breaking news
Kurnool District News
-
‘ఎక్మో’తో మంచి ఫలితాలు
● అపోలో క్రిటికల్ కేర్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారెడ్డి కర్నూలు(హాస్పిటల్): ఆధునికంగా అభివృద్ధి చెందిన ఎక్మో (ఎక్స్ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) చికిత్స ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగుల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని అపోలో హాస్పిటల్ (హైదరాబాద్) క్రిటికల్ కేర్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ కె.సుబ్బారెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్, ఏపీఐ చాప్టర్ కర్నూలు సంయుక్తంగా ఆదివారం ఓ హోటల్లో నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు(సీఎంఈ) నిర్వహించారు. ఎక్మో ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలనే అంశంపై డాక్టర్ కె.సుబ్బారెడ్డి వివరించారు. ఇటీవల ఎక్మో చికిత్స మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఆయువు పోసిందన్నారు. ఎమ్మిగనూరుకు చెందిన బాలగోటి కోట ప్రకాష్గౌడ్ (51)కు ఫిబ్రవరిలో తీవ్రమైన గుండెపోటుతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు. ఆయన గుండె బలహీనపడటంతోపాటు రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, మూత్రపిండాలతో సహా ఇతర అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో పరిస్థితి విషమించిందన్నారు. యాంజియోప్లాస్టీ కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిందని, దీంతో కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ను సంప్రదించడంతో డాక్టర్ నిరంజన్ పాణిగ్రాహి నేతృత్వంలో మొబైల్ ఎక్మో బృందం కర్నూలుకు చేరుకుని ప్రకాష్గౌడ్కు చికిత్స చేశారన్నారు. కాస్త కుదుటపడ్డాక హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కు తరలించి పూర్తిస్థాయి వైద్యం చేయడంతో ఆయన కోలుకున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనల్లో చాలా మందికి ఎక్మో చికిత్స అందించడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. కుందూలో పడి బాలుడి మృతిబండిఆత్మకూరు: కాకనూరు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు కుందూనదిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చెవిటి ఈశ్వరమ్మ, నాగార్జున దంపతుల కుమారుడు నాగచరణ్ ఆదివారం ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో అన్నిచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో కుందూనదిలో గాలించగా మృతదేహం లభించింది. ఈతకెళ్లి నీట మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. -
రాజధాని ప్రాంతం టీడీపీ నేతల జాగీరా?
● వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గం ● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి చిప్పగిరి: రాజధాని ప్రాంతం ఏమైనా టీడీపీ నేతల జాగీరా అని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు పరిశీలనకు ఉండవల్లికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గుండాలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. రాజధానికి భూములివ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన వెళితే వారిని పథకం ప్రకారం దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. లోకేష్ అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం తారా స్థాయికి చేరిందన్నారు. గ్రాఫిక్స్ చూపిస్తూ సీఎం చంద్రబాబు తమను మోసం చేస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు తెలుసుకున్నారన్నారు. అందుకే రెండో దఫా భూములు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. త్వరలో రాజధాని ప్రాంత రైతులే తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. శనివారం జరిగిన దాడి ఘటన సంబంధించి ఎంత మందిపై కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పినా హోమంత్రి నోరు మెదపడం లేదన్నారు. ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బుసినె చంద్రశేఖర్, హనుమంతు, మహానంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి దళితులపై వివక్ష తగదు
శ్రీశైలం ప్రాజెక్టు: రాష్ట్ర ప్రభుత్వం దళిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల పట్ల వివక్ష చూపడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్ బాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఈనెల పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఇచ్చిన అవకాశం పీవీ సునీల్ కుమార్కు ఇచ్చి గౌరవించాలని శోభన్ బాబు కోరారు. అలాగే దళిత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కారుపై రాళ్లదాడి దారుణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు, హింసకు దారి తీయడం అత్యంత దురదృష్టకరమన్నారు. -
పోలియో రహిత సమాజానికి కృషి
కర్నూలు(హాస్పిటల్): పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కోరారు. జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం కర్నూలు నగరంలోని ఎ.క్యాంపులో ఉన్న ఇందిరా గాంధి స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేద్దామని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత అని అన్నారు. పల్స్పోలియో కార్యక్రమంలో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,630 బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చ్కులు వేసేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులలో 52 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవ్వరైనా ఆదివారం పోలియో చుక్కలు వేసుకోలేకపోతే వారికి 29, 30వ తేదిల్లో ఇంటింటికి వచ్చి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఐఓ డాక్టర్ ఉమ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లి చేయకుండానే.. పండుగ చూడకుండానే!
ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు. కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ.. పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చియం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్లు మోటార్ సైకిల్పై పెద్దకడుబూరుకు బయలుదేరారు. బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు. పౌర్ణమి పండుగకు వెళ్తూ.. చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుదాస్, బోయ రవి (ఫైల్)రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం బనవాసి సమీపంలో దుర్ఘటన గాయాలతో బయటపడ్డ బాలుడు -
ప్రభుత్వం స్పందించడం లేదు
హమాలీల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ప్రతి నెలా 5వ తేదీలోపు ఇచ్చే వేతనాలను నెలలు తరబడి పెండింగ్లో పెడుతున్నారు. కూలి రేట్లను తక్షణమే పెంచాలన్న డిమాండ్తో 29వ తేదీన ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాం. అప్పటికీ స్పందించకపోతే నిరవధిక ఉద్యమాలకు వెళ్తాం. – ఆర్. కృష్ణ, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు పనిచేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కాళ్లు, చేతులు, నడుము విరగడం ఖాయం. ఇలాంటి వారికి సరైన వైద్యం కోసం ఆ కుటుంబానికి భరించే శక్తి ఉండదు. అంతేగాక ఇంట్లో ఎవరికై నా జ్వరం వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం స్పందించి ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలి. – బజారి, హమాలీ, కర్నూలు గతంలో క్వింటం ఎత్తి, దించితే రూ.28 ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని రూ.45కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక గతంలో మాదిరిగా ప్రతి నెలా 5వ తేదీలోపు కూలి చెల్లించాలి. తక్కువ వేతనాలతో బతికే మాకు సమయానికి జీతాలు ఇవ్వకపోతే జీవనం గడిచేది ఎలా? కూటమి ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. – సోలోమన్రాజు, హమాలీ, కర్నూలు -
‘ప్రసన్న వదనం’ పుస్తకావిష్కరణ
నందవరం: మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బాల సాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న రచించిన 99వ పుస్తకం ‘ప్రసన్న వదనం’ ఆవిష్కరణ ఆదివారం శంకర మఠం, ఖండేరి కోట కర్నూలులో జరిగింది. సాహితీ సదస్సు– కర్నూలు వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె. ఎస్.ఆర్.కె శర్మ, కవి ఎలమర్తి రమణయ్య, ప్రముఖుల చేతుల మీదుగా చేతుల పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం గద్వాల సోమన్నను ప్రముఖులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డా.దండెబోయిన పార్వతి, వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత, కవులు ఆరెకటిక నాగేశ్వరరావు, గద్వాల్ ఈరన్న దంపతులు, జహీర్, వేద విద్యార్థులు పాల్గొన్నారు. మౌలాలి స్వామి పీరుపై బంగారు మాయం కొలిమిగుండ్ల(అవుకు): మొహర్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో పట్టణంలోని తేరు వద్ద ఉన్న మౌలాలి స్వామి పీరుపై అలంకరించిన బంగారు వస్తువును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద సరిగెత్తు వేడుకల్లో భాగంగా స్వామి పీరును పూలతో అలంకరించారు. అలాగే బంగారుతో చేయించిన వస్తువును నైలాన్ తాడుతో కట్టారు. ఊరేగింపు సమయంలో సందడి నెలకొన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో తాడును కోసి బంగారు వస్తువును అపహరించారు. 12 గ్రాముల బరువున్న వస్తువు రూ.2 లక్షల విలువ చేస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. పీర్ల చావిడిలో ఉండగానే ఘటన జరిగిందా లేక ఊరేగింపు సమయంలో జనసమూహంలో చోటు చేసుకుందా అనే వాటిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ బలవన్మరణం కోవెలకుంట్ల: పెద్దకొప్పెర్లకు చెందిన ఓ మహిళ ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రేవనూరు పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నమ్మ(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంటి ఆవరణలోని బూత్రూంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామంలో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాలు తెలిపిన వివరాల మేరకు..ఎం.పేండేకల్లు గ్రామానికి చెందిన మన్నెం జయరాముడు (29) గోరుమానుకొండ ఎంజేపీ స్కూలు వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో ఎడమ చేతికి గాయమైంది. ఇదే సమయంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య బిందుతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. కారు ఢీకొని వృద్ధుడి మృతి ఆదోని అర్బన్: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన కురువ పాండురంగ(70) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం బైక్పై పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులో అతివేగంగా కారు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో పాండురంగ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మృతుడికి భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
తుంగభద్రలో ఇసు‘కాసు’రులు
రాత్రి వేళ తెలంగాణకు ఇసుకను తరలించడానికి జేసీబీతో టిప్పర్కు లోడ్ చేస్తున్న దృశ్యం, తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక టిప్పర్లునందవరం: ఉచిత ఇసుక అంటూనే టీడీపీ నేతలు ఇసుకాసురులుగా అవతారమెత్తారు. తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటించి రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు.అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నందవరం మండలంలో నాగలదిన్నె, గంగవరం గ్రామాల్లో రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. నాగలదిన్నె గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. రీచ్ను తలపించేలా నాగలదిన్నె గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సాయి బాబ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం ఇసుకను డంప్ చేసి రాత్రివేళ్లల్లో జేసీబీలతో తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ మొత్తంలో ఇసుకను నాగలదిన్నె వంతెన మీదుగా తెలంగాణాకు తరలిస్తున్నారు. జేసీబీలతో నదిలో ఇసుకను పోగుచేసి తీరంలో భారీ డంప్ ఉంచారు. అక్కడి నుంచి రాత్రి కాగానే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక అక్కడి నుంచి తరలుతున్నట్లు అంచనా. నిద్రపోతున్న నిఘా నదికై రవాడి, నాగలదిన్నె గ్రామాల సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం లేదు. కనీసం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో కూడా తనిఖీలు లేవని తెలుస్తోంది. మైనింగ్, విజులెన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో టీడీపీ నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక దందా చేస్తున్న టీడీపీ నాయకులు నాగలదిన్నె బ్రిడ్జి మీదుగా రాత్రి సమయంలో తరలింపు చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు అందిన చేయూత...
పథకం లబ్దిపొందిన రైతులు పొందిన ఆర్థిక లబ్ది (రూ.కోట్లలో) వైఎస్ఆర్ రైతుభరోసా 2,96,973 2,247.98 కరువు ఇన్పుట్ సబ్సిడీ 3,48,726 433.70 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 3,97,111 72.31 వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 2,70,046 1065.51 అధిక వర్షాలకు ఇన్పుట్ సబ్సిడీ 1,39,265 115.29 మొత్తం 3,934.79 -
వానల్లేక పత్తివిత్తనం మొలవలేదు
పదిరోజుల కిందట కురిసిన అరకొర వానలకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఖర్చు పెట్టి ఐదెకరాల్లో పత్తి విత్తనాలు నాటా. అయితే ఇంతవరకు చినుకు జాడలేకుండా పోయింది. భూమిలో పదును లేక పత్తి మొలకలు సరిగా రాలేదు. వచ్చిన మొలకలు కూడా వానల్లేక మొలకదశలోనే ఎండిపోతున్నాయి. ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు ఎలాంటి పరిస్థితులను చూడాలో అర్థం కావడం లేదు. – రాజు, రైతు, గూడూరు వర్షాధారం కింద ఈ ఏడాది 12 ఎకరాల్లో కంది పంట సాగు చేసేందుకు భూమిని దుక్కి దున్ని సిద్ధం చేసుకున్నా. ప్రతి ఏడాది ఈ సమయానికి వర్షాలు సమృద్ధిగా పడేవి. అయితే ఈ సారి సీజన్ ప్రారంభమై మూడువారాలు గడిచినా ఒక్క భారీ వర్షం కూడా లేదు. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. పంటలు సాగు చేయలేని పరిస్థితి వస్తుంది. – మహేశ్వరరెడ్డి, రైతు, వెంకటగిరి గ్రామం, కోడుమూరు మండలం. -
రైతులను పరామర్శిస్తే దాడులా..?
● రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం కర్నూలు పార్లమెంటు కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ కర్నూలు (టౌన్): పూలింగ్కు భూములివ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తున్న విషయం తెలుసుకుని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ మహిళా విభాగం కర్నూలు పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్య నారాయణమ్మ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయడం ఏమిటని, రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక స్వగృహంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ ప్రభుత్వం ఎందుకంత భయపడుతోందన్నారు. మాజీ సీఎంను కలిసిన రైతులను ఇబ్బందులు పెట్టాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పూలింగ్కు భూములు ఇవ్వలేదన్న అక్కసుతో రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలి ముంచేయడం దారుణమన్నారు. రైతులు పిలిస్తే అక్కడికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, పార్టీ అగ్రనేతలపై దాడులకు తెగబడటం తగదని, రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని, దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ శ్రేణుల రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్కు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంశాఖ ఘోరంగా వైఫలమైందన్నారు. జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరుష, అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాదరణ ఉన్న జగనన్నను విమర్శించడం వల్ల విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ నేతల కుట్రలను వైఎస్సార్సీపీ బలంగా తిప్పి కొడుతుందన్నారు. -
రాక్గార్డెన్లో ‘రణబాలి’
● సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నఓర్వకల్లు: రాక్గార్డెన్లో ఆదివారం సినిమా సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రప్మిక మందన్న కథానాయకులుగా నటిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న విలన్కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్కు అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. సినిమా షూటింగ్ను తిలకించేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన రాక్గార్డెన్లో మరోసారి సినిమా సినిమా షూటింగ్తో సందడిగా మారింది. -
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): వ్యక్తిగత దూషణలతో పాటు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో పార్టీ శ్రేణులతో కలిసి శనివారం ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఒక ప్రజాప్రతినిధిగా హుందాగా ఉండాల్సిన పంతం నానాజీ అనుచితంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో విద్వేషాలు, ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023 నిబంధల ప్రకారం ఎమ్మెల్యేతో పాటు వీడియోలు పోస్టు చేసి, ప్రచారం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ● మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని మాజీ ఎంపీపీ కేశన్న డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు సీఐ కంబగిరి రాముడును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య. వక్ప్బోర్డు మాజీ ఉపాద్యక్షులు రియాజ్ అహమ్మద్, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచానీ వెంకటేష్ పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని ఆలూరు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆలూరులో ఎస్ఐ మన్మథ విజయ్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీసీ సెల్ జిల్లా కార్యదర్శి భాస్కర్, మండల కన్వీనర్ మల్లిఖార్జున, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తరగతి భవనాల పూర్తికి చర్యలు
● జేడీ మువ్వా రామలింగం ఎమ్మిగనూరుటౌన్: పాఠశాలల్లో రెండవ విడత నాడు – నేడు కింద చేపట్టిన తరగతి గదుల నిర్మాణాల పూర్తికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మనబడి మన భవిష్యత్ ఇన్ఫ్రా జేడీ మువ్వా రామలింగం అన్నారు. శనివారం పట్టణంలో 3,500 మంది విద్యార్థినులతో నిర్వహిస్తున్న మాచాని సోమప్ప జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను డీఈఓ సుధాకర్, సమగ్రశిక్ష ఏపీసీ లోకరాజ్తో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఓ వ్యాపారవేత్త నిర్మిస్తున్న 8 తరగతి గదుల నిర్మాణాలతో పాటు గతంలో అసంపూర్తిగా వున్న గదులను, నిరుపయోగంగా వున్న ఆర్ఓ ప్లాంట్, పెచ్చులుడిన గదులు, ప్రస్తుతం వున్న మరుగుదొడ్ల సమస్య గురించి తరగతుల్లో విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెయ్యి మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 60కి పైగా వుండగా అందులో కర్నూలు జిల్లాలోనే 20 వున్నాయన్నారు. ఈ జిల్లాలో 67 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వున్నారని తెలిపారు. అసంపూర్తి గదుల నిర్మాణాలకు దాతల సహకారం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ రాజేంద్రప్రసాద్, స్థానిక పలు మండలాల ఎంఈఓలు ఆంజనేయులు, మధుసూదన్రాజు, రామాంజనేయులు, నీలకంఠ, గోవిందుడు, రఘునాథ్, నాగభూషణం, సమగ్ర శిక్ష ఏఈ మురళి, పాఠశాల హెచ్ఎం దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల స్థలానికి కొలతలు
● కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులుఆదోని: ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన ప్రభత్వ పాఠశాల స్థలం కబ్జా జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. ‘పచ్చ నోట్లకు రిజిస్ట్రేషన్’ పేరిట శనివారం వెలువడిన కథనం మీద జిల్లా కలెక్టర్ స్పందించారు. జెడ్పీ సీఈఓ రమణా రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన ఆదేశాల మేరకు ఆదోని మండల పరిషత్ అధికారి నాగరాజు స్వామి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, దొడ్డనగేరి పంచాయతీ సెక్రటరీ ధరణికుమార్తో పాటు జిల్లా విద్యాశాఖ కూడా విచారణలో భాగస్వాములయ్యారు. స్థానిక ఎంఈఓ ఇంద్రావతి, ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి కూడా విచారణలో పాల్గొన్నారు. అధికారులందరూ శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి భూమికి కొలతలు చేపట్టారు. ప్రభుత్వ రికార్డులు, పాఠశాల హద్దులు, రిజిస్ట్రేషన్ వివరాలను సరిపోల్చుతూ సమగ్ర నివేదికను ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అయితే ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ సెక్రటరీ ఈ స్కూల్ స్థలం కబ్జా వ్యవహారంలో తెదేపా మండల నాయకుడు కురువ శివప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణ సందర్భంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని పాత రికార్డులు అందుబాటులో లేవని మండల పంచాయతీ సెక్రటరీ తన సన్నిహితుల దగ్గర చెబుతుండటంతో మరిన్ని అనుమానాలను గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కర్నూలు(హాస్పిటల్): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టరేట్ వద్ద జేసీ నూరుల్ ఖమర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి కర్నూలు మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ సాగింది. డీఐఓ డాక్టర్ ఉమ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు పాల్గొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు రెండు పోలియో చుక్కలతో పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడుకోవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. శనివారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అరబ్ దేశాల నుంచి ఎక్కువ మంది భారతదేశానికి వచ్చేస్తుండటం, పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఇంకా పోలియో కేసులు ఉండటంతో మన దేశ వ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు 3,52,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మొద టి రోజు 28న పోలియో బూత్లలో, ఆ రోజు బూత్ల కు రాని వారికి ఇంటింటికి వెళ్లి 29, 30వ తేదీల్లో వేస్తామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ మాట్లాడుతూ జిల్లాలో 1,630 పోలియో బూత్లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాన్ని జిల్లాలో రాష్ట్ర పరిశీలకులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ వాసు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి ప్రకాష్రాజు పాల్గొన్నారు. -
అంతా దేవ రహస్యం
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో శనివారం జరిగిన టోల్ గేట్ నిర్వహణ వేలం పాటలో టీడీపీ నాయకుల పథకం పారింది. నాయకులందరూ సిండికేట్గా మారి నిబంధనలు అతిక్రమించారు. వాహనాల గేట్ (టోల్ గేట్) వసూలు చేసుకునే హక్కుకు సంబంధించి 2026–27 సంవత్సరానికి నిర్వహించిన వేలంలో అధికారుల తీరుపై పాటదారులు మండిపడుతున్నారు. నాయకులందరూ సిండికేట్కు ఒప్పుకోగా అందుకు పోలీస్, పంచాయతీ అధికారులు సైతం తన వంతు సహకారం అందించారు. అహోబిలం టీటీడీ కల్యాణ మండపంలో వాహనాల గేట్ (టోల్ గేట్) వసూలు చేసుకునే హక్కుకు సంబంధించి శనివారం డీఎల్పీఓ రాంబాబు అధ్యక్షతన వేలం పాటలు నిర్వహించారు. రూ 21,33,550తో వేలం ప్రారంభించగా రూ 25,04,000 సానే సురేష్ అనే వ్యక్తి పాట దక్కించుకున్నారు. పది రోజులుగా గ్రామ నాయకుల మధ్య పంచాయతీ, పోలీస్ అధికారులతో జరిగిన చర్చలో ఎట్టకేలకు రూ. 25 లక్షలకు వేలం పాట పాడినట్లు నటించి రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రూ. 25 లక్షలు రౌండ్ ఫిగర్ బాగుండదని, రూ.25,02,000 వరకు పాడినట్లు చేసి ముందే ఒప్పందం చేసుకున్న వ్యక్తి పేరుపై పాట నిలిపేయాలని, ఈ మేరకు ఎవరూ ఎక్కువ వేలం పాడకూడదని అనధికారిక ఒప్పంద పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం. అయితే పాట జరిగే సమయంలో టీడీపీలోని మరో వర్గం నాయకుడు గూడూరు సంజీవరాయుడు ఉన్నట్టుండి వేలం పాటలో రూ. వెయ్యి పెంచి రూ. 25,03,000కు పాట పాడటంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అంతలో తేరుకుని పక్కనున్న రమణ రూ.30 లక్షలు అంటుండగానే అక్కడే ఉన్న మరో తెలుగు తమ్ముడు అతని నోరు గట్టిగా అదిమిపట్టి మేం మాట్లాడుతాం.. పాడొద్దని చెప్పడం.. ఇదంతా పోలీసులు, అధికారుల ముందే జరగడం గమనార్హం. ఎట్టకేలకు మరో రూ. వెయ్యి పెంచి రూ. 25,04,000కు ముగిసేలా టీడీపీ నేతలు చక్రం తిప్పడంతో అధికారులు, పాటదారులు ఊపిరి పీల్చుకున్నారు. అడుగడుగునా అనుమానాలే.. అహోబిలం గేటు వేలం బహిరంగంగానే అంటూ చివరకు అధికారులు, పోలీసుల రహస్యంగా మారిపోయింది. వేలం పాటలో పాల్గొనేందుకు రెండు మూడు రోజుల నుంచి డబ్బులు సిద్ధం చేసుకుని పాట పాడేందుకు వచ్చిన ఇద్దరు మహిళలను గేటు బయటే నిలబెట్టడం ఆశ్చ్యరానికి గురి చేసింది. మరో టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి వేలం పాటలో పాల్గొనేందుకు తన అనచరులతో పాటు ఓ న్యాయవాదిని సైతం వెంటపెట్టుకుని వస్తుండగా పోలీసులు ఆయనను గేటు దగ్గరే అడ్డుకుని వెనక్కి పంపారు. గ్రామస్తులు తప్ప ఇతరులు పాల్గొనేందుకు అవకాశం లేదని అధికారులు సూచించడంతో గ్రామానికి చెందిన వెలంగయ్య, భాస్కర్రెడ్డిలతో పాట పాడించాలని న్యాయవాది, అనుచరులను పంపించారు. అయితే అందరిని పోలీసులు వేలం పాట జరుగుతున్న హాలు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్రధాన రహదారిలోనే బారికేడ్ల దగ్గరే నిలిపి అక్కడే కూర్చోబెట్టుకున్నారు. వీరినే కాదు కనీసం మీడియాను సైతం అడ్డుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముట్టడంతోనే బహిరంగ వేలాన్ని రహస్య వేలంగా నిర్వహించేందుకు అందరూ ఒక్కటయ్యారని చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయంపై డీఎల్పీవో రాంబాబును వివరణ కోరగా.. గ్రామ సభ సూచనల మేరకు గ్రామస్తులు తప్ప ఇతర ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన కూడదన్న నిబంధన మేరకే వేలం పాటలు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే గ్రామస్తులను బయట నిలిపేసినట్లు తమకు తెలియదన్నారు. అహోబిలం టోల్గేట్ వేలం పాటలో సిండికేట్ మాయ అధికారులు, పోలీసుల సహకారంతో ఫలించిన టీడీపీ నేతల పథకం నిర్ణయించిన ధరకే వేలం దక్కేలా చక్రం తిప్పిన తమ్ముళ్లు పాటదారులను అడ్డుకున్న అధికారులు -
అమరావతిలో రైతులపై దాడి అమానుషం
● రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: అమరాతిలో రైతులపై టీడీపీ గుండాలు దాడి చేయడం అమానుషమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన చిప్పగిరిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రైతుల ఆహ్వానం మేరకే వైఎస్సార్సీపీ కమిటీలోని రైతులు అక్కడి వెళ్లారన్నారు. చంద్రబాబు కలల రాజధానిలో రైతులపై దాడి జరిగితే పోలీసులు కళ్లకు గంతులు కట్టుకున్నారని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఇతర ప్రాంత రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అమరావతికి వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు వస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారు. అమరావతి పేరుతో భూ సేకరణతో రూ.లక్షల కోట్లు దోచుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులపై దాడి చేయడం, దుర్మార్గపు చర్యలకు పాల్పడం రాష్ట్రంలో సాధారణంగా మారిందని విమర్శించారు. -
కారు ఢీకొని బాలుడి మృతి
● మరో ముగ్గురికి గాయాలు గోస్పాడు: తేళ్లపురి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తేళ్ల్లపురి గ్రామానికి చెందిన తిరుపతి మస్తానయ్య, బీబీ దంపతులు వారి ఇద్దరి పిల్లలతో మోటార్ బైక్పై శుక్రవారం సాయంత్రం కానాలపల్లెకు బయలుదేరారు. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన దంపతులు మస్తానయ్య, బీబీ, కుమారుడు మొఘల్ షరీఫ్ (13), కుమార్తె అస్మాలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే షరీఫ్ తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించి మెరుగైన చికిత్స నిమిత్తం శనివారం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బాలుడి తల్లి బీబీ ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
మద్దిలేటయ్యకు పోటెత్తిన భక్తజనం
బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, చెల్లించి మహామంగళహారతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు తీసుకున్నారు. పారా రోయింగ్లో ప్యాపిలి యువకుడి ప్రతిభ ప్యాపిలి: పట్టణానికి చెందిన కొంగనపల్లి వెంకటనారాయణ పారా రోయింగ్లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ నెల 24 నుంచి 27 వ తేదీ వరకు పూణెలో జరిగిన అండర్ 23 నేషనల్ పారా రోయింగ్ చాంపియన్ షిప్లో సింగిల్స్ విభాగంలో నారాయణ తన సత్తా చాటుకున్నాడు. 26వ తేదీన జరిగిన పోటీల్లో రెండు కిలోమీటర్ల దూరాన్ని 8.20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నాడు. 27వ తేదీ జరిగిన పోటీల్లో రెండు కిలో మీటర్ల దూరాన్ని 6.49 నిమిషాల వ్యవధిలో చేరుకున్నాడు. ప్రతిభ చాటుకున్న నారాయణ బంగారు పతకాన్ని సాధించాడు. రూ.700 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రూ.700 కోట్ల కొత్త రుణాలు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించామని చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం డీసీసీబీ బోర్డు సమావేశం మహాజనసభ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1.84 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి డీసీసీబీ ద్వారా అన్నివిధాల సహకరిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 39 సంఘాలు మాత్రమే డీసీసీబీ నుంచి రుణాలు పొందేందుకు అర్హత పొందాయని, మిగిలిన సంఘాలు కూడా రికవరీ పెంచుకొని బడ్జెట్ పొందేందుకు అర్హత పొందాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీసీసీబీ సీఇవో పి.రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఇన్చార్జీ డీసీవో చెన్నమ్మ, నంద్యాల డీసీవో ఎన్.రామాంజనేయులు, ఆప్కాబ్ ప్రతినిధి లావణ్య, డీసీడీఎం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బెదిరింపులకు భయపడను
మంత్రాలయం: చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల తరపున నిరంతరం పోరాడతామని, కార్యకర్తలకు అండగా నిలుస్తామని మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిని ప్రస్తావించడం మాని, నాలుగు గ్రామ పంచాయతీలు, 3 ఆవాస గ్రామాల గురించి ఆలోచించడం శోచనీయమన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన నా గ్రామాలకు మంత్రులను పంపించే వరకు దిగజారడం చూస్తే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదన్నారు. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే ఏడు గ్రామాల్లో 8వేల మంది ఓటర్లు ప్రజా తీర్పును నిర్ణయిస్తారన్నారు. బీసీల ప్రభుత్వం అంటున్నావే, ఏ ఒక్క వాల్మీకి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చావా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బీసీలకు, అన్ని రంగాల్లో కులమతాలకు అతీతంగా మంత్రి పదవులు కేటాయించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేతనైతే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పట్టుకొని సచివాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. రెండు సంవత్సరాల్లో ఉచిత సిలిండర్లు తూతూమంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇచ్చేలోపు కూటమి ప్రభుత్వం ముగుస్తుందన్నారు. గురురాఘవేంద్ర పంపు హౌస్లో దొంగలు మోటార్లను ఎత్తికెళ్ళినా పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి ఈరన్న, కోసిగి ఎంపీపీ ఈరన్న, కౌతాళం మండల కన్వీనర్ ప్రహ్లాద ఆచారి, ఎల్ఎల్సీ డిస్టిబ్యూటర్ మాజీ అధ్యక్షులు ఐరన్గల్ శ్రీనివాసరెడ్డి, లీగల్సెల్ స్టేట్ జాయింట్ కార్యదర్శి గురురాజరావు పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆ
● కర్నూలు నగరంలోని గణేష్నగర్కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు. ● ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిద్ర పట్టక..నిద్ర సరిపోక! పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలు యువత..పెడదోవ ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సంవత్సరం ఓపీ ఐపీ 2020 10,451 -- 2021 15,942 92 2022 19,475 175 2023 23,992 608 2024 26,803 758 2025 28,062 698 2026 13,127 272 మొత్తం 1,37,852 2,603 పెరుగుతున్న మానసిక ఆందోళన బాధితులు యువతలో సొమటోఫాం డిజార్డర్ కేసులు గాంబ్లింగ్, బెట్టింగ్, నెట్ అడిక్షన్తో సమస్యలు ఇతరుల్లో పలు కారణాలతో ఆందోళన కర్నూలు పెద్దాసుపత్రిలో రోజూ 120 మంది దాకా చికిత్స ప్రైవేటులోనూ రెట్టింపు స్థాయిలో వైద్యం -
పీఆర్లో డీఈఈలుగా పది మందికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ, ఏఈఈలుగా విధులు నిర్వహిస్తున్న పది మందికి రెగ్యులర్ డీఈఈలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ ఈఎన్సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఇప్పటి వరకు కొందరు ఇన్చార్జి డీఈఈలుగా, మరికొందరు ఏఈ, ఏఈఈలుగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన వారిలో ఆర్.సతీష్కుమార్ను కర్నూలు పీఐయు సబ్ డివిజన్కు, గూడురు ఏఈఈ నాగరాజును పీఏ టు ఎస్ఈ కర్నూలు, రమణారెడ్డిని పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా నియమించారు. అలాగే విజయభాస్కర్ను పీలేరు, ఆర్ఎల్ ప్రకాష్ను పీఐయు పత్తికొండ, వాహీద్ను నంద్యాల పీఆర్ఐ, వెంకటరెడ్డిని ఆళ్లగడ్డ, ఆయాజ్ను ఆత్మకూరు, మన్నధబాబును పీఏ టు ఈఈ నంద్యాల, రమణను పీఐయు, ఆత్మకూరుకు నియమించారు. కర్నూలు పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా పదోన్నతి పొందిన రమణారెడ్డి శనివారం స్థానిక కార్యాలయంలో ఇన్చార్జి డీఈఈ భాస్కర్రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈఈ నాగిరెడ్డి, రిటైర్డు డీఈఈ రవీంద్రారెడ్డి, ఏఈఈలు అమర్నాథ్, విజయభాస్కర్ తదితరులు రమణారెడ్డికి పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ‘సీమ’ ప్రాజెక్టులపై టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు కర్నూలు (టౌన్): రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. జిల్లా స్థాయిలో ఈ టాస్క్ఫోర్స్ కమిటీలో సభ్యులుగా జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు యాదవ్, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డిని నియమించారు. అలాగే ఆలూరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించారు. ఈ మేరకు శనివారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్లు కర్నూలు(అగ్రికల్చర్): డ్రిప్, స్ప్రింక్లర్లను ఉద్యాన శాఖ ఏపీఎంఐపీ ద్వారా రాయితీపై మంజూరు చేస్తోందని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కే.శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర అన్ని వర్గాల రైతులకు 10 ఎకరాల వరకు 90 శాతం, 10 ఎకరాలకు పైనున్న రైతులకు 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. అన్ని వర్గాల రైతులకు స్ప్రింక్లర్ల యూనిట్ను 50 శాతం రాయి తీపై మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ, ఉద్యాన అధికారుల ద్వారా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సూక్ష్మసేద్యానికి ఆటోమేషన్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని.. మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా సూక్ష్మ సేద్యం చేసుకోవచ్చన్నారు. -
ఖరీఫ్ ఆశలు కరిగిపోతున్నాయ్..!
