృష్ణ(34) తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న వెంకటేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. బాలకృష్ణ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయపడ్డ యువకుడిని చికిత్సనిమిత్తం ఆదోనికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ పోలీసులు రాత్రి తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం నంద్యాల (వ్యవసాయం): హిందువులంతా ఐక్యంగా ఉండి సనాతన ధర్మా న్ని కాపాడుకోవాలని శ్రీశైలం దత్త పీఠాధిపతి రుద్ర శివానంద సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం కోటా వీధి లోని బ్రహ్మానందీశ్వర ఆలయ ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. భారత మాత చిత్రపటానికి, శివాజీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభలో వక్తలు మాట్లాడుతూ అన్ని మతాలు, ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకునే ఏకై క దేశం మనదేనన్నారు. ఈ సమ్మేళనంలో మాకాం శేషఫణి, ఆరవీటి శ్రీనివాసులు, వాసగిరి కృష్ణ లింగయ్య, అరుణ, శిరీష, శంకర్ పాల్గొన్నారు. -
గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పోటీ ల్లో రాణించాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ బసవరావు, రిజిస్టార్ విజయకుమార్ నా యుడు అన్నారు. నంద్యాల పట్టణంలోని పీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరు గుతున్న రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆయా పోటీల్లో విజేతలకు రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ బసవరావు, రిజిస్టర్ విజయ్కుమార్నాయు డు, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ శివకిశోర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని నంద్యాలలో నిర్వహించిన ఈ పోటీలకు 17 కళాశాలలు పాల్గొన్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. విజేతల వివరాలు.. పురుషులు వంద మీటర్ల పరుగులో పోటీలో జోసెఫ్ (శ్రీలక్ష్మీ బీపీడీ కాలేజీ), మంజునాథ్ (ఉస్మానియా), దీవెన కుమార్ (ఉస్మానియా) ● 200 మీటర్ల పరుగు పోటీలో మహేష్ (సెయింట్ జోసెఫ్), జోసెఫ్ (ఉస్మానియా), జీవన్ కుమార్ (ఉస్మానియా) ● 400 మీటర్ల పరుగు పోటీలో పరుశు రాముడు (ఉస్మానియా), ఉపేంద్ర (ఉస్మానియా), రంగస్వామి (నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ● 1500 మీటర్లు పరుగు పోటీలో శివలింగప్ప, బషీర్, ఉపేంద్ర (ప్రభుత్వ డిగ్రీ కళాశాల) మహిళలు.. ● 1500 మీటర్లు పరుగు పందెంలో ప్రసన్న (నంద్యాల ప్రభుత్వ కళాశాల), మానస, తేజస్వని (సెయింట్ జోసెఫ్) షాట్పుట్లో: కీర్తన, జయశ్రీ ( ప్రభుత్వ కళాశాల) డిస్కస్త్రోలో.. ప్రసన్న, మహేశ్వరి (నంద్యాల ప్రభుత్వ కళాశాల) -
విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి
కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఏపీ క్యాడర్కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 జనవరి 1 నుంచి పదోన్నతి జీవో అమలులోకి వస్తుంది. అప్పటివరకు ఈయన ఈ పదవిలోనే కొనసాగనున్నారు. 2012 ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బెటాలియన్స్, అనంతపురం డీఐజీగా ? ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్–2(కర్నూలు) డీఐజీ పోస్టు ప్రస్తుతం ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతోంది. ఇక్కడ డీఐజీగా పనిచేసిన వెంకటేశ్వర్లు 2024 ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. అప్పటినుంచి గ్రేహౌండ్స్లో విధులు నిర్వహిస్తున్న డీఐజీ సీతారాం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా జనవరి 30న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో విక్రాంత్ పాటిల్కు బెటాలియన్స్ రేంజ్–2 డీఐజీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా పోస్టింగ్ దక్కే అవకాశమున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న షెమూషి ఐజీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్గా ఎస్పీ సతీమణి దీపిక పాటిల్ విధులు నిర్వహిస్తున్నారు. స్పౌజ్ గ్రౌండ్ కింద విక్రాంత్ పాటిల్ను బెటాలియన్స్ డీఐజీగా ప్రభుత్వం నియమించే అవకాశమున్నట్లు కూడా పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ఆ నలుగురూ జిల్లాకు సుపరిచితులే జిల్లాలో పూర్వపు ఎస్పీలుగా పనిచేసిన శంకబ్రత బాగ్చి డీజీపీగా, గోపీనాథ్ జెట్టి, ఆదోని అదనపు ఎస్పీగా పనిచేసిన డాక్టర్ షమూషి బాజ్పేయి, కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేసిన సెంథిల్ కుమార్లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ నలుగురూ జిల్లాకు సుపరిచితులే. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటయ్య క్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉద యం వేదపండితులు గోపూజ, స్వామివారికి విష్వక్సేనారాధన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన పూజలు చేపట్టారు. సాయంత్రం రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, చతుస్థానార్చన, దీక్షా హోమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మద్దిలేటి నరసింహ స్వామి వారికి విశేష పుష్పాలంకరణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహామంగళహారతి సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారు నారాయణ అవతారంలో సహస్ర దీపాలంకరణలో సేవలో భక్తులకు దర్శన మిచ్చారు. హనుమద్ వాహనంపై కొలువైన స్వామి వారు ఆలయ ఆవరణలో విహరించారు. -
అప్పుల పాలయ్యాం
కర్నూలు, ఓర్వకల్లు, హుస్సేనాపురం, డోన్, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఏడాదికి దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. లక్ష రూపాయలు కూడా చేతికి రావడం గగనమైంది. చేసిన అప్పులకు వడ్డీలు కొండలు పెరిగనట్లు పెరుగుతూ పోతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే దివాలా తీశాం. అయితే ఈ విషయం బయటకు చెప్పితే అప్పుదారులు మీద పడతారని తేలు కుట్టిన దొంగల్లాగా వ్యాపారంపై ఆశతో ఉన్నాం. – రామిరెడ్డి, కర్నూలు రెండున్నరేళ్ల క్రితం నూతన జిల్లా ఏర్పాటు సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆశాజనకంగా ఉంది. స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కరోనా అనంతరం కూడా భూములకు ధరలు పలికాయి. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు, జిల్లా కేంద్రాలు ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు మూడు రాజధానులు అంటూ చేసిన ప్రచారాలతో రియల్ ఎస్టేట్ రంగం వెలిగి పోయింది. తాము పట్టుకున్నదంతా బంగారంలా కనిపించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదే ఊపు ఉంటుందని భావించి మోసపోయాం. రూ. కోట్లు ఖర్చు పెట్టి కొన్న భూములు అమ్ముకోలేక భారీగా నష్టపోతున్నాం. – షేక్ షరీఫ్, రియల్టర్, విశ్వనగర్, నంద్యాల నిర్మాణ రంగం నిలిచి పోయింది. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పనులు దొరు కుతున్నాయి. ఇల్లు, భవన నిర్మాణాల పను ల వేగం తగ్గింది. రియ ల్ ఎస్టేట్ రంగం పుంజుకునేంత వరకు కార్మికులకు పనులు దొరికేలా లేవు. ఇల్లు గడవటం ఇబ్బందింగా మారింది. రెండేళ్ల క్రితం వరకు వారం రోజుల పాటు పనులు దొరికేవి. ఏడాది కాలంగా మూడు రోజుల పనితో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. భవన నిర్మాణ కూలీలను ఆదుకోవాలి. – తిమ్మయ్య, భవన నిర్మాణ కార్మికుడు, నంద్యాల -
నకిలీ వెబ్ సైట్ బారిన భక్తులు
ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ల బారిన పడి మల్లన్న భక్తులు మోసపోతూనే ఉన్నారు. తాజా గా ఉత్తరాది ప్రాంతానికి చెందిన గుజ్రాల్ అనే వ్యక్తి సైబర్నేరగాళ్ల బారినపడ్డాడు. శ్రీశైలం వచ్చే ముందుగానే అతను వసతి పొందేందుకు ఆన్లైన్లో ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉంచిన నకిలీ మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మూడు గదులు బుక్ చేసుకున్నాడు. ఒక రూముకు రూ.1,750 చొప్పున మూడు రూములకు అద్దె, జీఎస్టీ కలిపి మొత్తం రూ.5,821 తన ఖాతా నుంచి జమ చేశాడు. శనివారం అతను కుటుంబీకులతో శ్రీశైలం వచ్చి మల్లికార్జున సదన్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న రశీదును చూపగా అది ఫేక్ అని తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. నెల క్రితం టూరిజం నకిలీ వెబ్ సైట్ పైన టూరిజం అధికారు లు తక్షణమే స్పందించి సదరు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేయించారు. కానీ దేవస్థానం అధికారులు మల్లికార్జున సదన్ అనే ఫేక్ వెబ్ సైట్ను ఎందుకు బ్లాక్ చేయించలేకపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీశైలానికి వస్తున్న భక్తులు నకిలీ వెబ్ సైట్లతో మోసపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీగిరి భక్తులకు ఆన్‘లైన్’కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో గత మూడేళ్ల నుంచి అన్ని ఆర్జిత సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో భక్తులు వారి ఇంటి నుంచే ఉభయ దేవాలయా ల్లో నిర్వహించే ఆర్జిత సేవలను దేవదాయ అధికారిక వెబ్ సైట్, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్ల ను వినియోగించుకుని టికెట్స్ బుక్ చేసుకుని, సేవ లు నిర్వహించుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వాట్సాప్ గవర్నెస్ అంటూ మన మిత్ర (9552300009) వాట్సాప్ నంబర్ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్కు ప్రజల నుంచి ప్రభుత్వం ఊహించిన స్పందన రాలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ప్రభుత్వ మెప్పు కోసం పాట్లు పడుతుందోనే విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం దేవస్థాన ఈఓ ఆన్లైన్ సేవలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు మనమిత్ర వాట్సాప్ను భక్తులు విరివిరిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి త్వరితగతిన దర్శనం చేసుకునేలా వారికి ప్రత్యేక క్యూలు, లడ్డూ ప్రసాదాలు సైతం తీసుకునేందుకు కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునేలా కియోస్క్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాల్లో శివసేవకులను ఏర్పాటు చేసి ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణ.. ఓ వైపు ఆన్లైన్ బుకింగ్పై అవగాహన కల్పిస్తున్న దేవస్థానం అధికారులు ఆ మేరకు వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రద్దీ రోజుల్లో కనీసం టైం స్లాట్ కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా భక్తులచే విస్తృతంగా ఆన్ లైన్లో టికెట్స్ బుక్ చేయ డం, దేవాదాయ శాఖ, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్లను వినియోగించుకుని ముందస్తుగా టిక్కె ట్లు బుక్ చేసుకున్న వారితో క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్షేత్రంలో వసతి దొరక్క, దర్శనానికి గంటల తరబడి వేచి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ అని ప్రకటించినా.. అధికారు లు ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో క్షేత్రానికి వచ్చిన భక్తులు దేవస్థాన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. శ్రీశైల వెబ్ సైట్, మన మిత్ర యాప్లో అధిక సంఖ్యలో బుకింగ్ రద్దీ రోజుల్లో కరెంట్ బుకింగ్లోనూ అదే పరిస్థితి టైం స్లాట్, ప్రత్యేక క్యూ లేక భక్తుల కష్టాలు -
ఆదోని జిల్లా కోసం ఉద్యమం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం ఐక్యంగా ఉద్యమం చేస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, వీరేష్, వీరేష్, రఘురామయ్య పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆదోనిని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆపబోమని చెప్పారు. ఊరంతా గాదిలింగప్పలు ఆలూరు: హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి వెళ్లి ‘గాదిలింగప్ప’ అని పిలిస్తే వేల మంది వస్తారు. గ్రామంలో గాదిలింగప్ప తాత ఆలయం ఉంగా మొత్తం 8,900 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ప్రతి కుటుంబంలో మగ వారికి గాదెప్ప, గాదిలింగప్ప, ఆడవారికి గాదెమ్మ అని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు గ్రామంలో 2,500 మంది వరకు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు. గ్రామంలో చిరు తగాదాలు ఏర్పడితే అధికారులకు ఏ గాదిలింగప్ప, లింగన్నలు ఫిర్యాదు చేశారో తెలియడం లేదు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. 31న పింఛన్ల పంపిణీ కర్నూలు(సెంట్రల్): జనవరి పింఛన్లను ఇంటింటికీ వెళ్లి డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. ఇందుకోసం డిసెంబర్ 30న ఫింఛన్ సొమ్మును డ్రా చేసుకొని సేఫ్ లాకర్లలో ఉంచుకునేలా చూడాలని కోరారు. ఆదివారం ఉదయం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా పింఛన్ల పంపిణీపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పింఛన్ల పంపిణీలో అవితినీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సచివాలయ ఉద్యోగులను హెచ్చరించారు. పింఛన్ ఇవ్వడానికి ఇటీవల లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. మరోసారి ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించిన బెలుం గుహల సహజ అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటకతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుహ లోపల పర్యాటకులతో రద్దీగా మారింది. గుహ లోపల అవతరించిన పలు ప్రాంతాలను తిలకించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. -
నంద్యాల జిల్లాలో దయనీయం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నంద్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దయనీయంగా మారింది. కొనేవారు లేక వ్యాపారులు అప్పులపాలవుతున్నారు. గతంలో రేట్లు భారీగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన తర్వాత అనుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రేట్లు భారీగా పతనమయ్యాయి. నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో 2024కి ముందు ఎకరం రూ.6 కోట్ల వరకు విక్రయించారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో రూ.3 కోట్లకు మించి ధర పలకడం లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో 50 శాతం రేట్లు పతనమవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో వ్యాపారులు ఉన్నారు. ధరలు భారీగా పడడంతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు ఐపీ పెట్టి నంద్యాలను వదిలేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ● 2024–25కు సంబంధించి జిల్లాకు రూ.260.36 కోట్ల లక్ష్యంగా నిర్ణయిస్తే రూ.150.07 కోట్లు మాత్రమే సమకూరింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండడంతో రిజిస్ట్రార్లు ఆందోళనకు గురవుతున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో రూ. 171.22 కోట్లు ఆదాయం వచ్చింది. ● ఒక్క ఏడాదిలోనే జిల్లాలో రూ. 21.05 కోట్ల ఆదాయం తగ్గింది. -
బోనోఫిక్స్ అక్రమంగా రవాణా చేస్తూ..
● పోలీసుల అదుపులో బాలుడు పాములపాడు: ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ బాలుడు కర్నూలు నుంచి మత్తు పదార్థంగా వినియోగించే బోనోఫిక్స్ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కరివేనకు చెందిన బాలుడు ఈనెల 27వ తేదీ రాత్రి మిత్రుడి (మైనర్)తో కలసి కర్నూలు నుంచి స్వగ్రామానికి బోనోఫిక్స్ను అక్రమంగా బైక్పై తరలిస్తూ మార్గమధ్యలో యర్రగూడూరు వద్ద నిలిచారు. స్థానిక సీపీడబ్ల్యూ స్కీం వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని గమనించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించాడు. మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు ఆగ్రహంతో వాచ్మెన్పై దాడి చేసి గాయపరిచారు. వాచ్మెన్ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు 20కి పైగా బోనోఫిక్స్ ట్యూబ్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎవరికీ ఇచ్చేందుకు వెళ్తున్నాడని విచారణ చేపట్టామన్నారు. మైనర్ కావడంతో మందలించి తల్లిదండ్రులకు అప్పగించామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. -
వేదభూమిలో భక్తిపారవశ్యం
మంత్రాలయం: వేదభూమి మంత్రాలయంలో ఆదివారం భక్తిభావం వెల్లివిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ సన్నిధిలో అభిషేకం చేశారు. కుంకుమ అర్చన అనంతరం నైవేద్యం సమర్పించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి సువర్ణ కవచంతో ఆలంకరణ చేయగా భక్తులు దర్శనం చేసుకున్నారు. బృందవానానికి నిత్య పూజలు చేశారు. శ్రీమఠంలోని మధ్వ కారిడార్, కల్పతరు క్యూలైన్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. భక్తుల రద్దీని ఉదయం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థులు పరిశీలించారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య చెక్క రథంపై అంగరంగ వైభవంగా ప్రహ్లాదరాయలు విహరించారు. -
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం
మల్లన్నకు నృత్య నీరాజనం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ నిత్య కళావేదికపై హైదరాబాద్కు చెందిన డి. సుధారమ్య వారి బృందం వారిచే సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. కార్యక్రమంలో వినాయక విఘ్నరాజ, మూహికవాహన, జతిస్వరం, నమశ్శివాయతే, శంభో శివశంభో తదితర గీతాలకు పల్లవి, నిత్య, శరణ్య, గౌరి, విజయ తదితరులు నత్యప్రదర్శన ప్రదర్శించారు. – శ్రీశైలం టెంపుల్ పత్తికొండ రూరల్: హోసూరు గ్రామానికి చెందిన కారు మెకానిక్ మస్తాన్ కుమార్తె ఇన్షాబేగం (4)ఏళ్ల బాలికపై శనివారం వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. చిన్నారి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దాడి చేసి కాలుపై నాలుగు చోట్ల కరచింది. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుక్కను తరిమేసి బాలికను కాపాడారు. గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. మండలంలో ఇటీవల కుక్కకాటు కేసులు అధికమవుతున్నా గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాడి కేసులో నిందితుల అరెస్టు కర్నూలు: నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీలో రామాంజినేయులు, కేశమ్మపై జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కల్లూరు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రాజు, వేణుకుమార్, మహివర్దన్లు కలసి ఈనెల 6వ తేదీన రామాంజినేయులు, కేశమ్మలతో ఘర్షణ పడి దాడి చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిరి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కోడుమూరు రూరల్: అనుగొండ గ్రామానికి చెందిన రైతు పింజరి కమాల్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు కమాల్ తనకున్న రెండెకరాలతో పాటు, మరో 13 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 8 ఎకరాల్లో ఉల్లి, 7 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాడు. ఉల్లికి పెట్టిన పెట్టుబడులు కూడా రాక సుమారు రూ.7 లక్షలకు వరకు నష్టపోయాడు. అంతేగాకుండా కుమార్తె వివాహం, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు సుమారు రూ.15 లక్షల వరకు రైతుకు ఉన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీరుతో రైతుల ఆత్మహత్యలు.. రైతు కమల్ ఆత్మహత్యాయత్నానికి యత్నించిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ శనివారం ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. రైతు ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులతో చర్చించడంతో పాటు త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్సనందించాలని సూచించారు. ఈ సందర్భంగా డా.సతీష్ మాట్లాడుతూ.. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, ఇటు గిట్టుబాటు ధర లభించక, అటు నష్టపోయిన ఉల్లి పంటకు పరిహారం లభించక దిక్కు తోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నా రు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామ ని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ రహదారిలో రేవనూరు బస్స్టాప్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. రేవనూరు ఏఎస్ఐ ఇబ్రహీం అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన పెద్దకొట్టాల రాజు (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొక్కుబడి నిమిత్తం అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేందుకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరాడు. గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహన టైర్లు శరీరంపైకి ఎక్కడంతో తల నుంచి పొట్టభాగం వరకు శరీరభాగాలు నుజ్జయయ్యాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిపాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన నాగార్జున రెడ్డి, పద్మావతి దంపతుల కుమారుడు అవినాష్రెడ్డి(22) హైదరాబాద్లో సాప్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వచ్చిన అవినాష్రెడ్డి పనులు ముగించుకు శనివారం కారులో తల్లితో కలసి హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్దకు రాగానే మలుపు వద్ద కారు అదుపు కాక సూచిక బోర్డును ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నంద్యాల జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అవినాస్రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద సమయంలో కారులో రెండు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పద్మావతి గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. సేంద్రియ పంట ఉత్పత్తులకు ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించిన పంటలకు ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు అందజే యనున్నట్లుగా జిల్లా వ్యవసాయ అధికారిణి పీఎల్ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సిఫారస్సు చేసిన మోతాదులోనే ఎరువులు వినియోగించిన పంటలను పండించిన రైతులను గుర్తిస్తామన్నారు. పంట ఉత్పత్తులను రాష్ట్ర సేంద్రి య ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ తనిఖీ చేసిన తర్వాత ఇండిగ్యాప్ ధ్రువపత్రాలు అందచేస్తామన్నారు. ఈ ధ్రువపత్రం పొందిన రైతులు సేంద్రియ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవచ్చన్నారు. 2025–26లో జిల్లాలోని 24 మంది రైతులకు ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. పంటలు సాగు చేసిన విస్తీర్ణం ఎంత ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు యూనిట్ కాస్ట్ రూ.77,100 ఉందని, ఇందులో 50 శాతం అంటే రూ.38,500 ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 50 శాతం రైతు భరించాలన్నారు. జిల్లాలో ని రైతులు వీలైనంత త్వరగా ఇండిగ్యాప్ ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. -
సంజీవనికి అనారోగ్యం
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 104 ఎంఎంయూ వాహనాలు (సంచార చికిత్స) 40 ఉన్నాయి. వీటిని భవ్య హెల్త్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ పరిధిలో జిల్లాలో 40 మంది పైలెట్లు (డ్రైవర్లు), 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఈ వాహనాలు పీహెచ్సీకి మూడు కిలోమీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు ప్రతి నెలా రెండు సార్లు వెళ్లి అక్కడి ప్రజలకు వైద్యపరీక్షలు చేసి, వారి వ్యాధులకు సంబంధించిన చికిత్స, మందులు అందించి వస్తారు. ఈ వాహనంలో ప్రభుత్వ వైద్యాధికారితో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఏఎంఎలు ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న భవ్య హెల్త్కేర్ సంస్థ సంచార చికిత్స విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వంలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో ప్రస్తుతం సగం కూడా చేయడం లేదు. మందులు సైతం బీపీ, షుగర్ మినహా ఇతర మందుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో చాలా మంది మందుల కోసం ఈ వాహనాలు గాకుండా స్థానికంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లు లేదా సమీపంలోని పీహెచ్సీలకు వెళ్తున్నారు. ఈ కారణంగా సంచార చికిత్స వాహనాలు వచ్చినప్పుడు రోగుల సంఖ్య గతంలో కంటే తక్కువగా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులకు నిత్యం వేధింపులు.. 104 ఎంఎంయూ వాహనాల్లో పనిచేసే డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సంస్థ ఉద్యోగులు బహిరంగంగా వచ్చి నిరసన కార్యక్రమాల్లో తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. గత ఏడు నెలల నుంచి తమపై సంస్థ అనేక వేధింపులకు గురిచేస్తోందని చెబుతున్నారు. గత అరబిందో సంస్థ చివరి నెలలో చెల్లించిన జీతాలలో సైతం ప్రతి ఉద్యోగికి రూ.500 నుంచి రూ.2వేల వరకు కోతలు విధించిందని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు అనేక సంవత్సరాల నుంచి అమలులో ఉన్న 15 క్యాజువల్ లీవ్లను ఈ సంస్థ పూర్తిగా రద్దు చేసింది. గతంలో మొత్తం సిబ్బందితో పాటు పది శాతం అదనంగా బఫర్ సిబ్బంది ఉండేవారు. ఎవ్వరైనా సెలవు పెడితే వారి స్థానంలో బఫర్ సిబ్బందిని వాడుకునే వారు. ప్రస్తుతం బఫర్ సిబ్బందిని పూర్తిగా తొలగించారు. ఉన్న వారు సెలవు పెడితే వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఉద్యోగుల్లో పెల్లుబికిన ఆగ్రహం 104 వాహనాల్లో మందుల కొరత అంతంత మాత్రంగా వైద్యపరీక్షలు ఉద్యోగులకు నిత్యం వేధింపులు నిరసనలతో రోడ్డెక్కిన పైలెట్లు, డీఈఓలుభవ్య హెల్త్కేర్ సంస్థ ఉద్యోగులపై అనుసరిస్తున్న చర్యలు తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి గురిచేస్తున్నాయి. యాజమాన్యం ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించాల్సింది పోయి ఉద్యోగ సంఘ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం చేస్తూ ఆన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇటీవల 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబును సెలవులో ఉన్న సమయంలో జరిగిన వాహన తనిఖీలకు బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఇది ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సంస్థ వేదింపులపై ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ బాధను వెలిబుచ్చారు. వీరి ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు సైతం మద్దతు తెలిపారు. -
దేశ రక్షణకు కమ్యూనిస్టుల ఐక్యత అవసరం
నంద్యాల(న్యూటౌన్): ‘భారత రాజ్యాంగాన్ని మనుస్మృతిగా మార్చాలని చూస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల పతనానికి కమ్యూనిస్టుల ఐక్యత పునాది కావాలి. నాడు స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేశాం.. నేడు దేశ రక్షణకు మతత్వ శక్తులపై పోరాడేందుకు నంద్యాల వేదికగా నాంది పలకాలి’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉన్న వివేకానంద ఆడిటోరియంలో ‘కమ్యూనిస్టుల ఐక్యత, నేటి ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టు ల బలిదానాల వల్లే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, రామాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపడం హేయమైన చర్య అని ఖండించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ చేస్తూ తన సన్నిహితులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్కుమార్, సీనియర్ నాయకులు శంకరయ్య, మనోహర్ మాణిక్యం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, భార్గవ్, రఘురామ్మూర్తి, నాగరాముడు, లక్ష్మిదేవి, సోమన్న, తదితరులు పాల్గొన్నారు. -
15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాల్సిందే
104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం తగ్గించిన వేత నాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి. వారికి గతంలో ఇచ్చిన విధంగానే సంవత్సరానికి 15 క్యా జువల్ లీవ్లు ఇవ్వాలి. పూర్తిస్థాయిలో 104 వాహనాల్లో బఫర్ ఉద్యోగులను తీసుకోవాలి. భవ్య సంస్థ ఏడు నెలలైనా ఇప్పటి వరకు పే స్లిప్ లు,నియామక పత్రాలు, ఐడీ కార్డులు పూర్తిస్థాయి లో ఇవ్వలేదు. వెంటనే వాటిని ఉద్యోగులకు ఇవ్వాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు, 104 ఉద్యోగుల సంఘం గ్రామీణ ప్రాంతాల్లో అపర సంజీవనిగా పేరు తెచ్చుకున్న 104 వాహనాల ద్వారా ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, ఫిట్స్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులపై వేదింపులు మానుకో వాలి. మిగులు ఉద్యోగులను నియమించడంతో పాటు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి. – పెద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, 104 ఉద్యోగుల సంఘం -
మైనింగ్ లీజు రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం
ఆలూరు రూరల్: హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని క్వార్ట్జ్ క్వారీ మైనింగ్ లీజు రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తామని ఆ గ్రామస్తులు మైనింగ్ అధికారులను హెచ్చరించారు. క్వారీ ఎన్ఓసీ రద్దు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఈ నెల 15వ తేదీన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు అర్జీ అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గనుల, భూగర్భ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ హసీనాబాను ఆధ్వర్యంలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు క్వారీని పరిశీలించారు. అధికారుల రాక సమాచా రం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని సమస్యను విన్నవించారు. 2018 ఆగస్టులో గ్రామ సమీపంలోని క్వారీలో పేలుడు సంభవించి 14 మంది చనిపోయారన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అప్పటి అధికారులు మైనింగ్ని నిలిపేశారన్నారు. ఏడేళ్ల తరువాత గ్రామ సమీపంలోని కొండల్లో పేలుళ్లు, తవ్వకాలు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఈ ఏడాది జూలై నెలలో క్వారీ అనుమతులు రద్దు చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే మైనింగ్ అధికారులు వచ్చి పరిశీలన చేసి కొండలో తవ్వకాలు నిలిపివేశారని.. గత 20 రోజుల నుంచి ఆ క్వారీ ఇతర వ్యక్తులు లీజుకు తీసుకుని పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. క్వారీకి 200 మీటర్ల సమీపంలో చరిత్ర కలిగిన పురాతన ఆంజనేయ స్వామి ఆలయం, ప్రభుత్వ పాఠశాల, నివాస గృహాలు ఉన్నాయన్నారు. ఇదే ప్రదేశంలో 8 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసి సంపు, ఓహెచ్ఆర్ ట్యాంక్ ఉందని.. అలాగే పంట పొలాలపై దుమ్ము, ధూళి చేరడంతో పంటలు నష్టపోతున్నాయన్నారు. వాతావారణ కాలుష్యంతో గ్రామ ప్రజలు అనార్యోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు సర్వే నంబర్ 969,969/సీలోని క్వారీ లీజు రద్దు చేస్తూ నివేదిక తయారీ చేసి ఆలూరు తహసీల్దార్, జిల్లా గనుల, భూగర్భ శాఖ ఉన్నతాఽధికారులకు సిఫారస్సు చేస్తామన్నారు. నేటి నుంచి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్వారీ పరిశీలనలో మైనింగ్ విజిలెన్స్ అధికారి సాంబశివారెడ్డి, వీఆర్వో అమరేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. గనుల, భూగర్భ శాఖ అధికారులను నిలదీసిన హత్తిబెళగల్ గ్రామస్తులు -
పక్షుల బెడదకు చెక్
ఈ ఏడాది సాగు చేసిన జొన్న కంకిదశలో ఉండటంతో పంట చుట్టూ ఫ్లిక్కర్స్ (మెరిసే రిబ్బ న్లు) ఏర్పాటు చేసుకుని పక్షుల బారి నుంచి పంట ను కాపాడుకుంటున్నారు. స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లో కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపా డు మండలాల పరిధిలో ఖరీఫ్, రబీసీజన్లలో 7,119 హెక్టార్లలో రైతులు మహీంద్ర, హైటెక్, తదితర రకాలను చెందిన జొన్న పంట సాగు చేశారు. పంట చేతికందే దశలో పక్షులు కంకిపై వాలి జొన్న పిసుకుళ్లను తిని పంటకు నష్టం చేకూరుస్తున్నాయి. వాటి బారి నుంచి పంటను రక్షించుకునేందుకు జొన్న పంట చుట్టూ మెరిసే రిబ్బన్లు అమర్చారు. అవి ఎండకు మెరుస్తూ.. గాలి కదులుతుండటంతో పక్షులు పంటవైపు రావడం లేదు. – కోవెలకుంట్ల -
ఎందుకూ ఉపయోగపడటం లేదు
ఖరీఫ్లో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. రబీలో కూడా వేస్తున్నాం. ప్రభుత్వం సీసీఆర్సీ కార్డు కూడా మంజూరు చేసింది. అయితే కౌలుదారు ఆర్థిక చేయూతకు ఏమాత్రం తోడ్పడటం లేదు. అన్నదాత సుఖీభవ కూడా రాలేదు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. కనీసం కార్డుపైన యూరియా కూడా తీసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని కౌలు రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలి. – ఉప్పరి కాశయ్య, బోయరేవుల గ్రామం, వెలుగోడు మండలం సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులకు రుణాలు ఇవ్వలేం. కర్నూలు మండలం పసుపల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 366 మంది కౌలు రైతులకు రుణాలు పంపిణీ అయ్యాయి. ఇందులో 359 మంది రైతులు రుణాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.144.18 లక్షలు నిరర్థక ఆస్తుల్లోకి వచ్చింది. అందువల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నాం. – గత నవంబర్ 21న డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశంలో ఎల్డీఎం రామచంద్రరావు -
ప్రయాణికుల కస్సు‘బస్సు’
● కర్నూలు నంచి గూడూరు– ఎమ్మిగనూరు రూట్లో బస్సుల కొరత ● ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు కర్నూలు (సిటీ): కర్నూలు నుంచి గూడూరు మీదుగా ఎమ్మిగనూరు వెళ్లే రూట్లో ఆర్టీసీ బస్సుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఉచిత బస్సు అమలు చేసిన తర్వాత కొరత మరింత తీవ్రమయ్యింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో శనివారం రాత్రి 7 నుంచి 9:15 గంటల వరకు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రూట్లో బస్సు సర్వీసులు లేవని ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు ఆందోళన చేసినా అధికారుల్లో చలనం లేదు. ఈ విషయమై ఫిర్యాదుల విభాగంలో, డిపోలోకి వెళ్లి ప్రయాణికులు అడిగితే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాప్రతినిధులు సైతం ఈ రూట్లో బస్సుల కొరతను తీరుస్తామని చెబుతున్నప్పటికీ ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. శనివారం రాత్రి 9:18 గంటలకు బస్సు రావడంతో ప్రయాణికులు ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించి దొంగలు ఇద్దరు ప్రయాణికుల సెల్ఫోన్లను కాజేశారు. దీంతో బస్స్టేషన్ ఔట్పోస్టు పోలీసులు 20 నిమిషాలు బస్సు నిలిపివేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినా సెల్ఫోన్లు దొరకకపోవడంతో బస్సును ముందుకు కదిలించారు. -
ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
● హిందూ సమ్మేళనంలో వక్తలుహొళగుంద: ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు. సమ్మేళనంలో తుముకూరుకు చెందిన ఎం, బాలచంద్ర, బెంగళూరుకు చెందిన హారిక మంజునాథ్, సురేంద్ర మాట్లాడారు. అన్ని మతాలు, ప్రాంతాలు బాగుండాలని కోరే ఏకై క దేశం భారతదేశమన్నారు. ఇందుకు ఇక్కడి ప్రజలు నమ్ముకున్న సనాతన ధర్మమే కారణమన్నారు. చత్రపతి శివాజీ, ఆయన తనయుడు చత్రపతి సంభాజీలాంటి మహనీయులతో నేడు సనాతన ధర్మం మనుగడలో ఉందన్నారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
వెబ్సైట్లో అర్హుల జాబితా
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న లాస్ట్గ్రేడ్ సర్వీస్ రెండు పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రెండో విడత సెలెక్షన్ జాబితాను జిల్లా వెబ్సైట్లో ఉంచినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించే కౌన్సిలింగ్కు హాజరుకావాలన్నారు. వివరాలకు వెబ్సైట్లు https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in లను చూడాలన్నారు. వేగంగా పాత గేట్ల తొలగింపు పనులు హొళగుంద: తుంగభద్ర జలాశయంలో 33 పాత గేట్ల తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవగానే నెలలో ఆరు గేట్ల ప్రకారంగా కుడి, ఎడమ, మద్య భాగాలలో మొత్తం మూడు బృందాలు 2026 మే నెల కల్లా 33 గేట్ల బిగింపు పనులు పూర్తి చేస్తారు. పనులకు వీలుగా డ్యాంలో నీటిని నదికి వదిలి నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల వరకు తగ్గించారు. డ్యాంకు శనివారం ఇన్ఫ్లో నిలిచిపోయింది. జనవరి 10 లేదంటే మరి కొద్ది రోజులు మాత్రమే కాలువలకు నీటిని వదలనున్నారు. అనంతరం నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ప్రస్తుతం దిగువ కాలువ 250 కి.మీ వద్ద 647 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. -
శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శుక్రవారం ఒక్క రోజురూ.1,46,94,825 ఆదాయం వచ్చిందని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో స్పర్శదర్శనం, రూ. 300 అతిశీఘ్రదర్శనం, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 14 ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా దర్శనం, ఆర్జితసేవలు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా శుక్రవారం దేవస్థానానికి రూ. 73,19,314, ఆఫ్లైన్ ద్వారా రూ.73,75,511 ఆదాయం వచ్చిందన్నారు. రూ.1.50లక్షలు పలికిన పొట్టేలు! కోసిగి: పందెం పొట్టేలు రూ.1.50 లక్షలు పలికింది. మండల కేంద్రం కోసిగిలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని గవిగట్టు నారాయణ, కృష్ణ ఈ ఏడాది దేవర ఉత్సవాల కోసం మార్చిలో రూ.40వేలకు ఓ పొట్టేలు కొని పెంచుకున్నారు. రోజూ లీటరు పాలు, 4 కోడిగుడ్లు, కేజీ ఉలువలను ఆహారంగా అందించారు. ఉత్సవాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో విక్రయించాలని నిర్ణయించుకోగా, మద్దికేర మండలం ఆగ్రహానికి చెందిన ఈరన్న అనే రైతు రూ.1.50లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని బరువు 120 కేజీలు. మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్య మాసంను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. మద్దిలేటి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు -
జిల్లా అంతటా వాహన తనిఖీలు
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, బైకులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు. -
30న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(అర్బన్): మూడు చక్రాల మోటారు వాహనాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల సర్టిఫికెట్లను ఈ నెల 30న కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పరిశీలించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్ఫాతిమా తెలిపారు. కార్యక్రమానికి కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తుదారులు మాత్రమే హాజరు కావాలని ఆమె శనివారం ఒక ప్రకటన లో కోరారు. జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన చేపడతామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ ధృవపత్రాలను తీసుకురావాలని పేర్కొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి కోడుమూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ సుధాకర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం సాయంత్రం డీఈఓ కోడుమూరులోని బాలురు, బాలికల హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా హైస్కూళ్లలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. డీఈఓ ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి స్వయంగా సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులంతా ప్రతి రోజు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జయరామచంద్రుడు, హెచ్ఎం రామచంద్రుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కర్నూలుకు 80 టన్నుల గోధుమ పిండి కర్నూలు(సెంట్రల్): జిల్లాకు 80 టన్నుల చెక్కీ ఆట గోధుమ పండిని కేటాయించినట్లు సివిల్ సప్లై డీఎం వెంకటరాముడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ గోధుమ పిండిని కర్నూలు నగరంలోని రేషన్ కార్డుదారులకు మాత్రమే అందజేస్తామన్నారు. కార్డుకు కేజీ చొప్పున కేటాయిస్తామని, ప్రత్యేక ప్యాకింగ్లో వచ్చిన గోధుమ పండి కోసం రూ.20 వసూలు చేస్తామన్నారు. రౌడీషీటర్ తులసికుమార్ జిల్లా బహిష్కరణ కర్నూలు: కర్నూలు నాలు గో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్లో నివాసముంటున్న కిరాయి హంతకుడు వడ్డె రామాంజినేయులు పెద్ద కుమారుడైన రౌడీషీటర్ వడ్డె తులసి కుమార్ (షీట్ నెం.389)పై జిల్లా కలెక్టర్ ఏ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశా రు. ఇతను ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా రకరకాల కేసుల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలతో క్రిమినల్ రికార్డులు పరిశీలించి కలెక్టర్ శనివారం ఇతనిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈయన తండ్రి వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, అదే కాలనీలో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ ఖాన్పై కూడా ఈనెల 11న జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ కావడంతో జైలు జీవితం గడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అల వాటు పడిన మరో 15 మంది పేర్లు కూడా జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ఓటరు మ్యాపింగ్లో జిల్లాకు 14వ స్థానం
● మ్యాపింగ్ చేయని ఇద్దరు బీఎల్ఓల సస్పెన్షన్ ● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ స్థానంలో నిలిచిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జనవరి చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను సరిగా చేపట్టని ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశామన్నారు. మున్ముందు బీఎల్ఓలు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెట్లను(బీఎల్ఏ) వెంటనే నియమించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోదామును శనివార త్రైమాసిక తనిఖీ చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితాలో రూపకల్పన బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కుక్కను తప్పించబోయి.. గోనెగండ్ల: అయ్యకొండ గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన గుల్ల మొరుసు నాగేష్(35), ప్రభుతో పాటు మరో ఇద్దరు దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామంలో పెయింట్ పనులు చేసేందుకు బుధవారం ఉదయం బైకులపై వెళ్లారు. పనులు ముగించుకొని రాత్రి గోనెగండ్లకు బయలు దేరారు. నాగేష్, ప్రభు ఒక బైకుపై వస్తుండగా మార్గమధ్యలో గోనెగండ్ల మండలం అయ్యకొండ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. దీంతో నాగేష్ తలకు తీవ్ర గాయమైంది. ప్రభు ఎడమ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని గోనెగండ్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేష్ను కర్నూలు ఆస్పత్రికి, ప్రభును ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. నాగేష్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభు ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేష్కు భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును చూసిన కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు. పట్టుబడిన మద్యం ధ్వంసం డోన్ టౌన్: రూరల్ పోలీ సు స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులతో కలిసి గురువారం పట్టణ సమీపంలో ధ్వంసం చేసినట్లు రూరల్ పోలీసు స్టేషన్ సీఐ సీఎం రాకేష్ తెలిపారు. ఇందులో 30 కేసులకు సంబంధించిన వాటిలో 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు 7,732, 526 క్వాటర్ బాటిళ్లు, 40 పుల్ బాటిళ్లతో పాటు 295 లీటర్ల నాటుసారా మొత్తం కలిపి దాదాపు 820.56 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ బత్తలపల్లి: రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ తెలిపారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. బత్తలపల్లి మండలం కాటమకుంట గ్రామానికి చెందిన దొడ్డావుల ఆదిలక్ష్మి ఈ నెల 23న బత్తలపల్లిలో ధర్మవరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ప్రభాకర్ నేతృత్వంలో బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, తాడిమర్రి ఎస్ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణ బైపాస్ రోడ్డులో ఉన్న భరత్నగర్లో నివాసముంట్ను కోటయ్య (డ్రైవర్), పిలీషా (క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు అమ్మకం), శాంతి (హోటల్లో కూలి)తో పాటు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాలలను జువైనల్ హోంకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. కర్నూలు(అర్బన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కురువ సంఘం నేతలు అన్నారు. గురువారం నగర శివారుల్లోని శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇటీవల పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి చెందిన వారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోనే 2026 నూతన సంవత్సర కేలండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కేఏ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల విద్యపై అధిక దృష్టిని సారించాలన్నారు. అలాగే రాజకీయంగా కూడా కురువలు రాణించాలన్నారు. రానున్న స్థానిక సంస్ఘల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కురువలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా కురువలు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. భీర లింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, దిశా కమిటీ సభ్యులు దేవశంకర్, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ, నాయకులు కేసీ నాగన్న, బీ రామకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగాలు పొందిన వారికి భక్త కనకదాసు జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. -
మహిళ అదృశ్యం
కృష్ణగిరి: కోయిలకొండ గ్రామానికి చెందిన బోయ కొసనాపల్లె లక్ష్మీదేవి(45) రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామానికి చెందిన కొసనాపల్లె సుంకన్న, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా లక్ష్మీదేవికి మానసికస్థితి సరిగాలేక గతంలో పలుమార్లు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లి తిరిగి వస్తుండేది. కానీ ఈ నెల 24న ఉదయం ఇంటి నుంచి బయలు దేరి డోన్కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో కర్నూలు వైపు వెళ్లినట్లు కుటుంబీకులు తెలుసు కుని విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సుంకన్న పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. 5.2 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉండి, ఇంటి నుంచి వెళ్లినప్పుడు వంకాయపూత కలర్ చీర, నెత్తిన తెల్ల టవాలు వేసుకుని వెళ్లిందన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెల్దుర్తి సీఐ 9121101118, కృష్ణగిరి ఎస్ఐ 9121101117కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్యాపిలిలో రెండిళ్లలో చోరీ ప్యాపిలి: పట్టణంలోని స్థానిక హుసేనాపురం వీధిలో గురువారం తెల్లవారుజామున రెండిళ్లలో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు 2.5 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి నగలు చోరీ చేశారు. ఇదే వీధిలో ఉంటున్న పెద్దయ్య ఇంట్లో చొర బడి అర తులం బంగారు, 10 తులాల వెండి అపహరించారు. సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి కొద్ది రోజుల క్రితం కాశీకి వెళ్లాడు. గురువారం తిరిగి వచ్చిన ఆయ న ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దయ్య కూడా కుటుంబ సభ్యులతో కలసి బంధువుల ఊరికి వెళ్లాడు. మరో రెండు ఇళ్లలోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ నాగార్జున దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కోడుమూరు రూరల్: కర్నూలు – కోడుమూరు రహదారిలో ప్యాలకుర్తి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాలకుర్తి చెందిన గౌరయ్య కుమారుడు రెడ్డిపోగు యశ్వంత్ (27), సంగాల నాగేష్ క్రిస్మస్ సందర్భంగా బట్టలు కొనేందుకు కోడుమూరుకు బైక్పై బయలుదేరారు. ఇదే సమయంలో కర్ణాటక నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ప్యాలకుర్తి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యశ్వంత్, నాగేష్కు తీవ్ర గాయాలవ్వగా, చికిత్స నిమిత్తం కర్నూ లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక యశ్వంత్ మృతిచెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కాగా క్రిస్మస్ పండుగ వేళ ప్యాలకుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి గౌరయ్య ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిపై కత్తితో దాడి బొమ్మలసత్రం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి కత్తితో దాడి చేసుకున్న సంఘటన గురువారం నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. దేవనగర్కు చెందిన సుంకన్న, విజయ్ స్నేహితులు. ఇద్దరు కలిసి మధ్యాహ్నం మద్యం సేవించి మద్యం మత్తులో ఘర్షణ పడ్డా రు. ఈ క్రమంలో విజయ్ తన వద్ద ఉన్న కత్తితో సుంకన్నను కడుపులో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భక్తులకు బిల్లు ఇవ్వకుండా..
● దేవస్థాన మల్లికార్జున సదన్ కౌంటర్ ఉద్యోగి నిర్వాకం శ్రీశైలంటెంపుల్: స్థానిక మల్లికార్జున సదన్ ఉద్యోగి దేవస్థానం ఆదాయానికి గండి కొట్టారు. ఉత్తరాఖాండ్కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వీరు బుధవారం రాత్రి వసతి కోసం మల్లికార్జున సదన్ వద్దకు వచ్చి డార్మెంటరీ కావాలని అడిగారు. కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తన వక్రబుద్ధికి పని చెప్పాడు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుము రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1,750 తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి, వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి వారి వద్ద నుంచి రూ.2 వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్నట్లు సమాచారం. హిందీ భక్తులు బెడ్ తీసుకుని రాత్రి నిద్రపోయి ఉదయం ఫ్రెష్అప్ కూడా అయ్యారు. రాత్రి కౌంటర్లో విధులు నిర్వహించిన వ్యక్తి గురువారం ఉద యం తన విధులు ముగించుకుని మరో ఉద్యోగికి విధులు అప్పగించారు. ఉదయం 10 గంటల సమయంలో డార్మెంటరీ తీసుకునేందుకు భక్తులు వచ్చా రు. ఖాళీగా ఉండడంతో డార్మెంటరీని బిల్లు కొట్టి ఇతర భక్తులకు ఇచ్చాడు. అయితే అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ బెడ్ల మీద ఇతరులు ఉండడంతో కౌంటర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో కంగుతిన్న కౌంటర్ సిబ్బంది విచారించగా రాత్రి విధులు నిర్వహించిన ఉద్యోగి బిల్లు కొట్టలేదని తెలిసింది. దీంతో వారిని బయటికి పంపించి, బిల్లు తీసుకున్న వారిని డార్మెంటరీలోకి అనుమతించారు. ఈ విషయం తెలుసుకున్న రాత్రి విధులు నిర్వహించిన కౌంటర్ ఉద్యోగి హుటాహుటిన మల్లికార్జున సదన్ వద్దకు చేరుకుని హింది భక్తులతో బతిమిలాడుకుని, తనపై ఫిర్యాదు చేయకుండా వారిని ఒప్పించి, వారి డబ్బులు తిరిగి చెల్లించినట్లు సమాచారం. అయితే వసతి విభాగంపై ఉన్నతాధికారి, వసతి విభాగపు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అడవిలోకి వెళ్లని పులి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్య పరిధిలోని ఆత్మకూరు డివిజన్ సంగమేశ్వరం ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి కృష్ణా నదిని ఈదుతూ దాటి తెలంగాణాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం వైపు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పులి నదికి ఆవల సోమశిల తదితర గ్రామాల పరిధిలోని పొలాల్లో తిరుగుతున్నదని గుర్తించిన ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు నదికి అటుఇటు గస్తీ ముమ్మరం చేశారు. కొల్లాపూర్ అటవీ రేంజ్, ఆత్మకూరు రేంజ్ అధికారులు టీంగా ఏర్పడి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో ప్రజలను హెచ్చరిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతున్నారు. కొత్తపల్లె మండలంలోని జానాల, సిద్దేశ్వరం, కొల్లాపూర్ మండలం సోమశిల, మంచాలకట్ట,మల్లేశ్వరం తదితర గ్రామలలో గురువారం అధికారులు, సిబ్బంది పర్యటించారు. శ్రీశైలంలో బహిరంగ పేకాట శ్రీశైలం: శ్రీశైలంలో జూదం ఆడటం, మద్యం తాగడం, మాంసం తినడం చట్ట విరుద్ధం. అయితే టూరిస్ట్ బస్టాండ్ వద్ద బహిరంగంగా పేకాడ ఆడటం కనిపించింది. బుధవారం సాయంత్రం కనిపించిన ఈ దృశ్యాన్ని కొందరు స్థానికులు సెల్ఫోన్లలో రికార్డు చేసి వాట్సాప్లో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు టూరిస్ట్ బస్టాండ్ చేరుకునే లోగా అక్కడ పేకాట ఆడుతున్న వారు వాహనాల్లో వెళ్లిపోయారు. -
ఆయకట్టు రైతుకు ఇక కన్నీరే!
కర్నూలు సిటీ: రబీలో సాగయ్యే ఆయకట్టుకు తుంగభద్ర డ్యాం నుంచి సాగునీరు అందే పరిస్థితులు లేవు. ప్రస్తుతం డ్యాం పాత గేట్ల ఎలిమెంట్స్ను తొలగిస్తున్నారు. కొత్త గేట్ల పనులు మొదలు పెట్టేందుకు పది రోజులుగా నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ నీరంతా నదీ తీరంలోని గ్రామాలకు, పంట పొలాలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. వృథాగా దిగువకు వెళ్తున్నాయి. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు ఎలాంటి రిజర్వాయర్లు లేవు. టీబీ డ్యాంలో పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో ఏమీ లేకపోగా 8,752 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు, అలగనూరు రిజర్వాయర్ సామర్థ్యం 2.65 టీఎంసీలు. సుంకేసుల బ్యారేజీ నీరంతా కర్నూలు నగరపాలక సంస్థ తాగు నీటి అవసరాలకు సైతం సరిపోని పరిస్థితులు ఉన్నాయి. అలగనూరు రిజర్వాయర్ కట్టలు కుంగిపోవడంతో ఎనిమిదేళ్లుగా నీటిని నిల్వ చేయడం లేదు. మరమ్మతులు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పి 18 నెలలు అవుతున్నా పట్టించుకోలేదు. కేవలం మట్టి పరీక్షలకే పరిమితం అయ్యింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది వర్షాకాలం వరకు తుంగభద్రలో నీటి ప్రవాహం ఉండదు. టీబీ డ్యాంలో నుంచి నీటి విడుదల బంద్ చేయడంతో వారం పది రోజుల వరకు మాత్రమే కేసీకి నీటి విడుదల ఉంటుంది. ఆ తరువాత నీటిని బంద్ చేయనున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి కేసీకి నీటి విడుదల చేసే అంశంపై ఇప్పటి వరకు జల వనరుల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రబీలో టీబీ డ్యాం నుంచి అందని సాగు నీరు గేట్ల మరమ్మతులతో దిగువకు వెళ్తున్న నీరు అలగనూరు రిజర్వాయర్ను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
జనవరి 2న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): రీసర్వే జరిగిన గ్రామాలకు సంబంధించిన రైతులకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో నిర్ధేశించిన రోజున రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారని పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకోవాలని రైతులకు సూచించారు. కాగా, గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని ముందుగానే రెవెన్యూ అధికారులు తెలియజేస్తారని, ఆ రోజున వెళ్తే సరిపోతుందని ఆమె సూచించారు. మెంటార్లుగా జిల్లా, మండల స్థాయి అధికారులు కర్నూలు సిటీ: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉన్నత పాఠశాలలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని 361 ఉన్నత పాఠశాలలకు నియమించిన మెంటార్లతో నేటి(శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు సునయన ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది పరీక్షల ఫలితాల పెంపునకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెంటార్లకు కేటాయించిన పాఠశాలల్లో పునరావృత బోధన, పునశ్చరణ, సాధన పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడం, క్రమ శిక్షణ పెంపొందించడం, పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు. పింఛన్లకు నిధుల మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): జనవరి నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రీ వెరిఫికేషన్లో అనర్హత వేటు వేస్తూ నోటీసులు అందుకున్న దివ్యాంగులు అప్పీల్ చేసుకోవడంతో పునఃపరిశీలన జరుగుతోంది. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అందరికీ పింఛన్లను కొనసాగించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 4,50,865 పింఛన్ల పంపిణీకి రూ.196.64 కోట్లు మంజూరయ్యాయి. సీనియర్ అకౌంటెంట్ సస్పెన్షన్ కర్నూలు(అగ్రికల్చర్): రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డోన్ సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ లక్ష్మానాయక్ను సస్పెండ్ చేస్తూ కర్నూలు జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. ఏసీబీ కేసులో పట్టుబడి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నట్లు నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి నుంచి రిపోర్టు అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గురువారం విలేకర్లకు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా అంతటా డ్రంకెన్ అండ్ డ్రైవ్ను విస్తృతం చేస్తున్నామని, తనిఖీల్లో పట్టుబడితే నెల రోజుల పాటు జైలుశిక్ష తప్పదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 9,025 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నా రు. ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేయడంతో పాటు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దక్షిణ భారత సైన్స్ ఫేర్కు జహీర్ ఆత్మకూరు: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జహీర్ ప్రతిభ చాటి దక్షిణ భారత సైన్స్ ఫేర్కు ఎంపిౖకైనట్లు హెచ్ఎం దేవానందన్ గురువారం తెలిపారు. విజయవాడలో ఈనెల 23 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా ప్రదర్శనలో జహీర్ ఓవర్లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టం ఇన్ టూ వీలర్ (ద్విచక్ర వాహనాల్లో అధిక బరువును గుర్తించి హెచ్చరించే వ్యవస్థ) అనే నమూనాను ప్రదర్శించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ప్రాజెక్టు జనవరి 19 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న దక్షిణ భారత సైన్స్ ఫేర్లో ప్రదర్శించడానికి ఎంపికై ందన్నారు. -
ప్రత్యేక క్యాంపులైనా పరిష్కారాలు చూపుతాయా?
