breaking news
Kurnool District News
-
5న అప్రెంటిషిప్కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కర్నూలు సిటీ: ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్కు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థులకు వచ్చే నెల 5న సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 25 నుంచి ఈ నెల 8వ తేది వరకు అప్రెంటిషిప్కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించామన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఐటీఐ అభ్యర్థులకు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలోని జోనల్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామన్నారు. డిజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్(సివిల్) ట్రేడ్లకు చెందిన అభ్యర్థులు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే వెరిఫికేషన్కు హాజరుకావాలన్నారు. వివరాలకు 08518–257025 నెంబరును సంప్రదించాలని పేర్కొన్నారు. నలుగురికి ఏఎస్ఐలుగా పదోన్నతి కర్నూలు (సిటీ): పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నలుగురికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండీ హనీఫ్ కె.నాగలాపురం పోలీస్స్టేషన్ నుంచి పదోన్నతి పొంది వెల్దుర్తికి బదిలీ అయ్యారు. జూపాడుబంగ్లా పీఎస్లో పనిచేస్తున్న సి.నాగన్న, ఆస్పరి పీఎస్ నుంచి బి.మద్దిలేటి, కోవెలకుంట్ల పీఎస్ నుంచి డి.మీరా సాహెబ్ పదోన్నతి పొందారు. వీరిని నంద్యాల జిల్లాకు కేటాయించారు. సమగ్ర శిక్ష ఏపీసీగా లోకరాజు కర్నూలు(సిటీ): సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్(ఏపీసీ)గా డాక్టర్ ఎన్.బి.లోకరాజును నియమిస్తూ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టు ఏడు నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు డీఈఓ అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం జీవీఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్బీ లోకరాజును ఫారిన్ సర్వీస్ కింద డిప్యూటేషన్పై నియమించారు. డిగ్రీ కాలేజీ కమిషనర్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ వచ్చిన వెంటనే కర్నూలు ఏపీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ప్రజోపయోగకరమైన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ అధికారి జీ.భాస్కర్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో విద్యుత్ మోటార్ల రిపేర్లు, తాగునీటి పైల్లైన్ల మరమ్మతులు, సీసీ రోడ్లు, గుంతలు పడిన రోడ్లకు గ్రావెల్ వేయడం తదితర పనులను సర్పంచులు చేయించారన్నారు. అధికారులు సీనియారిటీ ప్రకారం గాకుండా టీడీపీ నేతలు కొత్తగా చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. సర్పంచుల పదవీ కాలం త్వరలో ముగుస్తున్నందున అప్పులు చేసి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. డీపీఓ భాస్కర్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ నిధులతో 31 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను నిర్మిస్తున్నట్లుగా జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతులు కూడా లభించాయన్నారు. తుగ్గలి, పత్తికొండ మండలాల్లో మరో ఐదు పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రతిపాదన ఉందన్నారు. ఒక్కో భవనానికి రూ.32 లక్షలు ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద రూ.7.75 కోట్లు,ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.2.17 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. -
స్పర్శ లేకుండా ‘కుష్టు’ ఉత్పాతం
● గతేడాది నుంచి పెరుగుతున్న కేసులు ● ఈ నెల 30 వరకు ఇంటింటా సర్వే కర్నూలు(హాస్పిటల్): బ్యాక్టీరియా ద్వారా సోకే కుష్టు వ్యాధి జిల్లాలో గతేడాది నుంచి పెరుగుతోంది. చర్మంపై స్పర్శలేని రాగి రంగు గల మచ్చలు ఉన్న వారిని, చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోయిన వారిని వైద్య సిబ్బంది గుర్తిస్తోంది. జిల్లాలో ఈ నెల 30 వరకు సర్వే కొనసాగనుంది. సర్వే ఇలా.. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4,58,936 గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 1,85,916 గృహాలను సర్వే చేస్తారు. ఇందుకోసం 1,690 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఆశా, మగవలంటీర్ సర్వే చేస్తున్నారు. వీరిని 672 మంది ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారు. మహిళలకు ఆశా, పురుషులను మగ వలంటీర్ పరీక్షిస్తున్నారు. ఒక్కో బృందం రోజుకు గ్రామాల్లో అయితే 25 నుంచి 50 గృహాలను, అర్బన్లో అయితే 50 నుంచి వంద గృహాలను సర్వే చేస్తుంది. అనుమానిత లక్షణాలున్న వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులచే పరీక్ష చేయిస్తారు. వ్యాధినిర్ధారణ అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కుష్ఠువ్యాధి విభాగం లేదా చర్మవ్యాధుల విభాగానికి పంపించి చికిత్స చేయిస్తారు. చుట్టుపక్కల ఇళ్లలో స్క్రీనింగ్ పరీక్షలు నూతన కుష్టువ్యాధి కేసు బయటపడిన ప్రాంతంలో చుట్టుపక్కల 300 ఇళ్లల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేసు బయటపడిన ఇంటిలోని వారందరికీ కుష్టులేకపోయినా ముందుజాగ్రత్తగా మందులు ఇస్తారు. కుష్టు వ్యాధిగ్రస్తునికి మాత్రం ఒంట్లో పాసివ్ బేసిల్లై(తక్కువస్థాయిలో లెప్రసి క్రిములు) ఉంటే ఆరు నెలలు, మల్టీ బేసిల్లై(అధిక శాతం లెప్రసి క్రిములు) ఉంటే తొమ్మిది నెలల పాటు మల్టీ డ్రగ్ థెరపి(ఎండీటీ) మందులను ఉచితంగా అందజేస్తారు. కుష్టు వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆరు నెలలు మందులు వాడితే పూర్తిగా నయం అవు తుంది. మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయి. అంగవైకల్యం ఉన్న వారు ఉచితంగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. రోగులకు కుష్టు వ్యాధి విభాగంలో ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాం. –డాక్టర్ ఎల్. భాస్కర్, డీఎంహెచ్ఓ, కర్నూలు సంవత్సరం కేసుల సంఖ్య 2018-19 304 2019-20 286 2020-21 77 2021-22 112 2022-23 188 2023-24 278 2024-25 214 ఈ యేడాది ఇప్పటి వరకు 102 కొత్త కుష్టు కేసులు బయటపడ్డాయి. -
ఆపరేషన్ థియేటర్ల మరమ్మతులు ఇంకెంత కాలం
● ఆసుపత్రి ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ● పలు వార్డుల్లో రోగుల రికార్డుల నిర్వహణపై అసంతృప్తికర్నూలు(హాస్పిటల్): ‘‘ఆపరేషన్ థియేటర్ల మరమ్మతులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు. గతంలో నేను తనిఖీకి వచ్చినప్పుడు నవంబర్ 20 కంతా పూర్తి చేస్తామన్నారు. మీరు చెప్పినట్లే ఈ రోజున మళ్లీ వచ్చాను. ఎక్కడ పూర్తయ్యాయి. ఈ విషయంలో అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు’’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క్యాజువాలిటిలో చికిత్స పొందుతున్న చిన్నకేశవ, కొండయ్య, షేక్ ఫాతిమా, రామచంద్రుడు అనే రోగుల సహాయకులతో మాట్లాడారు. వైద్యులు బాగా ట్రీట్మెంట్ చేస్తారని, త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. జనరల్ మెడిసిన్ ఓపీ విభాగాన్ని పరిశీలించి సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. రోగులకు సంబంధించిన రిజిస్టర్, రోగనిర్ధారణ, ఐపీ నెంబర్లు సరిగ్గా రాయడం లేదని ఆర్థోపెడిక్ విభాగ వైద్యులపై మండిపడ్డారు. ఆసుపత్రిలోని టాయిలెట్ల మరమ్మతుకు అంచనాలు సిద్ధం చేసి ఫైల్ పంపించాలన్నారు. ఆసుపత్రిలో స్క్రాప్ తొలగించకుండా ఎందుకు అలాగే వదిలేశారని, దీనివల్ల రోగులకు ఇన్ఫెక్షన్ రాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మెడికల్ కాలేజి విద్యార్థినుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, వైద్యులు ఉన్నారు. -
శ్రీ మఠంలో జిల్లా ఎస్పీ
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్ర స్వామిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మలకు అర్చన హారతులు చేపట్టారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందవానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని శ్రీమఠం అధికారులకు సూచించారు. శ్రీ మఠంలో నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ రోజుల్లో మరో ఐదుగురు పోలీసులు, హోంగార్డులను వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ భార్గవి, సిఐ రామాంజులు, శ్రీమఠం అధికారులు ఉన్నారు. -
ఉరుకుంద.. వయా పోలీసు స్టేషన్
ఎమ్మిగనూరుటౌన్: ఆర్టీసీ బస్సుల కొరతకు నిదర్శనం ఈ సంఘటన. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సు సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. ఎమ్మిగనూరు డిపో పరిధిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం అమావ్యాస కావడంతో భక్తులు ఉరుకుంద క్షేత్రానికి చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మిగనూరు బస్టాండ్కు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఉరుకుందకు వెళ్లే ఉదయం 6 గంటల సర్వీసు బస్సు డిపో నుంచి బస్టాండ్కు చేరుకోవడంతో పరిమితికి మించి 120 మందికి పైగా ప్రయాణికులు ఎక్కారు. అయితే ఓవర్ లోడ్ కారణంగా బస్సు వెళ్లలేదని, కొందరు దిగి మరో బస్సులో రావాలని డ్రైవర్ సూచించారు. అసలే కోసిగి రోడ్డు శిథిలం కావడంతో అంతమందితో బస్సు నడపడం కష్ట మవుతుందని కొందరు దిగాలని డ్రైవర్, కండెక్టర్ చెప్పినా ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు. దిగమంటూ భీష్మించడంతో ఇక డ్రైవర్ తాను ఏమి చేయలేనంటూ.. నేరుగా పోలీస్ స్టేషన్కు బస్సును తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే తాము బస్సు దిగమని బస్టాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దిగమంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో కొందరు బస్సు దిగడంతో డ్రైవర్ ఉరుకుందకు బయలుదేరాడు. ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోతే ఎట్లా అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులు ఓవర్ లోడ్ అంటూ ముందుకు కదలని డ్రైవర్ దిగమని భీష్మించిన ప్రయాణికులు బస్సు స్టేషన్కు తరలింపు.. సర్దిచెప్పిన పోలీసులు -
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కర్నూలు: వివిధ సంస్థలు, శాఖల్లో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. డిసెంబర్ 13న ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు గురువారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్, మున్సిపల్, ఫైనాన్స్ అండ్ చిట్ఫండ్స్, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, బీఎస్ఎన్ఎల్, పంచాయతీ అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖలు, సంస్థలకు సంబంధించి కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు, మోటర్ యాక్సిడెంట్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు డీఫాల్టర్, మున్సిపాలిటీ ప్రాపర్టీ, బీఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని రాజీ పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
బనగానపల్లె: మండలంలోని యాగంటిపల్లె గ్రా మంలో గురువారం సాయంత్రం సోమన్నగారి రామకృష్ణారెడ్డికి చెందిన మొక్కజొన్న పంట నూ ర్పిడి దశలో ఉండగా ప్రమాదవశాత్తూ మూడు ఎకరాల్లోని పంట దగ్ధమైందని రైతు వాపోయాడు. పంట పొలాని కి కొంత దూరంలో ఎగిసిన మంటలు సుడిగాలి వల్ల మొక్కజొన్న పంటపై నిప్పులుపడ్డాయి. దీంతో మంటలు పంట మొత్తం వ్యాపించాగా బనగానపల్లెలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా.. నాలుగు ఎకరాల్లో పంట సాగు చేయగా.. మూడు ఎకరాల్లోని పంట కాలిపోయింది. -
అదృశ్యమైన వివాహిత మృతి
కౌతాళం: కౌతాళం పోలీస్టేషన్ పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన వడ్డే కోటేశ్వరి గురువారం తుంగభద్ర దిగువ కాలువలో శవమై తేలింది. సీఐ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కామవరం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు, ఈరమ్మల దంపతుల కుమారుడు వడ్డే వీరేష్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పులకల్ గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి కూతురు వడ్డే కోటేశ్వరి (21)తో వివాహమౌంది. ఏమి జరిగిందో తెలియదుకానీ తమ కూతురు కనిపించడం లేదని బుధవారం మద్దిలేటి కౌతాళం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా గురువారం పెద్దతుంబళం గ్రామం వద్ద తుంగభద్ర కాలువలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు బయటకు తీశారు. మృతి చెందిన మహిళ కోటేశ్వరిగా తండ్రి మద్దిలేటి గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
శివ.. శివా.. నీవే మాకు రక్ష!
శ్రీశైలంటెంపుల్: కార్తీకం.. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం. ఈ నెలలో ఈశ్వరుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసిన దేవస్థాన అధికారులు ఆచరణలో మాత్రం విఫలం అయ్యారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘శివ.. శివా.. నీవే మాకు రక్ష’ అని కంపార్టుమెంట్లలో స్వామిని చేతులెత్తి వేడుకున్నారు. గంటల తరబడి నిరీక్షణ శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 22 నుంచి శుక్రవారం వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించారు. క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రేకులషెడ్డు కంపార్ట్మెంట్లలో పరిమితికి మించి భక్తులు కనిపించారు. చాలా మంది ఊపిరి అడక అవస్థలు పడ్డారు. చిన్నారులు, బాలింతలు, వృద్ధుల అవస్థలు వర్ణానాతీతం. కష్టాలను ఎదు ర్కొని కంపార్ట్మెంట్లు దాటుకుని వచ్చిన భక్తులు ఆలయ ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు చేరుకునేందుకు మళ్లీ గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, షుగర్ రోగులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే నిరసన తెలిపారు. ‘ఇదేం పాలన’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. పాలన అస్తవ్యస్తం ● కార్తీకమాసమంతా శని, ఆది, సోమ, రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శదర్శనాన్ని రద్దు చేశారు. అయితే వీఐపీల పేరుతో కొందరు దేవస్థాన ఉన్నతాధికారులే స్వయంగా ఆలయానికి వచ్చి దగ్గరుండి అన్ని క్యూలైన్లను మూసివేయించి స్పర్శ దర్శనం చేయించారు. ● సిఫార్సుల లేఖలకు ఇష్టం వచ్చినట్లు స్పర్శదర్శనం టికెట్లు ఇచ్చారనే అరోపణలు వచ్చాయి. ● సామాన్య భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం అవకాశం కలగలేదు. ● కొందరు దేవస్థాన అధికారులు అర్హత లేని వారితో ప్రధాన గేటు ద్వారానే ఆలయ ప్రవేశం చేయించారు. ప్రధాన గేటుకు ఉన్న ప్రతిష్టతను మంట కలిపారనే విమర్శ లు వచ్చాయి. ● ఆలయంలో దీపారాధన చేయడం లేదని చెప్పిన కొందరు అధికారు లు కుటుంబ సభ్యులతో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. శ్రీశైలంలో మోగిన అవస్థల గంట! కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులకు తప్పని తిప్పలు అధికారుల పర్యవేక్షణ కరువు ముగిసిన కార్తీక మాసం -
యువకుడి బలవన్మరణం
కోవెలకుంట్ల: స్థానిక ఎల్ఎం కాంపౌండ్కు చెందిన ఓ యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన రామారావు కుమారుడు రంగస్వామి(21) పట్టణంలో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఉదయం తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన యువకుడు ఉరి వేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జవాన్కు కన్నీటి వీడ్కోలు
మద్దికెర: చత్తీస్ఘడ్లో ఐటీబీపీ జవానుగా పని చేస్తూ అనారోగ్యంతో మృత్యువాత పడిన మద్దికెరకు చెందిన కసాపురం నాగార్జునకు (32) గురువారం గ్రామస్తులు, ఆర్మీ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో సెలవుపై వచ్చి నాగార్జున బళ్లారిలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజులుగా అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, నాలుగేళ్ల కూతురు వున్నారు. గురువారం స్వగ్రామం మద్దికెరలో అంత్యక్రియలు నిర్వహించా రు. ఆర్మీ అధికారులు జవాను మృతదేహంపై జాతీ య పతాకం వుంచి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఐటీబీపీ ఆర్మీ అధికారులు ఎస్ఐ హరీష్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు లు, బాలాజీ, మద్దికెర పంచాయతీ సలహాదారు బండారు ఆంజనేయులు పాల్గొన్నారు. -
పాత తూకం.. కొత్త మోసం
ఆదోని అర్బన్: అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులు గద్దల్లా వాలి రైతు కష్టాన్ని దర్జాగా దోచుకుంటున్నారు. అధిక ధర ఆశచూపి తూకాల్లో మోసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆదోని వ్యవసాయ మార్కెట్లోనే నాణ్యత పత్తికి రూ.7,330 ధర పలుకుతోంది. అటువంటిది ఇతర రాష్ట్రం నుంచి వచ్చి పత్తి క్వింటాకు ఎలాగున్నా సరే రూ.7,300 ఇస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు పాత తక్కెడ తూకాలతో కోసిగి, కౌతాళం, హాల్వి మండలాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పెద్ద పెద్ద లారీలను తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కేవలం కుడివైపు 50 కేజీల రాళ్లను తాడుతో వేలాడదీడయం, ఎడమవైపు ఒక పెద్ద సంచిని వేలాడదీసి తూకం వేస్తు న్నారు. దీంతో 50 కేజీల పత్తికి గానూ 8 నుంచి 10 కేజీల వరకు తూకంలో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక క్వింటానికి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతు క్వింటాకు రూ.7300 ప్రకారం చెల్లించినా రూ.1466 చొప్పున నష్టపోవాల్సిందే. రోజుకు ఎనిమిది లారీల్లో తరలింపు.. మహారాష్ట్రకు చెందిన పత్తి వ్యాపారస్తులు 15 రోజుల నుంచి ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకు 8 లారీలు పత్తి దిగుబడులను కొనుగోలు చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒక లారీ వంద క్వింటాళ్లకు పైగానే ఉంటుంది. దీని ప్రకారం 800 క్వింటాళ్లు రోజూ లారీల్లో తరలిస్తున్నారు. 15 రోజుల్లో ఇప్పటి వరకు 120 లారీల్లో 96 టన్నుల పత్తిని మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి దిగుబడులను తక్కెడ తూకాల్లో వేయకూడదు. కేవలం ఎలక్ట్రానిక్ మిషన్లోనే తూకాలు వేయాలి. తక్కెడ తూకాల్లో మోసం ఉంది. అధిక ధర ఇస్తామంటే రైతులు మోసపోవద్దు. ముందుగా రాళ్లు, ముళ్లును సరి చూసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు అనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – శంకర్, తూనికల కొలతల శాఖ ఆదోని ఇన్చార్జి అధికారి పత్తి కొనుగోళ్లకు మహారాష్ట్ర వ్యాపారులు ఎక్కువ ధర ప్రకటించి పాత తూకాలతో మోసగిస్తున్న వైనం క్వింటానికి 15 కేజీలకు పైగా దోపిడీ ఎక్కడా కనిపించని ఎలక్ట్రానిక్ కాటాలు పట్టించుకోని తూనికల శాఖ అధికారులు -
భవనాశి వాగులో పడి రైతు మృతి
చాగలమర్రి: కలుగొట్లపల్లె పంచాయతీకి మజరా గ్రామమైన నగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన పాడి రైతు మురబోయిన రామ సుబ్బరాయుడు(60), అతని భార్య లక్ష్మీదేవితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో భవనాశి వాగు వద్ద పశువులు మేపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత గేదెలు కనిపించకపోవడంతో వాగు అవతల చూసేందుకు నీటిలో దిగగా.. గుంతల్లో గల్లంతయ్యాడు. భార్య గమనించి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో గాలించగా రామ సుబ్బరాయుడు విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
మాయలూరులో పిచ్చి కుక్క దాడి
● ఆరుగురు ఆసుపత్రిపాలుఉయ్యాలవాడ: మాయలూరు బస్టాండు సమీపంలోని చికెన్ సెంటర్ వద్ద గురువారం ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అల్లూరు గ్రామానికి చెందిన లక్ష్మి హర్షవర్ధన్ ఆచారి 9వ తరగతి విద్యార్థి, మాయలూరు గ్రామానికి చెందిన వెంకటేష్ 10వ తరగతి విద్యార్థి వీరివురు పాఠశాలకు వెళ్తుండగా అక్కడ తిరుగుతున్న పిచ్చి కుక్క దాడి చేసి చేయడంతో కాలు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మాయలూరు గ్రామానికి చెందిన పెద్ద తిరుపాలు, పుల్లన్న అనే ఇద్దరు వ్యక్తులు రైతు పొలంలో కూలి పనికి వెళ్తుండగా వారి మీద కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ నలుగురికి అక్కడే వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సలు వైద్యాధికారి రాబర్డ్ కెనడి వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మధ్యాహ్నం అదే కుక్క గ్రామానికి చెందిన రామలింగారెడ్డి, రామసుబ్బయ్య అనే వ్యక్తులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, చుట్టు పక్కల వారు చుట్టుముట్టి పిచ్చి కుక్కను చంపేశారు. ఈఎన్టీ మురళీక్రిష్ణ, ఫైలట్ రాజారెడ్డిలు వీరిని 108లో ప్రథమ చికిత్స చేసి కోవెలకుంట్లకు తీసుకెళ్లారు. -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పండితుల మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పుష్పాలంకరణ చేసిన ఉత్సవ పల్లకీలో రాత్రి ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
మహిళ అనుమానాస్పద మృతి