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు వారాలుగా వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. వర్షాలు తగ్గిపోగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలి తీవ్రత ఎక్కువైంది. దీంతో నేలలోని తేమ త్వరగా ఆవిరై పోతోంది. ఈ నెల మొదటి 10 రోజుల్లో ఆశాజనంగా వర్షాలు పడటంతో మొన్నటి వరకు ఖరీఫ్ పంటల సాగు జోరుగా సాగింది. దీంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అయితే పలు మండలాల్లో అంతంత మాత్రం తేమలో విత్తనం వేయడం వల్ల మొలకలు రాక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 1,08,349 హెక్టార్లలో సాగు అయ్యాయి. ఇందుల్లో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో కంది 5,990 హెక్టార్లు, వేరుశనగ 4,938, ఆముదం 1,970, సజ్జ 285, మొక్కజొన్న 93, కొర్ర 63 హెక్టార్ల ప్రకారం సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 99 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంలో 90 శాతం ఈ నెల 10వ తేదీలోపే నమోదైంది. అంటే రెండు వారాలకుపైగా వర్షాలు లేవు. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమై ఖరీఫ్ సాగుతుందా అనే అనుమానం రైతుల్లో నెలకొంది. పత్తిని కాపాడుకునేదెలా....! పత్తి సాగు చేయాలంటే కనీసం 75 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అప్పుడే విత్తనానికి తగిన తేమ ఉంటుంది. నెల మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. అయితే నల్ల రేగడి నేలల్లో అంతంత మాత్రం తేమలోనే పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల దాదాపు 25 వేల హెక్టార్లలో మొలకలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. 50 శాతం కూడా విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. పత్తి ప్రధానంగా ఆదోని, పెద్దకడుబూరు, మంత్రాలయం, హొళగుంద, దేవనకొండ, ఆస్పరి, మద్దికెర, పత్తికొండ, సీ.బెళగల్, హాలహర్వి, కల్లూరు మండలాల్లో ఎక్కువగా సాగైంది. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో ఇది వరకు సాగు చేసిన పత్తిని ఎలా కాపాడుకోడం ఎలా.. అనేది ప్రశ్నార్థకమైంది. నీటితడి ఇచ్చేందుకు కాలువల్లో చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటకు బిందు సేద్యం సదుపాయం కల్పించుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయితే సూక్ష్మ సేద్యం మంజూరు ప్రక్రియను ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం
ఆదోని అర్బన్: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాటును తనకు తెలియకుండా ఇతరులకు అమ్మేసిన వ్యక్తి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కార్వన్పేటకు చెందిన దంపతులు రామచంద్ర, సంధ్య హెచ్చరించారు. ఈ మేరకు వారు గంగపుత్ర సంఘం సభ్యులతో కలసి అక్రమంగా ప్లాట్ అమ్మేసిన వ్యక్తి ఇంటి ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 2014లో నాన్ లేఅవుట్ కింద ఉన్న 348, 349/3 సర్వేలో ఉన్న మూడున్నర సెంట్ల ప్లాట్ను శివప్రసాద్ నుంచి కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి ఆ ప్లాట్లో బండలు పాతుకుని ఉన్నామన్నారు. అయితే 2025లో లే–అవుట్ చేసి తన ప్లాట్ను వేరే వ్యక్తికి అమ్మేయడంపై శివప్రసాద్ను నిలదీశామన్నారు. డబ్బులు కానీ, ప్లాట్ కానీ తిరిగి ఇవ్వాలని కోరితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు శివప్రసాద్ ఇంటి ముందు ధర్నా కూర్చొంటామని, లేదంటే అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు గంగపుత్ర సంఘం కులస్తులు కోదండ, ప్రకాష్, శ్రీనివాసులు, దీపక్, వీరేష్, వై.పి.నాగరాజ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
40 ఏళ్లుగా..
చిత్రంలో సైకిల్పై కనిపిస్తున్న వ్యక్తి పేరు రఘు. స్థానిక కేడీసీసీ బ్యాంక్లో దాదాపు 25 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని వయస్సు ఇప్పుడు 50 ఏళ్లు కాగా.. 40 ఏళ్ల క్రితం తన నాన్న కొనిచ్చినా సైకిల్ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. ఇతను నివసించే చౌడమ్మ కాలనీలో ఉదయాన్నే ప్రతి ఒక్కరూ అతని సైకిల్ బెల్ చప్పుడు వినాల్సిందే. కుటుంబ అవసరాలకు, బ్యాంకుకు ఇదే సైకిల్పైనే వెళ్తున్నాడు. ఓ వైపు సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరో వైపు పెట్రోల్ ఖర్చులు ఆదా చేస్తున్న రఘు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. – పత్తికొండ -
కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇచ్చేందుకు వస్తూ
పాములపాడు: గుంటూరు నుంచి కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇవ్వడానికి వస్తున్న ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన శుక్రవారం కర్నూలు – గుంటూరు హైవేలో యర్రగూడరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు సొనాలిక షోరూం నుంచి నాలుగు ట్రాక్టర్ ఇంజిన్లు కర్నూలు జిల్లా ఆదోనిలో డెలివరీ ఇచ్చేందుకు డ్రైవర్లు బయల్దేరారు. మార్గమధ్యలో యర్రగూడూరు సమీపంలో కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన డ్రైవర్ తిరుపతయ్య(33) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంట వచ్చిన మరో ట్రాక్టర్ ఇంజిన్ డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్లో డౌన్ లైన్ ట్రాక్పై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, ఎడమ చేతిపై ‘అమ్మ ’అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆకుపచ్చని ఫుల్ టీషర్ట్, గులాబీ, నలుపు, తెలుపు రంగుల పూల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉందని, మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్లు ఆదో ని రైల్వే స్టేషన్లో పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు -
పరీక్షలు రాయండి!
బకాయి ఫీజు కట్టండి.. ● మెస్ బకాయిలు కడితేనే పరీక్షలకు అనుమతి ● పీజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకుఆర్యూ అధికారులు నోటీసులు ● నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ● ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కూటమి ప్రభుత్వం కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. విద్యార్థుల అత్యుత్సాహం, అధికారుల పంతాలు వెరసి విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు వర్సిటీ ప్రతిష్టను మసక బార్చేలా మారుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం వర్సిటీ పునః ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. వర్సిటీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మెస్ బిల్లుల బకాయిలు కట్టకపోవడంతో అధికారులు భోజనం పెట్టకుండా నిలిపేశా రు. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉందని, దాని గురించి ఆలోచించకుండా వెనుకబడిన ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులను కక్ష పూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. వర్సి టీ అభివృద్ధికి వాడాల్సిన ఇంటర్నల్ ఫండ్స్ను వర్సిటీ అభివృద్ధికి వాడకుండా ఉద్యోగులకు జీతాలు అయితే చెల్లిస్తారు కానీ విద్యార్థులు మెస్ ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీ అధికారులేమో మెస్ బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లను నిర్వహించగలమని చెబుతున్నారు. నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వర్సిటీ పరిధిలో పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ 472 మంది, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు వర్సిటీ కళాశాల కేంద్రంతో పాటు నంద్యాల, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అధికారులు చెబుతున్న బకాయిల లెక్కలు ఇలా.. ● పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన బకాయి రూ. 20.70 లక్షలు ● విద్యార్థులు కట్టిన బకాయి రూ. 11.03 లక్షలు ● ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ. 9.66 లక్షలు ● ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 6.20 లక్షలు ● రీయింబర్స్ పోగా ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ.2.64 లక్షలు రాయలసీమ యూనివర్సిటీ పరిపాలన భవనం వర్సిటీలో నోటీసుల జారీతో కలకలం హాస్టల్ బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటేనే హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాయనిస్తామని వర్సిటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వని ఏ ఒక్క విద్యార్థికై నా హాల్ టికెట్లు జారీ చేయొద్దని అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నో డ్యూస్ నోటీస్తో వర్సిటీలో కలకలం రేగుతోంది. గత పది రోజుల నుంచి వర్సిటీలో హాస్టళ్ల బకాయిల గురించి ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసి హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాట కేసు నమోదైంది. వీరిలో నలుగురు విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గతంలో ఇద్దరు విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, ఒక విద్యార్థిపై కేసు నమోదు కావడం జరిగింది. వీరు ఇద్దరు సైతం పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటు చేసుకోడం పట్ల విద్యా వేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎక్కడో ఒక చోటు పుల్స్టాప్ పడకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశఽనం కావడంతో పాటు వర్సిటీ ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్ల మెస్ బకాయిలు చెల్లించాక నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే హాల్ టికెట్స్ ఇచ్చి పరీక్షలకు అనుమతిస్తాం. కొంత ఫీ రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది కాక ఇంకా సుమారు రూ. 2 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు మెస్ బిల్లులు క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాస్టళ్ల నిర్వహణ సులభమవుతుంది. బకాయిలు పేరుకుపోతే నిర్వహణ కష్టమవుతుంది. కొంత మంది విద్యార్థులు రీయింబర్స్మెంట్ వచ్చినా కట్టకపోవడం బాధాకరం. పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులు బకాయిలు చెల్లించి సహకరించాలి. – డాక్టర్ విజయ్కుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూ -
ఈరన్న సన్నిధిలో పీర్ల దేవుడు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యకేత్రం అయిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో వందేళ్ల నాటి ఆచారం కొనసాగింది. మొహర్రం పండుగకు ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలోని పీర్ల దేవుడు మొహర్రం పదవ రోజు (సహదత్) తెల్లవారుజామున ఈరన్న స్వామి దేవాలయంలోకి ఊరేగింపుగా చేరుకుంటారు. పీర్ల దేవుడిరాకతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ కొనసాగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఈ సంప్రదాయం కొనసాగింది. పీర్ల దేవుడు దేవాలయం వద్దకు చేరుకోగానే కోలాహలం మొదలైంది. పీరును ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకులు పూజలు చేసి హారతి పట్టారు. సంప్రదాయ వేడుకను భక్తులు కనులారా తిలకించారు. పాతాళగంగలో గుర్తు తెలియని మృతదేహం శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పాతాళగంగలో శుక్ర వారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా అతని ప్యాంటు జేబులో రేపల్లె – గుంటూరు బస్ టికెట్ లభించిందన్నారు. మృతుని చొక్కాపై డీసెంట్ టైలర్స్ అని లేబుల్ ఉందని, మరే ఇతర ఎటువంటి ఆధారాలు లభించ లేదని తెలిపారు. మృతుడు రేపల్లెకు చెందిన వ్యక్తిగా భావించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9121101192, 9121110 1193కు సమాచారం ఇవ్వాలన్నారు. షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధం ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మైనార్టీ కాలనీ రోడ్డు ప్రాంతంలో కె.శ్రావ్య అనే మహిళకి చెందిన టాటా టియాగో ఈవీ కారు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. తమ ఇంటి ముందు ఉంచగా శుక్రవారం తెల్లవారుజామున కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులో తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. -
ఆటో, బైక్ ఢీ
ఆదోని రూరల్: గణేకల్–పాండవగల్ గ్రామాల మధ్య ఉన్న పాతరయ్యస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఓ యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దతుంబళం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నెమలికల్లు గోవిందు ప్రయాణికులతో మాధవరం నుంచి ఆదోనికి వస్తుండగా, గణేకల్ గ్రామానికి చెందిన అయ్యన్న బైక్పై పాండవగల్లు వైపు వెళ్తుండగా పాతరయ్య దేవాలయ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయ్యన్న(26) తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు వన్నూర్బీ, రెహానా, అయసూన్బీలకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. మద్యం మత్తులో బస్సు నడుపుతూ.. పత్తికొండ: ఫూటుగా మద్యం సేవించి అతివేగంగా ప్రైవేటు బస్సు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తికొండ సీఐ జయన్న, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి శిశిర శుక్రవారం రాత్రి పత్తికొండ పట్టణ శివారులోని హోసూరు బైపాస్ దగ్గర బస్సు ఆపి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...శుక్రవారం సాయంత్రం మంత్రాలయం నుంచి బెంగళూరుకు శ్రీగురు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మంత్రాలయం నుంచే వేగంగా, అడ్డదిడ్డంగా బస్సు నడుపుతూ ప్రయాణికులను బెంబేలెత్తించారు. పలువురు ప్రయాణికులు భయపడి వెంటనే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పత్తికొండ పోలీసులను, ఆదోని ఆర్టీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెంబడించి పత్తికొండ పట్టణ శివారులో నిలిపివేశారు. అనంతరం బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతిగా మద్యం తీసుకున్నట్లు వెల్లడైంది. వెంటనే కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ప్రయాణికులను ఇతర బస్సులలో బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ప్రపంచంలో కర్నూలుకు గుర్తింపు తీసుకొస్తాం
కర్నూలు (టౌన్): జైరాజ్ ఇస్పాత్ కంపెనీ నుంచి అత్యుత్తమైన ఉక్కును ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే కర్నూలుకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తామని జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే గోయెంకా అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని సాయి శక్తి ఏజెన్సీ, నంద్యాల రోడ్డులోని శ్రీ సా యి బిల్డింగ్ మెటీరియల్స్, నందికొట్కూర్ రోడ్డులోని ఆర్థ ట్రేడర్స్లలో జైరాజ్ ఎటూట్ ఎఫ్ఈ 550డీ టీఎంటీ డీలర్ షిప్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. ఉక్కు తయారీ కేంద్రంగా ఉక్కు ప్రపంచ పటంలో కర్నూలు నిలిచిపోతుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో ఏటా మిలియన్ టన్నుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉక్కు పారిశ్రామికవేత్త విక్రమ్ సింహా రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. జిల్లాలో ఒక పెద్ద సమీకృత ఉక్కు తయారీ కేంద్రాన్ని స్థాపించాలన్న జైరాజ్ ఇస్పాత్ నిర్ణయం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశ్రీజైన్, వైస్ ప్రెసిడెంట్ రమ్య కోడాలి, డీలర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. -
నేడు, రేపు ‘సర్’ ప్రత్యేక క్యాంపులు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీలో వెనుకబడిన పోలింగ్ బూత్ల్లో 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకటనారాయణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఇటీవల ఎన్నికల సంఘం డెప్యూటీ కమిషనర్ సర్ ప్రక్రియపై సమీక్షించారన్నారు. ఆ సందర్భంగా చాలా నియోజవకర్గాల్లో ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ, స్వీకరణ నెమ్మదిగా సాగుతున్నట్లు గుర్తించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ల్లో ప్రత్యేక క్యాంపులను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఏడు మండలాల్లో తేలికపాటి వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో వర్షాలు తేలికపాటికే పరిమితమవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. హొళగుందలో 7.2 మి.మీ, కల్లూరులో 2.2, ఆదోనిలో 2.2, చిప్పగిరిలో 1.8, కర్నూలు అర్బన్లో 1.6, కర్నూలు రూరల్లో 1.2, కౌతాళంలో 0.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ నిరాశాజనకంగా మారింది. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ, కంది తదితర విత్తనాలకు డిమాండ్ తగ్గిపోయింది. పత్తి విత్తనాలకు సైతం డిమాండ్ తగ్గిపోవడం గమనార్హం. కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఈనెల 28న ఆదివారం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్కు సంబంధించిన జిల్లా టాస్కు ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 28న బూత్ స్థాయిలో పోలియో చుక్కలు వేస్తారని, ఆ రోజు చుక్కలు వేయించుకొని ఐదేళ్లలోపు పిల్లలకు 29, 30 తేదీల్లో వారి ఇళ్లకే వెళ్లి వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలు 3,52,164 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకోసం 1,630 పోలియో బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవి, మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు, విద్యుత్ ఎస్ఈ ప్రదీప్కుమార్, ఐసీడీఎస్ పీడీ విజయ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి,మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం కర్నూలు: మాదక ద్రవ్యాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎకై ్సజ్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుధీర్ బాబుతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ప్రతి ఒక్కరూ ‘సే నో టు డ్రగ్, ఎస్ టు లైఫ్’ అంటూ నినాదాలు చేస్తూ సమాజంపై డ్రగ్స్ ప్రభావాన్ని ప్లకార్డుల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల మనిషి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వాటిని సేవించడం వల్ల అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటుందన్నారు. యువకు లు డ్రగ్స్ జోలికి వెళ్లరాదని సూచించారు. కార్య క్రమంలో ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, కిషోర్, ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు, రెహనా, వెంకటరాజు, రవితేజ, మారుతి ప్రసాద్తో పాటు ఎకై ్సజ్ సిబ్బంది, ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
● అభివృద్ధి లేకున్నా ఉన్నట్లు లెక్కలు ● సంక్షేమం స్వల్పమే అయినా అద్భుతం అంటూ కితాబు ● సేవా రంగంలో ప్రగతి భేష్ అని అంకెల గారిడీ ● జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ.2,00,522కు చేరిందట! ● అంకెలను చూసి మురిసి పోవాల్సిందే తప్ప.. ప్రగతి కనిపించదు
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లుగా జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. రైతులకు వ్యవసాయం కలసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో పలు బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు సరిగ్గా నడవడం లేదు. ఎలాంటి ప్రగతి లేకున్నా జిల్లాలో జీడీవీఏ ప్రస్తుత ధరల ప్రకారం రూ.50,339 కోట్ల ఉందని జొన్నగిరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జిల్లా అధికారులు ఉంచారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా గ్రాస్ డెవలప్మెంటు వాల్యు (జీడీవీఏ) లెక్కిస్తారు. వ్యవసాయ రంగం ద్వారా రూ.16,596 కోట్లు, పారిశ్రామిక రంగం ద్వారా రూ.9948 కోట్లు, సేవా రంగం ద్వారా రూ.23,795 కోట్లు జీవీఏ సాధించినట్లు లెక్కలు చూపారు. వ్యవసాయ రంగం కుదేలు అధిక వర్షాలతో 2025–26లో వ్యవసాయ, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్పాదకత పూర్తిగా పడిపోగా పంటలకు ధరలు కూడా లేవు. జిల్లాలో 2024–25లో వ్యవసాయ రంగం జీవీఏ రూ.18,164 కోట్లు ఉండగా 2025–26లో రూ.16,596 కోట్లకు పడిపోయింది. అంటే జీవీఏ రూ.1568 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైనట్లు జిల్లా యంత్రాంగం ఇచ్చిన లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఉత్తుత్తి ఉత్పత్తి! పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే 2025 ఖరీఫ్లో పండించిన టమాట మార్కెట్లోకి వచ్చే నాటికి ఈ పరిశ్రమ సిద్దం కావాలి. 2026 ఖరీఫ్లో పండించిన టమాట మార్కెట్లోకి వచ్చే నాటికి కూడా సిద్ధమయ్యే అవకాశం లేదు. ఎమ్మిగనూరు మండలంలో టెక్స్టైల్ పార్క్కు భూమి పూజ చేయడం తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. కాని పారిశ్రామిక రంగంలో అద్భుతమైన స్థూల ఉత్పత్తి సాధించినట్లు లెక్కలు వేశారు. 2025–26లో జిల్లాలో పారిశ్రామిక రంగం ద్వారా జీవీఏ రూ.9,948 కోట్లు ఉన్నట్లు లెక్కలు వేశారు. సేవలు అంతంతమాత్రమే! సేవా రంగంలోకి బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు తదితరవన్నీ వస్తాయి. సేవలకు విలువ కట్టి జీవీఏ లెక్కిస్తారు. 2025–26లో జిల్లాలో సేవా రంగం ద్వారా జీవీఏ రూ. 23,795 కోట్లు సాధించినట్లు లెక్కలు చూపుతుండటం పట్ల నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2025–26లో పశ్చిమాసియా యుద్ధం కారణంగా సేవారంగం కుదేలెంది. కాని సేవా రంగం 2024–25తో పోలిస్తే ప్రగతి సాధించినట్లు లెక్కలు చెబుతుండటం గమనార్హం. అంకెల గారిడీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023–24లో కర్నూలు జిల్లా స్థూల ఉత్పత్తి రూ.46,010 కోట్లు ఉంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైన తర్వాత 2024–25లో సంక్షేమం, అభివృద్ధి లేదు. అయినా రూ. 52,762 కోట్లకు పెరిగినట్లు లెక్కలు ఉన్నాయి. 2025–26లో జిల్లా స్థూల ఉత్పత్తి అమాంతం రూ.54,607 కోట్లకు చేరినట్లు అంకెల గారిడీకి చేశారు. అలాగే జిల్లా తలసరి ఆదాయం 2023–24లో రూ.1,70,304 ఉన్నట్లు తాజాగా లెక్కలు వేశారు. ఈ తలసరి ఆదాయం 2024–25లో రూ.194,723కు చేరినట్లు లెక్కలు వేశారు. 2023–24తో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి లేనే లేదు. కాని తలసరి ఆదాయం మాత్రం గణనీయంగా పెరగడం చంద్రబాబు ప్రభుత్వ అంకెల గారిడీ మహిమగా చెప్పవచ్చు. 2025–26లో తలసరి ఆదాయం మరింత పెరిగినట్లు లెక్కలు వేశారు. తలసరి ఆదాయం 1,94,723 నుంచి 2,00,522కు చేరినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. తలసరి ఆదాయంలో కర్నూలు జిల్లా 24వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా రూ. 2,27,054లతో 20వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆదాయం బాగుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా.. ఈ నెల 18న డోన్ పట్టణంలో వ్యాపారి శ్రీనివాసులశెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ‘వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.. బతకలేం.. ఆదుకోండి’ అంటూ సూసైడ్నోట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నవించుకున్నారు. దా‘రుణాలు’ జరుగుతున్నా తలసరి ఆదాయం పెరిగినట్లు చూపడంపై విమర్శలు వస్తున్నాయి. పొలంలోనే టమాటాలను వదిలేసిన దృశ్యం పెద్దకడబూరులో ఏప్రిల్ నెలలో కనిపించింది. రెతుల పరిస్థితిని తెలుసుకుని పత్తికొండలో నిర్మాణంలో ఉన్న టమాట ప్రాసెసింగ్ యూనిట్ పనుల పురోగతిపై ఉన్నతాధికారులు ఈ నెలలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును మూడు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదు. రెక్కల కష్టం మట్టిపాలు వర్షాలు లేక మిరప పైరును మొలకదశలోనే ట్రాక్టర్తో దున్నేస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో కనిపించింది. నలభై రోజులకు పూత, పిందె రావాల్సి ఉండగా వర్షాలు సరిగా కురవక పోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గింది. మొక్కలకు బింగి తెగులు సోకడంతో వాటిని ట్రాక్టర్లతో దున్నేశారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల వర కు రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వ్యవసాయం బాగుందని, అబద్ధాల లెక్కలు చూపిస్తోంది. -
వైద్యులు లేక.. 108 రాక.. వృద్ధుడి మృతి
హాలహర్వి: సమయానికి 108 అంబులెన్స్ రాక, ఆటోలో అష్టకష్టాలు పడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు లేక ఒక వృద్ధుడు మృతి చెందాడు. హాలహర్వి మండలం పచ్చారపల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీనారాయణ (74) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణను ఒక ఆటోలో పచ్చారపల్లి నుంచి హాలహర్వి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులోలేరు. డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్నర్స్ భోజనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో ఆలూరు అంబులెన్స్ హాలహర్వి ఆసుపత్రికి వచ్చింది. దానిలో బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో పరీక్షించిన ఆలూరు వైద్యులు లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. హాలహర్వి ఆసుపత్రిలో డాక్టర్లు లేక, 108 రాక వృద్ధుడు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేజీబీవీ విద్యార్థినులకు కుళ్లిన అరటి పండ్లు
గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు బుధవారం రాత్రి భోజనం అనంతరం కుళ్లిన అరటి పండ్లను పంపిణీ చేశారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థినులు తినకుండా పాఠశాల బయట డబ్బాలో పడేశారు. అయితే మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వెళ్లడం, అక్కడ డబ్బాలలో కుళ్లిన అరటి పండ్లను చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. వీటిని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అవుతోంది. గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్ విద్యావతిని ప్రశ్నించగా బుధవారం రాత్రి మంచి అరటి పండ్లనే ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీడీఎంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం కోర్సులు కర్నూలు సిటీ: ట్రిపుల్ ఐటీడీఎంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఏఐసీటీఈ–క్యూపీ–పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో–ఆర్డినేటర్ నరేష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ ఫ్యాకల్టీ బోధన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశించిన ప్రోగ్రాంకు వచ్చే నెల 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 200 గంటల వ్యవధితో హైబ్రిడ్ విధానంలో(ఆన్లైన్, ప్రత్యక్ష తరగతులు) నిర్వహిస్తామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో 50 మంది, డ్రోన్ టెక్నాలజీపై 50 మంది అధ్యాపకులకు శిక్షణనిస్తామన్నారు. ప్రత్యక్ష తరగతులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఏఐసీటీఈ క్యూఐపీ పోర్టల్ https://qippg.aicte.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
‘పచ్చ’నోట్లకు రిజిస్ట్రేషన్ !