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ సమస్యలను పరిష్కరిస్తారంటే అక్కడకు వెళ్లి అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే గ్రామసభలు, రెవెన్యూ సదస్సులు, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో వచ్చినా పరిష్కారాలు కావడంలేదు. ఈ క్రమంలో డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లోనైనా అర్జీలు ఇస్తే పరిష్కారం అవుతాయన్న ఆశ రైతుల్లో ఉంది. అయితే అధికారులు ఏమి చేస్తారో తెలియడంలేదు. ఎప్పటిలాగే అర్జీలను తీసుకొని బుట్టదాఖలు చేస్తారా లేదంటే పరిష్కారాలు చూపుతారా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో స్వయంగా ఆయనే చేతులు ఎత్తి వేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మరోసారి అర్జీల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చుక్కల భూములు, అడంగల్ సమస్యలు, నిషేధిత జాబితాలోని భూముల సమస్యలపై అర్జీల స్వీకరణ డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ మధ్య అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నామని, వాటిలో అర్జీలు ఇస్తే పరిష్కారాలు చూపుతామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా పరిష్కరించకపోగా..మళ్లీ ఇప్పుడు అర్జీలు ఇవ్వాలని కోరడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు ఇచ్చిన అర్జీలు బుట్టదాఖలేనా? రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2024 అక్టోబర్లో గ్రామ సభలు, 2025 జనవరిలో రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఇందులో గ్రామ సభల్లో దాదాపు 18 వేల అర్జీలు రైతుల నుంచి తమ భూములకు సంబంధించి వచ్చాయి. అలాగే రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 6 వేల అర్జీలు వచ్చాయి. అయితే వీటికి ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు చూపారు. ఈ క్రమంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల వెంట తిరగడం రైతులకు పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో గ్రామసభలు, రెవెన్యూ సదస్సులను ఎందుకు నిర్వహించారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో వాటిలో వచ్చిన అర్జీలన్నీ బుట్టదాఖలేనా అన్న ప్రశ్న వస్తోంది. ఇందుకు ఎవరూ సమాధానం చెప్పడంలేదు, ప్రత్యేక క్యాంపుల్లో అర్జీ పెట్టుకుంటే పరిష్కరిస్తామని చెబుతున్నారు. పీజీఆర్ఎస్లో రెవెన్యూ సమస్యలే అధికం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో రెవెన్యూ సమస్యలే అధికం. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 61,108 అర్జీలు రాగా, అందులో 52,794 అర్జీలను పరిష్కరించినట్లు అధికారులు చూపారు. అలాగే 2912 అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 20,757 అర్జీలు ఉన్నాయి. ఇందులో 16,753 అర్జీలను పరిష్కరించామని, 1,816 అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు చూపారు. ఈ నివేదికలను బట్టి పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యల్లో రెవెన్యూ సమస్యలే అధికమని అర్థమవుతుంది. ఈ క్రమంలో పరిష్కరించిన సమస్యలే అధికంగా ఉన్నట్లు అధికారులు నివేదికలో పొందుపరచారు. అయితే బాధిత రైతులు మాత్రం ఎవరూ పరిష్కారమైనట్లు చెప్పడంలేదు. ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం శూన్యం మరోసారి 26 నుంచి 31 వరకు క్యాంపుల నిర్వహణ ఇప్పటికే రెవెన్యూ సదస్సులు, గ్రామసభల పేరుతో అర్జీల స్వీకరణ ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చిన ప్రజలు వాటికి పరిష్కారం చూపకుండా బుట్టదాఖలు బాధితుల ఆవేదన -
26 నుంచి ప్రత్యేక క్యాంపులు
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నాం. వాటిలో రైతులు అర్జీలు ఇస్తే చుక్కల భూములు, నిషేధిత జాబితా భూములు, అడంగల్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కార్యాలయంలో అధికారులు అ ందుబాటులో ఉండి పరిష్కారాలు చూపుతారు. – డాక్టర్ ఏ.సిరి, జిల్లా కలెక్టర్ నాకు చిప్పగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 558/1 1.17 సెంట్లు, మరో సర్వే నంబర్540/3లో 0.70 సెంట్లు మొత్తం 1.87 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి నాకు ఆదరువు. అయితే దానిని ఆన్లైన్ చేయమని పదిసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా. ఎవరూ పట్టించుకోవడంలేదు. అర్జీ ఇస్తే వీఆర్వోలు మాట్లాడి పరిష్కారమైనట్లు చెబుతున్నారు. నేను మాత్రం ప్రతి సోమవారం కలెక్టరేట్కు వస్తూనే ఉన్నాను. నా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. – కేఎన్ రామచంద్ర, ఎస్సీకాలనీ, చిప్పగిరి సమాచారం ఇవ్వడం లేదు నాకు తుగ్గలి మండలం రాతన సర్వే నంబర్ 363లో 3 ఎకరాల పొలం ఉంది. దానిని రీసర్వే చేసే సమయంలో కనీసం సమాచారం ఇవ్వలేదు. తీరా రికార్డుల్లో చూస్తే 2.52 ఎకరాలు మాత్రమే ఎక్కించారు. మిగిలిన భూమి ఎక్కడి వెళ్లిందంటే ఎవరూ చెప్పడంలేదు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. పనులు మానుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కురువ మారుతి, రాతన, తుగ్గలి మండలం -
శ్రీమఠం.. భక్త జనసంద్రం
మధ్వ కారిడార్లో భక్తుల సందడి మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు క్యూలైన్ , శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ మఠం అధికారులు ఏర్పాట్లు చేశారు. నిలిచిపోయిన వాహనాలు.. మంత్రాలయంలో మాధవరం రోడ్డు, నాగలదిన్నె రోడ్డు, ఎమ్మిగనూరు రోడ్డులలో వాహనాలు నిలిచి పోయాయి. రాయచూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న అంబులెన్స్కు కొద్దిపాటి ఇబ్బంది కలిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తన కారులో మాధవరం రోడ్డు వైపులో ట్రాఫిక్ను తనిఖీ చేశారు. రాకపోకలు సాఫీగా సాగేలా సీఐ రామాంజులు, మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున, కోసిగి ఎస్ఐ రమేష్రెడ్డి చర్యలు తీసుకున్నారు. -
శాశ్వత పరిష్కారం చూపాలి
దశాబ్దాల తరబడి గ్రామంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇప్పుడు 10 నుంచి 15 రోజులకు ఒకసారి బాపురం రిజర్వాయర్ నీరు వస్తున్నాయి. వేసవి కాలంలో నెల రోజులకు ఒకసారి కూడా నీరు వదలని పరిస్థితి ఉంటుంది. దీంతో గ్రామ సమీపంలోని వక్కిరేణి నీరే మాకు దిక్కు. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు లోనవుతున్నారు. గ్రామంలో నీటి సమస్యకు హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని మళ్లించి రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. – లక్ష్మన్న, జొహరాపురం, ఆస్పరి మండలం రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే ఎస్ఎస్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపుకున్నాం. తిరిగి ఏప్రిల్లో ఎల్ఎల్సీ నుంచి తాగునీటి అవసరాలకు నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా టీబీపీ అధికారులను కోరాం. గ్రామీణ ప్రాంతాల్లో నీటి అవసరాలకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో స్టాండ్బై పంప్సెట్లను కూడా కొనుగోలు చేస్తాం. – సీహెచ్ మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ -
సాతనూరు..వలసవెళ్తోంది!
మూటముల్లె సర్దుకొని వలసపోతున్న దృశ్యంపైచిత్రంలోని వారు కోసిగి మండలం సాతనూరు గ్రామస్తులు. వీరు ఏనాడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లరు. తుంగభద్రనదికి సమీపంలోనే ఊరు ఉండటంతో రెండుకార్ల పంటలు పండించుకుంటూ రైతులు, పనులు చేసుకుంటూ కూలీలు జీవనం సాగిస్తారు. అయితే, ఈసారి నదికి నీళ్లు వదలకపోవడంతో పొలాలు బీళ్లుగా మారాయి. దీంతో స్థానికంగా పనులు లేకపోవడంతో మూట ముల్లె సర్దుకొని పిల్లాపాపలతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నట్లు తమ దుస్థితిని వెలిబుచ్చారు. –కోసిగి -
మెరిసే క్రిస్మస్
విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న కర్నూలులోని కెథడ్రల్ చర్చినేడు క్రిస్మస్.. క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అంతటా పండుగ నిర్వహించనున్నారు. చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇళ్ల వద్ద నక్షత్రాలను, క్రిస్మస్ ట్రీలను వెలిగించారు. కరుణామయుడు అయిన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
క్రీడా హాస్టళ్లను తరలిస్తుంటే నోరు మెదపరేం
కర్నూలు(టౌన్): కర్నూలులో సాయి(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) హాస్టళ్లను తరలించుకుపోతే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. క్రీడలను ఉద్దరిస్తామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఉన్న హాస్టళ్లను తరలిస్తుంటే కర్నూలును స్పోర్ట్స్ సిటీగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్’ అథారిటీ స్టేడియం వద్ద సాయి హాస్టల్ను తరలించకూడదంటూ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, క్రీడా సంఘాల ప్రతినిధులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయి హాస్టల్ను తిరుపతికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, పిల్ వేసి అడ్డుకుంటామన్నారు. కర్నూలు తలమానికంగా ఉన్న సాయి హాస్టల్ను తరలిస్తుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీమ ప్రాంతం అభివృద్ధి దృష్ట్యా గత ప్రభుత్వం ఒకప్పటి రాజధాని కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. చిన్న మరమ్మతులను సాకుగా చూపి స్పోర్ట్స్ హాస్టల్ను కుట్రతో తిరుపతికి తరలించాలనుకోవడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయం చేయకపోతే క్రీడాకారులతో కలిసి ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు బైఠాయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు, క్రీడా సంఘాల ప్రతినిధులు నాగరత్నమయ్య, నరేంద్ర ఆచారి, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తు నట్టేట ముంచింది!
ముడుమలగుర్తిలో కాపులేని కంది పంటను తొలగించిన దృశ్యం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో కొచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకు అవస్థలే. తాజాగా కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామానికి చెందిన పలువురు రైతులు నకిలీ కంది విత్తనాల సాగుతో నష్టపోయారు. పైరు ఏపుగా పెరిగింది కానీ పూత, బుడ్డ రాలేదు. దీంతో ఐదెకరాల్లో దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను మహేశ్వరరెడ్డి అనే రైతు బుధవారం తొలగించాడు. కోడుమూరులోని ఓ దుకాణదారుడు మంచి విత్తనాలు అని చెప్పడంతో నమ్మి సాగు చేసి మోసపోయామని బాధిత రైతులు వాపోయారు – కోడుమూరు రూరల్ -
శ్రీమఠంలో సినీనటుడు రిషబ్శెట్టి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మండల కేంద్రంలో శ్రీమద్వ కారిడార్లో శ్రీ మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులను శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆశీర్వదించి, శేషవస్రం, ఫల మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల ప్రోగ్రామ్ అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్లో మాతృమరణం జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైరిస్క్ గర్భిణిల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్లో అందించే వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉమా, డీపీఎంయూ డాక్టర్ శైలేష్కుమార్, సంచార చికిత్స కార్యక్రమ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ పాల్గొన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 19 ఉద్యాన క్లస్టర్ల ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్ నాణ్యతతో దిగుబడులు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యాన శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ వై.విద్యాశంకర్ తెలిపారు. బుధవారం కర్నూలు ఉద్యానభవన్లో క్లస్టర్ డెవలప్మెంటు కార్యక్రమంపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి, మిరప, టమాట తదితర ఉద్యాన పంటలను క్లస్టర్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్కో క్లస్టర్లో 5వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, మూడు దశలో ఈ ప్రక్రియ చేపడతామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 శాతం రాయితీ గ్రాంటు రూపంలో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లా ఉద్యాన అధికారులు రాజాకృష్ణారెడ్డి, నాగరాజు, నాబార్డు ఏజీఎం సుబ్బారెడ్డి, నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ సోమశేఖర్, సాంకేతిక ఉద్యాన అధికారి అనూష పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.3లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3లక్షల విరాళాలను అందించారు. బుధవారం విశాఖపట్నంకు చెందిన ఎన్.రామకృష్ణన్ రూ.లక్ష విరాళాన్ని ఏఈవో శ్రీనివాసులరెడ్డికి అందించారు. అలాగే కర్నూలుకు చెందిన ఎ.సుధేష్ణరాణి రూ.లక్ష విరాళాన్ని ఏఈవో సతీష్కు, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. అందించిన దాతలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. -
తాటి చెట్టు పైనుంచి కింద పడి వ్యక్తి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం తాటిచెట్టుపై నుంచి పడి తెలుగు బత్తలయ్య (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన తాటి నుంజల వ్యాపారం చేసుకుంటు జీవన సాగించేవాడు. ఇందులో భాగంగానే చెట్టుపైకి ఎక్కి తాటి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య చిట్టెమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
భారతి సిమెంట్ ఆధ్వర్యంలో వేడుకలు
కర్నూలు (అగ్రికల్చర్): భారతి సిమెంట్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వివిధ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్ట్ చర్చి, రాక్వుడ్ మెమోరియల్ చర్చి, కోల్స్ సెంటీనియల్ చర్చి, స్టాంటన్ మెమోరియల్ చర్చి, బిషప్ చర్చి, ఏబీఎం చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. భారతి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మల్లారెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతి సిమెంట్ కర్నూలు జిల్లా అధికారి షేక్ ఇక్బాల్, సాంకేతిక అధికారి ఉదయ్ కుమార్, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. -
గంజాయి సాగు చేస్తే శిక్ష తప్పదు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు చేసినా, పట్టుబడిననా చట్ట ప్రకారం శిక్ష తప్పదని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కనీసం మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్, ఎస్పీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్లు గంజాయి సాగుపై గట్టి నిఘా ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో గంజాయి సాగుతో కలిగే దుష్పరిమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారి వరలక్ష్మీని ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ మాట్లాడుతూ కాలేజీలు, పాఠశాలల్లో మత్తు పదార్థాలను తీసుకోకూడదనే సందేశంతో హోర్డింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. 1972 టోల్ ఫ్రీ నంబర్కు గంజాయి సమాచారం ఉంటే ఇవ్వాలన్నారు. సమావేశంలో ఈగల్ టీం సభ్యులు సృజన్ కుమార్, ఎకై ్సజ్ డీసీ సుధీర్బాబు, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ భాస్కర్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధిక, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహాపర్విన్ పాల్గొన్నారు. -
హక్కులపై అవగాహన పెంచుకోవాలి
కర్నూలు సిటీ: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ అన్నారు. బుధవారం నగరంలోని కెవిఆర్ కాలేజీలో వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ వినియోగాదారుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జేసీ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వస్తువులు, సేవలను విషయంలో వినియోగదారులు చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్లైన్ కొనుగోలు, డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ వస్తువు కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. అనంతరం వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు జేసీ ప్రశంసా పత్రాలు, బహూమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఎం.రాజా రఘువీర్, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు నజ్మా కౌసర్, నారాయణరెడ్డి, ఐఆర్ఓ జి.లాలెప్ప తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూముల్లో మట్టి మాఫియా!
● వందలాది టిప్పర్లతో మట్టి రవాణా ● పట్టించుకోని అధికారులు బండిఆత్మకూరు: టీడీపీ నాయకులు మట్టి సైతం వదలడం లేదు. అక్రమార్జనకు అటవీ భూముల్లో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, కడమలకాలువ గ్రామ శివార్లలోని తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట ఉన్న అటవీ, సొసైటీ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటుక తయారీకి సరిపడే ఎరమ్రట్టి ఉంది. ఈ మట్టిని కొల్లాగొట్టాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఇటీవలే దందా మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఉండే దళారులతో పేదలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించారు. పేదలకు మాయమాటలు చెప్పి అక్రమ తవ్వకాలు జరపుతున్నారు. వందలాది టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం అటవీ భూముల్లోనే కాకుండా తెలుగు గంగ ప్రధాన కాలువ వెంట కూడా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాలువపై ప్రొక్లెయిన్ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
నీటి సమస్య ప్రారంభమైన గ్రామాలు
మండలం గ్రామాలు ఆలూరు ఆలూరు, మొలగవెళ్లి, కురుకుంద, ముద్దనగేరి, కరిడిగుడ్డం, అరికెర హాలహర్వి సిద్ధ్దాపురం, బళ్లూరు, కొక్కరచేడు, సాకిబండ, సిరిగాపురం, శ్రీధరహాల్, బేవినహాల్, మల్లికార్జునపల్లె నందవరం నాగులదిన్నె, మిట్టసోమాపురం, కనకవీడు, పొనకలదిన్నె, నందవరం, జొహరాపురం, గంగవరం గోనెగండ్ల గోనెగండ్ల, పెద్దనెలటూరు మంత్రాలయం చిలకలడోణ, కల్లుదేవకుంట, రచ్చుమర్రి, చెట్నేహళ్లి, బసాపురం -
రోడ్లపై గుంతలు పూడ్చిన పోలీసులు
కోడుమూరు రూరల్: మండలంలోని ప్యాలకుర్తి నుంచి గూడూరుకు వెళ్లే రోడ్డు దెబ్బతిని అధ్వానంగా ఉంది. అడుగడుగునా గుంతలున్నాయి.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరోవైపు వాహనదారులు ఆ గుంతల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నా రు. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్ఐ రాజ కుళ్లాయప్ప స్పందించి బుధవారం రహదారి మ రమ్మతుకు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్లతో ఎర్రమట్టిని తోలించి రోడ్డుపైపడిన గుంతలనుపూడ్చివేయించారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు పోలీసులు చేపట్టి న మరమ్మతు పనులను చూసి హర్షం వ్యక్తం చేశారు. -
ఖైదీల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టండి
కర్నూలు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెయిల్కు అర్హత కలిగిన అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టి వారి హక్కుల పరిరక్షణకు పాటు పడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జైలు, ఉప జైలు సూపరింటెండెంట్లు, జైలు విజిటింగ్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీల వివరాలను అండర్ ట్రయల్ ప్రిజనర్ కమిటీ ముందు ఉంచి విడుదలకు సంబంధించిన చర్యలు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష నేరాలకు సంబంధించి రిమాండ్లో ఉన్న ఖైదీల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆర్యూకు ఫోర్ స్టార్ రేటింగ్ కర్నూలు (కల్చరల్): ఆంధ్రప్రదే, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ–గవర్నెన్స్ సర్టిఫికేషన్తో పాటు ఐఎస్ఓ సర్టిఫికేషన్లో రాయలసీమ యూనివర్సిటీ 4 స్టార్ రేటింగ్ సాధించడంపై వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ సంస్థ హైమ్ సర్టిఫికేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం వర్సిటీ వీసీకి ఏడు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వర్సిటీకి సహకరించిన హైమ్ సర్టిఫికేషన్ ప్రతినిధి ఎ.శివయ్య బృందానికి ఆచార్య వెంకట బసవరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇళ్లలోనే పత్తి నిల్వలు
● రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ● ఇప్పటి వరకు కొనింది 5 లక్షల క్వింటాళ్లే కర్నూలు(అగ్రికల్చర్): రైతుల ఇళ్లలో పత్తి నిల్వలు పేరుకుపోతున్నాయి. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. తమ గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఉన్నా రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఇంటింటా పత్తి నిల్వలు పేరుకపోయాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. అయితే సీసీఐ పత్తి ఎవరి నుంచి కొంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా సీసీఐ పత్తి కొంటోంది. ఇప్పటి వరకు 18,545 మంది నుంచి కొనుగోలు చేసిన పత్తి 5.67 లక్షల క్వింటాళ్లు మాత్రమే. మార్కెట్లో పత్తి ధరలు అతి తక్కువగా ఉండటం వల్ల రైతులు మద్దతు ధరతో అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుల దగ్గర 50 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే సీసీఐ కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. -
మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా?
కోసిగి: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్) నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలనైతే ఇలాగే వదిలేస్తారా.. అని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో భోజన వసతి ఏవిధంగా ఉంటుంది, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని పిల్లలను ఆరా తీశా రు. అయితే పిల్లలు తమ ఆవేదన వ్యక్తం చేయడంతో వార్డెన్ గోపాల్పై మండి పడ్డారు. బీసీ సంక్షేమ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి ఫొటోలు తీసి పంపాలని ఆదేశా లు జారీ చేశారు. పిల్లలకు ఇచ్చే పాలలో నీటిని అధికంగా కలపడం, చికెన్ కొంచమే పెట్టడం ఏమిటని, అరటి పండు ఎందుకు ఇవ్వడం లేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని వెంటనే మార్పు చేయాలన్నారు. నిర్లక్ష్యానికి కారుకుడైన వార్డెన్ గోపాల్పై చర్యలకు ఆదేశించారు. పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వాచ్మన్ రామయ్యను టెర్మినేట్ చేయాలన్నారు. పర్యవేక్షణలో విఫలమైన అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ మహబూబ్ బాషా, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి షోకాజ్ నోటీసులు వార్డెన్, వాచ్మన్లపై చర్యలకు ఆదేశం -
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,474 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 2,016 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలపరిష్కారానికి క్యాంపులు కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చుక్క ల భూములు, నిషేధిత జాబితా భూములు, అడంగల్ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది బాధిత రైతుల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. క్యాంపులను డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు మరింత మెరుగ్గా తపాలా సేవలు కర్నూలు(అర్బన్): గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజ లకు తపాలా సేవలను మరింత మెరుగ్గా అందించాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి కోరారు. బీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18, 19, 20వ తేదిల్లో కర్నూలు డివిజన్ పరిధిలో పీఎల్ఐ/ఆర్ఎల్ఐ రూ.1.51 కోట్లను కొత్త ప్రీమియంగా సేకరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ ఇన్సూరెన్స్పై ఇంకా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టి కర్నూలు డివిజన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నా రు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీమా యోధులను ప్రశంసిస్తూ బహుమతులను అందించారు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ జనరల్ ఉపేందర్, అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకటరెడ్డి, నాగా నాయక్, కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. వామ్మో...కొండచిలువ మహానంది: బుక్కాపురం గ్రామంలో లక్ష్మీనరసమ్మ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ వద్ద మంగళవా రం కొండచిలువ కనిపించడంతో హడలిపోయా రు. వెంటనే అయ్యన్ననగర్కు చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. అతను గ్రామానికి చేరుకుని సుమారు పది అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు. -
నల్లమలలో పులి భద్రమేనా?
