breaking news
Kurnool District News
-
బస్సులు కిటకిట
కొలిమిగుండ్ల: దసరా సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లులు అధిక సంఖ్యలో కొలిమిగుండ్ల, అవుకు బస్టాండ్లకు చేరుకున్నారు. వివిధ రకాల పనుల నిమిత్తం పోయే సాధారణ ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడంతో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ముందున్న స్జేజీల నుంచే ఓవర్లోడ్తో వచ్చాయి. చాలా మంది ఫుట్బోర్డు మీద నిలబడి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వచ్చింది. చిన్న పిల్లలు, గర్భిణులు బస్సులు ఎక్కలేని పరిస్థితి ఎదురైంది. వచ్చిన ప్రతి బస్సులో ఫుట్బోర్డు వరకు ప్రయాణికులే కనిపించారు. బస్టాండ్ల వద్ద గంటల సమయం వేచి చూసినా బస్సుల్లో ఏమాత్రం రద్దీ తగ్గలేదు. మార్గమధ్యలోనే పల్లెల్లో బస్సులు ఆపకుండానే వెళ్లాల్సి వచ్చింది. కండక్టర్లు టికెట్లు ఇచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అహోజలం
అహోబిల క్షేత్రంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల అడవి పచ్చదనాన్ని పరుచుకోవడంతో పాటు ఎత్తైన కొండ చరియల్లోంచి నీటి ధారలు జాలువారుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎగువ అహోబిలం జ్వాలా నృసింహస్వామి సన్నిధి, ఉక్కు స్తంభం రహదారి వెంట జలపాతాలు ఉద్ధృతంగా కిందకు దూకుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నవనారసింహ స్వాముల దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకులు జల సోయగాలను చూస్తూ మురిసిపోతున్నారు. – ఆళ్లగడ్డరేపటి నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులకు అనుగుణంగా తేనెటీగల పంపకంపై రైతులకు ఈ నెల 8 నుంచి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యాన శాఖ, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా మొత్తం ఆరు బ్యాచ్లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. శిక్షణ పొందిన రైతులకు ఉద్యాన శాఖ తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తుందన్నారు. అదే విధంగా 50 శాతం సబ్సిడీపై బాక్స్లు కూడా అందిస్తామన్నారు. ఒక్కో బ్యాచ్లో 25 మందికి మాత్రమే అవకాశం ఉందని, అయితే ఇప్పటికే 160 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. యాగంటిని సందర్శించిన విదేశీయులు బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని సోమవారం దక్షిణ కొరియాకు చెందిన ఐదుగురు దర్శించుకున్నారు. వీరు భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించుకుంటూ యాగంటికి చేరుకున్నారు. వీరు క్షేత్ర విశిష్టతలు తెలుసుకుని క్షేత్ర పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.ఎగువ అహోబిలం కొండపై నుంచి జాలువారుతున్న జలపాతాలుకిందకు దూకుతున్న జలపాతం క్షేత్రం ఎదుట జల పరవళ్లు, మెట్ల మార్గంలో వరద ప్రవాహం -
అగ్రహారంలో పట్ట పగలే చోరీ
● 3 తులాల బంగారం, రూ.10 వేల నగదు అపహరణ ఆలూరు రూరల్: మండలంలోని అగ్రహారం గ్రామంలోని ఓ ఇంట్లో పట్ట పగలే దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసం చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరణ చేశారు. గ్రామానికి చెందిన ఉరుకుందప్ప సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి తలుపులకు తాళాలు వేసి భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి చోరీ చేసిన విషయాన్ని గుర్తించాడు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయ భూమిలో అక్రమ మైనింగ్పై దాడి బనగానపల్లె రూరల్: పలుకూరు గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 308లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై బనగానపల్లె భూగర్భ గనుల శాఖ ఆర్ఐ రెడ్డప్ప సోమవారం ఆకస్మిక దాడి చేశారు. దాడి విషయం ముందుగానే తెలుసుకున్న సుమారు ఆరుగురు మైనింగ్దారులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. వారిలో బాబాయి, లక్ష్మయ్య, నాగమయ్య, రాజన్నలు ఉన్నారని ఆలయ అర్చకులు భాస్కరయ్య తెలిపారు. ఆర్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, మైనింగ్దారులు పారిపోవడంతో ఎటువంటి స్వాధీనం జరగలేదని తెలిసింది. ఈ అక్రమ మైనింగ్పై కఠి న చర్యలు తీసుకోవాలని ఆలయ అర్చకులు మండల తహసీల్దార్ను కోరారు. ఈ దాడుల్లో వీఆర్ఐ, సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహం అపహరణ హాలహర్వి: దేవుళ్ల విగ్రహాలను సైతం దొంగలను అపహరిస్తున్నారు. పచ్చారపల్లి గ్రామంలోని సుంకులమ్మదేవి ఆలయంలో అమ్మవారి వెండి విగ్రహాన్ని అపహరించారు. అలాగే అమ్మవారి తాళిబొట్టు, ముక్కుపుడక, ఒకటిన్నర తులం బంగారాన్ని చోరీ చేశారు. సోమవారం ఉదయం అర్చకుడు దేవేంద్రప్ప ఆలయానికి పూజ చేయడానికి వెళ్లి చూడగా విగ్రహం కనిపించలేదు. దీంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే హాలహర్వి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మారుతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్నూలు నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో ఎంతో మేలు
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కర్నూలు కల్చరల్: ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం బీఏఎస్ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లా పర్యటనకు వస్తున్నారని, ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. సూపర్ జీఎస్టీపై కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రమేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలి వేధింపులతో యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: ఇరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎవరికి వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత కూడా ప్రియుడితోనే ఉండేందుకు నిశ్చయించుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువకుడు సూసైడ్ నోట్ రాసుకొని తనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భీమన్నగౌడ్, రాజమ్మలకు అనికుమార్గౌడ్, సునీల్కుమార్గౌడ్, ధనుంజయ్గౌడ్, జయలక్ష్మీలు సంతానం. ధనుంజయ్గౌడ్(27) పెళ్లి కాక ముందు నుంచే గ్రామానికి చెందిన, వయస్సులో తనకన్నా పెద్దదైన శశికళను ప్రేమించాడు. కులాలు వేరుకావటం, వయసులో పెద్దది కావటంతో పెద్దలు, తల్లిదండ్రులు ఇద్దరికీ సర్దిచెప్పడంతో దూరంగా ఉంటున్నారు. శశికళను మంత్రాలయంకు చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. ధనుంజయ్గౌడ్(27) ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎర్రకోటలోని తన మేనమామ కృష్ణగౌడ్ కుమార్తె సాయిప్రియతో 2022 జూన్లో వివాహమైంది. అయితే శిశకళకు పెళ్లై పిల్లలున్నా ధనుంజయ్గౌడ్తో తిరిగి స్నేహం కొనసాగించింది. ఇరువురూ ఊరు వదలి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలుచుకొచ్చి సర్దిచెప్పారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇరువురూ పారిపోవడంతో ధనుంజయ్గౌడ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కేసు కోర్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ భర్త, ఇద్దరు ప్లిలలను వదలి ధనుంజయ్గౌడ్ వద్దకు చేరుకుంది. చేసేది లేక కర్నూలు రోడ్డులోని ఓ లేడిస్ హాస్ట్టల్లో శశికళ ను ఉంచి తాను ఎమ్మిగనూరులోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే శిశకళ తనను పెళ్లి చేసుకొవాలని, ఎన్ని రోజులు హాస్టల్లో పెడతావంటూ వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం గువ్వలదొడ్డికి వెళ్లిన ధనుంజయ్గౌడ్కు హాస్టల్లో ఉన్న శశికళ వీడియోకాల్ చేసి నన్ను తీసుకెళ్లకపోతే ఉరేసుకొని చనిపోతానంటూ బెదిరించింది. ఆమె చనిపోతే కేసు తన మీదకే వస్తుందని భయాందోళనకు లోనైన ధనుంజయగౌడ్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. శశికళను భర్త, పిల్లల దగ్గరకు చేర్చండి ధనుంజయ్గౌడ్ తన సుసైడ్ నోట్లో ‘‘నేను చనిపోతున్నా.. శశికళను తన భర్త, పిల్లల దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకోండి’’ అని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులును కోరాడు. ‘‘శశికళ భర్త చాలా మంచివాడు, శశికళ చనిపోతానని నన్ను భయపెట్టినందుకే నేను తప్పు చేశాను. నా చావే అన్నింటికీ పరిష్కారం.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి. మేన మామకు వేరీ వేరీ సారీ. చెల్లెలు బుజ్జమ్మను కలెక్టర్గా చూడాలనుకున్నా.. ప్రియురాలి కోసం అందరనీ దూరం చేసుకున్నా. ఇక సెలవు..’’ అనే సమాచారంతో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసుకుని తనువు చాలించాడు.సుసైడ్ నోట్ధనుంజయ్గౌడ్ (ఫైల్) -
మట్టి మిద్దె కూలి చిన్నారి మృతి
మంత్రాలయం రూరల్: మట్టి మిద్దె కూలి ఐదేళ్ల చిన్నారి లలిత మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామం బీసీ కాలనీకి చెందిన ఉలువ బీమరాయుడుతో పాటు భార్య బోయ నాగమ్మ, వారి కొడుకు రామాంజనేయులు, కుమార్తె శ్రావణి, మనవరాలు లలిత(5) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా తడిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలి పోయింది. పెద్ద ధ్వని రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చిన మట్టిని, జెంతలను తొలగించి కుటుంబ సభ్యులను బయటకు తీశారు. ప్రమాదంలో చిన్నారి లలిత స్పృహ కోల్పోయింది. నాగమ్మ, రామాంజనేయులు, శ్రావణి, భీమరాయుడికి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. లలిత స్పృహకోల్పవడంతో వెంటనే ఆర్ఎంపీని సంప్రదించగా మృతి చెందినట్లు తెలిపారు. గోనేగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రామాంజి దంపతుల కుమార్తె లలితను చదువు నిమిత్తం తాత భీమరాయుడు వద్ద ఉంచారు. తాత వద్ద ఉంటూ నర్సరీ చదువుతూ ఆటపాటలతో అలాడుతున్న చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ జనార్దన్రావు పరిశీలించి వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలు తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
గ్యాస్ లీకై ఇంట్లో భారీ పేలుడు
● భార్యాభర్తలకు, ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు వెల్దుర్తి: గ్యాస్ లీకై మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించి ఇల్లు ధ్వంసం కావడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన వెల్దుర్తి మండలం బోయనపల్లె గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో చోటుచేసుకుంది. గాయపడిన వారిలో వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణ (6 నెలల గర్భిణి), వారి కుమారులు అనిల్, చరణ్ ఉన్నారు. వడ్డె నాగరాజు గౌండ పనిచేస్తూ గ్రామంలో చర్చి వద్ద ఉన్న ఇంట్లో బాడుగకు నివాసముంటున్నాడు. ప్రతిరోజులాగేే ఆదివారం అందరూ ఇంట్లో నిదురించారు. అర్ధరాత్రి దాటిం తర్వాత పేలుడు శబ్దం రావడంతో చుట్టపక్కల వారు లేచి వచ్చి చూశారు. అప్పటికే ఇంటి చెక్క తలుపు విరగగొట్టబడి అందులో నుంచి పదేళ్ల అనిల్, నాలుగేళ్ల చరణ్ మంటలతో బయటకు రావడం గమనించారు. వారి మంటలార్పే సమయంలో ‘అమ్మా, నాన్నలు మంటల్లో కాలిపోతున్నారు’ అని అనడంతో ఇంట్లోకి ప్రవేశించి వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణను కాపాడారు. సిలిండర్ వద్ద గ్యాస్ లీకై ఇంటి నిండా వ్యాపించి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వడ్డె నాగరాజు లేచి లైట్ వేయడంతోనో, బీడీ అంటించుకునే ప్రయత్నంలోనో పేలుడుతో కూడిన మంటలు రేగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు ధాటికి గోడలు బీటలు వారి, తలుపు విరిగి, ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడ్డాయి. తీవ్రగాయాలతో ఉన్న నలుగురిని హుటాహుటిన కృష్ణగిరి 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామానికే చెందిన గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ సుంకన్న సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. సిలిండర్ ఆఫ్ చేయకపోవడం, స్టవ్ నాబ్ పూర్తిగా కట్టకపోవడంతో గ్యాస్ లీకై నట్లు తెలుస్తోందన్నారు. తీవ్రగాయాలైన నలుగురికి దాదాపు 50 శాతం మేర గాయాలైనట్లు కర్నూలు జీజీహెచ్ వైద్యులు ధృవీకరించి చికిత్స అందిస్తున్నారు. వెల్దుర్తి పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి, గ్రామ నాయకుడు కాంతారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న కోరారు. చరణ్అనిల్తీవ్రంగా గాయపడిన వడ్డె నాగరాజు, సువర్ణ -
అనుమానం పెనుభూతమై!
● భార్యను కిరాతకంగా చంపిన భర్త ● తలపై ఇటుకతో మోది.. ● మృతదేహాన్ని మిద్దైపె నుంచి కిందకు పడేసిన వైనం ఆళ్లగడ్డ: జీవితాంతం తోడు ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు.. ఏడు అడుగులు నడిచాడు. వారి అన్యోన్య దాంపత్యానికి నలుగురు పిల్లలు పుట్టారు. 20 ఏళ్ల తర్వాత భార్యపై అతనికి అనుమానం మొదలైంది. అది పెనుభూతమై చివరకు ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓలమ్మ (40)కి ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటకు చెందిన శేషగిరితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో అనుమానం పెనుభూతమైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో విసుగు చెందిన ఓలమ్మ వారం రోజుల క్రితం పుట్టినిల్లు ఆర్ కృష్ణాపురం చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం భార్య దగ్గరికి వచ్చిన ఆయన తనతో రావాలని చెప్పడంతో సోమవారం ఉదయం పోదామని చెప్పింది. కింది ఇంట్లో ఓలమ్మ తల్లి, అన్న నిద్రించగా ఓలమ్మ, భర్త శేషగిరిలు మిద్దైపె గదిలో నిద్రించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి భార్యను ఇటుకతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం మృతి చెందిన ఓలమ్మను మిద్దైపె నుంచి కిందకు విసిరి పడేసి అక్కడ నుంచి శేషగిరి పారిపోయాడు. ఏదో శబ్దం వచ్చిందని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా విగతజీవిగా పడిఉన్న ఓలమ్మను గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మురళీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి అన్న ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ప్రైవేటీకరణపై ‘ప్రజా’గ్రహం
● జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ● ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వైద్య కళాశాలలను, ఆసుపత్రులను వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీఓ నెంబర్ 107/108 విడుదల చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలకు రానున్న రోజుల్లో వైద్యం అందక తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐక్య వేదిక కన్వీనర్ ఎం రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసనలో కే రామాంజనేయులు (చేతి వృత్తుదారుల సమాఖ్య), పీ రాధాక్రిష్ణ (సీఐటీయు), ఎస్ మనోహర్ మాణిక్యం (ఏఐటీయుసీ), భార్గవ్ ( పీఓపీ ), జహంగీర్ (ఎస్డీపీఐ), హరీశ్వరరెడ్డి (ఏడీఎస్ఓ), సుబ్బరాయుడు (డీటీఎఫ్), కే శేషాద్రిరెడ్డి (జనవిజ్ఞాన వేదిక), డేవిడ్ (ప్రజా పరిరక్షణ సమితి), వీ నాగరాజు (ఏపీ ప్రజా నాట్య మండలి), కే శివనాగిరెడ్డి (స్పార్క్), జయన్న (భవన నిర్మాణ కార్మిక సంఘం), వివిధ సంఘాల నాయకులు సాయి ఉదయ్, అబ్దుల్లా, శరత్కుమార్, బీసన్న, వెంకట్రామిరెడ్డి, సుంకన్న, వాడాల శేఖర్రెడ్డి, కే శేషగిరి, సీ రమేష్, డీ ఏసురాజు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కర్నూలు కల్చరల్: అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అఽధికారులకు సూచనలు ఇచ్చారు. అర్జీలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. సీఎం కార్యాలయ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అజయ్కుమార్, అనురాధ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు ● పీజీఆర్ఎస్కు 58 ఫిర్యాదులు కర్నూలు: రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్కు చెందిన విజయభాస్కర్ రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కర్నూలుకు చెందిన దినేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో ఎస్నీప మాట్లాడారు. మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో పాల్గొని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
హొళగుంద: దేవరగట్టు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరాయి. కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవమూర్తులకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను, పల్లకీని నెరణికి గ్రామం ఊరువాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్దకు తీసుకొచ్చి అక్కడ కొలువుంచారు. దీంతో గ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది. గ్రామస్తులు ఆలయం నుంచి విగ్రహాలను అర్చకుల ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ మాళమల్లేశ్వరుని కంకణధారణతో నిష్టతో ఉన్న ప్రజలు సోమవారం దీక్షను విరమించారు. -
శనగ విత్తు అందక రైతుకు బెంగ
కర్నూలు (అగ్రికల్చర్): రబీ సీజన్ ప్రారంభమై వారం కావొస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. సెప్టెంబరు నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో రైతులు ముందస్తుగా శనగ సాగుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల పంపిణీలో చేతులెత్తేసింది. కేవలం కాగితాలపై శనగ విత్తనాల కేటాయింపు, ధర, సబ్సిడీలు ఖరారు అయ్యాయి. ఇంతవరకు రైతులకు విత్తనం అందని పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్ నిర్వీర్యం ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) శనగ విత్తనాలు సరఫరా చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ సీడ్స్ నిర్వీర్యం అయింది. 2024 ఖరీఫ్, 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్లలో ఏపీసీడ్స్ సరఫరా చేసిన విత్తనాలకు సబ్సిడీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కొన్ని ప్రయివేటు విత్తన కంపెనీలు రైతులతో శనగ ఉత్పత్తి చేయిస్తాయి. ప్రభుత్వం టెండరు ద్వారా ఖరారు చేసిన ధరలకు ఈ కంపెనీలు ఏపీ సీడ్స్కు సరఫరా చేస్తాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ పాత బకాయిలను చెల్లించకపోవడంతో సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో నేడు విత్తన సమస్య తీవ్రమై కూర్చుంది. యాప్ ఇవ్వకుండా ఆదేశాలు శనగ విత్తనాలను ఈ నెల 3వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధం చేయాలని ఏపీసీడ్స్కు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందుకు యాప్ ఇవ్వలేదు. డీ క్రిషి యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. విత్తన పంపిణీకి వీలవుతుంది. యాప్ ఇవ్వకపోవడం, ప్రయివేలు విత్తన కంపెనీలు సహకరించకపోవడంతోనే విత్తనాల పంపిణీ దిశగా ఎలాంటి చర్యలు లేవు. కర్నూలు జిల్లాలో కౌతాళం, కోసిగి మండలాలు, నంద్యాల జిల్లాలో మహానంది, శిరివెళ్ల మండలాలు మినహా మిగిలిన అన్నిమండలాల్లో శనగ సాగు చేస్తారు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు వ్యాపారుల దగ్గర విత్తనాలు కొని సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఆలూరు ప్రాంతంలో శనగ విత్తనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రూపాయి ఇవ్వకుండానే విత్తన సేకరణ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ప్రతి ఏటా రైతులకు బ్రీడర్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో 2024 రబీలో విత్తనోత్పత్తి చేయించింది. విత్తనోత్పత్తి చేసిన 100 మందికిపైగా రైతుల నుంచి ఏపీ సీడ్స్ 10 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించింది. మామూ లుగా అయితే ఉత్పత్తి చేసిన విత్తనాలను సేకరించే సమయంలోనే అడ్వాన్స్ కింద క్వింటాకు రూ.5,000 ఆపైన చెల్లిస్తారు. ప్రభుత్వం విత్తనోత్పత్తి ధరలను ఖరారు చేసిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సారిగా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఏపీసీడ్స్ 10 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సేకరించింది. 2024 రబీలో విత్తనోత్పత్తి చేసిన రైతులకు మళ్లీ రబీ వచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. విత్తనోత్పత్తి చేసిన రైతులు అడ్వాన్స్ కోసం ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రబీ మొదలైనప్పటికీ ప్రారంభం కాని సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ పాత బకాయిలు చెల్లిస్తేనే విత్తనాల సరఫరా అంటున్న ప్రయివేటు విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేసిన రైతులకు రూపాయి కూడా విదిల్చని వైనం ఉద్దేశపూర్వకంగానే... 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 20వ తేదీనే సబ్సిడీ శనగ విత్తన పంపిణీ జరిగేది. రబీ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం పూర్తయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రబీ సీజన్లో ఇదే సమయానికి 10వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సారి ఎలాంటి కదలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కూడా యాప్ వచ్చే అవకాశం లేదు. రాయలసీమకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నర లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం లక్ష క్వింటాళ్లు కూడా కేటాయించలేదు. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆదోని టౌన్/ఆదోని రూరల్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం కర్నూలు జిల్లా నాయకులు రవిచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు గురునాథ్రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి తదితరులతో కలిసి సోమవారం ఆదోని మార్కెట్యార్డులో వారు పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పత్తి, వేరుశనగ, కంది తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. అరకొరగా వచ్చిన పత్తి దిగుబడులను సీసీఐ ద్వారా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులతో అత్యవసరంగా పంట నష్టం అంచనా వేయాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్యార్డు కార్యాలయ సెక్రటరీ గోవిందుకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. -
పత్తికొండ మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు
పత్తికొండ: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పత్తికొండ మార్కెట్యార్డులో తనిఖీలు నిర్వహించారు. ధరలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కోనుగోలు విధానాలు, మార్కెటింగ్ అధికారుల పనితీరును పరిశీలించారు. ధరల హెచ్చుతగ్గుదలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీ చౌడేశ్వరిదేవి ఆదేశాలు మేరకు తనిఖీ చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్తో ఉల్లి పంట తొలగింపు పత్తికొండ రూరల్: మార్కెట్లో ధర లేకపోవడంతో పందికోన గ్రామానికి చెందిన కస్తూరి రంగప్పరాజు అనే రైతు రెండెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్తో సోమవారం తొలగించాడు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టాడు. మార్కెట్లో క్వింటా ధర రూ.200 మాత్రమే ఉండటంతో కోత ఖర్చులు కూడా రాబోవని పండిన పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. దానిని గొర్రెల మంద వదిలాడు. -
దేవరగట్టు.. భక్తిపారవశ్యం
● దేవరగట్టులో ఇనుప గొలుసు తెంపిన గొరవయ్య ● నేడు నెరణికి చేరనున్న ఉత్సవ విగ్రహాలుహొళగుంద: వందలాది మంది గొరవయ్యల ఢమరుక నాదాలతో దేవరగట్టు ఆదివారం హోరెత్తింది. భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. శ్రీమాళ మల్లేశ్వరస్వామి సన్నిధానంలో ఆదివారం గొరవయ్యల నృత్యాలు అలరించాయి. గొలుసు తెంపుట ఆకట్టుకుంది. జైత్రయాత్ర అనంతరం సింహాసన కట్టమీద కొలువుదీరిన మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట దేవదాసిల క్రీడత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. దైవ వచనాలు వల్లెవేస్తూ.. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో గొరవయ్యలు దేవరగట్టుకు తరలివచ్చారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామి మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీదున్న స్వామి వారి ఉత్సవమూర్తుల ఎదుట పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమరుకాలను ఆడిస్తూ లయబద్ధంగా నృత్యం చేశారు. గురు గొరవయ్యలు చాటిలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెప్తూ పూనకంతో ఊగిపోయారు. కొందరుదైవ వచనాలు వల్ల్లెవేస్తూ అందుకు తగ్గట్టు హావభావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేశారు. నాలుగు జఠికలకు తెగిన గొలుసు ఉత్సవంలో భాగంగా ఇనుప గొలుసును హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగప్ప నాలుగు జఠికలకు తెంపాడు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన మల్లప్ప గుడి ఎదుట ప్రతి ఏటా ఇనుప గొలుసు తెంపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆదివారం దాదాపు 20 కేజీల బరువు ఉన్న గొలుసును నాలుగు జఠికలకు తెంపారు. దీంతో భక్తులు గొరవయ్యను భుజాల మీదెత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ఆనందంతో నృత్యాలు చేశారు. గతేడాది 51 జఠికలకు గొలుసు తెగితే ఈ ఏడాది నాలుగు జఠికలకే తెగడం పట్ల భక్తులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. వసంతోత్సవం.. కంకణ విసర్జన ఆదోని, ఆలూరు, గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బసివినిలు క్రీడోత్సవం చేశారు. అనంతరం రంగు నీళ్లను భక్తులపై చల్లి వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలను నిర్వహించారు. మాళమల్లేశ్వర విగ్రహాలతో పాటు పల్లకీని భక్తులు ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆలూరు మండలాల ఎస్ఐలు దిలీప్కుమార్, శ్రీనివాసులు, మారుతి తదితరులతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు దేవరగట్టులో ఉన్న శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సోమవారం గొరవయ్యలు కాలినడకన నెరణికి గ్రామానికి మోసుకెళ్తారు. ఉత్సవ విగ్రహాలను గ్రామ ఊరు వాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి వద్ద కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఊరేగింపు నిర్వహించి యథాస్థానానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
ముగిసిన రాష్ట్ర స్థాయి జలక్రీడలు