● పరారీలో భర్త ● అనాథగా మూడేళ్ల చిన్నారి డోన్: డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన వివాహిత తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి మృతి చెంది, తండ్రి పరారీలో ఉండగా వారి కుమార్తె అనాథగా మిగిలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన పెయింటర్ కుమ్మలపాటి విజయ్కుమార్ పెద్దకుమార్తె మణి (25)ని ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని బసవనపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ధనరాజ్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షల కట్నంతో పాటు 8 తులాల బంగారు, గృహోపకరణాలు పెళ్లి కానుకగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా పర్వతాపురంలో నివాసం ఉండే వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ధనరాజ్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. భార్య మణిపై అనుమానం పెంచుకున్న ధనరాజ్ వేధిస్తూ రెండు రోజుల క్రితం ఆమె పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని రిజిస్ట్రర్ చేసి ఇవ్వాలని విజయ్కుమార్పై ఒత్తిడి చేశాడు. మరుసటిరోజే మణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు ధనరాజ్ ఆమె కుటుంబీకులకు విషయం తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోలుకోలేక మృతి చెందింది. బుధవారం మృతురాలి మృతదేహానికి డోన్ పట్టణంలోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పో యి, తండ్రి దూరమై రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని విజయ్కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ధన్రాజ్పై హత్యకేసు నమోదు చేసినట్లు తెలిసింది. మణి (ఫైల్),అనాథగా మిగిలిన మూడేళ్ల చిన్నారి -
పుడమి తల్లి ‘ఉల్లి’కిపాటు
ట్రాక్టర్తో ఉల్లి పంటను దున్నుతున్న రైతు రైతు కష్టం నేలపాలు కావడంతో పుడమి తల్లి ఉలికిపాటుకు గురైంది. నాట్లు వేసి.. ఎరువు చల్లి.. నీరు కట్టిన చేతులతోనే పచ్చని పంటను దున్నేస్తుంటే మౌనంగా రోదించింది. నల్లటి నేలలో కలసిపోతున్న ఎర్రటి ఉల్లిని చూసి తల్లడిల్లింది. వరుసగా తన బిడ్డ నష్టాలు మూటగట్టుకుంటుంటే చలించిపోయింది. పెట్టుబడిని కోల్పోయి అప్పుల్లో దిగబడుతున్న రైతు ను ఆదుకునేదెవరంటూ ప్రశ్నించింది. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెంది న రైతు పీవై. సురేంద్ర ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన తరు ణంలో మార్కెట్లో ధర లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కనీసం కూలీల ఖర్చు కూడా చేతికందే పరిస్థితులు లేకపోవడంతో బుధవారం పంటను తొలగించాడు. ట్రాక్టర్తో టిల్లర్ కొట్టించి దున్నేశాడు. చూసినా వారంతా అయ్యో అంటూ నిట్టూర్చారు. – పాణ్యం -
పర్యాటక కేంద్రంగా గాజులదిన్నె
గోనెగండ్ల: జిల్లాలో ఏకై క మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అయిన గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు ప డుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఏపీ టూరి జం శాఖ ఏఈ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సాజీత్, సుధారాణిలు జీడీపీలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఎకరా స్థలంలో చిన్న పిల్లలకు పార్కు, రెస్టారెంట్, అలాగే పర్యాటకులు, వికలాంగుల కోసం బాత్రుమ్లు ఏర్పాటుకు సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వే చేసిన ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఎస్టీ రిజర్వేషన్తోనే వాల్మీకుల అభ్యున్నతి
కర్నూలు(అర్బన్): వాల్మీకుల జీవితాల్లో వెలుగులు నిండడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎస్టీ రిజర్వేషన్తోనే సాధ్యమని పలువురు వాల్మీకి నేతలు అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం నగర శివారు వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని శ్రీనివాస గార్డెన్స్లో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరి చెట్టుకు, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. పత్తికొండ డీఎస్పీ బోయగడ్డ వెంకటరామయ్య, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు, వనభోజన కమిటీ సభ్యులు బేతం కృష్ణుడు, సత్రం రామకృష్ణుడు, తలారి కృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): రహదారి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్పా ట్లను గుర్తించి నెల రోజుల్లో బారికేడింగ్, రంబుల్ స్ట్రిప్స్, సైన్బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ● పోలీసు శాఖ ప్రతిపాదించిన విధంగా ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ● పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లలో బ్లైండ్ కర్వులు ఉన్న చోట రెండు, మూడు నెలలకోసారి బుష్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు. ● జాతీయ రహదారుల్లో మీడియన్స్ నిర్వహణ సరిగా లేదని, సక్రమంగా నిర్వహించాలని నేషనల్ హై అధికారులను ఆదేశించారు. ● ఎల్లమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 10 నాటికి పూర్తి చేసి స్వాధీనం చేయాలన్నారు. ● పెద్దపాడు నుంచి ఎన్హెచ్కు లింకు చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను రివైజ్ చేసి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తీసుకొని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్ పి.విశ్వనాథ్ను ఆదేశించారు. ● ఆటోల్లో వెనుకవైపు ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీటీసీ శాంతకుమారిని ఆదేశించారు. ● కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ● ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో కాపాడిన వారికి గుడ్ సమరిటన్గా అభినందిస్తూ రూ.25 వేల వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తుందని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, పీఆర్ ఎస్ఈ వేణగోపాల్, ఆర్టీసీ ఆర్ఎం ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో తలారి హల్చల్
పాణ్యం: కౌలురు గ్రామ సచివాలయం వద్ద తలారి ఆంజనేయులు హల్చల్ చేశారు. బుధవారం సచివాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామానికి చెందిన శివరామయ్య అనే వ్యక్తి ఇంటి పన్ను కట్టి రసీదు కోసం సచివాలయానికి వెళ్లగా అక్కడే మద్యం మత్తులో ఉన్న తలారి ఆంజినేయులు దరుసుగా ప్రవర్తించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించి డీటీ శివశంకర్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు శివరామయ్య కుమారుడు నాగేంద్రయాదవ్ తెలిపారు. టపాసులు సీజ్ ఆదోని అర్బన్: పట్టణంలో అనుమతి లేకుండా టపాసులు అమ్ముతుండగా అధికారులు సీజ్ చేశారు. షరాబ్ బజార్లోని మణికంఠ అనే దుకాణంలోని టపాసులు విక్రయిస్తున్న ట్లు స మాచారం రావడంతో ఆదోని సబ్కలెక్టర్ అజ య్కుమార్ బుధవారం తనిఖీ చేశారు. దాదాపు రూ.40 వేలు విలువ చేసే టపాసులను గుర్తించి సీజ్ చేసి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: ఆదోని–ఇస్వీ రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం 55 సంవత్సరాల వయ స్సు గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయిసర్వేశ్వరరావు తెలిపారు. ఆదోని రైల్వేస్టేషన్ సమీపంలోని 495/34కే గేటు దగ్గర మృతదేహం లభ్యమయ్యిందన్నారు. మృతుడి కుడి చేతిపై కేసీ, ఎన్టీఆర్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం కౌతాళం: కామవరం గ్రా మంలో వివాహిత కనపించడం లేదని సీఐ అశోక్కుమార్ తె లిపారు. బుధవారం ఆయన మాట్లాడు తూ.. గ్రామానికి చెంది న వీరేష్ భార్య వడ్డే కోటేశ్వరి(23) బుధవారం తెల్లవారు జామున 5గంటలకు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కోటేశ్వరి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కామేశ్వరిదేవికి లక్ష కుంకుమార్చన మహానంది: కార్తీక మాసం పురస్కరించుకుని మహానందిలో కామేశ్వరిదేవికి బుధవారం లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ముఖ్య అర్చకులు వణిపెంట ప్రకాశం శర్మ, వేదపండితులు రుత్విక్ తదితరులు లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, జలాభిషేకం, రుద్రాభిషేకం చేపట్టారు. -
పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం ● మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పత్తికొండ: వైద్య సేవలను దూరం చేస్తూ చంద్రబాబు సర్కారు పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని తేరుబజార్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదల ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యనభ్యసించేలా గత ప్రభుత్వంలో జగనన్న 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 కాలేజీలను ప్రారంభించడంతో, మరికొన్ని కాలేజీలు దాదాపు 50 నుంచి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటి నిర్మాణాలు పూర్తి చేయకుండా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణకు యత్నించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తున్నా చంద్రబాబు సర్కారకు చీమకుట్టినట్లుగాల లేదని విమర్శించారు. 18 నెలల కాలంలో రూ.2.50 లక్షలు కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు పేదలకు ఏమి చేశారని మండిపడ్డారు. అప్పుల్లో కనీసం 5వేలు కోట్లు కేటాయిస్తే చాలు 11 మెడికల్ కాలేజీలు పూర్తయి పేదలకు అందుబాటులోకి వచ్చేవన్నారు. ఇప్పటికే పేదవాడి సంజీవినిగా పేరుగాంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రస్టుపట్టించారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్దాస్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, జిల్లా ఎస్టీ సెల్ సంఘం అధ్యక్షుడు భాస్కర్నాయక్, మండల కన్వీనర్ కారం నాగరాజు, నాయకులు టీఎండీ హుశేన్, లలితా రామచంద్ర, శ్రీకాంత్రెడ్డి, నరసింహరెడ్డి, సాబ్డిన్ నూర్బాషా, కొమ్ము నెట్టేకల్ కారుమంచి నజీర్, దేవన్న, వార్డు మెంబర్లు లింగన్న, రంగన్న , కొండగేరి శివ, మస్తాన్, మహహ్మద్, రామాంజినేయులు నాయకులు గణపతి, తిమ్మరాజు, బండల వలి కరవాల హుశేన్, హనిఫ్, షరీఫ్, మస్తాన్, ఇమ్రాన్, నవీన్, మునిస్వామి బబ్లూ, జిలాన్, ముగ్బుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే భవనంలో మూడు కార్యాలయాలు
● ఆరు భవనాల మరమ్మతుకు రూ.95.70 లక్షల జెడ్పీ నిధులుకర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు డివిజన్ కేంద్రాల్లో డివిజినల్ డెవలప్మెంట్ కార్యాలయాలను అన్ని హంగులతో త్వరలో ప్రారంభించనున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాల్లోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారులకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలకు అనుగుణంగా ఆయా భవనాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ నిధులు రూ.95.70 లక్షలను కేటాయించారు. ఫర్నీచర్ ఇతరత్రాలకు అదనంగా మరో రూ.10 లక్షలను వెచ్చిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి డీడీఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్పై నియమిస్తామన్నారు. ఒక్కో డీడీఓ కార్యాలయానికి ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టైపిస్టు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను నియమిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్కు ప్రత్యేకంగా నియమితులైన డీడీఓ ఆయా డివిజన్లలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు. -
పత్తి రైతుల ‘యాప్’సోపాలు!
● చుక్కలు చూపిస్తున్నకిసాన్ కపాస్ యాప్ ● పనులు వదులుకొని స్లాట్ బుకింగ్కు ప్రయత్నిస్తున్న రైతులు ● వారం రోజులుగా స్లాట్ బుకింగ్లో ఇబ్బందులు ● చోద్యం చూస్తున్నసీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ వారం రోజులుగా అష్టకష్టాలు.. కర్నూలు(అగ్రికల్చర్): నాలుగైదు నెలల పాటు రేయింబవళ్లు కష్టించి పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతులకు తలప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతోంది. పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్న తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖ అధికారులు, అటు వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్లాట్ బుకింగ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి రోజు ఉదయ 10 గంటలకు స్లాట్ బుకింగ్కు అవకాశం ఉంటంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. అయితే ఓటీపీ నెంబరు ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు కనిపిస్తోంది. ఇదేమీ సీసీఐ మాయనో రైతులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యాప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులోని 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేయాలి. సామర్థ్యంలో కనీసం 50 శాతం కూడా కొనడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారం, పది రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. వందలాది మంది రైతులు అన్ని పనులు వదిలి పెట్టి పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోయింది. కొంతమందికి మాత్రం రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబరకు ఫోన్ చేయవచ్చని యాప్లోనే ఉంది. ఇంతవరకు టోల్ఫ్రీ నెంబరు పనిచేసిన దాఖలాలు లేవు. స్లాట్ బుకింగ్కే ఇంత సమయం పడుతుంటే సీసీఐ కేంద్రం వద్ద తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ సూచనలు, ఆదేశాలను సీసీఐ పట్టించుకోవడం లేదని, అందువల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. -
బ్యాంకింగ్ దిగ్గజానికి నివాళి
కర్నూలు(అగ్రికల్చర్): కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబల సుబ్బారావు పాయి 173వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో కెనరా బ్యాంకుకు 53 బ్రాంచీలు ఉన్నాయి. అన్ని బ్రాంచీల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. 1852 నవంబర్ 19న జన్మించిన ఆయన 1906 జూలై 1న కెనరా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుతం కెనరా బ్యాంకు 10 వేల శాఖలతో సేవలందిస్తోందని అధికారులు వెల్లడించారు. కర్నూలు శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకొని శిక్షణ పొందుతున్న వారికి జీరో ఖాతాలు ప్రారంభించి సురక్ష బీమా యోజన అమలుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించారు. -
చంద్రబాబూ.. కాగితాల ఎంఓయూలు వద్దు
ఆదోని రూరల్: ‘సీఎం చంద్రబాబూ.. ప్రభుత్వం కాగితాల ఎంఓయూలు కాదు... కాసులు కురిపించే ఎంఓయూలు చేపట్టండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం ఆదోనిలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైజాగ్లో జరిగిన సీఐఐ సమ్మిట్లో ఎంఓయూలు, ఉద్యోగాల కల్పనపై ప్రజలకు నమ్మకం కలగడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగానే మారుతోందన్నారు. విశాఖ వేదికగా ఆర్భాటంగా సీఐఐ పేరుతో సీఎం చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. సీఐఐ పేరుతో ఆర్భాటంగా చేసిన ఎంఈఓయూల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఏమి మేలు జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. 2014–19 మధ్యలో 1,761 ఎంఓయూలు చేసుకుంటే ఎన్ని ఎంఓయూలలో గ్రౌండ్ అయ్యాయో చంద్రబాబు చెప్పాలన్నారు. ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు ఇలా ఎంఓయూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేపట్టాలని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేవీపీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు జగన్నాథం, సీపీఐ నాయుకలు సుదర్శన్, వీరేష్, కల్లుబావి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు ● బంధువులను రైలు ఎక్కించి వస్తుండగా ప్రమాదం మహానంది: బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైలు ఎక్కించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన సీతారామాపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఎం.వెంకట కృష్ణ (22), అతని బంధువు నందవరం గ్రామానికి చెందిన తిమ్మయ్య బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి తిరిగి గోపవరం వస్తున్నారు. బైక్పై వస్తుండగా సీతారామాపురం సమీపంలో వడ్ల ట్రాక్టర్ రివర్స్లో వస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో లైట్ల వెలుతురులో సరిగా కనిపించలేదు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. వెంకటకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా తిమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
వేసవిలో మంచినీటి సమస్య తలెత్తరాదు
కర్నూలు (అర్బన్): రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ ఆదేశించారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఈఈ, డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు మెజార్టీ గ్రామాలకు నీటిని సరఫరా చేసే తుంగభద్ర దిగువ కాలువకు జనవరి నెలలో నీటి ప్రవా హం ఆగిపోయే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఎల్సీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపుకోవాలని సూచించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న వారి జాబితాలను ఈనెల 30 లోగా తయారు చేయాలని సూచించారు. సకాలంలో జాబితాలను రూపొందిస్తే వచ్చే నెల మొదటి వారంలో జరిగే సమావేశంలో వాటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటి సరఫరా పైప్లైన్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లోని నీటి ట్యాంకులను నిర్ణీత సమయంలోగా క్లోరినేషన్ చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని ఈఈలు అబ్దుల్ ఖాదర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజా పోరాటానికి సిద్ధం
కర్నూలు(టౌన్): వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ధర్నా చౌక్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం, పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంత్రి లోకేష్ అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ పద్ధతిని తెరపైకి తెచ్చారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయివేటీకరణను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వీటిని నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. కుడా మాజీ చైర్మన్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోట్ల హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రయివేటీకరించాలన్న చంద్రబాబు నిర్ణయం హేయమైందన్నారు. ఫీజులు కట్టలేని ఎంతో మంది విద్యార్థులు వైద్యులుగా రాణించాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలతోనే సాధ్యమన్నారు. ప్రయివేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నిరుపేద, మధ్య తరగతి విద్యార్థినీ, విద్యార్థులు వైద్యులుగా రాణించే అవకాశాలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కార్యక్రమంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, సుధాకర్, వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు అస్లాం, కర్నూలు జెడ్పీటీసీ ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపీ నెహెమియ్యా, గూడురు వైస్ చైర్మన్ లక్ష్మన్న, కౌన్సిలర్ మద్దిలేటి, కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్రెడ్డి, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, గూడురు మండల కన్వీనర్ రామాంజనేయులు, కర్నూలు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సంపత్కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రోడ్డెక్కని ‘పవన్’ హామీ
కర్నూలు(అర్బన్): సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఎనిమిది నెలలైనా నెరవేరని పరిస్థితి నెలకొంది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 22వ తేదీన జిల్లాలోని ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామంలో ఫారంపాండ్స్కు భూమి పూజ చేసేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తన నియోజకవర్గంలో రెండు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరగా నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్కు డిప్యూటీసీఎం సూచించారు. అలాగే ఈ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు కూడా ఆఘమేఘాల మీద ఆయా రోడ్లకు అంచనాలు రూపొందించి పంపించారు. అయితే ...నేటికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులు మంజూరు రాకపోవడం గమనార్హం. కాగా, గత నెల 17వ తేదీన జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చిన సందర్భంగా ఈ రోడ్ల మీదుగా ప్రజలను వాహనాల్లో తరలించేందుకు తాత్కాలికంగా మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. పవన్ హామీ ఇచ్చిన రోడ్లు ఏవంటే ... ● ఎన్హెచ్ 44 నుంచి లక్ష్మీపురం మీదుగా పెద్దపా డు వరకు ( 8.11 కిలోమీటర్లు ) రూ.4.50 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలను పీఆర్ ఈఎన్సీ కార్యాలయానికి పంపారు. ● ఉప్పలపాడు నుంచి గుట్టపాడు మీదుగా కొంతలపాడు వరకు ( 7 కిలోమీటర్లు ) రూ.5 కో ట్లతో అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు. అధ్వానంగా లక్ష్మీపురం – పెద్దపాడు, ఉప్పలపాడు– కొంతలపాడు రోడ్లు పనులకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు 8 నెలల క్రితం డిప్యూటీ సీఎం ప్రకటన -
అక్రమాలు ఇలా..