● అడవిలో కనిపించిన పులి పంజా ఉచ్చు ● అప్రమత్తమైన అటవీ అధికారులుఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ –శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్ఎస్టీఆర్)విస్తీర్ణంలో దేశంలోనే పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3,728 చ.కిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటీవల గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాన్ని కూడా ఎన్ఎస్టీఆర్లో విలీనం చేయడంతో 1,194 చ.కిమీ అదనంగా చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 87 పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నల్లమలలో పెద్దపులుల భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. అడవిలో అక్రమార్కుల కారణంగా ఉచ్చులు పెరిగిపోతున్నాయి. మాంసాహారం కోసం పులి ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను ఉచ్చులు పెట్టి చంపుతున్నారు. అప్పుడప్పుడు ఈ ఉచ్చులకు పెద్దపులులు చిక్కుకుని మరణించడం వంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయి. నాగలూటిలో టైగర్ జా ట్రాప్ లభ్యం ఇటీవల ఎన్ఎస్టీఆర్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో నాగలూటి ప్రాంతంలో పెద్దపులులను బంధించేందుకు వాడే టైగర్ జా ట్రాప్ లభ్యమవడం అటు అటవీ అధికారులలోనూ, ఇటు వన్యప్రాణి ప్రేమికులలోను ఆందోళనకు కారణమైంది. ఇలాంటి ట్రాప్లు అంతర్జాతీయ స్మగ్లర్లు మాత్రమే వినియోగిస్తారన్న అనుమానాలున్నాయి. నల్లమలలో పులుల ప్రవర్ధనం స్మగ్లర్లను ఆకర్షించి ఉండవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అనుమానితుల వివరాలు సేకరణ పులులను పట్టుకునేందుకు వినియోగించే జాట్రాప్ నల్లమలలో కనిపించడంతో అప్రత్తమైన అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అపరిచితుల సమాచారం కోసం అటవీ సమీప పట్టణాలలోని లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలకు ఆత్మకూరు పట్టణంలో ఒక లాడ్జి నుంచి మరో లాడ్జికి వారు వెళ్లేలోగా అక్కడ రిసెప్షన్లో ఉండాల్సిన రిజిస్టర్ మాయమైనట్లు గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక అగంతకుడు లాడ్జి రిసెప్షన్ వద్దకు వచ్చి అక్కడ అల్మారాలు వెతికి రిజిష్టర్ను తన చొక్కా లోపల పెట్టుకుని బయటకు వెళ్లడం కనిపించింది. అలా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి గురించి అటవీ అఽధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల చిత్రమైన వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి తరుచూ నంద్యాల అటవీ డివిజన్లో పలు చోట్ల కనిపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి హిందీ మాత్రమే మాట్లాడుతూ కాస్త మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. అనుమానంతో అతన్ని ఎంతగా ప్రశ్నించినా ఎలాంటి సమాచారం అధికారులకు వెళ్లడి కాలేదు. దీంతో ఎన్ఎస్టీ ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అనుమానితుడి వేలి ముద్రలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు పంపించారు.అక్కడ నుంచి నివేదిక రావాల్సి ఉంది. సిబ్బంది కొరత పులి సంరక్షణకు సిబ్బంది కొరత తీవ్ర అంతరా యం కలిగిస్తోంది. పెద్దపులుల అభయారణ్యాలలో ప్రొటెక్షన్ వాచర్లపై ఆధార పడి ఉన్న సిబ్బందితోనే ఇబ్బంది పడుతూ అటవీ శాఖ పులి సంరక్షణకు పాటు పడుతోంది. కంటికి కనించని ప్రాంతాల్లో పన్నే ఉచ్చులను కనుక్కుని తొలగించడం వారికి కష్టసాధ్యమవుతోంది.నల్లమలలో వృద్ధి చెందుతున్న పులి సంతతి -
ప్రజలకు సత్వర సేవలు అందించాలి
మద్దికెర : ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సత్వర సేవలు అందించాలని కర్నూలు జిల్లా సెంట్రల్ ప్రభారి ఆఫీసర్ టి.బంగారు రాజు అన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమం ప్రగతిని సమీక్షించేందుకు మంగళవారం మండలంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలను, మద్దికెరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ గుండాలనాయక్, ఎంపీ డీఓ కొండయ్య, వైద్యులు రాగిణి, శ్రీలక్ష్మి ఉన్నారు. -
రౌడీషీటర్ల లొకేషన్లు జియోట్యాగ్ చేయండి
కర్నూలు: రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారి ఫొటోలు, ఆధార్, బ్యాంకు వివరాలు, ఫోన్ నెంబర్తో కలిపి లొకేషన్ జియోట్యాగింగ్ చేసి సీసీ టీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించి స్టేషన్ల వారీగా పెండింగ్, నమోదైన కేసులపై సమీక్షించారు. ఏడాది ముగుస్తున్నందున రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి జనవరి నుంచి ప్రతి రౌడీషీటర్ సమాచారం సేకరించి జియోట్యాగింగ్ చేయాలన్నా రు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఎక్కువ కేసులు నమోదైన వారిపై జిల్లా బహిష్కరణ, పీడీ యాక్ట్ నమోదు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రొబేషనరీ ఎస్ఐలు బాగా పనిచేయాలి కొత్తగా విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్ఐలు బాగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లతో పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారు. ఉలిందకొండ పరిధిలో ఏటీఎం చోరీకి ప్రయత్నించిన కేసులో డీజీపీ నుంచి ఏబీసీడీ అవార్డు పొందిన పోలీసులను, గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, హేమలత, భార్గవి, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఆహార విక్రయ వ్యాపారులకు జరిమానా
కర్నూలు(హాస్పిటల్): తినేందుకు పనికిరాని, నాణ్యతలేని ఆహారాలను విక్రయించినందుకు గాను పలువురు వ్యాపారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు జరిమానా విధించారు. ఫుట్ సేఫ్టీ ఆఫీసర్ ఇటీవల ఆహార తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. వాటి నివేదికల ఆధారంగా వ్యాపారులకు ఫైన్ వేశారు. ఇందులో కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీ సత్యసాయి ఏజెన్సీ వారికి రూ.50 వేలు, అమీన్ అబ్బాస్నగర్లోని శ్రీ కామధేను హోటల్ వారికి రూ. 25వేలు, పాత కంట్రోల్రూమ్ వద్ద మండి రెస్టారెంట్ వారికి రూ.50వేలు, మంత్రాలయంకు రూ.25వేలు, ఆదోనిలోని న్యూ సోనమ్ హిల్స్కు రూ.25 వేలు, ఎమ్మిగనూరులోని వ్యాపారికి రూ.10వేలు జరిమానా విఽధించారు. దీంతో పాటు వివిధ హోటల్స్లో కల్తీ వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై వివిధ కోర్టుల్లో 12 కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తెలిపారు. రక్తదాతకు అభినందన కర్నూలు: రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడం లాంటిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చిన్నసుంకన్న 50 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడంతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆయనను శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ బాబుప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మారెమ్మ దేవాలయంలో చోరీ
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ శివారులో ఉన్న అడివి మారెమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లి, గోనెగండ్ల గ్రామా ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీలో ఉన్న నగదు, అమ్మవారి విగ్రహానికి ఉన్న వెండి కోర మీసాలు అపహరించారు. మంగళవారం ఉదయం భక్తులు పూజలు నిర్వహించడానికి వెళ్లగా చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా గుడికి సమీపంలో ఆ గ్రామాలకు చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు గ్రామస్తులు తెలి పారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాబోయ్ చిరుతలు...! మహానంది: నల్లమల అటవీ ప్రాంతాల్లో సమీపంలోని ఉన్న గాజులపల్లె, బసవాపురం పంట పొలాల్లో చిరుతల సంచారంతో రైతులు భ యాందోళన చెందుతున్నారు. పచ్చర్ల ఫీడర్లోని గాజులపల్లె గ్రామానికి చెందిన రైతు రంగస్వామిరెడ్డి పొలం సమీపంలో చిరుత సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయి. గత కొద్ది రోజుల క్రితం గోవిందరెడ్డి పొలం దగ్గర చిరుతపులి కనిపించింది. పంట పొలాల సమీపంలో చిరుతలు సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. నన్నూరు బ్యాంకులో చోరీకి విఫలయత్నం! ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామంలో ఉన్న ఆంధ్రపగతి గ్రామీణ బ్యాంక్లో చోరీకి విఫలయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీజీబీ వెనుకాల ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంక్ గోడను పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులోపల నిర్మించిన బాత్రూంను పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా దానికి తాళం వేసి ఉండటంతో దిక్కుతోచక వెనక్కు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. మంగళవారం బ్యాంకుకు వచ్చిన అధికారులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అనుమానిత వ్యక్తులను తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. కేసీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర వనుములపాడు పగిడ్యాల గ్రామాల మధ్య కేసీ కాలువలో మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు ఎర్రటి చీర, నల్లటి జాకెట్ ధరించి మరుగుజ్జుగా ఉండి సుమారు 50 ఏళ్లకు లోపే ఉంటుంది. కేసీ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం వలన దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు కేసీ కాలువ వెంట గాలించినా కని పించలేదని స్టేషన్ ఏఎస్ఐ శేషయ్య తెలిపారు. వైద్యులపై కేసు నమోదు దొర్నిపాడు: ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ.1.16 కోట్ల నిధుల అవకతవకలు జరిగిన విషయంలో నలుగురు వైద్యాధికారులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. సబ్ ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాణి, బాబు, నాగమస్తాన్, నాగదాసయ్య, పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్లపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కుంభకోణం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. యువతి అదృశ్యం నంద్యాల(అర్బన్): పట్టణ శివారు ప్రాంతం వైఎస్సార్నగర్కు చెందిన రెహనా అనే యువతి అదృశ్యమైంది. మంగళవారం ఉదయం బయటకెళ్తున్నానంటూ చెప్పి ఇంటి నుంచి వెళ్లినా రెహానా తిరిగి రాలేదు. గాలించినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో యువతి పెద్దమ్మ పెద్ద రాధ నంద్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి గోనెగండ్ల: మండల పరిధిలోని పుట్టపాశం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బైకు (ఎక్స్ఎల్)ను ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21 జెడ్ 0664) మంగళవారం రాత్రి ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు బయలు దేరింది. పుట్టపాశం గ్రామ సమీపంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ద్విచక్ర వాహనం (కేఏ 05 4462 ఎక్సెల్)పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుని వద్ద సమాచారం తెలిపే ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. -
గందరగోళంగా ఎన్సీడీ సర్వే!
కర్నూలు(హాస్పిటల్): జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ఇందులో ప్రధానంగా బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి జబ్బు ముందుగా గుర్తించి బాధితులకు చికిత్స అందించడమే గాక జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే అటు వారికి, ఇటు సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) సర్వేను ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా ఈ సర్వే పూర్తిగాకుండానే అటకెక్కుతూ మళ్లీ మొదటికి వస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న ఆదేశాలో లేక క్షేత్రస్థాయిలో సర్వే సరిగ్గా చేయడం లేదో అర్థం గాని పరిస్థితిల్లో తాజాగా ఎన్సీడీ 4.ఓ సర్వే కొనసాగుతోంది. సమాజంలో అంటువ్యాధికాని వ్యాధులు (నాన్ కమ్యూనకబుల్ డిసీజ్) అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి వారికి సరైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీ 3.0 సర్వేను గత ఏడాది నవంబర్ 14న ప్రారంభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 75 ఆరోగ్య కేంద్రాలు, 672 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు దాటిన వారు 19,43,321 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 13,49,503 మందికి (69.4శాతం) స్క్రీనింగ్ చేశారు. వ్యాధి లక్షణాల మేరకు పీహెచ్సీలకు అక్కడ నుంచి సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, అక్కడ నుంచి జీజీహెచ్ కర్నూలుకు రెఫర్ చేసి వైద్యం అందించేలా చేశారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పరీక్షించి అనంతరం వ్యాధినిర్ధారణ కోసం కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేస్తారు. వ్యాధినిర్ధారణ అయిన తర్వాత వారికి అవసరమైన వైద్యం అక్కడే అందిస్తారు. అధికంగా బీపీ, షుగర్ బాధితులే...! జిల్లాలో స్క్రీనింగ్ చేసిన 13,49,503 మందిలో 91,382 మందికి అధిక రక్తపోటు(బీపీ), 72,188 మందికి షుగర్(డయాబెటీస్), 4,231 మందికి నోటి క్యాన్సర్, 1,799 మందికి రొమ్ము క్యాన్సర్, 2,405 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించి మెడికల్ ఆఫీసర్ వద్దకు రెఫర్ చేశారు. వారిలో ఇప్పటి వరకు కొందరిని మాత్రమే పరీక్షించారు. ఎన్సీడీ 3.ఓ ను పక్కన పడేసి! నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) 3.ఓ 75శాతం పూర్తయ్యేలోగా దానిని ప్రభుత్వం పక్కన పడేసి ఎన్సీడీ 4.ఓను ప్రారంభించింది. ఇందులో అధికంగా వివిధ రకాల క్యాన్సర్ కేసులతో పాటు కొత్తగా బీపీ, షుగర్ రోగులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. ఇలా ఒకే పనిని క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎం లచే పదే పదే చేయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల సర్వే నాణ్యత కూడా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోతోందని పలువురు వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే సర్వే పేరిట ఏఎన్ఎంలకు తిప్పలు ఒక్క సర్వే పూర్తిగా చేయనివ్వని వైనం లెక్కతేలని బీపీ, షుగర్, క్యాన్సర్ కేసుల వివరాలు -
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కరెంటోళ్ల జనబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎస్ఈకర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ప్రదీప్కుమార్ అన్నారు.మంగళవారం ఆయన ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 37 సెక్షన్లు ఉండగా.. 26 గ్రామాలు, కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లోని 11 వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. కల్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొని మాట్లాడారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 11కేవీ, ఎల్టీ, వ్యవసాయ విద్యుత్ లైన్ల పరిశీలన, కిందకు వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడం. వాలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి.. మార్చడం, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్సఫార్మర్ల దిమ్మెల ఎత్తును పెంచడం లేదా ఫెన్షింగ్ ఏర్పాటు తదితర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఈఈ టెక్నికల్ మహేశ్వరరెడ్డి, కమర్షియల్ డీఈఈ విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాం
క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్సీడీ 4.ఓలో అధిక శాతం దీనిపైనే దృష్టి సారించాము. బీపీ, షుగర్ కేసులు గుర్తించడంతో పాటు క్యాన్సర్ కేసులను గుర్తించి వారిని చికిత్స నిమిత్తం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేస్తున్నాము. స్క్రీనింగ్ పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న 76 ప్రశ్నలను 26కు తగ్గించింది. దీనివల్ల ఏఎన్ఎంలపై పనిభారం తగ్గుతుంది. సర్వే కూడా నాణ్యతగా వస్తుంది. – డాక్టర్ మహేశ్వరప్రసాద్, ఎన్సీడీ అధికారి, కర్నూలు జిల్లా ● -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్రకుమార్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా రీజనల్ 28వ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. బాలుర విభాగంలో వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల, శ్రీశైలం మధ్య జరగగా నంద్యాల విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో కేవీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కర్నూలు), నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మధ్య జరగగా కేవీఎస్ఆర్ విజేతగా నిలిచింది. కబడ్డీ ఫైనల్లో బేతంచెర్లపై వాసవీ పాలిటెక్నిక్ కళాశాల (బనగానపల్లె), ఖోఖో బాలికల ఫైనల్లో కేవీఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గెలిచింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్షిప్ శ్రీశైలం దక్కించుకోగా బాలికల విభాగంలో చాంపియన్షిప్ రూపా బేతంచెర్ల నిలిచింది. బాలికల విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. పూర్వ విద్యార్థి రామమద్దయ్య, విభాగాధిపతులు రాజేష్, రమణప్రసాద్, రఘునాథరెడ్డి, సురేష్బాబు, విద్య హాజరై విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ మార్గరేట్ పాల్గొన్నారు. -
మహానందిలో షాపుల వేలాలు వాయిదా
మహానంది: మహానందిలోని షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న 17 షాపులకు సంబంధించిన బహిరంగ వేలాలు వాయిదా పడ్డాయి. మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో మంగళవారం బహిరంగ, సీల్డు టెండర్లు నిర్వహిచారు. దేవస్థానం ప్రాంగణంలోని షాపింగ్ కాంపెక్స్లో ఉన్న 17 షాపులకు వేలాలు జరగగా కొందరు స్థానిక వ్యాపారులు డిపాజిట్లు చెల్లించారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని మొగ్గు చూపకపోవడంతో వాయిదా వేశారు. ఇదిలా ఉండగా జేఎస్డబ్ల్యూ వాటర్ప్లాంట్ ముందున్న రెండు ఖాళీస్థలాలను గతంలో అప్పటి అధికారులు గిరిజన , చెంచుల ఉత్పత్తుల విక్రయం కోసం కేటాయించారు. అయితే అధికారులు వాటికి నిర్వహించిన వేలాలు పోటాపోటీగా జరిగాయి. వీటిలో 43వ నెంబరుకు రూ. 30వేలు, 44 నెంబరు దుకాణానికి నెలకు రూ. 29వేలు ప్రకారం స్థానిక వ్యాపారులు వేలం పాడారు. అనుకున్నట్లే అయింది మహానంది షాపింగ్ కాంప్లెక్స్లోని షాపుల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఇటీవల తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని కలిశారు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఓ అధికార పార్టీ కీలక నేత రెండు మూడు సార్లు వాయిదా పడేలా చూడండి, తర్వాత మేం చేసేది చేస్తామని ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం నిర్వహించిన వేలాల్లో వ్యాపారులు అదే సూత్రం పాటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఆలయ ఆదాయానికి అధికార పార్టీ నేతలు గండికొడుతుండటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్ఆర్ఎస్, బీపీఎస్లను వినియోగించుకోండి
కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, వెంచర్ల యజమానులు ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్), బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)లను వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కొత్తబస్టాండ్ సమీపంలోని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఏస్టేట్, డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యాలయంలో కర్నూలు చాప్టర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందుకు నిర్మాణాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలు, అక్రమంగా వెలసిన లేఔట్లను క్రమబద్దీకరించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల రమణ, అధ్యక్షులు సురేష్ రెడ్డి, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో కర్నూలుకు చెందిన కరాటే క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వ కారణమని జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్కుమార్, కార్యనిర్వహక కార్యదర్శి పి.సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం వెంకటరమణ కాలనీలోని గుజ్జరియో కరాటే అకాడమీలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన యువన్ సాయి, అర్షియాకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి రోజు కరాటే సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. మాస్టర్ జగదీష్ కుమార్, జిల్లా కరాటే సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ కరాటే మాస్టర్ ఆరిఫ్ హుస్సేన్, గౌస్బాషా పాల్గొన్నారు. -
వైభవంగా గోవిందుడి కల్యాణోత్సవం
డోన్: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రసన్న మండపంలో గోవిందుని కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందమాలదారుల ఆధ్వర్యంలో భక్తజనం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ , నరసింహాచార్యులు గోదాదేవి శ్రీదేవిలతో గోవిందుడి కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో స్వామి పెళ్లి జరపడం ఆనవాయితీగా వస్తోంది. ధర్మకర్తలు పాతాళం సుబ్బారావు. రజినీ కుమారి, శ్రీని వాసరావు గోవింద మాల సమితి ఆధ్వర్యంలో అన్నదాన, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కదం తొక్కాలి
కర్నూలు(సెంట్రల్): రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్టీయూ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ముగింపు వారోత్సావాలను పురస్కరించుకొని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన వర్తమాన కాలంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్య వక్తగా నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ హాజరై ప్రసంగించారు. ఎంతో మంది ప్రాణ త్యాగంతో సిద్ధంచిన స్వాతంత్రంతో ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భావించిన భారతదేశానికి బీజేపీ మతతత్వ విధానాలతో పెను ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ..బీజేపీ సర్కారు లౌకిక రాజ్యంగానికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మిక సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కార్యకరమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలితమ్మ, నంద్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వి.రఘురాం, మూర్తి, పి.సుంకయ్య, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు -
చెక్కుచెదరని వైభవం!
ఊరూరా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ వేడుకకు చర్చీలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ స్టార్లు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు చోట్ల వందల ఏళ్ల చరిత్ర కలిగిన చర్చీలు ఉన్నాయి. బ్రిటీషుల కాలంలో నిర్మించిన ఇవి నేటికీ చెక్కుచెదరకుండా ఠీవీగా దర్శనమిస్తున్నాయి. నిత్య ప్రార్థనలు, బైబిల్ పఠనాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి. – ఆలూరు రూరల్/చిప్పగిరి/ మద్దికెర -
కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతపై అవగాహన సదస్సు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సోమవారం న్యాయ సేవా సదన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించిన కార్పొరేట్ ఆర్గనైజేషన్ అధికారులు, పరిశ్రమల యజమానులు, బ్యాంకర్స్, లయన్స్ క్లబ్ నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ... సీఎస్ఆర్ నిధులు అంటే కంపెనీలు తమ లాభాలలో కొంత భాగాన్ని సమాజం, పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించే నిధులు అని తెలిపారు. దేశంలో కంపెనీల చట్టం 2013 ప్రకారం ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటి రంగాల్లో సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమేనన్నారు. లీగల్ సర్వీసెస్ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో విభిన్న ప్రతిభావంతులకు, మానసిక వికలాంగులకు పేద పిల్లల సహాయార్థం వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహాయం చేయాలని సూచించారు. వికలాంగుల కోసం వీల్చైర్లు, చెవిటి పిల్లల కోసం చెవిటి మిషన్ల సరఫరా చేయాలని కోరారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని కార్పొరేట్ అధికారులు హామీ ఇచ్చారు. ఆల్కాలీస్ గ్రూప్ మేనేజర్లు, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మేనేజర్లతో పాటు సిమెంటు ఫ్యాక్టరీ అధికారులు, లయన్స్ క్లబ్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్రమశిక్షణ అలవర్చుకోండి
● కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో డీఐజీ కర్నూలు: ఇప్పటివరకు మీరు సాధారణ పౌరులు (సివిలియన్స్).. ఇకపై పోలీస్ కుటుంబంలోకి అడుగు పెడుతున్నందున ప్రవర్తన, మాట తీరు మార్చుకోవడమే కాకుండా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. పోలీసు శాఖలో క్రమశిక్షణే ప్రధానమని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 633 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు 9 నెలల పాటు ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ శిక్షణ కళాశాల నిర్వహణకర్త దీపిక పాటిల్, అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, తదితరులు డీఐజీకి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. పటాలం శిక్షణ కేంద్రంలో 437 మంది, అలాగే కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో 209 మంది కలిపి మొత్తం 646 మందికి కమాండెంట్ దీపిక పాటిల్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీఐజీ పలు విషయాలపై నూతన కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని, క్రమశిక్షణతో తరగతులను పూర్తి చేసుకోవాలని సూచించారు. -
5న నీలకంఠేశ్వరుడి మహా రథోత్సవం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలో జనవరి 5న నీలకంఠుడి మహారథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మాచాని నీల మురళీధర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తేరు బజారులోని రథశాలలో ప్రత్యేక పూజలు చేశారు. మహారథాన్ని వెలుపలికి తీశారు. ఈసందర్భంగా ధర్మకర్త మాట్లాడుతూ.. జనవరి 3వ తేదీ రాత్రి 9 నుంచి 12గంటల వరకు శ్రీ పార్వతి పరమేశ్వరస్వామి స్వామి కల్యాణోత్సవం, 4న రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ప్రభావళి మహోత్సవం, 5న సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు మహారథోత్సవం ఉంటుందన్నారు. అలాగే 6న వ్యాహవళి మహోత్సవం, 7న సాయంత్రం 5గంటల నుండి రాత్రి 9గంటల వరకు తీర్థావళీ వసంతోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు మాచాని శివశంకర్, శివకేశవ, మున్సిపల్ కౌన్సిలర్లు కామర్తినాగేషప్ప, ఎంకె శివకుమార్, చంద్రశేఖర్, కుర్ణికుల సంఘ పెద్దలు పాల్గొన్నారు. ముఖం కడుక్కుని వెళ్లండి కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ అమలు చేస్తున్న స్టాప్.. వాష్ అండ్ గో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం కొనసాగుతోంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పోలీసులు జిల్లా అంతటా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆగండి.. ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు తగ్గుతుంది.. తర్వాత ముందుకెళ్లండి.. అంటూ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. వాహన రికార్డులు, డ్రైవర్ లైసెన్స్తో పాటు వాహన భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారుల్లో లారీలు, ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలెరో వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. -
సారా మానితే ప్రత్యామ్నాయ ఉపాధి
కర్నూలు: ప్రజారోగ్యానికి హాని కలిగించే సారా తయారీ, విక్రయాలను మానుకుంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీలకు ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు సూచించారు. ఇటీవల రూ.20 లక్షల వ్యయంతో బంగారుపేటలో నీలిషికారి వాసులకు ఆటోలు, కిరాణ దుకాణాలు నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్ జిల్లా అధికారి (ఈఎస్) సుధీర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సారా తయారీ, విక్రయదారుల్లో మార్పు తీసుకురావాలన్న ఉదేశంతోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని అవగాహన కల్పించారు. -
పెరవలిలో బాలుడి కిడ్నాప్