పాఠశాల స్థలం కబ్జా చేసినా ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. రోజు పాఠశాలకు వెళ్లే ప్రధానోపాధ్యాయుడు కూడా చూసీచూడనట్లు వదిలేశాడు. రెవెన్యూ అధికారులు తమకెందుకని మిన్నకుండిపోయారు. రిజిస్ట్రేషన్ సమయంలోనైనా అడ్డుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ కళ్లకు నోట్ల కట్టలు అడ్డురావడంతో ఏకంగా దాన విక్రయానికి ‘పచ్చ’జెండా ఊపేయడం గమనార్హం. ఏ స్థాయిలోనూ ఎవ్వరూ అడ్డు చెప్పకపోవడంతో పిల్లల ఆటస్థలం ఓ టీడీపీ నేత కుటుంబ పరమైంది. ఆదోని: మండల పరిధిలోని దొడ్డనగేరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి సర్వే నంబర్ 101లో 4.21 ఎకరాల భూమి ఉంది. ఇందులో 11.38 సెంట్ల భూమిని స్థానిక టీడీపీ మండల నాయకుడు కురువ శివప్ప ఆక్రమించాడు. ఆ తర్వాత ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన పలుకుబడిని, నోట్ల కట్లను ఉపయోగించి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్(రిజిస్ట్రేషన్ నంబర్లు: 22567/2024, 14107/2024, 20702/2024) చేయించాడు. అది కూడా తన మనవళ్లు, తన అన్న కుమారుల పేరిట దాన విక్రయం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామస్తులు కొందరు ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఆదివారం పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్, ప్రధానోపాధ్యాయుడు మూడో కంటికి తెలియకుండా పాఠశాల స్థలాన్ని కొలతలు వేసినట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలానికి పన్ను చెల్లించారట! సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు ఏ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లింకు డాక్యుమెంట్లను పరిశీలించడం పరిపాటి. అయితే టీడీపీ నేత పాఠశాల స్థలాన్ని దాన విక్రయం చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఒక్కదానికీ లింకు డాక్యుమెంట్ లేకపోవడం గమనార్హం. దొడ్డనగేరి గ్రామ పంచాయతీలో తన ఖాళీ స్థలం మీద అసెస్మెంట్ నెం.550 మీద పన్ను చెల్లిస్తునట్లు 2024 నాటి రసీదులతో అధికారులు గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఖాళీ స్థలాలకు గుత్త వసూలు చేయరనే విషయం సదరు టీడీపీ నేతకు తెలియకపోయినా, సబ్ రిజిస్ట్రార్ అధికారులు కూడా గుర్తించకపోవడం వారి ధనదాహానికి నిదర్శనం. పాఠశాల స్థలం ‘దానమిచ్చిన’ టీడీపీ నేత గ్రామ కంఠం భూమి అయితే కబ్జా చేసుకోవచ్చా! కబ్జా బాగోతం బయటకు పొక్కడంతో టీడీపీ నేత ఇదంతా గిట్టని వాళ్ల ప్రచారమని చెప్పుకుంటున్నాడు. ఆ భూమి గ్రామ కంఠానికి సంబంధించినదని చెబుతూనే.. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ‘‘నా పెద్దల వల్ల సంపాదించబడిన నా వారసత్వం’’ అని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. సర్వే నెం.101 గ్రామ కంఠం భూమి అయినప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలా దాన విక్రయానికి అంగీకరించారనేది అధికారులకే తెలియాలి. ఇవన్నీ పక్కనపెడితే.. ప్రభుత్వ విద్యా సంస్థకు చెందిన భూమిని ఏకంగా ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. గిఫ్ట్ డీల్ రిజిస్ట్రేషన్ -
పరిహారం ‘ముంచేస్తున్నారు’
కర్నూలు(సెంట్రల్): శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితుల పరిహారం కేసుల విచారణ గురువారం హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–4లో లోక్ అదాలత్లో చేపట్టారు. డ్యాం నిర్మాణ సమయంలో పగిడ్యాల, కొత్తపల్లి, జూపాడుబంగ్లా మండలాలకు చెందిన దా దాపు 57 గ్రామాల రైతుల భూములు బ్యాక్ వాటర్తో నిండిపోయాయి. దీంతో అప్పట్లో ప్రభుత్వం రైతులకు నామమాత్రపు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో కొందరు రైతులు పరిహారం విషయంలో కోర్టుకు వెళ్లారు. దాదాపు 50 ఏళ్ల తరువాత రైతుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఐదేళ్ల క్రితమే అదనపు పరిహారాన్ని మంజూరు చేసింది. అయితే ఎక్కువ మంది రైతులు వ్యక్తి గతంగా కేసులు వేయడంతో వాటిని పరిష్కరించే బాధ్యతను లోక్ అదాలత్ కోర్టులకు అప్పగించారు. 2019 నుంచి విచారణ పూర్తయినా రైతులకు జూలై 11వ తేదీన పరిహారానికి సంబంధించిన చెక్కులు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లోక్ అదాలత్ విచారణ చేపట్టింది. అయితే పరిహారాన్ని గతంలో తీసుకున్నట్లు అధికారులు చెప్పడం బాధిత రైతు కుటుంబాలు అవాక్కయ్యాయి. వచ్చిన పరిహారంలోనూ అన్నీ మోసాలే జరుగుతున్నాయని, అధికారులు, దళారులు కలసి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కొందరు పరిహారం తీసుకున్నారన్న అధికారులు ఆందోళన చెందుతున్న రైతులుమాకు సంబంధించి సర్వే నంబర్ 575/ఏ లో 1.5 ఎకరాల భూమి నీటి ముంపులో వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి అప్పట్లో అవార్డు 3/77 పాసు చేశారు. ఈ భూమికి సంబంధించి ఇటీవల రూ.14,814 మంజూరైంది. అయితే చెక్కులను 2019 జూలై 10వ తేదీనే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మాకు తెలియకుండా ఎవరికి ఇచ్చారో అధికారులకే తెలియాలి. మరో పొలానికి మంజూరైన పరిహారానికి ఇప్పుడు 15 శాతం లంచం అడుగుతున్నారు. – పింజరి జహరాబీ, ఘణపురం, పగిడ్యాల మండలం -
మూల్యాంకనం పారితోషికం చెల్లించాలి
కర్నూలు సిటీ: ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పది పరీక్షల మూల్యాంకనం పారితోషికాన్ని చెల్లించాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు వై.నారాయణ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ప్రధానోపాధ్యాయుల భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే క్లస్టర్ సమావేశాలను మండల కేంద్రంలోని ఒకే పాఠశాలలో కాకుండా ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి రెండు, మూడు పాఠశాలల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చేయనున్న పని సర్దుబాటుకు విద్యార్థుల ఎన్రోల్ను ఈ నెల 23వ తేదీకి కాకుండా జూన్ 30వ తేదీ నాటి నుంచి పరిగణలోకి తీసుకోవాలన్నారు. గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న ఉన్నత పాఠశాలల వాచ్మెన్ల వేతనాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డీసీ హూస్సేన్, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పి.రామచంద్రారెడ్డి, హెడ్ క్వార్టర్స్ కార్యదర్శి పి.అస్లాం, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దుదాం
● పీఆర్ అడిషనల్ కమిషనర్ డా.సుధాకర్రావు కర్నూలు(అర్బన్): స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దుదామని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ డా.సుధాకర్రావు అన్నా రు. గురువారం స్థానిక నందికొట్కూరు రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్స్లో ‘ ఘన వ్యర్థాల నిర్వహణ – నిబంధనలు ’ అనే అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డీపీఓ, డీడీఓ, డీఎల్పీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పీడీఓలకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, తడిపొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో చెత్త నిర్వహణ కార్యక్రమాలను బలోపేతం చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. షెడ్లలో పరిశుభ్రత, పరికరాల నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ ప్రాసెసింగ్పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ల వద్దే తడి, పొడి వ్యర్థాలను వేరుచేయడం అత్యంత ముఖ్యమన్నారు. వర్క్షాప్లో ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డి, కర్నూలు, ఆదోని డీఎల్పీఓలు టీ లక్ష్మి, తిమ్మక్క, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్ పాల్గొన్నారు. బ్యాగులో ఆభరణాలు మాయం ఆదోని అర్బన్: ఓ మహిళ బ్యాగులో రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో వెంటనే ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లతారెడ్డి అనే మహిళ ఆలూరు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు పట్టణం నుంచి ఆదోని బస్సు ఎక్కింది. ఆదోనిలోని కొత్త బస్టాండులో దిగి ఆటోలో తిమ్మారెడ్డి బస్టాండుకు వెళ్లింది. అక్కడ ఆలూరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా.. కండక్టర్కు చూపించేందుకు ఆధార్కార్డు కోసం బ్యాగును తెరిచింది. బ్యాగులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బస్సులో, బస్టాండులో వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో వసతులు కల్పించండి
● ఏపీ స్కూల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ మువ్వా రామలింగంకర్నూలు (సిటీ): జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లన్నింటిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ స్కూల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ మువ్వా రామలింగం అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లాలోని ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు, సమగ్ర శిక్ష ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 760 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని, ఆ స్కూళ్లలో మౌలిక వసతులు సమకూర్చుకోవాలన్నారు. మన బడి – మన భవిష్యత్తు రెండో దశలో ఆగిపోయిన అన్ని స్కూళ్ల పనులు ప్రారంభించాలని, వాటికి కేటాయించిన మిగులు నిధులు వెంటనే ఖర్చు చేయాలన్నారు. ఆర్వో ప్లాంట్లు ఉన్న స్కూళ్లలో షెడ్యూల్ ప్రకారం మరమ్మతులు చేయడానికి సంబంధిత కంపెనీ వారు చర్యలు తీసుకునేలా ఆదేశించామన్నారు. పాఠశాలల్లో ఎక్కడైనా సెంట్రల్, ఈ–ప్రొక్యూర్మెంట్ మెటీరియల్స్ (డెస్క్, ఫ్యాన్, గ్రీన్ బోర్డు, ఆర్వో ప్లాంట్, ఐఏపీ ప్యానెల్స్) అవసరమున్న పాఠశాలలకు బదిలీ చేసుకోవాలని, ఈ పనులన్నిటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలు రచించుకోవాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.సుధాకర్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వి.లోకరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
సందర్శనీయ స్థలాలు చూసేదెట్టా!
శ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీశైలం ఆలయంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సందర్శనకు అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు క్షేత్ర పరిధిలోని సందర్శనీయ స్థలాలను సందర్శిస్తారు. క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ఆలయాలను సందర్శిస్తారు. ప్రస్తుతం సందర్శనీయ స్థలాలను సందర్శించేందుకు భక్తులు ప్రైవేట్ వాహనాలైన జీపులు,ఆ టోలను అశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు శ్రీశైలంలో సందర్శనీయ స్థలాల సందర్శనకు సైట్ సీయింగ్ పేరుతో ఆర్టీసీ బస్సును నడిపేవారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం, శ్రీశైలం డ్యాం తదితర ప్రదేశాలను చూపించి తీసుకువచ్చేవారు. ఇందుకు గాను పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.40 చొప్పున బస్సు చార్జీలు వసూలు చేసేవారు. అప్పట్లో సైట్ సీయింగ్ బస్సును భక్తులు బాగానే అసక్తి చూపారు. అనంతరం పలువురు భక్తులు సొంత వాహనాలు తెచ్చుకోవడం, ఒక ఫ్యామిలీ మొత్తం ప్రైవేట్ వాహనాలైన జీపు, ఆటోలను ప్రత్యేకంగా వారి కోసమే మాట్లాడుకుని తీసుకెళ్లడంతో సైట్ సీయింగ్ వాహనాలపై ఆదరణ తగ్గిపోయింది. దీంతో రవాణా చార్జీలు భారమవడంతో సైట్ సీయింగ్ బస్సును తొలగించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులపై చార్జీల భారం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం సందర్శనీయ స్థలాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ప్రదేశాలను చూపించి తీసుకువచ్చేందుకు క్షేత్రంలో పలు ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. జీపులు, ఆటోలు సైట్సీయింగ్ పేరుతో నడుపుతున్నారు. అయితే ఒక్కో భక్తుడికి రూ.150 నుంచి రూ.200 వరకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో భక్తులపై చార్జీల పేరుతో అదనపు భారం పడుతుంది. సందర్శనీయ స్థలాలు సందర్శించేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ శ్రీశైలంలో సైట్ సీయింగ్ పేరుతో ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలని భక్తులు కోరుతున్నారు. ప్రేవేట్ వాహనాలను అశ్రయిస్తూ జేబులకు చిల్లులు పడుతున్నాయని, ఆర్టీసీ సర్వీసు ఏర్పాటు చేస్తే భద్రతతో పాటు, తక్కువ చార్జీలు ఉండడంతో తమకు వెసులుబాటుగా ఉంటుందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు క్షేత్ర పరిసరాల్లో ఉండే ఉపాలయాలను సందర్శిస్తారు. ప్రైవేట్ వాహనాల్లో వెళితే అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దేవస్థాన ట్రస్ట్బోర్డు, ఈఓ ప్రత్యేక చొరవ చూపి, ఆర్టీసీ అధికారులతో చర్చించి సైట్ సీయింగ్ బస్సును పునరుద్ధరించాలి. గంటకు ఒక బస్సు చొప్పున రెండు ఆర్టీసీ బస్సులు నిరంతరం నడపాలి. తద్వారా సామాన్య భక్తులకు ఎంతో వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా భక్తులు ఉపాలయాలను సందర్శిస్తే మరింత అధ్యాత్మికత పెరుగుతుంది. ఆర్టీసీ కాకపోయినా దేవస్థానం అయిన సైట్ సీయింగ్కు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలి. – రావిపూడి అశోక్కుమార్, కాకుమాను, గుంటూరు జిల్లా శ్రీశైలంలో పర్యాటక స్థలాల సందర్శనకు భక్తుల ఇబ్బందులు కొన్నేళ్ల క్రితం తొలగించిన సైట్ సీయింగ్ బస్సు ప్రైవేట్ జీపులు, ఆటోలను ఆశ్రయిస్తున్న భక్తులు అధిక చార్జీలతో భక్తుల జేబులకు చిల్లులు -
న్యాయస్థానానికే నకిలీ ధ్రువీకరణ పత్రం
● తనకు సంబంధం లేదంటున్న వీఆర్ఓమహానంది: సీతారామపురం గ్రామానికి చెందిన కొందరు న్యాయస్థానానికే నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించడం సంచలనంగా మారింది. గ్రామ రెవెన్యూ అధికారి పేరుతో ఫోర్జరీ సంతకం చేసి తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ పత్రాన్ని నంద్యాల కోర్టుకు సమర్పించడం విమర్శలకు దారితీస్తోంది. సాక్షాత్తు న్యాయస్థానానికే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామానికి చెందిన జమాల్ రెడ్డి గురువారం తెలిపిన వివరాల మేరకు.. జమాల్ రెడ్డి ఇల్లు నిర్మించుకుంటున్న నాలుగు సెంట్ల స్థలానికి సంబంధించి ఇటీవల హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 408 లోని 14.50 సెంట్ల స్థలంలో భాగంగా జమాల్ రెడ్డి తనకు ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో పాత ఇంటిని తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పంచాయతీ అధికారులు అనుమతులు లేవన్న పేరుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు జమాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అన్ని అధికారిక పత్రాలను సమర్పించడంతో ఉన్నత న్యాయస్థానం ఆయన అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో సంతృప్తి చెందని మరో వర్గం నేతలు తాజాగా ఈనెల 6వ తేదీన గ్రామ రెవెన్యూ అధికారి సల్మాన్ ఖాన్ పేరుతో ఫోర్జరీ సంతకం చేస్తూ సంబంధిత స్థలంలో గ్రామానికి చెందిన మరికొందరు పొజిషన్లో ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి న్యాయస్థానానికి సమర్పించారు. ఈ విషయంపై వీఆర్ఓ సల్మాన్ ఖాన్ను సాక్షి వివరణ కోరగా సంబంధిత స్థలానికి సంబంధించి తాను ఎలాంటి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయలేదన్నారు. తన పేరుతో సర్టిఫికెట్ మంజూరు చేయడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పచ్చని చెట్లు నరికివేత
తుగ్గలి: బొందిమడుగులలో నవీన్కుమార్ రెడ్డి సాగు చేసిన మామిడి, టెంకాయ చెట్ల గుర్తు తెలియని దుండగులు నరికేశారు. కర్నూలుకు చెందిన ఇతను 5 ఎకరాల పొలంలో గత రెండేళ్ల క్రితం మామిడి, టెంకాయ చెట్లును నాటారు. మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారు జామున పొలంలోకి చొరబడి చెట్లును కొడవలితో వేరు మొదల్లో నరికి పక్కన పడేసి పోయారు. వ్యక్తిగత కక్షలతో పచ్చని పంటను ధ్వంసం చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. జరిగిన సంఘటనపై బాధితుడు తుగ్గలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు బైకులు దగ్ధం బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రియాంక నగర్ వీధిలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఐదు బైకులను దగ్ధం చేశారు. బాధితులు పవన్కుమార్, హబీబుల్లా మాట్లాడుతూ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇళ్ల ముందు వరుసగా నిలిపిన వాహనా లకు నిప్పుపెట్టారన్నారు. భారీగా మంటలు వ్యాపించటంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే బైకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఎవరో ఆకతాయిలు ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు (అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఐదుగురికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పిస్తూ జిల్లాపరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి జెడ్పీ చైర్మన్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకం పొందిన ఐదుగురికి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నియామక పత్రాలను అందించారు. ఉద్యోగాలు పొందిన వారిలో పి.సతీష్ బాబు, కె.గురురాఘవేంద్రను జూనియర్ అసిస్టెంట్లుగా జిల్లాపరిషత్కు నియమించారు. అలాగే టైపిస్టులుగా కె.మహబూబ్ బాషాను ఎంపీపీ కోసిగి, బి.విష్ణువర్దన్ను పీఆర్ఐ సబ్ డివిజన్ ఆలూ రు, యు.లిఖిత రెడ్డిని పీఆర్ఐ సబ్ డివిజన్ నంద్యాలకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఆలూ రు ఎంపీపీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న జి.గాదిలింగారెడ్డికి రికార్డు అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి హొళగుంద మండలం ఇంగల్దహల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు నియమించారు. అలాగే రికార్డు అసిస్టెంట్/ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్న తి పొందిన పి.సోమశేఖర్ను ఎంపీపీ ఉయ్యాలవాడ, ఎన్.పద్మావతిని జెడ్పీహెచ్ఎస్ రాజనగరం, పి.శేఖర్ను జెడ్పీహెచ్ఎస్ పెద్ద హరివాణంకు పోస్టింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. హత్యకేసులో నిందితుల అరెస్ట్ సి.బెళగల్: పోలకల్ గ్రామంలో పది రోజుల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులోని నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపారు. గురువారం ఆయన కోడుమూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో ఈనెల 15వ తేదీన గ్రామానికి చెందిన పులదాసు జగన్ హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి పులదాసు సుశీల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం గూడూరు మండలం జూలకల్లు గ్రామ శివారులో మహేష్, యోహాన్, దేవరాజు, రాజ్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించి వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
వన్యప్రాణులను బంధిస్తే అదృష్టమా?
ఆత్మకూరురూరల్: వన్యప్రాణి చట్టం పట్ల అవగాహన లేక పోవడం, మూఢమ్మకాల కారణంగా కొంద రు వన్య ప్రాణుల ను పెంచుకుంటుంటారు. ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరం. నక్షత్ర తాబేలును తమకు మేలు కలుగుతుందనే మూఢ నమ్మకంతోనూ చట్టం పట్ల అవగాహన లోపంతో కర్నూలు నగరానికి చెందిన ఓ కుటుంబం కొంత కాలంగా నక్షత్ర తాబేలును పెంచుకుంటోంది. అది వారికి ఎలా లభ్యమైందో తెలియదు కానీ.. అలా పెంచుకోవడం సమస్యకు దారి తీస్తుందని మిత్రుల వల్ల వారు తెలుసుకున్నారు. అయితే ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియక కర్నూలు నగరానికి చెందిన సంఘమిత్ర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులను సంప్రదించారు. ఆ సంస్థకు చెందిన ఇస్మాయిల్ తాబేలును గురువారం ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ (ప్రాజెక్ట్ టైగర్) విగ్నేష్ అపావ్కు అందించారు. దీంతో ఆయన తాబేలును బైర్లూటీలోని వైల్డ్ లైఫ్ డిస్పెన్సరి వైద్యులు వెస్లీకి అప్పగించి సంరక్షించాలన్నారు. వన్యప్రాణులను పెంచుకోవడం చట్ట రీత్యా నేరమని ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైల్డ్ లైఫ్ డిస్పెన్సరి వైద్యులు డాక్టర్ వెస్లీ తెలిపారు. నక్షత్ర తాబేళ్లు అరుదైన వన్యప్రాణులని ఇవి ఇంటిలో ఉంటే అదృష్టమని కొందరు పెంచుకోవడానికి ఇష్ట పడుతున్నారని ఇది వాటి స్మగ్లింగ్కు కారణమవుతోందని అన్నారు. నక్షత్ర తాబేళ్లు నీటిలో నివసించవని అవి గడ్డి మైదానాల్లో ఉంటాయని అన్నారు. తమకు అందిన నక్షత్ర తాబేళు తన సహజ ఆహారపు అలవాటుకు దూరమైనందు వల్ల దాన్ని తిరిగి సహజ అలవాట్లకు మళ్ళించి ఆపై అడవిలో వదులుతామని ఆయన తెలిపారు. -
ముందుకొస్తున్న మగాళ్లు
ఒకప్పుడు మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి. అప్పట్లో మహిళలు అధిక శాతం ఇంటి పనులు చేసుకునేవారు. ఉద్యోగాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. ఈ నేపథ్యంలో మహిళలే అధిక శాతం కు.ని. ఆపరేషన్లకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మగవారు కు.ని ఆపరేషన్ చేయించుకుంటే వారిలో శక్తి తగ్గిపోతుందని, పనులు చేసుకోలేరని భావించేవారు. ఇప్పుడు అవగాహన పెరగడంతో పురుషులు సైతం కు.ని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. 2011 నుంచి 2019 వరకు జిల్లాలో ఒక్క పురుషుడు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వేసక్టమి) చేయించుకోని పరిస్థితి. ఆ తర్వాత ఒక్కొక్కరూ తోడవుతూ ప్రస్తుతం 46 మంది ఆపరేషన్ చేయించుకునే వరకు వచ్చింది. కర్నూలు(హాస్పిటల్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక్కడే కుమారుడు. ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్కు ఒక్కడే కుమారుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తులు, వ్యాపారాలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో సంతానమే ఉండాలి. అయితే ప్రజలను మాత్రం ఒకరు, ఇద్దరు కాదు.. ఎంత మంది పిల్లలను కంటే అంత డబ్బులు ఇస్తానని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఒకరిద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయడమే భారమవుతున్న రోజుల్లో.. సీఎం, ఆయన కుమారుడు పాటించకుండా ప్రజలను సంతానోత్పత్తి యంత్రాలుగా భావించడం గమనార్హం. అయితే ప్రజలు మాత్రం స్పష్టమైన ముందుచూపు, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారనేందుకు ఇటీవలి గణాంకాలే నిదర్శనం. పెరిగిన కు.ని. ఆపరేషన్లు దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి జనాభా పెరుగుదలను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే చాలంటూ విస్తృత ప్రచారం చేయించింది. అప్పట్లో ఏకంగా బలవంతపు కు.ని ఆపరేషన్లు కూడా చేయించారు. అప్పటి నుంచి దేశంలోని ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తూ వచ్చారు. 15 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 35వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యం విధించేవారు. ఈ మేరకు లక్ష్యాన్ని చేరుకునేందుకు బటన్హోల్ ఆపరేషన్లను సైతం ప్రోత్సహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ఓ డాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయించారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని ఎంసీహెచ్ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాటలపై ఆగ్రహావేశాలు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అవసరం మేరకు జనాభా లేదని, జనాభా స్థిరీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకోసం ఒక్కొక్కరు సంతానాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో పలు కార్యక్రమాల్లో చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పాలసీని సైతం రూపొందించారు. అయితే ముఖ్యమంత్రి మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీనికితోడు ఈ పాలసీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దంపతులు ఎప్పటిలానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఒకరిద్దరు పిల్లలను కని పెంచేందుకే ఆపసోపాలు పడుతుంటే అధిక సంతానం కనాలని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంతానం విషయంలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాం. ఎవరి ఆర్థిక స్థోమత, వారి సామాజిక పరిస్థితులను బట్టి సంతానం విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వచ్చే వారికి ఆపరేషన్ చేయించి పంపిస్తున్నాం. అయితే గతంలో మాదిరిగా కు.ని ఆపరేషన్లకు అధిక లక్ష్యాలు విధించి, వాటిని అధిగమించాలని చెప్పడం లేదు. –డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్వో, కర్నూలు సంవత్సరం ట్యూబెక్టమి వేసక్టమి (ఉమ్మడి జిల్లా) 2019-20 16,556 02020-21 7,728 1 2021-22 7,575 1 2023-24 8,836 3 2024-25 8,378 2 2025-26 7,906 46 చంద్రబాబు అధిక సంతానం వ్యాఖ్యలపై అనాసక్తి ఒకరు లేదా ఇద్దరే చాలంటున్న జంటలు అధికమవుతున్న ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి పెరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వేసక్టమి ఆపరేషన్లకు ముందుకొస్తున్న పురుషులు -
ఓటు పాట్లు!
● కర్నూలు నియోజకవర్గంలోని 89వ బూత్కు సంబంధించి ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేస్తే 86వ పోలింగ్ బూత్ ఓటర్ల వివరాలు వస్తున్నాయి. బీఎల్ఓ దగ్గర ఓటర్ల వివరాలు ఉంటాయని ఆయనను అడిగితే మా దగ్గర కూడా ఓటర్ల వివరాలు లేని చెప్పడంతో షఫీ అనే ఓటరు కంగుతిన్నారు. కర్నూలు(సెంట్రల్): ప్రస్తుత కల్లూరు అర్బన్, రూరల్ ప్రాంతాలు 2002లో కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే కర్నూలు ఓటర్లకు సంబంధించి బూత్ నంబర్ల వారీగా కర్నూలు అని ఉండడంతో ఆన్లైన్లో కల్లూరుకు చెందిన ఓటర్ల వివరాలు ఎంత సెర్చ్ చేసినా కనిపించని పరిస్థితి. దీంతో ఓటర్లు 2002 జాబితా కోసం ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోంది. తమకేమి తెలియదని, తాము ఎన్యుమరేషన్ ఫాం మాత్రమే ఇస్తామని, దానిని పూరించి ఇస్తే ఓటు ఉంటుంది.. లేదంటే ఉండదని బీఎల్ఓలు తేల్చి చెబుతుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో మొత్తం 8 నియోజకర్గాలకు సంబంధించి 2,203 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటిలో ప్రతి బూత్కు ఒక్కో బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ను నియమించారు. వీరి దగ్గరే ఆయా బూత్లకు సంబంధించి 2002, 2025 ఓటరు జాబితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్(ఈసీ) చెబుతోంది. అయితే బీఎల్ఓలు మాత్రం తమ దగ్గర ఆయా ఓటరు జాబితాలు లేవని, ఉన్నా ఎంతమందకని ఇస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆయా జాబితాల్లోని ఓటరు వివరాలు మాత్రమే తెలిపినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఎల్ఓలు సహకరించకపోవడంతో నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్యుమరేషన్ ఫాంతో పాటు 2002, 2025 ఓటరు జాబితాల వివరాలను బీఎల్ఓలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. బీఎల్ఓల దగ్గర 2002, 2025 ఓటరు జాబితాలు ఉండాలి. ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ సమయంలో ఓటర్లు అడిగితే ఆయా జాబితాల్లోని వారి ఓటు వివరాలను తెలియజేయాలి. ఎక్కడైనా బీఎల్ఓలు ఓటర్ల వివరాలను చెప్పకపోతే మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బీఎల్ఓల పనే ఓటర్ల వివరాలను చెప్పడం. – సి.వెంకటనారాయణమ్మ, డీఆర్వో ఎన్యుమరేషన్ ఫాం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైనం ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని ఉచిత సలహా బీఎల్ఓల తీరుతో నిరక్షరాస్య ఓటర్లకు ఇబ్బందులు -
1,220 మందితో సమావేశం.. 600 మందితో బందోబస్తు
బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు బలగాలుమంత్రాలయం: జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంత్రాలయం నియోజకవర్గం మాధవరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం కర్ణాటకలోని హొస్పేట్ డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 3.45 గంటలకు మాధవరం గ్రామంలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి సభలో సీఎం ప్రసంగించారు. అయితే పార్టీ సొంత కార్యక్రమమైనా పోలీసుల బందోబస్తు మాత్రం తగ్గలేదు. 1,220 మందితో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షోరాణ్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు ఇద్దరు, సీఐలు 30, ఎస్ఐలు 50 మందితోపాటు 500 మంది కానిస్టేబుళ్లు, 100 మంది ఎపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో బందోబస్తును విమర్శించిన ఇప్పటి టీడీపీ నేతలు, ఈ స్థాయిలో భయాందోళనలకు లోనవుతుండటం చూసి ప్రజలు ముక్కన వేలేసుకుంటున్నారు. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఏడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి మంత్రాలయం మండలంలోని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధీనంలో ఉన్న ఏడు గ్రామాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అవసరమైతే మంత్రులతో అక్కడ ప్రత్యేక క్యాంపెయినింగ్ చేపడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్గా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తిక్కారెడ్డికి కనీసం వేదికపై సీటు దక్కకపోవడం గమనార్హం. నాయకులనే కాదు, ఎవరినైనా వాడుకుని వదిలేసే టీడీపీ కరివేపాకు రాజకీయానికి ఇదొక నిదర్శనం. భక్తుల అవస్థలు తుంగభద్ర–మంత్రాలయం రహదారిని ఆనుకుని మాధవరంలో సభా వేదిక ఏర్పాటు చేశారు. గురువారం కావడంతో మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో పోలీసులు ట్రాఫిక్ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. తుంగభద్ర రైల్వే స్టేషన్కు వెళ్లే భక్తులు నానా అవస్థలు పడ్డారు. భక్తులు ఎంతగా వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. అవసరమైతే మంత్రులు అక్కడే తిష్టవేసి ఎన్నికలను పర్యవేక్షిస్తారు మాధవరం కార్యకర్తల సభలో సీఎం చంద్రబాబు -
డీసీసీబీలో పదోన్నతులకు ఇంటర్వ్యూలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్ ఖాళీలను పదోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదవీ విరమణలు చేయడం ద్వారా రెండు ఏజీఎం పోస్టులు, 4 చీఫ్ మేనేజర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. మామూలుగా అయితే సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు. ఆప్కాబ్ కొత్తగా రూపొందించిన సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం అర్హత కలిగిన వారందరితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సర్వీస్కు మార్కులు ఉంటాయి. ఇంటటర్వ్యూకు మార్కులు ఉంటాయి. రెండింటి మార్కుల ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తారు. 2 ఏజీఎం పోస్టుల భర్తీకి 20 మంది చీఫ్ మేనేజర్లను, 4 చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి 30 మంది మేనేజర్లను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇంటర్వ్యూలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అయితే ఇంటర్వ్యూ ద్వారా పదోన్నతులు ఎవరిని వరించాయనే వివరాలు తెలియాల్సి ఉంది. అంబేడ్కర్ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం(బాలురు, బాలికలు) మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ ర్యాంకు ప్రకారం ఎస్సీ–2 బాలికలకు 267–10,000, ఎస్సీ–3 వారికి 302 – 14,633, ఎస్టీ 947–14,678, బీసీ 02–2999 వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ–2 బాలురు 83–9996, ఎస్సీ–3 వారికి 3–14,504 వరకు, ఎస్టీ 656–14499, బీసీ 10–2500 వరకు మెరిట్ జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. బాలికలకు ఈ నెల 27న దిన్నెదేవరపాడులో ఉదయం 8.30 గంటలకు, బాలురకు ఈ నెల 29న చిన్నటేకూరులో ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 08518–295601 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా జ్యేష్ఠాభిషేకం (అభిద్యేయక అభిషేకం) వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో 108 కలశాలతో కూడిన విశేష తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించి జ్యేష్ఠాభిషేకం పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్వయం తిరుమేనితో (నిజరూప) దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. కొత్తపల్లి: శ్రీశైల దత్తత దేవాలయమైన కొలనుభారతిలో అనధికారికంగా నవచండీ యాగం చేశారని, ఇందుకు సహకరించిన సిబ్బందిపై వేటు వేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన కొంతమంది వ్యక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతులు లేకుండా కొలనుభారతిలో నవచండీ యాగం నిర్వహించారని తెలిపారు. ఈ విషయం తెలిసి శ్రీశైలం దేవస్థానం ఏఈఓ ఫణిధర్ ప్రసాద్తో విచారణ జరిపించామని పేర్కొన్నారు. నవచండీ యాగానికి సహకరించిన ఆలయ సిబ్బంది అయిన శివశంకర్, కె.తిరుపాలును సస్పెండ్ చేశామని వెల్లడించారు. అనధికారికంగా యాగం చేస్తుంటే అధికారులకు సమాచారం ఇవ్వనందుకు పురోహితులు చక్రపాణి శర్మ, శ్రీనివాస శర్మలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పురోహితులపై విచారణ చేసిన పూర్తిగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. అనుమతులు లేకుండా కొంత మంది నవచండీ యాగం చేస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
జొన్నగిరిలో 5వేల ఉద్యోగాలకు ఎంఓయూ ఇప్పించగలరా?