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2025–27 బ్యాచ్లో 49 కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇటీవలే మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రత్యేకంగా మార్గదర్శకాలను ఈ నెల 7వ తేదీన విడుదల చేసింది. ఈ రెండు కోటాలో సీట్లు పొందాలనుకునే వారు ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలి. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి.. మేథాడాలజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి.. తదితర వివరాలను ప్రకటించి, మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి కనీసం రెండు పత్రికలకు ప్రకటనలు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలి. కానీ ఇలా ఏ కాలేజీ కూడా చేయడం లేదు. ఇటీవల మోగా డీఎస్సీ ప్రకటన తరువాత కొంత మంది బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో సీట్లన్నీ ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటున్నాయి. స్థానికులు సీటు కోరినా కూడా ఖాళీలు లేవని చెబుతున్నారు. అసలు ఇంత వరకు స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. కానీ కాలేజీల యాజమాన్యాలు సీట్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భర్తీ చేసేసుకుని..స్థానికులు అడిగితే లేవని చెబుతున్నాయి. త్వరలో ఉన్నత విద్యా మండలి విచారణ? రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కాలేజీలకు భవనాలు లేకపోయినా కూడా అనుమతులు ఇచ్చారని పలు విద్యార్థి సంఘాల నాయకులు.. జిల్లా కలెక్టర్ నుంచి ఏపీ ఉన్నత విద్యా మండలి వరకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు థర్డ్ సెమిస్టర్లో బ్లాక్ టీచింగ్ చేయకపోయినా చేసినట్లు..సెమిస్టర్ పరీక్షల ఫీజులు కట్టించుకున్నారు. బ్లాక్ టీచింగ్పై చేసిన ఫిర్యాదులపై డీఈఓ విచారణ చేయించారు. రెండు, మూడు కాలేజీలకు చెందిన వారు మినహా మిగిలిన వారు బ్లాక్ టీచింగ్కు హాజరు కాలేదని హెచ్ఎంలు రాత పూర్వకంగా రాసి ఇవ్వడంపై సైతం విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులపై త్వరలోనే ఉన్నత విద్యా మండలి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో కొన్ని బీఈడీ కాలేజీలకు భవనాలు లేకుండా అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై నేను వ్యక్తిగతంగా కూడా తెలుసుకున్నా. భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చిన వాటిని నోట్ చేసుకున్నా. త్వరలోనే అఫ్లియేషన్ ఇచ్చిన కాలేజీ భవనాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. మేనేజ్మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్స్కు ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిని అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆచార్య వి.వెంకట బసవరావు, ఆర్యూ వీసీ డోన్లో శ్రీసుధ అనే బీఈడీ కాలేజీకి సొంత భవనం లేకపోవు. దీంతో అదే పేరుతో ఉన్న స్కూల్ భవనాలను, గాయత్రి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాలేజీకి వైష్ణవి కాలేజీ భవనాలు చూపించి అఫ్లియేషన్ తీసుకున్నారు. ఈ రెండు కాలేజీలకు సొంత భవనాలు లేవు. అలాగే సిబ్బంది కూడా లేరు. అవన్నీ కేవలం పేపర్లో మాత్రమే ఉన్నాయి. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామ సమీపంలో బాలాజీ బీఈడీ కాలేజీ ఉన్నట్లు ఆర్యూ అఫ్లియేషన్ కమిటీ అనుమతులు ఇచ్చింది. ఇందుకు కర్నూలు నగరంలోని కృష్ణానగర్లో ఓ పారామెడికల్ కాలేజీ భవవాన్ని చూపించారు. కనీసం ఇటుక కూడా లేని ఈ కాలేజీకి ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీలే కాదు మరికొన్నింటికి సొంత భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారు. కేవలం కాగితాల్లోనే సిబ్బందిని చూసి వర్సిటీ అఫ్లియేషన్ కమిటీలు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చాయి. ఆర్యూ పరిధిలో కొన్ని బీఈడీ కాలేజీలకు భవనాల్లేవు అయినా అఫ్లియేషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కాలేజీ యాజమాన్య సీట్ల్ల భర్తీ బోధన సిబ్బంది లేకున్నా ఉన్నట్లు కాగితాల్లో సృష్టి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మామూళ్ల సమర్పణ త్వరలో ఉన్నత విద్యా మండలి అధికారుల విచారణ?ఒక్కో కాలేజీకి అఫ్లియేషన్ కమిటీకి రూ.20వేల నుంచి రూ.30 వేలు, వర్సిటీలో కీలక అధికారికి రూ.30 వేలు, వర్సిటీ సీడీసీలో పని చేసే ఇద్దరికి రూ.5 వేల చొప్పున, అఫ్లియేషన్ కమిటీలో ఓ సభ్యుడికి కోరినప్పుడల్లా పార్టీలు ఇచ్చినట్లు, బీఈడీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ పేరుతో రూ.15 వేలు వసూళ్లు చేసినట్లు సమాచారం. వర్సిటీ అనుబంధ కాలేజీలన్నీ ఐఏఎస్ఈ(ప్రభుత్వ బీఈడీ కాలేజీ), మరొకటి, రెండు మినహా మిగిలిన అన్ని కాలేజీలు ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. -
డీపీఓలో కార్తీక వనభోజనం
కర్నూలు: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ పరిపాలన విభాగం ఉద్యోగులు బుధవారం డీపీఓ ఆవరణలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు మినిస్టీరియల్ సిబ్బందితో కలసి ఉసిరి చెట్టు కింద వన భోజనం చేశారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచి జరుగుతుందని, అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కుటుంబ సభ్యులతో కలసి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుని సంతోషంగా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్, డీపీఓ ఏఓ జయలక్ష్మి, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ ఏఓ దేవి పాల్గొన్నారు. తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు కర్నూలు సిటీ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది ఉల్లి పంటకు మంచి ధర ఉండడంతో ఈ ఏడాది ఉల్లి పంట అధికంగా సాగైందన్నారు. జిల్లాలో అత్యధిక శాతం రైతులు లోకల్ విత్తనాలు వాడుతుండడం, ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఎత్తు మడులు వేసి అందులో ఉల్లిని సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మీ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణరెడ్డి, ఎల్డీఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు(హాస్పిటల్): ఉద్యోగుల పనితీరు, వారి సమయపాలన, ఆసుపత్రి, రోగులు, వారి సహాయకులు, ప్రజల భద్రతకు ఉద్దేశించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలోని పరిపాలనా భవనానికి వెళ్లే మెట్ల మార్గంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గది ఉంది. దాని ముందు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. కార్యాలయానికి వెళ్లే వారి వివరాలు ఈ సీసీ కెమెరా ద్వారానే తెలుస్తుంది. ఇలాంటి కీలక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి కొంత కాలంగా కిందకు వంగిపోయి ఉంది. దీంతో ఎలాంటి సమాచారం రికార్డు కావడం లేదు. కాస్త సరిచేస్తే పని చేసే సీసీ కెమెరాను అలాగే వదిలేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణపై నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు వచ్చింది. మంగళవారం స్థానిక రాజ్యంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 34 రోజులకు హుండీల్లో వచ్చిన నగదు లెక్కించగా రూ.5,26,89,128 వచ్చింది. నాణేల రూపంలో రూ.14,58,100 సమకూరింది. అంతేగాక 80 గ్రాముల బంగారం, వెండి 1,610 గ్రాములు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకట్ష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి, ఏఈ కోనాపూర్ సురేష్ తెలిపారు. -
జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాలనా?
● చంద్రబాబు పాలన తీరుపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం ● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవనకొండలో కోటి సంతకాల సేకరణ దేవనకొండ: ‘ఇప్పటికే పేదవాడి సంజీవిని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడిచారు. తాజాగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల పేదలకు ఉచిత వైద్యం దూరమై జబ్బు చేసినప్పుడు ఆస్తులు ఆమ్ముకోవాల్సి వస్తుంద’ని చంద్రబాబు ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. దేవనకొండ మండలంలోని తెర్నెకల్, నల్లచెలిమల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారన్నారు. నేడు చంద్రబాబు సర్కారు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందన్నారు. దీని కారణంగా పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. అభివృద్ధిపై కాకుండా ప్రైవేట్పరం చేయడంపై బాబు దృష్టి పెట్టారని విమర్శించారు. అనంతరం తెర్నెకల్ సురేందర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విధానాలతో పేదల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా వారికి చేసిన మేలు శూన్యమన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో తన బినామీలకు అప్పగించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బూత్ సంయుక్త కార్యదర్శి కొత్త కాపు మధుసూదన్రెడ్డి, జెడ్పీటీసీ రామకృష్ణ, సర్పంచ్ అరుణ్కుమార్, ఎంపీటీసీ నామాల శీను, వైఎస్సార్సీపీ శ్రేణులు బెల్లి ఈరన్న, తలారి దొడ్డప్ప, బడేసాబ్, హంపిరెడ్డి, లుమాంబ , జొన్నల అంజి పాల్గొన్నారు. -
● 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం
దొంగ దొరికాడు కర్నూలు: ఇళ్ల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగను సి.బెళగల్ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. అతని వద్ద 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపర్చగా కోడుమూరు సీఐ తబ్రేజ్, బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్ రాజుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో డీఎస్పీ.. వివరాలు వెల్లడించారు. సి.బెళగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్నరెడ్డి ఇంట్లో సెప్టెంబర్ 25న చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులపై నిఘా ఉంచి విచారణ చేశారు. నేరం జరిగిన రోజు సీసీ ఫుటేజీల ఆధారంగా తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన గిర్నీ వెంకటేష్ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. బెళగల్ నుంచి చింతమానుపల్లె గ్రామానికి వెళ్లే దారిలో గుట్టల నాగమ్మ గుడి వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.9.25 లక్షల విలువచేసే 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనతి కాలంలోనే కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్ఐ వేణుగోపాల్ రాజు, ఏఎస్ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్, సత్యరాజు తదితరులను డీఎస్పీ అభినందించారు. -
ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు
● కర్నూలు నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీలో కొన్ని నెలల క్రితం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఓ ఇంటి రెండో అంతస్తులో తనిఖీ చేసి అక్కడ జూదం ఆడుతున్న బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ అండ ఉన్న ఒకరు ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలంగా జూదం సాగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ● తాజాగా ఉల్చాల రోడ్డు ఆదిత్య నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డోన్కు చెందిన హరి యాదవ్ ఇల్లు అద్దెకు తీసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార తతంగాన్ని నడిపించాడు. గతంలోనూ అతడు వేరే చోట అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహించడంతో యజమాని వెళ్లగొట్టినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ● కర్నూలు–గుత్తి రోడ్డులోని రామచంద్ర నగర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంటిని చుట్టుముట్టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు విటులు, ఐదుగురు సెక్స్ వర్కర్లతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. దీన్ని నిర్వహిస్తోంది మహిళ కావడం గమనార్హం. నివాసముండేది వేరే కాలనీలో అయినా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొన్ని నెలలుగా తతంగం నడిపించినట్లు విచారణలో బయటపడింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని జూదం, వ్యభిచారం, మద్యంపానం వంటి వాటిని నిర్వహిస్తున్నారు. జన సంచారం అంతగా ఉండని ప్రాంతాలు, కాలనీలు, యజమానులు లేకుండా ఉన్న ఇళ్లను ఇందుకోసం ఎంచుకుంటున్నారు. దీనివల్ల వేళాపాలాతో సంబంధం లేకుండా వచ్చి వెళ్లే వారిని అక్కడ జరిగే వ్యవహారాలను పట్టించుకునేవారు ఉండరు. నిర్వాహకులకు సంబంధించిన వారు లేదా సమాచారం అందుకున్న వారు మాత్రమే అక్కడికి వచ్చే వీలుంటుంది. ఫలితంగా అక్రమ తతంగానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదన్న ధీమా వారిని మరింత ప్రోత్సహిస్తోంది. పోలీసులనే బెదిరించే స్థాయిలో నిర్వాహకులు.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారికి ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో కొందరు తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరించే స్థాయిలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కర్నూలులో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంత్రి అండతో డెన్ నిర్వాహకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి విముక్తి పొందాడు. అలాగే కర్నూలు విష్ణు టౌన్షిప్ శివారులో భారీగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు ఓ రాజకీయ పార్టీ మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని దాడికి వెళ్లిన పోలీసు అధికారినే బెదిరించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఇలా మట్కా, పేకాట, వ్యభిచార నిర్వాహకులు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులనే బెదిరించే స్థాయిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. యజమాని దృష్టి సారిస్తేనే... ఇంటి కోసం వచ్చిన వారికి అద్దె, ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఠంచన్గా అద్దె చెల్లించాలని చెప్పడమే గాకుండా వచ్చిందెవరో పూర్తిస్థాయిలో ఆరా తీయాలి. అవసరమైతే వారి సంబంధీకుల వివరాలు తెలుసుకోవాలి. అన్నీ నిర్ధారించుకుని ఇంటిని అప్పగించాలి. యజమాని హోదాలో తరచూ ఇంటికి వెళ్తుండటం, తరచూ పరిశీలిస్తూ ఉండటం, నిర్వాహకులను పరిశీలించడం, వారు చేసే కార్యకలాపాలపై దృష్టి సారించడం తప్పనిసరి. ఇల్లు ఖాళీగా ఉందని.. ఎవరో ఒకరు వచ్చారని.. అడిగినంత అద్దె ఇస్తారని ఆశ పడే ఓనర్లు కొందరు.. నెలనెలా ఎంతో కొంత ఆదాయం వస్తుందని ముక్కూమొహం తెలియని వాళ్లకు ఇల్లు అద్దెకు ఇస్తున్న వారు ఇంకెందరు.. అయితే అద్దెకు అడిగే వారి స్వభావం తెలుసుకోకుండా, కనీస వివరాలను కూడా ఆరా తీయకుండా అద్దెకు ఇస్తే లేనిపోని తలనొప్పులు తప్పవంటున్నారు పోలీసులు. పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కల్పించిన వారవుతారని, ఒక్కోసారి కేసుల్లో కూడా ఇరుక్కునే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. – కర్నూలుచుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినా, వ్యక్తుల సంచారం కనిపించినా డయల్ 112, 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలి. మన చుట్టుపక్కల నివాసాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ -
కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
● పోలీసు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కర్నూలు : రాజీ పూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశమున్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి పోలీసు అధికారులకు సూచించారు. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్పై ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో జి.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువగా క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని వారి కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రబాబు, మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, అపర్ణ, అనూష, డీఎస్పీ వెంకటరామయ్య, ప్రమోద్ కుమార్, కర్నూలు దిశ పీఎస్ సీఐ రామయ్య నాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పరాకాష్టకు రెడ్బుక్ పాలన
● కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దుర్మార్గం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్) : రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దుర్మార్గమని చెప్పారు. ఖాకీ చొక్కాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రజల గొంతుకను నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అభిప్రాయాలకు గొంతు అధికార ప్రతినిధులు అని, అలాంటి వారిని మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. సీఐ మృతి కేసులో నిష్పాక్షిక విచారణ కోరడం నేరమా..దేశంలో ఎక్కడా లేని దుష్ట సంప్రదాయం మన రాష్ట్రంలో కూటమి నాయకులు శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీ నాయకులు సతీష్ కుమార్ది హత్య అని ప్రచారం చేస్తుంటే .. ఏ ఆధారాలతో చెబుతున్నారని ప్రశ్నించినందుకు కారుమూరి వెంకటరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సతీస్ది హత్య అని కథనాలు ప్రసారం చేసిన ఎల్లోమీడియా చానళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదన్నారు. తమ పార్టీకి చెందిన వారిని ఎంత మందిని అరెస్టు చేసినా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
కౌలుదారులకు అన్నదాత సుఖీభవ లేనట్లే..
మాకు ఎలాంటి సొంత భూమి లేదు. ఈ ఏడాది నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాము. ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా మంజూరు చేసింది. ఈసారి వ్యవసాయం కలసిరాలేదు. నష్టాలు మూటగట్టుకున్నాము. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వలేదు. కౌలుదారులకు ప్రభుత్వం నుంచి చేయూత కరువు అయింది. – పల్లెపాడు పెద్ద వెంకటస్వామి, గుడిపాడు, గూడూరు మండలం మాకు సొంతంగా ఒక్క సెంటుపొలం కూడా లేదు. ఏటా కౌలుకు భూములు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఎకరా కౌలుకు తీసుకుని ఉల్లిగడ్డలు సాగు చేశాను. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సీసీఆర్ కార్డు కూడా ఇచ్చారు. ఇటీవల అధిక వర్షాలతో పంట మొత్తం దెబ్బతినింది. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కూడా అందలేదు. – ముక్తార్ బాషా, రామళ్లకోట, వెల్దుర్తి మండలం కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవ రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024–25లో సాయాన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2025–26లో మొదటి విడత పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది ఆగస్టు 2న విడుదల చేశారు. మొదటి విడతలో 2,72,757 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఆ తర్వాత మాకు అన్ని అర్హతలు ఉన్నాయి.. అయితే సాయం అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ మేరకు ప్రభుత్వం 22,500 మంది రైతుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించింది. ఈ నెల 19న రెండవ విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. గ్రీవెన్స్తో పాటు కొత్త రైతులతో కలిపి రెండో విడతలో రైతుల సంఖ్య పెరగాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. మొదటి విడత జాబితానే ఇప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవడం చూస్తే వేలాది మంది రైతులకు ఈ విడత కూడా నిరాశ తప్పని పరిస్థితి. 13,093 మంది రైతులకు పీఎం కిసాన్లో కోత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల ప్రకారం రైతులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తోంది. ప్రస్తుతం 21వ విడత సాయాన్ని కేంద్రం విడుదల చేస్తోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత పెట్టుబడి సాయం ఆగస్టు 2న విడుదలైంది. ఈ నెల 19న రెండో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. మొదటి విడతతో పోలిస్తే ప్రస్తుతం లబ్ధిపొందే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొదటి విడత విడతలో 2,38,693 మంది రైతులకు రూ.47.73 కోట్ల విడుదలయ్యాయి. తాజాగా 13,093 మంది రైతులు పీఎం కిసాన్కు దూరమయ్యారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 2,72,757 రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయాన్ని పరిమితం చేసింది. అన్నదాత సుఖీభవ కింద రూ.136.38 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.45.12 కోట్లు ప్రకారం రూ.181.36 కోట్లు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేల ప్రకారం విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎసార్ రైతుభరోసా కింద లబ్ధిపొందిన రైతులతో పోలిస్తే 21,841 మంది రైతులకు మొండిచేయి చూపడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడిసాయం రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తుండటం గమనార్హం. కటుంబంలో ఎంతమందికి భూములు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని రైతులను మభ్యపెట్టి ఇప్పుడు కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడం చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది. అన్నదాత సుఖీభవలో అర్హులకు అన్యాయం ఐదేళ్లలో వేలాది మంది కొత్త రైతులు ఉత్పన్నమయ్యారు. భూములను కొనుగోలు చేయడం ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయ్యాయి. అయితే కొత్త రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లేదు. 2019 ఫిబ్రవరి 1లోపు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం అందుతోంది. ఉన్న రైతుల్లో వేలాది మందికి ఈ–కేవైసీ చేయించుకోలేదని, బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ మ్యాపింగ్ కాలేదనే కారణాలతో లబ్ధికి దూరం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కౌలురైతులు, ప్రభుత్వ భూములు, ఎండోమెంటు భూములు, అటవీ భూముల (ఆర్వోఎఫ్ఆర్) రైతులకు తీరని అన్యాయం చేసింది. మొదటి విడతలో కేవలం భూ యజమానులకు మాత్రమే అన్నదాత సుఖీభవ దక్కింది. రెండవ విడతలోనూ వీరి ఆశలు ఆవిరయ్యాయి. మొదటి విడతలో లబ్ధిపొందిన రైతులకు మాత్రమే రెండవ విడతలోనూ పెట్టుబడిసాయం దక్కుతుండటాన్ని పరిశీలిస్తే కౌలుదారులకు, అసైన్డ్ రైతులందరికీ చంద్రబాబు సర్కార్ మొండిచేయి చూపినట్లయింది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. వీరంతా సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్డబ్ల్యూపీసీలను వినియోగంలోకి తేవాలి
● జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సి.బెళగల్: గ్రామాల్లో చెత్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను (ఎస్డబ్ల్యూపీసీ) వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పలుకుదొడ్డి గ్రామ పంచాయతీలో పర్యటించారు. వీధులను, మురుగు కాలనువలను, నీటి సరఫరా పథకాలను పరిశీలించి రెగ్యులర్గా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి అజహర్ మహ్మద్ను ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులోని ఎస్డబ్ల్యూపీసీను తనిఖీ చేసి తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ అంశాలను పీఎస్ను అడిగి తెలుసుకున్నారు. వానపాము ఎరువుల తయారీ, విక్రయాలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమై పలు అంశాలపై సూచనలిచ్చారు. సచివాలయం – 2ను తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, రికార్డులను తనిఖీచేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ మహేశ్వరి, కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉన్నారు. -
ఆకతాయికి దేహశుద్ధి