● సురక్షితంగా నానమ్మ వద్దకు చేర్చిన పోలీసులు మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామంలో సోమవారం సాయంత్రం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి సోమశేఖర్, కవితలకు ఒక కుమారుడు మూలింటి రాజు, కూతురు రాధిక ఉన్నారు. విభేదాల కారణంగా ఆరు నెలల క్రితం పుట్టిల్లు చక్రాళ్లకు కవిత వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని నాయనమ్మ వద్ద ఉంది సోమశేఖర్ బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఇదే అదనుగా చూసుకొని పాఠశాలకు వెళ్లి వస్తున్న రాధికను పక్కకు తోసి రాజును ద్విచక్రవాహనంలో కవిత బంధువులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని నాయనమ్మకు రాధిక చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పత్తికొండ పోలీసులు వెంబడించడంతో కిడ్నాపర్లు మోటార్ సైకిల్ను, బాలుడిని పత్తికొండ సమీపంలో వదిలి వెళ్లారు. బాలుడిని సురక్షితంగా నానమ్మ వద్దకు పోలీసులు చేర్చారు. గుర్తు తెలియని యువకుడి మృతి నందికొట్కూరు: పట్టణంలోని రోడ్డు పక్కన ఈ నెల 11వ తేదీన అనారోగ్యంతో పడిన పోయిన గుర్తు తెలియని వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుడి చేతిపై ఇంగ్లిషులో ఎన్ అనే అక్షరం ట్యాటు ఉంది. తెలుపురంగు డిజైన్ చొక్కా, ముక్కు, పొట్ట మధ్య భాగంలో నల్లని పుట్టుమచ్చలు ఉన్నాయి. ఎత్తు 5.5, వయస్సు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో మృతదేహం ఉందని, ఆచూకీ తెలిసిన వారు నందికొట్కూరు పోలీసు స్టేషన్ను సంప్రందించాలని పోలీసులు తెలిపారు. ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం ఆదోని రూరల్: మండలంలోని ఆరేకల్ మెడికల్ కళాశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని పట్టణంలోని కార్వన్పేటకు చెందిన షేక్ నబీసాబ్(41) అనే వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో అతడి శరీరం నుజ్జునుజ్జయ్యి గుర్తు పట్టలేనంతగా మారింది. మృతుడికి భార్య సుల్తాన్బేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుల్తాన్బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదోని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి కర్నూలు(హాస్పిటల్): అకస్మాత్తుగా గోడ కూలడంతో కర్నూలులో ఆరేళ్ల చిన్నారి అకాల మరణం చెందింది. స్థానిక కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన నాగార్జున ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా ఆయన భార్య సుబ్బమ్మ కూలీ పనులు చేసుకుంటూ భర్తకు తోడుగా ఉంటోంది. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి జన్మించిన ఏకై క కుమార్తె ఉమామహేశ్వరి(6) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఇటుక గోడ కూలి పాపపై పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. రైతు ఆత్మహత్య పాణ్యం: కందికాయపల్లె గ్రామానికి చెందిన బిరవోలు రైతు మహానంది (45) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మహానందికి స్వగ్రామంలో రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది అదనంగా 18 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని కందిపంట సాగు చేశాడు. ఇటీవల అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. కంది చెట్లకు పూత రాలిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం పొలం వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. డాక్టర్ల సూచనల మేరకు కర్నూలు పెద్దాసుపత్రికి తరలించగా కొలుకోలేక మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య సుబ్బమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జింక మృతి దొర్నిపాడు: దొర్నిపాడు శివారులోని పంట పొలాల్లో సోమవారం ఓ జింక మృతి చెందింది. బనగానపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మక్బుల్, పోలీసులు జింక కలేబరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రధాన రహదారిని దాటే క్రమంలో వాహనం ఢీ కొనడంతో గాయపడిన జింక కదలలేక పొలంలోనే ఉండిపోయిందన్నారు. దీంతో కుక్కలు గమనించి దాడి చేసి చంపేసినట్లు తెలుస్తుందన్నారు. పశువైద్యాధికారి చిన్నబాబు పోస్టుమార్టం చేసిన అనంతరం కళేబరాన్ని ఖనం చేశారు. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
కృష్ణగిరి: లాల్మాన్పల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 47 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం అన్నం, వంకాయ కూర, గుడ్డు, చిక్కి వడ్డించారు. భోజనం చేసిన తర్వాత 3, 4, 5వ తరగతులకు చెందిన విక్రమ్, నితిన్ కుమార్, మేఘమాల, జాఫ్రిన్, ఉమేర, రవళిక తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ హెచ్ఎం వినోద్కుమార్, ఉపాధ్యా యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. తక్షణం స్పందించిన ఎంపీడీఓ మోహన్ కుమార్, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి వరప్రసాద్, ఎంఈఓ–1 సునంద, ఎంఈఓ–2 మైఖేల్ వెంటనే పాఠశాలకు వెళ్లి విచారించారు. వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది వాంతులు, కడుపునొప్పికి గురైన విద్యార్థుల ను పరీక్షించారు. పరీక్షలు, ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మధ్యాహ్న భోజనంకు సంబంధించి గుడ్డులో నాణ్యత లేకపోవడం, పాడుబడిన గుడ్డు తదితరాలే విద్యార్థుల అస్వస్థతకు కారణంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. మధ్యా హ్న భోజనం అన్ని వంటల నమూనాలు సేకరించారు. నాణ్యత పరిశీలనకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే గుడ్ల సరఫరా సక్రమంగా లేకపోవడం, వారానికి ఒకసారి ఒక్కో కలర్తో కూడిన రంగు వేసిన తాజా గుడ్లు తీసుకురావాల్సి ఉండగా, రెండు, మూడు వారాలకి ఒకసారి గుడ్లు సరఫరా చేస్తుండడం, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వ్యవహరించడం కనిపిస్తోంది. జరిగిన సంఘటన సందర్భంగా పాఠశాల రికార్డులను, భోజన సామగ్రిని తనిఖీ చేసిన ఎంపీడీఓ మాట్లాడుతూ ఏకంగా గుడ్లు రంగు లేకుండా ఉండడంపై విచారించారు. ఇది ఎంఈఓ–1 నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోందన్నారు. -
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
● సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధికకర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంద శాతం మంది ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక కోరారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో కర్నూలు సహాయ సంక్షేమాధికారి పరిధిలోని వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు వంద శాతం మంది ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో సహాయ సంక్షేమాధికారి బీ మద్దిలేటి, హెచ్డబ్ల్యూఓ ప్రమీలారాణి బెస్ట్ అవార్డులను తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది చాలా మంది హెచ్డబ్ల్యూఓలు జిల్లా నుంచి బెస్ట్ అవార్డులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖరప్ప (ఇంగ్లిషు), హిమకుమార్గౌడ్ (లెక్కలు), సుధాకర్ (తెలుగు), లక్ష్మీనర్సయ్య (సైన్స్) విద్యార్థులకు ఉన్న అనుమనాలను నివృత్తి చేశారు. సులభంగా పరీక్షలు రాసే విధానంలో మోటివేటర్స్ మహేంద్ర, గోపీచంద్ మెలకువలను నేర్పించారు. సహాయ సంక్షేమాధికారి బీ మద్దిలేటి, హెచ్డబ్ల్యూఓలు సుంకన్న, డీసీ మదారి, బీ రజని, డీపీ సులోచన, కే ప్రమీలారాణి, ఎం వెంకటరెడ్డి, ఆర్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటు పడి చోరీలు
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ● చోరీ సొమ్ము స్వాధీనం కోడుమూరు రూరల్: జల్సాలకు అలవాటు పడి ఇద్దరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం కేసులను నమోదు చేసుకున్న కోడుమూరు పోలీసులు ఎట్టకేలకు చోరీలకు పాల్పడ్డ నిందితులను గుర్తించి చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు డీఎస్సీ బాబు ప్రసాద్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మండలంలోని ముడుమలగుర్తి గ్రామానికి చెందిన కురువ నాగేంద్ర అనే వ్యక్తి భార్యను వదిలేసి గత ఏడాది నుంచి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో మూడు నెలల కిందట మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన బోయ ఎల్లప్ప అనే వ్యక్తిని పరిచయం చేసుకుని ఇద్దరు కలిసి తాళాలు వేసిన ఇండ్లను కనిపెట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. గత నవంబర్ 27న గోరంట్ల గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు కమ్మలు, వెండి కాళ్ల పట్టీలతో పాటు రూ.80వేల నగదును దొంగలించారు. ఈనెల 15న ముడుమలగుర్తి గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి రూ.6,13,000లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసుల్లో నిందితులను కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి గుర్తించారు. ముడుమలగుర్తికి కురువ నాగేంద్రను సోమవారం కోడుమూరులోని తాత గుడి సమీపంలో అరెస్ట్ చేసి నగదు, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన గోరంట్లకు బోయ ఎల్లప్ప పరారీలో ఉన్నట్లు డీఎస్సీ బాబుప్రసాద్ తెలిపారు. దొంగతనం కేసులను త్వరగా ఛేదించిన ఎస్ఐ ఎర్రిస్వామి, సిబ్బందిని డీఎస్సీ బాబు ప్రసాద్, కోడుమూరు సీఐ తబ్రేజ్ అభినందించారు. -
తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ్గిరాజేసింది. టీడీపీ కోసం శ్రమించిన వారికి కాకుండా వలస నేతలను అందలం ఎక్కించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్షుల పేర్లు ఖరారైన తర్వాత స్థానిక నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై అస
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులుగా గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితను, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నాగరాజు యాదవ్, ఎన్ఎండీ ఫిరోజ్ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ఎంపికపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొలుత కర్నూలు, నంద్యాల అధ్యక్షులుగా కర్నూలు నగర మైనార్టీ నేత వహీద్, డోన్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ధర్మవరం సుబ్బారెడ్డిలను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో పార్టీ నుంచి తమను అధ్యక్షులుగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన ఉంటుందని తమ అనుచరులతో చెప్పుకు న్నారు. అయితే అధిష్టానం ఆదివారం ప్రకటించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లు ఒక్కసారిగా పార్టీలో కలకలం రేపాయి. తొలుత నిర్ణయించిన పేర్ల స్థానంలో కొత్త పేర్లకు స్థానం లభించడం ఇది వరకు పేర్లున్న నేతలు, అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరి ఒత్తిడితోనే ‘అధ్యక్షుల’ మార్పు కర్నూలు అధ్యక్షుడిగా వహీద్ నియామకాన్ని కర్నూలు నియోజకర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కర్నూలు. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీకి చెందిన మైనార్టీ నేతను అధ్యక్షుడిగా నియమిస్తే భవిష్యత్లో తమ రాజకీయ ప్రయాణానికి పోటీ అవుతారని ప్రజాప్రతినిధి భావించినట్లు తెలుస్తోంది. దీంతోనే వహీద్ను కాదని నాగరాజు యాదవ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాగరాజు యాదవ్ను అధ్యక్షుడిగా నియమించేందుకు టీడీపీ అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. చివరకు తిక్కారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. అయితే కులసమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో గుడిసె కృష్ణమ్మ పేరును ఖరారు చేసి, నాగరాజు యాదవ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీడీపీలో పథకం ప్రకారమే మైనార్టీ నేతలను ఎదగకుండా కొందరు బడా నేతలు కుట్ర చేస్తున్నారని, ఈ అంశాన్ని ఇప్పటికై నా గ్రహించాలని మైనార్టీల్లో చర్చ జరుగుతోంది. ఓల్ట్సిటీలో సోమవారం ఏ టీకొట్టులోనైనా, నలుగురు గుమికూడినా ఇదే అంశంపై చర్చ జరగడం గమనార్హం. డోన్లోనూ అదే ఒత్తిడి ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు డోన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేసి టిక్కెట్ ఇవ్వలేకపోయాడు. దీంతో సుబ్బారెడ్డిని అధ్యక్షుడిగా, మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని అధిష్టానం భావించింది. అయితే డోన్ నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఈ నియామకానికి అడ్డుపడినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డిని నియమిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో అధిష్టానం చివరి నిమిషంలో గౌరు చరితను అధ్యక్షురాలిగా, ఫిరోజ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పోయాం.. మోసంధర్మవరం సుబ్బారెడ్డి వహీద్ భగ్గుమంటున్న అనుచరులు ధర్మవరం సుబ్బారెడ్డి అనుచరుడు గండికోట రామసుబ్బయ్య ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టీడీపీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని లోకేశ్ చెప్పడంతో నమ్మి మార్కెట్యార్డు చైర్మన్ పదవికి దరఖాస్తు చేశామని, లేదు వలస వచ్చిన వారికే ఇస్తామంటే దరఖాస్తు చేసేవారం కాదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రాజా నారాయణ మూర్తి సతీమణి రేణుకకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు నారాయణమూర్తి, సీమ సుధాకర్రెడ్డి ఇద్దరూ సోమవారం విలేకరుల సమావేశంలో రామసుబ్బయ్యపై విమర్శలు చేశారు. మార్కెట్యార్డు చైర్మన్ పదవి, మద్దిలేటిస్వామి ఆలయ చైర్మన్ పదవి ఇన్ని రోజులు భర్తీ చేయకుండా అడ్డుపడిందే సుబ్బారెడ్డి అని, ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజానికి ధర్మవరం సుబ్బారెడ్డికి పదవి రాకుండా ‘కోట్ల’ అడ్డుపడటంతో సుబ్బారెడ్డి సూచనలతోనే రామసుబ్బయ్య తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని డోన్ టీడీపీలో చర్చించుకుంటున్నారు. రేణుకతో పాటు గౌరు చరిత, నాగరాజు యాదవ్ కూడా టీడీపీకి వలస వచ్చిన నేతలే అని, వలసనేతల ఏలుబడిలో టీడీపీ నేతలు పని చేయాల్సిన దారుణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనే వాదన వినిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతే కారణంఇదిలా ఉండగా తొలుత నిర్ణయించిన నేతలు కాకుండా స్థానిక నేతల ఒత్తిడితో ఏకంగా జిల్లా అధ్యక్షుల నియమాకంలో మార్పు చేయడంపై ఇతర రాజకీయపార్టీల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ ఒత్తిళ్లకు చంద్రబాబు, లోకేశ్ తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ప్రభుత్వ తీరుపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయం వారికి బోధపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో కూడా అంతా బావుందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలు అలా అనుకోవడం లేదని స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలను లోతుగా విశ్లేషిస్తే తొలి ఏడాదిన్నరలోనే ప్రజావ్యతిరేకత స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వాదన వినిపిస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షుల ఎంపికపై కినుక మొదట తెరపైకి వహీద్, ధర్మవరం సుబ్బారెడ్డి పేర్లు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇద్దరికీ మొండిచేయి ఊహించని విధంగా గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితకు చోటు వలస నేతలకు పదవులు కట్టబెట్టడంపై విమర్శలు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ -
ఫ్లోర్ బాల్ విజేతకు కలెక్టర్ అభినందన
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పెద్దపాడు చిల్డ్రన్స్ హోమ్కు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం.వెంకటలక్ష్మీని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అభినందించారు. సోమవారం కలెక్టర్ ఆ బాలికను పిలిపించుకొని అభినందనలు తెలిపారు. అంతేకాక ఆ బాలికకు సెయిట్ జీసస్ స్పోర్ట్స్ చిల్డ్రన్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్టు ఇచ్చిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికకు శాలువ కప్పి సన్మానం చేశారు. మార్కెట్ యార్డులో కాటాల తనిఖీ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్రటరీ జయలక్ష్మి అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ... కాటాలు జరుగుతున్నపుడు రైతులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాటాలు జరుగుతున్న సమయంలో రైతులు పక్కకు వెళ్లరాదని, తూకాలు సక్రమంగా ఉంటున్నాయా అనే దానిపైనే నిఘా ఉండాలని పేర్కొన్నారు. తూకాలు పక్కాగా ఉండాలని, రైతులను దగా చేయడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సూపర్వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పరిశ్రమలతో ఇతరులకు జీవనోపాధి ఇవ్వాలి ● సెర్ప్ అడిషినల్ సీఈఓ శ్రీరాములు పాణ్యం: ప్రతి మహిళా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇతరులకు జీవనోపాధి కల్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అడిషినల్ సీఈఓ శ్రీరాములు నాయుడు తెలిపారు. పాణ్యంలో మండల సమాఖ్యలో జీవనోపాధులు పొందిన మహిళలలతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాల సమాఖ్యలు, సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ తనిఖీ చేశారు. అనంతరం ఓబీఓల, వీవోఓలతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి పాణ్యం సమాఖ్య ఒక నిదర్శమన్నారు. ప్రాజెక్టు మెనేజర్లు రంగరావు, నాయక్, సురేష్, బాబురావు, నంద్యాల ఏరియా కో–ఆర్డినేటర్ ప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కామాక్షమ్మ, సీసీలు రఘు రామ్, పుల్లన్న, బాలస్వామి, మేరీ పాల్గొన్నారు. పిచ్చికుక్క దాడి చాగలమర్రి(ఆళ్లగడ్డ): పట్టణంలోని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో సోమవారం సాయంత్రం పిచ్చికుక్క హల్చల్ చేసింది. కార్యాలయంలో విధు లు నిర్వహిస్తున్న సినియర్ అసిస్టెంట్ షంషుద్దీన్పై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన షంషుద్దీన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క కార్యాలయంలోనే తిష్ట వేసింది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే పిచ్చికుక్కను బంధించి చంపేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆదోని జిల్లా చేయకపోతే ఇక మహోద్యమమే
ఆదోని టౌన్/ఆదోని రూరల్: ఆదోని జిల్లా చేయకపోతే ఇక మహోద్యమం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా నిర్మల్ టాకీస్ ఆవరణానికి చేరుకుని రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలను ఉద్దేశించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఎన్నికల ముందు ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి నేడు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. విద్య, వైద్యం, తాగు, సాగునీరు, నిధులు కావాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆరేకల్ వద్ద ఉన్న మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. జిల్లాగా ఆదోని అన్నివిధాలుగా అర్హత ఉన్నప్పటికీ ప్రకటించకుండా చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తనకు ఇప్పటివరకు తెలియదని కుంటి సాకులు చెబుతున్నారన్నారు. సీఎంకు తెలియకుండా రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో రోజువారి సంఘటనలు సీఎంకు తెలియడం లేదంటే ఏమని చెప్పాలన్నారు. ఆదోని అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ప్రకటించాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్రెడ్డి, ప్రదీప్రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, చంద్రశేఖర్, రుద్రగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, పట్టణాధ్యక్షుడు దేవా పాల్గొన్నారు. 37 రోజులుగా దీక్షలు ఆదోని జిల్లా కావాలని మహిళలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు 37 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోతోంది. 37 రోజులుగా జిల్లా కోసం దీక్ష చేస్తున్నా చేతగాని చంద్రబాబు ప్రభుత్వమంటూ ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వచ్చేది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని అప్పుడు జిల్లాగా ఆదోనిని ప్రకటిస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీని చంద్రబాబు మరిచారు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టొద్దు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా అవుతుంది వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక -
ప్రతి అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్కు సంబంధించి మండల స్థాయిలో వచ్చిన ప్రతి అర్జీని రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తహసీల్దార్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుంచి పీజీఆర్ఎస్, హౌసింగ్, తాగునీటి అంశాలపై జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేకాధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సోమవారం మండల స్థాయిలో రిజిస్ట్రేషన్లు పూర్తి తక్కువగా ఎందుకున్నాయని తహసీల్దార్లను ప్రశ్నించారు. గోనెగండ్ల, సీబెళగల్, ఓర్వకల్ మండలాల్లో రీసర్వేకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని గడువులోపు పూర్తి చేయాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంతృప్తి చెందేలా పరిష్కరాలు చూపాలి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఉ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ అధికారి చిరంజీవి పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయండి
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం కల్లూరు సర్వే నంబర్ 292లో 1985లో వేసిన ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకున్న టీడీపీ నాయకుడు జనార్దన్ ఆచారి బారి నుంచి విముక్తి కల్పించాలని బాధితులు రోడ్డెక్కారు. ఆయనకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసు స్టేషన్లో కనీసం కేసు కూడా నమోదు చేయడంలేదని, కో ర్టు తీర్పును కూడా ధిక్కరించి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. సోమవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వెంటనే టీడీపీ నాయకుడు జనార్దన్ ఆచారి, అతని అనుచరులు తెలుగు మహేష్, వడ్డే నాగేశ్వరరావు, దేవేంద్ర ఆచారిలపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు రాజయ్య, రాముడు, సుంకన్న మాట్లాడుతూ.. సర్వే నంబర్ 292లో 3.95 ఎకరాల భూమి ఉందని, దానిలో 35 సెంట్లలో 1985లో మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకొని ఎనిమిది మంది ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అంతేకాక మిగతా స్థలంలో 38 మంది బాధితులు అప్రూవుడ్ లేవుట్లో ప్లాట్లను కొనుగోలు చేశారని చెప్పారు. ఈ క్రమంలో 40 ఏళ్ల తరువాత జనార్దన్ ఆచారి ఆ పొలం తమ తాతది అంటూ ప్లాట్లదారులకు తెలియకుండా రాత్రికి రాత్రి ఉన్న రోడ్లు, కట్టిన ఇళ్లను కూల్చారని, ఈ విషయంపై తాము పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టు ఆర్డర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారన్నారు. ఈ క్రమంలో తాము కోర్టుకు వెళ్లి ఆ ఆర్డర్ను ఇటీవల రద్దు చేయించామన్నారు. ఈ క్రమంలో కోర్టును తీర్పును కూడా ధిక్కరించి తమను ప్లాట్లలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, వెంటనే అతన్ని ఖాళీ చేయించాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. దీంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, ఆయనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసులు కూడా పట్టించుకోవడంలేదని, మునిసిపల్, రెవెన్యూ అధికారులు తమకు సంబంధంలేదని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకపోతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 1985లో కొనుగోలు చేసిన ప్లాట్లను స్వాధీనం చేసుకొని భయపెడుతున్నారు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి గుండాయిజం చేస్తున్నారు కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన -
గ్రామీణ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు
● మిస్సెస్ ఇండియా–2025 విజేత కవ్వం విజయలక్ష్మీకర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంత మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ఆ విషయాన్ని నిరూపించడం కోసమే తాను మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించినట్లు మిస్సెస్ ఇండియా–2025 విజేత కవ్వం విజయలక్ష్మీ తెలిపారు. ఇటీవలే కిరిటీం గెలుచుకున్న నేపథ్యంలో తన సన్నిహితులు, బంధువుల ఆహ్వానం మేరకు ఆమె కర్నూలు వచ్చారు. అందులో భాగంగా తన స్నేహితురాలు ఐపీఎస్ అధికారి చౌడేశ్వరితో మర్యాదపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనది రాయచోటి అన్నమయ్య జిల్లా ఇందన్నహాన్ గ్రామమని, అమ్మానాన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారన్నారు. వెనుకబడిన రాయలసీమకు చెందిన తనకు గ్రామీణ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనే కోరిక ఉండడంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. అందాల పోటీలు అంటే కేవలం అందానికి సంబంధించిన విషయమని కాదని.. అందంగా లేకున్నా సాధించాలన్న కృష్టి, పట్టుదల ఉంటే తనలా ఎవరైనా విజయం సాధించవచ్చని చెప్పారు. -
గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం
హొళగుంద: గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తించాలని సెంట్రల్ ప్రభరి ఆఫీసర్ బంగారరాజు అన్నారు. నీతి అయోగ్ అస్పిరేషన్ బ్లాక్ అయిన హొళగుంద మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. హొళగుందలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రం, జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నీతి అయోగ్ సూచించిన 40 అంశాలపై శాఖాలధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, టీచర్ల కొరత, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనపై చర్చించారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలలిత, తహసీల్దార్ నిజాముద్దీన్, డాక్టర్ బిందుమాధవి, ఈఓపీఆర్డీ చక్రవర్తి, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
పీఎం జాతీయ బాల పురస్కార్కు కర్నూలు క్రీడాకారిణి
కర్నూలు(టౌన్): ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్కు మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివాని ఎంపికై ంది. ఈనెల 26న న్యూఢిలీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనుంది. పారా అథ్లెటిక్స్లో జావెలిన్ త్రో క్రీడాంశంలో గత నాలుగు సంవత్సరాలుగా పారా అథ్లెటిక్స్లో జావెలిన్ త్రో, షాట్ పుట్ విభాగాల్లో విశేషంగా ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని పారా అథ్లెట్కు శిక్షణ, పునరావాసం, మార్గదర్శనం, పోటీ అవకాశాలు కల్పించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆస్తులు రాయించుకుని జీవనాధారం లేకుండా చేశారు కర్నూలు: ‘నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆస్తులు రాయించుకొని నాకు ఎలాంటి జీవనాధారం లేకుండా చేయడమే కాక బాగోగులు కూడా చూసుకోవడం లేదు. విచారణ జరిపి తగు న్యాయం చేయాలి’ అని ఎమ్మిగనూరుకు చెందిన యల్లప్ప ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఒకే గ్రామం నుంచి 50 కుటుంబాల వలస కౌతాళం: మండలంలోని ఓబుళాపురం గ్రామం నుంచి సోమవారం 50 కుటుంబాలు హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు నగరాలకు తరలివెళ్లాయి. ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో వల సలు తప్పడం లేదని గ్రామస్తులు రాము, మారెయ్య, పలువురు తెలిపారు. వ్యవసాయంలో ఈ ఏడాది పూర్తిగా నష్టపోయామని, పెట్టుబడుల కోసం అప్పులు చేశామని ఈరన్న అనే రైతు తెలిపారు. అప్పులు తీర్చాలంటే వలస వెళ్లడం తప్పడం లేదన్నారు. -
ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలి
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు యాప్ల భారాన్ని తగ్గించాలని పీఆర్టీయూ జిల్లా అద్యక్షులు ఎన్.వి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమప్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై ఎలాంటి స్పందన లేదన్నారు. పెండింగ్ డీఏలు చెల్లించాలని, కస్తూర్భా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం టైం స్కూల్ అమలు చేయాలన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ ఆదినారాయణ రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో ఈ నెల 22వ తేదీన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 7382614308 నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. కాగా.. సోమవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడి గడ్డివామి దగ్ధం వెల్దుర్తి: మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ భర్త మధుసూధన్ రెడ్డికి చెందిన గడ్డివామి ఆదివారం దగ్ధమైంది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. బాఽధితుడైన మధుసూధన్ రెడ్డి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తమను అక్రమ కేసులో ఇరికించి ఎన్నో బాధలు పెడుతున్నారన్నారు. పొలాలు, ఇళ్లు వదిలి తాము వేరే చోట నివాసం ఉంటున్నామని, గడ్డివామికి ఎవరు నిప్పు పెట్టారు, ఎలా జరిగిందన్నది తనకు తెలియదన్నారు. ప్రభుత్వం దృష్టికి గిరిజన ఉద్యోగుల సమస్యలు కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పీ వెంకటప్ప చెప్పారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన ఆయనను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ సురేష్ ఆధ్వర్యంలో ఆయా విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయా విద్యా సంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలని వారు వినతి పత్రాలను అందించారు. ఆలూరు రూరల్: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆలూరులో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్ స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో కేక్ కట్ చేయడానికి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ భర్త వైకుంఠం శివప్రసాద్ తన అనుచరులు 50 మందితో కలిసి అక్కడికి వచ్చారు. గుంతకల్లు చెక్పోస్టు నుంచి ర్యాలీగా ఆర్అండ్బీ అతిథి గృహానికి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో కలసి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైఎస్సార్సీపీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వైఎస్సార్ పార్టీ కార్యాలయానికి మార్చుకున్నారు. -
నియోజకవర్గాల వారీగా..
ఎమ్మిగనూరులో రక్తదానం చేస్తున్న వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టారేణుక మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి నాయకత్వంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాణ్యం అర్బన్ పరిధిలోని కల్లూరులోని శరీన్నగర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పూజలు చేశారు. తమ నేత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్ ఆధ్వర్యంలో 108 టెంకాయలు కొట్టారు. పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక శారద ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేశారు. ఎమ్మిగనూరులోని తన కార్యాలయంలో మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక కేక్ కట్ చేశారు. అలాగే ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక కార్యాలయంలో భారీ కేక్ కట్చేశారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆలూరులో రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొన్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తల మద్య భారీ కే క్ కట్ చేశారు. గూడూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. -
రాఘవేంద్రయా నమోస్తుతే!
మంత్రాలయం: చలిని లెక్క చేయకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక భక్తులు భారీగా ఆదివారం మంత్రలయానికి తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ దేవికి ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు ప్రత్యేక స్టీలుతో ఏర్పాటు చేసిన క్యూలైనులో తుంగభద్ర నది దగ్గర నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తులు పోటెత్తారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు రథోత్సవంపై ప్రహ్లాదరాయులు విహరించారు. తుంగభద్ర నది దగ్గర సీఐ రామాంజులు బందోబస్తు పర్యవేక్షించారు. పడవ యజమానులతో భక్తులు పట్ల జాగ్రత వహించాలన్నారు. -
ఆ‘ధారం’ తెగుతోంది!