కర్నూలు(టౌన్): ‘సీఎం చంద్రబాబు జొన్నగిరిలో ప్రారంభించింది రెండో దశ గోల్డ్ మైన్ ప్రాజెక్టును. ఇక్కడ ఇప్పటికే మొదటి దశ మైనింగ్ జరుగుతోంది. అయినా చంద్రబాబే కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా చెప్పుకొంటున్నారు. 5 వేల ఉద్యోగాలు వస్తాయని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లు కంపెనీ యాజమాన్యంతో ఎంఓయూ చేయించగలరా’ అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17 ఏల్లు సీఎంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని, కనీసం ఏ ప్రాజెక్టు అయిన తేవడం కానీ, ఇతర ప్రభుత్వాలు ప్రారంభించిన పనిని పూర్తి చేయడం కానీ చేశారా అని నిలదీశారు. పైగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 900 కోట్లు ఖర్చు పెట్టి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కోసం ఆ పనులను నిలిపివేయడం సీమ ప్రజలను, రైతులను దగా చేయడమేనన్నారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం బాబు అవివేకమన్నారు. టీడీపీనే పక్కా క్రిమినల్ పార్టీ అని చెప్పారు. కుల రాజకీయాలకు ఆద్యుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. కాపులకు పౌరుషం లేదా అని కులాలను రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుడికి పోయినా, మసీదుకు పోయినా, చర్చికి పోయినా ఎందుకంత బాధ అని అన్నారు. వైఎస్ జగన్కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జొన్నగిరి గోల్డ్ మైనింగ్కు నోటిఫికేషన్ ఇచ్చారని, 2007లో పనులు ప్రారంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. 2019లో 1500 ఎకరాలు లీజ్కు ఇచ్చారని చెప్పారు. ఈ రోజు అక్కడ పనులు కొత్తగా ప్రారంభించామని చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. – మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సీఎం హోదాలో చంద్రబాబుకు ఏంచేశారు పక్కా క్రిమినల్ పార్టీ టీడీపీనే కాపులకు పౌరుషం లేదా అని రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ కాదా? వైఎస్ జగన్ గుడికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా ఎందుకంత బాధ? వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి -
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేద్దాం
కర్నూలు: మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు.. ఈ మాట విననివారు, ఆ పేర్లు తెలియని వారు అరుదన్నారు. తమాషాగా మొదలై అది లేకుంటే బతకలేమనేంత బానిసలుగా మార్చే శక్తి ఈ మహమ్మారి డ్రగ్స్కు ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి మాట్లాడుతూ వివిధ వయస్సుల వారు, రకరకాల స్థాయిల్లో ఉన్న వారు మత్తు పదార్థాల బారిన పడుతున్నారన్నారు. అన్ని రకాలుగా సతమతమవుతూ తమ కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుస్తున్నారన్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా చెలరేగుతోందని ఈగల్ టీమ్ ఆఫీసర్ ఎలీషా అన్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక వాల్ పోస్టర్లను జడ్జి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం
● విచారణ జరుపుతున్న జిల్లా బాలిక సంరక్షణ అధికారి ఓర్వకల్లు: కొమ్ముచెరువు ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం జరిగింది. పోలీసులు, జిల్లా బాలిక సంరక్షణ అధికారి శారద తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుడుంబాయి తండాకు చెందిన బాలికకు అదే తండాకు చెందిన ప్రసాద్ నాయక్తో గురువారం వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొమ్ముచెరువు దేవాలయంలో వివాహం చేసేందుకు సిద్ధం అవగా.. వధువు తరఫున వచ్చిన సమాచారం మేరకు పోలీసులతో జిల్లా బాలికా సంరక్షణ అధికారిణి శారద అక్కడి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నాయకుల మధ్య వివాహం జరిపించారు. వధూవరులను అధికార పార్టీ నాయకులు ఆశీర్వదించారు. కాగా.. వధువు జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా వాస్తవం బయటకు వచ్చింది. పాఠశాలలో ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం బాలికకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగులో అక్కడి అధికారులు తప్పుడు తేదీతో ఇటీవల జన్మదిన ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇందులో ఏది నిజమైందో అధికారుల పరిశీలనలో తెలియాల్సి ఉంది. -
దిక్కుది‘వాన’ం లేక
వానల్లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలు ఎండిముఖం పట్టడంతో బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన కాంతన్న మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పది రోజుల క్రితం కురిసిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనం నాటాడు. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతోపాటు నీటి వనరులు లేక పత్తి పంట ఎండిపోసాగింది. దీంతో తీవ్ర వేదనలో మునిగిన తండ్రి బాధను చూడలేని ఆయన కుమారుడు ప్రదీప్ ద్విచక్ర వాహనంపై బిందెలతో నీళ్లు తీసుకొచ్చి జగ్గుతో మూడెకరాల్లోని పత్తి మొక్కలకు పోస్తున్నాడు. – ఎమ్మిగనూరు సెంట్రల్జగ్గుతో మొక్కలకు నీరు పోస్తున్న ప్రదీప్ -
‘కట్టలు’ తెగేలా దోపిడీ!
పాణ్యం: ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ వెంట అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అధికారులు చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు బరితెగించారు. అనేకసార్లు గ్రావెల్ను తరలించారు. ఫలితంగా ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ కట్టలు తెగేలా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు, సీనియర్ ఇంజినీర్లు చెబుతున్నారు. గోరుకల్లు జలాశయం వద్ద ప్రధాన కాల్వకు ఆధారంగా ఉండే గ్రావెల్ను సైతం తలిస్తున్నారు. పట్టపగలు భారీ యంత్రాలతో, భారీ టిప్పర్లలో గ్రావెల్ తరలించుకుపోతున్నా ఎలాంటి చర్యలు లేవు. ఎవరైనా సామాన్య ప్రజలు గంప మట్టి తీస్తే నిబంధనలు చెప్పే అఽధికారులు ఇంతలా గ్రావెల్ తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. అఽధికారులకు తెలిసే గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రధాన కాల్వకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఆదివారమే ఎందుకు? ఎస్సార్బీసీ కాల్వ కట్టల నుంచి భారీ యంత్రాలతో గ్రావెల్ను తరలిస్తున్నారు. శనివారం నుంచి తరలిస్తున్నప్పటికీ అధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదనుగా చూసుకున్న అక్రమార్కులు ఆదివారం కూడా తరలించారు. ఈ విషయం చీఫ్ ఇంజినీర్కు తెలియగా.. ఆయన ఆదేశాలతో మధ్యాహ్నసమయంలో గ్రావెల్ తరలింపు ఆపేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఎవ్వరు రాలేదు. ఇదిలా ఉండగా గతంలో పాణ్యం–దుర్వేశి రోడ్డు వేసే క్రమంలో కాంట్రాక్టర్లు గోరుకల్లు మలుపు వద్ద కాల్వకు ఉన్న సపోర్టు గ్రావెల్ను తవ్వారు. తవ్విన గుంతలో నీటి ఊటలు పడ్డాయి. ఉదయానికి దినపత్రికల్లో వార్తలు రావడంతో రాత్రికిరాత్రి గుంతలను పూడ్చి మమ అనిపించుకున్నారు. ఆ గుంతలు తవ్వింది కూడా ఆదివారమే కావడం విశేషం. ఇలా చాలా సార్లు ఆదివారమే గ్రావెల్ను తరలిస్తున్నారు. అధికారులు తనిఖీలకు రాబోరని ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అధికారులు ప్రధాన కాల్వ భఽద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎస్సార్బీసీ కాల్వ వెంట ఇష్టానుసారంగా తవ్వకాలు గతంలో రోడ్డు నిర్మాణానికి గ్రావెల్ తరలింపు చోద్యం చూస్తున్న అధికారులు -
119 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం
● ప్రత్యేకంగా నిలిచిన బేతంచెర్ల మెయిన్ ప్రాథమిక పాఠశాలబేతంచెర్ల: విద్యా వికాసానికి చిరునామాగా, తరతరాల విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన బేతంచెర్ల మెయిన్ ప్రాథమిక పాఠశాల నేటికి ప్రత్యేకతను చాటుకుంటోంది. స్వాతంత్య్రానికి ముందే 1907లో ఈ పాఠశాల ప్రారంభమై, 119 ఏళ్లకు పైగా విద్యా సేవలను అందిస్తూ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానంను సంపాదించుకుంది. మండల కేంద్రమైన బేతంచెర్ల పట్టణంలో ఉన్న ఈ పాఠశాలలో 350 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందింది. ఎన్నో దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టారు. తరగతి గదులను ఆధునీకరించారు. పాఠశాల ఆవరణాన్ని అందగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో పాఠశాల కొత్త రూపు సంతరించుకొని ఆకర్షణీయంగా మారింది. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆట వస్తువులు, క్రీడా సామగ్రిని అందజేస్తూ విద్యతో పాటు క్రీడల అభివృద్ధి కి తోడ్పడుతున్నారు. బేతంచెర్ల ప్రాథమిక పాఠశాలను 1907లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 350 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల అపూర్వ సేవలు అందిస్తోంది. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సాహిస్తున్నాం. – పాపారాయుడు, ప్రధానోపాధ్యాయుడు -
ఏషియన్ గేమ్స్కు కర్నూలు అథ్లెట్ ఎంపిక
కర్నూలు (టౌన్): ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్కు కర్నూలు అథ్లెట్ ఎంపికయ్యారు. అండర్–20 విభాగంలో ఈ అరుదైన ఘనత సాధించారు. ఎమ్మిగనూరు తాలూకా నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన మొగలి వెంకటరామి రెడ్డి బెంగళూరు సాయి హాస్టల్లో అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆల్ ఇండియా స్థాయిలో భువనేశ్వర్లో జరిగిన 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణపతకం సాధించాడు. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వ తేదీ వరకు జపాన్ దేశంలోని నగోయా పట్టణంలో జరిగే ఏషియన్ గేమ్స్–2026 క్రీడలకు ఎంపికయ్యారు. కర్నూలుకు చెందిన వెంకటరామిరెడ్డి ఏషియన్గేమ్స్ క్రీడలకు ఎంపికకావడం హర్షించదగ్గ విషయమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సాక్షి, టాస్క్ ఫోర్స్: డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో గొల్ల రాంభూపాల్ (38) అనుమానాస్పద మృతి బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సొంత సోదరుడు టీడీపీ నాయకుడు గొల్ల చంద్రుడుతో ఆయనకు పొలం తగాద ఉన్నట్లు తెలిసింది. ఎనిమిది నెలల క్రితమే మృతుడిపై చంద్రుడు కుటుంబీకులు దాడి చేసినట్లు అప్పట్లో రూరల్ పోలీసు స్టేషన్లో కేసు సైతం నమోదైంది. వివరాల్లోకి వెళితే.. గొల్ల రాంభూపాల్ బుధవారం తెల్లవారు జామున గ్రామ సమీపంలోని వివాదాస్పద పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గమనించిన స్థానికులు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కర్నూలు నుంచి పోలీసు జాగిలాన్ని రప్పించారు. ఈ జాగిలం పొలం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ నిలబడి పోయింది. చంద్రుడి కుటుంబీకులకు పోలీసులు వంతపాడుతున్నారని, పథకం ప్రకారమే ఈ హత్య జరిగింది అని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. సాయంత్రం మృతదేహాన్ని తీసుకెళ్లి డోన్ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, గ్రామ నాయకుడు రామిరెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని గొల్ల రాంభూపాల్ బంధువులు ఆరోపించారు.అన్నదమ్ముల మధ్య నెలకొన్న స్పల్ప వివాదాన్ని వారు పెద్దదిగా చేశారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్ స్వయంగా మృతుడి బంధువుల వద్దకు వచ్చి మాట్లాడారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల కోసం గ్రామానికి తరలించారు. హత్యే అంటున్న బంధువులు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అన్నే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణ న్యాయం కోసం శవంతో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా -
చంద్రబాబు కర్నూలుకు తీవ్ర అన్యాయం చేశారు
● సీఎం పర్యటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆందోళనకర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు కర్నూలుకు అన్యాయం చేశారని బార్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల అనంతరం ఆగస్టు 14వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా చంద్రబాబు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి తరలించి చంద్రబాబు కర్నూలుకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంను కలిసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు కల్లబొల్లి మాటలు పక్కన పెట్టి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రుడు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు రాజేష్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఓంకార్, మాజీ ఉపాధ్యక్షుడు నిత్యజీవ రాజుతో పాటు న్యాయవాదులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కిందపడి యువకుడు మృతి
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. పట్టణ ఏఎస్ఐ కిష్టప్ప తెలిపిన వివరాలు.. ఎస్సీ కాలనీకి చెందిన లూథర్, అనందమ్మకు మాదిగ చిన్న, మాదిగ అభి (19) సంతానం. మద్యానికి బానిసైన అభి రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి అన్నతో గొడవపెట్టుకున్నాడు. ఇరువురిని కాలనీ వాసులు సర్దిచెప్పారు. తర్వాత మద్యం మత్తులో నడుచుకుంటూ బయటకు వెళ్తూ అభి కిందపడిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఏఎస్ఐ కిష్టప్ప తెలిపారు. వెలుగోడులో చోరీ వెలుగోడు: మండలకేంద్రం వెలుగోడులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. గాంధీనగర్లో నివసించే ఒంటరి మహిళ దాసరి సుభాషిణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈనెల 22వ తేదీ ఉదయం కర్నూలుకు చికిత్స కోసం వెళ్లి 23వ తేదీ మధ్యాహ్నం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడిఉండటం, దాచిపెట్టుకున్న రెండున్నర తులాల బంగారు గొలుసు, 5 తులాల వెండి పట్టీలు, రూ.50వేలు నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. వక్కను మింగిన చిన్నారి ● ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు కర్నూలు (హాస్పిటల్): ప్రమాదవశాత్తు పెద్ద పరిమాణంలో ఉన్న గుండ్రని వక్కను మింగిన మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్సను కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు. బుధవారం చికిత్స వివరాలను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్ సమద్, పీడియాట్రిస్ట్ డాక్టర్ సింధూర వివరించారు. కర్నూలుకు చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల అనుకోకుండా వక్కను మింగడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకురాగా ఎండోస్కోపీ ద్వారా పరీక్షించి గొంతులోని పోస్ట్ క్రికోయెడ్ ప్రాంతంలో వక్క ఇరుక్కుపోయినట్లు గుర్తించామన్నారు. చిన్నారి వయస్సు, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనస్థిటిస్ట్ సహాయంతో వక్కను జాగ్రత్తగా తొలగించినట్లు తెలిపారు. చిన్నపిల్లలు వక్కలు, నాణేలు, గోలీలు, చిన్న బొమ్మల భాగాలు, బ్యాటరీలు వంటి వస్తువులను అనుకోకుండా మింగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులు ఇలాంటి వస్తువులు వారికి అందకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా వస్తువు మింగినట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడవచ్చన్నారు. లారీ ఢీకొని బైకిస్టు దుర్మరణం వెల్దుర్తి: పట్టణ పరిధిలోని డోన్ రైల్వే గేట్ల అవతల ఉన్న హైవే 44 సర్కిల్లో ఆగి ఉన్న బైక్ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన అమర్ (34) కర్నూలు ఐసీఐసీఐ బ్యాంకు ఫైనాన్స్ రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. వెల్దుర్తి, డోన్ మండల పరిధిలో విధి నిర్వహణ పూర్తి చేసుకుని డోన్ వైపు నుంచి హైవే మీదుగా కర్నూలు బయలు దేరాడు. రాత్రి వెల్దుర్తి సమీపంలోకి రాగానే టీ తాగేందుకు సర్కిల్ పక్కన ఉన్న హోటల్ ఎదురుగా బైక్ ఆపాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో బైక్పై కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కర్నూలు వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ అదుపుతప్పి హోటల్ వైపు దూసుకొచ్చి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో అమర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హోటల్ వద్ద ఉన్న వారు లారీ దూసుకురావడాన్ని గమనించి పరుగులు పెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
పోలీసుల చిత్రహింసలతోనే గంగమ్మ చనిపోయారు
● మానవ హక్కుల వేదిక నాయకుల ఆరోపణ ఆదోని: మాల వీరేంద్ర అదృశ్యం, హత్య కేసు దర్యాప్తు పేరుతో సిట్ పోలీసులు అమానుషంగా వ్యవహరించడం వల్లే బదినేహాల్ గ్రామానికి చెందిన దళిత మహిళ మాల గంగమ్మ మృతి చెందారని మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు ఉరుకుందప్ప, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు నర్సన్న ఆరోపించారు. ముగ్గురు సభ్యులతో కూడిన వాస్తవ నిర్ధారణ బృందం బుధవారం బదినేహాళ్ గ్రామానికి చేరుకొని స్థానికులు, గంగమ్మ కుటుంబ సభ్యులు, కౌతాళం పోలీసులను కలిసి వివరాలు సేకరించింది. అనంతరం గంగమ్మ మృతిపై ఆ బృంద సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం గంగమ్మను, ఆమెతో సహజీవనం చేసే దర్గయ్యను చిత్రహింసలకు గురి చేసిందని ఆరోపించారు. పోలీసులు చెప్పినట్లుగా గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందితే పోస్టు మార్టం ఎందుకు నిర్వహించారు, భారీ పోలీసు బందోబస్తు మధ్య హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్గయ్యను సైతం ఎవరూ కలవకుండా పోలీసులు అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
మామ అంత్యక్రియలు ముగిసిన వెంటనే అల్లుడి మృతి
● సి.బెళగల్లో అలుముకున్న విషాదంసి.బెళగల్: మేనమామ అంత్యక్రియలు ముగిసిన వెంటనే అల్లుడు మృతి చెందాడు. సి.బెళగల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి ముందరింటి వెంకటేష్ అలియాస్ టీజీ వెంకటేష్ అనారోగ్య సమస్యలతో సోమవారం మృతి చెందాడు. ఈయన పెద్ద కుమారుడు వంశీ జార్జీయా దేశంలో ఎంబీబీఎస్ చదువుతుండటంతో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. ముందరింటి వెంకటేష్ మొదటి చెల్లి మంగమ్మను గ్రామంలోని బుసప్పకు ఇచ్చి 30 ఏళ్ల క్రితం వివాహరం చేశారు. వీరి ఇద్దరి కుమారుల్లో చిన్న రంగన్న (22) పెద్ద కుమారుడు. మేనమామ అయిన ముందరింటి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందినప్పటి నుంచి కూలి పనులు చేసే చిన్న రంగన్న దుఃఖంలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం మామ అంత్యక్రియల అనంతరం తమ ఇంట్లో స్నానం ముగించుకుని బయటకు వస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుల దగ్గర చూపించిన అనంతరం వైద్యం కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబంలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకోవడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి ముందరింటి వెంకటేష్ అంత్యక్రియల్లో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ముందరింటి వెంకటేష్ పాడెను మాజీ ఎమ్మెల్యే మోసి, తన సంతాపం తెలియజేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్రెడ్డి, నాయకులు నాగేశ్వరరెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న రంగన్న, ముందరింటి వెంకటేష్ (ఫైల్) -
28 న ఒలింపిక్ డే రన్
కర్నూలు (టౌన్): ఈ నెల 28 వ తేదీన కర్నూలులో ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఒలింపిక్ డేను పురస్కరించుకొని బాస్కెట్బాల్, కబడ్డీ, బాక్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. అలాగే మాంటిస్సోరి పాఠశాలలో బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వివిధ క్రీడాంశాల్లో పాఠశాలల్లో పోటీలు నిర్వహించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కాగా కబడ్డీ పోటీలను జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు గుడిపల్లి సురేందర్, ఖోఖో పోటీలను హాకీ అసోసియేషన్ ప్రతినిధి దాసరి సుధీర్ ప్రారంభించారు. పోటీల నిహకులు కొండేపి చిన్న సుంకన్న, ప్రతాప్ పాల్గొన్నారు. -
రమణీయం.. సుదర్శనమూర్తి జయంతి ఉత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ సుదర్శన మూర్తి జయంతి వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే దిగువఅహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ సుదర్శన మూర్తులను కొలువుంచారు. నవకలశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ సదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున సుదర్శన హోమం నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహించారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కలిగి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని భక్తుల విశ్వాసం. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. నేడు స్వాతి వేడుకలు స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు జేష్టాభిషేక వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభిషేకం, అర్చనలు చేస్తారు. అనంతరం గరుడ సేవ కార్యక్రమాలు ఉంటాయి. -
తాగునీరో రామచంద్రా
కూటమి సర్కారు మాటలకు చేతలకు పొంతన ఉండదు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేస్తామని హడావుడి చేసింది. తీరా అరకొర ఇచ్చి చేతులు దులుపుకుంది. తల్లికి వందనం పథకం కింద సాయమని గాలిలో దీపంగా మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేదల పిల్లలు చదువుతారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అంటే అవి లేవు. కర్నూలు కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూలే ఇందుకు నిదర్శనం. బుధవారం ఈ పాఠశాల విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్న భోజనం సమయంలో పలువురు విద్యార్థులు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు చేతపట్టుకొని బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకొని దాహం తీర్చుకున్నారు. ఆ విద్యార్థులతోనే టీచర్లు కూల్ వాటర్ క్యాన్లు తెప్పించుకోవడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
దినసరి కూలీలతో ఆర్భాటం
డోన్: తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రాక సందర్భంగా డోన్ రెవెన్యూ, పోలీస్ అధికారులు దినసరి కూలీలతో ఆర్భాటం చేశారు. కోడుమూరు, కర్నూలు నుంచి పలువురు మహిళలను, యవకులను దినసరి కూలీపై డోన్కు తరలించారు. డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద గల షాదీఖానాలో వారికి వసతి ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పలు ప్రైవేట్ వాహనాల్లో వారిని జొన్నగిరికి తరలించారు. వీరికి ప్రతి ఒక్కరికి మైసూర్ గోల్డ్మైన్స్ అనే టీ షర్ట్లను, టోపీలను ఇచ్చారు. సీఎం కార్యక్రమానికి బౌన్సర్లు(రక్షణగా)గా పని చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ....800 వేతనం ఇస్తూ, భోజన వసతి కల్పిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు జొన్నగిరిలో పాల్గొనే సభకు తాము బౌన్సర్లుగా వెళ్లామన్నారు. -
స్నేహితురాలు మాట్లాడలేదని యువకుడి ఆత్మహత్య
కర్నూలు: ఫోన్లో మాట్లాడేందుకు స్నేహితురాలు నిరాకరించినందుకు మనస్తాపానికి గురైన ఓ యువకుడు కర్నూలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు (24) కల్లూరులోని శివప్ప నగర్లో గది అద్దెకు తీసుకుని నాలుగు సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం తన స్నేహితురాలికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే రూమ్కు చేరుకుని ఉరి నుంచి తప్పించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుని తండ్రి ప్రస్తుతం గుంటూరులో ఉన్నారు. ఆయన కర్నూలుకు చేరుకున్న తర్వాత పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తారని బంధువులు పోలీసులకు తెలిపారు. నాల్గవ పట్టణ పోలీసులు సంఘటనపై బంధువులతో ఆరా తీస్తున్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ద్వారా రూ.3,72,40,530 సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మే 3 తేదీ నుంచి 21 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ.3,61,40,030, నాణేలా రూపంలో రూ.11,02,500 వచ్చినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 67 గ్రాముల బంగారం, 511 గ్రాముల వెండి కానుకలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్ పాల్గొన్నారు. కేఎంసీకి 250 ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని 250 ఎంబీబీఎస్ సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్(పునరుద్ధరణ) చేసింది. 45 రోజుల్లోగా కళాశాలలో మౌలిక సదుపాయాలు, వైద్యపరమైన లోపాలను సరిదిద్దుకోవాలని షరతు విధించింది. ఎన్ఎంసీ పరిశీలనలో కళాశాలలో కనీస ప్రమాణాల ప్రకారం కొన్ని లోపాలను గుర్తించారు. అయినప్పటికీ 2026–27 విద్యాసంవత్సరం కోసం అధ్యాపకుల లభ్యత, భౌతిక సౌకర్యాలను సరిదిద్దడంలో విఫలమైతే సీట్ల తగ్గింపు లేదా ప్రవేశాల నిలిపివేత సహా శిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సూచించింది. అయితే తాము కళాశాలకు సంబంధించి అన్ని వివరాలను ఎన్ఎంసీకి పంపించామని, వారు కేవలం ఆఖరి పేజీని చూసి లోపాలు ఉన్నట్లు పొరపాటు పడ్డారని, ఈ మేరకు తిరిగి వివరాలను ఆధారాలతో సహా పంపిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేర్కొన్నారు. చదువుకుంటాను.. సీటు కేటాయించండి! ● కేజీబీవీ ఎదుట విద్యార్థిని నిరసన కోసిగి: చదువుకుంటాను కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సీటు కేటాయించాలని కౌతాళం మండలం కరణి గ్రామానికి చెందిన శృతి, విద్యార్థిని తల్లిదండ్రులు మహాదేవి, గోవిందులు కోరారు. బుధవారం కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట విద్యార్థినితో కలిసి తల్లిదండ్రులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శృతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కుటుంబపోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లామని, తమ కుమార్తెకు మంత్రాలయం, కౌతాళం, కోసిగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో సీటు దొరకలేదన్నారు. తమ కుమార్తెకు సీటు ఇవ్వకపోతే తమతో పాటు కూలీ పనులకు తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. జిల్లా ఉన్నత విద్యాధికారులు స్పందించి తమ కుమార్తెకు సీటు కేటాయించి ఆదుకోవాలని కోరారు. పదవీ కాలం ఆరునెలల పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఉన్న పాలకవర్గంలో ఒకరిని మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న చింతల నాగకుమార్ స్థానంలో తోట రామభూపాల్ నియమితులయ్యారు. పాలకవర్గంలో మిగిలిన వారందరూ యథతథంగా కొనసాగుతారు. ఆలూరు ఫస్ట్.. కర్నూలు లాస్ట్ కర్నూలు(సెంట్రల్): జూన్ 15 నుంచి ప్రారంభమైన సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీలో ఆలూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలువగా.. కర్నూలు నియోజకవర్గం చివరి స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు జిల్లా మొత్తంగా 20,86,119 మంది ఓటర్లలో 16,10,793 మందికి ఎన్యుమరేషన్ ఫాంలను పంపిణీ చేశారు. ఆన్లైన్ ద్వారా 52,506 మంది ఎన్యుమరేషన్ ఫాంలను సమర్పించారు. వీరంతా ఫాంలను త్వరలో తమ దగ్గరకు వచ్చే బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. -
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం ఐటీడీఏ వెలుగు ఏపీడీ పీక్లా నాయక్, ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు మేనేజర్ కె.జి.నాయక్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ బల్మూరి పరమేశ్ ఆధ్వర్యంలో పల్నాడు, నంద్యాల, మార్కాపురం జిల్లాల నుంచి 250 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
ఆస్పరి: హిందూ, ముస్లింలు కలసి కట్టుగా జరపుకునే మొహర్రం పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందువులు కూడా ఈపండుగను సంక్రాంతి, దీపావళి, ఉగాది, దసరాలతో సమానంగా ప్రాధాన్యతనిస్తూ జరుపుకుంటారు. ఆస్పరిలో పెద్ద పీర్లను భక్తిశ్రద్ధలతో అన్ని వర్గాల ప్రజలు కొలుస్తారు. పెద్ద పీర్లకు భక్తులు కానుకనగా ఇచ్చిన వెండి రూపాయి, అర్ధరూపాయి, పావులా, అణాలను గ్రామస్తులు భద్రపరిచారు. వీటిని ప్రతి ఏడాది జరిగే మొహర్రం వేడుకల్లో పెద్ద పీర్లకు అలంకరిస్తారు. చాలా గ్రామాల్లో పీర్లను మోసేటప్పుడు రెండు చేతులు ఉపయోగిస్తారు. ఆస్పరిలో మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు ఒకే వ్యక్తి 50 కేజీలు బరువున్న పెద్ద పీర్లను నాలుగు గంటల పాటు ఒంటి చేత్తోనే పీర్లను తీసుకెళ్లడం ప్రత్యేకం. -
వార్డు మెంబర్గా గెలవలేని నువ్వా విమర్శించేది!
● టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్: వార్డు మెంబర్గా గెలవలేని వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన గుడిసె కృష్ణమ్మ తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఘాటుగా స్పందించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వేతనం తీసుకొని అసెంబ్లీకి వెళ్లకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నాడని టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. అయితే గ్రామా ల్లో లభిస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకనే గిట్టని వ్యక్తులను టీడీపీ నేతలు దాడులకు పురమాయిస్తున్నారన్నారు. వైకుంఠం జ్యోతి చుట్టూ పోలీసులను పెట్టుకొని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి వెళ్లని విషయం మర్చిపోయారా? ఆలూరు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం లేదని, అక్కడికి వెళ్లి సమస్యలు పరిష్కారానికి మాట్లాడాలని టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడు నెలల క్రితం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకోలేదా అని ప్రశ్నించారు. వైకుంఠం జ్యోతి ఇచ్చిన లక్షల రూపాయలకు అమ్ముడుపోయి గుడిసె కృష్ణమ్మ ఓ బీసీ ఎమ్మెల్యేపై అర్థ్ధరహితమైన విమర్శలు చేయడం తగదన్నారు. 2009లో ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ ఇంచార్జ్గా బాధ్యతలు చేపట్టిన 8 నెలల్లోనే బోయ, కురువ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన సొంత పార్టీ కార్యకర్తలపైనే వైకుంఠం జ్యోతి దాడి చేయించారన్నారు. ఆలూరు అభివృద్ధికి రూ. కోట్లు తెచ్చినట్లు అబద్దపు మాటలు చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉండి నేను ఏం చేశానని మాట్లాడుతున్నారని.. ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అప్పుడు మంత్రిగా ఉన్నారని, ఆ విషయం ఆయన్ను అడగాలన్నారు. ఓ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ ఇవ్వడం తెలియదా? ఎమ్మెల్యేగా తనకు కల్పించాల్సిన ప్రొటోకాల్ విషయంలో జిల్లా ఎస్పీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎలాంటి పదవి లేకపోయినా వైకుంఠం జ్యోతి చుట్టూ ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 20 మంది పోలీసుల బందోబస్తు కల్పించడం ఎంతవరకు సమంజసమో పోలీసుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా టీడీపీ నేతలు రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, ఎల్లప్ప, భాస్కర్, ఉరుకుందు, నాగప్ప, మల్లయ్య, రాజు, వరుణ్, బాషా, హనుమంతప్ప, గౌస్ పాల్గొన్నారు. -
జిల్లా పశుగణాభివృద్ధి శాఖ డీడీకి పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుగణాభివృద్ధి శాఖ కార్యనిర్వహణాధికారి(డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.రాజశేఖర్కు జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈయనను జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఇదే పోస్టులో డాక్టర్ రాజశేఖర్ పూర్తి అదనపు బాధ్యతలతో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా పదోన్నతిపై రెగ్యులర్ జేడీగా నియమితులయ్యారు. ఖాళీ అవుతున్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి పోస్టును డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారితో రెండు, మూడు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. -
నేడు జిల్లాకు సీఎం
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూరు కంపెనీ ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ కంపెనీలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న మొదటి ప్లాంట్కు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే రెండో ప్లాంట్కు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ నేతృత్వంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. కంపెనీ వెలుపల నిర్వహించే బహిరంగ సభ, పార్టీ నాయకులతో మీటింగ్కు వేదికలను సిద్ధం చేశారు. దాదాపు 1,500 మంది పోలీసులతో పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటైంది. 916 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో జూన్ నెల 4,45,769 పింఛన్లు ఉండగా.. జూలైలో 4,44,853కు తగ్గిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే 916 పింఛన్లపై కోతపడింది. ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వకపోవడం గమనార్హం. జూలై నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.194.43 కోట్లు బ్యాంకుల వారీగా నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 29 నుంచి సహకార వారోత్సవాలు కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ సహకార వారోత్సవాలు ఈ నెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమై సహకార శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. వారోత్సవాల్లో జిల్లా సహకార అధికారులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఇతర సహకార సంస్థలు పాల్గొననున్నాయి. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై జూలై 6వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతి జిల్లాలో వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజీ ప్లాన్ స్కీమ్ కింద రూ.2 కోట్లతో గోదాము నిర్మించనున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,900 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి జూలై 6న భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీసీ టీవీ ఇన్స్టలేషన్, రిపేరీపై ఉచిత శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సీసీ టీవీ కెమెరా అమర్చడం(ఇన్స్టలేషన్), రిపేరీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు. జూలై నెల 7 నుంచి శిక్షణా కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సుకు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్కార్డు కలిగిన 19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు నిరుద్యోగ యువకులు మాత్రమేనని అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 08518–273710, 90007 10508, 96662 24931, 94409 05477 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. జిల్లాలో మూడు రోజులు వర్షాలు ఎమ్మిగనూరు సెంటల్ర్: జిల్లాలో ఈ నెల 24, 26, 27వ తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ వయన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. -
ఆర్యూ పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలకు 463 మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారరు. సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్ పరీక్షలకు 48 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్ ఆకస్మిక తనిఖీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్నాయుడు మంగళవారం కల్యాణకట్ట, కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అందరూ కూడా సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు, కౌంటర్ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంపై ప్రచురించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఫోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ 15100కు కాల్ చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్, లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి వరకు ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్
● కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన అధికారులు కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో స్పష్టత కోసం కొంత ఆలస్యంగానే కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. కూర్చునేందుకు సరైన సదుపాయాలు లేక ఎంటీఎస్ టీచర్లు అవస్థలు పడ్డారు. కనీసం తాగేందుకు కూడా నీటి సదుపాయం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 149, అలాగే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లలో పనిచేసే వారికి కౌన్సెలింగ్ నిర్వహించ లేదని తెలుస్తోంది. కొత్త టీచర్లు వచ్చేంత వరకు అక్కడే పని చేయాల్సి ఉంటుందని అధికారులు వారికి సూచించారు. కౌన్సెలింగ్ను డీఈఓ ఎల్.సుధాకర్, డిప్యూటీ డీఈఓ శ్రీధర్ బాబు పర్యవేక్షించారు. -
ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గడ్డిమేలు తలపెట్టండి!