కోవెలకుంట్ల: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో మంగళవా రం ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆకతాయికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన ఓ మహిళ తన పిల్లలతో కిరాణా వస్తువులు కొనుక్కునేందుకు వచ్చింది. మహిళ షాపు వద్ద ఉండగా ఎనిమిది ఏళ్ల వయసున్న కుమార్తె అక్కడే రోడ్డుపై నిలుచుని ఉంది. అదే ప్రాంతంలో ఉన్న కోవెలకుంట్లకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బొంగు చిన్నారిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన తల్లి వెంటనే అక్కడికి చేరుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఆమెతోపాటు స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీశైలం ఘాట్లో ఆర్టీసీ బస్సు –బైక్ ఢీ మరో యువకుడికి తీవ్ర గాయాలు శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్లో మంగళవారం ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దోర్నాల పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజావలి (35), స్నేహితుడు ముండ్లమూడి పాలకొండ స్వామి శ్రీశైలం నుంచి బైక్పై దోర్నాల వస్తుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో బస్సు ఢీకొంది. బైక్ నడుపుతున్న ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీశైలం ప్రాజెక్టు హాస్పిటల్కు తరలించారు. కాగా స్వామి శివమాలను శ్రీశైలం విరమణ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దోర్నాల పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో ఒడిశా యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శివ సర్కిల్లోని ఎస్బీఐ ఏటీఎం సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన టికెలాల్ ఒరియా(36) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన టికెలాల్ ఒరియా మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని సాయంత్రం ఎమ్మిగనూరుకు వెళ్లివస్తానని తోటి కూలీలతో చెప్పి బయలుదేరాడు. మంగళవారం ఉదయం ఏటీఎం ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడు ఉన్నాడు. గమనించిన కాలనీ వాసులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా చెన్నాపురం బట్టి వద్ద ఉన్న తోటి కూలీలను రప్పించి వివరాలు ఆరా తీశారు. కొన్ని రోజులుగా మృతుడు మూర్చవ్యాధితో బాధపడేవాడని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు. -
భారీగా కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు: గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడింది. వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన బోయ మహేష్ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. బోయ మహేష్ తన ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ భూమిలో 21 బాక్సుల్లో 2014 మద్యం బాటిళ్లను నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా ఈఎస్టీఎఫ్ ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె మండలం కై ప గ్రామానికి చెందిన తలారి కృష్ణ కర్ణాటక నుంచి మహేష్కు మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. ఇరువురిపై కేసు నమోదు చేశారు. మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరఫరాదారుడు తలారి కృష్ణ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రామచంద్ర, శాంతిరాజ్, అయ్యన్న పాల్గొన్నారు. -
ఉల్లికి మద్దతు ధర కల్పించండి
కోడుమూరు రూరల్/ గోనెగండ్ల: ‘కష్టపడి పండించిన ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. దీని నుంచి బయటపడేందుకు మద్దతు ధర కల్పించడంతో పాటు ఉల్లి నిల్వకు గోదాములు ఏర్పాటు చేయాల’ని సెంట్రల్ టీమ్ ఎదుట ఉల్లి రైతులు ఏకరువు పెట్టారు. ఉల్లి పంటపై అధ్యయనానికి జిల్లాకు వచ్చిన సెంట్రల్ టీం మంగళవారం కోడుమూరు మండలంలో ప్యాలకుర్తి, గోనెగండ్ల మండలంలో గోనెగండ్ల, గాజులదిన్నె గ్రామాల్లో పర్యటించారు. కేంద్ర ఉద్యాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డా. బి.జె.బ్రహ్మ ఆధ్వర్యంలో సెంట్రల్ టీం సభ్యులు మనోజ్, రాజీవ్ కుమార్, హేమంగ భార్గవ్, శరణం ముందుగా ప్యాలకుర్తి గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏయే రకాల ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు?ఎకరాకు ఎంత వరకు ఖర్చు వస్తుంది? నిల్వ చేసుకునేందుకు అవకాశాలున్నాయా? ఎంత ధర ఇస్తే గిట్టుబాటు అవుతుంది.. ప్రభుత్వం నుంచి ఏమైనా సౌకర్యాలు కోరుకుంటున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని గతంలో క్వింటాల్ ఉల్లి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ధర పలికేదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోయారు. ప్రభుత్వం కల్పించిన రూ.1200 మద్దతు ధర కూలీల ఖర్చులకే సరిపోతుందన్నారు. మంచి ధర కోసం ఉల్లిని నిల్వ చేసుకునేందుకు గోదాములు కూడా లేవని తెలిపారు. గాజులదిన్నె గ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేశానని, పెట్టుబడుల కింద రూ. 4 లక్షలు ఖర్చు చేస్తే మార్కెట్లో ధర లేదని గోనెగండ్లకు చెందిన కౌలు రైతు గొరవ మునెప్ప వాపోయారు. ఇప్పుడు పంటను దున్నేయాల్సి వస్తుందని అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ టీం వెంట జిల్లా ఉద్యానవన అధికారి రాజా క్రిష్ణారెడ్డి, సహాయ సంచాలకులు ఫిరోజ్ఖాన్, హార్టికల్చర్ ఆఫీసర్ మదన్మోహన్ ఉన్నారు. సెంట్రల్ టీమ్ ఎదుట రైతులు ఏకరువు -
రైతులకు అందుబాటులో ఉండండి
ఆదోని రూరల్: వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సమయానుకూలంగా సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆదోని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మదిరె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిరప సాగుకు ఎంత పెట్టుబడి అవసరం, విత్తనాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు తదితర విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. 60 శాతం పైగా మిరప పంటకు కాయ కుళ్లు, కాయ మచ్చ వచ్చిందని రైతులు కలెక్టర్కు చూపించారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతుసేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పి ంచాలని వ్యవసాయ సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తేమశాతం 14 ఉన్నా కూడా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ సీసీఐ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్, జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి ఉన్నారు. 13న ‘నవోదయ’ పరీక్ష ఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న పరీక్ష జరుగుతుందని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటలో తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను https:// cbsitms. rcil. gov. in/ nvs/ AdminCard నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఏమైనా సందేహాలుంటే 085212–29454 నంబర్కు కాల్ చేసి తెలుకోవాలని సూచించారు. నంద్యాల: వడ్డీ వేధింపులు తాళలేక నంద్యాల పట్టణంలో ఓ మహిళ నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని డేనియల్పురం కాలనీకి చెందిన మేరి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. భర్త హైదరాబాద్లో డ్రైవర్. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కుటుంబ అవసరాల నిమిత్తం పట్టణంలోని సుబ్బారెడ్డి వద్ద రూ.2.50లక్షలు వడ్డీకి తీసుకున్నారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నా, అసలుకు రెట్టింపు వడ్డీ అయ్యిందని, అంతా చెల్లించాలని మహిళ ఇంటి వద్దకు వెళ్లి తరచూ వేధిస్తున్నారు. వడ్డీదారుడి వేధింపులు తాళలేక మహిళ తన గృహంలోని గ్యాస్ పొయ్యి నిప్పుతో చీర అంటిచుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రి కి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రెవెన్యూ అధికారులపై కోర్టు ఆగ్రహం కర్నూలు(సెంట్రల్) : పదేళ్ల నుంచి రైతులకు పరిహారం ఇవ్వకపోవడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలు ఆర్డీఓ కార్యాలయ ఫర్నిచర్ వేలం వేసి బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2015 కర్నూలు మండలం ఈ.తాండ్రపాడుకు చెందిన 46 మంది రైతుల నుంచి రైల్వే వ్యాగన్ కోచ్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు భూసమీకరణ చేశారు. అయితే, ఆ పరిహారం అప్పటి మార్కెట్ రేటుకు సరిపోదని కొందరు రైతులు జిల్లా ఆరో అదనపు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రైతుల పక్షాన పరిహారాన్ని పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 2022లో హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు కూడా కింది కోర్టు ఉత్తర్వుల్లోని 50 శాతం పరిహారాన్ని తక్షణమే డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల పేరిట ఎలాంటి డిపాజిట్ చేయకపోవడాన్ని మంగళవారం న్యాయవాదులు కె.కపిలేశ్వరయ్య, పి.సుంకన్న కర్నూలు ఆరో అదనపు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం పరిహారం రూ.53.22 కోట్ల కోసం ప్రభుత్వానికి నివేదించామని, త్వరలోనే పరిహారం వస్తుందని కోర్టుకు హాజరైన రెవెన్యూ అధికారులు చెప్పగా పరిగణనలోకి తీసుకోలేదు. కర్నూలు ఆర్డీఓ కార్యాలయ ఫర్నిచర్ను వేలం వేసి బాధిత రైతులకు డిసెంబర్ 2వ తేదీలోపు చెల్లించాలని ఆ కోర్టు న్యాయమూర్తి వాసు ఆదేశాలు జారీ చేశారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో ఏదీ?
● అధికారుల తీరుపై బీజేపీ నేతల ఫైర్ వెలుగోడు: కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ మండల నాయకులు మరోసారి మండిపడ్డారు. ఇటీవల వెలుగోడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజకు బీజేపీ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేయగా, తాజాగా మంగళవారం వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించకపోవడాన్ని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నూలు నాగేశ్వరరావు తప్పుపట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 10న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ప్రారంభించారన్నారు. చేపల పెంపకం, ఉత్పత్తిని పెంచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోదీని జిల్లా, మండల అధికారులు విస్మరించడం సరికాదన్నారు. ప్రధానిని, బీజేపీ పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్కు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని ఫొటో లేని కార్యక్రమాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఓవర్లోడ్ ఆటోలపై ఎంవీఐ కొరడా
వెల్దుర్తి: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఆటోలపై ఎంవీఐ రవీంద్రకుమార్ కొరడా ఝళిపించారు. పెద్దల్లారా..పిల్లలు జాగ్రత్త శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం కర్నూలు ఎంవీఐ రవీంద్రకుమార్ 44వ జాతీయ రహదారి చెరుకులపాడు, వెల్దుర్తి క్రాస్లు, వెల్దుర్తి ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో స్థానిక, హైవే పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పరిమితికి మించి బడి పిల్లల్ని తీసుకెళ్తూ, ప్రమాదకరంగా టాప్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న రెండు ఆటోల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి ఓవర్లోడ్తో పాటు సరైన పత్రాలు లేని కారణంగా రూ.20,220(రూ.14,410, రూ.5,710) జరిమానా విధించారు. ప్రమాదాలు, శిక్షలపై పలువురు ఆటో డైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సమయాల్లో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని గ్రామాలకు బస్సులు నడపాల్సిందిగా డోన్ ఆర్టీసీ డీఎం శశిభూషణ్ను కోరామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని లారీ దగ్ధం
ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను లారీ ఢీకొని కాలిపోయింది. డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. బళ్లారి నుంచి నంద్యాలకు క్లింకర్ (సిమెంట్, కంకర మిశ్రమం) లోడుతో వస్తున్న లారీ చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో ఉన్న స్పీడు బ్రేకర్ దగ్గర డ్రైవర్ తన ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు తిప్పాడు. అదుపు తప్పిన లారీ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టింది. వెంటనే షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెలరేగిన మంటలు పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన బోయ రంగన్నకు సంబంధించిన వరి గడ్డి, జొన్న సోప్ప ఉన్న వాముల్లోకి పడడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీంతో సదరు రైతుకు రూ.50 వేలు నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఆలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో లారీ ముందు భాగం, పది టైర్లు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మోసగాళ్లు దొరికారు
ఆళ్లగడ్డ: వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ రూ. కోట్లలో డబ్బులు వసూళ్లు చేసి చివరకు బోర్డు తిప్పేసి పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రమోద్ వివరించారు. 2023లో వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ పేరుతో నలుగురు వ్యక్తులు కంపెనీ స్థాపించి కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కంపెనీ, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు సృష్టించి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ కంపెనీల గ్రాఫ్ స్క్రీన్షాట్లు పంపాలని సూచిస్తూ వాటిని జాబ్వర్క్గా చూపించి నెలకు రూ.40 వేలు జీతం ఇస్తామని చెబుతూ ప్రజలను నమ్మించారు. మొదట కుటుంబ సభ్యులను చేర్చుకుని జీతాలు ఇస్తూ ప్రచారం చేశారు. దీంతో గ్రామాల వారీగా ప్రజల్లో ఆశ కల్పించారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశారు. ఇందులో అనంతపురం జిల్లా గొడ్డుమర్రి గ్రామంలో 250 మంది, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 950 మంది నుంచి ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. మొత్తం రెండు జిల్లాల నుంచి 1,200కి పైగా చేర్చుకుని వారి నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో బాధితులకు జీతాలు నిలిపి వేయడంతో అందరూ రోడ్డెక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బాధితులు వందల్లో ఉన్నారని తెలుసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అంతపు రాజారెడ్డి, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె గ్రామానికి చెందిన సింగతల ఉమామహేశ్వరరెడ్డి, దొర్నిపాడుకు చెందిన బాచిరెడ్డి వీరారెడ్డి, బాచిరెడ్డి శ్రీకాంత్రెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని బాధితులు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సులభంగా డబ్బు వస్తుందని ఎవరూ ఇలాంటి మోసపూరిత పథకాలను నమ్మవద్దన్నారు. ఇలాంటి కంపెనీలు, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్త్ అండ్ హెల్త్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ 1,200 మందిని బాధితులుగా గుర్తించిన పోలీసులు రూ.35 కోట్లు వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడి -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి
● ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు ● మహిళ ఇంటిలో ఘటన ● దర్యాప్తు చేపట్టిన పోలీసులు డోన్ టౌన్: డోన్ పట్టణంలో ఓ మహిళ, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. స్థానిక రాజ్ టాకీస్ వెనుక వీధిలోని ఒక ఇంటిలో నివాసముంటున్న అశ్విని(35), పాతపేటకు చెందిన ఫరీధ్ (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందా రు. వీరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అశ్విని కుటుంబం గతంలో పాతపేటలో ఫరీద్ ఇంటి సమీపంలో ఉండగా, కొద్ది నెలల క్రితం రాజ్ టాకీస్ వెనుక ఉన్న వీధిలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి చేరింది. సోమవారం సాయంత్రం అశ్విని కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగా.. ఇంటిలో తల్లితో పాటు మరో వ్యక్తి మృతి చెంది కనిపించడంతో కేకలు వేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు అక్కడకికి చేరుకున్నారు. ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని, పరిసరాలను గమనించి ఉన్నతాధికారులకు, ఫోరెనిక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంటసీఐ రాకేష్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డి ఉన్నారు. కాగా అశ్విని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అడ్డుకోబోయిన ఫరీద్ కూడా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని సీఐలు తెలిపారు. మృతుడు ఫరీద్ , అశ్విని (ఫైల్) -
ప్రజలపై మోయలేని విద్యుత్ భారం
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సర్కారు ప్రజలపై మోయలేని విధంగా విద్యుత్ భారం వేస్తోందని సీపీఎం జిల్లాకార్యదర్శి డి.గౌస్దేశాయ్ అన్నా రు. సోమవారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకమునుపు ట్రూ అప్చార్జీలను వ్యతిరేకించారని, గత ప్రభు త్వంపై భారాలు మోపుతోందని విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు రూ.24 వేల కోట్ల ట్రూ అప్చార్జీలు, సర్చార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని, అది చాలక మరోసారి రూ.12 వేల కోట్ల భారాలను వేసేందుకు పూనుకోవడం అన్యాయమన్నా రు. ఇప్పటికే కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసమయంలో మరోసారి ప్రజలపై భారం వేసేందుకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంగళవారం ఏపీఈఆర్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నా యకులు టి.రాముడు, అరుణ, వై.నగేష్, విజయ రామాంజనేయులు, సీహెచ్సాయిబాబ, సుధాక రప్ప, ఎస్ఎండీ షరీఫ్ పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నెంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని సూచించారు. -
నేడు జిల్లాలో సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి పంటపై అధ్యయనానికి ఈ నెల 18న జిల్లాలో సెంట్రల్ టీం పర్యటించనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి సాగు చేసి అధిక వర్షాలతో కోలుకోలేని విధంగా నష్టపోయిన నేపథ్యంలో సెంట్రల్ టీం జిల్లాకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ఉద్యాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బిజే బ్రహ్మ ఆధ్వర్యంలో ఈ బృందం జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు చేరుకోనున్న సెంట్రల్ టీం భోజనం తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లనుంది. కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి, కోడుమూరు, దేవనకొండ, గోనెగండ్ల ప్రాంతాల్లో పర్యటించే విధంగా ఉద్యాన శాఖ షెడ్యూల్ రూపొందించింది. నంద్యాల జిల్లాలో ఈ నెల 19న సెంట్రల్ టీం డోన్ మండలంలో పర్యటించనుంది. సెంట్రల్ టీం దృష్టికి పంట నష్టం ● అధిక వర్షాలతో ఉల్లి పంటకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు, రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. ● గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు ఉల్లి సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నారు. ● ఈ ఏడాది పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.లక్ష పైనే ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ● ఆగస్టు నెల నుంచి అధిక వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి పంట భారీగా దెబ్బతినింది. ● ఎకరాకు గరిష్టంగా 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇందులో అధిక వర్షాల కారణంగా 40 క్వింటాళ్లకుపైగా పనికిరాకుండా పోయింది. ● క్వింటాకు రూ.400–500 వరకు ధర మాత్రమే లభించింది. ● రూ.100, రూ.150తో అమ్ముకున్న రైతులు భారీగా ఉన్నారు. ● చంద్రబాబు ప్రభుత్వం తొలుత క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించి.. ఆ తర్వాత ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని నమ్మబలికినా అతీగతీ లేకపోవడం గమనార్హం. -
సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను కొనసాగించాలి. అయితే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి కనిపించకూడదనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రస్తుత చంద్రబాబు సర్కారు నీరుగారుస్త
ఈ ఏడాది ఖరీఫ్లో 3.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాం. కూటమి ప్రభుత్వం మొదట్లో ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర ఉంటే కొంత ఉపశమనం లభించేది. ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసి ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో కోత, రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. విధిలేక మొత్తం పంటను ట్రాక్టరుతో టిల్లర్ కొట్టించాం. రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా దక్కలేదు. – కె.నాగరాజు, పెద్దహుల్తి, పత్తికొండ మండలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సోలార్ డ్రయ్యర్లు జీవనోపాధికి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఈఎంఐ చెల్లింపులు పోను రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం ఉండేది. 2024 మే నెల నుంచి సోలార్ డ్రయ్యర్లకు టమాట/ఉల్లి సరఫరా ఆగిపోయింది. నెలవారీ ఈఎంఐలు చెల్లించడం భారంగా మారడంతో కంపెనీకి సోలార్ డ్రయ్యర్లను వెనక్కి ఇచ్చేశాం. టీడీపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలు తగ్గినప్పుడు ఉల్లి/టమాట సరఫరా చేస్తే మహిళలకు ఉపాధి లభిస్తుంది. – అంజుమ్, పెద్దనెలటూరు, గోనెగండ్ల మండలంకర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధాన వాణిజ్య పంట. రాష్ట్రంలో సాగయ్యే ఉల్లిలో 90 శాతం కర్నూలు జిల్లాలోనే ఉంది. ఇక్కడ పండించిన ఉల్లి ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆగ్రా తదితర ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్, పలు అరబ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇలా జాతీయ, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఉల్లి ధర పడిపోవడం ఏటా జరిగేదే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకవైపు ఉల్లి రైతులకు ఉపశమనం కల్పించడం, మరోవైపు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెద్దఎత్తున సోలార్ డ్రయ్యర్లను ఏర్పాటుచేసింది. ఉల్లి ధరలు పూర్తిగా పడిపోయినప్పుడు తక్కువ నాణ్యత ఉన్న ఉల్లిని ఎస్4ఎస్ కంపెనీ రైతుల నుంచి కొనుగోలు చేసి రోజుకు 1,200 క్వింటాళ్ల ఉల్లి సోలార్ రడ్రయ్యర్లకు సరఫరా చేసేది. పొదుపు మహిళలు ఇళ్లలోనే ఉల్లి గడ్డలు కట్చేసి ఫ్లేక్స్ తయారుచేసేవారు. వీటిని ఆ కంపెనీ మళ్లీ సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేసేది. ఇందుకు ఒక్కో మహిళకు రోజూ రూ.800 వరకు ఆదాయం లభించేది. ఇలా వైఎస్సార్సీపీ పాలనలో సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఇటు రైతులకు, అటు పొదుపు మహిళలకు ఎంతో మేలు జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చొరవతో జిల్లాలో వందలాది మహిళలు జీవనోపాధి పొందారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉల్లి రైతుల గోడును పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. జీవనోపాధి లేక పొదుపు మహిళలు రోడ్డున పడ్డారు. నేడు కొనేవారు లేక ఉల్లిగడ్డలను రైతులు పారబోస్తున్న ఘటనలు కోకొల్లలు. కొత్తవి లేవు.. ఉన్నవి మూత.. ఇక రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలల కాలంలో ఒక్క సోలార్ డ్రయ్యర్ను కూడా ఏర్పాటుచేయకపోగా.. ఉన్నవి మూతపడేలా చేస్తోంది. గత ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 228 సోలార్ డ్రయ్యర్లను పక్కన పెట్టేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోనే దాదాపు 50 సోలార్ డ్రయ్యర్లు మూతపడ్డాయి. 15 నెలల్లోనే రోడ్డున పడిన మహిళలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషితో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా కల్లూరు మండలం తడకనపల్లిలో భారీగా సోలార్ డ్రయ్యర్లు భారీగా ఏర్పాటయ్యాయి. ఈ ఒక్క గ్రామంలోనే 120 ఏర్పాటయ్యాయి. ఇందులో సగం నేడు మూలనపడ్డాయి. నగర పంచాయతీ అయిన గూడూరులో 20 వరకు ఏర్పాటయ్యాయి. ఇక్కడ కూడా 12 మూలనపడిపోయాయి. నేడు తడకనపల్లిలో 60, గూడూరులో ఆరు సోలార్ డ్రయ్యర్లు మాత్రమే అప్పుడప్పుడు పనిచేస్తున్నాయి. బేతంచెర్లలో కూడా ఏర్పాటైనప్పటికీ నేడు ఒక్కటీ లేకుండాపోయింది. సోలార్ డ్రయ్యర్లను సద్వినియోగం చేసుకుని ఉపాధిని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి మహిళలకు ఉన్నప్పటికీ వారికి చేతినిండా పనికల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం శ్రద్ధచూపడంలేదు. దీంతో చంద్రబాబు సర్కారు వచ్చిన 15 నెలల్లోనే మహిళలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు.సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఉల్లి ఫ్లేక్స్ తయారీపత్తికొండ మండలం పెద్దహుల్తిలో ఉల్లి పంటను వదిలేసిన రైతులు టీడీపీ సర్కారు నిర్వాకంతో ఉల్లి రైతులు, మహిళలకు దెబ్బ ధరలు పడిపోయినప్పుడు వీటి ద్వారా చేయూత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 300 పైగా సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు ఉల్లి ఫ్లేక్స్ తయారీ.. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి ఇలా రోజుకు 1,200 క్వింటాళ్ల వరకు ఉల్లి వినియోగం చంద్రబాబు ప్రభుత్వంలో మనుగడ కోల్పోయిన సోలార్ డ్రయ్యర్లు ప్రస్తుతం మిగిలింది 72 యూనిట్లు మాత్రమే -