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. జగన్ సర్కారు చేపట్టిన చర్యలతో చేనేతను వదిలేసిన వారు కూడా మళ్లీ మగ్గం తిప్పారు. చంద్రబాబు సర్కారు ఏర్పాటై 18 నెలలు గడచింది. ఈ కాలంలోనే రెండు జాతీయ చేనేత దినోత్సవాలు జరిగాయి. వీటికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకారుల సంక్షేమానికి ఎన్నో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి మాటలు విన్న చేనేతకారులు మురిసిపోయారు. నెలలు గడచిపోతున్నా.. ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చకపోవడంతో డీలాపడిపోతున్నారు. మరోసారి బాబు మాటలు నమ్మి మోసపోయామని తలలుపట్టుకుంటున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): కూటమి పాలనలో చేనేత పరిశ్రమ అభివృద్ధి పడకేసింది..చేనేతకారుల సంక్షేమం కొండెక్కింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చేనేతలకు చేకూరిన లబ్ధి శూన్యం. 2014–19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. కొన్నింటికి జీవోలు కూడా జారీ చేశారు. కాని ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మళ్లీ అలాంటి పరిస్థితులే నేడు ఉత్పన్నమవుతుండటంతో చేనేతకారులు మగ్గం వదిలేసే పరిస్థితి ఏర్పడింది. టెక్స్టైల్ పార్క్ను వదిలేశారు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ నెలకొల్పాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కాని అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది ఆగస్టులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత, జౌళిశాఖల మంత్రి సవిత, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీభరత్ భూమి పూజ చేశారు. భూమి పూజ చేయడంతోనే టెక్స్టైల్ పార్క్ వచ్చేసిందని టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా, ఇంతా కాదు. అయితే ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతవరకు డీపీఆర్ కూడా సిద్ధం కాలేదు. టెక్స్టైల్ పార్క్ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉచిత విద్యుత్ వట్టిదే ఉమ్మడి జిల్లాలో 4,705 కుటుంబాలు చేనేతపై ఆధారపడి ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో చేనేతకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2024, 2025 సంవత్సరాల్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో నెలకు చేనేత పరిశ్రమకు 200, పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 2,457 చేనేత , ఒక పవర్ లూమ్, నంద్యాల జిల్లాలో 385 చేనేత, 73 పవర్ లూమ్స్కు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అధికార యంత్రాంగం ఏర్పట్లు కూడా చేసింది. కానీ ఉచిత విద్యుత్ హామీ 18 నెలలు గడచినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మాటలే తప్ప చేతలు లేవనే విషయం నేడు చేనేత కుటుంబాలకు అర్థమైంది. ఆచరణలో కనిపించని రూ.25 వేల సాయం చెప్పింది చెప్పినట్లు చేయడం వైఎస్సార్సీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకత. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన చెప్పింది చెప్పినట్లు అమలు చేశారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడలేదు. ఈ పథకం కింద చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకొని మరింత సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2000 ప్రకారం ఏడాదికి రూ.24,000 చెల్లించింది. దీంతో ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీ జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు విన్న చేనేతకారులు సంబరపడిపోయారు. నెలలు గడుస్తున్నా.. ఈ దిశగా చర్యలే లేకపోవడంతో నేడు ఉస్సు రు మంటున్నారు. చేనేతకార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని అమలు చేస్తామని, చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాధ్య కాకపోతే కట్టిన జీఎస్టీని వెనక్కు ఇస్తామని, చేనేత కార్మికులు ఇళ్ల నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామని, కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇంతవరకు వాటిలో ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో చేనేతలు మగ్గాలు వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపు 674 కుటుంబాలు మగ్గాలను వదిలేసినట్లుగా తెలుస్తోంది. దివాలా దిశగా ఆప్కోఉమ్మడి కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి మంగళగిరిలోని గోదాములో నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని షోరూములకు సరుకు సరఫరా అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. ఏడాది కాలంగా వాటికి కొత్తస్టాక్ సరఫరా కాలేదు. ఆప్కోలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు కూడా లేవు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆప్కో సిబ్బందికి వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఆప్కో చరిత్రలో ఎప్పుడూ లేని పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆప్కో ఏమవుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. విషయం కర్నూలు నంద్యాల చేనేత సహకార సంఘాలు 13 30 పని చేస్తున్న సంఘాలు 3 4 సభ్యులు 350 120 వ్యక్తిగత మగ్గాలపై ఆధార 3,398 837 పడిన కుటుంబాలు మొత్తం చేనేత కుటుంబాలు 3748 957 కూటమి పాలనలో చేనేతలకు కష్టాలు భూమి పూజకే పరిమితమైన టెక్స్టైల్ పార్క్ అతీగతీలేని ఉచిత విద్యుత్, ఏటా రూ.25 వేలు సాయం 18 నెలల్లో ఒక్క కుటుంబానికి లబ్ధి కలిగితే ఒట్టు సంక్షోభంలో కూరుకుపోయిన ఆప్కో -
ముగిసిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు
● బాలుర విభాగం విజేత బాపట్ల ● బాలికల విభాగం విజేత అనకాపల్లి కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44 వ షూటింగ్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. పురుషుల విభాగంలో బాపట్ల జిల్లా జట్టు మొదటి స్థానం, నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానం, బాపట్ల జిల్లా జట్టు రెండో స్థానం సాధించింది. ముగింపు కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ విజయ్కుమార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి, ఒలింపిక్ సంఘం కార్య నిర్వహణ కార్యదర్శి సునీల్కుమార్, కార్పొరేటర్ లక్ష్మీకాంత రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్, కప్పులను అందజేసి అభినందించారు. జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి పాల్గొన్నారు. -
గురజాడతో అభ్యుదయ సాహిత్యానికి బీజం
● అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకర్నూలు కల్చరల్: తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యం గురజాడతో ప్రారంభమైందని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. సాహిత్య అకాడమీ, అభ్యు దయ రచయితల సంఘం సంయుక్తంగా నగరంలోని సలాం ఖాన్ ఎస్టీయూ భవన్లో ఆదివారం 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1933లో శ్రీశ్రీ రాసిన జయభేరి కవితతో తెలుగునాట అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైందన్నారు. అనాటి నుంచి అభ్యుదయ సాహిత్య ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఆరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం, మార్క్సిజం తాత్విక దృక్పథంతో వర్గ సంఘర్షణలు ప్రతిబింబిస్తుందని, పీడిత, కర్షక, కార్మిక జీవితాలను చిత్రిస్తోందన్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ రచయితలు సామాజిక దృష్టికోణం నుంచి రచనలు కొనసాగించినప్పుడే అవి సమాజంలో ఎక్కువ కాలం నిలబడతాయన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు కె.ప్రహ్లాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విమోచనోద్యమం – సాహిత్యం అనే అంశంపై ఎస్వీ సత్యనారాయణ, అభ్యుదయ సాహిత్య విమర్శ అంశంపై కరిమిండ్ల లావణ్య, అభ్యుదయ నవల అంశంపై కేపీ అశోక్కుమార్, అభ్యుదయ కథ అంశంపై ఎం.హరికిషన్, అభ్యుదయ నాటకం అంశంపై వి.వింధ్యావాహసినీ దేవి, అభ్యుదయ కవిత్వం అంశంపై కెంగార తాయప్పలు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ తరపున చంద్రశేఖర రాజు, అరసం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, నగర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చక్రవర్తి పాల్గొన్నారు. -
సగరులు అన్ని రంగాల్లో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: సగరులు (ఉప్పరులు) అన్నిరంగాల్లో రాణించాలని ఏపీ సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేవల్లి వెంకటరమణ అన్నారు. ఆదివారం పట్టణంలో ని ఉప్పర కల్యాణ మండపంలో రాష్ట్ర సగర ఉపాధ్యా య, ఉద్యోగ, పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీ వల ఉద్యోగ, ఉపాధ్యాయ కొలువులు సాధించిన ఉప్పర కులస్తులను సత్కరించారు. సమ్మేళన కార్యక్రమంలో పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప, పల్నాడు జిల్లా డ్వామా పీడీ సిద్దలింగప్ప, శ్రీశైలం సగర సత్రం అధ్య క్షుడు కృష్ణయ్య, హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్ జయలక్ష్మి, బద్వేల్ రిటైర్డ్ డీఎస్పీ వెంకట య్య, కేవీఆర్ కళాశాల ప్రొఫెసర్ పార్వతీదేవి, నాయ కులు ఏపీ వీరన్న, కృష్ణమూర్తి, రవీంద్ర పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూమెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం 1993–1994వ సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులంతా 32 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాల్లో చిన్నతనంలో చేసిన అల్లరి చేష్టలు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులు రామృష్ణ, జయమ్మ, జనార్దన్లకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఫయాజ్, ఉపాధ్యాయులు రమేష్ నాయుడు, పూర్వ విద్యార్థులు స్వరూప్, గోనబావి గోపాల్, రంగారెడ్డి, రాజెంద్ర, వెంకటేష్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి కర్నూలు: నగర శివారులోని గుత్తిరోడ్డులో ఉన్న ఎథీనా ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న మరెడ్డి వేదికరెడ్డి(14) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి రెండు గంటల సమయంలో నిద్రలో మతిస్థిమితం లేకుండా ఉండటమే గాక బెడ్పై మూత్రవిసర్జన చేసుకోవడంతో తోటి విద్యార్థులు గమనించి హాస్టల్వార్డెన్కు తెలిపారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వైద్యచికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. బాలిక గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేదని, తరచూ ఫిట్స్ కూడా వచ్చేదని తండ్రి అశోక్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు 198 బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో ఎస్కేయూ విద్యార్థిని మృతి
రాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
యాగంటిలో ఎస్పీ పూజలు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు ఎస్పీ విక్రాంత్పాటిల్ దంతులు ఆదివారం దర్శించుకున్నారు. ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమామహేశ్వర స్వామికి అభిషేకం, తదితర పూజలు చేశారు. పూజల అనంతరం ఎస్పీ దంపతులకు స్వామి వారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం ఎమ్మిగనూరు రూరల్: మండల పరిఽధిలోని బోడబండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కోటేకల్ గ్రామానికి చెందిన మసీదపురం నరసింహులు కుమారుడు రామాంజనేయులు(25), మరో వ్యక్తి నరసప్ప వేర్వేరు బైక్లపై ఎమ్మిగనూరు వైపు వెళ్తున్నారు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి రామాంజనేయులు కిందపడిపోయాడు. ఇతని వెనుకే వస్తున్న నరసప్ప కూడా తన బైక్ను అదుపు చేస్తూ కిందపడ్డాడు. ఈ ఘటనలో రామాంజనేయులకు తలకు బలమైన గాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందగా నరసప్పకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఒక పాప సంతానం ఉన్నట్లు బంధువులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు(హాస్పిటల్): నిండు జీవితానికి రెండు పోలి యో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పిలుపునిచ్చారు. కర్నూలు నగరం ఎ.క్యాంపులోని ఇందిరిగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో ఆదివా రం ఏర్పాటు చేసిన పల్స్పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు కలెక్టర్ పల్స్పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియోచుక్కలు వేయించడం అందరి బాధ్యత అన్నారు. జిల్లాలో 3,52,000 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారని, ఆరు లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయని చెప్పారు. కర్నూ లు జిల్లాలో 1,630 బూత్లను, ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవ్వరైనా ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకోకపోతే అలాంటి వారికి వైద్య సిబ్బంది 22, 23వ తేదిల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ మా ట్లాడుతూ అందరూ సమిష్టిగా, సమన్వయంతో పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మలత, డీఐఓ డాక్టర్ ఉమా, డెమో ప్రకాష్రాజు పాల్గొన్నారు. -
సీహెచ్సీలో నిధుల దుర్వినియోగంపై విచారణ
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి సీహెచ్సీలో సుమారు రూ.5 లక్షల అభివృద్థి నిధుల దుర్వినియోగంపై ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ రామగిడ్డయ్య శనివారం విచారణ చేపట్టారు. సీహెచ్సీకి చేరుకున్న రికార్డులు పరిశీలించారు. వైద్యులు షేక్ ఇమ్రాన్, స్టాఫ్ నర్సులు ఉమా, విజయలక్ష్మి, పద్మ, ఎల్టీ శ్రీనివాసనాయక్, ఫార్మాసిస్ట్ రాజేష్తో వేర్వురుగా విచారించారు. అనంతరం ఫిర్యాదు చేసిన వైద్యురాలు పి.అంజలితో కూడా మాట్లాడారు. విచారణ అనంతరం వారితో నివేదిక ప్రతులపై సంతకాలు చేయించున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ నివేదికను వైద్యారోగ్య శాఖా మంత్రి పేషికి, రాష్ట్ర ప్రజా వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్కు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీడీఓ జగదీష్ చంద్రారెడ్డి ఉన్నారు. కాగా నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే సీఎం పేషికి ఫిర్యాదు చేస్తానని డాక్టర్ అంజలి తెలిపారు. నిధుల దుర్వినియోగంపై ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 54 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం 535 మందికి 481మంది హాజరు కాగా 54 తమంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు కర్నూలు కల్చరల్: సాహిత్య అకాడమీ, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నగరంలోని సలాం ఖాన్ ఎస్టీయూ భవన్లో ఆదివారం ఉదయం 10 గంటలకు 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్షులు కె.ప్రహ్లాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో సదస్సు జరుగుతుందన్నారు. సాహిత్య అకాడమీ బెంగళూరు ఆఫీస్ ఇన్చార్జి నవీన్కుమార్, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అతిథులు, వక్తలుగా హాజరు కానున్నారన్నారు. ర్యక్రమంలో అరసం గౌరవ సలహాదారుడు డాక్టర్ ఎం. హరికిషన్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. నేడు ఏపీఎన్జీజీవోస్ కర్నూలు నగర శాఖ ఎన్నిక కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు నగర శాఖ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. జిల్లా అడ్హాక్ కమిటీలో సభ్యుడైన మద్దిలేటి ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. స్థానిక ఎన్జీవో హోమ్లో ఉదయం 9 గంటలకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఐదు తాలూకా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నగరశాఖ ఎన్నికలు కూడ ఏకగ్రీవంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడుగా మద్దిలేటి, కోడుమూరుకు శ్రీనివాసులు, ఆదోనికి ఉషారాణి, పత్తికొండకు సాయిబాబా, ఆలూరు తాలూకాకు మోహన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కర్నూలు తాలూకాకు ఎన్నికలు జరిగితే అన్ని తాలూకాలకు ఎన్నికలు జరిగినట్లవుతుంది. కర్నూలు తాలూకా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర సహా అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి పర్యవేక్షించనున్నారు. రోగుల సేవలకు నూతన సాఫ్ట్వేర్ కర్నూలు (హాస్పిటల్): రోగుల సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం నూతన సాఫ్ట్వేర్ రూపొందించిందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి చెప్పారు. శనివారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో వైద్యులు, సిబ్బందికి నూతన సాఫ్ట్వేర్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ రోగి రిజిస్ట్రేషన్, కేస్ స్టడీ, డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అప్లోడ్, ఇంటర్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ అప్డేట్స్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయన్నారు. నూతన సాఫ్ట్వేర్ వల్ల అన్ని విభాగాల వైద్యులు ఒకే ప్లాట్ఫామ్లో రోగి హిస్టరీ, రిపోర్టులు, చికిత్స వివరాలను చూసి వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివబాల, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలను అధిగమించి..
ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు గుర్రం వాణి. నన్నూరు గ్రామం. ఈమె కూలి పనులకు వెళ్లేవారు. భర్త తిప్పన్న పాలీష్ కట్టింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకురేవారు. ఖర్చుతగ్గట్టు సంపాదన రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను సద్వినియోగం చేసుకొని ఈమె లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నారు. చీరల వ్యాపారం చేస్తున్నారు. కష్టాలను అధిగమించి, ఆర్థికంగా స్థిరపడ్డారు. – ఓర్వకల్లు ఈ రైతు పేరు కె.నగేష్. కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన ఈయనను 2019 నుంచి 2024 వరకు ఉచిత పంటల బీమా ఆదుకుంది. ప్రీమియం కింద రూపాయి కూడా చెల్లించకపోయినప్పటికీ రూ.లక్ష వరకు పరిహారం పొందినట్లు ఈ రైతు తెలిపారు. తనకు ఐదేళ్లు రైతుభరోసా వచ్చిందని, పంటలు దెబ్బతిన్నపుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని ఈ రైతు చెప్పారు. – కర్నూలు (అగ్రికల్చర్) జీవనోపాధికి ‘చేయూత’ దుకాణంలో మహిళలకు అవసరమైన గాజులను, పిల్లలకు చిరుతిళ్ల అమ్ముతున్న ఈమె పేరు కటిక రుకియాబీ. మండల కేంద్రమైన సి.బెళగల్లో నివాసం ఉంటున్నారు. పొదుపు మహిళ కావడంతో వైఎస్సార్ చేయుత పథకం కింద ఈమె బ్యాంక్ ఖాతాకు రూ.18,750 నగదు జమ అయ్యింది. గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన వారందరికీ నేరుగా సాయం అందేదని ఈమె తెలిపారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో తమకు జీవనోపాధి లభించిందని చెప్పారు. – సి.బెళగల్ -
ఎన్హెచ్–40పై హైఅలర్ట్
కర్నూలు: పొగ మంచు కారణంగా వాహనదారులకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) హై అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్హెచ్–40)పై శీతాకాలం సవాలు విసురుతోంది. 188 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రస్తుతం పొగ మంచు (వైట్ ఔట్) వల్ల ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9 గంటల వరకు దృశ్యమానత (విజిబులిటీ) సున్నాకి పడిపోతుండటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. ప్రమాదాలకు కారణమవుతున్న ఇల్యూజన్ (భ్రమ) సాధారణంగా పొగ మంచులో డ్రైవర్లు తమ వాహనం నెమ్మదిగా వెళ్తుందని భావిస్తారు. వాస్తవానికి వాహనం వేగంగానే ఉంటుంది. దీనిని స్పీడ్ ఇల్యూజన్ అని పిలుస్తారు. ఈ భ్రమ వల్లనే ఎక్స్ప్రెస్ వేలపై గొలుసుకట్టు ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 1033... ప్రయాణంలో వాహనం మొరాయించినా లేదా రోడ్డుపై ఏదైనా అవరోధం ఉన్నా వెంటనే జాతీయ రహదారి హెల్ప్లైన్ 1033కి డయల్ చేయాలి. పొగమంచు సమయంలో ఓపికగా, నెమ్మదిగా డ్రైవ్ చేయాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఐఏ ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనదారులు 10 నుంచి 15 మీటర్ల దూరం పాటించాలి. పొగ మంచు తీవ్రత దృష్ట్యా ఎన్హెచ్–40పై జాతీ య రహదారుల సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం కెమెరా ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోంది. నన్నూరు, చాపిరేవుల, చాగలమర్రి, పాటిమీద పల్లి టోల్ప్లాజాల నుంచి పెట్రోలింగ్ వాహనా లు నిరంతరం సైరన్లతో తిరుగుతూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద సోలార్ బ్లింకర్లు, మెరిసే సైన్ బోర్డులను అదనంగా ఏర్పాటు చేశాం. – వి.మదన్మోహన్, ప్రాజెక్ట్ హెడ్ -
ఇంటి వద్దనే వైద్యం
చిన్నారికి స్పెషలిస్టు వైద్యుడు వైద్య పరీక్షలు చేస్తున్న చిత్రమిది. ఇప్పుడు ఈ దృశ్యాలు గ్రామాల్లో కనిపించడం లేదు. జగనన్న సురక్ష పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా అమలు చేశారు. ప్రతి నెలా గ్రామాల్లో నిపుణులైన వైద్యులతో శిబిరాలు నిర్వహించేశారు. ఇంటి వద్దనే వైద్య సేవలు అందించారు. – కర్నూలు (హాస్పిటల్) వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు పంటలు పండించేలా 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్ జలకళ పథకం కింద బోర్లు వేశారు. అప్పటి ప్రభుత్వమే ఉచితంగా బోర్లను తవ్వించేది. భూగర్భ జలాలు ఎక్కడ ఉన్నాయో అధికారులు ముందుగానే గుర్తించేవారు. వైఎస్సార్ జలకళ బోరును వేసిన తర్వాత సూచనలు చేసేవారు. పాలాల్లో జలకళ సమృద్ధిగా ఉంది అని చెప్పే ఈ చిత్రం ఇదీ. – కర్నూలు (అగ్రికల్చర్) -
శ్రీమఠంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాన్ని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్ సతీసమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట ఆర్ఎం శ్రీనివాస్, డీజీఎం వి.హేమ ఉన్నారు. శ్రీమఠం అధికారులు శేష వస్త్రం, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్ర జ్ఞాపిక అంజేశారు. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను (ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్ సందర్శించారు. ప్రజలకు బ్యాంకు సేవలు ఉపయోగం గురించి తెలుసుకున్నారు. -
జగన్ మామతోనే సాంకేతిక విద్య
ఈ విద్యార్థిని పేరు మౌనిక. ఎమ్మిగనూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. మాజీ సీఎం జగన్ మామ తమ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని ఈ విద్యార్థిని తెలిపారు. అప్పట్లో తనకు ట్యాబ్ ఇచ్చారని, క్లాస్ రూమ్ల్లో డిజిటల్ ప్యానల్ బోర్డులు ఏర్పాటు చేసి సాంకేతిక విద్యను అందించారన్నారు. గతంలో తాము క్లాస్ రూమ్లో కింద కూర్చునే వారమని, ఇప్పుడు డెస్క్లపై కూర్చుంటున్నామని చెప్పారు. తనలాంటి విద్యార్థులెందరికో చదువులపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. – ఎమ్మిగనూరుటౌన్ ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ హొళగుంద ఈబీసీ కాలనీలోని సెంటున్నర స్థలంలో నిర్మించుకున్న సొంతింటిలో నివాసం ఉంటున్న దంపతుల పేర్లు అల్లా ఉద్దీన్, సర్తాజ్బేగం. సెంటు భూమికూడా లేని వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అల్లా ఉద్దీన్ బళ్లారిలో లారి డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య సర్తాజ్బేగం ఇంట్లో ఉంటూ పిల్లల బాగోగలను చూసుకుంటూ ఉండేవారు. వీరి ఇద్దరికీ ఒకేసారి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2 లక్షలు రావడంతో కర్నూలులో 2022లో అల్లా ఉద్దీన్కు గుండెకు బైపాస్ సర్జరీ చేశారు. అలాగే సర్తార్బేగంకు కర్నూలు విశ్వ భారతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద రెండు సార్లు క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు కోలుకుని ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. – హొళగుంద నాపేరు కురువ మల్లికార్జున. మాది గోనెగండ్ల మండలం అలువాల గ్రామం నా తల్లిదండ్రులు శరవప్ప, లక్ష్మీదేవి. వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ నన్ను, మా అన్నను చదివిస్తున్నారు. 2020 సంవత్సరంలో డిగ్రీ చదివేటప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ వేయడంతో నేను డిగ్రీ పూర్తి చేయగలిగాను. దీంతో మా తల్లిదండ్రులకు భారం తగ్గింది. కానీ నేడు ఆ పరిస్థితి కనబడడం లేదు. దీంతో నిరుపేద విద్యార్థులకు ఫీజుల భారంతో చదువు మానుకునే పరిస్థితి వచ్చింది. – గోనెగండ్ల -
ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు
కర్నూలు సిటీ: పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాత్మక విద్యతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిలా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సి.వి.రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన 11మంది విద్యార్థులు ఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై య్యారన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన చిన్న చిన్న ప్రాజెక్టులే రేపటి రోజున పెద్ద ఆవిష్కరణలకు నాంది అన్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా అపారమైన ప్రతిభ ఉంటుందని.. సరైన అవకాశాలు, మార్గదర్శకం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. వ్యక్తిగత విద్యార్థి విభాగం 1.ఎ.సురేఖ(ఉపరితలం వైశాల్యం, ఘన పరిమాణాం), డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కంబాలపాడు 2. మేఘన(బహుభుజి యొక్క బాహ్యకోణాల మొత్తం), జడ్పీ హైస్కూల్, హెచ్.కై రవాడి, గోనెగండ్ల మండలం వ్యక్తిగత ఉపాధ్యాయ విభాగం 1.పి.లింగరాజు(వాయు కాలుష్య నియంత్రణ), స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్, ఉరుకుంద జెడ్పీ హైస్కూల్ 2.వై.అనురాధ(సమీకృత వ్యవసాయ విధానం), జెడ్పీ హైస్కూల్, కోసిగి ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిస్తున్న కలెక్టర్ డా.ఎ.సిరి, ప్రదర్శనలను తిలకిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి, డీఈఓ ఎల్.సుధాకర్ వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది రాష్ట్ర స్థాయికి 11 ప్రాజెక్టులు ఎంపిక జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మొత్తం 159 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. 1.సుస్థిర వ్యవసాయం–బి.ఆసిఫ్, ఎం.అనాస, నందవరం జెడ్పీ హైస్కూల్ 2.వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు–కె.మల్లికార్జున(పాల ప్లాస్టిక్), ఏపీ మోడల్ స్కూల్ గోనెగండ్ల 3. హరిత శక్తి–పి.మానస, టి.గ్రేస్మేరి(హరిత హైడ్రోజన్–భవిష్యత్ ఇంధనం), డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, దిన్నెదేవరపాడు 4. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు– పి.లత్తీఫ్, పి.రోషన్(వాక్యుమ్ క్లీనర్), జెడ్పీ హైస్కూల్, హంప, మద్దికేర మండలం 5.గణిత నమూనాలు–ఎస్.రెహానా, భార్గవి(త్రిముఖ నమూనాలు)ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హైస్కూల్, వెల్దుర్తి 6.ఆరోగ్యం, పరిశుభ్రత–బి.రితిక, తేజేశ్వని(డ్రాప్ మైక్రోస్కోప్)ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, కింగ్ మార్కెట్, కర్నూలు 7. నీటి సంరక్షణ, నిర్వహణ–కె.వైష్ణవి(సుస్థిర వ్యవసాయంలో నీటి సంరక్షణ), జెడ్పీ హైస్కూల్ ఉరుకుంద, కౌతాళం మండలం -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. కర్నూలు(హాస్పిటల్): పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ చెప్పారు. శనివారం కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు పల్స్పోలియో కార్యక్రమ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే జన్మించిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ వారి వారి తల్లిదండ్రులు విధిగా పోలియోచుక్కలు వేయించాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వ్యాధినిరోధక టీకా ల అధికారి డాక్టర్ ఉమ, రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసా ద్, డీపీఎంఓ డాక్టర్ శైలేష్కుమార్ పాల్గొన్నారు. -
అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య
బనగానపల్లె: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలుకూరు గ్రామానికి చెందిన జే రామయ్య ఆచారి(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. మూడు రోజులుగా రామయ్య ఆచారీ కనిపించకపోవడంతో కుటుంబీకులు గాలింపు మొదలు పెట్టారు. గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున వెంకటాపురం గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వలో మృతదేహాం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈయనకు భార్య సరోజమ్మ ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కూరగాయలను రైతుబజారులో అమ్ముకోండి కర్నూలు(అగ్రికల్చర్):కూరగాయలు పండిస్తున్న రైతు లు కర్నూలులోని సీ.క్యాంపు రైతుబజారులో గిట్టుబాటు ధరతో అమ్ముకోవాలని హార్టికల్చర్ కన్సల్టెంట్ శివకుమార్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, కల్లూరు,బేతంచెర్ల మండలాల్లోని పడిదెంపాడు, రుద్ర వరం, చిన్నటేకూరు, పెద్దటేకూరు, ఎంబాయి,సీతారంపురం తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన కూ రగాయల పంటలను పరిశీలించారు. రైతులు సాగు చేసిన టమాట, సొర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుమ్మడి కాయలు, ఆకు కూరలను పరిశీలించారు. కూరగాయలు సాగు చేసిన ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. పండించిన కూరగాయలను రైతుబజారులో అమ్ముకోవాలని సూచించారు. రైతుబజారులో రైతులకు తగిన స్థానాలు కేటాయిస్తామన్నారు. మెడికవర్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్లో శనివారం సాయంత్రం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఎస్ఎంటీబీసీ, కర్నూలు సీనియర్ పాస్టర్ డాక్టర్ కరుణ సాగర్ హాజరై క్రిస్మస్ సందేశమిచ్చారు. క్రిస్మస్ పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, సేవాభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని ఆయ న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన నృత్య కార్యక్రమాలు, గాన ప్రదర్శన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం క్రిస్మస్ ఆనందాన్ని ప్రతిబింబించేలా కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వకుమార్, రుమటాలజిస్ట్ డాక్టర్ సృజన, హాస్పిటల్ క్లస్టర్ హెడ్ వై.మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రిమినల్ కేసులపై న్యాయమూర్తులకు వర్క్షాప్
కర్నూలు: క్రిమినల్ కేసుల విచారణ, స్వీకరణలపై కర్నూలు జిల్లా ప్రధాన కోర్టులో న్యాయమూర్తులకు శనివారం వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీతాపతి, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ఆర్ఏ రోజేదార్ వర్క్షాప్ జరిగింది. క్రిమినల్ కేసుల విచారణ, స్వీకరణ, అభియోగాల నమోదు, నిందితుల డిశ్చార్జి, తీర్పులు తదితర అంశాలపై చర్చించారు. న్యాయమూర్తులు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన్న రాజా, లీలావతి, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శోభారాణి, శ్రీవిద్య, రాజేంద్రబాబు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతతో రోడ్ల నాణ్యత
కర్నూలు(అర్బన్): రోడ్ల నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికతను అవలంబించడంతో చాలా ఏళ్ల వరకు అవి నాణ్యతగా ఉంటున్నాయని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శంకర్ అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై ) ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీరాజ్ ఇంజినీర్లకు పీఎంజీఎస్వై రోడ్ల నిర్మాణం, నాణ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణాల్లో పాత పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. రోడ్ల నాణ్యతపై నిట్ అధ్వర్యంలో నూతన టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఆయా పరిశోధనలను త్వరలో రోడ్ల నిర్మాణాల్లో ఉపయోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదన్నారు. ముఖ్యంగా పీఎంజీఎస్వై కింద చేపడుతున్న గ్రామీణ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. రోడ్లు పనులు ప్రారంభించినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు ఇంజినీర్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎక్కడ చిన్న పాటి అశ్రద్ధ వహించినా, నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల నాణ్యతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అనేక విషయాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు ఐ వేణుగోపాల్, ఈఈలు మహేశ్వరరెడ్డి, రఘురామిరెడ్డి, డీసీ వెంకటేష్, జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు సౌజన్య, సుస్మిత, డీఈఈలు బండారు శ్రీనివాసులు, నాగిరెడ్డి, చంద్రశేఖర్, కర్రెన్న, మోహన్రావు, రాణి, భాస్కర్రెడ్డి, ధనిబాబు, మన్మధబాబు, ఏఈఈలు ఆర్ సతీష్కుమార్, అమర్నాథ్, రమణ, మోహన్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్. శంకర్ -
ఖాదర్లింగ స్వామికి ప్రత్యేక ఫాతేహాలు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున ఐదు గంటలకు ప్రత్యేక ఫాతేహలు అనంతరం భక్తుల్ని దర్శనానికి వదిలారు. సాయంత్రం దర్గాలో ప్రత్యేక ఫాతేహల అనంతరం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ పూరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచేకాక మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. కొనసాగిన ఆచారం స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్తులు తలపై మోసుకొని తిరుగుతూ ఆచారాన్ని కొనసాగించారు. ఫక్కీర్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఖాదర్లింగ స్వామి దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాదిపతి ఖాదర్బాషా చిష్తీ, కోరుగోడు దర్గా ధర్మకర్త సయ్యద్ ఖాజాపీర్హుసేని చిష్తీ పాల్గొన్నారు. -
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి
కర్నూలు(సెంట్రల్): ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్ అరుణ్ మాట్లాడుతూ..ఆదోని ప్రాంత ప్రజలకు వలసలు నిత్యం కృత్యమయ్యాయన్నా రు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి పథంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదోని మండలాన్ని శాసీ్త్రయంగా విభజించాలని, ప్రజల కోరిక మేరకు పెద్దతుంబళం మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులు రామకృష్ణారెడ్డి, నక్కలమిట్ట శ్రీనివాసులు, చాంద్బాషా, మనోహర్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన సొంతింటి కల
జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం చేసిన పత్రాన్ని చూపుతున్న ఈమె పేరు డొలు లలితా. పాణ్యం గ్రామానికి చెందిన ఈమె భర్త రామ్ తాపీ మేస్రీగా పనికి వెళ్లి జీవనం సాగించే వాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరికి సొంతిళ్లు లేక 12 సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉండేవారు. 2020లో నవరత్నాలు–పేదలకు ఇళ్లులో భాగంగా పాణ్యంలోని మేకల బండ(జగనన్న కాలనీ)లో వీరికి సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వమే సామగ్రి అందించింది. తమ కుటుంబానికి రూ. 2లక్షల వరకు ఆర్థిక భరోసా కలిగిందని డొలు లలితా తెలిపారు. పాణ్యంలో 628 మంది పేదల సొంతింటి కల నిజం అయ్యిందని ఆమె చెప్పారు. – పాణ్యం -
ప్రతిభ చాటే క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు
● రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం కర్నూలు (టౌన్) : క్రీడల్లో ప్రతిభ చాటే క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, దండు లక్ష్మీకాంత రెడ్డి, నాగలక్ష్మీ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 44 వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ మాట్లాడుతూ.. షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో 17 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే ఏడాది జనవరి నెల మొదటి వారంలో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు అతిథులకు కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్కుమార్, సెపక్తక్రా ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వహక కార్యదర్శి సునీల్ కుమార్, కెవి.సుబ్బారెడ్డి, హనుమంత రెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణా రెడ్డి, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, రాష్ట్ర షూటింగ్ బాల్ సంఘం ప్రతినిధులు రత్నం, సురేంద్ర పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో పారిశుద్ధ్యం లేకుంటే ఎలా?
● ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని కారిడార్లలోనే తాగిన టీకప్పులు, తిన్న పేపర్ప్లేట్లు, ఇతర చెత్తను వేయడంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సిబ్బందిలో మార్పు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలకు పరిశుభ్రత ను పాటించాలని ఎలా చెబుతామని ప్రశ్నించారు. కార్యాలయాలు, వాటి కారిడార్లలో పరిశుభ్రతను పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ టెర్రస్పై కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించా రు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ కలెక్టరేట్లోని కొన్ని కార్యాలయాలను ఆమె పరిశీలించారు. నేషనల్ హైవే కార్యాలయంలో రికార్డులు చెత్త కుప్ప మాదిరిగా ఉండడంతో వాటిని స్కాన్ చేసి ఈపీటీఏ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం స్పెషల్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలో టాయిలెట్లు క్లీన్గా లేవని, అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కిట్లు సరిగా లేవని ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు అక్కడి సిబ్బంది కలెక్టర్కు వివరించారు. అంతకముందు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి స్వచ్ఛంధ్రా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ,ఏఓ శివరాముడు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫుడ్ ఇన్ప్పెక్టర్ల విచారణ
నందికొట్కూరు: పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో చాక్లెట్ల కలకలంపై నంద్యాల, ఆత్మకూరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, ఖాసీంవలి శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాలలో గురువారం చాక్లెట్లు తిన్న బాలికలు అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. హెచ్ఎం సావిత్రిని చాక్లెట్ సంఘటన గురించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు ఇచ్చిన స్టేట్మెంట్ను రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్కు, అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో విక్రయించిన చాక్లెట్లను ల్యాబ్కు పంపామన్నారు. కాలం చెల్లిన చిక్కీలు విద్యార్థులకు ఇస్తే చట్ట పరమైన చర్యలు వారిపై జిల్లా అధికారులు తీసుకుంటారని తెలిపారు. వీరి వెంట టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రామిరెడ్డి, ఎంఈఓ–2 శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాలలో 22, 23న స్పోర్ట్స్ మీట్
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–2026 (ఐపీఎస్జీఎం) ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం వాల్పోస్టర్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్లో కర్నూలు నంద్యాల జిల్లాల నుంచి 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారన్నారు. వివరాల కోసం మార్గరెట్ (9390405721), నాగరాజు (9885037114) సంప్రదించాలన్నారు. ఆన్లైన్ ఉద్యోగాలంటూ టోకరా ● రూ. 6 లక్షలు మోసపోయిన యువకులు ఆదోని అర్బన్: పట్టణంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆన్లైన్లో ఉద్యోగాల కోసం రూ.6 లక్షలు మోసపోయారని వన్టౌన్ ఎస్ఐ సమీర్బాషా శుక్రవారం తెలపారు. ఎల్టీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థలో ఆన్లైన్ ఉద్యోగాలు ఇస్తామంటూ విశాఖపట్నంకు చెందిన భానుప్రసాద్, లావణ్య ఆశ పెట్టారు. ఒక ఉద్యోగానికి ఒకటిన్నర లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని ఆన్లైన్లో నమ్మ పలికారు. దీంతో రాజరాజేశ్వరి కాలనీకి చెందిన వీరేష్బాబుతో పాటు మరో ముగ్గురు ఒకటిన్నర లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షలు ఆన్లైన్ ద్వారా వేశారు. 2024లో ఈ లావాదేవీలు జరిగాయని, తీరా ఉద్యోగం రాకపోవడంతో ఆన్లైన్లో, ఫోన్ ద్వారా సంప్రదించడంతో వారి ఆచూకీ తెలియకపోవడంతో మోసపోయామని తెలుసుకుని శుక్రవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బయలు వీరభద్రస్వామికి విశేష పూజ శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి శుక్రవారం అమావాస్య సందర్బంగా విశేషార్చన జరిపించారు. అమావాస్య రోజున భక్తులు పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 30 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా ఈ విశేష పూజను జరిపించుకున్నారు. స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు తెలిపారు. -
ఇద్దరికి షోకాజ్ నోటీసు
జూపాడుబంగ్లా: స్థానిక కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఘటనలో ఎస్ఓ యశోద, టీచర్ ఇందిరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత తెలిపారు. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటనపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్రెడ్డి స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని అకడమిక్ మానిటరింగ్ అధికారిణి మాధవీలత, ఎంఈఓ శ్రీనివాసులును ఆదేశించారు. ఈ మేరకు వారు పాఠశాలకు చేరుకుని ముందుగా బాధిత విద్యార్థిని హరిణిశ్రీతో మాట్లాడి శరీరంపై ఉన్న దెబ్బలను పరిశీలించారు. అనంతరం విద్యార్థిని చితకబాదిన తెలుగు టీచర్ ఇందిర, ఎస్ఓ యశోదతో కారణాలు తెలుసుకున్నారు. అయితే ఏఎంఓ విచారణలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. అనంతరం ఏఎంఓ విలేకరులతో మాట్లాడుతూ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఆమె వెంట ఏఎస్ఓ దస్తగిరి, సీఆర్పీ కిరణ్ ఉన్నారు. -
జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు దక్కింది. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్ఐలు ధనుంజయ, సునిల్తో పాటు సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు గ్రామ శివారులో ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రెండు ఏటీఎంలను ఎత్తుకెళ్లేందుకు దొంగలు ప్రయత్నించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఏటీఎంను దొంగలు పెకిలించి వాహనంలో తీసుకుపోతుండగా స్థానికులు అనుమానించి వెంటపడ్డారు. దీంతో దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించినందుకు జిల్లా పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. -
అన్ని రకాల పత్తిని కొనుగోలు చేయాలి
● జాతీయ రహదారిపై రాస్తారోకో ఎమ్మిగనూరుటౌన్: సీపీఐ అధికారులు అన్ని రకాల పత్తిని కోనుగోలు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హనుమంతు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శివమూర్తి పత్తి మిల్లు వద్ద శుక్రవారం జాతీయరహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తిని కొనుగోలు చేయకుండా ఒక్క రైతును కూడా వెనక్కి పంపకూడదన్నారు. రాస్తారోకో అనంతరం సీసీఐ అధికారితో మాట్లాడారు. రైతులందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. రైతు సంఘ నాయకులు నరసింహులు, దేవపుత్ర, రాఘవరెడ్డి, నరసింహులు, రాముడు పాల్గొన్నారు. -
ఉద్యమం చేస్తాం
బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభు త్వం బకాయి పడిన ఫీజులను విడుదల చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఫీజు బకాయిలన్నింటినీ చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నేటి వరకు నెరవేరలేదు. ఫీజులను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందున కళాఽశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. – కటారుకొండ సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు నిర్ణీత సమయంలోగా ఫీజులను చెల్లించకపోతే వారి చదువులు ఎలా సాగుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్పై దృష్టి సారించకపోవడంతో విద్యారంగం ఒడిదొడుకులను ఎదుర్కోంటోంది. అనేక మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంతో పాటు 2023–24 బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. – కే భాస్కర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలన్నింటిని విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్లను విడతల వారీగా విడుదల చేస్తున్నామని పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయ కూడా విడుదల చేయలేదు. కూటమి నాయకులకు చెందిన అనేక కళాశాలలు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వెంటనే ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయాలి. – డీ సోమన్న, ఏఐఎస్ఎఫ్, జిల్లా అధ్యక్షుడు -
ప్రకృతి స్నోయగాలు
మంచు చాటున ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు ఉదయాన్నే పొలం పనులు, ఉద్యోగాలపై బయటకు వెళ్లే వారే ఇబ్బందులు పడుతుండగా.. మరో వైపు మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతిలో అందాలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని పైర్లపై కమ్ముకున్న పొగ మంచు, మంచు తెరల మాటున ప్రకాశించే భానుడు, అదే సమయంలో పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న రైలు, రహదారులపై లైట్ల వెలుతురులో వెళ్తున్న వాహనాలు.. ఇలా ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. – బేతంచెర్ల/గోనెగండ్ల గోనెగండ్లలో రహదారిని కమ్మేసిన మంచుపంట పొలాలను కమ్మేవేసిన పొగ మంచు -
పేదల భవిష్యత్తును వేలం వేయడమే ‘ప్రైవేటీకరణ’
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): పేదలకు విద్య, వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ అజెండా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రెవేటీకరణ చేయడమంటే పేదల భవిష్యత్తును వేలం వేయడమే అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి నాలుగు లక్షల సంతకాలను జగనన్న నేతృత్వంలో గవర్నర్కు అందజేశామన్నారు. ప్రజా స్పందన ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భూమి ఇచ్చి, నిర్మాణాలు చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పించి 66 ఏళ్ల లీజు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందని చంద్రబాబు నాయుడు నిసిగ్గుగా చెప్పడం దారుణంగా ఉందన్నారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమం రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజల మనుగడ కోసం చేసిన పోరాటమన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో అమలులో ఉన్న నిబంధనలే అమలు చేయాలన్నారు. రూ.2.75 లక్షల కోట్లు ఏం చేశారు? చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.2.75 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. విద్యా శాఖమంత్రిగా కొనసాగుతున్న లోకేష్ ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ బిల్డింగ్ అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పేరుతో 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ. 4 వేలు, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు రూ. 3 వేలు, న్యాయవాదులకు రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మరచిపోయారన్నారు. అప్పుగా తెచ్చిన రూ.2.75 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. అమరావతిలో కిలో మీటర్ రోడ్డుకు రూ.170 కోట్లు ఖర్చు చేస్తున్నారని, రోడ్డుకు బంగారు పూత పూస్తున్నారా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ విక్రమ సింహారెడ్డి, పార్టీ నేతలు కిషన్, రాఘవేంద్ర నాయుడు, పాండు, శ్రావణ్, అశోక్ లాజరస్, అస్లాం పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఆదోని జిల్లా చేయాలి
● జేఏసీ నాయకుల నిరసనఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు శుక్రవారం వారు సంఘీభావం తెలిపారు. అనంతరం శివ సర్కిల్లో రాస్తారోకో చేసి అక్కడే బైఠాయించారు. ఆదోని జిల్లా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు నియోజకవర్గాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ, హంద్రీ–నీవా, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేయాలని కోరారు. ఆదోని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. సత్వరం ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. జేఏసీ నాయకులు గణేష్, సత్యన్న, రాజు, సత్యనారాయణరెడ్డి, ఆఫ్రిది, కృష్ణ, మహేంద్ర, ఖాజ, ఉదయ్, శేఖర్, నల్లారెడ్డి, రఘునాథ్ పాల్గొన్నారు. -
వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలా?
● పాలిస్ బండల ఫ్యాక్టరీ, ట్రాక్టర్ యజమానులు వినూత్న నిరసనబనగానపల్లె రూరల్: పాలిస్ బండల ఫ్యాక్టరీ నుంచి వెలువడే వేస్టేజ్కి కూడా రాయల్టీ చెల్లించాలని రాయల్టీ చెక్పోస్ట్ సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్ల యజమానులు, బ్రిక్స్ తయారీ అసోసియేషన్ సభ్యులు, పాలిస్ బండల ఫ్యాక్టరీ యజమానులు రోడ్డెక్కారు. శుక్రవారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలోని యాగంటిపల్లె రహదారిలో సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన చెక్పోస్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలని చెక్పోస్టు సిబ్బంది ట్రాక్టర్లను నిలిపివేయడంతో ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి సుమారు గంట పాటు ఆందోళన చేశారు. బనగానపల్లె – గుత్తి ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ.. పాలీస్ బండల పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజీని ఫ్యాక్టరీకి దూరంగా పారబోస్తామన్నారు. అయితే ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్పోస్ట్ సిబ్బంది టన్నుకు రూ.120 ప్రకారం చెల్లించాలని వాహనాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేస్టేజీ మట్టికి రాయల్టీ ఉపసంహరించుకోవాలన్నా రు. అయితే చెక్పోస్టు అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో చెక్పోస్టు షెడ్ వద్ద వేస్టేజీని వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్ఐ దుగ్గిరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని నిరసన కారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు. -
భారీగా గంజాయి మొక్కలు పట్టివేత
పొలంలో గంజాయి మొక్కలను పరిశీలిస్తున్న సీఐ రవిశంకర్ రెడ్డి, ట్రాక్టర్లో తరలిస్తున్న దృశ్యంచిప్పగిరి: మండలంలోని డేగులహాలు గ్రామంలో భారీగా సాగు చేసిన గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన వివరాలివీ.. గ్రామంలోని సర్వే నంబర్లు 173, 176లలో కందితో పాటు మిరప పైర్లలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ పోలీసులతో కలిసి ఆయా పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. రెండు సర్వే నంబర్లలోని దాదాపు 15 ఎకరాల్లో గ్రామానికి చెందిన శివయ్య సాగు చేస్తున్న కంది, మిరప పొలాల్లో గంజాయి మొక్కలను గుర్తించారు. మొక్కలు అక్కడక్కడ ఉండడంతో కూలీల సాయంతో సేకరిస్తున్నారు. మొక్కల బరువు ఇతర వివరాలను పంచనామా అనంతరం వెల్లడిస్తామని సీఐ తెలిపారు. పొలం సాగు చేస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్, ఏడీఏ చెంగల్రాయుడు, ఎకై ్సజ్ సీఐ లలిత పంచనామా నిర్వహించారు. -
బాల్య వివాహాలు సాంఘిక దురాచారం
కర్నూలు: బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని, అలాంటి వివాహాల వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాల్య వివాహి రహిత భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కుటుంబాలతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందన్నారు. 18 సంవత్సరాల్లోపు పెళ్లి చేసుకుంటే వారికి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గర్భవతి అయితే శిశువు గర్భంలోనే మరణించే అవకాశముందన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉంటాయన్నారు. బాలల సహాయం కోసం విడుదల చేసిన పోస్టర్లను జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రదర్శిస్తామన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గేడ్–1 సూపర్వైజర్ రాజేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జుబేదాబేగం. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పరిశ్రమ పేరుతో రూ.2 కోట్ల మోసం
ఆదోని అర్బన్: పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కర్నూలుకు చెందిన వ్యక్తి దాదాపు రూ.2 కోట్లు మోసం చేశాడని సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన భీమేష్, ధనలక్ష్మి పీవీసీ పైపులు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వారికి కర్నూలుకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిశ్రమ ఏర్పా టు చేస్తానని అనుమతులు కూడా తీసుకొస్తాన ని చెప్పి 2023లో రూ.కోటి ఆ దంపతుల వద్ద ఆర్టీజీఎస్, నగదు రూపంలో తీసుకున్నారు. అంతేగాకుండా తమ తండ్రి వద్ద పరిశ్రమకు అవసరమైన మిషనరీలు కూడా ఉన్నాయని, మిషనరీలు కోసం రూ.90 లక్షలు ఇప్పించుకున్నట్లు తెలిపారు. అయితే కొంత మేర నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత పనులు ఆపినందుకు నిలదీస్తే రిజ్వాన్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ ఆదోని త్రీటౌన్కు పంపించారని, బాధితులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు ఆలూరు రూరల్: దాడి కేసులో ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన బోయ సుధాకర్ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించింది. ఆలూరు ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన కురువ నౌనేపాటి, బోయ సుధాకర్ల మధ్య వ్యక్తి గత కారణాలతో గొడవలు ఉండేవి. ఇందులో భాగంగానే 2015లో బోయ సుధాకర్ ..నౌనేపాటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారన్నారు. పదేళ్ల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఆదోని సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.. నిందితుడు సుధాకర్కు మూడేళ్లు జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. దేవస్థాన వైద్యశాలకు ‘ఈసీజీ’ విరాళం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వైద్యశాలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బాలం సుధీర్ శుక్రవారం ఈసీజీ యంత్రాన్ని విరాళంగా అందజేశారు. వైద్యశాల జూనియర్ అసిస్టెంట్ చిన్నాకు దాత తరఫున దేవస్థాన మాజీ పర్యవేక్షకుడు మధుసూదన్రెడ్డి ఈ పరికరాన్ని అందజేశారు. స్థానిక భక్తులు, ప్రజల సౌకర్యార్థం దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు ఈ యంత్రం ఎంతగానో దోహదపడుతుందని దాత పేర్కొన్నారు. -
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమావాస్య కావడంతో భక్తులు తమ ఇంటి ఇలవేల్పును దర్శంచుకోవాడానికి వేలాదిగా తరలివచ్చారు. క్షేత్ర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు స్వామివారి మూలవిరాట్కు సుప్రభాతసేవ, మహామంగళహరతి, ఆకుపూజ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప డిపో అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. కౌతాళం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. అలాగే ఉరుకుందకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన బుడుములదొడ్డి ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తుంగభద్ర నది ఒడ్డున మేళిగనూరు గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
పార్థసారథి.. ఆదోనిలో అభివృద్ధి ఎక్కడా?
● ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిఆదోని టౌన్: ఆదోనిలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పార్థసారథి పట్టణంలో ఎక్కడెక్కడా.. ఏమి చేశారో చూపించాలని వైఎస్సార్సీపీ ఆదోని ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదోనికి షాపింగ్ మాల్స్ తీసుకొచ్చాను.. అభివృద్ధి చేశాను.. ఉపాధి కల్పించానని.. చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా.. అని ప్రశ్నించారు. షాపింగ్మాల్స్తో స్థానిక చిన్నచిన్న వస్త్ర వ్యాపా రులు దుకాణాలను మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు. షాపింగ్ మాల్స్లో పనిచేసే వారికి కూడా అతి తక్కువ జీతాలు ఉంటాయని, వారు ఆ జీతాలతో బతకలేని పరిస్థితి ఉందన్న విషయాన్ని పార్థసారథికి తెలియదా అని సూటిగా అడిగారు. బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మరమ్మతులకు ఎమ్మెల్యే పార్థసారథి నిధులు మంజూరు చేయించానని గొప్ప లు చెప్పుకుంటున్నారన్నారు. అసలు బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మరమ్మతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదన్నారు. మున్సిపాలిటీకి 16 ఫైనాన్స్, జనరల్ ఫండ్స్ నిధులు వస్తాయని, మున్సిపాలిటీకి ఎమ్మెల్యే నిధులు తెప్పించిన దాఖలాలు కూడా లేవన్నారు. ఎమ్మెల్యేగా 18 నెలల్లో ఆదోని ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలకు చూపెట్టాలని హితవు పలికారు. ఎమ్మెల్యేను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకుని ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. -
ఖలీల్.. వహ్వా!
కర్నూలు కల్చరల్: సంగీత సవ్వడులకు కాలు కదపడం.. మధురమైన సంగీతానికి మైమరిచిపోతుంటాం. అలాంటి సంగీత వాయిద్యాల్లో బుల్బుల్ తారా (ఎలక్ట్రికల్ బ్యాంజో) ఒకటి. గజల్, ఖవ్వాలి ప్రదర్శనల్లో ఆ పాటలకు బుల్బుల్ తారా వాయిద్యం నుంచే వెలువడే సవ్వడులు, వాయిద్య కారుడు తన చేతివేళ్లతో లయబద్దంగా వాయిద్యం తీగలను, బటన్స్ను మీటడంతో వచ్చే శబ్ధాలు మనసుకు వినసొంపును ఇస్తాయి. అయితే ఈ బులుబుల్ తారా వాయిద్య పరికరాలు కాలంతో పాటు కనుమరుగవుతున్నాయి. ఈ వాయిద్యాన్ని వాయించే వారిని వేళ్లపై లెక్కించ వచ్చు. అలాంటి వారిలో కర్నూల నగరానికి చెందిన బుల్ బుల్ తారా వాయిద్య కళాకారుడు షేక్ ఖలీల్ అహ్మద్. ఇతని కళా నైపుణ్యాన్ని గుర్తించి తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఖలీల్ కళా ప్రస్థానం గురించి ఇలా.. వాయిద్యం తయారీలో దిట్ట.. స్వతహాగా కార్పెంటర్ అయిన ఖలీల్ తనకు ఎంతో ఇష్టమైన బుల్బుల్ తారా వాయిద్యాన్ని ఆయనే తయారు చేసుకుంటారు. పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే దొరికే ఈ వాయిద్యం ప్రారంభం ధర రూ. 20 వేలు. ఈయన వాయిద్యానికి సంబంధించిన పరికరాలను తెప్పించుకొని తనకు తీరిక ఉన్న సమయాల్లో రూ. 8 వేల లోపు ఖర్చుతో నెల రోజుల్లో తయారు చేసుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో ఈ వాయిద్యాన్ని వాయించడం, తయారు చేయడంలో ఖలీల్ ఒక్కరే ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకై క బుల్బుల్ వాయిద్య కళారుడు 16 ఏళ్ల వయస్సులో మొదలు పెట్టి 68 సంవత్సరాలుగా కొనసాగింపు వాయిద్యం తయారు చేసుకోవడంతో పాటు ప్రదర్శనల్లో మేటి ఖలీల్ కళా నైపుణ్యానికి గుర్తింపుగా ప్రతిభా పురస్కారం నేడు ప్రదానం చేయనున్న తెలుగు కళా సమితి -
గాంధీజీ అంటే ఎందుకు మీకంత ఈర్ష్య
కర్నూలు(సెంట్రల్): మహాత్మాగాంధీ అంటే మీకు ఎందుకంత ఈర్ష్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తీసి వేయడం అన్యాయమన్నా రు. శుక్రవారం సీపీఐ నగర 17వ మహాసభలు కర్నూలులో నిర్వహించారు. స్థానిక సీపీఐ కార్యాల యం నుంచి సీక్యాంపు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్ మాత్రమేనని.. అయితే స్వాతంత్ర పోరాటం చేయని బీజేపీ అధికారంలో ఉండడం అన్యాయమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్కు కొమ్ముకాస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖ స్టీలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ విచ్చల విడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని, అరికట్టడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, శేఖర్, రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఎన్,లెనిన్బాబు, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. -
రివ్యూ పిటిషన్ వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): టీచర్లకు ఇన్సర్వీసు టెట్ అంశంపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని.. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా టెట్ నిర్వహణపై మోసపూరిత ప్రకటనలు చేశాయ ని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్ మండిపడ్డారు. గురువారం కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్సర్వీసు టీచర్లకు టెట్ రద్దు డిమాండ్తో వచ్చే నెల 2, 3 తేదీల్లో విజయవాడలో, 29న ఢిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా చేపడతామన్నారు. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు టెట్ అవసరంలేదన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని చెబుతున్నా ఎందుకు వారి సేలను తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన నూరు రోజుల ప్రణాళికను రద్దు చేయాలని, దాని ప్రకారం పిల్లవాడు చదివే దానికన్నా ఉపాధ్యాయుడు ఆన్లైన్లో ఫొటోలు అప్లోడ్ చేసేదే ఎక్కువగా ఉందన్నారు. ప్రతి టీచర్కు తన సబ్జెక్టుపై ప్రణాళిక ఉంటుందని, దానిని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్పాటి తదితరులు పాల్గొన్నారు. -
నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
శ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనార్థం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని రాత్రి బస చేసి, శనివారం ఉదయం మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చౌడేశ్వరిదేవి దీక్ష విరమణ బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరిదేవి దీక్షను 200 మంది భక్తులు గురువారం విరమించారు. ఇరుముడులతో అమ్మవారి భక్తిగీతాలు పాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయలో ఆవరణలో పూర్ణాహుతి అనంతరం మాలధారులు తమ దీక్షను విరమించారు. భక్తులకు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ కుమార్రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
బాబూ.. ఇవేం లెక్కలు!