రోళ్లపాడు గడ్డి మైదానంలో కృష్ణ జింకలుఎన్ఎస్టీఆర్లో అరుదైన గడ్డి మైదానాలుఆత్మకూరురూరల్: పర్యావరణమంటే భూమిపై ఉండే సమస్త భూ ఉపరితల ఆవరణమని తెలుసుకోవాలి. అడవులను సంరక్షించడం ఒక్కటే సమగ్ర పర్యావరణ రక్షణ కాదు. విశాలమైన పచ్చికబయళ్లు, పొద లు, గుల్మాలతో కూడిన గడ్డితో మైదానాలు కూడా. ఇవి పర్యావరణ సమతుల్యతకు విశేషంగా దోహద పడుతున్నావి. సాధారణ గడ్డి మైదానాలు జీవవైవిధ్యానికి ఇతోదికంగా ఉపయోగ పడుతున్నప్పటికీ వాటిని గ్రేజింగ్ (పశువులు మేసే బీళ్లు) గానో, బంజరులు గానో రెవెన్యూ రికార్డులు వర్గీకరిస్తున్నాయి కానీ వాటి సంరక్షణకు ఇప్పటికీ ప్రత్యేక చట్టాలు లేవు. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న రోళ్లపాడు గడ్డి మైదానాలు క్షీణదశకు చేరుకుంటున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించలేక పోతున్నారు. బట్టమేకపక్షి సంరక్షణ కేంద్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో చోటు చేసుకున్న పెను మార్పులు గుర్తించక పోవడంతో ఈ మైదానం పర్యావరణ సమతుల్యతకు కృషి చేయలేక పోతోంది. రోళ్లపాడు అభయారణ్యంలో ఇప్పటికే బట్టమేక పక్షి జాడ కనిపించడం లేదు. గడ్డి మైదానాల్లో ఉండాల్సిన పొదలు, గుల్మాల వంటి వాటిని తొలగించడంతో ఇక్కడ ఉండాల్సిన ప్రధాన మాంసాహార జంతువు తోడేలు జీవనం ప్రమాదంలో పడుతోంది. పలు ప్యాక్ (గుంపు)లుగా ఉన్న తోడేళ్లు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. క్షీణతకు కారణాలివే.. రోళ్లపాడు వంటి ప్రధాన గడ్డి మైదానాల ప్రాంతం ఒకప్పుడు మోకాటి ఎత్తు గడ్డిలో పలు రకాల కీటక జాతులకు ఆలవాలంగా ఉండేది. ఈ గడ్డి మైదానాల్లో కృష్ణ జింకల మందలు, గొర్ల మందలు తిరుగుతు మేస్తూ ఉంటే కీటకాలు పైకి లేస్తూ బట్టమేక, నేల నెమలి వంటి పక్షులకు పుష్కల ఆహారం అందించేవి. అందుకే అరుదైన బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ బట్టమేక పక్షి అసలు కనిపించడం లేదు. రోళ్లపాడు అభయారణ్యం చుట్టూ ఉన్న గ్రామ పరిధిలో ఒకప్పుడు కొర్రలు, ఆరికెలు వంటి తృణధాన్యాలు, అపరాల సాగు ఉండేది. అలాగే వేరుశనగ పంట కూడా ప్రముఖంగా పండేది. ఇది బట్టమేక పక్షికి ముఖ్య ఆహారం. అయితే ఈ పక్షి కేంద్రానికి ఆనుకుని అలగనూరు జలాశయం నిర్మించడం, శ్రీశైలం కుడిగట్టు కాలువలు రావడంతో వ్యవసాయ రీతి మారింది. వరి ప్రధాన పంటగా మారడంతో పాటు ఉద్యాన పంటలు పెరిగి అపరాలు, తృణధాన్యాలు మాయమయ్యాయి. మరో వైపు మరో వైపు అటవీ జీవావరణానికి ప్రమాద కరమైన ప్రోసోపిస్ (ముళ్ల పొదలు) జాతులు ఆక్రమణ కూడా జరుగుతోంది. ఈ జాతి మొక్కలు, గడ్డిని ఎదగకుండా చేస్తాయి. అంతే కాకుండా రోళ్లపాడు అనుబంధంగా ఉన్న ఎర్రమల చుట్టూ భారీ సోలార్ ప్రాజెక్ట్లు రావడంతో భూ స్వరూపమే పూర్తిగా మారింది. దీంతో రోళ్లపాడు అభయారణ్యం ఉనికిని కోల్పోతోంది. భారత దేశపు గడ్డి మైదానాలు జీవావరణ ప్రాంతాలు. వీటిని రక్షించుకోవడానికి ప్రత్యేక చట్టాల ఆవశ్యకత ఉంది. 1986 పర్యావరణ రక్షణ చట్టం ఉన్నప్పటికీ దాని తీవ్రత సరిపోవడం లేదు. జాతీయ గడ్డి భూముల రక్షణపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ సమగ్రమైన చట్ట పరిధి రక్షణ ఇప్పటికీ రూపొంద లేదు. ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోక పోతే రోళ్లపాడు వంటి అద్భుతమైన గడ్డి మైదానాల్లో ఏషియన్ చీతా, బట్టమేక, తోడేలు వంటి అపురూప వన్యప్రాణుల పునఃప్రవేశాన్ని కలగనలేము. – బి.విజయకుమార్ సీఎఫ్ డైరెక్టర్, ఫారెస్ట్ అకాడమి, రాజమండ్రి క్షీణదశలో రోళ్లపాడు గడ్డి మైదానాలు కనిపించని బట్టమేక... కనుమరుగవుతున్న తోడేళ్లు పర్యావరణ సమతుల్యతకు గడ్డి మైదానాలు కీలకం ప్రమాదాన్ని గుర్తించని అటవీ అధికారులు -
కూటమి ప్రభుత్వంలో ఓట్ల గల్లంతు ఖాయం
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు గల్లంతు కావడం ఖాయమని, గ్రామాల్లో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కరిడిగుడ్డం, ముద్దనగేరి, కురుకుంద, మూసానహళ్లి, కాత్రికి, గోనేహాల్, మనేకుర్తి, అంగస్కల్ గ్రామాల్లో పర్యటించారు. బీఎల్ఏలు, ఓటర్లను అవగాహన కల్పించారు. ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. వెన్నుపోటులతోనే ఆయన అధికారంలోకి వచ్చారని, తిరిగి అధికారంలోకి రావటానికి ఓట్లు గల్లంతు చేస్తారన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు తీసివేసే ప్రక్రియ కచ్చితంగా సాగుతోందన్నారు. ‘సర్’ ప్రక్రియలో బీఎల్ఏలు వైఎస్సార్సీపీ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు సవరణ చాలా ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అర్హులైన వారు ఓటు వేసేలా జాగ్రత్త తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారి ఓట్లు తొలగించకుండా, డబుల్ ఎంట్రీలు లేకుండా చూడాల్సి బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమై టీడీపీ యాప్ ద్వారా తమ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. ప్రతి బీఎల్ఏ ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఇచ్చిన ఫారాలను పరిశీలించి వివరాలన్నీ పూర్తి చేయించాలన్నారు. చంద్రబాబు పాలనంతా మోసమే! హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల్ని సైతం లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. అన్నదాత సుఖీభవలో కోత విధించడం సరికాదన్నారు. సూపర్ సిక్స్ పేరిట మోసం చేసిన చంద్రబాబును గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీఎల్ఏలు, ఎంపీటీసీలు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలం ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీతో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్స్పల్ సెక్రటరీ రాజశేఖర్ ఆరు నెలలు పొడిగిస్తూ జీవో ఆర్టీ నంబరు 551 జారీ చేశారు. కర్నూలు డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్రెడ్డి ఈ ఏడాది డిసెంబరు 26 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవ నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తుంగభద్రలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కర్నూలు (సెంట్రల్): నగర పరిధిలోని తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించినట్లు వన్టౌన్ సీఐ మారుతి శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతురాలు 5.6 అడుగుల ఎత్తు ఉండి, కుడి చేతిపై కె.బాషా అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. లేత ఆకుపచ్చ పూల అంచుల నల్ల చీర, ఆకుపచ్చ గాజులు ధరించిందని, ఎవరైనా ఆమెను గుర్తు పడితే వన్టౌన్ పోలీస్స్టేషన్లో సమాచారమివ్వాలని సీఐ సూచించారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: మండల కేంద్రంలోని 7 విత్తనాలు, ఎరువుల దుకాణాలలో సోమవారం ఏకకాలంలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్ కిశోర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రిజిస్టర్లు, స్టాకు పరిశీలిస్తూ, గోడౌన్లలో సోదాలు చేపట్టారు. రెండు దుకాణాలలో యూరియా, ఇతరత్రా ఎరువులను ఎమ్మార్పీకి మించి అమ్మడాన్ని గుర్తించారు. ఆయా దుకాణదారులపై నిత్యావసరాల చట్టం క్రింద కేసు నమోదు చేసి, రూ.4,09,450ల విలువైన 274 బస్తాలను సీజ్ చేసినట్లు తెలిపారు. దాడుల్లో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయాధికారి విశ్వనాథ్, స్థానిక వ్యవసాయాధికారి అక్బర్ బాషాపాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక కలచట్ల బ్రిడ్జిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్ (50) మృతి చెందాడు. తుగ్గలి మండలం లంకాయపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్ సొంత పని నిమిత్తం బైక్పై ప్యాపిలికి చేరుకున్నాడు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా కలచట్ల బ్రిడ్జిపై లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రున్ని డోన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గర్భిణి ప్రాణాలు కాపాడిన పోలీసులు ఆదోని అర్బన్: తనతోపాటు రెండేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లి రాంజల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందు వెళ్లిన గర్భిణిని ఆదోని త్రీటౌన్ పోలీసులు అన్వర్, గురుప్రసాద్, పరశురామ్ కాపాడారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలో అంబేడ్కర్ నగర్కు చెందిన ఫిఫా అలియాస్ ఈశ్వర్, సునీత భార్యభర్తలు. ప్రతిరోజూ భర్త మద్యం సేవించి వేధించేవాడు. సోమవారం మద్యం మత్తులో వచ్చి భార్య సునీతతో గొడవపడి చెప్పుతో కొట్టాడు. దీంతో సునీత అవమానంగా భావించి రెండేళ్ల కుమారుడిని ఎత్తుకుని రాంజల చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రవర్తన చూసిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేయడంతో తాము స్పందించి రాంజల చెరువు వద్దకు వెళ్లి సునీతను, ఆమె రెండేళ్ల కుమారుడిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపారు. -
రక్షణ నల్లమలకే పరిమితమా..
1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980 అటవీ సంరక్షణ చట్టాలు కేవలం అడవుల సంరక్షణ కోసం మాత్రమే పరిమితమవుతున్నాయి. గడ్డి మైదానాల రక్షణకు స్వయం ఛాలక వ్యవస్థ ఏది లేక పోవడం సంపూర్ణ జీవావరణ వ్యవస్థకు విఘాతంగా మారుతోంది. అలాగే గ్రాస్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ మురాత్కర్ లాటి వారిచేత గడ్డి మైదానాల అభివృద్ధిపై వర్క్షాప్లు, ప్రణాళికలు ఎన్ఎస్టీఆర్లో చేపడుతున్నప్పటికీ అడవి వెలుపల ఉన్న రోళ్ల పాడు గడ్డి మైదానాల అభివృద్ధికి, రక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గడ్డి మైదానాలను కీలకమైన వన్యప్రాణి ఆవాస కేంద్రాలుగా గుర్తించి వాటి రక్షణకు ప్రభుత్వం పూనుకోవాలి. అప్పుడే గడ్డి మైదానాల ఆవాస వన్యప్రాణులైన కృష్ణ జింకలు, తోడేళ్లు, బట్టమేక పక్షులు, గోల్డెన్ జాకాల్ (నక్క)లు మనుగడ సాగిస్తాయి. ఇప్పటికే ఈ గడ్డి మైదానాల నుంచి అదృశ్యమైన ఏషియన్ చీతా అంశం నుంచి పాఠాలు నేర్చుకుని వాటి పునరుజ్జీవనానికి కృషి చేయాలని జీవావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
సీనియర్ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్ సహాయకులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్కుమార్ను పీఆర్ క్యూసీ సబ్ డివిజన్ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన తుగ్గలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జొన్నగిరి వద్ద జియోమైసూర్ కంపెనీ ప్రవేట్ లిమిటెడ్ (ఇండియా) గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్, జేసీ నూరుల్ఖమర్ ఏర్పాట్లను పరిశీలించారు. మైనింగ్ ప్లాంట్లో హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను మ్యాప్ ద్వారా తెలసుకున్నారు. కార్యక్రమానికి 5వేల నుంచి 10వేల వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్కుమార్, ఓబులేసు, ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ మధుసూదన్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం ● ఎస్ఈ ప్రదీప్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్శాఖ ఈఈ, డీఈఈ, ఏడీఈలను ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర వాటికి సంబంధించిన సమస్యలను కొందరు ఎస్ఈ దృష్టికి తెచ్చారు. డీఈఈ విజయ భాస్కర్ పాల్గొన్నారు. రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ● జూలై 6న సీట్ల కేటాయింపు కర్నూలు సిటీ: పాలిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్.జి పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు https://polycet.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బీసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రసీదును ప్రింటౌట్ తీసుకోవాలన్నారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈ నెల 29 నుంచి జూలై 3వ తేది వరకు ఆన్లైన్లో ఆప్షన్ నమోదు చేసుకోవాలన్నారు. జూలై 4న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, జూలై 6వ తేదీ సీట్ల కేటాయింపు చేయనున్నారన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు రూ.4,700, ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు రూ.25 వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9052437831, 9703535575, 9848202584 అనే నంబర్లను సంప్రదించాలన్నారు. -
మంత్రి లోకేష్ పేరు చెప్పి భూములు కాజేశారు!
● వెంటనే చర్యలు తీసుకోవాలి ● పీజీఆర్ఎస్లో కై రుప్పల బాధితుల ఫిర్యాదు కర్నూలు(సెంట్రల్): మంత్రి లోకేష్ పేరు చెప్పి ఆస్పరి మండలం కై రుప్పల గ్రామ టీడీపీ నాయకుడు కమ్మరి వరప్రసాదు అనే వ్యక్తి భూములు కాజేస్తున్నారని, ఆయన స్వాధీనం నుంచి తమ భూములను తమకు ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జెడ్పీ సీఈఓ వెంకటరమణారెడ్డి, అభియాన్ ఏపీసీ లోక రాజు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 440 అర్జీలు పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 440 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించే దాదాపు 150కిపైగా అర్జీలు ఉన్నాయి. పెన్షన్ల కోసం సుమారు 50కిపైగా అర్జీలు వచ్చాయి. అర్జీలకు సరైన పరిష్కారాలు చూపాలని, రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రసల్ కేసులను పూర్తిగా తగ్గించాలని అధికారులకు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. కాగా.. ఈనెల 24న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులైన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులే ఫిర్యాదులను స్వీకరించాల్సి వచ్చింది. మా చావులకు అధికారులే కారణం! తాము జీవనోధిపాధి కోసం గ్రామంలో లేకపోవడంతో కమ్మర వరప్రసాదు తమ భూములను వారి పేరిట ఆన్లైన్ చేయించుకున్నారని కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు ఆయన పేరిట తమ భూములను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. వాటిని వెంటనే రద్దు చేసి తమ పేరిట మార్చాలని కోరారు. లేదంటే తమ చావులకు అధికారులే కారణమవుతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఎల్నినో ‘మండుతోంది’!
● కర్నూలులో 39, నంద్యాలలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వానాకాలం వచ్చి 22 రోజులవుతున్నా ఎండాకాలంగానే కనిపిస్తుండటం గమనార్హం. ఇటీవల వర్షాలు కొంతవరకు మురిపించినప్పటికీ.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు కనుమరుగై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. విత్తనం విత్తుకోవడానికి వానలు కరువయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదవుతాయి. కానీ కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీలు నమోదయ్యాయి, నంద్యాలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. 96.3 మిమీ వర్షపాతం నమోదైంది. 10 రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఆగస్టు వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. -
అనుమతి ఒకటి.. ప్రచారంలో మరొకటి!
● పత్తికొండలో ఒక స్కూల్ నిర్వాకం ● మోసపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు పత్తికొండ: అనుమతి ఒక స్కూల్పైనే తీసుకుని ప్రచారంలో మరొక పాఠశాల పేరు చెబుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. పత్తికొండలో నడుస్తున్న ఈ స్కూల్పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆరేళ్ల కిందట పట్టణంలోని యశోదగార్డెన్ పాఠశాలను శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యం లీజుకు తీసుకుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయి. దీంతో అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇదిలా ఉండగా శ్రీచైతన్య స్కూల్ పేరుతో ప్రచారం చేసుకోని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. యశోదగార్డెన్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. ఫీజుల దోపిడీ! శ్రీచైతన్య అలియాస్ యశోదగార్డెన్ స్కూల్లో ఇంటిగ్రేటిడ్ చదువు పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్, సీ బ్యాచ్, స్టేట్ సిలబస్ అంటూ మూడు భాగాలు చేసి ఫీజులు తీసుకుంటున్నారు. నర్సరీలో స్టడీ కోసం ఫీజు రూ.20వేలు ఉంది. పుస్తకాలు, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ పేరుతో 35వేల రూపాయిలు ఉంటుంది. 6 నుండి 10 వరకు రూ.70వేలు దాకా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఫీజులు ఇక్కడ వసూలు చేస్తూ గ్రామీణ విద్యార్థులపై పెనుభారం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యశోదగార్డెన్ స్కూల్ పేరుతో అనుమతి తీసుకుని శ్రీచైతన్య పేరుతో నడిచే పాఠశాలలో నిబంధనలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. అధికారుల కళ్లకు గంతలు కట్టి చదువు పేరుతో ఫీజులు దోపిడీకి యాజమాన్యం పాల్పడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో ఎక్కడా ఫీజులు సూచించే బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదులపై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అరోపణలు ఉన్నాయి. యశోదగార్డెన్ స్కూల్ పేరుతో గుర్తింపు ఉండి శ్రీచైతన్య పేరుతో ప్రచారం చేసుకొని అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పాఠశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలను వివరిస్తాం. లేదంటే నోటీసులు జారీ చేసి చర్యలకు జిల్లా అధికారులుకు సిఫార్సు చేస్తాం. శ్రీచైతన్య పేరుతో వారు ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. – మాలతీ ఎంఈఓ -
నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా!
ఆదోని: గంగమ్మ పోలీసు కస్టడీ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప బెయిల్ పిటీషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం జిల్లా కోర్టులో జరిగిన విచారణలో దర్గప్ప తరపు న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు మేజిస్ట్రేట్ పోలీసు కస్టడీలోని దర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పహరా మధ్య పోలీసు సదన్లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎవరినీ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్గప్ప ఆరోగ్యం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసును ఎలాంటి మలుపు తిప్పుతుందోననే చర్చ కొనసాగుతోంది. హత్యోదంతంలో మరొకరు ఎవరు? కుమారుని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు విచారణలో గంగమ్మ మృతి చెందడం తెలిసిందే. విచారణ సందర్భంగా సిట్ పోలీసులు కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు పత్రికల్లో విరుస కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే తన తల్లి కిందపడటం వల్లే మరణించినట్లు గంగమ్మ కుమార్తెతో పోలీసులు రాతపూర్వకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కుమారుడి హత్యోదంతంలో గంగమ్మ, దర్గప్పతో పాటు మరొకరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు మరొకరు ఎవరనే విషయాన్ని కూడా వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 22 రోజులుగా పోలీసుల ఆధీనంలోనే! సిట్ పోలీసుల విచారణ ఇప్పటికే వివాదాస్పదం కావడం తెలిసిందే. గంగమ్మ మృతి, దర్గప్ప ఆసుపత్రి పాలవడం చూస్తే ఏస్థాయిలో తమదైన శైలిలో విచారణ చేపట్టారో అర్థమవుతోంది. హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని కోరడంతో పోలీసులు ఆయనను ఏమైనా భయపెట్టి ఉంటారేమోనని చర్చ జరుగుతోంది. గంగమ్మ మరణం వెనుక మిస్టరీని దర్గప్ప నిర్భయంగా బయటపెట్టగలడా? లేక తనను కూడా ఏమైనా చేస్తారేమోనని పోలీసుల స్క్రిప్టుతో సరిపెడతాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల్లో వణుకు సిట్ పోలీసుల తీరు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని స్థానిక పోలీసుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే కేసు రోజుకో మలుపు తిరుగుతుండటం, వ్యవహారం హైకోర్టు వరకు చేరడంతో ఎవరి ‘సిట్’కిందకు నీళ్లు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కౌతాళం సీఐ కూడా విజయవాడలోనే మకాం వేయడం, స్థానిక పోలీసులు ఇద్దరు, ముగ్గురిపై వేటు పడక తప్పదనే ప్రచారం ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ఫిర్యాదు స్వీకరించే విషయంలో నిర్లక్ష్యం నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారిపైనా చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. మొత్తంగా నేడు కోర్టులు ఏవిధంగా స్పందిస్తాయోనని పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది.నేడు హైకోర్టుకు దర్గప్ప వాంగ్మూలంగంగమ్మ మరణం వెనుక నిజానిజాలను వెల్లడించాల్సిన ప్రత్యక్ష సాక్షి దర్గప్ప. వీరిద్దరిపైనే సిట్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికీ గంగమ్మ మరణం వెనుక కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం.. దర్గప్ప ఆరోగ్య పరిస్థితిని వివరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దర్గప్ప కనీసం నడవలేని స్థితిలో కాళ్లు సెప్టిక్ అయ్యాయని, అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ చదువుతున్న దర్గప్ప కుమారుడు తండ్రికి బెయిల్ మంజూరు చేయించాలని ఆదోని చెందిన ప్రముఖ న్యాయవాదిని ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుండటం, మరోవైపు హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని ఈనెల 23న తమ ముందుంచాలని ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. గంగమ్మ మృతి ఇప్పటికీ అనుమానాస్పదమే లాకప్డెత్గానే పత్రికల్లో కథనాలు కిందపడి చనిపోయినట్లుగా కుమార్తెతో లేఖ పోలీసుల తప్పించుకునే ప్రయత్నమనే వాదన ఇదే కేసులోని దర్గప్ప ఆసుపత్రిపాలు 22 రోజులకు పైగా కొనసాగుతున్న చికిత్స -
విద్యుదాఘాతంతో నెమలి మృతి
చాగలమర్రి: మండల కేంద్రంలో సోమవారం జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి అడ్డువాగు కాలువ మీదుగా పాత హైవే పైకి చేరుకుంది. జన సంచారంలోకి వచ్చిన నెమలి భయపడి సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలపైకి ఎగరడంతో విద్యుదాఘాతానికి గురై గాయపడింది. స్థానికులు గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే డి.వనిపెంట సెక్షన్ అధికారి టి. రామకృష్ణ అక్కడికి చేరుకుని గాయపడిన నెమలికి వైద్య చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని అటవీ అధికారులు తెలిపారు. -
తలకెక్కించుకోవాల్సిందే...
హెల్మెట్ వినియోగం విషయంలో కూడా జిల్లాలో ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిరోభారం అనే ఆలోచనను వాహనదారులు వీడాల్సిన అవసరముంది. ఆరునెలల వ్యవధిలో ఏకంగా 3,145 మంది వీటిని ధరించకపోవడం వల్ల జరిమానా రూపంలో భారీగా ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. సిగ్నల్ జంపింగ్, అధిక బరువు, మైనర్లు వాహనాలు నడపటం, అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లడం లాంటి కేసుల సంఖ్య కూడా తగ్గేలా వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలు: హెల్మెట్ లేకుండా బైకులపై రయ్మని దూసుకెళ్లడం.. మద్యం తాగిన తర్వాత వాహనాన్ని నడపటం.. వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం.. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం.. లైసెన్స్, వాహనాల పత్రాలు లేకుండానే డ్రైవింగ్ చేయడం.. పరిపాటిగా మారింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాల జోరు జిల్లాలో పెరుగుతోంది. ఏమవుతుందనే సాహసమో.. ఒక్కసారే కదా అనే నిర్లక్ష్యమో ఏదైమైతేనేమి వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎవరికి వారుగా చిన్నపాటి మొత్తంగానే భావించినా ట్రాఫిక్ ఉల్లంఘనకు వాహనదారులు తగిన మూల్యాన్ని మాత్రం భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 జనవరి నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆరు నెలల వ్యవధిలోనే ఉల్లంఘనలకు సంబంధించి 57 వేలకు పైగా కేసులు నమోదైన తీరు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మొదటి స్థానంలో లైసెన్స్, రికార్డులు లేని కేసులు 57 వేల కేసుల్లో లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా నడిపిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందుకు దాదాపు రూ.23 లక్షలకు పైగా వాహనదారులు జరిమానాల రూపంలో చెల్లించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిప్పుతున్న వాహనాలపై నమోదైన కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. దాదాపు 6,043కు పైగా నంబర్ ప్లేట్లు లేని కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ సిగ్సల్స్ పడినా పట్టించుకోని వాహనదారులపై కూడా 4,332 కేసులు నమోదయ్యాయి. అలాగే రాంగ్ రూట్ ప్రయాణాలతో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటమే దీనికి కారణమని తెలిసినప్పటికీ వాహనదారుల్లో మార్పు కరువైంది. సమయం కలసివస్తుందని కొందరు వాహనదారులు చేస్తున్న తప్పిదం ఎంతోమంది ప్రాణాల మీదకు తెస్తోంది. యూటర్న్ తీసుకుని వెళ్లాలంటే అర కిలోమీటర్, కిలోమీటర్ ప్రయాణించాల్సి వస్తోందని రాంగ్రూట్లో వెళ్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదు. ‘మత్తు’గా దొరికిపోతున్నారు! మద్యం తాగి వాహనాలు నడపొద్దని తనిఖీల సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నా కేసులు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించి భారీగా జరిమానాలు విధిస్తున్నా మందుబాబుల్లో మార్పు కనిపించడం లేదు. మద్యం మత్తులో వాహనాలు తోలుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా పోలీసుల తనిఖీల్లో దొరికి భారీగా జరిమానాలు చెల్లించి ఆర్థికంగా చిత్తవుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో యువతే అధిక సంఖ్యలో ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జిల్లాలో ఏకంగా 9,360 మంది మందు బాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానాల్లో హాజరుపర్చగా మొదటి ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.3 వేలు, రెండో ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా రూపంలో రూ.6.50 కోట్లు మూల్యం చెల్లించారు. అలాగే ఈ ఏడాది ఆరు మాసాల వ్యవధిలోనే 4258 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా రూ.4.26 కోట్లు జరిమానా రూపంలో చెల్లించుకున్నారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమలు చేసేందుకు కర్నూలు నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని రాజ్విహార్, పాత కంట్రోల్ రూమ్ సెంటర్, పంప్హౌస్, వెంకటరమణ కాలనీ, ఐదు రోడ్ల కూడలి, సి.క్యాంప్ సెంటర్, నంద్యాల చెక్పోస్టుతో పాటు ప్రధాన రహదారుల్లో వందకు పైగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంది. రక్షణతో పాటు పర్యవేక్షణ కోసం వీటి సంఖ్యను నగరంలో పెంచనున్నారు. అయినప్పటికీ వాహనదారుల ఉల్లంఘనల జోరు కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న కూడళ్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహన చోదకులు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలు కూడా ఎక్కువే. మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు ఇవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు ప్రతిరోజూ పోలీస్స్టేషన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారికి తనిఖీల సందర్భంగా జరిమానాలు విధిస్తారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా, ఇబ్బందికరంగా వాహనాలు నడిపినా డయల్ 100 లేదా 112కు సమాచారమివ్వాలి. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ లైసెన్స్, వాహన 13,640 నెంబర్ ప్లేట్లు లేకుండా 6,043 సిగ్నల్ జంపింగ్ 4,332 ఓవర్ స్పీడ్ 4,106 వ్యతిరేక మార్గ ప్రయాణం 3,784 ఓవర్ లోడ్ 3,146 హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 3,145 సెల్ఫోన్ మాట్లాడుతూ 1,089 బహిరంగ ప్రదేశాల్లో 7,963 ట్రిపుల్ రైడింగ్ 286 అదనపు ప్రయాణికులు 401 సీటు బెల్టు లేకుండా డ్రైవింగ్ 249 మైనర్ డ్రైవింగ్ 52 ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోని వైనం మద్యం మత్తులో డ్రైవింగ్ ఆరు నెలల్లో 57 వేల కేసులు జరిమానాల జోరుతో జేబులు గుల్ల -
నిజ జీవితంలో యోగా అవసరం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థికర్నూలు (టౌన్): అనునిత్యం ఎదురయ్యే అటుపోట్లను అధిగమించేందుకు నిజ జీవితంలో యోగా అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశమన్నారు. న్యాయ శాఖ ఉద్యోగి, యోగా మాస్టర్ ముంతాజ్ యోగాసనాలు చేయించారు. జిల్లా జడ్జీలు రామచంద్రుడు, శోభారాణి, లక్ష్మీరాజ్యం, వెంకట హరినాథ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, సీనియర్ సివిల్ జడ్జీలు సంధ్యారాణి, అపర్ణ, సరోజమ్మ, అనూష, స్రవంతి, అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నాన్నకు బిడ్డే మహారాణి
తండ్రి చెంత ఉంటే ప్రతి బిడ్డ మహారాణే.. ప్రతి కొడుకు మహారాజునే. ఎంత కష్టమొచ్చినా.. బిడ్డలకు ఏ లోటు లేకుండా తండ్రి చూసుకుంటాడు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా పలువురు తమ వాట్సాప్ స్టేటస్లో నాన్న ఫొటోలు పోస్టు చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ నాన్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేశారు. మరి కొందరు అందుబాటులో ఉన్న తండ్రికి పాదాభివందనం చేసి ఆశ్వీరాదం తీసుకోగా ఇంకొందరు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే పట్టణంలోని పాత బస్టాండ్లో ఒక తండ్రి తన కూతురును అట్ట పెట్టెలు వేసిన బండిపై కూర్చోబెట్టుకొని తీసుకెళుతున్న దృశ్యాన్ని చూసి.. తండ్రి ఉన్న ప్రతి బిడ్డ మహారాణినే అంటూ చర్చించుకున్నారు. – డోన్ టౌన్ -
కార్యకర్తలకు అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, గుట్టపాడు రామకృష్ణారెడ్డి, పాలకొలను మద్దయ్య, మాబాషా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాలయంలో సోమయాగం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో ఆదివారం వేదపండితులు సోమయాగంను ప్రారంభించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆజ్ఞానుసారం ఈ యాగం 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమయాగంతో దేశంలో వైపరీత్యాలు వైదొలగి సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ హోమం చేపడుతున్నట్లు చెప్పారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు. పందికోన మలలో నెమళ్లు పత్తికొండ: వాన పడిన సమయంలో నెమళ్లు పూరి విప్పి నాట్యం చేస్తే చూపరులకు కనువిందుగా ఉంటుంది. అలాంటి నెమళ్లు ఆవాసంగా పందికోన మల మారింది. పత్తికొండ పట్టణ శివారు నుంచి పందికోన, పెండ్లిమాన్తండాల నడుమ వేలాది ఎకరాల్లో పందికొన మల విస్తరించి ఉంది. వన్య ప్రాణాలు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పందికోన మలలో నాలుగు దిక్కుల్లో వందలాది నెమళ్లు పొలాల్లో సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి. కందిసాగుకు 4,300 మినీకిట్లు కర్నూలు(అగ్రికల్చర్): ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ కింద జిల్లాలో కంది సాగును ప్రోత్సహించనున్నారు. ఈ పథకం కింద ఎల్ఆర్జీ–105 రకం కంది విత్తనాలు 172 క్వింటాళ్లను మినీకిట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. మొత్తం 4,300 కందుల మినీకిట్లు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎల్ఆర్జీ–105 రకం విత్తనాలను 100 శాతం సబ్సడీతో పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ఎల్ఆర్జీ–52 రకం కంది విత్తనాలను 50 క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. కిలో పూర్తి ధర రూ.120.50 ఉండగా రూ.30 రాయితీ ఉంటుంది. నాలుగు కిలోల ప్యాకెట్కు సబ్సిడీ పోను రైతులు రూ.362 చెల్లించాల్సి ఉంది. -
పొలంలో ప్రాణాలు వదలిన వీఆర్వో
ఎమ్మిగనూరురూరల్/గోనెగండ్ల: పొలంలో పనిచేస్తూ గుండెపోటు రావటంతో వీఆర్వో తలారి మునెప్ప(53) మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన మునెప్ప గతంలో కౌతాళం మండలం ఎరిగేరిలో వీఆర్వోగా పనిచేశారు. సంవత్సరం క్రితం గోనెగండ్ల మండలానికి బదిలీపై వచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం అయిన పార్లపల్లి గ్రామానికి వెళ్లారు. భార్య భాగ్యమ్మతో కలసి పొలం పనులకు వెళ్లి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వస్తుందని భార్యకు చెప్పి పక్కకు ఒరిగిపోయారు. వెంటనే భార్య భాగ్యమ్మ కుమారుడు నరసింహులుకు ఫోన్ చేసి చెప్పారు. పొలం దగ్గరకు వెళ్లి ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం చేయటంతో అప్పటికే ప్రాణాలు వదిలినట్లు గుర్తించారు. దీంతో మునెప్ప మృతదేహంపై పడి భార్య, కుమారుడు రోదించటం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది. వీఆర్వో మునెప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో మృతిపై గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి, సిబ్బంది సంతాపం తెలిపారు. -
ఓటరూ.. ఆందోళన వద్దు!