పెయ్యదూడల అభివృద్ధిని ప్రోత్సహించాలి
కర్నూలు(అగ్రికల్చర్): నాటు ఆవులు, గేదెల ద్వారా లింగనిర్ధారణ వీర్యంతో మేలుజాతి పెయ్య దూడల అభివృద్ధిని ప్రోత్సహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. సోమవారం కర్నూలు డివిజన్లోని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు, ఏరియా హాస్పిటల్స్ ఏడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్నూలు డివిజన్లో లింగ నిర్ధారణ వీర్యంతో 5,000 పశువులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలనేది లక్ష్యమని ఇప్పటి వరకు 1100 పశువులకు మాత్రమే వేశారని తెలిపారు. లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయడం వల్ల ఆడదూడలే పుడుతాయని, ఇందువల్ల పాడిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క డోసు పూర్తి ధర రూ.500 ఉండగా.. కేంద్రం రూ.350 సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులు కేవలం రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పశుగణాభివృద్ధి సంస్థ డీడీ డాక్టర్ రాజశేఖర్, ఏడీలు భవానీశంకర్రెడ్డి, జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ రవిప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె సీఎంఓ నుంచి వచ్చి రీఓపెన్ అయిన కొందరి అర్జీదారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్య పరిష్కారంలో అధికారులు వ్యవహరించిన తీరు, ఫీల్డ్ విజిట్ అంశాలపై ఆరా తీశారు. పశుసంవర్ధకశాఖలో 14 మందికి పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖలో 14 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లకు వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన ఒక మహిళకు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇచ్చే విధంగా చూస్తామని చెప్పిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. పదోన్నతులు, పోస్టింగ్లు ఇవ్వడం పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. కర్నూలు మండలంలో పనిచేసే జేవీవోకు ఇదే మండలంలోని పంచలింగాలకు పోస్టింగ్ వేయిస్తామని నమ్మబలికి ముడుపులు గుంజినట్లు సమాచారం. అయితే కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నేతల సిఫారసులతో పంచలింగాల వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసరుగా శివనారాయణరెడ్డిని నియమించినట్లు తెలిసింది. పంచాలింగాలకు వేయిస్తామని చెప్పిన మహిళకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోస్టింగ్ దక్కింది. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి కొనుగోలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో తొమ్మిది పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయని, వాటిలో ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేవని, రైతులు మొదటి విడతలోనే పండించిన పత్తి మొత్తాన్ని అమ్ముకునే సదుపాయం లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు కపాస్ కిసాన్ యాప్ ఉదయం 10 గంటలకు ఓపన్ అవుతుందని, ఇందులో స్లాట్ బుక్ చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘పది’ ఉత్తీర్ణత శాతం పెరగాలి ఆలూరు: ఈ ఏడాది పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని పది పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ హెచ్.గోవిందునాయక్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆలూరు మండలంలోని పెద్దహోతూరు, ప్రభుత్వ బాలుర–2, బాలికల –1 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయా స్కూళ్లలో విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధనపై ఆరా తీశారు. పిల్లలకు అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఏడాది జిల్లాలోని 345 జెడ్పీ ఉన్న పాఠశాలల నుంచి దాదాపు 35 వేల మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆలూరు ఎంఈఓ కోమలాదేవి, ఎంఈఓ–2 చిరంజీవిరెడ్డి ఉన్నారు. -
తల్లిదండ్రుల సంరక్షణ వదిలేస్తే జైలుశిక్ష
కర్నూలు(అర్బన్): తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోకుండా వీధుల్లో వదిలేసిన వారిపై క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకటశేషాద్రి తెలిపారు. సోమవారం ఆయన నగరంలోని మద్దూర్నగర్ అమ్మ వృద్ధుల ఆశ్రమం, బీ క్యాంప్లోని మన వృద్ధుల ఆశ్రమాల్లో తల్లిదండ్రులు, వయో వృద్ధ పౌరుల భరణం, పోషణ చట్టం–2007పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి జి. కబర్ధి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టించుకోని పిల్లలపై తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసులు వేసి వారి నుంచి తమ జీవనానికి భరణాన్ని పొందవచ్చన్నారు. వృద్ధులకు ఎవరికై నా న్యాయ సహాయం కావాలంటే నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 15100కు ఫోన్ చేసి సమస్యను చెప్పుకోవచ్చన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాది రాంపుల్లయ్య, ఆశ్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
సీమ వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
● రాయలసీమ ప్రయోజనాల కోసం నిరంతర పోరాటం ● డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి కర్నూలు(అర్బన్): రాయలసీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలనే డిమాండ్పై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలతో వేలకోట్ల రూపాయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాయలసీమ జిల్లాలో పర్యటించారని, ఏ ఒక్కరికి కూడా శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు నోరు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక రూపాల్లో నష్టపోతున్న రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తన తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం అపబోమన్నారు. రాయలసీమ ఎప్పటికై తే ప్రత్యేకంగా ఉంటుందో అప్పుడే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు ఎంతో అనుకులంగా ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చూస్తున్న పాలకులు రాయలసీమపై కూడా దృష్టి సారించాలన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది పడుతున్న రాయలసీమ ఎడారి కాకముందే ఇక్కడి ప్రజలు మెల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ పౌరుషాన్ని చూపించకపోతే భావితరాలు మనల్ని క్షమించబోవన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ కంటే రాయలసీమ చాలా వెనకబడి ఉందని గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాయలసీమ రాష్ట్ర సమితి మైనార్టీ నాయకులు ఖాదర్ వలి, బి. ముసికిన్, సుభాన్, రాజశేఖర్, ఖాసీం వలి, మీడియా కోఆర్డినేటర్ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కర్నూలు (టౌన్): హిందూపురంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు విధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఆదివారం స్థానిక సీ.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులతో వైఎస్సా ర్సీపీ నాయకులను బెదిరించలేరన్నారు. ప్రజల్లో ఇప్పటికే బాబు సర్కార్పై పూర్తి వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. 24న డాక్టర్ ఖాదర్వలి కర్నూలు రాక కర్నూలు(అగ్రికల్చర్): ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ స్పెషలిస్టు, పద్యశ్రీ అవార్డు గ్రహాత డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 24న కర్నూలుకు రానున్నారు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీ.క్యాంపు సెంటరులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని అధితి చిరుధాన్యాల ప్రతినిధులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్వింటా పత్తిని రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలి కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పత్తిని క్వింటాలు రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఆదివారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంగళ, బుధవారాల్లో ఆదోనిలోని రోషన్ గార్డెన్స్లో జరిగే పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, రావుల వెంకయ్య, మాజీ మంత్రి రఘువీరారెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. తిప్పాయపల్లెలో దొంగలు హల్చల్ ఓర్వకల్లు: మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి దొంగతనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ బాలమద్దిలేటి, బైరాపురం చంద్రశేఖర్రెడ్డి, వడ్డె రవిచంద్రుడు ఇళ్లకు తాళం వేసి వేర్వేరు ప్రాంతాలో జీవనం సాగిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళం గడియలను ఆక్సిల్ బ్లేడుతో కోసి ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. కురువ బాలమద్దిలేటి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, బైరాపురం చంద్రశేఖర్రెడ్డి ఇంట్లో రూ.30 వేల నగదు, వడ్డె రవిచంద్రుడు ఇంటిలో రూ.7 వేలు, ముల్ల బషీర్ అహ్మద్ ఇంట్లో సుమారు రూ.25 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం ఇంటికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. -
గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయమని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మూడో రోజు ఆదివారం గ్రంథాలయ ఉద్యమ నాయకులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించా రు. గ్రంథాలయ ఉద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణ య్య, పాతూరి నాగభూషణం, ముచ్చుకోట చంద్రశేఖర్ చిత్ర పటాలకు డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఆర్అండ్బీ డీఈ పి.ప్రేమకుమారి, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎస్ఆర్ రత్న రూత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠంతో మేదస్సు పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఇన్చార్జ్ సెక్రటరీ పెద్దక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, చంద్రమ్మ, నసీమా, రేణుక, పద్మావతమ్మ, ఈశ్వరమ్మ, ఉమ పాల్గొన్నారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో ఆటోవాలాల స్టంట్లు
కర్నూలు: నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద అవుటర్ రింగ్ రోడ్డులో బైక్ రేసింగ్లు, ఆటోవాలాల స్టంట్లు మితిమీరాయి. ఈ ప్రాంతంలో పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండటంతో ఆకతాయిలు గుంపులుగా చేరి బైక్ రేసింగ్లు, ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఆకతాయిలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. రౌడీషీటర్లు కూడా మద్యం సేవించి గట్టు ప్రాంతానికి వచ్చే ప్రేమికులను బెదిరించి నిలువు దోపిడీకి పాల్పడి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఆటోవాలాలు మద్యం మత్తులో రోడ్డుపైనే ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం అందడంతో ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. నాలుగు ఆటోలతో స్నేక్ డ్రైవింగ్, స్టంట్లు చేస్తూ వీడియోలు తీస్తుండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టంట్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో వివరించి నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆటోలతో స్టంట్లు, ర్యాష్ డ్రైవింగ్లకు పాల్పడుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే 112 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శివారులోని తుంగభద్ర బ్రిడ్జి దగ్గర కేసీ కెనాల్లోకి దూకి కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ అన్వర్(60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత 20 ఏళ్లుగా కిమ్స్ హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆదివారం ఉదయం మాసామసీదు వద్ద కేసి కెనాల్లో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్ తాలుగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంభ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పాతిమాతో పాటు కుమారుడు, కూతురు సంతానం. సోదరి కుమారుడు జావీద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సి.బెళగల్: తుంగభద్ర నదితీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందని ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. ఆదివారం నదితీర గ్రామమైన ముడుమాల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్లకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వేణుగోపాల్రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ బృందం సభ్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే ఖననం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడి ఎత్తు 172 సెంటీమీటర్లు ఉన్నట్లు, మృతుడి ఎడమ భుజముపై ఎస్యూ అనే అక్షరాలు ఉన్నాయని, వివరాలు తెలిస్తే సి.బెళగల్ పోలీస్లను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. నల్లమల ఘాట్లో రోడ్డు ప్రమాదం మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘాట్రోడ్డులోని బొగద దొరబావి వంతెన వద్ద గిద్దలూరు నుంచి వస్తున్న లారీ, నంద్యాల నుంచి వెళ్తున్న కారు మలుపు వద్ద ఢీకొన్నాయి. కారు ముందు భాగం దెబ్బతినింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహానంది, శిరివెళ్ల మండలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు ఆదోని అర్బన్: బాలికను వేధించడంతో త్రీటౌన్ పోలీసులు బీజేపీ నాయకుడు మహేష్నాయక్ అనే యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు.. మహేష్నాయక్ అనే బీజేపీకి చెందిన నాయకుడు వేధిస్తున్నాడని శనివారం ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మహేష్నాయక్ ఎమ్మెల్యే ఇంటి ముందే వారితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇరువురు త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. బాలికను వేధిస్తున్నాడని బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మహేష్నాయక్పై బాలిక తల్లిదండ్రులు దాడి చేసినట్లు మహేష్నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
నందికొట్కూరు: వడ్డేమాన్ గ్రామంలో ఓ రైతు నిర్లక్ష్యం వల్ల 30 ఎకరాల మొక్కజొన్న పంట, 4 ఎకరాల్లో కంది పంట దగ్ధమైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోయ సోమన్న అతని రెండు ఎకరాల్లో మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలో చుట్టూ ఉన్న కొందరు రైతులకు చెందిన మొక్కజొన్న పంట, కంది పంటకు మంటలు వ్యాపించి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తెలుగు రోషన్నకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన అబ్దుల్ రహిమాన్–7 ఎకరాలు, ముర్తుజావలి–4, ఈశ్వరన్న–5, నూరుల్లా–4, నాగపుల్లన్నకు 4 ఎకరాల కంది పంట మొత్తం దగ్ధమైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపాలు పొలాలను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు బోయ సోమన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
20 శాతం మంది మూర్ఛరోగులే...!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి వచ్చే రోగుల్లో 20 శాతానికి పైగా మూర్చరోగులే ఉంటున్నారు. తాము ప్రతి వారం దాదాపు వంద మంది మూర్చవ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాము. అవసరమైన వారికి ఈఈజీ, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయించి ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స చేస్తున్నాము. ఇక్కడ చికిత్సతోపాటు అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా రోగులకు అందిస్తున్నాము. –డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి విభాగాధిపతి, పెద్దాసుపత్రి ఈ వ్యాధికి ఆడ, మగా తేడా లేదు. వయస్సుతో సంబంధం లేదు. సున్నా నుంచి 90 ఏళ్ల వయస్సు వారి వరకు ఈ వ్యాధి రావచ్చు. కొందరికి పుట్టుకతో వస్తే, మరికొందరికి ప్రమాదాలు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్ల వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో పలు కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అది ఎందువల్ల వచ్చిందో వైద్యులు నిర్ధారించి చికిత్స చేస్తారు. కొందరు మాత్రమే దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. అధిక శాతం వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం మందులు వాడితే సరిపోతుంది. – డాక్టర్ బి.హైందవకుమార్రెడ్డి, న్యూరోఫిజీషియన్, కర్నూలు -
సాగునీరు ఇవ్వడం కష్టమే!
గురురాఘవేంద్ర ప్రాజెక్ట్లలో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన ఏడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.4.50కోట్లుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాం. కోసిగి మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్లు ఒక్కొక్క మిషన్ పనిచేస్తోంది. దుద్ది పైప్లైన్ పగిలి పోవడంతో కాంట్రాక్టర్ సమయం ముగిసిందని పట్టించేకోలేదు. బడ్జెట్ వచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ఈ ఏడాది దుద్ది నుంచి సాగునీరు ఇవ్వడం కష్టమే. – ప్రేమ్, గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏఈ -
న్యాయపోరాటం చేస్తాం
గ్రామ కంఠం భూమి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, ఆదోని సబ్కలెక్టర్, తహసీల్దార్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదు. అధికార పార్టీ నాయకుల చెప్పిందే రెవిన్యూ అధికారులు పాటిస్తున్నారనే అనుమానాలు మాకు ఉన్నాయి. గ్రామ కంఠంలో కొన్ని సంవత్సరాలుగా దిబ్బలు వేసుకుంటున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లేవారు. ఇప్పుడు నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – శంకర్, మల్లారిపేట, గుడేకల్ గ్రామం కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న స్థలంలో ఎరువు దిబ్బలు, వరిగడ్డి వాములు వేసుకుంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటవిని మమ్మల్ని స్థలం లోకి రాకూడదని చెప్పితే ఎలా? మాకు స్థలం చూపించాలి. ఇంటి ముందు దిబ్బలు వేసుకోవటానికి స్థలం లేదు. –మహదేవి, మల్లారిపేట, గుడేకల్ గ్రామం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అండదండలు మాకు ఉన్నాయని, మమ్మల్ని ఏమి చేసుకోలేరని గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఆక్రమించుకోవాలని చూసే తెలుగుదేశం పార్టీ నాయకులది 4వ వార్డు. మాది 3వ వార్డు. మా కాలనీలో వారి దౌర్జన్యం ఏమిటి? ప్రజల సహనం కోల్పోయి ఏమైనా జరిగితే దీనికి అధికారులు, ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – తిమ్మయ్య, మల్లారిపేట, గుడేకల్ -
మెదడులో కలకలం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ రోగులకు చికిత్స అందిస్తారు. ప్రతి ఓపీ రోజున 200 నుంచి 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఇందులో వీరిలో 20 శాతం మంది మూర్చ వ్యాధి బాధితులుంటున్నారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ఐపీ సేవలతో పాటు ఈఈజీ, ఎపిలెప్సీ స్టడీ సేవలు ఏడాదికి 3వేల మంది వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటే రూ.2 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. మూర్ఛ బాధితులకు అవసరమైతే ఎంఆర్ఐ, వీడియో ఈఈజీ పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనే గాక జిల్లా మొత్తంగా సీహెచ్సీలు, పీహెచ్సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్దకు వెళ్లే వారు ప్రతి నెలా మరో 10వేల మంది దాకా ఉంటారని అంచనా. కాగా ఇప్పటికీ గ్రామాల్లో కొందరు ఈ వ్యాధికి నాటు మందు తీసుకుంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వస్తున్నారు. మూర్చలో రకాలు–లక్షణాలు ● సాధారణ మూర్ఛలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్చలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. ● మయోక్లోనిక్ మూర్చలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలలో ఆకస్మిక విచ్ఛిన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లల్లో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. ● ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు.రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతులలో, కాళ్లల్లో తరచూ లాగుతుంది. చికిత్స మూర్ఛ వ్యాధులను 75 శాతం మందులతోనే నయం చేయవచ్చు. 25 శాతం మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి వారికి కూడా ముందుగా మందులు ఇచ్చి చూస్తారు. అయినా మందులకు లొంగకపోతే ఆపరేషన్కు సూచిస్తారు. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్చ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కాస్త బాగైందిలే అని మందులు మానిస్తే ప్రమాదం సంభవించవచ్చు. మూర్ఛవ్యాధి అంటే... మూర్ఛ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటి అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికై నా రావచ్చు. పెరుగుతున్న మూర్ఛ వ్యాధి బాధితులు అవగాహనే ఈ జబ్బుకు నివారణ కొద్దికాలం మందులు వాడితే నయం చికిత్సలో ఆధునిక మందులు, పరికరాలు నేడు జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినంఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్లూ, చేతులు కొట్టుకుంటూ నోట్లో నురగ వస్తుంటే అలాంటి వారిని చూసి మూర్చ వచ్చిందని భావిస్తాము. వెంటనే కొందరు వారి నుదుటన అదిమి పట్టి, చేతుల్లో తాళం చెవి పెట్టి అలాగే ఉంచుతారు. కొద్దిసేపటికే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా మారి మళ్లీ ఎలా వచ్చాడో అలా వెళ్లిపోతారు. సమాజంలో నిత్యం ఇలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాము. దీనినే వైద్యపరిభాషలో ఎపిలెప్సీ అని, సాధారణ పరిభాషలో మూర్ఛ/వాయి/ఫిట్స్ అని పిలుస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అవగాహన కలిగి ఉండటంతో పాటు సకాలంలో మందులు వాడితే ఈ జబ్బు నుంచి బయటపడొచ్చు. నేడు జాతీయ మూర్చవ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్చ వస్తుంది. -
ఎత్తిపోయిన పథకాలు!