● సీనియర్స్, మిక్స్డ్ విభాగాల్లో కర్నూలుకు పతకాలు సీనియర్ బాయ్స్ విభాగంలో మొదటి స్థానం సాధించిన ఏలూరు జిల్లా జట్టు జూనియర్స్ బాయ్స్ విభాగంలో రెండో స్థానం సాధించిన కర్నూలు జిల్లా జట్టు కర్నూలు (టౌన్): మండలంలోని గార్గేయపురం చెరువులో రెండు రోజులు పాటు జరిగిన 4 వ రాష్ట్ర స్థాయి కెనోయింగ్అండ్ కయాకింగ్ డ్రాగన్ బోటో పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనంతరం నిర్వహించిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ఏపీఈ డబ్ల్యూ డీసీ డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర, రాష్ట్ర కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బలరాం నాయుడు అతిథులుగా హాజరై మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా 3 శాతం వినియోగించుకొని క్రీడాకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. కర్నూలులో మొట్టమొదటి సారిగా రాష్ట్ర స్థాయి వాటర్ స్పోర్ట్స్ను విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కెనోయింగ్ అండ్ కయాకింగ్ సంఘం వ్యవస్థాపకులు శివారెడ్డి, ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజేతల వివరాలు : జూనియర్స్ విభాగంలో... 200 మీటర్ల పురుషుల జూనియర్ విభాగంలో ఏలూరు (ప్రథమస్థానం), కర్నూలు (ద్వితీయ స్థానం) నంద్యాల (మూడో స్థానం) సీనియర్స్ విభాగంలో... కర్నూలు మొదటి స్థానం, ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం మిక్స్డ్ విభాగంలో... ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానం, కర్నూలు రెండవ స్థానం, నంద్యాల తృతీయ స్థానం 500 మీటర్ల పురుషుల జూనియర్స్ విభాగంలో.... ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం, కర్నూలు ద్వితీయ స్థానం, నంద్యాల తృతీయ స్థానం సీనియర్స్ విభాగంలో ... ఏలూరు ప్రథమ స్థానం, నంద్యాల ద్వితీయ స్థానం, కర్నూలు మూడో స్థానం మిక్స్డ్ విభాగంలో... కర్నూలు ప్రథమ స్థానం, కృష్ణ జిల్లా ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా తృతీయ స్థానం దక్కించుకున్నాయి. -
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
● ఎనిమిది మందికి గాయాలు బనగానపల్లె రూరల్: మండలంలోని టంగుటూరు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు–ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన చిలకల రమేష్ కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో కై ప గ్రామంలోని బిజ్జి తిమ్మయ్య స్వామికి మొక్కబడి నిమిత్తం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్లో బయల్దేరారు. అయితే టంగుటూరు గ్రామంలోని పెద్దమ్మగుడి సమీపంలో ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ప్రమాదశాత్తు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న రమేష్ బంధువులు పుల్లయ్య, లక్ష్మీదేవి, మాధురి, లింగమ్మ, తిమ్మయ్య, కాశమ్మ, అబ్దుల్రహీం, దస్తగిరిలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
తుగ్గలి: సూపర్ వాస్మాల్ తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఉప్పర్లపల్లికి చెందిన యలమంచి జస్వంత్(25) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదేళ్లుగా వైద్యం చేయిస్తున్నా తగ్గలేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో శనివారం గుత్తికి వెళ్లిన జస్వంత్ అక్కడే రసాయన ద్రావణాన్ని తాగి ఇంటికి వచ్చాడు. వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. జస్వంత్ తండ్రి చంద్రశేఖర్ ఏడేళ్ల క్రితం మృతి చెందారు. మృతుడి తల్లి దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్ఐ తెలిపారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి ● స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు ● బాధితుడి పరిస్థితి విషమం నంద్యాల: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీనగర్ వద్ద పట్టపగలే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గాంధీనగర్ జంక్షన్ లోని ఓ దుకాణం వద్ద గట్టాల్ నగర్కు చెందిన సుభాన్ అనే వ్యక్తి కూర్చొని ఉండగా గాంధీనగర్కు చెందిన పరుశురాముడు గొడ్డలితో తలపై రెండు సార్లు నరికాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సుభాన్ చనిపోయాడనుకొని పరుశురాముడు నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుభాన్ను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరి మధ్య వినాయక చవితి పండుగ సందర్భంగా డ్యాన్స్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని, పాత కక్షలతోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నెహ్రూనగర్లో ఘర్షణ పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో శనివారం దుర్గామాత అమ్మవారి నిమజ్జన వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గ్రామంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహానికి గ్రామస్తులు నిమజ్జన వేడుకలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ట్రాక్టర్లో ఊరేగింపుగా తరలిస్తు చేస్తున్న డ్యాన్స్ విషయంలో ఓ సామాజిక వర్గానికి చెందిన గంగన్న, గణేష్, మద్దిలేటి, గిరిరాహుల్, మరో సామాజిక వర్గానికి చెందిన మధు, మహేష్, వంశీ, అనిల్, ప్రభాస్ల మధ్య వివాదం తలెత్తింది. శ్రీశైలం బ్యాక్వాటర్లో నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను మూర్వకొండ ఘాట్కు తరలించారు. అమ్మవారిని బ్యాక్వాటర్లో నిమజ్జనం చేసిన అనంతరం స్నానాలు చేస్తుండగా మధు, మహేష్, వంశీ, అనిల్, ప్రభాస్లు మూకుమ్మడిగా గంగన్న, గణేష్లపై పడి నీటిలో ముంచి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిడుతూరు ఎస్ఐ ఓబులేసు నిందితులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. కొనసాగుతున్న నీటి విడుదల జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిసరఫరా చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలోకి వరద కొనసాగుతుండగా సాయంత్రం ఆరుగంటల సమయంలో పోతిరెడ్డిపాడు వద్ద 883.20 అడుగుల నీటిమట్టం నమోదయ్యిందన్నారు. హెడ్రెగ్యులేటర్ 4వ గేటు నుంచి 1,500 క్యూసెక్కులు, ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర నుంచి తెలుగుగంగ 4 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్ఎస్ఎస్)కాల్వకు 500, కేసీ ఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
ఆస్తి విషయంలో తల్లి, అక్కలపై దాడి
బేతంచెర్ల: ఆస్తి విషయంలో తల్లి, అక్కపై ఓ వ్యక్తి తన భార్య, అత్త, బావమరిదితో కలసి కత్తులతో దాడి చేసిన సంఘటన ఆర్. కొత్తపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న రామ మద్దయ్య, సుభద్రమ్మ దంపతులకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అప్పులు ఉండటంతో పొలం అమ్మాలని దంపతులు కొడుకు, కుమార్తెలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పొలం అమ్మ కూడదని కొడుకు శేఖర్, భార్య శ్యామల, బావమరిది నీలకంఠం మధు, అత్త పుల్లమ్మతో కలసి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. ఆ క్రమంలో అక్కలు లక్ష్మి, మాధవ లక్షమ్మ, సుజాత, రమాదేవిపై తమ్ముడు శేఖర్, బంధువులతో కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన లక్ష్మి, మాధవ లక్షమ్మను బేతంచెర్ల ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని వివరాల సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శేఖర్, నీలకంఠం, పుల్లమ్మ, శ్యామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
స్కార్పియో బోల్తా – ఐదుగురికి గాయాలు
కొలిమిగుండ్ల: పెట్నికోట–నాయినిపల్లె గ్రామాల మధ్యలో ఆదివారం ప్రమాదవశాత్తు స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పెట్నికోట నుంచి కొలిమిగుండ్ల పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్న సమయంలో మార్గమధ్యలో వాహనం బోల్తాపడింది. పెట్నికోటకు చెందిన ఆంజనేయులు, కంబగిరి, నాయినిపల్లెకు చెందిన కృష్ణారెడ్డి, కోటపాడుకు చెందిన పెద్దన్నతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన వాహనాన్ని పైకి లేపి అందులో ఉన్న క్షతగాత్రు లను బయటకు తీశారు. వారిని 108లో కొలిమిగుండ్ల పీహెచ్సీకి తరలించారు. మైరుగైన చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పరామర్శించారు. -
జ్ఞాపకాల జడివాన
బనగానపల్లె రూరల్: ఇల్లూరుకొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జ్ఞాపకాల జడివాన కురిసింది. 21 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ పరవశించిపోయారు. 2003–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆర్గనైజర్లు మహబూబ్బాషా, ఇస్మాయిల్, షరీఫ్, ఓబులేసు, విజయ్, చంద్రుడు, షఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ దూర ప్రాంతంలో ఉన్న ఈ కార్యక్రమానికి హాజరై మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు రంగారెడ్డి, దాదాబాషా, సురేష్బాబు, పద్మావతి, వెంకటలక్ష్మీ, సుబ్బరాయుడు నారాయణ, రమేష్ను సన్మానించి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు దీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. శాస్త్రోక్తంగా శేర్తి పూజ ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
20 కిలోల టమాట ధర రూ.50
ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
అదిగదిగో జీరంగి
జీరంగి..ఇప్పటి తరానికి మినహా అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల క్రితం పిల్లలు పొలాలు, కొండ గుట్టల వెంట తిరుగుతూ చెట్లపై ఉన్న జీరంగులను పట్టుకుని ఆడుకునే వారు. వీటిని అగ్గి పెట్టెలో దాచి తుమ్మ ఆకు వేసి దాచి పెట్టేవారు. ఇవి గుడ్లు పెడుతూ ఉంటే వాటిని చూసి సంతోషపడుతూ ఉండేవారు. వర్షాకాలం వస్తే చెట్లపై ఇవి విపరీతంగా కనిపించేవి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావంతో రోజురోజుకూ అంతరించి పోతున్నాయి. తుగ్గలి మండలంలోని ఆముదం పొలంలో ఆదివారం ఒకటి కనిపించింది. గంటల తరబడి ఏక ధాటిగా శబ్దం చేసింది. సూర్యుని కిరణాలు దీనిపై పడటంతో బాగా కనిపించింది. – తుగ్గలి -
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణ మార్పులే కారణమా?నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు. -
ఆదర్శనీయుడు అంబేడ్కర్
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిపెద్దకడబూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆదర్శనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. కల్లుకుంట గ్రామంలో ఆదివారం నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్రెడ్డి మాట్లాడారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీ యుడన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిక్సూచి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రవిచంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి శివరామిరెడ్డి, రైతు విభాగం తాలూకా అధ్యక్షుడు యల్లప్ప, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, సర్పంచ్ ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ సత్యన్నగౌడ్, జైభీమ్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. -
కష్టాలు.. కన్నీళ్లు!
● భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులుకోసిగి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు కుళ్లి పోయి పూర్తి దెబ్బతిన్నాయి. రైతుల కష్టమంతా నేలపాలైపోయింది. ఉల్లి పంట బాగా కాపు కొచ్చి మంచి దిగుబడిని ఇచ్చింది. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దసరా పండుగ అయిన వెంటనే కోతలు కోసి పంటను అమ్ముకుందామనుకున్నారు. అయితే అంతలో భారీగా వర్షం కురువడంతో పొలాలలోనే ఉల్లి పంట మొలకులు వచ్చేసింది. మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారు. కొందరు ట్రాక్టర్ను ఏర్పాటు చేసి రోటవేటర్తో తొలగించారు. మరికొందరు పంటను తొలగించి దిబ్బలో పడేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు. -
వైభవంగా గుర్రాల పార్వేట
మద్దికెర: దేశంలో మైసూరు తర్వాత ఎక్కడా లేని విధంగా మద్దికెరలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. విజయదశమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పార్వేట కార్యక్రమం అశేష జనవాహిని మధ్య వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దనగిరి, చిన్న నగిరి, యామనగిరి కుటుంబాలకు చెందిన యాదవ వంశీకులు రాజుల దుస్తులతో ఠీవిగా గుర్రాలపై కూర్చుని తమ వెంట ఆయుధాలు ధరించిన సైనికులతో ఊరేగింపుగా గ్రామ సరిహద్దులో ఉన్న రాగి మాను కట్ట వద్దకు వచ్చారు. అనంతరం గ్రామానికి 3 కి.మీ దూరంలో బొజ్జనాయుని పేట గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ప్రధాన రహదారిలో అశేష జనవాహిని మధ్య విజయం సాధించిన అశ్వాన్ని ప్రత్యేకంగా ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి గ్రామప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
శ్రీమఠంలో భక్తి శ్రద్ధలతో దసరా వేడుకలు
మంత్రాలయం: విజయదశమి వేడుకలను శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర మూల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం శ్రీమఠంలో శమీ వృక్షానికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్ వై. సీతారామిరెడ్డి, జిల్లా కార్యదర్శి మురళీ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అలాగే మంత్రాలయం పాత ఊరులో వెలసిన మారికాంబ దేవాలయంలో సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్యతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పూజలు చేశారు. -
ఆర్మీ జవాన్కు కన్నీటి వీడ్కోలు
పగిడ్యాల: ఆర్మీజవాన్ బడికెల తిక్కస్వామి(36)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జమ్మూ కాశ్మీర్లో హవల్దార్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైన ఇతను ఢిల్లీ ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామైన పగిడ్యాలకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పూలమాలలు వేసి నివాళుర్పించిన అనంతరం మేజర్ రాహుల్దత్ నేతృత్వంలో జవాన్ అంతిమ యాత్ర కొత్త పాలమర్రి నుంచి శ్మశాన వాటిక వరకు శోకసంద్రంగా సాగింది. అక్కడ ఆర్మీజవాన్లు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు మృతుడి భార్య సుభాషిణికి గుర్తుగా ఆర్మీఅధికారులు జాతీయ జెండాను అందజేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, తహసీల్దార్ శివరాముడు, ఇన్చార్జ్ ఎంపీడీఓ నాగేంద్రకుమార్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, వివిధ కుల సంఘాల నాయకులు వీర జవాన్ తిక్కస్వామికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
మళ్లీ కుంగిన అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్
● కట్ట నుంచి లీకేజీ అవుతున్న నీళ్లు ● ఆందోళనలో రైతన్నలు ● అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన అవుకు(కొలిమిగుండ్ల): ఏడాది వ్యవధిలోనే రెండో సారి మళ్లీ అవుకు రిజర్వాయర్ లోపల భాగంలో ఎర్రటి రాళ్లతో నిర్మించిన రివిట్మెంట్ కుంగిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున ఈఘటన చోటు చేసుకోవడంతో అవుకుతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్లో నీళ్ల సామర్థ్యం తగ్గించేందుకు చెర్లోపల్లె సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వ వద్ద గేట్లు ఎత్తి వైఎస్సార్ కడప జిల్లా గండికోటకు 8వేల క్యూసెక్కులు వదిలారు. రివిట్మెంట్ కుంగిన సమయంలో మొదట్లో ఎక్కువ మొత్తంలో నీళ్లు లీకేజీ అయ్యాయి. తర్వాత కుంగిన చోట లోపల రాళ్లు,మట్టి అడ్డుపడటంతో తగ్గుమఖం పట్టాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 3.64 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఏడాది క్రితం రివిట్మెంట్ కుంగినప్పుడే నిపుణుల సాయంతో శాశ్వత పరిష్కారం చేసుంటే మళ్లీ ఈ పరిస్థితి తలెత్తేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో ఎస్సార్బీసీ అధికారులు నల్లమట్టి తీసుకొచ్చి కుంగిన చోట తాత్కాలికంగా పూడ్చివేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్ట దిగువన బండ్ నుంచి సీఫేజ్ వాటర్ చాలా రోజుల నుంచి లీక్ అవుతూనే ఉన్నాయి. అధికారులు లీకేజ్ వద్ద రాళ్లు అడ్డుపెట్టారు. ప్రస్తుతం రివిట్మెంట్ కుంగడంతో పైన నీళ్లు లీకేజీ అయ్యాయి. రిజర్వాయర్ వద్ద రివిట్మెంట్ కుంగిన విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, ఇప్పటికై నా భ ద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. కాగా రిజర్వాయర్ వద్ద రివిట్మెంట్ కుంగిన ప్రదేశాన్ని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఎక్కువ నీళ్లు నిల్వ చేయడం వల్లనే కుంగిందని నిర్ధారణకు వచ్చారు. కట్ట వద్ద లీకేజీ అవుతున్న నీటిని పరిశీలించారు. అధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రివిట్మెంట్ కుంగిన చోట మరమ్మతు లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● రైతు బజార్ సర్కిల్ నుంచి చెక్పోస్టు వరకు రోడ్డు షోకర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16న జిల్లాలో పర్యటించనున్నట్లు అందిన ప్రాథమిక సమాచారం నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటన అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ ప్రాథమిక సమాచారం మేరకు ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. నగరంలో 4వేల మందితో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందన్నారు. రైతు బజార్ సర్కిల్ నుంచి నంద్యాల చెక్పోస్టు వరకు రోడ్ షో నిర్వహించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో సుందరీకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీపీని దించే టీడీపీ కుట్రలు సాగవు
● కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షకర్నూలు (టౌన్): కర్నూలు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఎంపీపీని దించే కుట్రలు టీడీపీ మానుకోవాలని వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హితవు పలికారు. కర్నూలు నగరంలోని ఎల్కూర్ ఎస్టేట్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం నూతనపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత క్రిష్ణ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యేను కలిశారన్నారు. అయితే పార్టీ కండువా కప్పి టీడీపీలో చేరినట్లు ప్రకటించారన్నారు. ఆ పార్టీ ఎంతగా దిగజారిందో ఇట్టే అర్థమవుతుందన్నారు. క్రిష్ణ మాట్లాడుతూ.. గ్రామ సమస్యలు చర్చిద్దామని, బిల్లుల సమస్యలు మాట్లాడుదామని వెళ్లాలని, అయితే పార్టీలో చేరుతున్నట్లు కండువాలు కప్పారన్నారు. దీంతో అక్కడ పది నిమిషాలు కూడా ఉండలేదన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రసన్న కుమార్, కర్నూలు మండల మాజీ ఉపాద్యక్షులు డి. వాసు, కర్నూలు మండల వైస్. ఎంపీపీ నెహేమ్యా, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, ఆర్. కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సంపత్కుమార్, కోడుమూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఎం. కె. వెంకటేశ్వర్లు, మద్దిలేటి, పసుపల బాషా, మందలపాడు గోపాల్, నూతనపల్లె గ్రామస్తులు టి. మధు, ఎర్రమల, నారయణ, మద్దయ్య పాల్గొన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
కర్నూలు (రూరల్): మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన కురువ తిమ్మప్ప కుమారుడు కురువ గిడ్డయ్య (50) గత నెల 30వ తేదీన భార్యతో గొడవ పడి తన నివాసంలోనే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతిచెందాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె సంతానం. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలూకా పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఆస్పరి: నగరూరు బస్టాప్ సమీపంలో గురువారం రాత్రి స్కూటర్ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో శశిధర్రెడ్డి (35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఇతను గురువారం రాత్రి స్కూటర్పై ఆదోనికి వస్తుండగా ఆస్పరి దాటాక నగరూరు బస్టాప్ సమీంలో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఐచర్వాహనం ఢీకొంది. ఈఘటనలో శశిధర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అడ్రస్ అడిగి..బంగారు గొలుసు లాక్కెళ్లాడు బనగానపల్లె రూరల్: ఓ అగంతకుండు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బనగానపల్లె పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొండపేటలో నివసించే కర్నాటి రమాదేవి తెల్లవారుజామున ఇంటి ముందు నీళ్లు చల్లుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి బైక్పై వచ్చాడు. ఈ కాలనీలో కొత్తగా తమకు తెలిసిన వాళ్లు చేరారని వారి ఇల్లు ఎక్కడుందని అడిగాడు. తెలియదని సమాధానం చెబుతుండగానే మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైక్పై పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కల్పన తెలిపారు.కాగా చోరీకి గురైన చైన్ సుమారు మూడు తులాలు ఉంటుందని రమాదేవి తెలిపారు. ఈతకు వెళ్లి మృత్యు ఒడికి వెల్దుర్తి: బావిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కలుగొట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూలీ పనులు చేసుకుని జీవించే నక్కలి ఎల్లకృష్ణ (45) ఇసుక వంక సమీపంలోని ఎస్సీ బావిలో ఈతకు వెళ్లాడు. అప్పటికే అక్కడ పలువురు ఈదులాడుతున్నారు. ఎల్లకృష్ణ బావి పై నుంచి తలకిందులుగా నీటిలోకి కొర్రు వేశాడు. అయితే, ఎంత సేపటికి బయటకు రాకపోవడం చూసి మిగతావారు గాలింపు చేపట్టగా వారికి కనబడలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మద్దిలేటి, గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వెల్దుర్తి పోలీసులకు, డోన్ ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. డోన్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ రంగస్వామి గౌడ్ సిబ్బంది, ఫైరింజన్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. బావిలోపలికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడికి భార్య మల్లేశ్వరి ఉంది. -
పెత్తన, దౌర్జన్య కాలం
మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్రలో భక్తుల కర్రల సమరంహొళగుంద: కర్రలు కరాళనృత్యం చేశాయి.. వందలాది తలలు పగిలాయి.. నలభై మందికి తీవ్రగాయాలయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. విజయదశమిని పురస్కరించుకుని హొళగుంద మండలం దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అనాదిగా వస్తున్న ఆచారమే కొనసాగింది. పోలీస్ నిబంధనలు, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా బన్ని ఉత్సవం సాగి రణరంగాన్ని తలపించింది. ఉద్వేగంగా, ఉత్కంఠ భరితంగా సాగిన కర్రల సమరంలో దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. పాలబాసతో ఒక్కటై.. మాళమల్లేశ్వరస్వామి జైత్రయాత్ర (ఊరేగింపు)కు ముందు మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామస్తులు గురువారం రాత్రి 11.30 గంటలకు డొళ్లిన బండ వద్దకు చేరుకున్నారు. వర్గ వైషమ్యాలు, పాత కక్షలు, వ్యక్తిగత మనస్పర్థలను వీడి మూడు గ్రామస్తులు కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకున్నారు. అనంతరం మూడు గ్రామాలకు చెందిన పెద్దలు కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు బండారం (పసుపు) ఇచ్చి వారి అనుమతి కోరారు. అధికారులు సమ్మతం తెలపడంతో డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండ పై ఉన్న స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మంత్రోచ్ఛారణలు, భక్తులు జయ జయ ధ్వనుల మధ్య మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరిపించారు. డిర్రు..డిర్రు కళ్యాణోత్సవం అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకీని ఊరేగింపుగా దిగువకు తీసుకు వస్తుండగా అక్కడే ఉన్న ఇతర గ్రామాలకు చెందిన కొందరు భక్తులు అటకాయించారు. అగ్గి కాగడాలు విసురుకున్నారు. కర్రల శబ్దాలతో, డిర్రు...డిర్రు అంటూ విగ్రహాలను మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపజేశారు. అనంతరం అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలై ఉద్వేగంగా, ఉత్కంఠంగా ముందుకు సాగింది. సత్య నారాయణ కట్ట, కాడసిద్దప్ప మఠం పరిసరాల్లో భక్తుల కర్రలు తగిలి ఎన్నో తలలు పగిలాయి. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. మొగలాయి ఆడుతున్న కొందరు అగ్గి కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. పల్లకీ వద్ద అలజడి పదాల గట్టు వైపు జైత్రయాత్ర వెళ్తుండగా బసవన్న గుడి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద పల్లకీ మోస్తున్న వారితోపాటు చుట్టూ ఉన్న వారిపై రింగు కర్రలు, దివిటీలతో దాడి చేశారు. దీంతో పల్లకీ కింద పడిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో కొందరి తలలు పగిలి తీవ్ర రక్త గాయాలయ్యాయి. వారికి హెల్త్ క్యాంపులో చికిత్స అందించారు. నెరణికి, అరికెర గ్రామ భక్తుల మధ్య దాదాపు అరగంట పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకు ముందు మెట్ల వద్ద కూడా అలజడి నెలకొంది. అనంతరం విగ్రహాలతో జైత్రయాత్ర దట్టమైన అడవిలో సుమారు 6 కి. మీ పరిధిలో ఉన్న ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి శమీవృక్షం వద్దకు తీసుకెళ్లారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కర్రలు, మిగిలిన ఆయుధాలను ఉంచి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శమీవృక్షం మీదుగా మాళ మల్లేశ్వర విగ్రహాలతో ఎదురు బసవన్న గుడి వైపుకు బయలుదేరాయి. అక్కడ ఆలయ పూజారి గిరిస్వామి భవిష్యవాణి(కార్ణీకం) వినిపించారు. అనంతరం ఉత్సవ మూర్తులను మల్లప్ప గుడిలోని సింహాసన కట్టమీద అధిష్టించి విజయ సూచకంగా భక్తులు చప్పట్లు కొట్టి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. నేడు రథోత్సవం దేవరగట్టులో శనివారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. అదేవిధంగా 5న గొరవొయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. పోలీసు బందోబస్తు ఉన్నా... కర్రల సమరంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఈ ఏడాది కూడా అనుకున్నంత ఫలితం ఇవ్వలేదు. అనాదిగా వస్తున్న ఆచారమే పై చేయిగా నిలిచింది. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్, తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు, స్పెషల్ పార్టీలతో కలిసి మొత్తం కలిసి 800 మంది బందోబస్తు నిర్వహించారు. అల్లర్లుకు పాల్పడే వారిని గుర్తించడానికి వందల సంఖ్యలో సీసీ కెమరాలు, 4 డ్రోన్ కెమరాలు, దాదాపు 800 వరకు భారీ వెలుతురు ఇచ్చే లైట్లను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అయితే ఈ ఏడాది చాలా మంది గాయపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. దేవరగట్టులో చిందిన రక్తం కర్రల సమరంలో 100 మందికి పైగా గాయాలు అందులో 40 మందికి తీవ్ర గాయాలు ఇద్దరు మృతి... మరి కొంతమంది పరిస్థితి విషమం మెరుగైన చికిత్స కోసం ఆలూరు, ఆదోనికి తరలింపు -