అన్ మ్యాప్డు కాకపోయినా..కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ఎన్నికల కమిషన్ ఓటర్లకు శుభవార్త చెప్పింది. అన్మ్యాప్డు ఓటర్లను భయపెడుతున్న అంశంపై తాజాగా వివరణ ఇచ్చింది. 2025, 2002 ఓటరు జాబితాలు మ్యాప్ కాకపోయినా ఎన్యుమరేషన్ ఫామ్ను ఎన్నికల కమిషన్కు సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. అంతేకాక ఎన్నికల కమిషన్ గుర్తించిన ఆధార్తోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని సమర్పించాలని షరతు పెట్టింది. కర్నూలు జిల్లాలో 2025 ఓటరు జాబితా ప్రకారం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలన్నీ 2002 జాబితాతో సరి పోల్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న ఓటర్లలో చాలా మంది 2002 జాబితా తో పోల్చితే మ్యాప్ కావడం లేదు. దీంతో చాలా మంది అన్మ్యాప్డ్గా మిగిలిపోతున్నారు. దీంతో వారంతా తమను ఓటర్లుగా తొలగిస్తారనే భయంతో ఉన్న నేపథ్యంలో అన్ మ్యాప్డ్ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వివరణతో కొంత ఆందోళన తగ్గింది. రెండు జాబితాల్లో పేరు లేకపోతే... ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో 2002, 2025 ఓటరు జాబితాలు అత్యంత కీలకం. రెండు జాబితాల్లో ఓటరుగా ఉండటం లేదా తల్లిదండ్రులు వివరాలు కలిగి ఉండాలి. అప్పుడు ఓటరుగా కొనసాగిస్తారు. అయితే రెండు జాబితాల్లో పేర్లు లేనివారు ఏమి చేయాలంటే... కొత్తగా ఓటు నమోదుకు ఫామ్–6ను నింపి ఇస్తే సరిపోతుంది. వారి పేరు కూడా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో వచ్చేస్తుంది. డబుల్ ఓటర్లకు.. ట్రబులే! ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చాలా మందికి రెండు చోట్లా ఓటు హక్కు ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో దానిని గుర్తించేందుకు డమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పద్ధతిని వాడిన సరైన ఫలితం లభించేది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టే సర్లో మాత్రం డబుల్ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండు చోట్లా ఓటు ఉన్నా ఒక్క చోటే ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాలి. కాదని రెండు చోట్లా ఇచ్చినా వారు సమర్పించి గుర్తింపు కార్డులతో పట్టుబడే అవకాశం ఉంది. దీంతో డబుల్ ఓటర్లకు ట్రబుల్ మొదలైందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో ఎవరినీ తొలగించం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఓటర్లు సరైన డాక్యుమెంట్లను సమర్పిస్తే ఎవరి ఓటును తొలగించడం, చేర్చడంకానీ చేయడానికి వీలు ఉండదు. అన్మ్యాప్డు ఓటర్లు అయితే ఎన్యుమరేషన్ ఫామ్ను ఇస్తే సరిపోతుంది. దానికి 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక దానిని సమర్పించాల్సి ఉంటుంది. – డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎన్నికల అధికారిణి, కర్నూలు ఎన్యుమరేషన్ ఫామ్ నింపితే చాలు ఓటు పదిలమే 2002 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు లేకపోయినా భయం అవసరం లేదు ఎన్యుమరేషన్ ఫామ్తోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా సమర్పిస్తే సరి 2002, 2025 జాబితాల్లో అసలు పేరే లేకపోతే ఫామ్–6 ఇస్తే ఓటుగా నమోదు 2002 జాబితాలో ప్రస్తుత ఓటరు వివరాలు లేకపోయినా, వారి తల్లిదండ్రుల వివరాలు లేక పోయినా.. మ్యాపింగ్ అయి ఉంటే చాలు ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అన్మ్యాప్డ్ ఓటర్లకు నోటీసు ఇస్తామని, తాము గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. 1987 జూలై ఒకటో తేదీ నాటికీ ఓటరు జన్మించి ఉంటే తనకు సంబంధించిన గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 01 నుంచి 2004 డిసెంబర్ 02వ తేదీ మధ్య జన్మించి ఓటరైతే తన ఒక్క గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 02 తరువాత జన్మించిన ఓటరైతే తన గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల ఇద్దరి గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుంది. 2004 తరువాత విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఉంటే అతని పాస్పోర్టు, వీసాలను సమర్పించి ఓటు హక్కును పొందవచ్చు. -
వానల్లేవ్.. వరదల్లేవ్
● టీబీ డ్యాం ఎగువన కురవని వర్షాలు ● పూర్తిగా నిలిచిన ఇన్ఫ్లో ● డ్యాంలో 9.748 టీఎంసీలు నీరు నిల్వహొళగుంద: ఈ ఏడాది ప్రారంభంలో తుంగభద్ర డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్ నెలలో వేగంగా నిండిన డ్యాం ప్రస్తుతం వెలవెలబోతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనం జరిగినా జలాశయం ఎగువ భాగంలోని శివమొగ్గ, చిక్మంగళూరు, శృంగేరి, వరనాడు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడంతో డ్యాంకు వరద రావడం లేదు. రెండు వారాల క్రితం అడపాదడపా వర్షాల కారణంగా వరద వచ్చినా అది కూడా 500 క్యూసెక్కులు దాట లేదు. దీంతో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనబడుతుండడంతో జలాశయం మీద ఆధార పడిన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం డ్యాంకు ఇన్ఫ్లో 78 క్యూసెక్కులుండగా సాయంత్రానికి దాదాపు 30 క్యూసెక్కులకు పడి పోగా.. ఆదివారం ఉదయానికి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఈ సమయానికి ఇన్ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉండేది. జలాశయం పూర్తి సామర్థ్యం 1,633 అడుగుల వద్ద 105.788 టీఎంసీలు కాగా గతేడాది ఇదే సమయానికి 1612.09 అడుగుల వద్ద 41.856 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది ఆదివారం నాటికి 1588.40 అడుగుల వద్ద కేవలం 9.748 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. వరుణుడు కరుణిస్తాడా.. రిజర్వాయర్ నిండుతుందా అని మూడు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
ఇప్పటి వరకు ఇవ్వలేదు
ఈ ఏడాది ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. మిరప, ఉల్లి సాగు చేయాలని పొలంలోనే నారు పోశా. మొక్కలు నాటుకొచ్చాయి కానీ అవసరమైన ఎరువులు లేవు. దీంతో నాటు వేయడం ఆపేశాను. రైతుకు ఇంట్లో ఎరువులు ఉంటేనే పంటలు సాగే చేసే ధైర్యం వస్తుంది. రైతుభరోసా కేంద్రాల దగ్గర సారోళ్ల అడిగితే ఎరువులు వస్తాయని చెప్పినారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా చాలా అవసరం. – రామాంజనేయులు, రైతు, పత్తికొండ చాలా ఏళ్లుగా పొలాలను కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నా. ఈ ఏడాది ఎరువులను తీసుకునేందుకు వీలుకుదరడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎరువులు లేకుండా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని రైతులందరికీ అవసరమైన ఎరువులను అందజేయాలి. – వెంకటేష్, కౌలు రైతు, సి.బెళగల్ పంటల సాగుకు సత్తువ ఎరువులు చాలా అవసరం. అలాంటి ఎరువులు ఏవీ అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే యూరియా, సత్తువ(డీఏపీ) ఎరువులు, పురుగు నివారణ మందులు అన్నీ ఆర్బీకేలో అందుబాటులో ఉండేవి. ఈ ప్రభుత్వ వచ్చాక ఆర్బీకేని ఆర్ఎస్కేగా పేరు మార్చారు తప్ప ప్రయోజనమేమీలేదు. ఇప్పుడు యూరియా తప్ప ఏవీ లేవు. ఎరువులు తెచ్చుకోవాలంటే డోన్కు 30 కిలోమీటర్లు, పత్తికొండకు 28 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. డోన్ నుంచి బస్తాకు ఆటో బాడుగ రూ.55. పత్తికొండ నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఆర్ఎస్కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు కూడా మూలనపడ్డాయి. ఏవీ పనిచేయడం లేదు. – ఈశ్వరరెడ్డి, రైతు, బొందిమడుగుల -
ప్రశాంతంగా ‘నీట్’ రీఎగ్జామ్
● జిల్లాలో 16 కేంద్రాల్లో నిర్వహణ ● 92.29 శాతం హాజరు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నీట్ రీఎగ్జామ్ను ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6.15 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,995 మందికి గాను 4,610మంది విద్యార్థులు హాజరు 385 మంది గైర్హాజరయ్యారు. గత నెలలో నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో రీ–ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించారు. భారీ బందోబస్తు ప్రతి కేంద్రానికి ఒక తహసీల్దార్, ప్రతి నాలుగు కేంద్రాలకు ఓ జిల్లా అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించారు. అదే విధంగా కేంద్రాల దగ్గర భారీగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్ష విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి డోన్కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయారని సమాచారం. కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కనుక్కునేందుకు కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక హైస్కూల్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, 92.29 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. -
మొహర్రం గుర్రం వచ్చెన్..!
మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు సమైక్యంగా జరుపుకునే మొహర్రం వేడుకల్లో గుర్రాలకు ప్రత్యేకత ఉంది. అశ్వం స్వామివారి వాహనం కావడంతో కానుకగా లోహపు గుర్రాలను సమర్పిస్తారు. కోరినకోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివార్లకు మొక్కుబడిగా గుర్రాలను సమర్పించుకుంటారు. తమ స్థోమతను బట్టి తోచినంతగా దగ్గరుండి గుర్రాలను ఎంతో ప్రీతిపాత్రంగా తయారు చేయించుకుంటారు. ఇంటి దగ్గర భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఊరేగింపుగా పీర్లచావిడులకు వచ్చి స్వామివారికి కానుకలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మొహర్రం ఆరంభంతో శిల్ప కళాకారులకు చేతికి గుర్రాల తయారీ పని దొరికింది. దీంతో కళాకారులు గుర్రాల తయారీలో నిమగ్నమయ్యారు. – పత్తికొండ రూరల్ -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
కర్నూలు: నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఉన్న కేశవ గ్రాండ్ హోటల్ వద్ద సిటీ కేఫ్లో ఈ నెల 16వ తేదీన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాతబస్తీ గరీబ్నగర్కు చెందిన నవీద్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తన మిత్రులు మహబూబ్బాషా, బీసన్నతో కలిసి కర్నూలు సిటీ కేఫ్లో మాట్లాడుతుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా హోటల్లోకి ప్రవేశించి నవీద్ను చంపాలనే ఉద్దేశంతో కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షి మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు నవీద్ ఇంటి సమీపంలో నివసిస్తున్న గుజిరి సామాన్ల వ్యాపారం చేసే షేక్షా, అతని అన్న కుమారుడు అబ్దుల్ రహిమాన్, అక్క కొడుకు రెహాన్ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు దాడికి ఉపయోగించిన రెండు కత్తులు, ఒక ఆటోను సీజ్ చేసి నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. వారిని పంచలింగాల జిల్లా కారాగారంలో అప్పగించినట్లు తెలిపారు. నవీద్, షేక్షా మధ్య ఎల్కూరు బంగ్లా వద్దగల ఐదు సెంట్ల ప్లాట్ విషయంలో జరిగిన లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థలే హత్యాయత్నానికి దారి తీసినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా శోభన్బాబు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గంగుమాల శోభన్బాబు పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటనను జారీ చేసింది. శోభన్బాబు కరాటే రంగంపై మక్కువతో తైక్వాండో రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండడంతో పార్టీలో పదవి లభించింది. యువకుడిపై పోక్సో కేసు బొమ్మలసత్రం: పట్టణంలోని టూటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అస్రార్బాషా తెలిపారు. మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఒంటరిగా నిద్రిస్తుండగా ఇంటి పక్కన నివాసముంటున్న 18 ఏళ్ల జ్ఞానమూర్తి బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు యువకుడినిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేశారు. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు కొలిమిగుండ్ల(అవుకు): మండల పరిధిలోని గుండ్లశింగవరం సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు గుండ్లశింగవరం సమీపానికి చేరుకోగానే మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాల్వలోకి పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయట పడ్డారు. స్థానికులు, వాహనదారుల సాయంతో ఇరువురిని బయటకు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంట కాల్వలో పడిన కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు. అనధికార మద్యంవిక్రయదారుల అరెస్ట్ కర్నూలు: బెల్ట్ దుకాణాల ద్వారా (అనధికార) మద్యం విక్రయాలు జరుపుతున్న 45 మందిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాస్క్ఫోర్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 67 లీటర్ల అనధికార మద్యం సీజ్చేసి విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి, ఆయా స్టేషన్ల అధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనధికార మద్యం దుకాణాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్య పానంపై కూడా తనిఖీలు నిర్వహించారు. 32 మందిపై బహిరంగ సేవనం కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం బనగానపల్లె: మండలంలోని రాళ్లకొత్తూరు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. రాళ్లకొత్తూరుతండా గ్రామానికి చెందిన కిశోర్నాయక్ (23) రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా పని చేసేవాడు. శనివారం డ్యూటీ ముగిశాక మోటర్ సైకిల్పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాళ్లకొత్తూరు సమీపంలో రహదారిపై లారీ ఆగి ఉంది. చీకటిలో కనిపించకపోవడంతో దానిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరుడు రవితేజానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దొంగ అరెస్ట్
● మోటారు సైకిల్ స్వాధీనంకర్నూలు: నగరు శివారులోని కోడుమూరు రోడ్డులో హోసన్నా మందిరం సమీపాన నివసించే శోభారాణి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. శోభారాణి గత నెలలో ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా అనంతపురానికి వెళ్లారు ఇదే అదనుగా భావించిన దొంగ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల వెండి ఆభరణాలు, ఇంటి బయట పార్కు చేసిన ఉంచిన ద్విచక్రవాహనం చోరీ చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలు తెలంగాణ రాష్ట్రం పరిగి కురుకచెర్లలో నివాసం ఉండే అరుణ్కుమార్, యామీన్గా గుర్తించారు. కోడుమూరు రోడ్లోని రియలెన్స్ మార్ట్ వద్ద యామీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. అతని వద్ద నుంచి మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకొని నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. ఈ కేసులో మరో ముద్దాయి అరుణ్కుమార్ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ విక్రమసింహ తెలిపారు. -
గతంలో పంపిణీ విధానమే మేలు
గతంలో రైతుల నుంచి పాసుపుస్తకం జిరాక్స్ ప్రతిని తీసుకుని వివరాలు రాసుకుని టోకన్ ఇచ్చేవారు. రైతులకు సమయం ఎంతో ఆదా అయ్యేది. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలకు వచ్చి పాసుపుస్తకం, ఆధార్కార్డు సమర్పించి వివరాలను నమోదు చేయించుకుని, మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాల్సి వస్తుంది. దీంతో రైతులు ఉదయం నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. – మహానంది, రైతు నేను 50 ఎకరాల్లో సోయాబీన్, ఆరు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు డీఏపీ ఒక బస్తా ఇస్తే ఏరకంగా పంట సాగు చేయాలి? నాకున్న సొంత భూమికి ఇచ్చారు. కౌలుకు వేసుకున్న 20 ఎకరాల పొలానికి ఎరువులు ఎట్లా? పొలం కౌలుకు ఇచ్చిన వారు ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చి యాప్తో వేలిముద్ర వేసి ఎరువులు ఇప్పించడం కుదురుతుందా? ఇప్పుడు నాకు సోయాబీన్కు డీఏపీ, యూరియా కావాలి. పంటను పండించాలా, నాశనం చేసుకోవాలా? ఇలాగైతే వ్యవసాయం చేయలేం! – శ్రీనివాసులు, రైతు పాములపాడు నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. కొన్ని రోజులుగా డీలర్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. వరి మడులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంటే బాగుంటుంది. యూరియా అత్యవసరమవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ మాకు యాప్ తెలియదు. ప్రభుత్వమే అర్హులైన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలి. – కురవ భీరప్ప, రైతు, జొహరాపురం -
చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి
● టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన 30 కుటుంబాలుచిప్పగిరి: చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. హొళగుంద మండలంలోని సులువాయి గ్రామం నుంచి 30 కుంటుంబాల సభ్యులు టీడీపీని వీడి ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి వైఎస్సార్సీపీ కండువా వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరుతో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గొప్పలు చెబుతున్నారని, అధికారం చేపట్టి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు. అభివృద్ధి పేరిట చేసస్తున్న రూ. లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో శేఖప్ప, ఖాశీం, నాగరాజు, ఉప్పర రామంజిని, బోయ గోవిందు, మహబూబ్ సాబ్, చాకలి హనుమంతు, శంకరప్ప, బోయ తిమ్మప్ప, దాసరి బీమయ్య, చంద్రశేఖర్, తిక్కప్ప, హుసేని, మల్లికార్జున, సుభాన్ సాబ్, గిరప్ప తదితరులు ఉన్నారు. -
దగాకోరు ప్రభుత్వంలో అన్నదాతల అవస్థలు
● పంటలకు గిట్టుబాటు ధర లేదు ● పెట్టుబడి సాయం దూరమైంది ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పత్తికొండ: దగాకోరు ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందేవని తెలిపారు. నేడు అన్నదాత సుఖీభవ క్రమంగా అన్నదాత దుఃఖీభవగా మారిందన్నారు. కేంద్రసాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది రూ. 20 వేలు అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని విమర్శించారు. అన్నదాత సుఖీభవలో ప్రతి ఏడాది రైతులు సంఖ్య పెరగాలని కాని అందుకు భిన్నంగా తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, సున్నావడ్డీ రుణాలు రద్దు చేశారని, రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పత్తికొండ నియోజకవర్గంలో రైతులు పండించిన టమాట, ఉల్లి పంటను గత ఏడాది రోడ్లపై, పొలాల్లో పారబోస్తుంటే కనీసం దయ కూడా చూపలేదన్నారు. ‘కూటమి’ నిర్లక్ష్యం కూరగాయలు పండించడంలో పత్తికొండ ప్రాంత రైతు లు భారీ స్థాయిలో ఉండటం గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టమాట సాగులో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి తరువాత పత్తికొండ రెండో స్థానంలో ఉందన్నారు. ఇంతటి స్థాయిలో కూరగాయులు పండించే పత్తికొండ రైతులపై అన్ని విధాలా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, సీనియర్ నాయకులు అటికెలగుండు బాబుల్రెడ్డి, ఎంపీపీ నారాయణ్దాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్నాయక్, బనగాని శ్రీనువాసులు, మండల కన్వీనర్ కారం నాగరాజుయాదవ్, నాయకులు కేశవరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సాబ్డిన్ నూర్భాషా, జాకీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
పదిలో 99.24 శాతం ఉత్తీర్ణత
కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు 99.24 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి బి.సురేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా మొత్తం 132 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా, మొదటి విడతగా మార్చిలో 108 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మే నెలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 24 మంది పరీక్షలు రాయగా, 23 మంది ఉత్తీర్ణత సాధించగా.. ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రేపటి నుంచి రైతన్నా.. మీ కోసం వారోత్సవాలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ మరోసారి రైతన్నా.. మీ కోసం వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చిలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు వారోత్సవాల నిర్వహణకు షెడ్యూల్ను ఖరారు చేసింది. రైతుభరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ శాఖ ఫీల్డ్ బృందాలు రైతుల ఇంటింటికి వెళ్లి ప్రధానంగా ఐదు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయ సాంకేతికత వినియోగం, ఆహార ప్రాసెసింగ్ విస్తరణ, రైతులకు ఆర్థిక సహాయం తదితరాలపై ఫీల్డ్ బృందాలు రైతులతో చర్చిస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు 90 కుటుంబాల ప్రకారం ఆరు రోజుల్లో 540 కుటుంబాలను రైతన్నా.. మీ కోసం కింద కవర్ చేస్తామన్నారు. కేజీబీవీల్లో సీసీ కెమెరాలు కర్నూలు సిటీ: కసూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రతను మరింత పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూళ్లతో పాటు, ఏపీ మోడల్ స్కూల్స్, పీఎంశ్రీ స్కూళ్లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉండగా, దాదాపు అన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు పూర్తయింది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు కేజీబీవీల్లో మాత్రమే సీసీ కెమెరాల ఆపరేంటింగ్కు అవసరమైన ఇంటర్నెంట్ను అమర్చారు. వీటి పనితీరును సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.బి లోకరాజు పరిశీలించారు. వచ్చే వారంలోపు అన్ని కేజీబీవీల్లో ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు సిటీ: నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనిఫైడ్ సర్వేపై అభ్యంతరాలను తెలపండి కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీల ద్వారా పోర్టల్లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్ చేస్తామన్నారు. -
నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
కర్నూలు: నీట్ పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల రవాణా సమయంలో సివిల్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని సూచించారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పోలీసు సదన్లో చికిత్స
గంగమ్మ చనిపోయినా, ఆమె ప్రియుడు బ్యాగారి దర్గప్ప ఇంకా పోలీసు కస్టడీలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసు కస్టడీలోని బ్యాగారి దర్గప్పకు ఈ పరిస్థితి ఎవరు కల్పించారు. కనీసం లేవలేని స్థితికి ఎవరు చేర్చారు. దాదాపు నెల రోజులుగా చేతులు సచ్చుపడిపోయి శరీరంలోని అవయవాలు దెబ్బతినేంతగా ఎవరు కొట్టి ఉంటారు? పోలీసు సదన్లో ఉంచి వైద్యం అందిస్తున్న పోలీసులు మరే కొత్త కథను అల్లుతున్నారోననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతని చేతులు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాళ్లు సెప్టిక్ కాగా, శరీరంలోని అంతర్గత అవయవాలు(కిడ్నీ, లివర్ తదితరాలు) చాలా పనిచేయడం లేదని సమాచారం. వెంటిలేటర్ అవసరం లేకపోవడంతో పోలీస్ సదన్లో గోప్యంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. -
ఆళ్లగడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్గా సేవలందించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్గా, చైర్మన్గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మద్దిలేటయ్య కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. -
గందరగోళం.. అయోమయం!