పంటలు పండక రైతులు అప్పుల్లో ఉన్నారుజీడీడీపీ చాలా ఎక్కువగా ఉందికర్నూలు(అగ్రికల్చర్): జీడీవీఏ (జిల్లా స్థూల విలువ జోడింపు)ను పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో ఉత్పత్తి నుంచి గణన చేస్తారు. ఈ మొత్తాల నుంచి సబ్సిడీలను తీసేస్తే జీడీడీపీ( జిల్లా స్థూల దేశీయోత్పత్తి) వస్తుంది. రైతులకు సబ్సిడీలు భారీ స్థాయిలో ఇవ్వకుండా, పరిశ్రమలను, సేవారంగాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం జీడీవీఏను అమాంతంగా పెంచింది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా అంకెల గారడీ చూపింది. వాస్తవం ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వంలో మొదటి ఏడాది సంక్షేమ పథకాలు అమలు కాలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను 2025–26లో అరకొరగా అమలు చేశారు. సూపర్–6 హామీలు ఇచ్చామని, వాటిని అమలు చేస్తామని ప్రజలకు అభయా న్ని ఇవ్వడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారి జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. అయినప్పటికీ జీడీవీఏ, జీడీడీపీ అద్భుతంగా పెరిగినట్లు గణాంకాలు సిద్ధం చేశారు. అంకెలను చూసి మురిసిపోవాల్సిందే తప్ప.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమం కనిపించదు. దగా చేయడమే లక్ష్యం! ఉమ్మడి జిల్లాలో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందా, లేదా అనే దానిని తెలుసుకోవడానికి స్థూల ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. పక్కాగా లెక్కిస్తే జీడీడీపీకి ప్రాధాన్యం ఎంతో ఉంది. అయితే అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి అంకెల గారిడీతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. జీడీడీపీలో పెరుగుదలకు అధికారులు కుస్తీ పడుతున్నారు. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా జీడీడీపీ ఎక్కువ చూపాలని చెప్పడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జీడీడీపీ రూ.1,12,332 కోట్లట! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అంటే 2023–24లో కర్నూలు జిల్లా జీడీడీపీ రూ.48,126 కోట్లు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైన తర్వాత అంటే 2024–25లో జీడీడీపీ రూ.47,362 కోట్లకు పడిపోయింది. అయితే 2025–26లో మాత్రం జీడీడీపీ అమాంతంగా రూ.61,630 కోట్లకు పెరిగిపోయింది. గతేడాది పోలిస్తే ఏకంగా రూ.14,268 కోట్లు పెరిగినట్లు అంకెల వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే నంద్యాల జిల్లాలో 50,702 కోట్లు జీడీవీఏ ఉందని లెక్కలు వేశారు. ఈఏడాది వ్యవసాయ ఉత్పాదకత పెరుగకపోగా తగ్గిపోయింది. గత పరిశ్రమలే తప్ప కొత్తవి ఏర్పాటు కాలేదు. సేవారంగంలో సేవలు ఏ మాత్రం పెరుగలేదు. కానీ జీడీడీపీ రూ.1,12,332 కోట్లుగా ప్రకటించుకోవడంపై ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. అధిక వర్షాలతో 2025–26లో వ్యవసాయ, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు మార్కెట్ యార్డులు వెలవెలబోతున్నాయి. సాధారణంగా మార్చి వరకు మార్కెట్ యార్డులు కిటకిటలాడుతాయి. ఈ సారి దిగుబడులులేక, ధరలు లేక ఖాళీగా ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెట్లకు పంట దిగుబడులు రాకున్నా కర్నూలు జిల్లాలో రూ.18,985 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.20,395 కోట్లు జీడీడీపీ ఉన్నట్లు లెక్కలు వేశారు. రైతన్నా.. మీకోసం అంటూ గత నవంబరు 24 నుంచి 29 వరకు ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ నెల 3న రైతుసేవా కేంద్రాల వారీగా వర్క్షాపులు నిర్వహించి జీడీడీపీ లో అంకెల గారిడీ కోసం కసరత్తు చేశారు. దీంతో జీడీడీపీ అమాంతం పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో 18 నెలలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్మిగనూరు మండలంలో టెక్స్టైల్ పార్క్కు భూమి పూజ చేయడం తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. నంద్యాల జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. పారిశ్రామిక రంగంలో అద్భుతమైన జీడీడీపీ సాధించినట్లు లెక్కలు వేశారు. కర్నూలు జిల్లాలో పారిశ్రామిక రంగం ద్వారా జీవీఏ రూ.11,657 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.7,886 కోట్లు ఉన్నట్లు లెక్కలు వేశారు. మొదటి ఆరు నెలల్లో కర్నూలు జిల్లాలో రూ.4.981, నంద్యాల జిల్లాలో రూ.3.914 కోట్ల జీవీఏ సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. మిగిలిన జీవీఏను మార్చి నాటికి సాధిస్తారని గణాంకాల్లో చూపారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు వంటి వాటిని నిర్మించింది. రైతు భరోసాతో అన్నదాతలకు ఆదుకుంది. మద్దతు ధరతో పంటలను కొనుగోల చేసి కర్షకులకు అండగా నిలిచింది. ఆదోని, నంద్యాలల్లో మెడికల్ కళాశాలలు నిర్మించింది. నాడు–నేడు పేరుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచింది. సేవా రంగంలోకి బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు తదితరవన్నీ వస్తాయి. సేవలకు విలువ కట్టి జీడీవీఏ లెక్కిస్తారు. 2025–26లో కర్నూలు జిల్లాలో సేవా రంగం ద్వారా జీడీవీఏ రూ. 29927 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.18,266 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ఆరు నెలల్లో కర్నూలు జిల్లాలో జీడీవీఏ రూ.12058 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.8181 కోట్లు సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. మిగిలిన జీడీవీఏను మార్చిలోపు సాధించనున్నట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నాయి. -
ప్రభుత్వాల అంకెల గారడీ
జీడీడీపీ/జీడీవీఏ లెక్కల్లో ప్రభుత్వాలు అంకెల గారిడీ కి పాల్పడుతున్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా అంకెలు వేసుకుంటున్నాయి. జిల్లా/రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జీడీడీపీ/జీడీవీఏ గణాంకాలు దర్పణం పడుతాయి. ఇది పూర్తి పా రదర్శకంగా జరగాలి. నేడు ప్రభుత్వాలు ఆర్భాటాల కోసం జీవీఏను అమాంతం పెంచేసుకుంటూ పోతున్నాయి. కర్నూలు జిల్లాలో జీడీవీఏ రూ.11వేల కోట్లకుపైగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవడాన్ని పరిశీలిస్తే అంకెల గారిడీకి అద్దం పడుతోంది. – ప్రొఫెసర్ మన్సూర్ రహిమాన్, ఆర్థిక విశ్లేషకులు, కర్నూలు -
రైతులను నట్టేట ముంచిన కావేరి సీడ్స్
కర్నూలు(అగ్రికల్చర్)/కర్నూలు(సెంట్రల్): నకిలీ విత్తనాలతో కావేరీ సీడ్ కంపెనీ రైతులను నట్టేట ముంచిందని మండల కేంద్రమైన గోనెగండ్ల రైతులు కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్కు వచ్చి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదుట రైతుల పక్షాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీత మాధురి మాట్లాడుతూ గోనెగండ్ల, నందవరం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర మండలాల రైతులు కావేరీ సీడ్ కంపెనీ ద్వారా దాదాపు 500 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనోత్సత్తి చేపట్టారన్నారు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి వచ్చిందన్నారు. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా, కిలో కూడా దిగుబడి లేకపోవడంతో కావేరీ సీడ్ కంపెనీ నకిలీ విత్తనాలతో మోసం చేసిందని గుర్తించారన్నారు. ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసిన కావేరీ సీడ్ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఎకరాకు రూ.లక్ష ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఈరన్న, నాయకులు మాలతి, మురళీనాయుడు, త్రివిక్రమ్, సాయి ప్రసాద్ పాల్గొన్నారు. -
కోర్టు వాయిదాలకు ఖైదీలను హాజరు పరచాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి నంద్యాల(వ్యవసాయం): కోర్టు వాయిదాలకు ఖైదీలను కచ్చితంగా హాజరుపరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అన్నారు. నంద్యాల స్పెషల్ సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామన్నారు. అనారోగ్యంతో బాధ పడే వారికి, 70 ఏళ్లు వయస్సుపై బడిన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్లో ఒక న్యాయవాది, ఒక ప్యారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ఖైదీలకు అవగాహన కల్పించారు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసు, జైలు అధికారి గురుప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బిల్లు తీసుకోవడం తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు, సేవకు సంబంధించిన బిల్లు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సూచించారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రజల అవగాహనకు నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీ నూరుల్ ఖమర్ గాయత్రీ ఎస్టేట్లోని జూనియర్ కాలేజీ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ని జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా వినియోగదారులను చైతన్య పరచేందుకు వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మోసపూరిత ప్రకటనలు, అధిక ధరలు, నాణ్యతలేని వస్తువులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఫోరమ్లను ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం జిల్లా చైర్మన్ కరణం కిశోర్కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, కౌసర్ డేగం, డీఎస్ఓ రాజారఘువీర్, వినియోగదారుల ఫోరం సెక్రటరీ శివ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ఈవ్టీజింగ్పై ప్రత్యేక నిఘా
కర్నూలు(టౌన్): జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కళాశాలల వద్ద ఈవ్టీజింగ్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ పోలీసు స్టేషన్లకు సంబందించిన పోలీసులు యాంటీ ఈవ్టీజింగ్ బీట్లను తనిఖీ చేశారన్నారు. పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద ఈవ్టీజింగ్కు పాల్పడే వారిపై నిఘా ఉంచి యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఈవ్టీజింగ్, ఆకతాయిలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని.. లేదా 112, 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం కర్నూలు(అర్బన్): పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ అన్నారు. ఉర్దూ అకాడమీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరై పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వివిధ అంశాలపై పోటీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చిన వారమవుతామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఐడీయల్ స్కూల్, యునానీ కళాశాలను సందర్శించారు. అలాగే ఉస్మానియా కళాశాలలో నిర్వహించిన ప్రపంచ అరబిక్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీఖాన్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం, ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ కౌన్సిల్ చైర్మన్ మహమ్మద్ పీర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి(శనివారం) నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీలో పార్సిల్స్ ఇంటి వద్దకే చేరవేస్తామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ల కార్గో కౌంటర్ల ద్వారా రాష్ట్రంలోని 87 ముఖ్య పట్టణాలకు 50 కేజీల వరకు 10 కి.మీ పరిధిలో పార్సిల్స్ బుక్ చేసి త్వరితగతిన డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మద్దతు ధరతో కందుల కొనుగోలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది రబీలో పండించిన కందులను మార్క్ఫెడ్ ద్వారా నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. కర్నూలు జిల్లాలో 14,788 టన్నులు, నంద్యాల జిల్లాలో 25,875 క్వింటాళ్లు మద్దతు ధర రూ.8వేలతో కొనుగోలు చేయనుంది. నంద్యాల జిల్లాలో మినుములు కూడా 11,254 టన్నులు కొనుగోలు చేయనుంది. నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. మార్కెట్లోకి దాదాపు నెల రోజులుగా కందులు వస్తున్నాయి. మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. మార్కెట్లో రైతులకు గరిష్టంగా రూ.7 వేల వరకే ధర లభిస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఎట్టకేలకు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోళ్లు చేయనుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో కంది సాగు ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లోని ఆర్బీకేల వారీగా కందులు కొనుగోలు చేయనున్నారు. కంది సాగు తక్కువగా ఉన్న మండలాల రైతులు పక్క మండలంలో అమ్ముకోవచ్చని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజు తెలిపారు. ఖరీఫ్లో కంది సాగు చేసి ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులు సంబంధిత ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
ఏపీఎన్జీజీవోస్ జిల్లా అడ్హాక్ కమిటీ ఏర్పాటు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్జీజీవోస్ కర్నూలు జిల్లా శాఖకు ఎట్టకేలకు తాత్కాలిక అడ్హాక్ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల చివరిలోపు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. గురువారం స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అడ్హాక్ కమిటీని ప్రకటించారు. చైర్మన్గా నాగరాజు(వాణిజ్యపన్నుల శాఖ), కన్వీనర్గా నాగేశ్వరరెడ్డి(ఏఈఓ వ్యవసాయ శాఖ), కోశాధికారిగా లక్ష్మినారాయణ(ఆర్డబ్ల్యూఎస్)తో పాటు ఐదుగురిని సభ్యులుగా నియమించారు. అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో తాలూకా ఎన్నికలు కూడా వెంటనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ దస్తగిరిరెడ్డి తెలిపారు. ఈ నెల 19న కోడుమూరు, ఎమ్మిగనూరు తాలూకాలకు, 20న ఆదోని, ఆలూరు, పత్తికొండ తాలూకాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆయా తాలూకాల ఓటర్ల జాబితాను అడ్హాక్ కమిటీ ఆమోదించిందన్నారు. తాలూకాల తర్వాత కర్నూలు నగర శాఖ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
జూపాడుబంగ్లా: కస్తూర్బా పాఠశాలలో తెలుగు టీచర్ ఇందిర బెత్తంతో ఏడో తరగతి విద్యార్థిని హరిణీశ్రీని చితకబాదారు. విద్యార్థి ని తండ్రి సంతోష్కుమార్శర్మ గురువారం కుమార్తెను చూసేందుకు పాఠశాల వద్దకు వెళ్లగా విషయం తెలిసింది. వెంటనే ఆయన పాఠశాల ఎస్ఓ యశోద దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. తాను పాఠశాలలో లేనని ఆమె తెలపటంతో తన బిడ్డను కొట్టిన తెలుగు టీచర్ ఇందిరకు ఫోన్చేసి నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పారని విద్యార్థిని తండ్రి సంతోష్కుమార్ శర్మ విలేకరుల ఎదుట వాపోయాడు. ఏడో తరగతి చదువుతున్న తన బిడ్డను ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న విషయం తనకు తెలియజేకుండా పాఠశాల ఎస్ఓ, తెలుగు టీచర్ ఇందిర నిర్లక్ష్యం చేశారన్నారు. టీచర్పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆవేదనకు లోనైన తల్లిదండ్రులు -
మహనీయుడు.. ఖాదర్లింగ స్వామి
కౌతాళం: తల్లి గర్భం నుంచే మహిమలు ప్రదర్శిస్తూ వేలాది మంది శిష్యులను కూడగట్టుకున్న గురువు ఖాదర్ లింగస్వామి. చరాచర జీవకోటి రాశులకే మూలమైన పరమేశ్వరుడినే మెప్పించిన ఓ ముస్లిం మహనీయుడు అని చరిత్ర చెబుతోంది. మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన ఖాదర్లింగ స్వామిని కులమతాలతీతకంగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఈనెల 20వ తేదీన ఖాదర్లింగ స్వామి జయంతిని దర్గా నిర్వాహకులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు. పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణంలో కొలువైన అమీనుద్దీన్ అలిఆలా షేర్ ఏ ఖుదా గురువు గారి వద్ద ఖాదర్లింగ స్వామి 12 సంవత్సరాలు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో మత మౌఢ్యాన్ని తొలగించి మతసామరాస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి వచ్చారు. ఆయన మెడలో లింగాన్ని ధరించేవారు. దీనికి ఈ ప్రాంతంలో ఉన్న శైవమతస్తులు కొందరు అభ్యంతరం చెప్పారు. భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని ఆయన వారితో వాదించారు. ఒకరోజు శైవమతస్తులను సమావేశ పరిచి వారి మేడలో ఉన్న లింగాలను బావిలో వేసి, వాటిని మరలా రప్పిస్తానని, అలా చేయలేని పక్షంలో గ్రామం వదలి వెళ్లడానికి సిద్ధమని, సాధించినచో తాను ప్రస్తుతం ఉన్న స్థలాన్ని శ్వాశతంగా ఉండడానికి ఇచ్చేయాలని ఒప్పందానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మోప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా మత సామరస్యంతో ఆయనను ఖాదర్లింగ స్వామిగా పూజించడం ఆరంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు 321 సంవత్సరాల క్రితం ఆయన గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్తులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు. ఖాదర్లింగ స్వామి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల భక్తులు తరలిరానున్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
పాణ్యం: పాణ్యం గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు పీవీ జగన్నాథరావు తల్లి జనజకబాయి (104) గురువారం మృతి చెందింది. ఆమె భర్త పీవీ రామచంద్రరావు రైల్వే కాంట్రాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈ కుటుంబం కాంగ్రెస్లో చాలా ఏళ్ల పాటు కొనసాగింది. బెంగళూరులో చిన్న కుమారుడి వద్ద ఉన్న జనజకబాయి గురువారం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు నాయకులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. ఏ కష్టం వచ్చిందో.. మహానంది: పెద్ద మని షినికి ఏ కష్టం వచ్చిందో తెలియదు. మహానందీశ్వరుడి దర్శనానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చి నల్లమల అడవిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు...అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పెద్దమల్లెపల్లె గ్రామానికి చెందిన కంచన రామాంజనేయులు రెడ్డి బుధవా రం తన కుటుంబ సభ్యులకు చెప్పి మహానందికి చేరుకున్నాడు. కాగా గురువారం ఉదయం మహానంది ఆలయం వెనుక ఉన్న నల్లమల అడవిలోకి వెళ్లి నామాలతిప్ప సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వంట చెరుకు కోసం వెళ్లిన కొందరు గుర్తించి వెంటనే బయటికి తరలించారు. 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బ యటపడ్డాడు.వృద్ధుడి కుమారులకు సమాచా రం అందించామని ఎస్ఐ వివరించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయల విహారం మంత్రాలయం: శ్రీ మఠంలో గురువారం రాత్రి మంగళ వాయిద్యాల మధ్య బంగారు రథంపై ప్రహ్లాద రాయలు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వలస కూలీ మృతి నందవరం: బతుకు దెరువు కోసం ఒడిసా రాష్ట్రం నుంచి వచ్చి ముగతి ఇట్టుకల బట్టిలో పని చేస్తున్న అనూర్ మాఘి(30) మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఐ ఇట్టుకల బట్టి వద్ద ఒడిసా రాష్ట్రం నువపాడ జిల్లా కిటిక గ్రామానికి చెందిన ఐదుగురు 15 రోజుల క్రితం పనిలో చేరారు. బుధవారం ఇట్టుకల బట్టిలో అనూర్ మాఘి క్రేన్ వద్ద పని చేస్తుడడంతో ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడు బావమరిది భువన ధ్రువ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుభాన్ తెలిపారు. -
అయ్యో.. కుయ్యో.. మొర్రో !
ఎరుక్క పోయి ఓ శునకం మూతి డబ్బాలో ఇరుక్కుపోయింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ శునకానికి స్వీట్ల డబ్బా కనిపించింది. దీంతో వెంటనే మూతి డబ్బాలోకి పెట్టడంతో ఇరుక్కు పోయింది. ఈ ఘటన మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇరుక్కున్న డబ్బాను స్థానికులు తొలగించేందుకు ప్రయత్నించినా పరుగులు తీసింది. కాసేపటికీ అలసిన శునకం నిద్రించేందుకు నీడకు చేరుకోగా.. పక్కనే ఉన్న వారు మెల్లగా వెళ్లి దాన్ని పట్టుకుని డబ్బాను తొలగించారు. హమ్మ య్యా.. అంటూ కుక్క పరుగులు పెడుతూ తన పిల్లల చెంతుకు చేరి పాలుపట్టింది. – దొర్నిపాడు -
పీపీపీ వద్దంటూ రోడ్డు దిగ్బంధం
ఆదోని రూరల్: పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వద్దంటూ గురువారం ఆదోని మెడికల్ కళాశాల వద్ద రోడ్డుపై ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ.. పీపీపీ విధానంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని, సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందబోదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండాల్సిన వైద్య విద్యను లాభాల కేంద్రంగా మార్చే ప్రయత్నాన్ని మార్చుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.సుదర్శన్, విరుపాక్షి, పంపన్నగౌడ్, భాస్కర్యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నంబర్ 107, 108, 590లను వెంటనే రద్దు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.తిమ్మయ్య డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదం ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తాలూకా ఎస్ఐ రామాంజనేయులు అక్కడికి చేరుకుని ప్రజా సంఘాల నాయకులతో వారించే ప్రయత్నం చేశారు. ధర్నా చేస్తున్న వారిలో కొందరని పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో ప్రజా సంఘాల నాయకులు, ఎస్ఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.షాబీర్బాషా, సీపీఐ మండల కార్యదర్శి రాజు, సీపీఐ పట్ణణ సహకార కార్యదర్శి రమేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి బసాపురం గోపాల్, ప్రజా సంఘాల నాయకులు విజయ్, శ్రీకాంత్, దస్తగిరి, శేఖర్ పాల్గొన్నారు. -
ఇద్దరు మహిళల అరెస్ట్
● పోలీసు అధికారులే టార్గెట్గా ఫొటోల మార్ఫింగ్ ● రెండు సెల్ఫోన్లు స్వాధీనం కోవెలకుంట్ల: పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగాం అకౌంట్లలో పోస్టు చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కొలిమిగుండ్ల సీఐ రమేష్బాబు అందించిన వివరాలకు మేరకు.. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన బందెల స్పందన, ఆమె తల్లి బందెల మార్తమ్మ ప్రస్తుతం కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల నుంచి వీరిద్దరూ ఫేస్బుక్, తదితర సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించి కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పోలీస్స్టేసన్ల పరిధిల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న డ్రస్లో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలు తారుమారు చేసి వాటిల్లో పదే పదే పోస్టు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గత సెప్టెంబర్ 7వ తేదీ, నవంబర్ 26వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లలో వీరిద్దరిపై రెండు కేసులు నమోదు చేశారు. అంతేకాక ఈ ఏడాది మే 6వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించి దౌర్జన్యం చేయడంతో అప్పట్లో మరో కేసు నమోదైంది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని కొలిమిగుండ్ల సీఐ తమ సిబ్బందితో అరెస్ట్ చేసి ఫొటోల మార్ఫింగ్కు వాడుతున్న రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు పదేపదే నేరాలకు అలవాటు పడి ఇప్పటికీ మూడు కేసుల్లో నిందితులుగా ఉండటంతో వీరిని జిల్లా బహిష్కరణ చేయాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సీఐ వివరించారు. -
నత్తనడకన పత్తి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ సీసీఐ మాత్రం నత్తనడకన కొనుగోళ్లు చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 7.02 లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. ఆదోని, ఎమ్మిగనూరు, పెంచికలపాడు, మంత్రాలయంలో 16 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో సీసీఐ పత్తి కొను గోలు చేస్తోంది. జిల్లాలో దాదాపు 70 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. దిగుబడు లు భారీగా ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 49వేల ఎకరాల్లో పండించిన 4.89 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు అందుబాటులో వచ్చే సమయానికే రైతులు దాదాపు 10 లక్షల క్వింటాళ్లు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకున్నారు. రైతుల దగ్గర ఇంకా 5.3 లక్షల ఎకరాల్లో పండించిన 55 లక్షల క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకపోయాయి. మద్దతు ధర రూ. 8100 ఉండగా.. మార్కెట్లో లభిస్తున్న ధర రూ.6వేల నుంచి రూ.6,800 వరకు మాత్రమే ఉంటోంది. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు తేమ, రంగు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఐ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మంత్రి అచ్చేన్నాయుడు అయితే 16–18 శాతం వరకు తేమ ఉన్నా అనుమతించాలని సీసీఐని ఆదేశించినట్లు ప్రకటించారు. కానీ సీసీ ఐ అధికారులు ఏ ఒక్కరి ఆదేశాలను పట్టించుకోని పరి స్థితి నెలకొంది. 12 శాతం కంటే తేమ ఉంటే నిర్దాక్షిణ ్యంగా వెనక్కు పంపుతుండటం గమనార్హం. తిరస్కరించిన పత్తిని దళారీలు కొని అదే పత్తిని మద్దతు ధరతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ అధికారులే ముడుపుల కోసం దళారీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాతాలకు జమకాని నగదు మద్దతు ధరతో పత్తి అమ్ముకున్న రైతులకు గత నెల 28 నుంచి నగదు జమ కావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడంతోబ్యాంకర్లతోపా టు ప్రయివేటు వడ్డీ వ్యా పారులు రైతులపై రు ణాల వసూలుకు ఒత్తిడి చేస్తున్నా రు. అయితే ఇప్ప టి వరకు నగ దు జమ కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
● 2.5 కేజీల గంజాయి, మారుతి కారు స్వాధీనం నంద్యాల: పట్టణంలోని వైజంక్షన్ సమీపంలో ప్రథమనంది ఆలయ ఆర్చి వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావళి గురువారం తెలిపారు. ఏఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్బాషా అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి మారుతి కారులో నంద్యాలకు తీసుకొని వచ్చారు. మునీర్బాషాకు వరుసకు తమ్ముడైన షేక్ మహమూబ్బాషాకు గంజాయిని ఇస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, మారుతి కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని నంద్యాల కోర్టులో హాజరు పరిచామన్నారు.