వరద నీటి మళ్లింపుతోనే పరిష్కారం
కర్నూలు(అర్బన్): శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ద్వారా సముద్రంలో కలిసే నీటిలో కొంత భాగాన్ని పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు మళ్లిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. వరద నీటి మళ్లీంపుతో జిల్లాలోని వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుకోవడంతో పాటు కాలువల్లో నిరంతర ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ దిశగా నీటి పారుదల శాఖకు చెందిన ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ ఏడాది జూన్ 22వ తేది నాటికి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉండిందని, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసి ఉంటే కనీసం బోర్లు రీచార్జ్ అయ్యేవని ఇటీవల నంద్యాలలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రస్తావించినట్లు చెప్పారు. శ్రీశైలం నీటి విడుదల మన చేతిలో లేదని, దీనికి తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులు కావాలని సంబంధిత పర్యవేక్షక ఇంజినీరు ప్రతాప్ సమాధానమిచ్చారని, సమాధాన ప్రతులను సమావేశంలో చూపించారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడుకు విడుదల చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ బీవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. స్థాయీ సంఘ సమావేశాలంటే అంత చులకననా.... ? జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలంటే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తరచు గైర్హాజరు అవడంపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సహేతుక కారణం లేకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులకు నోటీసులు జారీ చేయాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తమకేమి పనుల్లేక సమావేశాలకు వస్తున్నామా? అసెంబ్లీ ద్వారా సభా హక్కుల నోటీసులను ఇప్పిస్తానని గైర్హాజరైన అధికారులకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు. రూ.2 .50 కోట్ల నిధుల ల్యాప్స్పై పీఆర్ కమిషనర్కు ఫిర్యాదు జిల్లా పరిషత్ నిధులతో నిర్ణీత సమయంలోగా చేపట్టాల్సిన పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి రూ.2.50 కోట్ల నిధులు ల్యాప్స్కు కారణమైన పీఆర్ ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు పీఆర్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇయర్ మార్క్డ్ నిధులు ఎస్సీ సంక్షేమానికి 15 శాతం , ఎస్టీల సంక్షేమానికి 6 శాతం, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం నిధులు మొత్తం రూ. 5.91 కోట్ల విలువ చేసే పనులను అప్పగించామన్నారు. ఈ పనులను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయకుంటే నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని ప్రతి నెలా పీఆర్ ఇంజినీర్లను హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. అయినా, పనుల్లో జరిగిన జాప్యం వల్ల రూ.2.50 కోట్ల నిధులు ల్యాప్స్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు,తాగు నీటి సమస్యపై జెడ్పీ చైర్మన్ స్థాయీ సంఘ సమావేశాలంటే అంత చులకననా ? గైర్హాజరైన అధికారులకు నోటీసుల జారీకి ఆదేశం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో అనేక అంశాలపై పాపిరెడ్డి సమీక్ష జెడ్పీ నిధుల ల్యాప్స్పై పీఆర్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి స్థాయీ సంఘ సమావేశాల్లో ఇంకా ఏం మాట్లాడారంటే ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీలకు పనులు దొరుకుతున్నాయే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని జెడ్పీ చైర్మన్ అన్నారు. ‘రబీ సీజన్లో రైతుల అవసరాలకు అనుగుణంగా శనగ, పప్పుశనగ విత్తనాలను అందించాలి. దివ్యాంగుల పెన్షన్లలో అర్హులైన అనేక మందికి నోటీసులు పంపించడం దారుణం. అర్హులైన వారందరికి పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టాల’ని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం పనుల్లో క్షేత్ర స్థాయిలో అవినీతి అక్రమాలు జోరుగా సాగుతున్నాయని, అలాగే గృహ నిర్మాణాల ఫ్లెక్సీలు పెట్టుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి చెప్పారు. కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి పారుమంచాల వద్ద అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ పి. జగదీశ్వరరెడ్డి కోరారు. -
టీబీ డ్యాం సమాచారం
పూర్తి మట్టం : 1,633 అడుగులు ప్రస్తుతం : 1,626.06 టీఎంసీల సామర్థ్యం : 105.788 ప్రస్తుతం : 80.003 ఇన్ఫ్లో (క్యూసెక్కులు) : 14,268 ఔట్ఫ్లో (క్యూసెక్కులు) : 13,961జైత్రయాత్రలో చాలా మందికి తలలు పగిలాయి. ఈ కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. 40 మందికి పైగా తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి హెల్త్ క్యాంపులో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలుకు రెఫర్ చేశారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్లో చికిత్స అందించారు. ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేవించిన వారే ఉన్నారు. మద్యంమత్తులో రింగు కర్రలు తగిలి, అగ్గి కాగడాలు మీద పడిన గాయాలయ్యాయి. బన్ని ఉత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప (46)పై రింగు కర్ర లతో కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతునికి భార్య బసమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య బసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆదోనిలోని అరుణ జ్యోతి నగర్కు చెందిన ఆంజినేయ (48) బన్ని ఉత్సవాలు తిలకించేందుకు వచ్చి..తొక్కిసలాటలో ఊపిరాడక గుండెపోటుతో మృతి చెందాడు. ఈయనకు భార్య ఈరమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. దేవరగట్టు బన్ని ఉత్సవంలో భాగంగా జైత్రయాత్ర దట్టమైన అడవిలోని ముళ్లబండ, పాదాల గట్టు మీదుగా రాక్షసపడి గుండ్ల వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంఛాబీర వంశానికి చెందిన బసవరాజు అనే గొరువయ్య ఎడమ కాలు పిక్కల నుంచి డబ్బణంను గుచ్చి వచ్చిన రక్తాన్ని మణి, మల్లాశురులుగా పిలిచే రాక్షస గుండ్లకు సమర్పించారు. ప్రతి ఏటా ఈ వంశస్తులే రాక్షస గుళ్లకు రక్తసంతర్పణ చేస్తారు. పాదాలగట్టు నుంచి 6 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ రక్షపడి ఉంటుంది. గతంలో ఇక్కడికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ భయపడే వారు. గత ఏడాది నుంచి అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించారు.గాయపడిన భక్తులుపగిలిన తలలు.. చిందిన రక్తం ఇద్దరు మృతి రాక్షస గుండ్లకు రక్తార్పణ -
శమీ వృక్షానికి పూజ
కల్లూరు: దసరా పండుగను గురువారం ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోని దుర్గామాతలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శమీవృక్షం పూజలో పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ కల్లూరు, వీకర్సెక్షన్ కాలనీ శమీవృక్ష పూజ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొన్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శమీ వృక్షానికి, దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద వైద్యుల ధర్నాకర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్లో పనిచేస్తున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పదోన్నతులు లేకుండానే రిటైర్ అవుతున్నారని, వెంటనే తమకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదన్నారు. తామేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన తమ డిమాండ్లను ఏళ్ల తరబడి అడుగుతున్నా పరిష్కరించడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం గత సంవత్సరం తమకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.మనోజ్, జాయింట్ సెక్రటరి డాక్టర్ మిథున్కుమార్రెడ్డి, డాక్టర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీఎస్ఎన్ఎల్ రజతోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): భారత సంచార నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.రమేష మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ 2000 అక్టోబర్ 1న ప్రభుత్వ రంగ సెక్టార్ యూనిట్గా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్లైన్, బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తోందన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆరవ అతి పెద్ద సంస్థగా బీఎస్ఎన్ఎల్ రూపుదిద్దుకుందన్నారు. వినియోగదారులు తమ పాత సిమ్కార్డులను 4జీ సిమ్లుగా మార్చుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరసమైన ధరలతో ప్రవేశపెట్టిన నూతన ప్లాన్లను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయినాథ్, ఏజీఎంలు వి.శ్రీను నాయక్, దేవచంద్ నాయక్, లక్ష్మనాయక్, మురళీకృష్ణ, నారాయణస్వామి, వి.జాన్సన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ సమరానికి ‘సై’
దేవరగట్టు హొళగుంద మండలం నెరణికి గ్రామ సమీపంలోని దేవరగట్టుపై వెలసిన మాత మాళమ్మ, మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవాలు విజయదశమి రోజున వైభవంగా జరుగుతాయి. అదే రోజు అర్ధరాత్రి నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణం తర్వాత జరిగే బన్ని ఉత్సవంలో ఘర్షణలకు తావులేకుండా కలిసి కట్టుగా జరుపుకుందామని దేవరగట్టు సమీపంలోని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి పాలబాసలు తీసుకుంటారు. అనంతరం కల్యాణానికి వస్తున్నట్లు గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. జౌట్లు పేల్చీ ఇనుప తొడుగులు, రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో నిమిషాల్లో కొండ(గిరి)పైకి చేరుకుంటారు. అక్కడ మాత మాళమ్మ, మల్లేశ్వర ఉత్సవ విగ్రహాలకు పురోహితులు, వేదపండితులు కల్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఉత్సవ మూర్తులతో జెత్రయాత్ర ప్రారంభమవుతుంది. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిలో పాల్గొంటారు. ఈక్రమంలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి పలువురికి గాయాలవుతాయి. మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను మల్లప్ప గుడిలో కొద్ది సేపు కొలువుంచి తిరిగి ఉత్సవ విగ్రహాలను పల్లకీతో ఊరేగింపుగా జైత్రయాత్రను కొనసాగిస్తారు. భవిష్యవాణిపై నమ్మకం శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో ఆలయ పూజారి గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా మొగలాయిని నిలిపేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. జంతువుల నుంచి రక్షణకే.. పురాతన కాలంలో దసరా బన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మాళ మల్లేశ్వస్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో విద్యుత్, రవాణా సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల భారీ నుంచి రక్షణ పొందేందుకు దివిటీటులు, మారణాయుధాలు చేత పట్టుకుని కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించేవారు. కొందరు వ్యక్తిగత కక్షలతో చీకట్లో జరిగే ఊరేగింపులో రింగుకర్రలు, దివిటీలు, మారణాయు ధాలతో తమ ప్రత్యర్థులపై దాడులు చేసి పగ తీర్చుకునేవారు. ఇది కాలక్రమంలో కర్రల సమరంగా ముద్ర పడిపోయింది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు ఉత్సవంలో గాయపడిన భక్తులకు దేవరగట్టులో భారీ ఎత్తున హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నారు. డీఎంఅండ్హెచ్ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్తో పాటు 100 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించనున్నారు. వాటర్ ప్రూప్ టెంట్లో వందకు పైగా మంచాలు, మెడిసిన్, ఇతర అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నారు. విజయ దశమి రోజున అర్ధరాత్రి సాగనున్న సంప్రదాయ సమరానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల జైత్రయాత్ర సందర్భంగా బన్ని ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమరాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలమూలల నుంచే గాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెయ్యి మందితో పోలీసు బందోబస్త్ను ఏర్పాటు చేశారు. – హొళగుంద ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభకాంక్షలు. ప్రతి ఒక్కరూ దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పండుగను భక్తితో నిర్వహించుకుని, సంతోషంగా ఇంటికి చేరాలి. ఉత్స వాల్లో పాల్గొనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామస్తులు బన్ని ఉత్సవం సమరం కాదు సంప్రదాయ పండుగని సమాజానికి చాటి చెబుదాం. – బుసినే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే -
● రైతు కష్టం జీవాలపాలు!
సి.బెళగల్: ఉల్లి రైతుల కష్టం అంతా ఇంతా కాదు. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉల్లి పంట.. చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో దిక్కుతోచక జీవాలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు ఇమ్మానియేలు ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. మరోవైపు కోతకు కూలీ, గ్రేడింగ్, రవాణా ఖర్చులతో మరింత అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆందోళన చెంది జీవాలకు వదిలేశాడు. తన రెక్కల కష్టం జీవాలకు మేతగా మారడం చూసి రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉల్లి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నిలిచిపోయిన రహదారి పనులు
● ఇబ్బందుల్లో 5 గ్రామాల ప్రజలు బేతంచెర్ల: మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె గ్రామం వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ రహదారికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం వరకు రహదారి పనులు పూర్తి చేసింది. అంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె వరకు చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ నిలిపేశారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన శంకరాపురం బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
సారూ కాళ్లు మొక్కుతా .. స్తంభాలు తొలగించండి
● తహసీల్దార్ను వేడుకున్న రైతు కుమారుడు నందికొట్కూరు: సారూ తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించండి అంటూ మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమారుడు స్వామన్న తహసీల్దార్ శ్రీనివాసులు కాళ్లు మొక్కాడు. బుధవారం గ్రామ సభ జరుగుతుండగా స్వాములు తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఉన్నదే ఎకరా పొలమని, అందులో విద్యుత్ స్తంభాలు వేయడంతో సాగుకు కష్టంగా మారిందని, ఇదే విషయమై పదేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా.. స్పందించిన తహసీల్దార్ విద్యుత్ అధికారులతో మాట్లాడి తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
అవుకు(కొలిమిగుండ్ల): బనగానపల్లె నుంచి అవుకు మండలం మంగంపేట తండాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం మార్గమధ్యంలో అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. బస్సులో 25 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఏమీ కాక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగ కావడంతో ప్రజలు నిత్యావసర సరుకులు,ఇతర వస్తువులను బనగానపల్లెలో తీసుకొని బస్సులో బయలుదేరారు. బస్సు కృష్ణగిరి మెట్ట మీదుగా మంగంపేటకు ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగింది. -
నేడు అశ్వాల పారువేట
మద్దికెర: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ రాజ వంశంలోని పెద్దనగిరి, చిన్ననగిరి, యామనగిరి కుటుంబీకులు అశ్వాల పారువేట ఉత్సవాన్ని మూడు శతాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేయడం వీరి ఆచారం. అందులో భాగంగా గురువారం ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నారు. భోగేశ్వరాలయం నుంచి.. పూర్వం యాదవ వంశాలు రాజ్యాలను ఏలిన విజ యం విదితమే. అందులో భాగంగా ఆయా యాదవ వంశీయుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న గురప్రు స్వారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు, మూడు గుర్రాలను స్వారీకి అనుమతిస్తుండటంతో ఆయా కుటుంబాలు విజయదశమికి నెల రోజుల ముందు నుంచే గుర్రాలు సమకూర్చుకుని శిక్షణ ఇస్తారు. పండుగ రోజు వారు తలపాగ ధరించి రాచరికపు వస్త్రాలతో ఖడ్గాలు ధరించి గుర్రాలపై మేళ తాళాలతో మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలోని బొజ్జనాయినిపేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయానికి చేరుకుంటారు. వీరికి సైనికులుగా ‘మద్ది’ కులస్తులు ఆయుధాలు ధరించి వెంట నడుస్తారు. ఆలయంలోని స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాల స్వారీ ప్రారంభిస్తారు. విజయం సాధించిన వారిని భాజాభజంత్రీలతో మొదట ఊరేగిస్తారు. అనంతరం యాదవ రాజ వంశీకుల కుటుంబాలు గుర్రాలపై ప్రధాన రహదారిలో తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను ప్రజలకు ఎంతో ఆశక్తితో తిలకిస్తారు. -
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్ మాంగర్స్, సారా విక్రేతలను బైండోవర్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు. తెలుగుగంగలో వ్యక్తి గల్లంతు బండి ఆత్మకూరు: తెలుగు గంగ ప్రధాన కాలువలో బుధవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన భూమా వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లిన అనంతరం తాగునీటి కోసమని ఓంకారం సమీపంలోని తెలుగుంగా ప్రధాన కాలువ వద్దకు వెళ్లాడు. మెట్ల వద్ద దాహం తీర్చుకునే ప్రయత్నంలో కాలుజారి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్ఆర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకుని ఇటీవల మళ్లీ 8 ఏళ్ల సర్వీస్ను పొడిగించుకుని ఢిల్లీలో పరేడ్కు హాజరై బీపీ లెవెల్స్ పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడని వెల్లడించారు. మృతునికి భార్య సుభాషిణి, కుమారులు నిక్షిత్, షణ్ముఖ్ ఉన్నారు. గురువారం స్వగ్రామం పగిడ్యాలలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. -
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. -
పింఛన్ల పంపిణీ.. తప్పని అవస్థలు
● ఇంటి దగ్గర అందజేత నామమాత్రమే ● అవ్వాతాతలకు తీరని ఎదురుచూపులుకర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ చెప్పుకోవడానికే పరిమితమైంది. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా అవ్వతాతలు, వికలాంగులు ఇతర పింఛన్దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనులు వదులుకొని చాలామంది పింఛన్దారులు సచివాలయాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాశారు. అక్టోబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పలు మండలాల్లో పింఛన్దారులందరికీ ఒకే చోటుకు పిలిపించి పంపిణీ చేశారు. దీని వల్ల అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డితో కలసి కర్నూలు నగరంలోని వివిధ కాలనీల్లో పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలులో 94.12 శాతం, నంద్యాల జిల్లాలో 94.43 శాతం పంపిణీ... అక్టోబరు నెలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 2,38,755 పింఛన్లు ఉండగా...సాయంత్రం 6 గంటల సమయానికి 2,24,711 (94.12 శాతం) మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,005 పింఛన్లు ఉండగా 2,03,032 (94.43 శాతం) పంపిణీ చేశారు. ఇంకా తీసుకోని వారికి ఈ నెల 3వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలే
● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ● దేవనకొండలో పంట పొలాల పరిశీలనదేవనకొండ: కూటమి ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. మండల కేంద్రం దేవనకొండ, అలారుదిన్నె తదితర గ్రామాల్లో వర్షాల ధాటికి నష్టపోయిన పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఉల్లి, టమాట రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గిట్టుబాటు ధర కల్పించి ఆయా పంటల దిగుబడులను సర్కారు కొనుగోలు చేయలేదన్నారు. తొలి నుంచి చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని, నాడు విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు సహాయ సహకారాలు అందేవన్నారు. ఉచిత పంటల బీమాతో నష్టపోయిన రైతులను ఆదుకునేవారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఏదిఏమైనా ప్రస్తుత వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు చొప్పున పరిహారం అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామకృష్ణ, నాయకులు ప్రభాకర్రెడ్డి, నారాయణరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ప్రేమనాథ్రెడ్డి, హంపిరెడ్డి పాల్గొన్నారు. -
లిఖిత పూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమణ
● డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నాలో పీహెచ్సీ వైద్యులుకర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రఘురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ బాలకృష్ణ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము డ్యూటీలు ఎగ్గొట్టి ఆందోళనలు చేయడం లేదని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. గత సంవత్సరం ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనికోరారు. అలాగే వైద్యులకు కచ్చితమైన పనిగంటలు ఏర్పాటు చేయాలని, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని, అనధికార వ్యక్తులు(నాన్ మెడికల్, శాఖకు సంబంధం లేనివారు) పీహెచ్సీలను విచ్చలవిడిగా తనిఖీ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. విధుల్లో చేరేందుకు ససేమిరా..! పీహెచ్సీల్లో మెడికల్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కర్నూలు మెడికల్ కాలేజీలోని పీజీ వైద్యులు, ఎస్ఆర్లు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ఆయుష్ వైద్యులను 35 పీహెచ్సీల్లో తాత్కాలికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఉన్నఫలంగా తమను అక్కడికి వెళ్లమంటే ఎలాగని, పీహెచ్సీల్లో తమకు వసతి సౌకర్యాలు లేవని, ఎలా ఉండాలని పలువురు వైద్యులు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మహిళా వైద్యులు సుదూర ప్రాంతాలకు తాము వెళ్లి ఉండలేమని, తమను డ్యూటీ నుంచి మినహాయించాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పలువురి స్థానంలో వేరొకరిని చేరుస్తూ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
చెరువులు నింపి భూగర్భజలాలు పెంపొందిద్దాం
కర్నూలు(సెంట్రల్): చెరువులను నింపి భూగర్భ జలాలను పెంపొందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో చెరువులు నింపడం–భూగర్భ జలాలు పెంపొందించడం అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 11 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టి హంద్రీనీవా నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని చెక్ డ్యాంల మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేసి మూడు రోజుల్లో నివేదించాలని డ్వామా పీడీ వెంకట రమణయ్యను ఆదేశించారు. జిల్లాలోని మద్దికెర, ఆస్పరి తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటికి ఇబ్బంది ఉంటున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హెచ్ఎన్ఎస్ ఎస్ఈ పాండురంగయ్య, ఈఈ గుణకర్రెడ్డి, ఎంఐఈఈ వెంకటరాముడు, డ్వామా పీడీ వెంకటరమణమ్య, భూగర్భ జలాల శాఖ డీడీ సన్నన్న, సీపీఓ భారతి తదితరులు పాల్గొన్నారు. 3న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 3న స్థానిక మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు–ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. ఆయా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించే సమయానికి అనుగుణంగా చైర్పర్సన్లు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు హాజరు కావాలని సీఈఓ కోరారు. డీపీఓలో ఆయుధ పూజ కర్నూలు: విజయదశమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్లో ఎస్పీ దంపతులు ఆయుధ పూజ నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా వచ్చే ఆయుధ పూజను డీపీఓలోని శమీ వృక్షం వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్, సతీమణి ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ కలసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దుర్గాదేవి చిత్రపటానికి, జమ్మి చెట్టుకు, పోలీసు వాహనాలకు, పోలీసులు వినియోగించే ఆయుధాగారంలోని అన్ని ఆయుధాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ దంపతులు ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
● సిద్దిదాయిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి ● కై లాస వాహనంపై విహరించిన భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో మంగళవారం సిద్దిదాయిని స్వరూపంలో భ్రమరాంబాదేవి, కైలాస వాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులను కరుణించారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబాదేవిని సిద్దిదాయిని అలంకారంలో అలంకరించి అమ్మవారి ఆలయం ముందుభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై ఉంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లను కై లాస వాహనంపైకి చేర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సిద్దిదాయిని అమ్మవారిని, కై లాస వాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. కళాకారుల విచిత్ర వేషధారణలు, నృత్యాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో నేడు.. దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబాదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో, అశ్వవాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్తో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
హామీలు ఇస్తాం.. అంతే !