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల్లో నెలకొన్న గందరగోళంతో అందరూ అయోమయంలో పడ్డారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఆషీసర్లుగా, పీఈటీ, సీఆర్టీలుగా సుమారుగా 315 మంది పని చేస్తున్నారు. ఇందులో 250 మంది వరకు కచ్చితంగా బదిలీ కావల్సిన వారు ఉన్నారు. వారిలో 202 మంది, రిక్వెస్ట్ బదిలీకి 84 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 275 ఖాళీలు బదిలీలకి గత నెల డిస్ప్లే చేసి మౌఖికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బదిలీలు చేసి, బదిలీ అయిన వారిని కొత్త స్థానాల్లో చేరాలని కూడా సూచించారు. ఈ మేరకు చాలా మంది బదిలీ అయిన స్థానాల్లో చేరారు. అయితే జిల్లాలో సుమారుగా 46 మంది బదిలీలపై న్యాయస్థానాల్లో కేసులు వేసి వారిని యథాస్థానాల్లోనే కొనసాగేటట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరందరూ తిరిగి వారి స్థానాల్లోకి రావడంతో వారి స్థానాల్లో చేరిన వారు సైతం తిరిగి వాళ్ల స్థానాల్లో వెళ్లాలా? లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇస్తారా? అనే విషయం తెలియక చిరుద్యోగులు మానసిన ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది కేజీబీవీ కార్యదర్శికి పోన్లు చేసి తమ ఆవేదన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కర్నూలు నగరానికి సమీపంలో ఉండే ఇద్దరు, ముగ్గురు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. బదిలీల ప్రస్తావన వచ్చి ప్రతిసారి తమ ఆర్థిక బలంతో కేసులు వేయించి బదిలీలను నిలిపి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లకుపైగా చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు కుటుంబాలకు సూదురంగా పని చేయాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసిన ఓ కేసు విషయంలో హైకోర్టు మినిమం టైం స్కేల్తో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై సమస్యలను నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెలలో కేజీబీవీల్లో పని చేసే టీచర్లకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. చాలా మంది ఏళ్లుగా దూరం ఉన్న వారికి కూడా వారు అనుకున్న స్థానాలు రావడంతో చాలా సంతోష పడుతున్నారు. అయితే కొంత మంది కోర్టుకెళ్లడంతో వారిని కోర్టు ఆదేశాల మేరకు వారి స్థానాల్లోనే కొనసాగించి, అక్కడికి వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని స్థానాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. వారంలోగా కచ్చితంగా బదిలీలపై స్పష్టత రానుంది. – డా.ఎన్బీ లోకరాజు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ గత నెలలో కేజీబీవీ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ బదిలీలను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో 46 మంది కేసులు వారి స్థానాల్లోనే కొనసాగేలా తాత్కాలిక ఉత్తర్వులు అప్పటికే కొత్త స్థానాల్లో విధుల్లో చేరిన ఉద్యోగులు ఎక్కడ పని చేయాలా అర్థంకాక ఆందోళన -
జవాబు లేని ప్రశ్నలు
ఆదోని: పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు కౌతాళం ఘటన తాజా ఉదాహరణ. 21 రోజుల క్రితం సిట్ విచారణలో ఓ మహిళ చనిపోగా.. ఇప్పటి వరకు ఆ వివరాలు బయటకు పొక్కలేదు. కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పత్రికలు కోడై కూస్తున్నా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే కేసులోని మరో వ్యక్తిని సైతం పోలీసులు విచారణ పేరిట చావబాదినట్లు తెలుస్తోంది. ఈయన కూడా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇతని విషయంలోనూ పోలీసులు గోప్యత పాటిస్తుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన గంగమ్మ తన కుమారుడు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన పోలీసు అధికారులతో ఒక సిట్ ఏర్పాటుకు కోర్టు ఆదేశించింది. అయితే సిట్ అధికారులకు ఈ కేసు అంతుచిక్కలేదు. చివరకు తమదైన శైలిలో గంగమ్మను విచారణ చేశారు. నిజాలు బయటకు వచ్చాయి. విధవరాలైన తను బ్యాగారి దర్గప్ప అనే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన కుమారుడిని తామే చంపి రహస్య స్థలంలో పూడ్చి పెట్టామని తెలిపింది. ఆ రూ.2లక్షలు ఎవరి చేతి నుంచి! ఖాకీ దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిన దర్గప్పను పోలీసులు మొదట అత్యంత గోప్యంగా కర్నూలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం. ఒక పోలీసు అధికారి తన సొంత ఖర్చుతో రూ.2లక్షలు ఖర్చు చేసినా కోలుకోకపోవడంతో సదరు పోలీసు అధికారి కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. చివరకు దర్గప్పను కర్నూలు పెద్దాసుపత్రిలోని పోలీసు సదన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కర్నూలు టు విజయవాడ కౌతాళం ఘటన పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తు తమ మెడకు ఎక్కడ బిగుసుకుంటుందోనని జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి పోలీసుల వరకు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కేసును ఎలాగైనా మసిపూసి మారేడుకాయ చేసేందుకు పోలీసులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కర్నూలు, విజయవాడ ప్రాంతాలకు న్యాయ సలహాల కోసం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒక సీఐపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌతాళం పోలీసుస్టేషన్ పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం చేర్చినప్పుడు సాధరణ రోగిలా కాకుండా మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారా? రోగిని పోలీసులు రెఫర్ చేస్తే ఆసుపత్రి వర్గాలు మెడికో లీగల్ కేసు కింద నమోదు చేశారా? గాయాల స్వభావం, పరిస్థితి, చేర్పించిన సమయం, పోలీసు అధికారుల వివరాలు మొదలైనవి రిజిస్టర్లో పొందుపరిచారా? వైద్యులు గాయాలపై నివేదిక తయారు చేసి, అవసరమైతే మేజిస్ట్రేట్ లేదా దర్యాప్తు సంస్థలకు అందజేస్తారు? ఇలాంటి ప్రక్రియ చేపట్టారా? చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు నోరు మెదపడం లేదు. అసలు దర్గప్పను బయటి ప్రపంచానికి ఎందుకు చూపడం లేదు. స్పృహలోనే ఉన్నాడా? లేక కోమాలోకి వెళ్లిపోయాడా? రెండు రోజుల క్రితం పోలీసు సదన్లో దర్గప్ప స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ వివరాలను బయటపెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో పోలీసులకే తెలియాలి. సిట్ విచారణ పేరిట ఓ మహిళ మృతిపై అనుమానాలు అదే కేసులోని మరో వ్యక్తి మృత్యువుతో పోరాటం 21 రోజులుగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గోప్యంగా చికిత్స కలకలం రేపుతున్న పోలీసుల తీరు -
బెల్టు షాపులపై దాడులు
కర్నూలు: అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎ కై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐలు రెహనా, మారుతీ ప్రసాద్, తేజ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన సుధాకర్ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు
కర్నూలు(టౌన్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో గాదె సాయిక్రిష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిందని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అరకొర నిధులతో గత ఏడాది 20 లక్షల మందికి తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టారని, వారికి ఈ ఏడాదైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ఏడాదికి 3 సిలిండర్ల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు సైతం యూరియా కోసం ఇబ్బందులు పడే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ● యువజన విభాగం ఉపాధ్యక్షులు నవీన్, పాణ్యం పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు సాయి, దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం బీసీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కారుమూరి సునీల్ను సంబంధం లేని లిక్కర్ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. వాస్తవానికి లిక్కర్ విక్రయాలను నియంత్రించడం, వైన్ షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యువత, విద్యార్థులకు, మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో కోడుమూరు యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి మధుమోహన్ రెడ్డి, కల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షులు మధు పాల్గొన్నారు. తక్షణం విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి -
అదనపు కోర్టులతో కేసులకు సత్వర పరిష్కారం
● ఎమ్మిగనూరులో రెండు కోర్టులు ● జూలై నెలాఖరులోపు ప్రారంభం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఎమ్మిగనూరురూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్లో ఉన్న చాలా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయనతోపాటు జిడ్జి పి.హేమ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్అండ్బీ డీఈ నాగరాజు, బార్ అసోషియేషన్ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జి.కబర్ధి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కోర్టులు ఏర్పాటుకు రూ. 96 కోట్లు కేటాయిస్తే కర్నూలు జిల్లాకు రూ. 21 కోట్లు వచ్చాయన్నారు. ఎమ్మిగనూరుకు ఉన్న కోర్టుతో పాటు అదనపు కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ. 2 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు, కోర్టు అవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టు ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ సభ్యులు తమ భవాన్ని అదనపు కోర్టుకు ఇచ్చి తాము షెడ్స్లో ఉంటామని చెప్పటం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు కొత్త కోర్టులను జూలై నెలాఖరు లోపు ప్రారంభించనున్నట్లు, అంతలోపే సంబందిత అఽధికారులు మరమ్మతులు చేయించి సిద్ధం చేయాలన్నారు. ఎమ్మిగనూరు కోర్టులో ఇప్పటి వరకు 5 వేల కేసు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు కొత్త కోర్టుల ఏర్పాటు చేస్తే వాటికి త్వరితగిగతి పరిష్కారం లభిస్తుందన్నారు. కక్షిదారులు తమ కేసుల అప్పీల్కు ఆదోని కోర్టుకు వెళ్లేవారని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే అదనపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. గోనెగండ్ల మండలానికి సంబంధించిన కేసులు పత్తికొండ కోర్టుకు వెళ్లేవని, ఇక నుంచి ఎమ్మిగనూరు కోర్టుకు మార్పు చేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు పరమేశప్ప, లక్ష్మినారాయణరెడ్డి, డి. మల్లికార్జున, బార్ అసోసియేసన్ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు నీట్–యూజీ పరీక్ష
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నీట్–యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష హాలులోకి అనుమతించబోమన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నీట్–యూజీ పరీక్షలకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 4,995 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాలకు అనువుగా రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో అత్యధిక శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈనెల 24న తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూరు సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. -
పోలీసులూ.. టీడీపీ తొత్తులుగా మారొద్దు
కర్నూలు (టౌన్): పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీకి తొత్తులుగా మారవద్దని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. బాధితులు పోలీసుస్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా స్పందించకోపోవడం దారుణమన్నారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ వార్డులో పనులు చేస్తున్నారని, తనకు రూ.5 లక్షలు కమీషన్ ఇవ్వాలంటూ మున్సిపల్ కాంట్రాక్టర్తో శ్రీరామనగర్కు చెందిన టీడీపీ నాయకుడు సునీల్ కుమార్ గొడవపడారన్నారు. అంతటితో ఆడగకుండా రెండు రోజుల క్రితం దాడి కూడా చేశారన్నారు. బాధితుడు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, కురవ సంఘం నాయకులతో కలిసి మూడో పట్టణ పోలీసు స్టేషన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విన్నవించినా ఎవరి ఒత్తిళ్లతో కేసును నీరు గారుస్తున్నారని ప్రశ్నించారు. బాధితుడిపైనే కేసు దుర్మార్గం కాదా? కర్నూలు పదో వార్డు మాజీ కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా పార్టీ కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేశారని ఎస్వీ మోహన్రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశారని, దీనిపై పోలీసుస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. అయితే దాడి చేసిన మహబూబ్ ఖాన్, అనుచరులపై కేసు నమోదు చేయకుండా బాధితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడంలో పోలీసు శాఖ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తెలుస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయండి.. సెల్యూట్ కొడతాం తండ్రిపై దాడి చేసిన కోపంతో ప్రత్యర్థి వ్యక్తిపై పాతబస్తీకి చెందిన నలుగురు యువకులు దాడి చేశారని ఎస్వీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరని తెలిసే దాడి చేశారని, వీరిని వెంటనే అరెస్టు చేసి రోడ్లపై నడిపించుకుంటూ వెళ్లారన్నారు. అలాకాకుండా బాధితుల వైపు పోలీసులు ఉంటే సెల్యూట్ చేస్తామన్నారు. శాంతిభద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయింది!టీడీపీ ఐటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న గట్టు తిలక్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్కు చెందిన సతీష్ అనే యువకుడు మరణ వాంగ్మూలంలో రాశారని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఎస్వీ అన్నారు. దీంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడని, అయితే అతని కారులో సారాయి ఉందని కేసులు నమోదు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వేధింపులు భరించలేక చనిపోదామని బాలు కత్తితో చేతులు కోసుకున్నాడని, అతనికి మద్దతుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కర్నూలులో ధర్నా చేశారన్నారు. అయితే జక్కంపూడి రాజాపై కేసులు నమోదు చేయడం దుర్మర్గం కాదా.. టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం లేదా.. అని ప్రశ్నించారు. బాధితులను వదిలి అధికార పార్టీకి పోలీస్ యంత్రాంగం కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఫిర్యాదులు చేస్తున్నా.. ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయడం లేదు కాంట్రాక్టర్పై దాడి చేసినా, సతీష్ చనిపోయినా చర్యలేవీ? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి తారకనాథ్ కృషి
● డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ వెల్లడికర్నూలు(అగ్రికల్చర్): ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి దివంగత కార్మిక నాయకులు వై.తారకనాథ్ ఎంతో కృషి చేశారని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ అన్నారు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కర్నూలు మాడ్యుల్ ఆధ్వర్యంలో వై.తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా శనివారం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ఎస్బీఐ శాఖల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. కర్నూలులోని డాక్టర్ వైఎస్సార్ సర్కిల్లోని మెయిన్ బ్రాంచ్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ప్రారంభించారు. కర్నూలులో 70 మంది, ఎమ్మిగనూరులో 80 మంది, ఇతర పట్టణాల్లో 51 మంది ప్రకారం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ విద్యాసాగర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి.శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అయితే కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్నినో కారణంగా పచ్చిమేత కొరతతో పాటు పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 7 లక్షల యూనిట్ల పశువులు ఉన్నాయని, ఆగస్టు నెల వరకు 3 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 2.67 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 75 శాతం సబ్సిడీతో 46 టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా 946 టన్నుల సమీకృత దాణా కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమిని కప్పి ఉంచే నిరంతర పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. -
ఆశల సేద్యానికి తాళం!
ఎన్నో ఆశలతో సేద్యం చేయడానికి యూరియా కోసం వచ్చిన రైతులకు తాళం వేసిన కోసిగి వ్యవసాయ కార్యాలయం వెక్కిరించింది. కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు వరకు అధికారుల కోసం వీరంతా ఎదురు చూడాల్సి వచ్చింది. వ్యవసాయ సహాయక అధికారి ఆలస్యంగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఉందని వెళ్లి పోయారు. రైతులు మాత్రం మధ్యాహ్న 12 గంటలకు వరకు అక్కడే ఉన్నారు. వీరికి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. రెండు రోజులుగా ఇదే దుస్థితి. ఈ విషయమై వ్యవసాయాధికారి ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ సిబ్బందికి బీఎల్ఓ విధులు ఉన్నాయని, మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. రైతుసేవా కేంద్రాల్లో యాప్లో రిజిష్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా అందజేస్తున్నట్లు చెప్పారు. –కోసిగి -
క్షణికావేశంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: క్షణికావేశంలో పట్టణంలోని తేరుబజార్లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. వంశీ, లావణ్య దంపతులకు శృతి(18), వెంకటసాయి సంతానం. వంశీ అనారోగ్యంతో ఏడు సంవత్సరాల కిత్రం మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలను పనిచేసుకుంటు కష్టపడి చదివిస్తోంది. శృతి స్థానిక తిరుపతమ్మ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, ఎంసెట్ సైతం బాగా రాసినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం ఇంటి పైన ఉన్న గదిలో తన బంధువుల అబ్బాయితో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగిందో కానీ శృతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కోసం తల్లి లావణ్య పైకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేయ గా ఇంటి పక్కన వారు వచ్చి కిందకు దించారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి ఘటనాస్థలితో పాటు పోస్టుమార్టం గదిలో శృతి మృతదేహాన్ని పరిశీలించారు. కుమార్తె ఆత్మహత్యకు తమ బంధువుల అబ్బాయి కారణం కావచ్చని, విచారిస్తే అసలు నిజం బయటకు వస్తుందని మృతురాలి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధాకరం
మాకు సొంత భూమి లేదు. కౌలుకు 6.50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈ సారి పత్తి సాగు చేశా. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చేయూత లేదు. గత ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టడం బాధాకరం. బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు. – శేషన్న, జి.సింగవరం, కర్నూలు మండలం మేం దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. మాకు ఐదు ఎకరాలకు సీసీఆర్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ సారి కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సాగులో ఎలా రాణిస్తాం? ఇప్పటికై నా చంద్రబాబు చొరవ తీసుకొని కౌలురైతులకు న్యాయం చేయాలి. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం పింఛన్లు, భూ రీసర్వే అర్జీలే అధికం ● తుగ్గలిలో పీజీఆర్ఎస్ తుగ్గలి: ఒకనెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనల్లో భాగంగా రెండో శుక్రవారం తుగ్గలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా భూ రీసర్వే చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని అధికంగా అర్జీలు వచ్చాయి. పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్, జేసీ, అధికారులు ప్రత్యేక బస్సుల్లో తుగ్గలికి చేరుకున్నారు. పీజీఆర్ఎస్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు ఇవ్వగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జేసీ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. అర్జీలపై వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీలను తిరస్కరిస్తే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. తమ పెద్దల నుంచి సంక్రమించిన 1.85 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని, పెండింగ్లో ఉన్న ఆర్ఓఆర్ కేసు పరిష్కరించాలని కోరినా పరిష్కారం కాలేదని తుగ్గలికి చెందిన రవీంద్రనాథశర్మ పీజీఆర్ఎస్లో విన్నవించుకున్నారు. పత్తికొండ ఆర్డీవో సీహెచ్ ఓబులేసు, తహసీల్దార్ రవి, సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కర్నూలు సిటీ: ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ లభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంఽధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతులు ఇవ్వడంతో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు గోరంట్లప్ప, జిల్లా కమిటీ సభ్యులు టీ.జి ప్రసాద్, చంద్రమోహన్, నగర అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, ఎర్రమల హర్షం వ్యక్తం చేశారు. 2,94,598గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ అందుకున్న అన్నదాతలు కొంత మందికే అన్నదాత సుఖీభవ! కౌలు రైతులకు మొండి చేయి కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన వారికి అందని పెట్టుబడి సాయం గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులందరికీ భరోసా ప్రస్తుతం 2,72,757 మందికే లబ్ధి నేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సాయం విడుదల -
జల్సాలకు అలవాటు పడి అడ్డదారి
● ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన ఇద్దరు దొంగలు ● సీసీ ఫుటేజీ ద్వారా ఛేదించిన పోలీసులు కర్నూలు: జీవనోపాధి కోసం జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉప్పర వీరేష్, వ్యవసాయం చేస్తున్న ముక్కెర రాముడు మద్యం, జల్సాలకు అలవాటు పడి వృత్తిపై వచ్చే ఆదాయం చాలక సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరూ కలసి ద్విచక్ర వాహన చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉప్పర వీరేష్ ద్విచక్ర వాహనం చోరీ చేసి ముక్కెర రాముడుకు అప్పగిస్తే.. అతను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుని ఇద్దరూ కలసి జల్సాలు చేసేవారు. నాలుగు మాసాలుగా సాగిపోతున్న వీరి చోరీల పర్వానికి కర్నూలు సీసీఎస్, మూడో పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి వారి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ తెర్నెకల్లో వివాహం చేసుకుని ప్రస్తుతం అక్కడే నివాసముంటున్నాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన ముక్కెర రాముడుతో పరిచయం ఏర్పడి జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి పోలీసుల నిఘాకు చిక్కారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో పార్కు చేసి ఉన్న బుల్లెట్ వాహనం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ రాత్రి చోరీకి గురైంది. ఆసుపత్రిలో పీజీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ తన బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మెయిన్ గేట్ వద్ద పార్కు చేసి విధులకు వెళ్లి తిరిగి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో తన వాహనం చోరీకి గురైందని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా శుక్రవారం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని అరుంధతి నగర్ టైల్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కంప చెట్లలో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 6 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి వీరేష్ గతంలో గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కూడా ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఆయా పోలీస్స్టేషన్లలో రికార్డులకెక్కాడు. సీఐలు పూల రామకృష్ణ, శేషయ్య, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలసి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా బైకు దొంగలను మీడియా ముందు హాజరుపరచి వివరాలను వెల్లడించారు. -
ప్రాణాలను ‘లెక్క’ పెట్టకుండా..
చిత్రంలో కనిపిస్తున్న ఆటోలో ఉన్న వారంతా మహిళలే.. డ్రైవర్ మినహా. అందులో సాధారణంగా పది మందికి మించి ప్రయాణించడం కష్టం. అలాంటిది.. 10.. 15.. 20 మంది కూడా కాదు.. ఏకంగా 35 మంది ఉన్నారు. పనుల కోసం వారంతా ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఆటోలో వెళ్తూ కనిపించారు. దేవనకొండ మండలంలోని నునుసరాళ్ల నుంచి కొందరు మహిళలు వ్యవసాయ పనులకు ఆటో నిండా టాప్ పైఎక్కి తువ్వదొడ్డికి బయలుదేరారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నా ఎవరిలో మార్పు కనిపించడం లేదు. కుటుంబానికి వెలుగులైన మహిళలూ.. ఏదైనా జరగరానిది జరిగితే.. ఎవరిది బాధ్యత. మీకో కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర ప్రయాణం వద్దు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
కర్నూలు: కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహనం డ్రైవర్ విజయవాడకు చెందిన సత్యనారాయణ (62) మృతిచెందాడు. ఈయన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోని ఆంజనేయ నగర్లో నివాసముంటూ డ్రైవర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఐచర్ కంటైనర్ వాహనంలో తెలంగాణలోని సూర్యపేటకు ఫుడ్ ప్రాడక్ట్కు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తూ కర్నూలులోని ఎన్హెచ్44 రోడ్డుపై బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తూ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఐచర్ కంటైనర్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ సత్యనారాయణ తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు, తల, నుదుటి భాగాలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సత్యనారాయణను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేవలందించిన ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది... ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ దీపిక పాటిల్ ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సత్యనారాయణను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి మృతదేహాన్ని తరలించి భద్రపరిచారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బురద నీరే దిక్కు!
నందవరం: బురద నీరు తాగలేక చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, జొహరాపురం గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాలకు నెదార్లాండ్ స్కీమ్ నుంచి కుళాయి పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరద నీరు చేరింది. దీంతో నెదార్లాండ్ స్కీమ్లో వాటర్ను శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారు. నీరు బురద మయంగా మారాయని, దుర్వాసన వస్తున్నాయని, ఎలా తాగాలని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డబ్ల్ూయ్వస్ అధికారులు స్పందించి మంచి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. -
‘సర్’వేత్రా గందరగోళం!
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్) గందరగోళంగా సాగుతోంది. 2025, 2002 ఓటరు జాబితాల్లో వేలాది మంది ఓటర్ల వివరాలు గల్లంతయ్యాయి. 2024 ఎన్నికల తరువాత జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల వివరాలను వ్యూహాత్మకంగా గల్లంతు చేశారు. దీంతో వారంతా బీఎల్ఓలను తమ ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తున్నా సమాధానం కరువైంది. మరో వైపు 2002 జాబితాపై కూడా ప్రజల్లో ప్రతిష్టంబన నెలకొంది. కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది బతుకుదెరువు కోసం హైదరాబాద్, కడప, బెంగళూరు, ముంబయి, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో 2025లో జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్లో వారి ఓట్లపై వేటు వేశారు. ఆయా ఓటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50వేలకు పైగా వలసదారులను జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్ సర్వేలో వారి ఓటు వివరాలు జాబితాలో లేకపోవడంతో ఖంగుతింటున్నారు. సర్వే పూర్తయిన తరువాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం. 2002 జాబితాపై అదే సస్పెన్స్ ప్రస్తుతం జరుగుతున్న సర్ సర్వేను 2002, 2025 ఓటరు జాబితాలతో పోల్చి చూస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో జాబితాలో లేవు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్న పలు ఓటర్లకు అప్పటిలో ఓటు హక్కు లేకపోవడం, 18 ఏళ్లు వచ్చినా ఓటు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం తదితర కారణాలతో అప్పట్లో ఓటు హక్కు పొందలేకపోయారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలను పోల్చి చూసి సర్ సర్వే చేయాలి. అయితే కొన్ని చోట్ల 2002 జాబితాకు సంబంధించిన ఐడీ కార్డు కావాలని అడుగుతున్నారు. అప్పటి కార్డులను ఓటర్లు ఎందుకు ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నా బీఎల్ఓలు పట్టించుకోని పరిస్థితి. బీఎల్ఓలను భయపెడుతున్న టీడీపీ బీఎల్ఏలు జిల్లాలో ఇప్పటి వరకు 20,56,119 మంది ఓటర్లలో 6,40,008 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫాంలను బీఎల్ఓలు అందజేశారు. దాదాపు 30.60 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పాంలు అందాయి. అలాగే ఆన్లైన్ ద్వారా 7,660 మంది ఎన్యుమరేషన్ ఫాంలను సబ్మిట్ చేశారు. కాగా, ఆఫ్లైన్ ద్వారా బీఎల్ఓలు ఇవ్వాల్సిన ఎన్యుమరేషన్ ఫాంలను టీడీపీ బీఎల్ఏలు భయపెట్టి వారే నేరుగా ఓటర్లకు అందజేస్తున్నారు. ఈక్రమంలో బీఎల్ఓలు వారిని వారించడంలో భయపడుతున్నారు. టీడీపీ మరో మూడేళ్లు అధికారంలో ఉండనుండటంతో భవిష్యత్లో ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న భయంతో మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. మిత్రా యాప్లో నమోదు సందడిలో సడేమియా అన్నట్లుగా టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. సర్ సర్వేను పరిశీలించే నెపంతో నేరుగా ఓటర్ల వివరాలను మిత్రా యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఈ క్రమంలో మిత్రా యాప్ నుంచి నేరుగా ఫాం–7ను రైజ్ చేసి వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్లో అన్ని పార్టీలకు చెందిన బీఎల్ఏలు పాల్గొనవచ్చు. ఎక్కడైనా టీడీపీ బీఎల్ఏలు ఎన్యుమరేషన్ ఫాంలను ఇస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఓటర్ల వివరాలను ఎవరూ కాపీ చేయడానికి వీల్లేదు. – డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు వలసదారుల ఓటర్లను తొలగించిన వైనం 2002 జాబితాపై తొలగని ప్రతిష్టంబన టీడీపీ బీఎల్ఏలే ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ఓటర్ల వివరాలు మిత్రా యాప్లో నమోదు చేస్తున్న టీడీపీ బీఎల్ఏలు ఇదేం పద్ధతి ‘సర్’ బీఎల్ఓలను నిలదీసిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ ఆదోని: ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి వివరాలు సేకరించాల్సిన బీఎల్ఓలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ‘ఇదేం పద్ధతి’ అని వైఎస్సార్సీపీ బీఎల్ఏ అడ్డుకున్నారు. ఆదోని పట్టణంలోని 4, 34 వార్డుల్లో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండా సచివాలయంలోనే టీడీపీ బీఎల్ఏల సహాయంతో ఓటర్లను పిలిపించారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇళ్లకు వెళ్లకుండా సచివాలయాల్లో ఎందుకు కూర్చున్నారని వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు బి.దేవా నిలదీశారు. టీడీపీ బీఎల్ఏ జోక్యం చేసుకుంటూ తప్పేంటి అంటూ వాగ్వాదానికి దిగాడు. బీఎల్ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాల్సిందేనని బి.దేవా పట్టుబట్టాడు. ఎన్యుమరేషన్ ఇవ్వని వారికి చేటు తప్పదని, వారి ఓటు జూలై 21 ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉండదని బి.దేవా హెచ్చరిస్తూ బీఎల్ఓలను సచివాలయం నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. బీఎల్ఓలు ఏదైనా పొరపాటు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాఖపరమైన చర్యలు ఉంటాయని బి.దేవా హెచ్చరించారు. ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి బీఎల్ఓలు బాధ్యతలను నిర్వహించాలన్నారు. -
యథేచ్ఛగా ఇనుప ఖనిజం తరలింపు
ఓర్వకల్లు: మండలంలోని ఉయ్యాలవాడ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా ఇనుప ఖనిజాన్ని గుట్టుగా అక్రమ రవాణా చేస్తున్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని 725, 726 సర్వే నంబర్లలోని అటవీశాఖ, ప్రభుత్వ బంజరు భూములకు సంబంధించి 130 ఎకరాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు భూగర్భ, గనుల శాఖ అధికారులు గుర్తించినట్లు స్థానికుల సమాచారం. ఈ నిక్షేపాలను వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, కలుగొట్ల గ్రామాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా కొల్లగొడుతున్నట్లు తెలిసింది. రాత్రి వేళ టాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బృందంతో మైనింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించడంతో అక్రమ మైనింగ్ బాగోతం బయటపడింది. ఈ ప్రాంతంలో వున్న ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే దర్జాగా లూటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజిస్టు దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు దాడులు చేసి తవ్వకాలను అడ్డుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి నందికొట్కూరు: పట్టణంలోని మారుతీనగర్కు చెందిన కోట లక్ష్మీదేవి(45) బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత వారం అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది ఈనెల 15వ తేదీన ఇంటికి చేరుకుంది. మృతిరాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. లక్ష్మీదేవి మృతిపై అనుమానం ఉందని బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన మృతురాలి సోదరుడు అంజి ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఖాజపీరా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు నంద్యాల (వ్యవసాయం): నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ప్రవచనకర్త డాక్టర్ బోలు గద్దె అనిల్ కుమార్ హాజరయ్యారు. నలదమయంతుల కథ అన్ని కాలాల్లోని ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకట్ రెడ్డి, నిత్యాతృప్తా దాసు స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి, నాగ ప్రసాద్ రెడ్డి, బాలశివారెడ్డి, సుబ్బారావు, రాముడు, పెద్ద వీరయ్య, లక్ష్మీదేవి, ఇందిరాదేవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగు ఇలా.. బడికెలా?
సొంతబ్యాగులు వేసుకొని వెళుతున్న విద్యార్థులు పాతబ్యాగుతోనే పాఠశాలకు వచ్చిన విద్యార్థి చిరిగిన బ్యాగుకు పిన్నీసు పెట్టుకుని..పేద విద్యార్థులనో.. నోరెత్తి అడగలేరనో.. తెలియదు కానీ.. కూటమి సర్కారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోంది. 2026–27 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరవగానే విద్యాకిట్లు ఇస్తామన్న కూటమి పాలకుల ప్రకటనలు ఒట్టిమాటలయ్యాయి. కేవలం పుస్తకాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు చిరిగిన, పాత బ్యాగులతోనే బడికి వస్తున్నారు. ప్రభుత్వ తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బడులు తెరిచి రోజులు గడుస్తున్నాయని, పూర్తి స్థాయిలో కిట్లు ఇంకెప్పుడిస్తారని మండిపడుతున్నారు. – మద్దికెర -
జూలై 11న లోక్ అదాలత్
కర్నూలు: కోర్టులలో ఉన్న సివిల్, భూసేకరణ, పన్ను బకాయిలు, మున్సిపల్ కేసులు జులై 11న నిర్వహించనున్న లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు మున్సిపల్, సచివాలయ, కెనరా లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్ అధికారులతో స్థానిక ప్రాంగణంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ, బ్యాంకు, మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. -
గ్రామీణ రోడ్ల్లను పట్టించుకోని ప్రభుత్వం
ఆస్పరి: అధ్వానంగా మారిన గ్రామీణ రోడ్లను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలికంగా నిర్మించుకున్న ఆస్పరి మండలంలోని యాటకల్లు బ్రిడ్జి తెగిపోయింది. తెగిపోయిన యాటకల్లు బ్రిడ్జిని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన వర్షాలకు యాటకల్లు బ్రిడ్జి తెగిపోయిందన్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్వయంగా తాను అప్పటి కలెక్టర్ రంజిత్ బాషాకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తాత్కాలికంగా గరుసు వేసి నిర్మించుకున్నా ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిందన్నారు. ఫలితంగా మండల కేంద్రమైన ఆస్పరికి వచ్చేందుకు యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, బైలుపత్తికొండ, గార్లపెంట, కై రుప్పల, కారుమంచి, ములుగుందం, డి.కోటకొండ గ్రామాల ప్రజలు అదనంగా మరో 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. రైతులు పండించిన పంటలను ఆటో, ట్రాక్టర్లులో ఆస్పరి మార్కెట్కు తీసుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా యాటకల్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఆయా గ్రామాల ప్రజలతో కలసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. -
వాటర్ను కొనుగోలు చేస్తున్నారు
చిప్పగిరి మండలం కాజీపురం రిజర్వాయర్ నుంచి తొమ్మిది గ్రామాలకు సరఫరా అయ్యే నీరు పూర్తి కలుషితమవుతోంది. కుళాయిల ద్వారా వస్తున్న బురద నీరు తాగేందుకు ఏ మాత్రం పనికిరాని పరిస్థితి నెలకొంది. ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని రిజర్వాయర్లో నిల్వ చేసి గ్రామాలకు వదులుతున్నారు. ఫిల్టర్బెడ్లు లేని కారణంగా రిజర్వాయర్లోకి వచ్చిన నీటిని యథాతథంగా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. కొందరు మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లోని నీటి పథకాల ఫిల్టర్ బెడ్లు మార్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే 19 నీటి పథకాల ఫిల్టర్బెడ్ల నిర్వహణకు రూ.6 కోట్లు అవసరమవుతాయని జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. క్షేత్ర స్థాయిలో సమ స్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నాం. – సీహెచ్ మనోహర్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ బాపురం రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న మంచినీరు శుభ్రంగా రావడం లేదు. నీరు ఫిల్టర్ కాకపోవడం వల్ల బురద, నాచు నీటిలో వస్తున్నాయి. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారు. శుభ్రమైన నీటిని సరఫరా చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – నాగరాజు, బాపురం, హాలహర్వి -
పరిపాలనాధికారులుగా ముగ్గురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు పరిపాలనాధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. వీరిలో ఎం.వీరభద్రయ్యను కౌతాళం ఎంపీడీఓ, బి.గిడ్డమూర్తిని జెడ్పీ, ఏవీ రమణయ్యను ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి ఏఓలుగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఏఓలుగా పదోన్నతి పొందిన వారు పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే పలువురు సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పి స్తూ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రామగిడ్డయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ఆయన సీనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. రాయలసీమ జోన్లో పది మంది పదోన్నతి పొందగా అందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో కర్నూలులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే విశ్వనాథ్ కడపలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే అంబ ప్రసాద్ సింగ్ కర్నూలు మెడికల్ కాలేజీకి, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే శివనాగిరెడ్డి కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు, చంద్రహాసుడు కడప డీఎంహెచ్ఓ కార్యాలయం, బ్రాహ్మణకొట్కూరులో పనిచేసే కేవీఎన్ రాజశేఖర్ కడప డీఎంహెచ్ఓ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యారు. నత్తనడకన వేరుశనగ పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ పంపిణీ నత్తనడకన సాగుతోంది. విత్తన పంపిణీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా జాప్యం చోటు చేసుకుంటోంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వివిధ మండలాల్లోని రైతుసేవా కేంద్రాల్లో దాదాపు 2,500 క్వింటాళ్ల వేరుశనగ రైతులకు అందుబాటులో ఉంచింది. ఆదోని, తుగ్గలి, పత్తికొండ, వెల్దుర్తి, కోడుమూరు, హాలహర్వి, ఆలూరు మండలాల్లో వేరుశనగ పంపిణీ మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వర్షాలు కురుస్తాయో లేదోననే భయం రైతులను వెంటాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో పీఓలకు స్థానచలనం కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్లకు స్థాన చలనం కలగనుంది. ఈ శాఖలోని పలువురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తూ డిప్యుటేషన్పై ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని తప్పించి, వీరి స్థానంలో సివిల్ సర్జన్లు లేదా డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అర్హులైన వారి వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రస్తుతం పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం వైద్యారోగ్యశాఖలో జోరుగా సాగుతోంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గతేడాది సప్లిమెంటరీ పరీక్షల కంటే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది తగ్గిపోయింది. గత నెల 21 నుంచి ఈ నెల 5వ తేది వరకు నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేపట్టారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ విభాగంలో 5215 మంది హాజరు కాగా 2045 మంది, వొకేషనల్ విభాగంలో 964 మంది పరీక్షలు రాస్తే 436 మంది పాసయ్యారు. సెకండియర్ జనరల్ విభాగంలో 3,388 మంది హాజరు కాగా 1927 మంది, వొకేషనల్ విభాగంలో 472 మంది హాజరు కాగా 296 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఫస్టియర్లో జిల్లా రాష్ట్రంలో 10వ, సెకండియర్లో 8వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఈ నెల 19 నుంచి 26వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300, రీకౌంటింగ్కు రూ.260 ఆన్లైన్లో చెల్లించాలని అధికారులు తెలిపారు. -
అడవిలో అర్ధరాత్రి ఆక్రమణలు
ఆలూరు/హాలహర్వి: అక్రమ సంపాదన కోసం పచ్చ నేతలు ప్రకృతిని కొల్లగొడుతున్నారు. ఓ వైపు గ్రావెల్ కోసం కొండలను కరిగిస్తూ.. మరో వైపు ఇసుక కోసం నదులు, వాగులను గుళ్ల చేస్తున్న టీడీపీ నేతలు తాజాగా అడవిపై కన్నేశారు. అర్ధరాత్రి వేళ గుట్టుగా అడవిలో చెట్లను నరికేసి, భూములను చదును చేసి దర్జాగా ఆక్రమించుకోవాలనుకున్నారు. అయితే అటవీశాఖ అధికారుల దాడితో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామ రిజర్వు ఫారెస్టు కంపార్ట్మెంట్–2లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గూళ్యం అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ దిబ్బల సోమప్ప దేవాలయం వెనుక భాగంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత అనుచరులు కుట్ర పన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జేసీబీలతో అక్కడికి చేరుకుని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వందలాది ఈత చెట్లను కూకటి వేర్లతో సహా తొలగించేశారు. అడవిలో అర్ధరాత్రి ఆక్రమణల విషయం తెలుసుకున్న ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, బీఎఫ్ఓలు విమల్, బాలు, తదితరులు అర్ధరాత్రి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే జేసీబీ డ్రైవర్లు వారిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అక్రమణల సమాచారాన్ని హాలహర్వి పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను గమనించిన జేసీబీ డ్రైవర్లు వాహనాలను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరు జేసీబీలను వెంటనే సీజ్ చేసి హాలహర్వి పోలీస్స్టేషన్కు తరలించారు. జేసీబీ డ్రైవర్లు దాసరి తిమ్మరాజు, పి.అశోక్, వై.ఆనంద్, దాసరి హనుమేశ్, సందీప్ కుమార్, నవీన్పై, వారిని ప్రోత్సహించిన దొడ్డ గాదిలింగప్ప, పాండురంగపై కేసులు నమోదు చేసినట్లు ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. అయితే అటవీ అధికారులపై దాడి విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా అదేమీ లేదని సమాధానం ఇచ్చారు. అటవీ సంరక్షణకు విఘాతం కలిగించినా, అటవీ సంపదను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆక్రమణల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. అటవీ భూమిలో చెట్లను తొలగించిన దృశ్యంపట్టుబడిన జేసీబీలను చూపుతున్న ఫారెస్ట్ అధికారులు అటవీ భూముల కబ్జాకు యత్నించిన టీడీపీ నేతల అనుచరులు చెట్లు నరికి, భూమిని చదును చేసిన వైనం అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి ? ఆరు జేసీబీలు స్వాధీనం, 8 మందిపై కేసు నమోదు -
హాస్టళ్ల నిర్వహణలో అశ్రద్ధ వద్దు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి అశ్రద్ధ ప్రదర్శించరాదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో పత్తికొండ, ఆదోని డివిజన్లకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలను మెరుగుపరచాలని, ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూల థృక్పథం ఏర్పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో పత్తికొండ, ఆదోని సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): పాల ఉత్పత్తిని పెంచేందుకు 50 శాతం సబ్సిడీతో సమీకృత దాణా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. 50 కిలోల ప్యాకెట్ పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో 50 శాతం సబ్సిడీ మినహాయించి రూ.555 పాడి రైతులు చెల్లించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు 946 మెట్రిక్ టన్నుల దాణా కేటాయించారని, ఇందులో మొదట ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ రైతులకు 330 టన్నులు, ఎస్టీ రైతులకు 83 టన్నుల ప్రకారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన దాణా ఇతరులకు పంపిణీ చేస్తామని.. వివరాలకు రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించాలన్నారు. వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ) ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి.దుర్గా ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీమా చేసిన ఉద్యోగుల పిల్లలు అందుకు అర్హులని, దేశవ్యాప్తంగా 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. నీట్(యూజీ)–2026 ర్యాంకు ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్కు జూన్ 21వ తేదీలోపు, అలాగే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కోసం జూన్ 24వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పీఆర్ ఈఈగా శివసాగర్రెడ్డి బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈగా జి.శివసాగర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శివసాగర్రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు నియమించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 30న ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన ఎస్.మహేశ్వరరెడ్డి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి పాణ్యం డీఈఈ నాగిరెడ్డి ఇంచార్జీ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఈఈగా శివసాగర్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పీఆర్, పీఐయు డీఈఈలు బండారు శ్రీనివాసులు, కర్రెన్న, నాగిరెడ్డి, ఆర్.సతీష్కుమార్, పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈలు ధనిబాబు, భాస్కర్రెడ్డి, పత్తికొండ డీఈఈ శేషయ్య, డీఏఓ నాగశేఖర్రెడ్డి, ఏఈలు శుభాకాంక్షలు తెలిపారు. 20న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 23వ విడత ఆర్థిక సహాయం ఈ నెల 20న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ–కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2026–27 సంవత్సరానికి మొదటి విడత పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ కింద రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నా యి. అయితే ఎంత మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 19న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై గ్రామసభలు కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా వాలిడేషన్పై ఈనెల 19న జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల పరిధిలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎస్డబ్ల్యూ సచివాలయాల అధికారి టీవీ భాస్కర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వే డేటాను ఆయా సచివాలయాల పరిధిలో ఈనెల 18న పంచాయతీ కార్యదర్శులు/వార్డు అడ్మిన్ సెక్రెటరీల ద్వారా ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు పోర్టల్ ద్వారా నమోదు చేస్తారన్నారు. కుల సంబంధమైన అభ్యంతరాలను సంబంధిత వీఆర్వో, తదుపరి అధీకృత అధికారి ద్వారా ఈనెల 27వ తేదీ వరకు పరిశీలిస్తారన్నారు. కులాలకు సంబంధం లేని అభ్యంతరాలు, ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ సెక్రెటరీల ద్వారా ఈనెల 26వ తేదీ వరకు ప్రాసెస్ చేస్తారన్నారు. -
యోగాతో ఆరోగ్యం
● ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు నంద్యాల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్షెరాన్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం యోగా నిపుణుల సూచనల మేరకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, అనారోగ్య సమస్యలకు యోగం చక్కని పరిష్కారంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పటివరకు జిల్లాలో 3.50 లక్షల మంది ‘యోగాంధ్ర’ యాప్, పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఆరోజు జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు, మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమ ఆదేశించారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో బుధవారం కర్నూలు పట్టణ వార్డు ఆరోగ్య కార్యకర్తలకు పల్స్పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించే జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అర్హులైన పిల్లందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. పోలియో బూత్లతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రత్యేక మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి ఆమె వివరించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బంది, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
వెల్దుర్తి: పట్టణ పరిధిలోని డోన్వైపు రైల్వే గేటు దాటిన తర్వాత హైవే–44పై యూ టర్న్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతులూరి ఆచారి (68) మృతి చెందాడు. వివరాలు.. మండల పరిధిలోని ఎల్ నగరంకు చెందిన పోతులూరి ఆచారి రైతు పనితో పాటు వడ్రంగి వృత్తి చేసేవాడు. ఐదు నెలల క్రితం నుంచి వెల్దుర్తికి వచ్చి ఇక్కడే నివాసముంటున్నాడు. బుధవారం కృష్ణగిరి మండలంలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు తన టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిల్పై వెళ్తూ పట్టణ రహదారి నుంచి హైవేలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో ఒరిస్సాకు చెందిన శుభమ్ తన స్పోర్ట్స్ బైక్పై హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తూ టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొట్టాడు. కింద పడ్డ పోతులూరి ఆచారి కాలికి గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య శంకరమ్మ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు!