దుద్ది రిజర్వాయర్ కింద 15 ఎకరాల భూమి సాగుచేసుకున్నా. ఖరీఫ్లో భారీ వర్షాలు కారణంగా పత్తి, ఉల్లి పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. కనీసం పెట్టుబడి రాక అప్పులు మిగిలాయి. రబీలో వేరుశన, మిరప, ఉల్లి పంటలు సాగు చేసుకున్నా. ఇప్పుడు ఎల్లెల్సీ కాల్వకు నీళ్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – తిమ్మయ్య, ఆయకట్టు రైతు, కోసిగి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. గతంలో ఖరీఫ్లోనే మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్లు నిండుగా నీటితో నింపేవారు. ఎల్లెల్సీ నీరు తగ్గిన వెంటనే ఆ రిజర్వాయర్ నీటితో పంటలను పండించుకునే వాళ్లం. కానీ ఈ ఏడాది ఎల్లెల్సీ నీరు ఇవ్వమంటున్నారు. వర్షకాలంలో పంటలు దెబ్బతిన్నాయి, రబీలోను పంటలు లేక పోతే రైతులు ఎలా బతకాలి? – నాడుగేని వీరారెడ్డి, రైతు, కోసిగి కోసిగి: భారీ వర్షాలు కురిసి తుంగభద్ర నది నిండుగా ప్రవహించినా రైతుల కష్టాలు తొలగలేదు. ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడం, తుంగభద్ర దిగువ కాలువకు జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలన్నీ బీళ్లుగా మారుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎల్లెల్సీ (తుంగభద్ర దిగువ కాలువ)కింద చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడాన్ని గమనించి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తుంగభద్ర నది ఒడ్డున దుద్ది, మూగలదొడ్డి, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి పుష్కలంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించారు. సాగుకు ‘చంద్ర’గ్రహణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదు. తుంగభద్ర నది నిండుగా ప్రవహించే సమయంలో ఎత్తిపోతల పథకాల పంప్హౌస్ల నుంచి రిజర్వాయర్లను నీటితో నింపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు. దీంతో పంప్ హౌస్లు పనిచేయలేదు. ఫలితంగా రిజర్వాయర్లు నీరు లేక వెలవెలబోతున్నాయి. ‘దుద్ది’ ఎత్తిపోయింది! తుంగభద్ర నది ఒడ్డున సాతనూరు సమీపంలో నిర్మించిన దుద్ది ఎత్తిపోతల పథకం మిషన్లు ఏడాది మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్కు చుక్క నీరు కూడా పంపింగ్ చేయలేదు. ఈ రిజర్వాయ కింద దుద్ది, కోసిగి, దేవరబెట్ట, డి.బెళగల్ వరకు 3,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అలాగే నీటిని సరఫరా చేసే దుద్ది పొలాల్లో నెల రోజల క్రితం పైప్లైన్ పగిలిపోయింది. ఇంత వరకు మరమ్మతులు చేపట్టక లేక పోయారు. నదిలో వృథా నీరు దిగువ ప్రాంతాలకు తరలి పోయాయి. ఖరీఫ్ ముగిసి పోయినా రిజ్వాయర్ వైపు పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో నైనా సాగు చేసుకుందామనుకున్నా జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెబతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పంటలు లేక బతుకు భారమై వలస బాట పడుతున్నారు. ‘మూగ’నోము మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం కింద 3,700 ఎకరాలు ఆయకట్టు భూములు ఉన్నాయి. మూగలదొడ్డి, అగసనూరు, జంపాపురం, చిర్తనకల్లు, ఐరన్గల్లు, సాతనూరు వరకు ప్రవహిస్తోంది. ఎత్తి పోతల పథకం వద్ద రెండు మిషన్లు ఉన్నారు. ఒకటి మరమ్మతులకు గురైనా మరమ్మతులు చేయలేదు. ఒక మిషన్తో రైతులు దగ్గరుండి పంపింగ్ చేయించుకుంటున్నారు. ఒక మిషన్తో రిజర్వాయర్లోకి అరకొరగా వచ్చి చేరుతున్నారు. దీంతో రిజర్వాయర్లో పుష్కలంగా సాగునీరు నిండలేదు. అలాగే మంత్రాలయం మండలంలోని మాధవరం, బసలదొడ్డి ఎత్తి పోతల పథకాలకు గతేడాది ఒక్క చుక్క నీరు కూడా అందించలేక పోయారు. ఈ ఏడాది కూడా అందిస్తారో లేదో నని రైతులు ఎదురు చూపులే మిగిలాయి. ఈ ఏడాది దుద్ది రిజర్వాయర్కు చుక్క నీరు నింపని వైనం పంప్ హౌస్ మరమ్మతులు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువకు జనవరి 10 వరకే నీరు పొలాలు బీళ్లు అవుతాయనే ఆందోళనలో అన్నదాతలు -
ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు!
కోవెలకుంట్ల/కోడుమూరురూరల్/హాలహర్వి/కౌతాళం: చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంటలు పండక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పలు గ్రామ సచివాలయాలు అసంపూర్తిగా ఉండి అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మందుబాబులు మద్యం సేవించి సీసాలు పగులగొడుతున్నారు. ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు కనిపిస్తుండటంతో ‘ఇదేం పాలన’ అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తొలగని ‘దారి’ద్య్రం హాలహర్వి మండలంలోని గూళ్యం–బల్లూరు గ్రామ రహదారి కంకరతేలి గుంతలతో అధ్వానంగా మారింది. ఏడాదిగా గ్రామ రహదారి బాగుపడడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్లేందుకు వాహనాల్లో ఈ మార్గం గుండానే విద్యార్థులు వెళ్తుంటారు. రోడ్డుబాగా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి..ఆధోగతి కోడుమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గ్రామ సచివాలయ భవనం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ భవనంలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కొందరు ఆకతాయిలు నిత్యం మద్యం తాగుతున్నారు. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవనంపైనే కాంట్రాక్టర్ ఇసుక, కంకరను అలాగే వదిలేశారు. దీంతో వర్షాలకు నీళ్లు నిలిచిపోయి భవనం దెబ్బతింటోంది. అసాంఘిక చర్యలు కౌతాళంలోని కన్నడ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్లో విద్యార్థులు నిత్యం ప్రార్థన చేసే స్థలంలో బీర్ బాటిళ్లను పగలగొట్టారు. గాజు ముక్కల్ని చెల్లాచెదురుగా పడేశారు. పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఈ పాఠశాల ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల కాంపౌండ్లోకి దూకి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. విద్యార్థులు ప్రార్థన చేసే స్థలంలో ఇలా చేయడం చాలా బాధాకరం అని, వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మిరప పైరును తొలగించి.. కోవెలకుంట్ల మండలం రేవనూరులో ఇటీవల తుపాన్తో కురిసిన భారీ వర్షాలు మిరప రైతులకు కన్నీటిని మిగిల్చాయి. గ్రామానికి చెందిన హనుమంతు రెడ్డి నాలుగు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది జూలై నెలలో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. 90 వేలు ఖర్చు చేశాడు. నాలుగు నెలల పంట కావడంతో మొక్కకు 60 నుంచి 70 మిరప కాయలు కాశాయి. గత నెలాఖరులో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతో పైరులో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయి దెబ్బతినింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే మరో రైతు ఎకరా రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడున్నర ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. లక్ష చొప్పున పెట్టుబడుల రూపంలో వెచ్చించాడు. భారీ వర్షాలతో వేరుకుళ్లు తెగులు ఆశించి పైరు పూర్తిగా దెబ్బతినింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నమంతా వృథా కావడంతో విధిలేని పరిస్థితుల్లో పైరును తొలగించారు. అధికారులు పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
బియ్యం గింజలతో పరమ శివుడు
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజలతో పరమశివుడు రూపాన్ని ఆవిష్కరించారు. కుంచె, రంగులు లేకుండా స్కెచ్లు ఉపయోగించకుండా బియ్యపు గింజలను పలకమీద పోస్తూ చేతి వేలితో బియ్యపు గింజలను క్రమంగా సరి చేస్తూ శివయ్య రూపాన్ని ఆవిష్కరించారు. గంగాదేవి, సిగలో నెలవంక, మెడలో నాగరాజు(పాము), త్రిశూలం, ఓం ఆకారం, కార్తీక ప్రమిదలను చిత్రంలో రూపొందించడంతో కోటేష్ను పలువురు అభినందించారు. – నంద్యాల(అర్బన్) -
30లోపు పొగాకు కొనుగోలు ఒప్పందం
కర్నూలు(సెంట్రల్): పొగాకు పంటకు సంబంధించి రైతులతో కొనుగోలు ఒప్పందాన్ని ఈనెల 30వ తేదీలోపు కుదుర్చుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆయా కంపెనీలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొగాకు సంబంధించి జిల్లా స్థాయి టాస్క్ఫోర్సు కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..2025–26 సంవత్సరం రబీలో హెచ్డీ బీఆర్జీ, హెడీ బార్లీ, బ్లాక్ బెర్రీ రకాల పొగాకు సాగును పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అందువల్ల అన్ని పొగాకు కంపెనీలు/ఎగుమతిదారులు వాటి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోరాదన్నారు. వైట్ బార్లీ రకం పొగాకు సాగుపై నియంత్రణ అమల్లో లేదని, రైతులు, పొగాకు కంపెనీలు కొనుగోలు ఒప్పందాన్ని కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. పొగాకుకు సంబంధించి టాస్కుఫోర్సు కమిటీలు డివిజన్, మండల స్థాయిల్లో కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా కమిటీల్లో ఒక్క రైతు ఉండే విధంగా చూడాలన్నారు. ఫలితంగా రైతుల తరఫున సమస్యలను కమిటీ దృష్టికి తెస్తే పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: పట్టణంలోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ముల్లాన్పేటకు చెందిన దినేష్, ప్రవళ్లికల కుమారుడు ప్రజ్వల్(15) శుక్రవారం రాత్రి ఇంట్లో దిమ్మెకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, చదువులో రాణించకపోవడం, త్వరలోనే పదవ తరగతి పరీక్షలు వస్తుండటంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.గుండె పోటుతో ఉపాధ్యాయుడి మృతి పాణ్యం/కొలిమిగుండ్ల: ఎంతో కష్టపడి ఆశల ఉద్యోగం సాధించి విధుల్లో చేరిన నెల రోజుల్లోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన విజయ్కుమార్ (37) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం నిర్వహించిన కౌన్సెలింగ్లో పాణ్యం మండలం నెరవాడ సమీపంలోని గిరిజన బాలుర పాఠశాలకు నియమితులయ్యారు. సోషల్ స్కూల్ అసిస్టెంట్గా అక్టోబర్ 13న విధుల్లో చేరాడు. అంతకు ముందు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండేవారు. ఎట్టకేలకు డీఎస్సీలో ప్రతిభ చాటుకొని కొలువు సాధించడంతో జీవితంలో స్థిరపడేందుకు మార్గం సుగమమైంది. ఈలోగా విధి వక్రీకరించడంతో అర్ధాంతంగా మృతి చెందారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటనతో కుటుంబ సభ్యులు రోదనలు స్థానికులను కంట తడిపెట్టించాయి. ఎంఈఓ శ్రీధర్రావుతో పాటు నెరవాడ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, సిబ్బంది అవుకు చేరుకొని విజయ్కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు వెల్దుర్తి: గుంటుపల్లె గ్రామానికి చెందిన గొల్ల సుధాకర్ అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. తన భర్త అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య శ్రీదేవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. రెండెకరాల పొలం సాగుకు, కుటుంబ ఖర్చులకు దాదాపు బ్యాంక్లో రూ. 3 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 6 లక్షలు అప్పులు కావడంతో తీర్చే మార్గం లేక మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌర స్తా సమీపంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమచారం మేరకు.. శ్రీరాం నగర్ కాలనీకి చెందిన సుజాత కుమారు డు గణేష్(22) పట్టణంలోని ఓ మార్ట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. యువకుడి తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి ఉరికి వేలాడుతూ కన్పించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కిందికి దించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా పదేళ్ల క్రితం యువకుడి తండ్రి తిమ్మరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి, బంధువుల రోదన లు మిన్నంటాయి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మినీ బస్సుకు రూ.86 వేల జరిమానా
కృష్ణగిరి: అమకతాడు టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) క్రాంతికుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక మినీ బస్సును ఆపే ప్రయత్నం చేయగా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. నిర్ఘాంతపోయిన అధికారి తేరుకుని మినీ బస్సును తన వాహనంలో వెంబడించి పట్టుకున్నారు. శ్రీసాయి విష్ణు ట్రావెల్స్కు చెందిన మినీ బస్సు హైదరాబాద్ నుంచి యాగంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బస్సుకు ఫిట్నెస్ పత్రాలు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, చివరకు బస్సు డ్రైవర్కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు గుర్తించి బస్సును జప్తు చేశారు. రూ.86వేల జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించినట్లు ఎంవీఐ తెలిపారు. -
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఆదోని అర్బన్: ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేశాడని, ఆ బాలిక తల్లిదండ్రులు శనివారం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు వారిని చూసి.. మాటామాటా పెరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది.ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్ బండి ఆత్మకూరు: వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను శనివారం అరెస్ట్ చేసినట్లు బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా తెలిపారు. మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన కల్లూరి వెంకట రమణ, కల్లూరి వెంకటేశ్వర్లు, కలడి ఈశ్వరయ్య సెప్టెంబర్ నెలలో గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ వద్ద అడవి పందిని వేటాడుతుండగా అటవీ శాఖ సిబ్బంది వారిని వెంటబడించారు. అప్ప టి నుంచి పరారీలో ఉన్న ముగ్గురిని శనివారం గ్రామ ంలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు అటవీ అధికారి తెలిపారు. సమావేశంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీ సర్లు జి. రామకృష్ణ, వై. నాగేంద్రయ్య, బీట్ ఆఫీసర్ పరమేశ్వరి పాల్గొన్నారు. -
ఫాస్టాగ్ లేకపోయినా స్మార్ట్ టోల్ సిస్టమ్
కర్నూలు: ఫాస్టాగ్ లేకపోతే ఇకపై టోల్ ప్లాజాల్లో డబుల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించే వాహనదారులు ఇప్పటివరకు టోల్ప్లాజాలో క్యాష్ (నగదు) చెల్లిస్తే డబుల్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు రూ.100 టోల్ ఉన్న చోట ఫాస్టాగ్ ఉంటే రూ.100, లేకపోతే నగదు రూ.200 వసూలు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 25 శాతం అదనంగా మాత్రమే అంటే రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధన ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం.. యూపీఐ చెల్లింపుల ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతాయి. నగదు లావాదేవీల్లో ఉండే అవినీతి, ఆలస్యం కూడా తగ్గుతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఈ మేరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్కు ఆమోద పత్రం జారీ చేసింది. ఇకపై కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్హెచ్40)లోని టోల్ ప్లాజాల్లో స్టాటిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపు విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు ఫాస్టాగ్ లేకపోయినా సులభంగా క్యూఆర్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు–కడప జాతీయ రహదారిపై క్యూఆర్ యూపీఐ టోల్ చెల్లింపు అమలు ప్రారంభం కావడం వేలాది వాహనదారులకు పెద్ద ఉపశమనం. వాహనదారులు టోల్ బూత్ వద్ద ఆగి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. నగదు చెల్లింపులతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు. ట్రాఫిక్ తగ్గింపుతో పాటు పారదర్శకత కూడా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలతో టోల్ప్లాజాల్లో లైన్లు తగ్గి ట్రాఫిక్ కుదింపు, సమయం ఆదా అవుతుంది. – వి.మదనమోహన్, ప్రాజెక్ట్ హెడ్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే -
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రికి పెరిగెడతారు. పెంపుడు జంతువులకు సైతం పశు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి. మరి అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులకు అనుకోని ప్రమాదం జరిగితే... అనారోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటి? అరుదైన జంతు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్– శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ముఖ్య సంరక్షిత జంతువు పెద్ద పులి. దానికి అనారోగ్య సమస్యలు తలెత్తితే కనీసం పరీక్షించేందుకు మత్తు ఇవ్వాలన్నా హైదరాబాద్, తిరుపతి జంతు ప్రదర్శనశాలల నుంచి వైద్యులు రావాల్సి ఉండేది. ఇదంతా నాలుగేళ్ల క్రితం వరకే. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీలో 2021లో వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది అరుదైన వన్యప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ ఉన్న వైద్యులను నియమించారు. వారికి ఒక వెటర్నరీ సహాయకుడిని, ఒక న్యాచురాలజిస్ట్ (వన్యప్రాణి ప్రవర్తనను అంచనా వేసేందుకు), మరో ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని సౌకర్యాలు కలిగిన ఒక అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాహనం కూడా ప్రతి అటవీ డివిజన్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన అనిమల్ రెస్క్యూ వ్యాన్ కూడా ఉంది. ఓ వైపు అనుభవం ఉన్న వైద్యులు, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో అరుదైన వన్యప్రాణులకు రక్షణగా నిలుస్తున్నారు. సహజంగా అడవిలో ఏదో కారణంగా గాయపడిన వన్యప్రాణిని చేరుకోవడానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. నల్లమల అడవుల్లో విస్తారంగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలలో వన్యప్రాణుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఏదైన జంతువు గాయ పడిన విషయం సాధారణంగా కెమోరాల ద్వారానే తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ జంతువు సంచరించే ప్రాంతాన్ని గుర్తించి, దానిని పట్టుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెస్క్యూ పార్టీ విధులు ఇలా.. ● వన్యప్రాణులను రక్షించి తిరిగి అడవిలోకి వదలడం ● ప్రమాదవశాత్తూ మరణించిన వన్యప్రాణుల పోస్ట్మార్టం, దహనం ● పులి దాడిలో మరణించిన పెంపుడు జంతువుల పోస్ట్ మార్టం (లైవ్స్టాక్ డిప్రిడేషన్) ● అడవుల్లో అంటువ్వాధుల నిరోధం, పర్వవేక్షణ ● అటవీ సమీప గ్రామాల్లో పెంపుడు జంతువుల వాక్సినేషన్పై పర్యవేక్షణ ● వేటగాళ్ల దగ్గర లభించే మాంసాన్ని పరిశీలించి వన్యప్రాణి మాంసంగా నిర్ధారించడం ● అటవీశాఖ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ మానిటరింగ్ ● ట్రైనీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్లకు శిక్షణా కార్యక్రమాలు డిస్పెన్సరీ వైద్యుల విజయాలు.. ● నల్లమలలో అడవి పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం. ● రాష్ట్రం నలుమూలల చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల సమీపంలోకి వచ్చినపుడు వాటిని పట్టి తిరిగి అడవిలోకి వదలడం. ● అడవి దున్న (గౌర్)ను తిరిగి నల్లమలకు తెప్పించే ప్రాజెక్ట్లో సాంకేతిక సహాయకులుగా ఉండటం. ● డిస్పెన్సరీ వైద్యులు రక్షించిన వన్య ప్రాణుల్లో చిరుత, పెద్దపులులు, ఎలుగు బంటి వంటి జంతువులే కాకుండా పాంగోళిన్ (అలుగు), అడవిపంది, పునుగు పిల్లి, మొసలితో పాటు రకాల పక్షులు ఉన్నాయి. ● నల్లమలలో నాలుగు పెద్దపులి కూనలు తల్లికి దూరమై ఆత్మకూరు అటవీ డివిజన్లోని గుమ్మడాపురం గ్రామ శివార్లకు చేరుకోగా బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు వాటిని క్షేమంగా తిరుపతి జంతు ప్రదర్శన శాలకు తరలించారు. కాని అప్పటికే అవి మానవ స్పర్శకు అలవాటు కావడంతో వాటి వన్యజీవన విధానానికి దూరమయ్యాయి. అవి ఇప్పుడు తిరుపతి జూలోనే ఉన్నాయి. అడవిలో ఎవరి పర్యవేక్షణలో లేని వన్యప్రాణులకు వైద్యం చేయడం అత్యున్నత సేవగా భావిస్తాం. ఎన్నో రకాల వన్యప్రాణులకు చికిత్స చేసి అడవుల్లోకి తిరిగి పంపాం. నెమలి పిల్లలు, గద్ద(కై ట్) వంటి వాటికి ఇక్కడ చికిత్స అందించాం. అవి కోలుకుంటున్నాయి. పెద్దపులి లాంటి ముఖ్య రక్షిత వన్యజంతువు సంరక్షణ మాకు ఎంతో కీలకం. వన్యప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – డాక్టర్ జుబేర్, వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ పశువైద్యులు డ్రోన్తో గుర్తించి.. ఉచ్చు తొలగించి..వేటగాడు జింకల కోసం పన్నిన ఉచ్చు పెద్దపులి మెడకు బిగుసుకోవడంతో గాయపడింది. బైర్లూటి రేంజ్లోని ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఆ పులిని చిత్రీకరించడంతో విషయం తెలుసుకున్న బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు రంగంలోకి దిగారు. గాయపడిన పులి ఆవాస ప్రాంతం సమీపంలో ప్లాష్ కెమెరాలను ఉంచారు. పులి వాటి సమీపంలో వెళుతున్నప్పుడు ఆటో మేటిగ్గా ప్లాష్ వెలిగి పులి రాకపై సమాచారం అందడంతో అక్కడ మాటు వేసి దాని జాడను కనిపెట్టారు. వంద అడుగుల దూరం నుంచి ఓ వైద్యుడు ట్రాంక్విలైజర్ గన్తో మత్తు ఇచ్చాడు. ఆ తర్వాత డ్రోన్తో దానిని అనుసరించారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి చేర్చి ప్రత్యేక వాహనంలో బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీకి తరలించారు. పులి మెడకు వున్న ఉచ్చును తొలగించారు. ఆహార నాళానికి గాయం తీవ్రంగా ఉండడంతో వైద్యం అందించి తిరుపతిలోని జంతుప్రదర్శన శాలకు తరలించారు. అక్కడ వెటర్నరీ సర్జన్ల చేత ఆపరేషన్ చేసి గాయానికి కుట్లు వేశారు. వారం రోజులు పరిశీలనలో ఉంచారు. దురదృష్టవశాత్తు ఆ పులి కోలుకోలేక మరణించింది. క్షేమంగా 60 జింకల తరలింపు.. వన్యప్రాణులను ఒకచోట నుంచి మరో చోటికి తరలించడం అంటే అది ఒక పెద్ద టాస్క్. ఇలాంటి తరలింపుల్లో గమ్యం చేరేది 50 శాతం మాత్రమే. అయితే దేశంలోనే మొట్ట మొదటి సారి నూరుశాతం సక్సస్ రేట్తో పుట్టపర్తిలోని 60కి పైగా కృష్ణజింకలు, పొడదుప్పులను బైర్లూటీ డిస్పెన్సరీ వైద్యుల పర్యవేక్షణలో నల్లకాల్వ సెక్షన్కు తరలించారు. జింకలు తరలించే సమయంలో అవి తీవ్రమైన భయాందోళనకు గురవుతాయి. అకారణంగా వాటి శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగి అవి షాక్కు గురై రవాణాలో ఎక్కువ శాతం మరణిస్తాయి. అయితే బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ జుబేర్, డాక్టర్ అరోన్ వెస్లీల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రవాణా వాహనంలో చల్లటి నీటిని వెదజల్లే స్ప్రింక్లర్లు ఉంచడం, కుదుపుల్లో వాహనం అంచులకు తగిలి గాయపడకుండా కుషన్ ఏర్పాటు చేయడం, నల్లమలలో ఒక ఎన్క్లోజర్లో 10 రోజులు ఉంచి, ఈ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వాటిని అడవిలో వదిలారు. నల్లమలలో వన్యప్రాణులకో ఆసుపత్రి ఎన్ఎస్టీఆర్లో విస్తృత సేవలందిస్తున్న ౖబైర్లూటీ వెల్డ్ లైఫ్ డిస్పెన్సరీ గాయపడిన వన్యప్రాణులకు సత్వర చికిత్స -
పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పుదాం
ఓర్వకల్లు: పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం మండలంలోని నన్నూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సీఈఓ నాసర రెడ్డి, డీపీఓ భాస్కర్, ఆర్డీఓ సందీప్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, నీటి వనరులను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నా వాటిని కట్టెలు, కోళ్లు ఉంచడానికి ఉపయోగిస్తుండటం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని విధిగా నిర్మించుకోవడంతో పాటు వినియోగించుకోవాలన్నారు. ఇంటి బయట చెత్త పడేయకుండా ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ కోసం వచ్చే సిబ్బందికి అందివ్వాలన్నారు. వలసలకు వెళ్లే సమయంలో పిల్లలను వారితో పాటు తీసుకెళ్లకుండా సీజనల్ హాస్టల్లో ఉంచితే వారి విద్యకు అంతరాయం కలుగకుండా సహకరించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. విద్యార్థులతో కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగ అనసూయ, తహసీల్దార్ విద్యాసాగర్, డీఎల్డీఓ రమణారెడ్డి, సర్పంచు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్కు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు తదితర జిరాక్స్ కాపీలను జతపరిచి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, కల్లూరు చిరునామాలో స్వయంగా వచ్చి దరఖాస్తులను ఈ నెల 25లోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు బీసీ భవన్, గొల్లపూడి, విజయవాడలో ఉచిత శిక్షణను అందించేందుకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటైందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వివరాలకు 08518– 236076 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నందవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందిస్తామని, ప్రత్యేక క్లాసులు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు డీఈఓ శామ్యూల్ పాల్ సూచించారు. నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.63 కోట్లు మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కొరత ఉందని, సర్దుబాటు చేయాలని జెడ్పీ పాఠశాల హెచ్ఎం రామకృష్ణం రాజు, ఉపాధ్యాయులు డీఈఓకి వినతి పత్రం అందజేశారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్కు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 2024–25 రెగ్యులర్ బ్యాచ్ డీఎడ్ 2వ సెమిస్టర్లో ఫెయిల్ అయిన వారు, అలాగే ఉత్తీర్ణత కాని 2022–24, 2023–25 బ్యాచ్కి చెంది వారు ఈ నెల 20వ తేదీలోపు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ సిస్టం చలానా ద్వారా చెల్లించాలన్నారు. మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత చొరవ తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వసంతలక్ష్మి తెలిపారు. బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ సహాయ సంచాలకులు(ఏడీ)గా పనిచేస్తున్న ఈమెకు ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా పదోన్నతి కల్పించింది. పదోన్నతిపై కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా నియమించిన నేపథ్యంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈమె వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా, సహాయ సంచాలకులుగా సుదీర్ఘకాలం జిల్లాలోనే పనిచేశారు. డీడీ కార్యాలయం సహాయ సంచాలకులు భవానిశంకర్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
రైతు సేవా కేంద్రాల్లో వైద్య సేవలు బంద్
2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పశువుల ఆసుపత్రులు కేవలం 338 మాత్రమే ఉన్నాయి. మూగజీవాలకు సరైన వైద్య సేవలు అందడం లేదనే విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలలో కూడా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు రైతుభరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా మందులు సరఫరా అయ్యాయి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువైద్య కేంద్రాల సంఖ్య 721కి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుభరోసా కేంద్రాల్లో వైద్య సేవలు స్తంభించాయి. వీటికి మందుల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్బీకేలకు ప్రత్యేకంగా మందులు ఇవ్వమని.. ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డెస్పెన్సరీలు, గ్రామీణ పశువైద్యశాలలకు ఇస్తున్న మందుల నుంచే తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇస్తుండటం గమనార్హం. వీటిల్లోనే మందులు లేకపోతే రైతుభరోసా కేంద్రాలకు ఎలా ఇస్తారని పశుసంవర్ధక శాఖ అధికారులు వాపోతున్నారు. -
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధికర్నూలు (సెంట్రల్): జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ఆదేశించారు. కోర్టు సముదాయంలోని న్యాయ సదన్లో శనివారం జిల్లాస్థాయి న్యాయాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల జడ్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈపీ కేసులను ఆరు నెలల్లోపు పరిష్కరించేందుకు చేయాల్సిన సవరణలపై పలు సూచనలు ఇచ్చారు. కోర్టు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్జీలు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన రాజ, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, ఇ.రాజేంద్రబాబు, ఎంవీ హరినాథ్ పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లో కనిపించని ఈ–క్రాప్ బుకింగ్ వివరాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ–క్రాప్ బుకింగ్ వివరాలను సోషల్ ఆడిట్కు పెట్టాలనే వ్యవసాయ శాఖ ఆదేశాలను కిందిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు అన్ని రైతుభరోసా కేంద్రాల్లో రైతుల పరిశీలనకు ప్రదర్శించాల్సి ఉంది. వివరాలను రైతులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే రాతపూర్వకంగా చెప్పవచ్చు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి రైతుల పరిశీలనకు పెట్టేందుకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సగానికిపైగా ఆర్బీకే ఇన్చార్జీలు సోషల్ ఆడిట్ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. అక్కడక్కడ ఆర్బీకే ఇన్చార్జీలు ఐదారుగురు రైతులను పిలిపించి ఫొటోలు తీసుకొని మమ అనిపించినట్లు సమాచారం. డ్రంకెన్ డ్రైవ్లో మైనర్లు పట్టుబడితే వాహనం జప్తు కర్నూలు: డ్రంకెన్ డ్రైవ్లో మైనర్లు పట్టుబడితే వాహనాలను జప్తు చేసి వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని యజమానులు, తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధ పడాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదం ద్వారా పిల్లలను దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజలంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలనే సంకల్పంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా కూడా విధిస్తామని పేర్కొన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పాములపాడు:మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజారా కృష్ణానగర్ గ్రామానికి చెందిన వీరేష్ (17) ఎస్ఆర్బీసీ కాలువలో గల్లంతు కాగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. వీరేష్ పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13న ఎస్ఆర్ బీసీ కాలువ గట్టుపై ఆరబోసిన మొక్కజొన్న ధా న్యం వద్దకు కాపలాగా వెళ్లాడు. అక్కడ నీటి కోసం ఎస్ఆర్బీసీ కాలువలో దిగి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యా డు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం మృతదేహం లభించగా ఎస్ఐ సురేష్బాబు పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి మొగులేశ్వరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
కోలుకోలేక రిటైర్డ్ ఉద్యోగి..
కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్పోస్టు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయకల్లు సుంకన్న (72) తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని మంగళగిరి కాలనీలో నివాసముంటాడు. అగ్నిమాపక శాఖలో లీడ్ ఫైర్మెన్ (ఎల్ఎఫ్)గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. గురువారం మధ్యాహ్నం కర్నూలులోని టెలికాం నగర్ నందు ఉన్న వెంకటేశ్వర ఫర్నీచర్ షాపు వద్దకు వచ్చి కొత్త ఇంటికి తలుపులు, కిటికీలు బిగించుకునేందుకు కార్పెంటర్ కుమ్మరి మహేశ్వరాచారి స్కూటీ వెనుక కూర్చొని తాండ్రపాడుకు వెళ్లారు. చెక్క సామాన్లు కొలతలు తీసుకోవడానికి తిరిగి నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న సూర్య టింబర్ డిపో వద్దకు స్కూటీపై వస్తుండగా భారత్ పెట్రోల్ బంకు సమీపంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న మహేశ్వరాచారికి స్వల్ప గాయాలు కాగా, వెనుక కూర్చున్న సుంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించగా కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తద్వారా ఉన్నత దశకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో శుక్రవారం ఇన్చార్జ్ కార్యదర్శి వి.పెద్దక్క అధ్యక్షతన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జేసీ నూరుల్ ఖమర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు చంద్రశేఖర కల్కూర, గంగాధర్రెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, నిఖిల్ ఎడ్యుకేషన్ అకాడమీ అధ్యక్షుడు మద్దిలేటి, నైస్ కప్యూటర్స్ అధినేత రాయపాటి శ్రీనివాస్ ప్రారంభించారు. గాడిచర్ల హరిసర్వోత్తమవు విగ్రహం, అయ్యంకి వెంకట రమణ, ఎస్ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణం చిత్ర పటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకు ముందు గ్రంథాలయాల అవగాహన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వెల్దుర్తి: మండల పరిధిలోని గుంటుపల్లె గ్రామానికి చెందిన రైతు గొల్ల సుధాకర్ (40) శుక్రవారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీ సులు తెలిపిన వివరాలు.. సుధాకర్కు గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.ఆ మహిళ శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి సుధాకర్ హైవే–44 లద్దగిరి క్రాస్ దాటుకుని గోకులపాడు వెళ్లే రోడ్డు పక్కన పొలాల్లో కొన ఊపిరితో పడి ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్ను 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని వారంతా ఆసుపత్రికి వెళ్లి బిగ్గరగా రోదించారు. మృతుడి వెంట ఉన్న మహిళ సైతం ఆసుపత్రి వద్ద ఉండి.. తాను వెల్దుర్తికి బ్యాంకు పనిమీద వచ్చానని, సుధాకర్ ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్లినట్లు తెలపడం విశేషం. పో స్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అతని మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. -
సీట్ల కోసం పాట్లు
చంద్రబాబు సర్కారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఫీట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దివ్యాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్థితిలో శుక్రవారం మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు బస్సుల్లో సీట్ల కోసం పరుగులు తీస్తూ కనిపించారు. కొందరు ప్రమాదకర స్థితిలో తమ పిల్లలను కిటికీల్లోంచి బస్సులోకి ఎక్కించారు. బస్సులు రద్దీగా మారడంతో ప్రయాణికులను నియంత్రించడం డ్రైవర్, కండక్టర్లకు కష్టతరంగా మారింది. – మహానంది పిల్లలను కిటికీలోంచి బస్సులోకి ఎక్కిస్తున్న దృశ్యం -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
జూపాడుబంగ్లా: మండలంలోని పారుమంచాల గ్రామానికి చెందిన సతీష్ (23) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దేవరాజు కుమారు డు సతీష్ తిరుపతిలో బంధువుల వద్ద ఉంటూ పెయింటర్ పనిచేసేవాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సతీష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. తలుపు లోపలవైపు గడియపెట్టి ఉండటంతో ఎంతగా పిలిచినా తెరవలేదు. ఇంటి గవాక్షి ద్వారా లోపలికి వెళ్లి గడియ తీశారు. ఇంట్లోని ఫ్యాన్కు సతీష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడు కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, నొప్పి తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి దేవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహానికి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో ఎర్రజెండాలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని, కమ్యూనిస్టులు రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం సీఆర్ భవన్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. నేపాల్లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఒకే వేదికపైకి వచ్చినట్లు ఇక్కడ కూడా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మావోయిస్టు నేతలు, సభ్యులను హత్య చేస్తోందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాటాలకు దిగాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, చంద్రబాబు పాలనలో 4111 పాఠశాలలను మూసివేశారని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచింగ్, నాన్ టీచించ్ పోస్టులను భర్తీ చేయడంలేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేదలకు అందని ద్రాక్షగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. రూ.6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు కాలేజీలు మానుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా నిరుద్యోగులకు భృతి లేదని, మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500 ఇవ్వడం లేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కేంద్రంతో అంటకాగుతున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, పూర్వపు జిల్లా కార్యదర్శి పి.భీమలింగప్ప పాల్గొన్నారు. -
రాయల్టీ సిబ్బందితో వాగ్వాదం
కొలిమిగుండ్ల: బెలుం సమీపంలో శుక్రవారం రాయల్టీ వసూలు చేసే ప్రైవేట్ సిబ్బంది, మైనింగ్ యజమానులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నాపరాతి గనుల నుంచి పెద్దగా ఖరీదు చేయని రాళ్లను ట్రాక్టర్లో తీసుకెళుతుండటంతో ప్రైవేట్ సంస్థ సిబ్బంది బెలుం ప్రధాన రహదారిపైకి చేరుకోగానే జీపులో వచ్చి ట్రాక్టర్ను అడ్డుకుని రాయల్టీ చెల్లించాలని పట్టుబట్టారు. కొద్ది సేపటికే యజమానులు, కార్మికులు అక్కడ గుమికూడి సిబ్బందితో వాదోపవాదానికి దిగారు. గనుల్లో వృథాగా ఉన్న వాటిని తీసుకెళుతున్నారని వాటికి రాయల్టీ చెల్లించాలంటే ఎలా అని ప్రశ్నించారు. సిబ్బంది మాత్రం రాయల్టీ చెల్లించాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల లోడ్తో ఉన్న ట్రాక్టర్ను యజమానులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వృధా రాళ్లకు కూడా రాయల్టీ ఇవ్వాలనడం దారుణమని యజమానులు మండిపడ్డారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఆలూరు: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాలలో మత్తుపదార్థాలు, వ్యసనాలు వాటివల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల దేశంలో ఏటా 1.40 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. యవత డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నాయని వివరించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు ప్రజలు, యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎకై ్సజ్ సీఐ లలిత, ప్రిన్సిపాల్ రమాదేవి, సిబ్బంది శశికుమార్, పాండురంగ తదితరులు ఉన్నారు. -
నాలుగు గ్రామాల రోడ్డును మూసివేస్తే సహించం
పాములపాడు: జాతీయ రహదారి 340సి భానుముక్కల టర్నింగ్ వద్ద కర్నూలు వైపు నుంచి బస్సులు వచ్చే దారిని పీఎస్కే కంపెనీ వారు మూసి వేసేందుకు ప్రయత్నించగా భానుముక్కల, బానకచర్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. భానుముక్కల క్రాస్ రోడ్డు మీదుగా భానుముక్కల, బానకచర్ల, గుండాలనట్టు, వేంపెంట, కొత్త రామాపురంతో పాటు వెలుగోడు మీదుగా నంద్యాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటిది భానుముక్కల టర్నింగ్ వరకు బస్సులు రాకుండా రోడ్డును బంద్ చేసి కాస్త దూరంలో ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్లేలే మళ్లిస్తే సహించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. నాలుగు గ్రాముల ప్రజలు ఏకమై రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. పీఎస్కే కంపెనీ సీఈఓ ప్రసాద్యాదవ్, మేనేజర్ చంద్రమౌళి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెనుదిరిగారు. నిర్మించిన డివైడర్ను తొలగించారు. భానుముక్కల క్రాస్ వరకు రోడ్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాములపాడు వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రబీలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేం
● తుంగభద్ర ప్రాజెక్టు ఐఏసీ నిర్ణయంకర్నూలు సిటీ: రబీలో తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని తుంగభద్ర ప్రాజెక్టు నీటిపారుదల సలహా కమిటీ(ఐఏసీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఐఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర డ్యాం 19వ క్రస్టు గేటు 2024 ఆగస్టు నెలలో కొట్టుకుపోగా, దాని స్థానంలో స్టాప్లాక్ గేటు ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీల చేసిన సూచనల మేరకు డ్యాం 33 గేట్లు మార్చాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. రైతులకు అవగహన కల్పించి గేట్ల మార్పునకు సహకరించేటట్లు ఒప్పించాలని సూచించారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీటిని ఇంకా ఎన్ని రోజులు అందించవచ్చో సమావేశంలో చర్చించారు. అందుబాటులో ఉన్న నీటిని సాగులో ఉన్న ఆయకట్టుకు దామాషా ప్రకారం అందించేందుకు షెడ్యుల్ను ప్రకటించారు. జనవరి 10 వరకు ఖరీఫ్ పంటలకు నీరు తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. ప్రస్తుతం డ్యాంలో 75.96 టీఎంసీలకు నీటి నిల్వలు తగ్గాయి. దీంతో పాటు డ్యాం ఎగువ నుంచి ఇన్ఫ్లో నిలిచిపోయింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే వర్షాలు వచ్చేటట్లు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రబీకి నీరు ఇవ్వబోమని ఖరీఫ్ సీజన్కు ముందే బోర్డు ప్రకటించింది. మొన్నటిదాకా వర్షాలు కురుస్తుండడం డ్యాంలో నీటి నీటి నిల్వలు ఆశజనకంగా ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు అశలు పెంచుకున్నారు. డ్యాం గేట్ల మార్పు చేయాల్సి ఉండడం..ఇందుకు డ్యాంలో 1613 అడుగులకు నీటి నిల్వలు చేరితేనే కొత్త గేట్లకు అవకాశం ఉండడంతో రబీకి నీరు ఇవ్వలేమని ఐఏసీ తీర్మానం చేసింది. ఖరీఫ్లో కురిసిన వర్షాలతో కొంత మంది రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి పంటలు సాగు చేశారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల పరిధితో పాటు, టీబీ డ్యాల జలాలు అందించే కాల్వలకు నీటిని సాగుకు వచ్చే నెల 1 నుంచి జనవరి 10వ తేదీ వరకు నీటిని అందించాలని తీర్మానం చేశారు. తాగు నీటిని అవసరమైన సమయంలో వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు నీటిని అందించాలని నిర్ణయించారు. -
చట్టాలపై అవగాహన పెరగాలి
కర్నూలు(అర్బన్): ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కంటి వైద్యులు డాక్టర్ స్వాతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం, విద్యాబ్యాసం, దేశానికి చేసిన సేవలను వివరించారు. అలాగే విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, పేదరికం, నిరక్షరాస్యత, బాల కార్మిక సమస్య, అక్రమ రవాణా తదితర అంశాలపై ఆయన చట్టపరమైన అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి లోపం ఉన్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.విజయ, డీసీపీఓ టి.శారద, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, 3వ పట్టణ సీఐ శేషయ్య, వసతి గృహ సంక్షేమాధికారిణులు సులోచన, రజనీ, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికర్నూల(సెంట్రల్): టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థినులు ఏమి చేస్తున్నారో చూడాలని డీఈఓలను ఆదేశించారు. అంతేగాక బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులోని లక్ష్మణ్పేట, ఆదోనిలోని హనుమాన్నగర్, ఇందిరాగాంధీ నగర్ యూపీహెచ్సీల్లో హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. సరైన సమయంలో గుర్తించకపోతే వైద్య సేవలు అందక ప్రసూతి, శిశు మరణాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల వివరాలు రిజిస్టర్ చేయడంలో కోసిగి, పెద్దతుంబళం, నందవరం ప్రాథమిక కేంద్రాల పనితీరు బాగుందని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్రావు, డీసీహెచ్ఎస్ జఫ్రూల్లా, జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