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామన్నారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రస్తుతం నాకు 53 ఏళ్లు. పింఛనుపై పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోంది. – ఓబులేసు, రామాపురం, తుగ్గలి మండలం నారా చంద్రబాబు నాయు డు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ల ఊసెత్తడం లేదు. మాది బీసీ సామాజిక వర్గం. నా వయస్సు 55 ఏళ్లు. కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారే కానీ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తామని చెప్పడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలో. – గొల్ల వెంకటేష్, ముద్దటమాగి, హొళగుంద మండలం ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు వైఎస్ఆర్సీపీ పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు ఇవ్వడం విశేషం. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లను అర్హులైన వారందరికీ మంజూరు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు కొత్త పింఛను ఇంటి తలుపు తట్టేది. వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు 1.20 లక్షలకుపైగా జారీ అయ్యాయి. కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్కటీ కొత్త పింఛను ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్ల కోసం ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వేలాది మంది నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడంటూ ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రెండు లక్షల మందికి పైగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏస్థాయిలో మోసగిస్తుందో అర్థమవుతోంది. పైగా అనర్హత పేరిట దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు చర్యలు చేపట్టడం గమనార్హం. పింఛన్ల వల్ల దివ్యాంగులు సమాజంలో గౌరవంగా బతకగులుగుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వేలాది దివ్యాంగుల నోటికాడి ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తోంది. అక్టోబర్ నెల పింఛన్లు బుధవారం పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 4,748, నంద్యాల జిల్లాలో 4,163 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 8,911 దివ్యాంగుల పింఛన్లపై అనర్హత వేటు వేసి ఆగస్టులో నోటీసులు కూడా అందించారు. అర్హత ఉన్నప్పటికీ తొలగింపుల నోటీసు ఇవ్వడంపై వేలాది మంది అప్పీల్ చేసుకున్నారు. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో దాదాపు అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అప్పీల్ చేసుకున్న వారి వికలత్వాన్ని మరోసారి పరిశీలిస్తామని.. అంతవరకు పింఛన్లు కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ 1వ తేదీ వస్తుందంటే దివ్యాంగుల్లో టెన్షన్ మొదలవుతోంది. జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోననే ఆందోళన కనిపిస్తోంది. 50 ఏళ్లకే పింఛను ఏమైంది! సూపర్–6 హామీల్లో అత్యంత ప్రధానమైన హామీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ప్రకటించడం. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించని పరిస్థితి. అయినప్పటికీ సూపర్–6 సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుండటం ప్రజల్లో నవ్వులపాలవుతోంది. వంచన చేసిన ముఖ్యమంత్రిపై 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వితంతు మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 13,629 పింఛన్ల కోత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతినెలా పింఛన్లలో కోత పడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఏడాది జూన్ నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెల నాటికి 12,736 పింఛన్లు కోత కోశారు. ఈ ఏడాది జూన్ నెలలో 4,67,389 పింఛన్లు ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆ సంఖ్య 4,53,760కి చేరుకుంది. 16 నెలల కాలంలో గుట్టుచప్పుడు కాకుండా 13,629 పింఛన్లు తొలగించడం గమనార్హం. కర్నూలు జిల్లాపింఛనుదారుల గుండెల్లో గుబులు -
కనుల పండువగా మంచాలమ్మ తెప్పోత్సవం
మంత్రాలయం : ఓవైపు వేద మంత్రాల ఘోష, మరో వైపు మంగళవాయిద్యాల సుస్వరాలు.. ఇంకోవైపు భక్తజనుల హర్షధ్వానాల మధ్య గ్రామదైవం మంచాలమ్మ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ముందుగా అమ్మవారిని శ్రీమఠం ఈశాన్య భాగంలోని పుష్కరిణి వరకు మంగళవాయిద్యాలతో తీసుకెళ్లారు. పుష్కరిణి మంటపంలో శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూజలు చేపట్టారు. పీఠాధిపతి ప్రవచనం అనంతరం అమ్మవారిని తెప్పపై ఆశీనులను గావించారు. వేదమంత్రోచ్ఛారణ పఠిస్తూ సుందరంగా అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రభపై అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవ వేడుకలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం డోన్ టౌన్: డోన్ పాత బస్టాండ్ నుంచి పాతపేట మార్గంలో ఉన్న కర్నూలు రైల్వే గేట్ల సమీపంలో రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి (38) మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ బిందుమాధవి తెలిపారు. కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న డెమో రైలు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డోన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు, ఎడమ భుజంపై ‘శివమణి’ అనే పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 90304 81295 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రైవేటీకరిస్తే ఊరుకోం
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగిస్తే ఊరుకోమని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని రాజకీయ, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పు బట్టాయి. వెంటనే అందుకోసం విడుదల చేసిన జీఓలు 107,108లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్య విభాగాలను ప్రభుత్వమే నిర్వహించాలని, అయితే, కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తమ అనుకూల వ్యక్తులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకుందని వక్తలు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీలోని ఎంపీపీ హాలులో స్పార్క్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్కు అప్పగించడాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పార్క్ కన్వీనర్ శివనాగిరెడ్డి, కోకన్వీనర్, జాన్బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. సాగునీటి సంఘం నాయకులు శేషాద్రిరెడ్డి, రిటైర్డ్ ఎకానమీ ప్రొఫెసర్ ఎస్ఏ రహమాన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు లాజరస్ తదితరులు కూటమి సర్కారు ప్రతీది ప్రైవేట్ పరం చేస్తుందని, కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి వ్యతిరేకం -
పత్తి రైతు చిత్తు
● నకిలీ విత్తనాలతో కిలో దిగుబడి కూడా రాని వైనం ఈ చిత్రంలోని రైతు పేరు గొల్ల వెంకటలింగం. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామానికి చెందిన పత్తి రైతు. నందికొట్కూరులోని భ్రమరాంబ మల్లికార్జున సీడ్స్ దుకాణంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన రాయల్ సీడ్స్ కంపెనీకి చెందిన రణధీర్ బీజీ–2 రకం పత్తి విత్తనాలు (475 గ్రాములు) ప్యాకెట్ రూ.850 ప్రకారం 11 ప్యాకెట్లు కొని మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మందులు తదితర వాటికి పెట్టుబడిగా రూ.లక్షకుపైగా పెట్టాడు. ఇప్పటికే పత్తి సాగు చేసిన రైతులు మొదటి విడత పత్తి తీసి.. రెండో దఫా కూడ పత్తి తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రైతు సాగు చేసిన పత్తిలో మాత్రం ఇంతవరకు కిలో పత్తి కూడా తీయలేదు. పూత వచ్చినప్పటికి చెట్టుపైనే వాడిపోయి రాలిపోతోంది. అక్కడక్కడ కాయలు వచ్చినా...కుళ్లి పోతున్నాయి. దిగుబడి పెంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఫలితం లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు తన అవస్థ చెప్పుకునేందుకు మంగళవారం కుమారుడు హరికృష్ణతో కలిసి కలెక్టరేట్కు వచ్చాడు. అయితే సెలవు దినం కావడం.. అధికారులెవ్వరూ కనిపించకపోవడంతో విలేకర్లకు తన గోడు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యాడు. నకిలీ పత్తి విత్తనాలు ఇవ్వడంతోనే తనకు నష్టం జరిగిందని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పరిహారం ఇప్పించాలని కోరారు. -
కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ సత్యనారాయణరెడ్డి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు లోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ఎం. సత్యనారాయణరెడ్డి నియమితులయ్యా రు. ఆయన గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో ఆఫ్తమాలజి ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్గా కొనసాగిన డాక్టర్ పృథ్వీ వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయడంతో సత్యనారాయణరెడినియమించారు. 1998లో ఆయన కంటి ఆసుపత్రిలో మొబైల్ మెడికల్ ఆఫీసర్గా విధుల్లో చేరారు. 1999లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా,1997లో అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. 2022లో అనంతపురానికి బదిలీ అయ్యారు. మరుసటి సంవత్సరం ప్రొఫెసర్గా పదోన్నతి పొంది తిరిగి కర్నూలుకు బదిలీపై వచ్చారు. -
94 శాతం అధిక వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. గత సెప్టెంబర్ నెల రికార్డు స్థాయిలో 94 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు హొళగుంద, చిప్పగిరి మండలాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంత్రాలయంలో అత్యధిక వర్షపాతం, మద్దికెరలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 19.2 మి.మీ వర్షం కురిసింది. వరుసగా రెండు నెలలు అధిక వర్షపాతం నమోదవుతుండటంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా ఉల్లి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆస్పరి మండలం యాటకల్ గ్రామంలో ఎంకప్ప అనే రైతు 400 బస్తాల ఉల్లిని వంకలో పారబోశారు. క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన మూలింటి మనోజ్ ఉల్లిని కొనేవారు లేకపోవడం, అధిక వర్షాలతో కుళ్లిపోతుండటంతో రోడ్డు పక్కన పారబోయడం గమనార్హం. మండలం వర్షపాతం(మి.మీ) మంత్రాలయం 53.4 పెద్దకడుబూరు 49.4 గోనెగండ్ల 43.8 ఎమ్మిగనూరు 36.4 కౌతాలం 32.4 కోసిగి 30.6 నందవరం 30.2 ఓర్వకల్ 30.2 కోడుమూరు 27.4 కల్లూరు 25 సీ.బెలగల్ 20.6 -
ప్రలోభాలతో మోసం చేయడం తగదు
కోసిగి: కూటమి నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను ప్రలోభాలతో మోసం చేయడం తగదని వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం నాయకులు నరసింహులు గౌడ్, గ్రామ సర్పంచ్ మునెమ్మలు విమర్శించారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన 90 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరినట్లు హడావుడి చేయడం తగదన్నారు. మంగళవారం కామన్దొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ మునెమ్మ ఆధ్వర్యంలో ఎవరైతే పార్టీ వీడారని చెప్పారో వారే తిరిగి గ్రామానికి చెందిన హరిజన అడివప్ప, యల్లప్ప, అబ్రహం, పరమేష్, దాసరి అంజినయ్య, పింజారి బాషా, రహిమాన్, ఉసేనిలతో పాటు మరో 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు ఇంటి స్థలం మంజూరుపై మాట్లాడేందుకు పిలిపించి తమకు పార్టీ కండువాలు వేశారన్నారు. అంతేకానీ పార్టీ కండువాలు వేస్తారంటే వెళ్లే వాళ్లం కాదన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వెంటే ఉంటామని, వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఎవరూ కూటమి నాయకుల ప్రలోభాలకు గురికావద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బషీర్, నాయకులు పాల్గొన్నారు. -
శ్రీజోగులాంబకు పట్టువస్త్రాల సమర్పణ
కర్నూలు(సెంట్రల్): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తరపున అలంపూర్లో వెలసిన జోగులాంబా సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల కు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం ఆమె అలంపూర్కు చేరుకొని తొలుత బాలబ్రహ్మేశ్వ ర స్వామికి అభిషేకం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్కు వేదపండితులు వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ వెంట దేవదాయ శాఖ ఏసీ బి.సుధాకరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు సీఐలకు స్థానచలనం కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలు అర్బన్ తాలూకాకు ఎస్బీలో పనిచేస్తున్న తేజమూర్తిని నియమించి అక్కడున్న శ్రీధర్ను ఫ్యాక్షన్ జోన్కు బదిలీ చేశారు. అలాగే కర్నూలు ఫ్యాక్షన్ జోన్లో పనిచేస్తున్న చిరంజీవి ఖాళీగా ఉన్న ఎమ్మిగనూరు రూరల్ పీఎస్కు నియమితులయ్యారు. అక్కడున్న మధుసూదన్రావు నెల రోజుల క్రితం డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు. ఇదిలాఉంటే కర్నూలు అర్బన్ తాలూకా, ఎమ్మిగనూరు రూరల్ తాలూకా పోలీస్స్టేషన్ల పోస్టింగుల కోసం అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీధర్ను కర్నూలు రెండో పట్టణ స్టేషన్కు, అక్కడున్న నాగరాజరావును కర్నూలు అర్బన్ తాలూకాకు నియమించేందుకు మంత్రి అంగీకరించినప్పటికీ చివరి నిమిషంలో సమీకరణలు మారి తేజమూర్తి నియమితులయ్యారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్కు కూడా ముగ్గురు ఇన్స్పెక్టర్లు పోటీ పడ్డారు. జిల్లా పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారికి టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లేఖతో చిరంజీవి ఎమ్మిగనూరు రూరల్ పోస్టింగ్ దక్కించుకున్నట్లు సమాచారం. బిట్కాయిన్ పేరుతో బురిడీ కర్నూలు: బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. స్థానిక గణేష్ నగర్లో నివాసముంటున్న ప్రసన్న రాణికి అపరిచితుడు ఫోన్ చేసి బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో ప్రసన్నరాణి స్పందించి అతడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఫోన్పే ద్వారా రూ.90 వేలు జమ చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పీజీ రెండో విడత ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కర్నూలు కల్చరల్: ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద రెండో విడత పీజీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, వెబ్ కౌన్సెలింగ్కు ఫీజు చెల్లింపు, 5వ తేదీ వరకు అప్లోడెడ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 1 నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, 6వ తేదీన వెబ్ఆప్షన్ల మార్పు, 8వ తేదీన సీట్ల కేటాయింపు, 8 నుంచి 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయడం, 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని షెడ్యూల్లో ప్రకటించారు. పీహెచ్సీలలో తాత్కాలిక వైద్యులతో సేవలు కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి స్థానంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతికళ తాత్కాలికంగా వైద్యులను సర్దుబాటు చేశారు. మొ త్తం 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు మెడికల్ కళాశాలలోని పీజీ వైద్యులు, సీహెచ్సీ వైద్యులు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను సర్దుబాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా పీహెచ్సీలకు వెళ్లి రోగుల కు సేవలు అందించాలని, లేకపోతే తగిన చర్య లు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
బన్ని ఉత్సవంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీ జరిగే దేవనగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. అల్లర్లకు పాల్పడటం నిప్పులు విసరడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రింగుల కర్రలతో బన్ని ఉత్సవంలో పాల్గొన డం వల్ల కలిగే దుష్పరిణామాలపై దేవరగట్టు చుట్టుప్రక్కల గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టి గతంలో ఘర్షణలకు పాల్పడ్డ వారిని, అక్రమ మద్యం రవాణా చేసినవారిని గుర్తించి 195 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బన్ని ఉత్సవంలో ఫైర్, వైద్య, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. భారీ బందోబస్తు... ఏడుగురు డీఎస్పీలు, 50 సీఐలు, ఆర్ఐలు, 59 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 95 మంది ఏఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది సివిల్ ఏఆర్ కానిస్టేబుళ్లు, 18 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 90 మంది హోంగార్డులను బన్ని ఉత్సవం బందోబస్తు విధులకు నియమించినట్లు ఎస్పీ వెల్లడించారు. -
2029 ఎన్నికల్లో దళితుల సత్తా చూపుతాం
కర్నూలు(టౌన్): దళిత పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దళితుల సత్తా ఏంటో చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేలంపాడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోల్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కొండారెడ్డి బురుజు మీదుగా పాతబస్టాండ్ వరకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, పేదల వ్యతిరేకి సీఎం అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ తీరుకు నిరసనగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేలంపాడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో అప్పులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడమే పనిగా కూటమి ప్రభు త్వ పాలన సాగుతోందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో సదుద్దేశంతో రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహణ చేతకాదని తప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి రూ.వేల కోట్ల వైద్య కళాశాలల భూములు తమ్ముళ్లకు దారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలన్న డిమాండ్తో దశల వారీ ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ● ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైల్వే ప్రసాద్, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రకంటి కిషన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మాల మాదిగలను మోసం చేసేందుకే పీపీపీ విధానాన్ని అమలు చేస్తొందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రంలో దళిత పిల్లలకు విద్య, వైద్యాన్ని పూర్తిగా దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. వైద్య కళాశాలలే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందే అవకాశాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే దళితులంతా ఏకమై ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ● ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కమతం పరుశరాం, సి.హెచ్.మద్దయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విద్యను సర్వనాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చదువులకు ఎలాంటి అటంకాలు లేకుండా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలిగారన్నారు. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ కళాశాలలు మూతపడి విద్యార్థులు రోడ్ల పాలయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనమరకల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ప్రభుదాస్, అవతారం, జిల్లా కార్యదర్శి గంధం చంద్ర, మంత్రాలయం ఇన్చార్జి జయపాల్, ఆదోని ఇన్చార్జి ఏసేపు, ఆర్టీఐ నగర అధ్యక్షులు గద్ద రాజశేఖర్ బాబు, యాక్టివిటీ కమిటీ జిల్లా కార్యదర్శి జగ్గుల లాజర్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు హరి, జిల్లా ఉపాధ్యక్షులు ఏసు, కార్యదర్శి శ్రీకాంత్, శివ, కటారి సురేష్, చందు, యోగి తదితరులు పాల్గొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఓటు ద్వారా బుద్ధి చెబుతాం -
పల్లెల్లో వైద్యం.. అందనంత దూరం!
● సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యులు ● ఓపీ సేవల బహిష్కరణ ● ఫార్మాసిస్టులు, నర్సులతో చికిత్సకర్నూలు(హాస్పిటల్): గ్రామీణ ప్రజలకు ఏదైనా అస్వస్థత చేకూరితే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. అలాంటి వైద్యాలయాల్లో వైద్యం అందించే డాక్టర్ స్టెతస్కోప్ ముట్టడం లేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అత్యవసరం మినహా ఓపీ కేసులు చూడబోమని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి వారు ఓపీ సేవలను బహిష్కరించారు. కేవలం అత్యవసర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కొన్నిచోట్ల ఓపీ రోగులకు చికిత్స చేసినా ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. తమ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనని, కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ తాము ప్రజా సేవకు వెనుకడుగు వేయలేదని, అయినప్పటికీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను మరుగున పరుస్తూనే ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సమ్మెతో ఓపీ రోగులకు అక్కడ ఉన్న ఫార్మాసిస్టులు, నర్సులే చికిత్స చేసి లక్షణాలను బట్టి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన తమకు స్వయంగా వైద్యులు చూడలేదన్న అసంతృప్తి రోగుల్లో కలుగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తాము సమ్మె చేయబోతున్నట్లు ఈ నెల 24వ తేదీనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓలను కలిసి సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. తమకు పీజీలు, హౌస్సర్జన్లను పంపితే పీహెచ్సీలకు పంపిస్తామని మాత్రమే ప్రభుత్వ కేఎంసీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు లేఖలు రాసినట్లు సమాచారం. వారిని పంపితే ఆసుపత్రి నిర్వహణ కష్టమవుతుందని అధికారులు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం నుంచి వైద్యులు ఓపీ సేవలు బహిష్కరించడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎస్సీ నిబంధనల మేరకు వైద్యులు సమ్మె చేయడానికి వీలులేదని, అది నేరం అవుతుందని, ఈ మేరకు వైద్యులకు సోమవారం నోటీసులు పంపించారు. వెంటనే సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించాం. అయినా కూడా ఏ ఒక్కరూ స్పందించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యాం. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేశాం. మంగళవారం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నాం. ఇప్పటికే అఫీషియల్ వాట్సాప్ గ్రూపు నుంచి నిష్క్రమించాం. జూమ్ కాన్ఫరెన్స్లకు హాజరుకావడం లేదు. –డాక్టర్ రఘురామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ పీహెచ్సీ డాక్టర్స్ అసోసియేషన్, కర్నూలు -
పీహెచ్సీల్లో నిలిచిన వైద్య సేవలు
నందవరం: పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో పేదలకు వైద్య సేవలు అందకుండా పోయాయి. నందవరం మండలంలో హాలహార్వి, నందవరంలో పీహెచ్సీ సెంటర్లు ఉన్నాయి. నందవరం పీహెచ్సీలో స్టాఫ్ నర్సులు, ఎంఎల్హెచ్పీలతో ఓపీలు, వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులతో వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం పీహెచ్సీ డాక్టర్లు విధులకు హాజరై కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించారు. నందవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం -
అనంతపురం – అమరావతి రహదారి అలైన్మెంట్ ఖరారు
● ఆమోదం తెలిపిన కేంద్రం ● అలైన్మెంట్లో మార్పులు కోరిన జెడ్పీచైర్మన్ కొలిమిగుండ్ల: అనంతపురం–అమరావతి 544–డీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అలెన్మెంట్ దాదాపుగా ఖరారు అయ్యింది. అనంతపురం నుంచి బుగ్గ వరకు రెండు ప్యాకేజీల కింద చేపడుతున్న హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా సరిహద్దు నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల అలైన్మెంట్కు ఆమోదముద్ర వేసింది. జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల మండలంలో మీదుగా ఈ హైవే సాగనుంది. అలైన్మెంట్లో చిన్న మార్పులు చేసేందుకు సోమవారం ఎన్హెచ్ఏఐ సైట్ ఇంజినీర్ సుశాంత్, బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్తో పలు అంశాలపై క్షేత్ర స్థాయిలో చర్చించారు. జిల్లా సరిహద్దు నుంచి మండల కేంద్రం వరకు పలు చోట్ల అలైన్మెంట్ మార్పులు చేసే వాటిపై ఆయా ప్రాంతాలను చూపించి వివరించారు. మార్పులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారి చెప్పారు. 2017లో చేసిన అలైన్మెంట్ ప్రకారమే ఎలాంటి మార్పులు లేకుండా మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగనుంది. అతి త్వరలోనే డీపీఆర్కు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్లు పిలిచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలైన్మెంట్లో తప్పక మార్పులు చేపట్టాలి.. అనంతపురం–అమరావతి జాతీయ రహదారి నిర్మాణం జరిగితే రవాణ సదుపాయం మెరుగుపడుతుండటం సంతోషకరమని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమోదం చేసిన అలైన్మెంట్ ప్రకారం జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల క్రాస్ రోడ్డు వరకు గ్రామాల్లోనే హైవే వస్తుంది. దీని వల్ల ఆయా గ్రామాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ నిర్మించాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కోరుతామన్నారు. గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ చేపడితే నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. ప్రధానంగా సిమెంట్, పవర్గ్రిడ్ తదితర పరిశ్రమలకు అనుకూలంగా మారుతుందన్నారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించి, బేయర్, న్యూజి వీడు, జీల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, రామచంద్రుడు అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన షాపు యజమానుల లైసెన్స్లు రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోతలు ప్రారంభమైనందున జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు అమలు చేయాలని కోరారు. శాస్త్రవేత్తల రిపోర్టు అనంతరం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
బారులు తీరి.. సమస్యలు నివేదించి!
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్)లో అర్జీలు అందించేందుకు ప్రజలు బారుతీరి కనిపించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పీజీఆర్ఎస్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కాలేకపోయారు. వారి తరఫున కింది స్థాయి అధికారులను పంపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వచ్చి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను తన కార్యాలయానికి పిలుపించుకున్నారు. ఈ క్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, హౌసింగ్ పీడీ చిరంజీవిలు మాత్రమే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎన్నో ఆశలతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఇవీ సమస్యలు.. ● తన తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితం లక్ష్మీపురంలో రెండు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారని, అందుకు సంబంధించి అన్నీ ఆధారాలు ఉన్నా పొలాన్ని అమ్మిన వారి మనువళ్లు భయపెడుతున్నారని, న్యాయం చేయాలని అడ్వొకేట్ నంద్యాల ఉమేష్ కుమార్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న రవికుమార్ భయపెడుతన్నారని అర్జీలో పేర్కొన్నారు. ● తాను దివ్యాంగుడి అని.. తనకున్న 2.50 ఎకరాల భూమిని చుట్టుపక్కల వాళ్లు ఆక్రమించారని, దానిని సర్వే చేసి చూపాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మద్దికెర గ్రామానికి చెందిన కాలువ శ్రీరాములు అర్జీ ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ చిన్న షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాని, భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నారు. -
ధరలు ఇంకా పెరుగుతాయనే భయం
ధరలు పెరుగుతున్నా అవసరాన్ని బట్టి కొనక తప్పడం లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,500 ఉంది. ఈ ధర రూ.లక్షలోపునకు వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉన్నందున కాస్త ముందుగానే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. – స్వాతి, కర్నూలు ఏడాదిలో 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.40 వేల పెరుగుదల ఉంది. ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేచి చూడటం వల్ల ధరల భారాన్ని భరించడమే అవుతుంది. డిజైన్లు ఆకట్టుకుంటున్నా ధరలు, తరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.– రూప, కర్నూలు● -
మహానందిలో మహాగౌరి దుర్గగా
మహానంది: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారిని మహాగౌరిదుర్గగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని విశేష పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా వాహనసేవను రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, ఎం.నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. చౌడేశ్వరిదేవి సేవలో.. బనగానపల్లె రూరల్: నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దేవదాయ శాఖ జోన్–2 రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు చంద్రశేఖర్ ఆజాద్ను సత్కరించి ప్రసాదం అందజేశారు. -
సమస్యలు తలెత్తితే నేరుగా కలవండి
● జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: పదవీ విరమణ అనంతరం రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తనను కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సుదీర్ఘ కాలం పోలీసు శాఖలో పనిచేసి ఆర్మ్డ్ రిజర్వుడు విభాగం డీఎస్పీ భాస్కర్రావు, వెల్దుర్తి పీఎస్ ఏఎస్ఐ శివరామిరెడ్డి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వారికి శాలువా, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం శేష జీవితం కుటుంబ సభ్యులతో సుఖంగా గడపాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా, కర్నూలు డీఎస్సీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, శివశంకర్, గుణశేఖర్బాబు, వేణుగోపాల్, ఆర్ఐలు జావేద్, నారాయణ, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు సుమారు 40 ఏళ్ల వయస్సు, ఐదున్నర అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తి, ఆదివారం రాత్రి పెట్రోల్బంకు సర్కిల్ నంద్యాల బస్సు స్టాప్ షెల్టర్ సమీపంలో ఉన్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కాపాడేందుకు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, హాఫ్ టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ ఫుల్షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని, మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01124కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. నాటుసారా కట్టడికి ప్రత్యేక బృందాలు ఆలూరు రూరల్: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఉత్సవాల రోజు మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి తెలిపారు. దేవరగట్టు కొండల్లో సోమవారం ఆలూరు సీఐ లలిదాదేవి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బన్ని ఉత్సవాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 69 మంది నాటు సారా తయారీ, విక్రయదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆలూరు ఎకై ్సజ్ పరిధిలోని 5 మండలాల్లో నాటుసారా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ నవీన్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇంజినీరింగ్ అధికారులకు సెలవులు రద్దు కర్నూలు (టౌన్): దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 16వ తేదీ కర్నూలు నగరంలో పర్యటిస్తున్నందున నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెల 7 వ తేదీ లోపు పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధిచిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ (డెమో)గా ఎన్.ప్రకాష్రాజు నియమితులయ్యారు. గుంటూరులోని పీఓడీటీటీలో పనిచేస్తున్న ఆయన్ను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్చార్జ్ డెమోగా ఉన్న పి.శ్రీనివాసులుశెట్టిని కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)లో కమ్యూనికేషన్ ఆఫీసర్గా బదిలీ చేశారు. ఆయనతో పాటు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎ.నిర్మలమ్మను తిరుపతిలోని ఎస్వీఎంసీలో ఉన్న ప్రసూతి హాస్పిటల్కు బదిలీ చేశారు. -
జీఎస్టీ తగ్గింపుపై విస్తృత ప్రచారం
కర్నూలు(సెంట్రల్): జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. తగ్గింపుతో ఒక్కో కుటుంబానికి నెలకు కనీసం రూ.1000 వరకు ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని తెలపాలన్నారు. దుకాణాల్లో పాత ఎమ్మార్పీ ధరలకే నిత్యావసర వస్తువులను అమ్ముతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తూనికలు–కొలతలు, వాణిజ్య పన్నులు, పౌరసరఫరాల శాఖలు ఆకస్మిక తనిఖీలు చేసి నిర్ధారించాలన్నారు. జీఎస్టీ తగ్గింపుపై వ్యవసాయ శాఖ, డీఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసర చన, వక్తృత్త పోటీలను నిర్వహించాలని, ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, కమర్షియల్ ట్యాక్స్ జేసీ నీరజ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 79 ఫిర్యాదులు
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ను ఎస్పీ విక్రాంత్పాటిల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాల పేరుతో మోసం ఎయిడెడ్ స్కూల్లో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన మాధవప్ప రూ.14.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు ఎల్ వెంకయ్య నగర్కు చెందిన దొరస్వామి ఫిర్యాదు చేశారు. చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డుకు మూడు రోజుల సెలవు కర్నూలు(అగ్రికల్చర్): విజయ దశిమి పర్వదినం సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 30న దుర్గాష్టమి, 1న ఆయుధపూజ, 2న విజయ దశిమి పండగలు ఉన్నందున మూడు రోజుల్లో మార్కెట్లో ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగవని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలని కోరారు. -
జీడీపీ నీటి విడుదల
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జీడీపీలో ప్రస్తుతం 4.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు నాలుగో క్రస్ట్ గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని హంద్రీనదిలోకి విడుదల చేశారు. జీడీపీ ఎగువ ప్రాంతం నుంచి 3వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనగ విత్తనాలకు అడ్డగోలు ధర ● కిలో ధర రూ.78.. సబ్సిడీ 25 శాతమే కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో కిలో శనగల ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం రబీ సీజన్ కోసం సబ్సిడీపై పంపిణీ చేసే పప్పు శనగలకు మార్కెట్ ధర కంటే తక్కువ ఉండాలి. అప్పుడే రైతులు సబ్సిడీ విత్తనాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రం 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. కిలోకు 25 శాతం సబ్సిడీ (రూ.19.50) ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు 33 నుంచి 40 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ చేసింది. అక్టోబర్ 3 నుంచి శనగ విత్తనాలు పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 57 విలేజ్ క్లీనిక్స్ మంజూరు కర్నూలు(అర్బన్): జిల్లాకు కొత్తగా 57 విలేజ్ క్లీనిక్స్ మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు ఐ.వేణుగోపాల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎంఏబీహెచ్ఐఎం) నిధులతో ఈ విలేజ్ క్లీనిక్స్ భవనాలను నిర్మిస్తామన్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో జిల్లాకు వైఎస్సార్ హెల్త్ క్లీనిక్స్ 354 మంజూరయ్యాయని, వీటిలో 135 భవన నిర్మాణాలను పూర్తి చేసి వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించామన్నారు. రూఫ్ లెవెల్, రూఫ్ లెయిడ్ దశలో ఉన్న 76 భవన నిర్మాణాలను నేషనల్ హెల్త్ మిషన్ కింద పూర్తి చేస్తామన్నారు. బిలో బేస్మెంట్, బేస్మెంట్ లెవెల్లో ఉన్న మరో 30 భవన నిర్మాణాలను కూడా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులకు త్వరలో టెండర్లను పిలుస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నేడు నిరసన కర్నూలు (టౌన్): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు పాతబస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసనలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాలతో పాటు దళిత సామాజిక వర్గ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. 35,064 ఎకరాల్లో పంట నష్టం కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల జిల్లాలో 35,064 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలు 34,635 ఎకరాలు, ఉద్యాన పంటలు 429 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. 14,169 మంది రైతులు అధిక వర్షాల వల్ల పంటలను నష్టపోయారు. ఈ నెల 12 నుంచి 29వ తేదీ వరకు కురిసిన వర్షాల ప్రభావం చిప్పగిరి, ఆదోని, కౌతాళం, తుగ్గలి, మద్దికెర, కర్నూలు, కల్లూరు, ఆస్పరి, కోసిగి, మంత్రాలయం, దేవనకొండ, దేవనకొండ మండలాల్లోని 119 గ్రామాలపై ఉంది. అత్యధికంగా పత్తి 31,665 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఉద్యాన పంటల్లో మిర్చి, బొప్పాయ పంటలకు నష్టం వాటిల్లింది. కాగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 18 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంత్రాలయంలో 28.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 206.6 మి.మీ వర్షపాతం నమోదైంది. -
అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!