నిత్యం రోగుల సేవల్లో తరిస్తున్న వారు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. పదేళ్లుగా వారికి ప్రతి నెలా సక్రమంగా అందుతున్న జీతాలు నాలుగు నెలలుగా ఆగిపోయాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఒక్కో శాఖ ఒక్కో కారణం చెబుతోంది. వైద్య ఆరోగ్య శాఖ నిధి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉందని చెబితే, ట్రెజరీ శాఖ మాత్రం వారి నియామక ఉత్తర్వులు సరిగ్గా లేవని, అన్ని పత్రాలు సమర్పిస్తే జీతాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఎండమావిలా మారుతున్నాయి.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్టు విధానంలో దాదాపు 2 వేల మంది స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ఈ యేడాది మార్చి నుంచి జీతాల రాక ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు వీరికి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు మంజూరయ్యేవి. ఇప్పుడు దాని స్థానంలో నిధి పోర్టల్ను ఏర్పాటు చేశారు. అందులో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంది. వివరాలను అప్లోడ్ చేయాల్సిన ఉద్యోగులు కొన్ని రోజుల పాటు తీవ్ర జాప్యం చేశారు. వారు అడిగే వివరాలన్నీ తెచ్చి ఇవ్వలేక కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు నరకయాతన అనుభవించారు. వివరాలు నమోదు చేసి ట్రెజరీకి పంపే ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్య మరింత జఠిలమయ్యింది. కార్యాలయం చుట్టూ ఉద్యోగులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జీతాల కోసం స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు నిధి పోర్టల్లో వారి వివరాలు సరిగ్గా నమోదు చేయించుకునేందుకు ఆసుపత్రిలోని పరిపాలనా విభాగం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఇందులో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, ఈసీజీ టెక్నీషియన్లు, అనెస్తీషియా టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, డయాలసిస్ టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆపరేషన్ థియేటర్ ఉద్యోగులు, బయోమెడికల్ ఇంజినీర్లు కలిపి దాదాపు 440 మందికి పైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిధి పోర్టల్ సమస్య ఉన్నా అన్ని చోట్లా పరిష్కారమయ్యింది. కానీ కర్నూలులోనే సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ఈ విషయమై ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులు మంత్రి టీజీ భరత్ను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కొంతకాలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల జీతభత్యాల విషయం కర్నూలు మెడికల్ కాలేజీలోని ఏడీ చూస్తున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు ఈ విషయం తమ పరిధిలోనిది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్లర్కులు సైతం వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్టాఫ్నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధి పోర్టల్ పేరుతో వేధింపులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో పలు మార్పులు చేశారు. నిధి పోర్టల్ ద్వారా జీతాలు చెల్లించాలంటే ముందుగా ఉద్యోగుల నియామక పత్రాలు, కేడర్ వివరాలు, శాఖల వారీగా పోస్టుల వివరాలు, అప్పటి రోస్టర్ వివరాలు, రోస్టర్ నంబర్, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నంబర్లు వంటి వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2016లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అప్పటి అధికారులు 56 మందికిగాను ఏకంగా 156 మందికి పైగా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అప్పట్లో వివాదం జరిగింది. ఈ క్రమంలో కొందరికి రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఇవ్వలేకపోవడంతో వివరాలు సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు పలుమార్లు జీతాలు నిలిపినట్లు సమాచారం. ఇప్పుడు కూడా నిధి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి రావడంతో సమస్య మొదటికి వచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా అందని వేతనాలు ఇబ్బంది పడుతున్న స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ట్రెజరీ అధికారుల కొర్రీలు నియామకపు ఉత్తర్వుల్లో రోస్టర్ పాయింట్లు లేవని మెలిక శాపంగా మారిన నిధి పోర్టల్ అందులో పూర్తి వివరాలను అప్లోడ్ చేస్తేనే జీతాలు పట్టించుకోని అధికారులునిధి పోర్టల్ పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు. ఈ పోర్టల్లో మంజూరైన పోస్టులు, నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్లు వంటి వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు ట్రెజరీ శాఖ అధికారులు మాత్రం రోస్టర్ పాయింట్లు లేకుండా గతంలో రిక్రూట్ చేశారని, శాంక్షన్ పోస్టుల కన్నా ఎక్కువ మందిని నియమించారని చెబుతున్నారు. ఈ గందరగోళం వల్లే జీతాల సమస్య వచ్చి పడింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులకు పాత సీఎఫ్ఎంఎస్ విధానంలోనే జీతాలు ఇవ్వాలి. –సి.బంగారి, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం కర్నూలు కార్యదర్శి కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగుల జీతాల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ట్రెజరీ శాఖలో సమస్య పరిష్కారం అవుతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాలు వేస్తారు. ఉద్యోగులు పంపిన వివరాలను ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని వివరాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగం కింద నియామకం పొందిన కొందరు ఉద్యోగులు మాత్రం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. – కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్, కర్నూలు మెడికల్ కాలేజీ -
పొలాలన్నీ ఇసుక దిబ్బలే!
ఏ పొలం చూసినా ఇసుక దిబ్బలే.. కుంబళనూరు–నదిచాగి మెయిన్ రోడ్డుకు ఇరువైపుల పొలాలన్నీ ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్నారు. అయితే కుంబళనూరు కొత్త గ్రామం నుంచి పాత గ్రామం వరకు పొలాలన్నింటినీ నిర్వాహకులు రెండింతల కౌలుకు మాట్లాడుకున్నారు. ఇక ఏ పొలం చూసినా ఇసుకతో నింపేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు ఈ దారిలో ప్రయాణమంటే చుక్కలు చూస్తున్నారు. కొద్దిగా గాలి వస్తే చాలు ఇసుక కళ్లలో పడుతుండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు నోరు మెదపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. – కౌతాళం -
‘సర్’లో ఏకపక్షంగా ఉండొద్దు
ఆదోని: సర్ సర్వేలో బీఎల్ఓలు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించరాదని, అధికార పార్టీకి లేదా ఇతర పార్టీ బీఎల్ఏలకు అనుకూలంగా వ్యవహరించొద్దని, ముఖ్యంగా ఓటర్ల సమాచారం రాజకీయ పార్టీల యాప్లోకి అప్లోడ్ చేయకుండా చూడాలని ఆదోని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా బుధవారం రాత్రి బీఎల్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ పలు సూచనలు చేశారు. ‘సర్’ సర్వేకు ఏ పార్టీ వారు వచ్చినా అభ్యంతరం తెలపొద్దని, అయితే ఓటర్ల వివరాలను వారి వ్యక్తిగత యాప్లోకి వెళ్లకుండా నిలుపుదల చేయాలన్నారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఎక్కడా గందరగోళం చోటు చేసుకోకూడదని, వాటిని ఏ రాజకీయ పార్టీ బీఎల్ఏలకు ఇవ్వకూడదని ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియలో ప్రతి ఒక్క బీఎల్ఓ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను కలవాలన్నారు. -
మతిస్థిమితం సరిగాలేని యువకుడి ఆత్మహత్య
మహానంది: కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేక రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన గోపవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మనాయుడు దంపతుల రెండో కుమారుడు ముత్తా మదన్ (27) వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులకు వెళ్లేవాడు. కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగా లేక మనోవేదనకు గురయ్యేవాడు. ఈ స్థితిలో మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న నంద్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్రంకెన్ డ్రైవ్లో ఐదుగురికి జైలుశిక్ష ఆదోని రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు తాలూకా సీఐ నల్లప్ప బుధవారం తెలిపారు. ఇందులో సింధనూరు తాలూకా రాయచూరు జిల్లాకు చెందిన యన్నూరు, ఆదోని పట్టణానికి చెందిన ఎం.పెద్ద ఈరన్న, ఆస్పరి మండలం నగరూరుకు చెందిన బాట రామకృష్ణ, ఆదోని పట్టణానికి చెందిన ఎరుకల సుంకన్న, సాంబగల్లు గ్రామానికి చెందిన సూరిపోగుల రాజు ఉన్నారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. పంచాయతీ సెక్రటరీకి రిమాండ్ వెల్దుర్తి: పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ ఇంటి అప్రూవల్ కొరకు మంగళవారం ఓ టీస్టాల్ వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ స్థానిక మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ను బుధవారం ఏసీబీ కర్నూలు కోర్టులో హాజరుపరుచగా జడ్జి 15 రోజుల రిమాండ్కు ఆదేశించినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పంచలింగాల డిస్ట్రిక్ జైలుకు తరలించినట్లు చెప్పారు. మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుకున్న సెక్రటరీని ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వరకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారించారు. సతీష్ తాను ఇంటి అప్రూవల్ కొరకు పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం, ఆ అర్జీని సెక్రటరీ లక్ష్మీనాథ్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ చంద్రశేఖర్వర్మకు పంపడం, అనంతరం స్పెషల్ ఆఫీసర్ కార్యాలయానికి పంపడం తదితరాలను సెక్రటరీని, తహసీల్దార్ను విచారించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆయన్ను కర్నూలుకు తరలించారు. పట్టుబడ్డ నిందితుడికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, అవినీతి ఆదాయ పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఊరి వేసుకుని యువకుడి బలవన్మరణం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని వగరూరు గ్రామంలో మద్యం తాగి యువకుడు ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన ముల్లా రహిమాన్ (30) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. తాను అప్పుల పాలయ్యానని, బతికినా దండగ అంటూ తరచూ చెప్పేవాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతనికి సర్ధి చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య బషీరూమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముంభైలో కోసిగి యువకుడి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రంలోని సిద్దప్ప పాళెం ఊరువాకిలి సమీపంలో నివాసం ఉంటున్న కోదండ వెంకటేష్, సునీత దంపతుల కుమారుడు సాయికుమార్ (22) బుధవారం ముంభైలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడు డిగ్రీ వరకు చదువుకుని గతేడాది నుంచి ముంభైలో బంధువుల వద్ద ఉంటూ కాల్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఈ స్థితిలో ఏమైందో గానీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంభైకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. -
ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం
పాణ్యం: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటలకు ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు వెనుక భాగంలోని డోర్ నుంచి కిందకు దిగారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆంజనేయ ట్రావెల్ బస్సు 32 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పాణ్యంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే ముందు పౌడర్ లోడ్తో వెళ్తున్న లారీ ఎడమవైపు తిరిగే క్రమంలో బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు అద్దం పగిలిపోగా ముందు భాగం దెబ్బతింది. బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురై హాహాకారాలు పెట్టారు. బస్సు ముందువైపు ఉన్న డోర్ లాక్ కావడంతో వెనక ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి సిబ్బందిని ఘటనా స్థలానికి పంపి విచారణ చేపట్టారు. హైవే పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను పలు బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. ఇదిలాఉండగా మండలంలో వరుసగా బస్సుల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు, ప్రజలు హడలిపోతున్నారు. -
కొట్టుకుపోయిన పొలాల దారి
పెద్దకడబూరు: మండల కేంద్రం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న తక్కిడి ఓణి రస్తా (పొలాల రస్తా) మొన్న కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొని పోయి గుంతగా మారింది. దారి ప్రమాదకరంగా మారడంతో రైతులు తమ పొలాలకు ఎద్దులబండి కట్టుకొని పోవాలన్నా, ఆ రస్తాగుండా వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు కూడా కష్టంగా మారింది. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రైతులు నిత్యం ఆ రహదారిలో వెళ్లాల్సిందే. మరో వర్షం వస్తే ఉన్న కాస్తకూడా తెగిపోతే అటువైపు పొలాలకు దారేలేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహాదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మున్సిపల్ కాంట్రాక్టర్పై టీడీపీ నేతల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్, కర్నూలు: ఏయ్.. మేము ప్రజాప్రతినిధి అనుచరులం. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ మున్సిపల్ కాంట్రాక్టర్పై దాడికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్పై దౌర్జన్యం చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కాంట్రాక్టర్గా, అసోసియేషన్ నాయకులుగా ఉన్న రంగయ్యకు స్థానికంగా శ్రీరామ నగర్కు చెందిన సునీల్ కుమార్ పని విషయం మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశాడు. దీంతో ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత మా ఏరియాలో పనులు చేస్తున్నావు కదా.. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. గొడవకు దిగారు. అంత ఇచ్చుకోలేనని, తన వద్ద లేవంటూ సమాధానమిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ప్రజా ప్రతినిధి అనుచరులు కాంట్రాక్టను తీవ్రంగా కొట్టారు. తలపై, చెవిపై దాడి చేశారు. అక్కడి నుంచి బాదితుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వైద్యం చేయించుకున్నాడు. కర్ణబేరి దెబ్బతినిందని చెప్పడంతో మరో ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషయమై ‘సాక్షి’ బాధితుడితో మాట్లాడగా.. ‘‘నగరంలోని శ్రీరామనగర్కు చెందిన టీడీపీ ముఖ్యనేత అనుచరులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇవ్వకుంటే ఎలా పనులు చేస్తావో చూస్తామని బెదిరించారు. ఇలాగైతే కర్నూలులో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని వాపోయినా వినిపించుకోలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదు. 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్గా ఉన్నా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పనులు చేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడు కర్నూలులో పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఓ వైపు చేసినా పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నాం. మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నేత అనుచరులంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోని పోలీసులు బాధితుడు బుధవారం సాయంత్రం తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని, కనీసం ఫిర్యాదు తీసుకోలేదని రంగయ్య వాపోయాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ను కలుస్తానన్నారు. తనపై దాడి చేసిన టీడీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతానన్నారు. -
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక న్యాయ సహాయ సెల్
● జిల్లా జడ్జి జి.కబర్ధికర్నూలు(టౌన్): ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి జి.కబర్ధి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రత్యేక సెల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల సంక్షేమానికి న్యాయ సహాయ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శివరాం, సులోచన, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం జైలులో ఉన్న ఖైదీలు వారికున్న హక్కులను తెలుసుకోవాలని, ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను, ములాఖత్ హెల్ప్ డెస్క్ను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని ఆదేశించారు. లీగల్ ఎయిడ్ న్యాయవాదులు శివరాం, సులోచన, హెల్ప్డెస్క్ న్యాయవాది ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
టీబీ డ్యాంలో 9.9 టీఎంసీల నీరు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 9.903 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్ఫ్లో 319 క్యూసెకులు ఉండగా.. బళ్లారి పట్టణానికి, ఆర్బీసీ కాలువలకు 380 క్యూసెక్కుల (అవుట్ఫ్లో) నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1605.27 అడుగుల వద్ద 29.145 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్ఫ్లో 14,621 క్యూసెక్కులు నమోదైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఇప్పటికే రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే బళ్లారి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు బుధవారం టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు 180 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. ఎల్లెల్సీకి వదులుతున్న నీరు బళ్లారి పట్టణానికి మాత్రమే కావడంతో ఆంధ్ర ప్రాంత రైతులు నిరాశకు లోనవుతున్నారు. -
నాణ్యత చినుకులకెరుక!
టీడీపీ కాంట్రాక్టర్లకు డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ చేస్తున్న పనులపై ఉండటం లేదనేందుకు ఈ రోడ్డే నిదర్శనం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, పట్టణ నడిబొడ్డున నిర్మించిన రోడ్డు పట్టుమని వంద రోజులు కాకమునుపే గుంతలు తేలడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమీషన్ల బాగోతమే ఈ నాసిరకం పనులకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు దాదాపు 2.60 కిలోమీటర్ల ప్రధాన రహదారిని రూ.2.75కోట్లతో నాలుగు నెలల కిందట నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో రెండు వారాలకే చాలాచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. రెండు రోజుల కిందట కురిసిన మొదటి వానకే అంబేడ్కర్ సర్కిల్ ప్రధాన రహదారి ఎక్కడికక్కడ గుంతలు తేలుతోంది. అయితే కాంట్రాక్టర్ కనీస మరమ్మతులు చేపట్టకపోవడం చూస్తే అధికారుల పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. – పత్తికొండ -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 23 మంది ఎంపిక
కర్నూలు(సెంట్రల్): యోగాంధ్రలో భాగంగా జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి 23 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో వారంతా జేసీ నూరుల్ ఖమర్ను ఆయన కార్యాలయంలో కలవగా ఆయన అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని ప్రోత్సహించారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, యోగాంధ్ర, ఆయూష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమర్నాథ్, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ పాల్గొన్నారు. హోంగార్డులకు బీమా అవసరం కర్నూలు(టౌన్): ఆరోగ్య భద్రతకు బీమా వంటి ఇన్సూరెన్స్ పాలసీలు హోంగార్డులకు అవసరమని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో హోంగార్డ్స్ పరేడ్, దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో 70 మంది హోంగార్డులు హాజరయ్యారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం లెక్కింపు బేతంచెర్ల: మండలపరిధిలోని ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.45,73,676 వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రంలోని హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో మొత్తం 34 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించగా రూ.45,73,676 నగదు, 66 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వెల్లడించారు. బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీనపడటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాల్సి ఉంది. అయితే రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలులో గరిష్టంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రతల ప్రకారం 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదు కావాల్సి ఉంది. అయితే సాధారణం కంటే 4–5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో రాత్రి ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు చోట్ల 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి
దేవనకొండ: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల గ్రామంలో రైతు సదాశివరావు హై–డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు చేస్తున్న మామిడి పంటను కలెక్టర్ పరిశీలించారు. సూక్ష్మ నీటిసాగు సదుపాయాలతో సాగు చేస్తున్న ఇలాంటి తోటలు అధిక ఉత్పాదకత సాధించడంలో ఆదర్శమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం దేవనకొండలో పలువురు రైతులు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరితోటతో పాటు మిశ్రమ, అంతర పంటల విధానాలను కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత మన గ్రోమోర్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా, ఎరువుల విక్రయాల్లో ఫిర్యాదులు ఉంటే 155251, 8341302863 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో విఫలమైన బండగట్టు, కుంకనూరు, ఆర్ఎస్కే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యూ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసెర్ వి.వెంకట బసరావు హెచ్చరించారు. బుధవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్నాయుడుతో కలిసి వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏ ఒక్క పని చేపట్టలేదని, అలాంటప్పుడు అవకతవకలకు ఆస్కారమెక్కడిదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు వర్సిటీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. విద్యార్థి సంఘాల నేతలకు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా మార్పు రాకపోవడంతోనే ఇటీవల ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకున్నామన్నారు. నాన్ బోర్డర్స్ను వర్సిటీ హాస్టళ్లలోకి అనుమతించేది లేదన్నారు. వర్సిటీలో ఇప్పటికే నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల బీఏ ఎకనామిక్స్(ఆనర్స్), బి.ఫార్మసీ కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వర్సిటీకి ఐఎస్వో 4 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు. న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించామన్నారు. సమావేశంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్ తదితరులు పాల్గొన్నారు. -
బుసలు కొడుతున్న పాములు
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు ఎక్కడెక్కడో దాక్కున్న విష పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. వాటికి అడ్డొచ్చిన వారిని కాటేసి వెళ్లిపోతాయి. దీంతో పలువురు విష పురుగుల కాట్లకు బలికావాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాలో పాము కాట్లతో పలువురు మృతి చెందారు. ఇలాంటి సమయంలో విషపురుగుల భారి నుంచి కాపాడుకోవడంపై ప్రత్యేక కథనం. ● వర్షాలకు బయటకు వస్తున్న విషపురుగులు ● జిల్లాలో ఇప్పటికే పలువురికి పాముకాటు ● బేతంచర్లలోని డోన్ రహదారిలో ఉన్న ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పాము కరిచి ఈ నెల 10వ తేదీన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోసాగోప్ అనే మహిళ మరణించారు. ● బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన మధులిఖిత్ అనే బాలుడు ఈ నెల 10న ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటేసింది. తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.● కోడుమూరు మండలం కల్లపరి హైస్కూల్లో వంట గదిలో బియ్యం సంచుల మధ్య నాగు పాము కనిపించింది. పాములు పట్టే వ్యక్తిని పిలిచి పట్టుకొని బయట వదిలేశారు. కర్నూలు(హాస్పిటల్): మృగశిరకార్తె ప్రారంభం అవుతుండగానే జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. చినుకు నేలరాలగానే వేడిగా ఉన్న భూమి కాస్త చల్లబడుతోంది. ఈ క్రమంలో ఉత్పత్తయ్యే వేడి ఆవిర్లను భరించలేక భూమి పొరల్లోని బొరియల్లో దాక్కున్న విషపురుగులు బయటకు వస్తున్నాయి. వాటికి సురక్షితమనుకున్న ప్రాంతంలో నక్కి ఉంటున్నాయి. అవసరాల రీత్యా మనుషులు వాటిని కదిలించడంతో వెంటనే కాటేస్తున్నాయి. ● ధాన్యపు గాదెలు, గడ్డివాముల వద్ద, పేడ దిబ్బలు, కట్టెలు కుప్పపోసిన ప్రాంతాల్లో పాములు ఎక్కువగా ఉంటాయి. ● పాము కాటుకు గురిగాకుండా రాత్రివేళ విధిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాల్లో నడిచేటప్పుడు చేతి కర్రతో చప్పుడు చేస్తూ వెళ్లాలి. తప్పనిసరిగా చెప్పులు/బూట్లు ధరించాలి. విషసర్పం కాటు–లక్షణాలు తాచుపాము విష ప్రభావం శరీరంలో ప్రవేశించడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లత్రాచు (కింగ్కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒక రకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. ● కాటు వేసిన ప్రాంతంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. ● నొప్పి క్రమంగా పైకి పాకుతూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ● పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుపోయినట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, కొందరికి నోట్లో చొంగ కారవచ్చు. ● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. పాము కాటేయగానే... ● పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా పక్కనుండే వారు ధైర్యం చెప్పాలి. ● కాటేసిన పాము ఎలాంటిదో గుర్తించాలి. చికిత్స చేసే వైద్యులకూ చెప్పాలి. ● సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము కాటును బట్టి చికిత్స పాము గాట్లను బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్ధారణ చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తారు. రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి అది ఎలాంటి పామో వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగపండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. దీన్ని బట్టి విషపు పాముగా గుర్తించవచ్చు. విషపు పాము కాటుకు ప్రథమ చికిత్సగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి అందులో నుంచి ఏఎస్వీ ఇంజెక్షన్ ఇస్తారు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. పాముకాటుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉచితంగా అందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాం. అవసరమైన వారు కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి ఈ ఇంజెక్షన్లు తీసుకెళ్లవచ్చు. పాము కాటు వేస్తే నాటు వైద్యం జోలికి వెళ్లకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. – డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ, కర్నూలు -
బీఏఎస్ విద్యార్థుల చదువుకు ఆటంకం
● బ్యాంక్ ఖాతా వివరాలను యాజమాన్యం తప్పుగా నమోదు చేయడంతో జమకాని నిధులుఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ స్కూల్లో బీఏఎస్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్) పథకం కింద ఎంపికై న విద్యార్థుల చదువు ఆటంకంగా మారింది. బీఏఎస్ పథకం కింద 2016 నుంచి నారాయణ పాఠశాలలో ఎం.అజయ్కుమార్, ఎం.సుదర్శన్, బి.హస్నమని (10వ తరగతి), జై.రీటాఅనైన్య (7వ తరగతి) చదువుతున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను పాఠశాల నిర్వాహకులు తప్పుగా నమోదు చేయడంతో పథకం కింద నిధులు బదాలాయింపు కాలేదు. తర్వాత తప్పు తెలుసుకొని బ్యాంకు ఖాతా వివరాలు సరిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపగా నేటికి ఫైల్ పెండింగ్లో ఉంది. అన్ని కార్పొరేట్ స్కూళ్లకు బీఏఎస్ కింద బకాయిలు మంజూరుకాగా స్థానిక నారాయణ స్కూల్కు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను కలిసి బీఏఎస్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫీజులు చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఎమ్మిగనూరు విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సతీష్కుమార్ను వివరణ కోరగా విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావడంతో నిధులు మంజూరు కాలేదని చెప్పారు. వివరాలు సరిచేసి పంపామని, ఇంకా అప్రూవ్ కాలేదని, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. -
మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం
కర్నూలు(సెంట్రల్): వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సాగు పద్ధతులపై కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమలులో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటల వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతోపాటు 5 నుంచి 6 అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు నాణ్యత ప్రమాణాలు సాధించలేకపోతే 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీ సమయంలో రైతులకు ఫార్మర్ యాప్ను డౌన్లోడ్ చేసివ్వాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, నేచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, మార్క్ఫెడ్ డీఎం రాజు పాల్గొన్నారు.