మంత్రాలయం: దుకాణం లేదు.. వ్యాపారం ఊసే లేదు.. అయినా ట్రేడర్స్ను సృష్టించి జీఎస్టీ నంబర్ పొందాడు. రూ.కోట్లలో వ్యాపారాలు చేసినట్లు దొంగ బిల్లులతో ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశాడు. అకౌంటెంట్ ముసుగులో ఒక వ్యక్తి మూడేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా చేసిన మోసం ఇదీ. రాయచూరుకు చెందిన ఓ డీలర్కు అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చీటింగ్ వెలుగులోకి వచ్చింది. ఇలా మోసం.. మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య విశాల పేరున ట్రేడర్స్ను సృష్టించాడు. పాతూరులోని ఇరుకు సందులో ఇంటి చిరునామాలో దుకాణం ఉందని రికార్డులో చూపాడు. అందులో ఐరన్, సిమెంట్, పెయింట్స్ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. విశాల ట్రేడర్స్ రిజిస్ట్రేషన్తో 2002 ఆగస్టు నెల 4వ తేదీన జీఎస్టీ నంబర్ పొంది 2–112 నంబరు ఇంటిని దుకాణంగా చూపించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ తరహాలో ప్రభుత్వ ట్యాక్స్ మొత్తాన్ని తన సొంత అకౌంట్కు మళ్లించుకున్నా డు. కొంత మంది డీలర్లను నమ్మబలికి తానే బిల్స్ వేస్తానని తంతు సాగించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ విధానంతో మూడేళ్లలో రూ.4 కోట్ల మేర టర్నోవర్ జరిగినట్లు సమాచారం. ఇన్వాస్ బిల్లులు పేరుతో జీఎస్టీ ట్యాక్స్ను తన సొంత అకౌంట్కు మళ్లించుని దాదాపు రూ.70 లక్షల మేర ప్రభుత్వ జీఎస్టీ ఖజానాకు గండికొట్టినట్లు తెలుస్తోంది. గుట్టు రట్టు ఇలా.. ఈ చీటింగ్ వ్యవహారాన్ని రాయచూరులోని ఓ డీలర్ తెలుసుకుని జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ట్రేడర్స్, జీఎస్టీ నంబర్పై విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఆదోని జీఎస్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందజేసి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్పై వే బిల్లు, ఇన్వాస్ బిల్లులు, అలాగే దుకాణాన్ని తని ఖీ చేయాలని విన్నవించారు. రాయచూరు మరో దొంగ ఫర్మ్ క్రియేట్ చేసుకుని తతంగం మొదలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి చీటింగ్ చేసిన వ్యక్తి తన గుట్టును కప్పి పుచ్చుకునేందుకు జీఎస్టీ అకౌంట్ను క్లోజ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తమే. ఫిర్యాదును ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు రాగానే పూర్తి విచారణ చేపడతాం. – కల్లూరు వరలక్ష్మి, సీటీవో, ఆదోని అకౌంటెంట్ ముసుగులో చీటింగ్ వ్యాపారం చేయకుండానే జీఎస్టీ ట్యాక్స్ స్వాహా దొంగ బిల్లులు సమర్పించిన వైనం విచారణ చేస్తామన్న అధికారులు -
రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి
కర్నూలు(అర్బన్): విశాఖపట్నం ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్న నగరంలోని క్రిష్ణానగర్కు చెందిన పీ రఘురామిరెడ్డి ఈ నెల 28వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని కర్నూలులోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నట్లు నేవీ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడికి సమాచారం అందిందన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైనిక్బోర్డు, నేవీ అధికారులు, మాజీ సైనికులు పాల్గొంటారని తెలిపారు. ఆయన మృతికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నదని, ఆయన కుటుంబానికి సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తోటలో రైతు మృతి కొలిమిగుండ్ల: మండల పరిధిలోని తోళ్లమడుగు గ్రామానికి చెందిన రైతు సద్దల చలమయ్య(60) మృతి చెందాడు. గ్రామానికి సమీపంలో చీని, నిమ్మ తోటలతో పాటు వరి సాగు చేస్తున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులతో పాటు కూలీల తో పనుల్లో నిమగ్నమయ్యాడు. డ్రిప్కు సంబంధించి అన్ని వాల్వ్లు ఆఫ్ చేసి ఉంచడంతో మర్చిపోయి గేట్వాల్వ్ ఆన్చేశాడు. నీళ్ల ఒత్తిడికి పైపు ఎగిరి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కూలీలు గమనించి చలమయ్య కుటుంబ సభ్యులకు తెలిపారు. చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
సంప్రదాయబద్ధంగా కుమారీ పూజ
శ్రీశైలంటెంపుల్: కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కుమారీపూజలు నిర్వహిస్తున్నారు. ఈ కుమారీపూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి పూజించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కొండచిలువ పట్టివేత ప్యాపిలి: జలదుర్గం పరిసర పొలంలో ఆదివారం కనిపించిన పది అడుగుల కొండచిలువను అటవీ అధికారులకు పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండ చిలువను స్థానిక రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న డోన్ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్ లైఫ్ హెడ్ మోహమ్మద్ ఇద్రిస్ కొండచిలువను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. పాములు పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు. పాములను చంపితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం శిక్షార్హులని తెలిపారు. కార్యక్రమంలో రాచర్ల సెక్షన్ ఆఫీసర్ మౌలాలి, బీట్ ఆఫీసర్లు మహేశ్వరి బాయి, శకుంతల తదితరులు పాల్గొన్నారు. తాగుడుకు బానిసై... గడివేముల: మండల పరిధిలోని కరిమద్దెల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుకుంది. ఎస్ఐ నాగార్జునరెడి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనకల సుధర్శన్ (20) గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు భార్య బంగారు అమ్మి మద్యం తాగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం అధికంగా మద్యం తాగి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మరణించాడు. ఈమేరకు మృతుడి తండ్రి బాలశంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మృతి చెందిన సుదర్శన్కు భార్య, కుమారుడు సంతానం. -
శుభంకరీ..కాళరాత్రి
● శ్రీగిరి క్షేత్రంలో నేత్రానందపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానందభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కాళరాత్రి అమ్మవారిని ఉంచి అర్చకులు, వేదపండితులు విశేష పూజాకార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గజ వాహనంపై అలంకరించారు. గజ వాహనదీశులైన పార్వతీ పరమేశ్వరులను అలంకార మండపంలో ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. కాళరాత్రి అమ్మవారిని, గజ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు నిర్వహించిన గ్రామోత్సవం కమనీయంగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీమేళం, డప్పు వాయిద్యాల నడుమ కళాకారుల నృత్యప్రదర్శనలు గ్రామోత్సవానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ పూజా కార్యక్రమం నేత్రానందభరితంగా సాగింది. ప్రత్యేక అలంకీకృతులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. -
సంక్షేమాన్ని వదిలేసి ప్రతీకారంతో పాలన
మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పగలు, ప్రతీకారాలతో పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం స్వగ్రామం రాంపురంలో తన నివాసంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ ‘రెడ్బుక్’ ఆగడాలకు భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని పాలన చేయడం శోచనీయమన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పర్యావసనాలు నోట్ చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ఈ బుక్లో రెడ్బుక్ బాధితుల వివరాలు, జరిగిన నష్టాలను పొందు పర్చేందుకు వీలు ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు ఈ బుక్ భవిష్యత్తులో తోడుగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త డిజిటల్ బుక్ను వినియోగించుకోవాలని సూచించారు. టీడీపీ శ్రేణుల ఆగడాలను ప్రతిదీ ఇందులో నోట్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి ఈరన్న, అగసనూరు అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ -
ప్రాణాలు కాపాడిన యువకులు
పత్తికొండ రూరల్: పత్తికొండ –హోసూరు రోడ్డులోని హంద్రీ నీవా కాలువ నీటిలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకోపోతున్న యువకుడిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. వివరాలు ఇలా.. హోసూరు గ్రామానికి చెందిన మాల కల్యాణ్ ఆదివారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో బస్సు రావడంతో భయపడి పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన జయకృష్ణ, హుసేన్ గమనించి వెంటనే నీటిలోకి దూకి కల్యాణ్ను ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రాణాలు తెగించి కాపాడటంతో ఆ యువకులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హంద్రీ కల్లూరు: హంద్రీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తోడు గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి నీరు వదిలారు. దీంతో హంద్రీ నిండుగా ప్రవహిస్తూ జొహరాపురం వద్ద తుంగభద్ర నదిలో కలుస్తోంది. కాగా వరద నీటి ఉద్ధృతితో కల్లూరు దేవనగర్ మధ్యలోనున్న వంతెన నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. హంద్రీ పరిసరాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
కాళరాత్రి దుర్గగా కామేశ్వరి దేవి
నందవరంలో... బనగానపల్లె రూరల్: దసరాశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలోని శ్రీగాయత్రిదేవి అమ్మవారు శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.ప్రత్యేక అలంకారంలో లక్ష్మమ్మవ్వ ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో శరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. ఏడోరోజు ఆదివారం అమ్మవార్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేరుశనగ విత్తనాలు, రాజ్మా విత్తనాల అలంకారంలో ఆదోని ఇలవేల్పు శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.మహాచండీగా మంచాలమ్మ మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయ క్షేత్రంలో గ్రామ దేవత మంచాలమ్మ మహాచండీగా దర్శనమిచ్చారు. రజత కవచధారణలో పులిపై కొలువుదీరిన మంచాలమ్మ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహానంది: శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారు కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి శ్రీ కాళరాత్రి దుర్గగా దర్శనం ఇచ్చారు. శ్రీ కాళరాత్రి రూపంలో అమ్మవారిని ఉపాసించడం ద్వారా సమస్త పాపాలు, విఘ్నాలు తొలగిపోతాయని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. గ్రహబాధలు ఉండవని, శత్రు, జంతు భయాలు ఉండవన్నారు. స్థానిక అలంకార మండపంలో ముందుగా అమ్మవారికి అలంకార పూజలు, అష్టవిధ మహామంగళ హారతులు ఇచ్చారు. వర్షం కారణంగా గ్రామోత్సవం రద్దు చేసినట్లు ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి చెప్పారు. పూజా కార్యక్రమంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్లు ఎం. నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అయినా, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే క్షేత్ర స్థాయిలో పలు రూపాల్లో మా ఆవేదనను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువస్తున్నాం. జేఏసీతో చర్చలు సఫలం కాకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. – యం రవికుమార్, రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సచివాలయ ఉద్యో గులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు సర్వేలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదు. ఇతర డిమాండ్లు అన్ని కూడా పరిష్కరించదగ్గవే. – కే గోవిందరాజులు, జిల్లా జేఏసీ చైర్మన్ న్యాయమైన సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటికే పలు రూపాల్లో కార్యాక్రమాలను చేపట్టాం. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ కావాలని నిర్ణయించాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర జేఏసీ నాయకులు 15 రోజుల ముందుగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జీఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్కు నోటీసులు కూడా ఇచ్చారు. – బీ భాస్కర్రెడ్డి, జిల్లా జేఏసీ సభ్యులు -
శనగ విత్తనాల పంపిణీ ఇంకెప్పుడు!
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మరో రెండు రోజుల్లో మొదలు అవుతోంది. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే ఇంతవరకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ ఊసే లేకుండా పోయింది. అటు నంద్యాల జిల్లాలో శనగ (బెంగాల్గ్రామ్) ప్రధాన పంట. శనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్లో ఇటు కర్నూలు జిల్లాలో రబీలో 70 వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 50 వేల హెక్టార్ల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షల హెక్టార్లలో సాగు అవుతుంది. రబీ సీజన్కు కూటమి ప్రభుత్వం సాగు విస్తీర్ణాన్ని, డిమాండ్ను, గత ఏడాది పంపిణీ చేసిన దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొరగా శనగ విత్తనాలు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరును పరిశీలిస్తే సబ్సిడీ విత్తనాల పంపిణీకి మంగళం పలికే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. డిమాండ్కు అనుగుణంగా విత్తనాలు కేటాయించక పోవడంతో రైతుల ఆందోళన వ్యక్తం అవుతోంది. 2024–25 రబీ, 2025–26 ఖరీఫ్ సీజన్లో పంపిణీ చేసిన విత్తనాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏపీసీడ్స్కు సబ్సిడీ సొమ్ములో రూపాయి కూడా చెల్లించలేదు. రూ.120 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్గనైజర్లు ప్రస్తుత రబీ సీజన్కు శనగ విత్తనాల సరఫరాకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. 12,371 క్వింటాళ్ల కోత... రబీలో శనగ సాగుకు కర్నూలు జిల్లాకు 46 వేలు, నంద్యాల జిల్లాకు 25 వేల క్వింటాళ్ల ప్రకారం ఉమ్మడి జిల్లాకు 71 వేల క్వింటాళ్లు శనగ విత్తనాలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యవసాయ యంత్రాంగం కూడా ప్రభుత్వానికి నివేదించింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా కర్నూలు జిల్లాకు 23,897 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 12,564 క్వింటాళ్ల ప్రకారం 36,461 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఈ విత్తనాలు ఏ మాత్రం సరిపోవని వ్యవసాయ అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గత రబీలో కర్నూలు జిల్లాలో 29,967 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 18,865 వేల క్వింటాళ్ల ప్రకారం 48,832 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. గత ఏడాది రబీతో పోలిస్తే కర్నూలు జిల్లాలో 6,070 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 6,031 క్వింటాళ్ల శనగ విత్తనాలకు కూటమి ప్రభుత్వం కోత విధించింది. ఏకంగా ఉమ్మడి జిల్లాలో 12,371 క్వింటాళ్లకు కోత పెట్టడంతో ఈ సారి రబీల్లో శనగ విత్తనాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సీజన్కు ముందే విత్తనాల పంపిణీ చేపట్టింది. రబీ సీజన్ అక్టోబరు 1 నుంచి మొదలవుతుంటే సెప్టెంబరు 20 నుంచే విత్తనాల పంపిణీ జరిగేది. ముందస్తుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం వల్ల వర్షాలు పడినపుడు అదునులో విత్తుకోవడం జరిగేది. కూటమి ప్రభుత్వం గత ఏడాది రబీలో ఆలస్యంగా విత్తనాల పంపిణీ చేపట్టింది. ఈ సారి కూడా జాప్యం చేస్తుండటంతో రైతుల ఆందోళన అంతా.. ఇంతా కాదు. ఆలూరు సబ్ డివిజన్లో శనగ ముందస్తుగా సాగు చేస్తారు. ఇంతవరకు విత్తనాల పంపిణీ ఊసే లేకుండా పోవడంతో రైతులు ప్రయివేటుగా అధిక ధరలతో కొనుగోలు చేసే పరిస్థి తి ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా రబీలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయరు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022–23, 2023–24 సంవత్సరాల్లో రబీలో కూడా వేరుశనగ సబ్సిడీపై పంపిణీ చేసింది. ఈ సారి రబీ సీజన్కు కర్నూలు జిల్లాకు వేరుశనగ 4,715 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 449 క్వింటాళ్లు కేటాయించింది. గత ఏడాది రబీలో వేరుశనగ పంపిణీలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ సారి కూడా పంపిణీ చేయడం అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. కేటాయింపులో భారీ కోత ఈ సారి కేవలం 36,371 క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీ విత్తనాల పంపిణీపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లలో శనగ సాగుకు అవకాశం అరకొర విత్తనాలతో రైతుల్లో ఆందోళన -
డిగ్రీ కళాశాలల మూత మంత్రి లోకేష్కు కనిపించదా?
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): ‘జిల్లాలో ఈనెల 22వ తేదీన డిగ్రీ కళాశాలలు మూత పడ్డాయి. ఇప్పటికి వారం రోజులు అవుతుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్కు కనిపించదా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్పార్టీ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన లక్కీ 2 బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, లోక్నాథ్ యాదవ్, 50వ వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పాలన అన్ని రంగాల్లో విఫలం చెందిందన్నారు. ఫీజురీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని వారం రోజుల క్రితం డిగ్రీ కళాశాలలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందన లేదన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి కళాశాలలు మూత పడి విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. అయినా మంత్రి లోకేష్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల వ్యవధిలో రూ. 2 50 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ. లక్ష కోట్లు పెట్టి అమరావతికి నిర్మిస్తున్నారన్నారు. కనీసం రూ.350 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే విద్యార్థుల చదువులకు అటంకం ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన లక్కీ 2 బ్రదర్స్తో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : లక్కీ 2 బ్రదర్స్ వైఎస్సార్సీపీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని కేడీసీసీ మాజీ డైరెక్టర్, గొర్రెల పెంపకం దారుల సహకారం సంఘం ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు నరసింహులు యాదవ్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, నగర అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్, కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి, పార్టీ నాయకులు షరీఫ్, రాఘవేంద్ర, శ్రీనివాసరెడ్డి, కిషన్, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీ.. దారి తప్పుతోంది!
చేతిలో లాఠీ... నెత్తిన టోపీ... ఒంటి మీద ఖాకీ... వీటి పేరు చెబితే చాలు.. పోలీసు గుర్తొస్తాడు. నేరస్తులను పట్టుకుని బుద్ధి చెప్పడమే కాదు.. వారిని దారిలో పెట్టాల్సింది పోలీసే. అందుకు పోలీసులకు అధికారమే కాదు, బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పోలీసులే తప్పు చేస్తూ పోతే.. ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. లాఠీయే దారి తప్పిందని తెలిస్తే నేరస్తులకు కొమ్ములు వస్తాయి. దురదృష్టవశాత్తు జిల్లాలో కొందరు పోలీసులు క్రమశిక్షణ తప్పి శాఖ పరువు తీస్తున్నారు. ఇటీవల కాలంలో పదేపదే ఖాకీ కథలెన్నో వెలుగులోకి వస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.కర్నూలు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. సంపాదన కోసం తమ పరిఽఽధిలను అతిక్రమించి జైలుపాలవుతున్న సంఘటనలు ఆ శాఖకు మచ్చగా మిగులుతున్నాయి. ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ముఠా సభ్యులకు సహకరించి ఇటీవలే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు సస్పెన్షన్కు గురయ్యారు. కరుడుగట్టిన నేరస్తుడు రౌడీషీటర్ శరీన్ నగర్కు చెందిన నాగేంద్ర అరాచకాలకు బ్లూ కోల్ట్స్ సిబ్బంది అండగా నిలిచి జైలుపాలయ్యారు. ఏకాంతంగా గడిపే జంటలపై దాడి చేసి నగలు, నగదు దోచుకోవడంతో పాటు యువతులపై గోర్లగుట్ట నాగేంద్ర అత్యాచారాలకు పాల్పడేవారు. నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం బ్లూ కోల్ట్స్ సిబ్బందికి తెలిసినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోనందుకు వారు శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. అలాగే కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృపానందం విజయవాడకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జగదీష్తో చేతులు కలిపి ఇళ్ల దొంగతనాలకు పాల్పడి జైలుపాలు కావడం తాజాగా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్రైం పార్టీ ముసుగులో... పోలీసు శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరు. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన కొందరు కాసుల రుచి మరిగి అక్రమార్కులకు సహకరించడం, అక్రమ వ్యవహారాల్లో తల దూర్చి శాఖాపరమైన చర్యలకు గురవుతున్నారు. ● క్రైం పార్టీ ముసుగులో కర్నూలు అర్బన్ తాలూకా, నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇటీవల బదిలీ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారికి సహకరించారన్న నిఘా విభాగం నివేదిక మేరకు వారిని జిల్లా సరిహద్దు స్టేషన్లకు బదిలీ చేసినప్పటికీ రాజకీయంగా ఉన్నతాధికారులతో వారికున్న పలుకుబడిని ఉపయోగించి అనతి కాలంలోనే యథా స్థానాలకు వచ్చి దందాలు కొనసాగిస్తున్నారు. ● నగరంలో కొందరు పోలీసులకు గంజాయి స్మగ్లర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలతో వెలుగు చూసినా చర్యలు లేకపోవడంతో ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ● విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఏఎస్ఐ పట్ల మద్యం మత్తులో పట్టపగలే దురుసుగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ బదిలీ వేటుకు గురయ్యా రు. బాధితురాలు స్టేషన్ ఎస్హెచ్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చి అప్పట్లో చర్చనీయాంశమైంది. ● కేసుల్లో సీజ్ చేసిన బైకులు పోలీస్స్టేషన్లో ఉంచుతారు. వాటికి అమ్మి సొమ్ము చేసుకుందామని కోడుమూరు పీఎస్లో పనిచేసే కానిస్టేబుల్ జగదీష్కు దుర్బుద్ధి పుట్టింది. పట్టుబడిన ఐదు బైకులను ఒక్కొక్కటిగా విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి ఇటీవల సస్పెన్షన్కు గురయ్యాడు. ● పాత కేసును తిరగదోడి ఓ చిరు వ్యాపారిని బెదిరించి ఓ సీఐ, కానిస్టేబుల్ ఇటీవల ఏసీబీకి పట్టుబడి జైలుపాలయ్యారు. ● పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు కొంతమంది ప్రైవేటు, చిట్ఫండ్స్తో పాటు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. ● కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తెరచాటుగా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్ట రీత్యా నేరం. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి సహకరించడమే కాక మరికొందరు దొంగలతో దోస్తీ కట్టి జైలుపాలు కావడం పోలీసు శాఖలో హాట్ టాపిక్గా మారింది. పలు నేరాల్లో వెలుగులోకి వస్తున్న పోలీసుల పాత్ర లోపాయికారికంగా మరుగున పడుతున్న ఘటనలు మరికొన్ని పోలీసు శాఖలో పెరుగుతున్న ఆగడాలు పట్టు తప్పుతున్న క్రమశిక్షణ వీఆర్కు పంపుతున్నా తీరు మార్చుకోని కొందరు ఖాకీలు జిల్లా పోలీసు శాఖను గాడిలో పెట్టాల్సిన సమయమిది -
అరాచకాలకు మూల్యం తప్పదు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిఆలూరు: అరాచకాలకు పాల్పడే అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆలూరు ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో వైఎస్సార్సీపీ ఆలూరు మండల అధ్యక్ష్యడు కె.మల్లికార్జున ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందన్నారు. క్యూఆర్ కోడ్ ఐవీఆఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ‘రెడ్బుక్’ను అమలు చేస్తూ ఇష్టానుసారం కేసులను పెట్టిన జైళ్లకు పంపుతున్నారన్నారు. ఈ సంస్కృతికి అడ్డుకట్టవేసేందుకే వైఎస్సార్షీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంయుక్త కార్యదర్శి మహానంది, జిల్లా పీఆర్ వింగ్ ఉపాధ్యక్షులు ఓబులేసు, బీసీ సెల్ కార్యదర్శులు శ్రీనివాసులు, ఈరన్న, భాస్కర్, శేషప్ప, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, గిరి, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ, మాజీ మార్కెట్కమిటీ డైరెక్టర్ వెంకటే ష్, సోమశేఖర్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల దీక్షకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య స్పష్టం చేశారు. హైకోర్టు సాధన కమిటీ సభ్యులు వి.కృష్ణమూర్తి, కె.నాగరాజు, నరసింహులు, జి.రామాంజనేయులు, సింగరాజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడితోపాటు మేయర్, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాయలసీమకు మేలు చేసేలా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారన్నారు. అందులో భాగంగా కర్నూలులో జాతీయ న్యాయ యూనివర్సిటీకి శంకు స్థాపన చేశారని, లోకాయుక్తా, హెచ్ఆర్సీ, వక్ఫ్ట్రిబ్యునల్, ఏపీఈఆర్సీ, సీబీఐ కోర్టు తదితర కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. హైకోర్టును ఏర్పాటు చేసేందు కు నిర్ణయం తీసుకున్నా కోర్టుల అడ్డగింతతో సాధ్యం కాలేదన్నారు. 2029లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి హైకోర్టును ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. దీక్షలో కూర్చున్న బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సుబ్బయ్య, చంద్రుడు, రాజేంద్ర ప్రసాదు, మహేష్, సోమశంకర యాదవ్, ఆనంద్కు పూల దండలు వేసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు సువర్ణారెడ్డి, సత్రాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీ రోడ్డుపై రాకపోకలు బంద్
ఆత్మకూరురూరల్: సిద్ధాపురం చెరువు కుడివైపు అలుగు పొర్లుతూ కర్నూలు –గుంటూరు రోడ్డు (కేజీ రోడ్డు)పైకి వచ్చాయి. ఇది 340సి జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు అక్కడ కాపలాగా ఉండి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. విజయవాడ, శ్రీశైలం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆత్మకూరు బస్టాండ్లోనే నిలిపి వేశారు. చెరువు నిండిందన్న సమాచారం రావడంతో మత్స్యకారులు అలుగుకు అడ్డుగా వలలు కట్టి చేపలు దాటి పోకుండా కాపాడుకునే యత్నం చేశారు. ఇదిలా ఉండగా బవనాశి నదిలో నీటి ప్రవాహం పెరిగి ఆత్మకూరు సమీపంలో రోడ్డుపైకెక్కి పారుతుండడంతో కురుకుంద గ్రామానికి రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే వడ్లరామాపురం వెళ్లే దారిలో కూడా భవనాశినది బ్రిడ్జిలపై వరద నీరు పారుతుండడంతో ఆ గ్రామానికి కూడా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
ముంచెత్తిన వాన!
ఆకాశానికి చిల్లుపడినట్లు ఒకటే వాన. రోడ్లన్నీ జలమయం అయ్యి చెరువులను తలపించాయి. చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. మేఘాలు ముసురు పట్టి చలి తీవ్రత విపరీతంగా పెరిగి వివిధ రోగాలు ప్రబలుతున్నాయి. ఎడతెరపని వర్షంతో అనేక కష్టాలు ప్రజలను గజగజ వణికిస్తున్నాయి.2,085 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం! కర్నూలు (అగ్రికల్చర్): అతి భారీ వర్షాలతో జిల్లాలో 2,085 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కర్నూలు, కల్లూరు, ఆస్పరి, ఆదోని, దేవనకొండ మండలాల్లోని గ్రామాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. పంటలకు అపారమైన నష్టం జరిగినా వ్యవసాయ శాఖ మాత్రం తూతూమంత్రంగా అంచనా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్)/ నంద్యాల(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తెరిపి లేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 62 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 16 మండలాల్లో 50 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి హంద్రీ నదిలోకి విడుదల చేశారు. దేవనకొండ మండలంలో చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. అధిక వర్షాలతో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఆగష్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా 208.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా 27 రోజుల్లోనే 199.8 మి.మీ. నమోదైంది. కుండపోత వానకు ఈదురు గాలులు తోడు కావడంతో చలి తీవ్రత పెరిగి ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో 30 గొర్రెలు మృతి చెందాయి. నంద్యాల జిల్లాలో.. కుందూ, మద్దిలేరు, పాలేరువాగులు ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ హెచ్చరికలు చేశారు. పంట పొలాలో నీట మునగడంతో రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. నంద్యాలలో నందమూరినగర్ వైపు వెళ్లే కుందూ బ్రిడ్జి, రామకృష్ణ పీజీ కళాశాల సమీపంలోని పాలేరు వాగు వద్ద పోలీసులు మోహరించి ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేని వర్షం కురియడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతుకు క‘న్నీరే’ మిగిలింది! ఈ ఏడాది జిల్లాలో 2.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా.. అధిక వర్షాలతో పగిలిన పత్తికాయలు నేల రాలిపోయాయి. సాధారణంగా ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఇప్పుడు 3 క్వింటాళ్లు కూడా రాని దుస్థితి ఏర్పడింది. పత్తికి వాతావరణ బీమా ఉన్నా ఎకరాకు రూ.2000 ప్రీమియాన్ని రెండు శాతం మంది రైతులు కూడా చెల్లించలేదు. అధిక వర్షాలతో ఉల్లి సాగు చేసిన రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఈ క్రాప్ నమోదు ప్రకారం జిల్లాలో 52 వేల ఎకరాల్లో ఈ పంట సాగు కాగా నిరంతరం వర్షాలు పడుతుండటంతో దిగుబడి స్పల్పంగా వచ్చింది. అధిక వర్షాలతో టమాట, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతింటున్నాయి. పెట్టుబడి నీళ్లపాలై రైతుకు క‘న్నీరే’ మిగిలింది. భారీగా దెబ్బతిన్న పత్తి, ఉల్లి, కంది, టమాట పొంగిన వాగులు, వంకలు.. స్తంభించిన రాకపోకలు పెరిగిన చలి తీవ్రత.. 30 గొర్రెలు మృతిరానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడనున్నాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో ఉక్కిరిబిక్కరవుతున్న రైతులు రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు పడుతాయనే సమాచారంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
దేవరగట్టు ఉత్సవాలకు శ్రీకారం
● భక్తిశ్రద్ధలతో కంకణాధారణ ● అక్టోబర్ 2న ‘బన్ని’ జైత్రయాత్రహొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామికి శనివారం రాత్రి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నెరణికి గ్రామంలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకీతో పాటు విగ్రహాలను గ్రామ శివారు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి గొరవయ్యలు, ఆలయ పూజారులతో దేవరగట్టుకు పంపారు. కొండకు చేరుకున్న విగ్రహాలను గిరిపై ఉన్న ఆలయంలోని కంకణకట్టపై కొలువుంచారు. సాయంత్రం ఆలయంలోని మూల విరాట్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కంకణ కట్టపై కొలువుదీరిన మాత మాళమ్మ, మల్లేశ్వరునికి భక్తుల జయ ధ్వనుల మధ్య కంకణధారణ నిర్వహించారు. వచ్చే నెల 2న విజయదశమి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించడానికి నిశ్చయించారు. అనంతరం జైత్రయాత్ర, మరుసటి రోజు 3న దైవవాణీ(కార్ణీకం), 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కర్నూలు(సెంట్రల్): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అప్పుడే పర్యాటక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ.14 కోట్లతో ఐదు టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అలవాటు చేసుకోవాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడ పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా టూరిజం, డివిజినల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ యేడాది స్థిరమైన పర్యాటకం, పరివర్తన అనే మోటోను తీసుకొని పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత ప్రదర్శన, మోహన్బాబు చేసిన డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, ఆర్ఐఓ లాలెప్ప, డీఎస్ఓ రాజారఘువీర్, ఎస్డీసీలు నాగ ప్రసూన లక్ష్మీ, కొండయ్య పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు అవగాహన సదస్సు
కర్నూలు: ‘నేరారోపణల రిమాండ్, జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టం–జాగ్రత్త’ అనే అంశంపై న్యాయమూర్తులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అధ్యక్షతన శనివారం జరిగిన అవగాహన సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, శోభారాణి, రాజేంద్రబాబు, హరినాథ్తో పాటు జిల్లాలోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. -
హంస వాహనంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం అలంకార మండపంలో హంస వాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి ఆలయ అర్చకులు, పండితులు విశేష పూజలు చేశారు. శ్రీ భ్రమరాంబాదేవిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉండి..కుడివైపున అభయహస్తాన్ని, వరముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. కాత్యాయనీ దేవిని ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం ఎదుట భాగంలో వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని అధిష్టింపజేసి విశేష పూజా కార్యక్రమాలను జరిపారు. అనంతరం కాత్యాయనీ దేవిని, హంస వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, శ్రీచక్రార్చాన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలంలో నేడు దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి, గజవాహనంపై భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తాం
● కలెక్టరేట్ ఎదుట సచివాలయ ఉద్యోగుల ఆందోళనకర్నూలు(సెంట్రల్): ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తామని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు భాస్కరరెడ్డి, శివప్రసాద్, రవి యాదవ్, మగ్బుల్హుస్సేన్ హెచ్చరించారు. శనివారం గ్రామ, వార్డు సెక్రటరీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించి కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సర్వే పేరుతో క్షేత్ర స్థాయికి పంపి అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ చదువుకు విలువనిచ్చి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సేవలను తమతో చేయించుకోవాలన్నారు. తమను తమ శాఖల మాతృసంస్థలకు అప్పగించాలని, సమయ పాలనతో పని ఒత్తిడి దూరం చేయాలని కోరారు. అన్ని విభాగాల తరహాలో తమకూ పదోన్నతులు కల్పించాలని, స్టేషన్ సినియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో చిరంజీవిని అవమానిస్తే పవన్ నోరు మెదపరేం?
● మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కర్నూలు (టౌన్): ఏపీ అసెంబ్లీలో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని విమర్శిస్తే సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా ఉందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పక్కన పెట్టడంతో ఆయన ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. నియోజవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే అది అర్థవంతంగా ఉంటుందన్నారు. చిల్లర మాటలు వద్దని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తనతో మర్యాదగా వ్యవహరించారని చిరంజీవి స్వయంగా మీడియాతో చెప్పిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
10 కి.మీ 500 గుంతలు
ఆలూరు–పెద్దహోతూరు రోడ్డులో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు నుంచి పెద్దహోతూరు రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు జడుసుకుంటున్నారు. పది కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డులో అడుగడుగునా మోకాలు లోతు గుంతలు ఉన్నాయి. చిన్న.. పెద్ద గుంతలు కలిపి దాదాపు 500కు పైగా ఉన్నాయి. వానలకు ఆ గుంతల్లో నీరు నిలవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు ఈ రోడ్డుపై ప్రయాణించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గమనార్హం. ఈ రోడ్డు బాగుపడేదెన్నడూ.. అంటూ ప్రయాణికులు గుంతల దారిలో ప్రయాణిస్తున్నారు. – ఆలూరు -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలి పారు. శుక్రవారం పట్టణంలోని సైబ్జైల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలు ఉంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఎల్లెల్సీలో జారి పడి మహిళ మృతి ఆదోని అర్బన్: ఇస్వీ గ్రామానికి చెందిన యాస్మిన్ (30) ఎల్లెల్సీ కాలువలో ప్రమాదవశాత్తూ జారి పడి మృత్యువాత పడింది. శుక్రవారం తన సొంతూరు పెద్ద హరివాణంలోని కుటుంబీకులను చూసేందుకు యాస్మిన్ భర్త నబీసాహెబ్తో కలసి సొంత ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా నబీసాహెబ్ మలవిసర్జనకు ఆటో నిలిపాడు. ఈ క్రమంలో యాస్మిన్ కాలువలో ముఖం కడిగేందుకు వెళ్లి జారి కాలువలో పడిపోయి కేకలు వేసింది. గమనించిన భర్త వెంటనే స్థానికుల సహయాంతో ఒడ్డుకు చేర్చారు. అస్వస్థతకు గురైన ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వర్షాకాలంలోనూ దాహం.. దాహం!
హాలహర్వి: వర్షాకాలంలోనూ మల్లికార్జునపల్లె గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత 20 రోజుల నుంచి గ్రామ ప్రజలు తాగేందుకు నీరు లేకపోవడంతో గ్రామ శివారులోని వక్రేణి వంక వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. దసరా పండుగ వచ్చినా కూడా మంచినీరు వదలకపోవడంతో వక్రేణి నీరే శరణ్యమయ్యిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నీటిని తాగి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, అధికారులు స్పందించి గ్రామానికి సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వక్రేణి నీటిని బిందెలతో తీసుకెళ్తున్న ప్రజలు -
క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మేలు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడం వల్ల కోలుకునే అవకాశం ఉంటుందని రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక ముజఫర్నగర్ యుపీహెచ్సీలో స్వస్త్నారీ స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు, అపరిశుభ్రత,అబార్షన్ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ప్రాథమిక దశలో దీనిని గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా వీటిని నివారించుకోవచ్చన్నారు. ప్రాథమిక దశలో మొహమాటం కారణంగా వైద్యపరీక్షలకు ఆసక్తి చూపకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీ ఎంఎఓ డాక్టర్ ఉమా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డీపీఓ విజయరాజు, కన్సల్టెంట్ సుధాకర్, మల్లికార్జున, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు డోన్ టౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం డోన్ డిపోను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ను పరిశీలిస్తూ పలువురు ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిపో పరిసరాలు, గ్యారేజ్ను తనిఖీ చేశారు. బస్సుల సంఖ్య, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం, సంస్థ నిర్వాహణ ఖర్చులను తగ్గించి సంస్థ లాభాలు ఆర్జీంచేలా 110 ఎలక్ట్రికల్ బస్సులను త్వరలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట నంద్యాల జిల్లా రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా, డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ తదితరులు ఉన్నారు. -
పీహెచ్సీ డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు ఎన్నికలు
గోస్పాడు: జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల శాశ్వ త సంఘం ఏర్పాటుకు ఎన్నికలు జరగనున్నట్లు అడహక్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అడహక్ కమిటీ ద్వారా డాక్టర్ల సంఘం నిర్వహణ కొనసాగిందన్నారు. ఇప్పటి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ఏపీపీహెచ్ఈడీఏ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తామనానరు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు విన్నవించగా డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను నియమించారన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియామకం పొందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఈనెల 25న ప్రారంభమైందని, 27వ తేదీ మధ్యా హ్నం 2గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, అనంతరం అదే రోజు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అప్పుల మాఫీలో లక్ష కోట్ల అవినీతి
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనలో కార్పొరేట్ దిగ్గజాలకు రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, అందులో 10 శాతం వాట దక్కించుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. అప్పుల రుణమాఫీలో గుజరాత్ మార్వాడీలే ఎక్కువగా ఉన్నారని, వారి పేర్లను ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలు కార్పొరేషన్ ద్వారా రూ.60 కోట్ల రుణాలు తీసుకుంటే కట్టాలని నోటీసులు ఇచ్చే ప్రభుత్వాలు.. బడా కార్పొరేట్లకు ఎందుకు రుణమాఫీ చేస్తున్నాయనో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతోందని, పత్రిక కార్యాలయాలు, విలేకరులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలన సజావుగా లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసమ్మతి ఉందని చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన తన సొంత నిజయోజకవర్గమైన కుప్పానికే ఏమి చేయలేదని, ఇక సొంత జిల్లా ఊసే పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. -
ప్రమాదం పొటుకు పెట్టింది!
పెద్దాసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్య సేవల కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆసుపత్రిలో ఎదురయ్యే కష్టాలతో వణికిపోతున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పెద్దాసుపత్రిలో ప్రమాదం పొటుకు పెట్టింది. భవనాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఫిమేల్ 5, 6 వార్డుల్లో వాన నీరు గోడల వెంబడి కారుతూ ఫ్లోరుపైకి చేరుకోవడంతో బెడ్లపై కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రోగుల సహాయకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోగులకు అవసరమైన మందులు, ఆహారం కోసం బయటకు వెళ్లాంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సిందే. కాలు జారితే వాళ్లు కూడా అదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే భయపెట్టే పైకప్పు పెచ్చులు.. వానకు తడిచిన విద్యుత్ స్విచ్ బోర్డులు.. ఓ వైపు దోమలు.. వార్డు లోపల కుక్కలు.. వామ్మో ఇదేమి ఆసుపత్రి అని రోగులు భయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుఆసుపత్రిలోనే కుక్క కరిస్తే.. -
బన్ని ఉత్సవాల్లో హింసకు తావివ్వొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎ.సిరిహాజరైన ఆయా శాఖల ఉన్నతాధికారులు హొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాల్లో హింసకు తావివ్వకుండా సంప్రదాయలను పాటిస్తూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్తో కలిసి దేవరగట్టులో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా కొండ కింద ఉన్న దేవుళ్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలనంతరం వారికి పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏ దేవుడు, ఏ మతం రక్తపాతాన్ని కోరుకోదని.. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సమావేశానికి హాజరైన ఉత్సవ కమిటీ సభ్యులను, ఆయా గ్రామస్తులను కోరారు. వచ్చే నెల 2న మాళ మల్లేశ్వరస్వామి కల్యాణం, బన్ని ఉత్సవాలను తిలకించేందుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని, వారికి అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు రెండు రోజుల ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్, డీఎస్పీ వెంకటరామయ్య, జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్, ఎకై ్సజ్ సుపరిటెండెంట్ సుధీర్కుమార్, డీపీఓ భాస్కర్, డీఎంహెచ్ఓ శశికళ, ఆలూరు సీఐ రవి శంకర్రెడ్డి, ఎస్ఐ దిలీప్కుమార్, తహసీల్దారు నిజాముద్దీన్, ఎంపీడీఓ విజయలలిత తదితరులు పాల్గొన్నారు. బన్ని ఉత్సవాల్లో ఆచారాలను గౌరవిస్తామని, రక్తపాతాన్ని ఎంతమాత్రం సహించబోం. అల్లర్లకు పాల్పడే వారితో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తిస్తాం. గతేడాది చెట్టు పైనుంచి పడి పలువురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది అలాంటి ఘటనలు పునారావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. క్షతగాత్రలకు తక్షణ వైద్య సేవలు అందించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పని చేసేందుకు తాత్కాలిక టవర్లు ఏర్పాటు చెయాలి. – విక్రాంత్పాటిల్, జిల్లా ఎస్పీ -
సింహ వాహనంపై కూష్మాండదుర్గ
మహానంది: మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీకామేశ్వరిదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, రుత్వికులు ముందుగా అమ్మవారికి విశేష అలంకార పూజలు, సహస్రదీపాలంకరణ పూజలు చేపట్టారు. బలిహరణ, కూష్మాండబలి పూజల అనంతరం అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఉత్సవం చేపట్టగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగుల సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని, ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. గురువారం సాయంత్రం ఏపీఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖ నేతలు జిల్లా కలెక్టర్ను ఆమె చాంబర్లో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని శాఖల్లో మహిళా ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందిస్తూ ఉద్యోగుల అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి, కర్నూలు నగర శాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, జిల్లా అసోషియేట్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు, మహిళ విభాగం నేతలు పాల్గొన్నారు. సెలవులో వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి ● ఏటీవో సుబ్బరాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు అనారోగ్య కారణాలతో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవోగా పనిచేస్తున్న సుబ్బరాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ట్రెజరీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును ఏపీటీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు డి.రవికుమార్, సెక్రటరీ గురుమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జడ్.కరుణాకర్ పలువురు ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు. తప్పుడు స్టాంపు డ్యూటీ సొమ్ము రూ.20.26 లక్షల రికవరీ ● అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యలు కర్నూలు(సెంట్రల్): ఆస్తి విలువను తక్కువగా చూపి రూ.20.26 లక్షల స్టాంపు డ్యూటీ మినహాయింపుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్షమించరాని నేరమని, బాధ్యతాయుత హోదాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ అలా చేయడంతో అతనికి మూడు సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడంతోపాటు రూ.20.26 లక్షలను బాధిత పార్టీల నుంచి ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ డాక్యుమెంట్ నంబర్ 5352/2023 రిజిస్ట్రేషన్కు తక్కువ స్టాంపు డ్యూటీ నమోదు చేసి ఖాజానాకు రూ.20.26 లక్షలు ఆర్థిక నష్టం కలిగించారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఉప లోకాయుక్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కర్నూలు డీఐజీని విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువు కావడంతో బాధిత పార్టీల నుంచి రూ.20,26,200 వసూలు చేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యల కింద మూడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ లోకాయుక్తకు గురువారం నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ కేసును మూసివేశారు. హాస్టళ్ల బిల్లులు అప్లోడ్ చేయించండి కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తయిన పనుల బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్ మనోహర్ను కలిసి బిల్లుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 25 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రూ.7,89,99,000లతో పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే చాలా పనులు దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో చేసిన పనులకు బిల్లులను ఆయా శాఖలు అప్లోడ్ త్వరితగతిన బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు. -
పెన్షనర్ల సంఘానికి నేడు ఎన్నికలు
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా సంఘానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. రహస్య బ్యాలె ట్ పేపర్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో పుల్లారెడ్డి, రామసుబ్బయ్య ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. పన్నెండు ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగించారు. దాదాపు 3,400 మంది ఓటర్లు ఉన్న సంఘానికి ఎన్నికల అధికారులుగా పెదనగౌడ్, ప్రభాకర్, కిట్టప్పలు వ్యవహరించనున్నా రు. శుక్రవారం ఉదయం 10కి ప్రారంభమయ్యే ఎన్నిక లు సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. గంట వ్యవధిలోనే తుది ఫలితాలు వెలువరించి అధ్యక్ష కార్యదర్శులకు గెలుపు పత్రాలను అందజేయనున్నారు. -
ప్రశాంతంగా నంద్యాల డయాసిస్ కమిటీ ఎన్నిక
● సెక్రటరీగా ప్రభుదాసు, ఉపాధ్యక్షుడిగా రాజేంద్రబాబు విజయంనంద్యాల(న్యూటౌన్): నంద్యాల అధ్యక్ష ఖండం డయాసిస్ కమిటీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చికి ఎదురుగా ఉన్న డయాసిస్ కార్యాలయ ఆవరణలో బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో డయాసిస్ సెక్రటరీ, ఉపాధ్యక్షులకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా స్టాండ్లీ విలీయం వ్యవహరించారు. ఉదయం 9గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటకు ముగిసింది. అప్పటి నుంచి కౌంటింగ్ నిర్వహించారు. డయాసిస్ సెక్రటరీగా బైళ్ల ప్రభుదాసు 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షుడిగా రెవరెండ్ మేకల రాజేంద్రబాబు 300 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే డయాసిస్ ట్రెజరర్గా పరిశుద్ధ మత్తయి ఆలయం డీనరీ చైర్మన్ నందం ఐజక్ను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కమిటీ మూడేళ్ల పాటు 2028 వరకు కొనసాగుతుందని బిషప్ వివరించారు. ఎన్నికై న అభ్యర్థులను ఆయా పాస్టరేట్ల కౌన్సిలర్లు, గురువులు పూలమాలలతోను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికై న డయాసిస్ సెక్రటరీ బైళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు మేకల రాజేంద్రబాబు మాట్లాడుతూ.. బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డయాసిస్ ఎన్నికల సందర్భంగా మూడవ పట్టణ సీఐ కంబగిరిరాముడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబుసెక్రటరీ బైళ్ల ప్రభుదాసు -
ప్రాణం తీసిన ఈత సరదా
● బావిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతికర్నూలు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందిన జయంతి, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు శ్రీనివాసులు(17) కర్నూలు మండలం పసుపల–రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న పొలంలోని బావిలో సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు. సరిగ్గా ఈత రాకపోవడంతో మునిగి మృతిచెందాడు. తల్లి జయంతి దుబాయ్లో నర్సుగా పనిచేస్తుండగా తండ్రి వెంకటేశ్వర్లు కర్ణాటకలో పాలిష్ కట్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ఇద్దరు కూడా నాయనమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. శ్రీనివాసులు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఇంటర్మీడియట్ హెచ్ఈసీ చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ఈదుర్ బాషా, గణేష్, నవీన్, చంద్రహాస్లతో కలసి పసుపుల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. స్నేహితులందరూ నీటిలోకి దిగి ఈత కొడుతుండగా తనకు కూడా కొద్దిగా ఈత వచ్చని స్నేహితులకు చెప్పి వారితో సరదాగా గడిపేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి తేలకపోవడంతో స్నేహి తులు భయాందోళనకు లోనై పరిగెత్తుకుంటూ వెళ్లి కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కర్నూలుకు చేరుకున్నారు. అయితే విద్యార్థి శ్రీనివాసులు పెదవులు, చెవుల వద్ద చాపలు కొరికిన గాట్లు ఉన్నాయి. వాటిని చూసి స్నేహితులే ఏదో చేశారని, అందుకే తన కుమారుడు మృతిచెందాడని తల్లి జయంతి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
టమాట ధర మరింత పతనం
పత్తికొండ/ప్యాపిలి: మార్కెట్లో టమాట ధర మరింత పతనం అయ్యింది. గత కొద్ది రోజులుగా నిలకడగా ఉండటం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గురువారం పత్తికొండ పట్టణంలోని మార్కెట్లో టమాట ధర కిలో రూ.2 నుంచి గరిష్టంగా రూ.4 మాత్రమే పలికింది. మార్కెట్లో ధర తగ్గినప్పుడు కూటమి ప్రభుత్వం కిలో 8 రూపాయలకు కోనుగోలు చేస్తామన్న హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్యార్డులో గురువారం టమాట 25కేజీల జత గంపలు కేవలం రూ.150 నుంచి రూ.250లోపు ధర పలికింది. వ్యాపారులు కమీషన్ పట్టుకోని ఇవ్వడంతో కేజీ రూ.2 నుంచి రూ. 4 మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో 421 క్వింటాల టమాటను వ్యాపారులు కోనుగోలు చేశారు. దాదాపు 10 లారీల సరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మూడో రోజు కూడా పూర్తిగా ధరలు తగ్గిపోవడంతో ఈఏడాది టమాట పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక మమ్ముల్ని అప్పుల్లో ముంచేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఽ ప్యాపిలిలో.. ప్యాపిలి మార్కెట్లో రెండు రోజుల క్రితం 25 కిలోల బాక్స్ రూ. 650 వరకు పలికింది. గురువారం మాత్రం 25 కిలోల బాక్స్ ధర రూ. 50 పలికింది. కిలో రెండు రూపాయలకు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. -
కేసుల ఛేదన వేగవంతానికి చర్యలు
కర్నూలు: కేసుల ఛేదనను వేగవంతం చేసేందుకు ప్రతి పోలీస్ సబ్ డివిజన్కు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను ఏర్పా టు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులకు శిక్షలు పడేలా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి బేసిక్ పోలీసింగ్ పాటించాలని, జీరో ఎఫ్ఐఆర్, ఈ–ఎఫ్ఐఆర్, ఈ–సాక్ష యాప్ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. అర్హత ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు నాలుగు వారాల పాటు రోడ్డు భద్రతపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గస్తీ తిరిగేటప్పుడు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పరికరంతో అనుమానితుల వేలిముద్రలు సేకరించాలన్నారు. గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనపర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, వెంకటరామయ్య, భార్గవి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ విజేత కర్నూలు
● బాలికల విభాగంలో అనంతపురం జట్టు ● ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు ఎమ్మిగనూరుటౌన్: మూడు రోజులుగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫుట్బాల్ పోటీల్లో బాలురు విభాగంలో కర్నూలు జట్లు విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ద్వితీయ స్థానం శ్రీకాకుళం జట్టు, తృతీయ స్థానాన్ని అనంతపురం జిల్లా జట్టు దక్కించుకొంది. అదే విధంగా బాలిక పోటీల్లో మొదటి స్థానాన్ని అనంతపురం జట్టు, ద్వితీయ స్థానాన్ని విశాఖ పట్టణం జట్టు కై వసం చేసుకోగా తృతీయ స్థానం వెస్ట్ గోదావరి జిల్లా జట్టు దక్కించుకొంది. గెలుపొందిన ఆయా జట్లకు జిల్లా ఆర్ఐఓ లాలప్ప, మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రాచారి, ఫుట్బాల్ అసొయేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల ఆర్గనైజర్లు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, హనీఫ్, శ్రీనివాసులు, సీజీ ఈరన్న ,శ్రీరాములు, లతీఫ్, వెంకటేష్, బసవరాజు, గంగాధర్తో పాటు పలువురు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన కర్నూలు బాలుర జట్టు మొదటి స్థానంలో నిలిచిన అనంతపురం బాలికల జట్టు -
కేసీ కెనాల్లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
నగరంలో ఈత కొట్టడానికి వెళ్లి స్వామిరెడ్డి నగర్ వద్ద (వినాయక ఘాట్ పైన) ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బళ్లారి చౌరస్తా సమీపంలోని వాస వీ నగర్లో నివాసముంటున్న రాముడు కుమారుడు వడ్డె అశోక్ (13), సీతారామ నగర్కు చెందిన కొమ్ము శివన్న కుమారుడు కొమ్ము ప్రశాంత్ (12) ఏపీఎస్పీ క్యాంప్లో ఉన్న పాఠశాలలో ఒకరు 9, మరొకరు 7వ తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇరువురూ ఈత కొట్టేందుకు స్వామిరెడ్డి నగర్ వద్దకు చేరుకుని కేసీ కెనాల్లోకి దిగారు. నీటి ఉధృతిలో మునిగి వారు కనిపించకపోవడంతో స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు. 3వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల అడ్రస్సులు సేకరించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అశోక్కు సంబంధించిన టీషర్టు, ప్రశాంత్కు సంబంధించిన చెప్పుల ను సంఘటనా స్థలంలో తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కేసీ కెనాల్ వెంట జొహరాపురం వరకు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగి వచ్చారు. కేసీ కాలువలో గల్లంతైన ప్రశాంత్, వడ్డె అశోక్ -
నేటి నుంచి డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నేటి నుంచి డిజిటల్ రేషన్ కార్డులను అక్టోబర్ 1వ తేదీ వరకు సచివాలయాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జేసీ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాల యంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను డీఎస్ఓ ఎం.రాజారఘువీర్తో కలసి పరిశీలించారు. జిల్లాలకు మొత్తం 6,68,944 కార్డులు వచ్చాయన్నారు. వీటిని సచివాలయాల్లో నేటి నుంచి, అక్టోబర్ 2వ తేదీ నుంచే రేషన్ షాపుల్లో వీటిని తీసుకోవచ్చని వినియోగదారులకు సూచించారు. ప్రజలు తమకు సమీపంలోని సచివాలయాలను సందర్శించి డిజిట ల్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవచ్చన్నారు.నిండుకుండలా జీడీపీ గోనెగండ్ల: మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి నీటి విడుదలను గురువారం ఉదయం నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గత మూడు రోజుల నుంచి జీడీపీ నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. గురువారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో క్రస్ట్ గేటును మూసివేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జీడీపీలో 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలినంద్యాల(న్యూటౌన్): పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలని, నాలుగు డీఏలను ఇవ్వాలని, మధ్యంతర భృతి 30శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ 257 సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివయ్య, రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కార్యాలయంలో నంద్యాల మండలం ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికై న మండల అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ భాస్కరరెడ్డి, శ్రీనివాసులు వ్యవహరించారు.నూనె గింజల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలిఎమ్మిగనూరురూరల్: నూనె గింజల ఉత్పత్తి పెంపుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మీ అన్నారు. గురువారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకంలో భాగంగా కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి ఆధ్వర్యంలో రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మీ మాట్లాడుతూ.. భారతదేశం సంవత్సరానికి సగటున 16 మిలియన్ టన్నుల నూనె గింజలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు. దీతో లక్షల కోట్లు రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, నూనె గింజల ఉత్పత్తి పెంపుతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. ఎఫ్పీవోలకు నాణ్యమైన విత్తనాలను అందించి విత్తనోత్పత్తి పెంపుతోపాటు నూనె గింజనల ఉత్పత్తి పెరగటానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల ఏవోలు శివశంకర్, హేమలత, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
గౌరవ వేతనాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేసేందుకు చేతులు రావడం లేదు. ముస్లిం, క్రిస్టియన్లకు సూపర్ 10 అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని బలపరిచేది కాదు. – పీ ఇక్బాల్హుసేన్, ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షుడు -
కూటమికి బిగ్ షాక్
ఎమ్మిగనూరు టౌన్: ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ నేత కె.ఆర్.మురహరిరెడ్డి ఆ పార్టీని వీడి గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి అన్న మహానందిరెడ్డి మనవడైన కె.ఆర్.మురహరిరెడ్డి వ్యాపారవేత్తగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యారు. వైఎస్సార్సీపీలో ఈయన చేరికతో నియోజకవర్గంలో కూటమికి బిగ్ షాక్ తగిలినట్లయింది. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టారేణుక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడి ఆధ్వర్యంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, చేనేత నాయకుడు మల్లికార్జున, మాజీ కౌన్సిలర్ మధుబాబులు ఆయా పార్టీలను వీడి వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బుట్టా శివనీలకంఠ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టాప్రతుల్, నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప పాల్గొన్నారు. కర్నూలు(టౌన్): కర్నూలు నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడీసీసీ మాజీ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం మాజీ చైర్మన్ రాంపుల్లయ్య యా దవ్, మాజీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు నరసింహులు యాదవ్, బంధువులు, అనుచరులతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వీరందరికీ మాజీ సీఎం పార్టీ కండువాలు కప్పి అభినందించారు.మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ నేతకె.ఆర్.మురహరిరెడ్డి -
శనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి హాలహర్వి: రబీ సీజన్ ప్రారంభంకావొస్తున్నా నేటికీ రైతులకు పప్పుశనగ విత్తనాలను సబ్సిడీలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు శనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. హాలహర్వి, చిప్పగిరి మండలాల్లో ఎక్కువగా పప్పుశనగను సాగు చేస్తారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో సెప్టెంబర్ చివరి వారానికే సబ్సిడీ శనగ విత్తనాలు రైతులకు అందేవన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందన్నారు. సకాలంలో సబ్సిడీ శనగ విత్తనాలను అందించని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 27న అంతర్జాతీయ బధిరుల దినోత్సవం కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఈ నెల 27న ఉదయం 10 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బధిరుల సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు తదితర శాఖలకు చెందిన ఉద్యోగులందరూ హాజరు కావాలని కోరారు. బధిర ప్రభుత్వ ఉద్యోగులకు ఓడీ సౌకర్యం ఉందనే విషయాన్ని తమ అధికారులకు తెలియజేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఏడీ పేర్కొన్నారు. -
‘కన్నీళ్లు’ తుడిచేదెప్పుడు!
● 3,700 మంది రైతులకు మొండిచేయి ● 69,320 క్వింటాళ్లు రైతుల నుంచి నేరుగా కొన్న మార్క్ఫెడ్ ● ఇప్పటి వరకు 14,491 క్వింటాళ్లకు మాత్రమే రూ.1.54 కోట్ల చెల్లింపులు ● పది రోజులుగా మార్క్ఫెడ్ చుట్టూ రైతుల ప్రదక్షిణ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో ఉల్లిగడ్డలు అమ్ముకున్న రైతులకు నగదు చెల్లింపులు ఇప్పటికీ అందని పరిస్థితి. 20 రోజులు గడుస్తున్నా చెల్లింపులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు వారం, పది రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు విడుదలవుతుందని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధిత రైతులు మార్క్ఫెడ్తో పాటు మార్కెటింగ్ శాఖ అధికారుల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు రైతుల నుంచి మద్దతు ధర రూ.1,200తో నేరుగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత నుంచి వ్యాపారులు కొన్న ధర మినహాయించి బ్యాలెన్స్ అమౌంటు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. 20వ తేదీ వరకు మద్దతు ధరతో మార్క్ఫెడ్ ఉల్లి కొనుగోలు చేసింది. ఆర్థిక బారం తగ్గించుకునేందుకు కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోళ్లకు మంగళం పలికి హెక్టారుకు రూ.50 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకుంది. మద్దతు చెల్లింపులు 250 మందికే.. మార్క్ఫెడ్ నేరుగా 1,200 మంది రైతుల నుంచి 69,320 క్వింటాళ్లు మద్దతు ధర రూ.1,200తో కొనుగోలు చేసింది. మరో 2,500 మంది రైతుల నుంచి వ్యాపారులు 90,917 క్వింటాళ్లు కొన్నారు. మద్దతు ధర రూ.1,200 నుంచి వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం మొత్తాన్ని మార్క్ఫెడ్ రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే 3700 మంది రైతులు మద్దతు ధరతో ఉల్లి గడ్డలు అమ్ముకుంటే ఈ నెల 15వ తేదీ నాటికి కేవలం 250 మంది రైతులకు సంబంధించి 14,491.02 క్వింటాళ్లకు రూ.1,54,35,360 చెల్లింపులు చేయడం గమనార్హం. రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. ఈ నెల 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 118 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు క్వింటా రూ.204 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం రూ.996 ప్రకారం రూ.1,17,528 బ్యాంకు ఖాతాకు విడుదలవుతుందని చెప్పారు. ఈ నెల 5వ తేదీ వరకు బ్యాంకు ఖాతాకు వ్యత్యాసం మొత్తం జమ కాలేదు. రోజూ బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోవడంతో సరిపోతుంది. – బి.రామలింగడు, దైవందిన్నె, ఎమ్మిగనూరు మండలం -
బాల్య వివాహాలు చేస్తే శిక్ష తప్పదు
కర్నూలు: బాల్య వివాహాలు చేసిన వారికి, చేయించిన వారికి శిక్షలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్లో గురువారం ‘బాల్య వివాహ నిరోధక చట్టం’పై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, దేవాలయ ఏఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపించాలని ఎవరైనా మీ దగ్గరకు వస్తే సంబంధిత శాఖలకు, 15100 టోల్ ఫ్రీ నంబర్కు కానీ సమాచారం ఇస్తే వెంటనే నిలుపుదల చేయిస్తామన్నారు. బాల్య వివాహాలు చేసినవారికి రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఐసీడీఎస్ అధికారి శారద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయని, బాల్య వివాహాలపై సమాచారం ఇస్తే వెంటనే ఆ వివాహాన్ని నిలుపుదల చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాం సుందర్, రవిచంద్రవర్మ, చైల్డ్ రైట్స్ ఎన్జీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వినతి
ఆదోని రూరల్/ఆదోని టౌన్: ఆదోని ఎంపీపీపై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం మండలంలోని 20 మంది వైఎస్సార్సీపీ చెందిన ఎంపీటీసీలు ఏకమై ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, మండలాధ్యక్షుడు గురునాథ్రెడ్డి, ఎంపీటీసీలు మాట్లాడారు. ౖవైఎస్సార్సీపీ తరఫున గెలిచి వేరే పార్టీలో చేరడంతోనే ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. దానమ్మ పార్టీకి నమ్మకద్రోహం చేసిందని, అందువల్లనే ఆమెను ఎంపీపీ పదవి నుంచి దించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్లు చెప్పారు. స్పందించిన సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీల వినతి మేరకు 15 రోజుల్లో నోటీసు జారీ చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ఎంపీపీగా ఉన్న దానమ్మ నెగ్గితే కొనసాగుతారని, లేనిపక్షంలో తదుపరి ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు. పార్టీకి నమ్మకద్రోహం వైఎస్సార్సీపీ తరఫున కపటి గ్రామ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన దానమ్మను అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఆదోని మండలంలో మొత్తం 29 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా మండిగిరి–1, 2, సాదాపురం స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 26 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా, ఒకరు రాజీనామా చేశారు. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు కపటి గ్రామానికి చెందిన ఎంపీటీసీ దానమ్మ ఎంపీపీగా ఎన్నుకున్నారు. -
సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ
కొత్తపల్లి: సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ సాధ్యమని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, కృష్ణమూర్తి, రవిగౌడ్ అన్నారు. గురువారం వారు నందికుంట గ్రామ సమీపంలోని వరిపొలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాతావరణం చల్లగా ఉండడంతో తెగుళ్లు సోకే అకాశం ఎక్కువగా ఉందన్నారు. రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టి సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమీరున్నీసా బేగం, ఏపీఎమ్ పుల్లయ్య, వెలుగు సీసీలు నరసింహులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల పునఃమూల్యాంకనం ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు. రెండో సెమిస్టర్కు సంబంధించి 541 మంది రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 151 మంది, నాల్గవ సెమిస్టర్కు 781 మందికి 196 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు. మద్యం తాగొద్దని మందలించడంతో.. గోస్పాడు: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎం.కృష్ణాపురం గ్రామానికి చెందిన హుసేని(73) రోజూ మద్యం సేవించి భార్య సాలమ్మతో ఘర్షణ పడుతుండేవాడు. బుధవారం కూడా మద్యం సేవించడంతో భార్య మందలించింది. బయటకు వెళ్లిన హుసే ని రాత్రి పొద్దుపోయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలో వెతుకుతుండగా అపస్మారక స్థితిలో కనిపించా డు. పురుగు మందు తాగినట్లు గుర్తించి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటి కే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. బాషా, రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయండి కర్నూలు (సెంట్రల్): లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కోడుమూరు బాషా, కర్నూలు రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ (పీసీ, పీఎన్డీటీ యాక్ట్) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశానికి 6వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, సీఐ తబ్రేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి మరణానికి కారణమైన రక్ష ఆసుపత్రిపై కేసు నమోదు చేసి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ బాలమద్దయ్య, నోడల్ ఆఫీసర్ నాగప్రసాద్ బాబు, ప్రోగ్రాం కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు. -
డీఏనా.. ఆ ఒక్కటీ అడగొద్దు!
దసరా.. హిందువులకు అతి పెద్ద పండుగ. ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరూ సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుంటారు. దసరాకై నా కనీసం ఒక్క డీఏ అయినా ఇస్తారా అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘డీఏనా.. ఆ ఒక్కటీ అడగొద్దు’ అన్నట్లు వ్యవహరిస్తోంది.కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2024 జూన్ నెలలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 16 నెలల కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఓపిక పట్టాలనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించడంలో ఉద్యోగుల్లో సహనం నశిస్తోంది. మొదటి విడతలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు రెండో విడతలో నిరసనలు మరింత తీవ్రం చేయనున్నారు. రోడ్డెక్కుతున్న ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై ఉన్న భ్రమలు ఉద్యోగుల్లో తొలగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పబ్లిక్ సెక్టారు కంపెనీ అయిన ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉద్యమం చేసే యోచనలో ఉన్నారు. మొన్నటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే ఉద్యోగులు నేడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటు దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగా నిరసన గళం విప్పుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో అసోసియేషన్.. చంద్రబాబు భజనలో తరిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి జిల్లాలో బకాయిలు రూ.3 వేల కోట్లు కర్నూలు జిల్లాలో 25,895, నంద్యాల జిల్లాలో 20,282 మంది ఉద్యోగులు ఉన్నారు. పబ్లిక్ సెక్టారుకు చెందిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో మరో 10 వేల మంది వరకు ఉన్నారు. 1వ తేదీ వేతనాలు ఇవ్వడం మినహా ఎలాంటి ప్రయోజనం లేదనే అసంతృప్తితో ఉద్యోగులు రగిలిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తితో లేదనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ఆర్థిక శాఖ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.3 వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఇవీ కష్టాలు..● ఏపీజీఎల్ఐ లోన్, పైనల్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోయాయి. ● 10 నెలలుగా మెడికల్ రీయింబర్స్మెంటు బిల్లులు ఇవ్వడం లేదు. ● మూడు సరండర్ లీవ్లు పెండింగ్ల ఉన్నాయి. ● 2024 అక్టోబరు నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ ఇవ్వడం లేదు. ● పది నెలల ఎన్క్యాస్మెంట్ ఆప్ లీవ్లు పెండింగ్లోనే ఉన్నాయి. ● డీఏ అరియర్, పీఆర్సీ అరియర్స్ పెండింగ్లో ఉండిపోయాయి. ● కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు అవుతున్నా ఐఆర్ ఊసే లేదు. ● 12వ పీఆర్సీ గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. ● 2019లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 27 శాతం మద్యంతర భృతి(ఐఆర్) ఇచ్చారు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమీషన్ ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ తన పని మొదలు పెట్టే సమాయానికి ఎన్నికల నోటిఫికేన్ రావడంతో నిలిచిపోయింది. తదనంతరం పీఆర్సీ కమీషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతోంది. ఇంతవరకు ఉద్యోగ, ఉపా ధ్యాయ కార్మికుల పెండింగ్ బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఫెడరేషన్గా ఏర్పడ్డాయి. ఇదివరకే జిల్లాస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్రస్థాయిలో పద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. – హృదయరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం దారుణం. నాలుగు డీఏలు పెండింగ్లో ఉండటంతో ఒక్కో ఉద్యోగి సగటున రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై మొదటి దశ ఆందోళన కార్యక్రమాలు పూర్తి చేశాం. త్వరలోనే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. – సతీష్ కుమార్, ఉమ్మడి జిల్లా చైర్మన్, ఏపీ పవర్ ఉద్యోగుల జేఏసీ రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు(ఫైల్)2024 జనవరిలో 3.64 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది ( 33.67 శాతం నుంచి 37.31 శాతం) 2024 జూలైలో 2.73 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది.( 37.31 శాతం నుంచి 40.04 శాతం) 2025 జనవరిలో 1.82 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది.( 40.04 శాతం నుంచి 41.86 శాతం) 2025 జూలై 2.73 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. (41.86 శాతం నుంచి 44.59 శాతం) ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏల మొత్తం 10.92 శాతం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వని వైనం రోడ్డెక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా రూ.10 వేలు నష్టపోతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల బకాయిలు రూ.3,000 కోట్లు పైమాటనే! -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు(సెంట్రల్): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు ప్రతిపాదించిన 84 అప్రోచ్రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయం దగ్గర అప్రోచ్ రోడ్డు పనులు నెలలోపు పూర్తి చేయాలన్నారు. పెద్దపాడు నుంచి హైవే వరకు నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదలను అక్టోబర్ 10 లోగా ప్రభుత్వానికి పంపాలన్నారు. ఉల్చాలరోడ్డు, గాయత్రీ ఎస్టేట్లలో జంక్షన్ పనులను త్వరగా చేపట్టాలన్నారు. కర్నూలు నగరంలో సుందరీకరణ పనులపై ఆరా తీశారు. కర్నూలులో మరో 135 సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఆదోని, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాలోని ఆర్అండ్బీ రోడ్లలో రాత్రిపూట వెలుతురు ఇచ్చే రోడ్ స్టడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో సీసీ కెమెరాల నిర్వహణను బా ధ్యతను మునిసిపల్ శాఖ తీసుకోవాలని, మరో 135 సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, డీటీసీ శాంతకుమారి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షాలు కురిశాయి. కర్నూలు రూరల్లో అత్యధికంగా 38.2 మి.మీ, అత్యల్పంగా మద్దికెరలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా సగటున 8.3 మి.మీ వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా.. 132.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను నీరుకారుస్తున్నాయి. తేమ అరకుండా వర్షాలు కురుస్తుండటంతో దాదాపు అన్ని పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, వేరుశనగ తదితర పంటలు పచ్చగా ఉంటున్నా దిగుబడులు లేకుండా పోతున్నాయి. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధిక వర్షాల వల్ల పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. వేరుశనగలో కాయలు లొత్తలు పడుతున్నాయి. మండలం వర్షపాతం(మి.మీ) కర్నూలు రూరల్ 38.2 కర్నూలు అర్బన్ 33.4 కల్లూరు 17.6 వెల్దుర్తి 13 తుగ్గలి 12.8 పత్తికొండ 11 ఎమ్మిగనూరు 10.8 హొళగుంద 10.6 గోనెగండ్ల 9.8 -
దొంగతో జతకట్టి పోలీసు చోరీలు
కర్నూలు: ఆయనో కానిస్టేబుల్. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ దొంగతో దోస్తీ కట్టాడు. తన ద్విచక్ర వాహనంపై దొంగను కూర్చోబెట్టుకొని నగరంలో తిరుగుతుంటాడు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు అక్కడ దొంగను రంగంలోకి దించుతాడు. బయట తాను గస్తీ పోలీసుననే ఫోజు ఇస్తాడు. పని పూర్తి కాగానే ఇద్దరూ కలసి లక్ష్మీ టౌన్షిప్లోని కానిస్టేబుల్ ఇంటికి చేరుకుంటారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బును పంచుకుంటారు. మోస్ట్ వాంటెడ్ గజదొంగ జగదీష్ను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ ఎద్దుల కృపానందం బాగోతం వెలుగులోకి వచ్చింది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు కల్లూరులోని తెలుగు వీధిలో నివాసముంటున్న కార్ డ్రైవ్ గురుస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలసి వృత్తి రీత్యా బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచిన 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. ఈ మేరకు బాధితుడు గురుస్వామి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి క్రైం పార్టీ సిబ్బందితో కలసి దర్యాప్తులో భాగంగా నగర శివారులో విజయవాడకు చెందిన దొంగ జగదీష్ను అదుపులోకి తీసుకుని విచారించగా కానిస్టేబుల్ దోస్తీ వ్యవహారం వెలుగు చూసింది. జగదీష్పై 25కు పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఫోన్ కాల్ డేటా ఆధారంగా వెలుగులోకి.. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజైన నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ కృపానందం సెల్ఫోన్కు గజదొంగ జగదీష్ నుంచి తరచూ ఫోన్లు వచ్చినట్లు కాల్ డేటా సేకరించారు. కల్లూరులోని గురుస్వామి ఇంట్లో దొంగతనం జరిగిన రోజు విజయవాడకు చెందిన జగదీష్ కదలికలు ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి విచారించడంతో వారి మధ్య ఉన్న బంధం బయటపడింది. విధి నిర్వహణలో భాగంగా కృపానందం విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ గార్డు డ్యూటీ విధుల్లో ఉండగా జగదీష్ పరిచయమయ్యాడు. అది కాస్తా స్నేహంగా మారి తరచూ కర్నూలుకు వస్తూ కానిస్టేబుల్ ఇంట్లోనే ఉంటూ ఇద్దరూ కలసి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెలుగుచూసింది. ఇలా కర్నూలు నగరంలో ఇద్దరూ కలసి పలు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. 2007లో కృపానందం ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. మద్యం మత్తులో యువకులపై దాడి చేసి సస్పెన్షన్● కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ యువకులతో గొడవ పడిన ఘటనలో బెటాలియన్ అధికారులు కృపానందంపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. ● విచారణ జరుగుతుండగానే ఈ ఏడాది ఆగస్టులో కంబం పోలీసులు కృపానందంను చోరీ కేసులో అరెస్టు చేసి గిద్దలూరు జైలుకు పంపారు. ● బెయిల్పై బయటకు వచ్చి జగదీష్తో కలసి కర్నూలులో మళ్లీ ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. ● నేరానికి ఉపయోగించిన కృపానందం పల్సర్ మోటార్బైక్ను సీజ్ చేసి ఇరువురినీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. ● కేసును సాంకేతికత ఆధారంగా ఛేదించిన ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్, కానిస్టేబుళ్లు ఎల్లా శివుడు, సుబ్బరాయుడులను సీఐ అభినందించారు. తన బైక్పైనే తిప్పుతూ తాళం వేసిన ఇళ్ల గుర్తింపు చోరీ సొత్తు సొమ్ము చేసుకొని భాగాలు మోస్ట్ వాంటెడ్ దొంగ జగదీష్పై 25కు పైగా కేసులు ఇప్పటికే ఓ కేసులో అరెస్టయిన కానిస్టేబుల్ బెయిల్పై వచ్చి విజయవాడ దొంగతో దోస్తీ -
సమ్మెకు సిద్ధమైన పీహెచ్సీ వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఫలితం లేకపోయిందన్నారు. దీంతో తాము నిరసనకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనన్నారు. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ తాము ప్రజా సేవకు వెనకడుగు వేయలేదని, అయినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరుగున పడేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. -
పంట తడిచి.. నష్టం మొలకెత్తి!
దొర్నిపాడు: భారీ వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్లో మొక్కజొన్నను విస్తారంగా సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకులు చెట్లపైన్నే మొలకెత్తున్నాయి. కోతకోయడానికి పొలమంతా నీరు, బురద ఉండటంతో కోత యంత్రాలు, కూలీలు పొలంలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉండటంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నా రు. చేతికొచ్చిన మొక్కజొన్న కళ్ల ముందే పొలంలోనే వర్షాలకు తడిచి కంకులు మొలకెత్తుండటంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. -
వివాదం రాజేసిన చేపల వేట
అవుకు(కొలిమిగుండ్ల): చేపల వేట కోసం రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. బుధవారం మెట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని గాలేరు నగరి కాల్వకు ఎగువ నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని ఇటీవల అధికారులు తగ్గించారు. దీంతో మెట్టుపల్లె, కోనాపురం గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు గాలేరు నగరి కాల్వలో దిగి చేపలు పట్టుకుంటున్నారు. పది నుంచి ఇరవై కేజీల బరువున్న చేపలు కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్లోకి చేరుతుంటాయి. కొద్ది రోజుల నుంచి రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు చేపలు పట్టుకొని బనగానపల్లెకు చెందిన వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాలుగు టన్నుల వరకు చేపలను విక్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం టన్నుకు పైగానే చేపలు పట్టు కొని ఆటోలో తరలించేందుకు సిద్ధం చేశారు. ఈ విష యం తెలుసుకున్న అవుకు పట్టణానికి చెందిన బెస్త సంఘం నాయకులు గాలేరు నగరి కాల్వ వద్దకు చేరుకున్నారు. చేపలు పట్టుకునే హక్కు తమకు మాత్రమే ఉందని వాదించారు. అయితే తమ గ్రామ పొలిమేర కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉందని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో ఒకరికొకరు స్వల్పంగా తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల వాదనలు విని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరూ చేపలు పట్టరాదని సూచించారు. ఆటో లో ఉన్న చేపలను స్టేషన్కు తరలించారు. సీఐ మంజునాథరెడ్డి అవుకు పోలీస్ స్టేషన్కు చేరుకొని రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులతో పాటు అవుకు బెస్త సంఘం నాయకులతో చర్చించారు. కాగా చివరకు ఆ ప్రా ంతం చేపల వేటకు నిషేధమని, ఎవరూ చేపలు పట్ట కూడదని తేల్చి చెప్పారు.ఆటోలో ఉన్న చేపలను అప్పటికే కొనుగోలు చేసిన వ్యాపారులకు అప్పగించారు. -
నిష్టతో కట్టుబాట్లను పాటిస్తారు
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారిచి గ్రామంలోని గుడిలకు వెళ్లి టెంకాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల దగ్గరకు వచ్చే వారిని కట్టడి చేసి విగ్రహాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు. – రవిశాసీ్త్ర, మాళమల్లేశ్వరునికి కల్యాణం జరిపే పురోహితుడు, నెరణికి -
విగ్రహాల రక్షణే మా లక్ష్యం
వేలాది మంది పాల్గొనే వేడుకల్లో విగ్రహాలను కాపాడుకోవడమే మా మూడు గ్రామాల లక్ష్యం. పలు కట్టుబాట్లతో ఉండంతోనే జైత్రయాత్రలో విగ్రహాలకు దెబ్బలు తగలకుండా రక్షణ కవచగా ఉండి కాపాడుకుంటూ వస్తున్నాం. విగ్రహాలను కై వసం చేసుకోవడానికి అడ్డు పడ్తారనేది అవాస్తవం. మద్యం, మాంసం ముడితే బన్ని ఉత్సవం జరిపే అర్హత కోల్పోతాం. ఉత్సవంలో మా మూడు గ్రామాల ఆచారాలు, పూజలు నిష్ట నిబద్ధత కలిగి ఉంటాయి. – బసవరాజు, రాక్షస గుండ్లకు రక్తం ఇచ్చే గొరవయ్య, కంచాభీరా వంశస్తుడు, నెరణికి -
ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలు
కర్నూలు(సెంట్రల్): యూనివర్సిటీ మొదలు పాఠశాలల వరకు ప్రతి విద్యా సంస్థలో ఈగల్టీం(బృందాలు)లను సోమవారంలోపు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. జూనియర్ కాలేజీలు, పాఠశాలల ఈగల్ టీంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉండేలా చూసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్సీఓఆర్డీ సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, విద్యార్థుల సాయంతో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా వేయవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో అనారోగ్యం బారిన పడతారని, కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయనే విషయాన్ని ఈగల్ టీంల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పంట పొలాల్లో గంజాయి పెంచకుండా తగిన నిఘా ఉంచాలని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీసు శాఖ మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టడంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలను ఆవిష్కరించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని 250 పాఠశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం పాఠశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యా సంస్థలకు సూచించినట్లు చెప్పారు. ఆదోని మండలం పెద్దతుంబళంలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తుండడంతో గుర్తించామని, సుమారు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబీహపర్వీన్, డీటీసీ శాంతకుమారి, ఆర్టీసీ ఏఓ సుధారాణి, డిజేబుల్డ్ ఏడీ ఫాతిమా సుల్తానా, జేడీఏ వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ శాంతికళ, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సుధీర్బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఆర్ఐఓ లాలెప్ప, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, లేబర్ డీసీ వెంకటేశ్వర్లు, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అఖీరాబాను పాల్గొన్నారు. -
దీక్ష బూని.. భక్తి చాటి !
ఈ నెల 27న శనివారం నెరణికి గ్రామంలో ఉంటున్న మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దేవరగట్టుకు తీసుకెళ్లి రాత్రి కంకణధారణ నిర్వహిస్తారు. ● అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర. ● 3న భవిష్యవాణి (దైవవాణి) ● 4న సాయంత్రం స్వామివారి రథోత్సవం. ● 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం. ● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. హొళగుంద: దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్ల నుంచి మల్లయ్య మాల దీక్షను చేపట్టి భక్తిని చాటుతున్నా రు. అయ్యప్ప, శివయ్య మాల దీక్ష వలే కొన్నేళ్ల నుంచి మల్లయ్య మాల ధరిస్తుస్తున్నారు. మూడు గ్రామాల్లో మల్లయ్య దీక్ష చేపట్టే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కఠోర దీక్షను పాటిస్తూ తమ ఇలవేల్పుపై భక్తిని చాటుకుంటున్నారు. దేవరగట్టు దసరా బన్ని మహోత్సవాల్లో ఈ మూడు గ్రామాస్తులదే కీలక భూమిక. అమావాస్య నుంచి దీక్షను మొదలు పెట్టి బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు. విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటిస్తారు. ఈ 15 రోజుల పాటు చెప్పులు తొడుక్కోరు. అలాగే దాంపత్య సుఖానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక మద్యం జోలికెళ్లరు. మాంసం ముట్టరు. దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పండుగను జరుపుకుంటారు. ఎంత కక్షలు ఉన్నా బన్ని రోజు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉందామని పాలబాస తీసుకుంటారు. మూడు గ్రామాల్లో ఆరోజే దసరా.. ఈ ఏడాది దేశమంతా అక్టోబర్ 2వ తేదీ దసరా వేడుకలు జరుపుకుంటే ఈ మూడు గ్రామంలో 6వ తేదీన చేసుకుంటారు. విజయదశమి నాడు అందరికీ దసరా పండుగా అయితే ఆ మూడు గ్రామస్తులకు మాత్రం బన్ని ఉత్సవాలు ముగిసి విగ్రహాలు నెరణకి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా వారు పండుగ చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాటిస్తూ ఉత్సవంలో భాగస్వాములవుతారు. ఉత్సవాలు ముగిసేంత వరకు ఒకరినొకరు కొట్టుకోరు. ఒకరినొకరు తిట్టుకోరు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. మాళమల్లేశ్వరుల విగ్రహాన్ని విజయవంతంగా నెరణికికి చేర్చడం. మనస్సు నిండా భక్తిని నింపుకుని నిష్టతో, నిబద్ధతతో ఉంటారు. కట్టుబాట్లను పాటిస్తున్నందునే బన్ని (కర్రల సమరం)లో దేవరగట్టు చుట్టు పక్క ఉన్న మిగిలిన గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా జైత్రయాత్రాన్ని విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తున్నామని మూడు గ్రామస్తు ల నమ్మకం. తమ గ్రామాల్లో ఇన్నాళ్లు ఒకరికొకరు ఎలా ఉన్నా ఉత్సవంలో మాత్రం కలిసికట్టుగా ఉండి తమ మధ్య విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. ఉత్సవం ఇలా.. -
వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బుధవారం వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, షాపింగ్ మాల్ ఎండీ గోపాల్ రెడ్డి, హరీష్రెడ్డి పాల్గొన్నారు. అతిథులు నూతన షాపింగ్ మాల్ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తమ వస్త్రాలయ షాపింగ్ మాల్లో అపరితమైన కలెక్షన్లు, మెన్స్వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, పార్టీ వేర్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందు బాటులో ఉన్నాయన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభం పురస్కరించుకొని దీపావళి పండుగ వరకు లక్కీ డ్రాలు ఉన్నాయన్నారు. రూ.1000 కొనుగోలు చేస్తే లక్కీ డ్రాలో టీవీ, ఫ్రిడ్జ్, బైక్ వంటి బహుమతులతో పాటు బంపర్ డ్రాలో విజేతకు కారును కూడా అందిస్తున్నామన్నారు. -
సీడీపీఓ వేధింపులపై విచారణ
ఆలూరు రూరల్: ఆలూరు సీడీపీఓ నరసమ్మ వేధిస్తున్నారని కురువళ్లి అంగన్వాడీ టీచర్ భువనేశ్వరి ఆరోపణలపై జిల్లా ఐసీడీఎస్ పీడీ విజయ విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన సీడీపీఓ కురువళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు లేకపోవడంతో టీచర్ను నిలదీసి, రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశా రని, ఇవ్వలేకపోవడంతో వేధిస్తు న్నారని అంగన్ వాడీ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీడీ విజయ బుధవారం ఆలూరుకు చేరుకుని సీడీపీఓ, సూపర్ వైజర్, అంగన్వాడీటీచర్, ఆయాను విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. సబ్ జైలు తనిఖీడోన్ టౌన్: పట్టణంలోని సబ్ జైలును బుధవారం జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఏ ఏ నేరాలపై జైలుకు వచ్చారు? బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎవ్వరైన 70 ఏళ్ల పైబడిన వయస్సు వారు ఉన్నారా? అంటూ అరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైలులో వసతులు, భోజనం, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. బెయిలు కోసం స్వతహాగా దరఖాస్తు చేసుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక పోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు పెట్టకోవాలని సూచించారు. ఈయన వెంట పట్టణ సీఐ ఇంతియాజ్బాషా, లీగల్ అడ్వయిజర్ మాధవస్వామి తదితరులు ఉన్నారు. -
విజయవాడకు బయలుదేరిన కొత్త సారోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి 123 బస్సుల్లో తరలింపు ● జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ కర్నూలు సిటీ: డీఎస్సీ–2025లో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడకు తరలివెళ్లారు. వీరంతా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో నియామకపత్రాలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, వారికి ఒకరి చొప్పున సహాయకులను రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు. 123 బస్సుల్లో ప్రతి బస్సుకు ఒక పోలీసు ఎస్కార్ట్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షణకు పది బస్సులకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. రాత్రి విడిది కోసం ప్రత్యేకంగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నరసరావుపేట, గుంటూరులో బస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే బస్సుల్లోనే అభ్యర్థులను జిల్లా కేంద్రానికి తీసుకొస్తామన్నారు. కాగా చంటి పిల్లలు ఉన్న తల్లులు ఎంతో అవస్థలు పడ్డారు. వాతావరణం చల్లగా ఉండడంతో పిల్లలతో సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఆందోళన చెందారు. అయితే నియమాక పత్రాలు జిల్లాకు ఇద్దరికి మాత్రమే వేదికపై ఇస్తారని ప్రయాణంలో తెలియడంతో అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రచారం కోసం ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని బస్సుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
కర్రలతో కొట్టుకోరు..
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఉత్సవాన్ని కర్రల సమరంగా చెప్పడం భావ్యం కాదు. పూర్వం గట్టు మీదకెక్కడానికి దివిటీలు, జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడుతారు తప్ప ఇతరులకు గాయాలు కావు. విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం వల్ల గతంలో చనిపోయారు. ఇప్పుడు తగ్గిపోయాయి. ఇదొక సంప్రదాయ పండుగ. – గిరిస్వామి,భవిష్యవాణి వినిపించే ఆలయ పూజారి -
రైతులకు న్యాయం చేయాలి
మద్దతు ధరలు లేక పత్తి, సజ్జ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతినింది. మార్కెట్లో ధర లేక సజ్జ రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలి. – వంగాల భరత్కుమార్రెడ్డి, మాజీ చైర్మన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఐదు ఎకరాల సొంత పొలం, మరో పది ఎకరాల కౌల పొలంలో పత్తి సాగు చేశాం. అధిక వర్షాలతో ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అంతంతమాత్రం వచ్చిన పంటకు ధర లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. – వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం, కల్లూరు మండలం ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ 3.50 ఎకరాల్లో సాగు చేశాం. ఎకరాకు రూ.40 వేల ప్రకారం మొత్తం రూ.1.40 లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. దిగుబడి 20 క్వింటాళ్లు రాగా మార్కెట్కు తీసుకు రాగా ధర లేదు. అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – వెంకటేష్, చెల్లెలచెలిమల, దేవనకొండ మండలం కొన్ని రోజులుగా మార్కెట్లోకి పత్తి వస్తోంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రైతులకు ఉపయోగమని చెప్పాం. అక్టోబరు మొదటి వారంలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. – నారాయణమూర్తి, ఏడీఎం, కర్నూలు -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆత్మకూరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్థాలు, వ్యసనం, పర్యవసనాలు, సైబర్ క్రైమ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువకులకు సిగరెట్, మద్యం తాగడమేనేది ఫ్యాషన్ అయ్యిందని చెప్పారు. ఈ అలవాటు భవిష్యత్తులో వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి మద్యంకు దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా పది సంవత్సరాలపాటు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుక్కలదాడిలో జింక మృతి ఉయ్యాలవాడ: మండ లంలోని హరివరం గ్రా మంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. తహసీల్దార్ ప్రసాద్బాబు తెలిపిన వివరాల మేరకు.. పొలాల్లో సంచరిస్తున్న జింకలు సోమవారం రాత్రి గ్రామంలోకి వచ్చాయి. గమనించిన కుక్కలు వాటి వెంటపడి దాడి చేయగా ఓ జింక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు బనగానపల్లె అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే జింకకు దహన సంస్కారాలు చేశారు. -
ఎస్సీ యువతకు ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ద్వారా ఎంపికై న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీలో ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఈఓ విజయలక్ష్మితో కలిసి ఆమె ఎంపికైన అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసీదేవి మాట్లాడుతూ శిక్షణ కోసం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నా రు. కర్నూలు జిల్లాకు సంబంధించి 10 మందిని, నంద్యాల జిల్లాలో 10 మందిని ఎంపిక చేశామన్నారు. శిక్షణనిచ్చే అంశాన్ని రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతామన్నారు. అనుమతి రాగానే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలల్లో శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు. ఉల్లి ధర మరింత పతనం ● క్వింటా ధర రూ.93 నుంచి రూ.459లోపే! కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర మరింత తగ్గింది. క్వింటా ధర రూ.93 నుంచి రూ.459 వరకు మాత్రమే పలికింది. మద్దతు ధరతో ఉల్లి కొనుగోలుకు స్వస్తి పలకడంతో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మద్దతు ధర ఉన్నంత వరకు మార్కెట్కు ఉల్లి వెల్లువెత్తింది. ఆగస్టు నెలలోనే 12 వేల క్వింటాళ్లు.. సెప్టెంబర్ నెలలో గరిష్టంగా 18 వేల క్వింటాళ్లు వచ్చింది. ప్రభు త్వం మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్కు ఉల్లి రావడం పూర్తిగా తగ్గిపోయింది. సోమవారం 2,445 క్వింటాళ్లు రాగా.. మంగళవారం 1806 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, సజ్జల ధరలు కూడా మరింత పడిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి గడుపు తేదీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేది వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న నిర్వహిస్తామన్నారు. సందేహాలుంటే 08512–294545 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. స్వామిత్వ సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన స్వామిత్వ సర్వేను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. మంగళవారం ఆయన సర్వే ఏడీ మునెప్పతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, మండల సర్వేయర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశలో 74 గ్రామ పంచాయతీల్లో స్వామిత్వ పూర్తయిందని, రెండవ దశలో 85 గ్రామ పంచాయతీల్లో సర్వేలో భాగంగా గ్రౌండ్ ట్రూథింగ్ జరుగుతోందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రౌండ్ ట్రూథింగ్లో కొంత జాప్యం ఉందని, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బి.తాండ్రపాడు, ఆస్పరి, కాల్వ గ్రామాల్లో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేయాలన్నారు. స్వామిత్వ పూర్తయితే గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. సీపీఆర్ ఆదేశాల మేరకు రెండవ దశలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. -
ఆశావర్కర్లకు రూ.26 వేల వేతనమివ్వాలి
కర్నూలు(సెంట్రల్) : గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం కార్మిక, కర్షక భవన్లో ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ఐదో మహాసభలు ఈశ్వరీబాయ్, రవిజాబీ, వెంకటమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆశావర్కర్లకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైవిఫలమయ్యారని విమర్శించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఏర్పాటై 20 ఏళ్లు గడిచినా ఆశావర్కర్లను కార్మికులుగా గుర్తించడంలేదని విమర్శించారు. ఆశా వర్కర్లను విచ్చల విడిగా తొలగించడం కూటమి సర్కారు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలుగా పి.రమిజాబీ, ప్రధాన కార్యదర్శిగా శివలక్ష్మితోపాటు 33 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు. -
కనెక్షన్ల ఏర్పాటులో నిర్లక్ల్యం!
● బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఇద్దరు ఏఈలపై సస్పెన్షన్ వేటు! నంద్యాల(అర్బన్): రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్ మెటీరియల్కు అవసరమైన డబ్బు చెల్లించినా అదిగో ఇదిగో అంటూ స్థానిక విద్యుత్ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీనిపై విసిగిన బాధిత రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఏఈలపై వేటు పడినట్లు తెలిసింది.బనగానపల్లె మండలం డోన్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.ఈ మండలానికి సంబంధించిన 200 మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలు తదితర మెటీరియల్ కోసం రూ.60 లక్షలు చెల్లించారు. అయితే, సామగ్రి అందజేతలో బనగానపల్లె విద్యుత్ కార్యాలయ అధికారులు నిబంధనలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. మెటీరియల్ కోసం చెల్లించిన సొమ్ముకు సంబంధించిన రికార్డులు సరిగ్గా చూపకపోవడంతో పాటు కొందరికి అరకొరగా మెటీరియల్ పంపిణీ చేయడం, మరికొందరికి మొండిచేయి చూపడం చేశారు. ఈ గోల్మాల్పై బాధిత రైతులు శాఖ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నంద్యాల జిల్లా ఎస్ఈ సుధాకర్కుమార్, డోన్ సబ్ డివిజన్ ఈఈ కమలాకర్రావు వేర్వేరుగా విచారణ జరిపి నివేదికలను విద్యుత్ సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్ ఎండీకి అందజేసినట్లు సమాచారం. దీంతో బనగానపల్లె రూరల్, అర్బన్ ఏఈలు గజ్జప్ప, శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ సోమవారం సీఎండీ కార్యాలయం ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది.అయితే, గుట్టుగా ఈ సస్పెన్షన్ ఎత్తి వేసుకునేందుకు సంబంధిత అధికారులు స్థానిక మంత్రి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్ మెటీరియల్ అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చామని విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్కుమార్ తెలిపారు. -
పిల్లల సంరక్షణపై దృష్టి సారించాలి
కర్నూలు(సెంట్రల్) : చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లలో ఉన ్న పిల్లల సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి కమిటీ చైర్మన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మిషన్ వాత్సల్యలో భాగంగా మొట్ట మొదటి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో 11 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని, అందులో 4 ప్రభుత్వ ఆధీనంలోవి కాగా, మిగిలిన ఏడు స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుస్తున్నట్లు చెప్పారు. ఆయా సంస్థల్లో ఉన్న చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, చదువు, బట్టలు తదితర సేవలన్నీ పక్కాగా అందేలా చూడాలని కోరారు. ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. సిబ్బంది పనితీరును గమనించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయ, కమిటీ మెంబర్ సెక్రటరీ టి.శారద, సభుఎ్యలు, మంజుష, ఎస్.మహబూబ్బాషా, రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
కర్నూలు కల్చరల్ : దసరా సెలవుల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్పాల్ తెలిపారు. కొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపారు. ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు తమ పరిధిలోని ఏవైనా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేంపెంటలో కొండ చిలువ కలకలం పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రా మం ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించింది. సెవెన్త్ డే చర్చి వెనక సామేలు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న కొండచిలువను కాలనీ వాసులు గమనించారు. ఫొటోలు,వీడియోలు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా స్పందించంలేదని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందోననే భయంతో బయటకు రాలేకపోతునన్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఫేక్ ఉద్యోగాలపై ఎస్పీకి ఫిర్యాదు కర్నూలు కల్చరల్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో విధుల్లో ఫేక్గా నియమితులైన ఉదంతంపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు జిల్లా విద్యాశాఖ తరఫున ఫిర్యాదు చేసినట్లు డీఈఓ శామ్యూల్పాల్ తెలిపారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేయనున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎంతటివారున్నా చర్యలు తప్పవన్నారు. విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయమున్నా వదిలిపెట్టమని డీఈఓ చెప్పారు. కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు పడుతున్నందున వ్యవసాయ ఉత్పత్తులను కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోకి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత వచ్చిన వాహనాలను మార్కెట్ లోపలికి అనుమతించబోమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉల్లి గడ్డలను పొలంలోనే గ్రేడింగ్ చేసుకొని మార్కెట్కు తీసుకరావాలని సూచించారు. ఎలాంటి మురుగులు లేకుండా తెచ్చిన ఉల్లిగడ్డలకు మంచి ధర లభిస్తుందన్నారు. పాణ్యం: రెండు రోజులగా కందికాయపల్లె గ్రామస్తులను భయపెడుతున్న చిరుతపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు, సోలార్ అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు. గత నెల 25న కూడా పెద్దమ్మ గుడి వద్ద సోలార్లో చిరుత సంచరిచిన అనవాళ్లు సీసీపుటేజీలో రికార్డు కావడం, గ్రామంలో రెండు రోజు క్రితం పొలం వద్ద వ్యక్తిని చిరుత వెంబడించింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ అధికారులు మంగళవారం డీఆర్ఓ విజయలక్ష్మి ఎఫ్బీఓ అబ్దుల్కలాం గ్రామ సమీపంలోని పొలాలు, కాల్వల వెంట పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు పొలాలకు వెళ్లే సమయంలో ఇద్దరు, ముగ్గురు కలసి వెళ్లాలని సూచించారు. -
స్థానిక సమస్యలకు ముందుగా పరిష్కారం
ఓర్వకల్లు: ప్రాజెక్టు నిర్మాణంలో సమర్థవంతమైన భూ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానిక సమస్యలను ముందుగానే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. మండలంలోని గుమ్మితం తండా వద్ద గ్రీన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు సైట్లోని అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్టు సైట్ పవర్ హౌస్ తదితర ప్రాంతాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి, పంపింగ్ ప్రక్రియలను కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేస్తున్నప్పుడు టర్బైన్ పనిచేయడాన్ని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఎగువ జలాశయానికి వెళ్లి పక్కనే ఉన్న 700 మెగావాట్ల పిన్నాపురం సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిరి మాట్లాడుతూ..ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడంతో పాటు, పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని గ్రీన్కో అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనితీరులో వినూత్నమైన, స్థిరమైన ఇంజినీరింగ్ పద్ధతులను అవలంబించాలన్నారు. కలెక్టర్ వెంట గ్రీన్కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాసనాయుడు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
బన్ని ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుందాం
ఆలూరు రూరల్/చిప్పగిరి: దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాతంగా జరుపుకుందామని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. చిప్పగిరి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం దేవరగట్టు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా బన్ని ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హొళగుంద మండలం దేవరగట్టులో వెలసిన మాళమల్లేశ్వర స్వా మి బన్ని ఉత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. 27న కంకణధారణ, అక్టోబర్ 2న బన్ని (మాళమల్లేశ్వర స్వామి కల్యాణోత్సం) ఉత్సవాలను కలసికట్టుగా విజయవంతం చేద్దామన్నారు. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో సంప్రదాయాల చిరునామా దేవరగట్టు ఉత్సవం అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని సౌక ర్యాలు కల్పించాలన్నారు. అక్టోబర్ 3న దైవ కార్ణీకం, 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, కంకణ విసర్జన, 6వ తేదీన మాళమల్లేశ్వర స్వామి విగ్రహ మూర్తులు నెరణికి గ్రామం చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. -
● ఆశలు వర్షార్పణం
హొళగుంద: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హొళగుంద మండలంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి, వేరుశనగ, మిరప తదితర పంటలు చేతికి వచ్చాయి. అయితే, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హొళగుంద, గజ్జహళ్లి, ఇంగళదహాల్, పెద్దగోనెహాళ్, పెద్దహ్యాట, వంద వాగిలి, హెబ్బటం, చిన్నహ్యాట తదితర గ్రామాల పరిధిలో దాదాపు 6 వేల ఎకరాల పత్తి పంట నీటిపాలైంది. పొలాల్లో తేమశాతం పెరగడంతో మిరప, వేరుశనగ పైర్లు కుళ్లిపోయాయి. జరిగిన నష్టంపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరతున్నారు. హొళగుంద సమీపంలో పత్తి పొలంలో నిలిచిన వర్షపు నీరు -
అట్టహాసంగా ఫుట్బాల్ పోటీలు షురూ
ఎమ్మిగనూరు టౌన్: రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. కర్నూలు జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈపోటీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలబాలికలు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, ఫుట్బాల్ అసోసియేన్ నాయకులు రామకృష్ణ నాయుడు,స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రఆచారి పోటీలను ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తొలి రోజు కృష్ణా–తూర్పుగోదావరి, విజయనగరం–అనంతపురం, పశ్చిమగోదావరి– నెల్లూరు, చిత్తూరు– ప్రకాశం జిల్లాల బాలుర జట్టు తలపడ్డాయి. కాగా పోటీల సమయంలో వర్షం పడటంతో క్రీడాకారులు కొంత ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు నిలవడంతో మైదానం బురదమయంగా మారింది.అయినా, ఆయా జట్ల క్రీడాకారులు ఆటను కొనసాగించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు అక్టోబర్ 5వ తేదీన జమ్ముకాశ్మీర్లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పోటీల రాష్ట్ర పరిశీలకులు ప్రభాకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామాంజినేయులు,ప్రైవేట్ స్కూళ్ల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు సుంకన్న, పోటీల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, శ్రీనివాసులు, హనీఫ్, సీజీ ఈరన్న, శ్రీరాములు,లతీఫ్, వెంకటేష్, బసవరాజు, సురజ్, గంగాధర్, శేషు, మనోహర్, వీరేష్ పలువురు పీఈటీలు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు -
పర్యాటక ప్రదేశాల్లో మరిన్ని సౌకర్యాలు
కర్నూలు కల్చరల్ : పర్యాటక ప్రదేశాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పేర్కొన్నారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని సుంకేసుల గ్రామ సమీపంలో సుంకేసుల డ్యామ్ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుడా ఆధ్వర్యంలో పర్యాటక ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి జి.లక్ష్మీనారాయణ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.