కోసిగి: విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోసిగి మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం దుద్ది గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేయగా.. హాజరు పట్టిక ఉద్యోగుల సంతకాలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ ఎస్. మహబూబ్ బాషాను ఆదేశించారు. సాతనూరు గ్రామంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇక్బాల్ బాషా కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యానికి చెందిన ఎస్. ఇక్బాల్ బాషాను నియమించారు. అలాగే కళాకారుల విభాగం ఆలూరు, కర్నూలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా వడ్ల మల్లికార్జున ఆచారి, కన్నా ప్రదీప్ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాజువాలిటీలో ఆకస్మిక తనిఖీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఎఫ్ఆర్ఎస్, సమయపాలన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఆర్ఎంఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తనిఖీల్లో నిర్లక్ష్యం బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్యాజువాలిటిలో సీఎంఓలు, డ్యూటీ డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫయాజ్ ఉన్నారు. గోనెగండ్లలో డెంగీ కేసు గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల ఎస్సీ కాలనీలో 34 ఏళ్ల వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోడంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా డెంగీ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీంతో జిల్లా మలేరియా సబ్యూనిట్ అధికారి విజయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణుడు గోనెగండ్ల వైద్య సిబ్బంది శుక్రవారం డెంగీ సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. 21 నుంచే సాగునీరు విడుదల చేయాలి గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో సాగుచేసుకుంటున్న గోనెగండ్ల, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల ఆయకట్ట భూములకు ఈనెల 21 నుంచే సాగునీరు విడుదల చేయాలని జీడీపీ ఆయకట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుడు, సంఘం సభ్యులతో కలిసి ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కుడి కాలువ కింద 11 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 2వేల ఎకరాలు సాగు కావచ్చునని తెలిపారు. పంట కాలం పూర్తయ్యే వరకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. -
తేలు కాటుకు విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని దైవందిన్నె గ్రామంలో పొలంలో తేలు కాటుకు గురై కురవ సరస్వతి(13) అనే విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన కురవ శేఖర్, కురవ శకుంతలమ్మ కుమార్తె కె. సరస్వతి స్థానిక హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. బుధవారం తల్లిదండ్రులతో పాటు సాయంత్రం పత్తి పొలంలో పనిచేస్తుండగా తేలు కాటుకు గురైంది. ఇంటికి వచ్చాక గ్రామంలో నాటు వైద్యం చేయించటంతో నొప్పి తగ్గి రాత్రి మరలా ఎక్కువ కావటంతో గురువారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో కోలుకోలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. గుండెపోటుతో జీవితఖైదీ మృతి కోవెలకుంట్ల: భీమునిపాడుకు చెందిన మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ఆరికట్ల సుంకిరెడ్డి(73) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకేసులో 2022వ సంవత్సరంలో జీవితఖైదీ పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ఽధ్రువీకరించారు. ఈ మేరకు మృతదేహాన్ని రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భార్య కాపురానికి రాలేదని భర్త అదృశ్యం కర్నూలు: భార్య దీణరాణి కాపురానికి రాకుండా ఉందని మనస్తాపానికి గురైన భర్త సుంకన్న అలియాస్ రాజు (39) అదృశ్యమయ్యాడు. ఈయన కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శిరివెళ్ల మండలం మాదేపురం గ్రామానికి చెందిన దీణరాణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. చిన్న గొడవ కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి సంసారానికి రాకపోవడంతో పోలీస్స్టేషన్లో పంచాయితీ జరిగింది. అయినా ఆమె కాపురానికి రాకపోవడంతో సుంకన్న మనస్తాపానికి గురై ఈనెల 1వ తేదీన పిల్లలను చూడటానికి భార్య దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి సాగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 95029 81868 లేదా 7989690812 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తండ్రి సాగర్ కోరారు. ముచ్చట్లలో వ్యక్తి మృతి బేతంచెర్ల: ముచ్చట్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల మేరకు.. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మనోహర్(45) కొంత కాలంగా నాపరాయి ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు ముచ్చట్ల క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న మనోహర్ ఆలయ కోనేరులో స్నానం చేస్తుండటంతో ఆయాసం వచ్చింది. భయంతో ఒడ్డుకు వచ్చి మెట్లపైనే కుప్పకూలి పోయి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో భక్తుడు గమనించి ఆలయ పూజారికి తెలపడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగలక్ష్మితోపాటు కుమారులు మణికంఠ, మురళీ ఉన్నారు. ఆస్పరి: చిరుత పులి దాడిలో ఆవు దూడ మృతి చెందడంతో తొగలగల్లు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. గ్రామ సమీపంలోని కొండ పక్కన అహోబిలం అనే రైతు బోరు కింద పంటలను సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజులాగే బుధవారం సాయంత్రం పశువులను ఆరుబయట కట్టేశాడు. రాత్రి సమయంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున రైతు చూస్తే ఆవు దూడ కన్పించకపోవడంతో వెతకగా కొద్ది దూరంలో ఆవు దూడ కళేబరం కన్పించింది. ఆవు దూడపై చిరుతే దాడి చేసిందని రైతు తెలిపారు. రెండు సంవత్సరాలు నుంచి చిరుత పులి ఇక్కడే కొండల్లో సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని అహోబిలం అనే రైతుకు పరిహారం ఇవ్వాలని తొగలుగల్లు గ్రామస్తులు కోరుతున్నారు. -
జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో 50 శాతం డయాబెటీస్ రోగులే ఉన్నారు. షుగర్ రోగులు వారి మూత్రంలో యూరిన్ ప్రొటీన్ ఎక్కువగా వెళ్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రంలో నురగ, కాళ్లవాపులు, రాత్రిపూట మూత్రంకు ఎక్కువసార్లు వెళ్లడం దీని లక్షణాలు. షుగర్ వచ్చి ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరిన్ ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష చేయించుకోవాలి. క్రియాటినిన్ 1.2 దాటితే కిడ్నీ జబ్బు ప్రారంభమైందని గుర్తించాలి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. – డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కోడుమూరు రూరల్: హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గురువారం కోడుమూరు పోలీసులు పట్టుకున్నారు. ‘బరి తెగించిన ఇసుకాసురులు’ అన్న శీర్షిక ఈనెల 12వతేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు పోలీసులు ఈ మేరకు స్పందించారు. వర్కూరుకు చెందిన రెండు ట్రాక్టర్లు, కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు పారిపోగా, మరో ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యాజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): ఏపీజీఎల్ఐలో 2024 ఏప్రిల్ నుంచి అమలులోని ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కర్నూలులోని ఏపీజీఎల్ఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్, నిధి పోర్టల్ అమలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగంలో చేరిన వారు దరఖాస్తు చేసుకుంటేనే బీమా అమలయ్యేదని, బీమా బాండు పొందడం కూడా కష్టతరమయ్యేదన్నారు. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏపీజీఎల్ఐ తప్పనిసరి చేశారన్నారు. ప్రతి నెలా రూ.800 నుంచి రూ.3వేల వరకు ప్రీమియం ఉంటుందన్నారు. బీమా బాండు కూడా సంబంధిత డీడీఓనే ఆన్లైన్లో జనరేట్ చేస్తారన్నారు. నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్ఐ నుంచి లోన్ పొందడం సులువైందన్నారు. కార్యక్రమంలో ఏడీలు రంజిత్కుమార్ నాయుడు, గౌరిప్రసన్న, పర్యవేక్షకులు శివనాగకుమార్, రామకృష్ణారెడ్డి, కళ్యాణి తదితరులు పా ల్గొన్నారు. ఇదిలాఉంటే డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్తో ఏపీన్జీజీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ ఆధ్వర్యంలో పలువురు సంఘం నాయకు లు సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
వ్యాయామం తప్పనిసరి
మధుమేహం అనేది కేవలం చక్కెర స్థాయిల సమస్య మాత్రమే కాదు. శరీరంలో వాత దోషం అసమతుల్యతతో వస్తుంది. దీని నివారణకు ఆహారంలో మార్పులు, వ్యాయామం, మూలికల వాడకం వంటి సమగ్ర విధానాన్ని సూచిస్తాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, మెంతులు, దాల్చిన చెక్క, పసుపు వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద చికిత్సలో ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఆహార మార్పులు, వ్యాయామం, మూలికల కలయికను సూచిస్తాం. –డాక్టర్ వెంకటనాగరాజ పాల, ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యకర్నూలు(సెంట్రల్): ఉల్లి, టమాటా, పత్తి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తిని కూడా క్వింటాల్ రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన జిల్లా సమితి సమావేశంలో గురువా రం ఆయన మాట్లాడారు. అధికారంలో లేని సమయంలో మాత్రమే గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడి కాలువల ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోరని విమర్శించారు. కులగణన జరిగిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన తరువాత తొలిసారి కర్నూలు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. సీపీఐ నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, జగన్నాథం, మునెప్ప, లెనిన్బాబు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీలో విద్యార్థి గల్లంతు
పాములపాడు: మద్దూరు పంచాయతీ కృష్ణానగర్ గ్రామ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో వీరేష్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన మొగిళీశ్వరప్ప, మల్లిక దంపతుల కుమారుడు వీరేష్ (17) పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులు పొలంలో మొక్కజొన్న కోత కోపిస్తున్నారు. కాగా అప్పటికే కోత కోసి ఎస్సార్బీసీ కాల్వ గట్టుపై మొక్కజొన్నలు ఆరబోయగా అక్కడికి వీరేష్ వెళ్లాడు. అయితే నీటి కోసం కాల్వలో దిగిన వీరేష్ కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కాల్వ గట్టుపై జీవాలు మేపుతున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశా డు. చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకునేలోపే యువకుడు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ బాబు పుట్టీల సాయంతో మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రతిభను ప్రోత్సహించేలా..!
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈఈఎంటీ పరీక్ష ● రిజిస్ట్రేషన్కు ఈనెల 14న తుది గడువు ● విజేతలకు నగదు బహుమతులు నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపీఫనీ అనే సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ టెస్టు (ఈఈఎంటీ) నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలలోని 7, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనుంది. ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి పరీక్షకు హాజరు కావచ్చు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్/ల్యాప్టాప్/ట్యాబ్/ కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్షకు డిసెంబరు 20న టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్టీటీపీఎస్–ఎడ్యుకేషనల్ ఎపిఫనీ.ఓఆర్జీ–ఈఈ ఎంటీ2026/రిజిస్ట్రేషన్, పీహెచ్పీ లింక్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాసు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈఈఎంటీ పరీక్ష అని, అధిక శాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుకు ఎటువంటి రుసుం లేదన్నారు. బహుమతులు ఇలా.. ఈ పోటీ పరీక్షల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.8వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు,రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. -
కొలనుభారతి పూజార్లపై చర్యలు తీసువాలి
● కాకనూరు శారద పీఠం పీఠాథిపతి కొత్తపల్లి: అమ్మవారి పూజల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొలనుభారతి ఆలయ పూజార్లపై చర్యలు తీసుకోవాలని కాకనూరు శారధ పీఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి అధికారులను కోరారు. గురువారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉదయం 8 గంటల లోపు అన్ని పూజలు పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమివ్వాల్సిన అమ్మవారికి పురోహితులు 9.20 గంటలైనా పూజలు చేయకపోవడంతో ఆయన మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆల య పురోహితుల ప్రవర్తనలో మార్పురాకపోతే దేవ దాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నా రు. ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానానికి అనుసంధానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, ఛారుఘోషిణి నది విస్తరణ, డార్మెంటరీ, ప్రత్యేక క్యూలైన్లు నిర్మాణానికి శ్రీశైల దేవస్థానం కృషి చేయాలని కోరారు. -
ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
షుగర్ రోగుల్లో ఎముకల ఆరోగ్యం తగ్గిపోతోంది. తక్కువ ఎత్తు నుంచి కింద పడినా కొందరి ఎముకలు విరుగుతున్నాయి. కొందరు నిద్ర నుంచి లేచిన వెంటనే కళ్లు తిరిగి కింద పడతారు. షుగర్ రోగుల్లో న్యూరోపతి వచ్చి నడిచేటప్పుడు అదుపు తప్పి కిందపడే అవకాశం ఉంది. మహిళలు పయోగ్లిటజోన్ అనే మందు వాడటం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు జీజీహెచ్లో డెక్సా స్కాన్ చేసి, ఎముకల సాంధ్రత తక్కువగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, దేవస్థాన ఈఓ శేషవస్త్రాలు బహుకరించి సత్కరించారు. పీఠాధిపతి అధికారులకు, అర్చకులకు, వేదపండితులకు అనుగ్రహభాషణం చేశారు. -
శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్రవారం శ్రీశైల దేవస్థానం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి దీపోత్సవం ఏర్పాట్లను గురువారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కైలాస పర్వతం సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఉత్సవంలో పాల్గొనే భక్తులకు అవసరమైన పూజాద్రవ్యాలన్నింటిని దేవస్థానమే సమకూర్చనుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. పరమేశ్వరునికి దివ్యజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాల్సిసినదిగా దేవస్థాన అధికారులు కోరుతున్నారు. -
కౌతాళం ఎంపీడీఓకు డీఎల్డీఓగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని కౌతాళం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న పి.రాజేంద్రప్రసాద్కు డీఎల్డీఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతి పొందిన ఆయనను గుంటూరు డ్వామా ఏపీఓ ( ఎంఅండ్ఈ )గా నియమించారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రద్దు కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని మీడియా సెంటర్లో ఖాళీగా ఉన్న స్టెనో, టైపిస్టు కమ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. పంటల నమోదుపై నేటి నుంచి సామాజిక తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబందించి పంటల నమోదు వివరాలను ఈ నెల 14 నుంచి సోషల్ ఆడిట్కు పెట్టనున్నారు. అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేసేందుకు నేటి నుంచి 17వ తేదీ వరకు జాబితాలను ఆర్ఎస్కేల్లో పెట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అయితే ప్రింట్ తీసేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆర్బీకే ఇన్చార్జీలకు ఖర్చు తడసి మోపెడుకానుంది. భూమి విస్తీర్ణం, పంటల వివరాలు, విత్తనం రకాలు తదితర వివరాలను పరిశీలించుకొని తేడాలు ఉంటే సరిచేసుకోవాలనేది లక్ష్యం. పంటల నమోదు వివరాలు సరిగ్గా ఉంటే భవిష్యత్లో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించవచ్చు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంటల నమోదు వివరాలు ప్రింటు తీసి సోషల్ ఆడిట్కు పెడుతారా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఎస్ఏ–1 పరీక్ష వాయిదా కర్నూలు సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం)జరగాల్సిన ఎస్ఏ–1 పరీక్షను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షను 1వ తరగతి నుంచి 5తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రాలను సురక్షితంగా భద్ర పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోను తెరవకూడదని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 లోపు ‘పది’ పరీక్షల ఫీజు చెల్లించాలి కర్నూలు సిటీ: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఫీజు చెల్లించాలని, రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో వచ్చే నెల 10వ తేదీ, రూ.500 రుసుంతో డిసెంబరు 15వ తేదీలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో సాధారణ సెలవులు ఏవైనా ఉన్నట్లు అయితే ఆ మరుసటి రోజు కూడా చెల్లించవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలకు www.bseap.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలన్నారు. అనాథ శిశువుల కోసం ఊయల కర్నూలు(అర్బన్): అనాథ శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పీ విజయ తెలిపారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఊయలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా తమ వ్యక్తిగత సమస్యలతో శిశువులను ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో పారవేయకుండా సురక్షితమైన ప్రదేశాల్లో వదలాలన్నారు. ఎక్కడపడితే అక్కడ శిశువులను వదిలి వేయడం వల్ల శిశువులు ప్రమాదాలకు గురై పలు సందర్భాల్లో మృతి చెందే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామన్నారు. బాలల పరిరక్షణ అధికారిణి టీ శారద, రైల్వే సీనియర్ డీఎంఓ జీ విజయకుమార్, ఏఎస్ఐ కే ప్రకాష్, ఎస్ఏఏ మేనేజర్ మోహతాజ్ బేగం, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
రోజుకో పుంజు చొప్పున ఏసీబీకి పట్టిస్తా!
● వీఆర్వోలందరూ అవినీతిపరులే.. ● మండల మీట్లో టీడీపీ సర్పంచ్ హల్చల్ ● అవాకై ్కన అధికారులు డోన్: మండల సర్వసభ్య సమావేశంలో టీడీపీ మద్దతుదారుడైన గుమ్మకొండ సర్పంచ్ తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. సభలో సంబంధం లేని అంశాలపై మాట్లాడమే కాకుండా.. వీఆర్వోలపై నోరు పారేసుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరుగుతుండగా గుమ్మకొండ సర్పంచ్ దశరథరామిరెడ్డి వీఆర్ఓలపై రెచ్చిపోయారు. ‘మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓలందరూ అక్షరం ముక్క రాని వారు. అందరూ అవినీతిపరులు. ఇలాంటి వారి పట్ల రైతులకు ఏమి మేలు జరుగుతుంది. నేను అనుకుంటే రోజుకో పుంజు చొప్పున అన్నట్లు ఏసీబీకి అధికారులను పట్టిస్తా’ అంటూ సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ డీటీ నారాయణమ్మ తప్పుబడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతిపరులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అందరూ అవినీతిపరులని సంబోధించడం సబబు కాదన్నారు. వీఆర్వోలపై నోరు పారేసుకున్న సర్పంచ్.. ప్యాకెట్ పాల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని, విక్రయాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే తమకు సంబంధం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా ఆయన ఉపన్యాసం ఆపలేదు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అనధికారికంగా పీఆర్ఓలను ఏర్పాటు చేసి గర్భిణులను భయబ్రాంతులకు గురిచేసి సిజేరియన్ల కోసం తమ ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తా మని ఎంపీపీ హామీ ఇచ్చారు. కాగా సర్యసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి కుటుంబీకులు హాజరైనా అధికారులు పట్టించుకోకపోవడంపై ఎంపీడీఓను కొందరు సభ్యులు ప్రశ్నించారు. -
ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు
కర్నూలు: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాబు ప్రసాద్ నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి బస్టాండ్ ఆవరణలో నెలల తరబడి పార్కు చేసి ఉన్న బైకులు, కార్లు, పార్సిల్, రవాణా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో కలసి ఆర్టీసీ బస్టాండ్లోని అనుమానితులు, ప్రయాణికుల బ్యాగులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీ చేశారు. అనుమానితుల వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే 112 లేదా 100 నంబర్లకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. సీఐలు నాగరాజరావు, మన్సూరుదీన్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘బహుళ’ తప్పిదం
కర్నూలు(అగ్రికల్చర్): సామూహికంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. గొర్రెలు, చేపల పెంపకం చేపట్టాలన్నా సహకార వ్యవస్థ దోహద పడుతుంది. మార్క్ఫెడ్, నాఫెడ్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు సైతం ఈ వ్యవస్థ కిందనే ఏర్పాటయ్యాయి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత సహకార వ్యవస్థ తిరోగమనం అయ్యింది. ప్రగతికి సహాయ నిరాకరణ జరుగుతోంది. సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా 18 నెలల కాలంలో చేయలేదు. ఇదీ దుస్థితి.. ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇందులో 2014–15 నుంచి 2018–19 వరకు 85 సంఘాల వరకు నష్టాల్లో కూరుకపోయాయి. నాటి ఐదేళ్ల కాలంలో సహకార సంఘాల అభివృద్దికి చేసింది సున్నానే. ఆ ఐదేళ్లు సహకార రంగానికి చీకటి రోజులే. అలాంటి పరిస్థితులే మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నేడు డీలా పడింది. చేనేత సహకార సంఘాలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా అత్యధిక సంఘాలు నష్టాల్లో కూరుకపోయాయి. ఇందులో 70 సంఘాలు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. వీటిని లాభాల బాట పట్టించేందుకు ఎలాంటి చర్యలు లేవు. వీటికి అనుబంధంగా గత ప్రభుత్వం మల్టీపర్పస్ గోదాములు నిర్మిస్తే చంద్రబాబు సర్కార్ వీటిని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా 2024–25లో రూ.50 కోట్లు లోనింగ్ జరగలేదు. సంఘాలకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. నష్టాలే మిగిలాయి! ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. కల్లూరు సహకార సంఘానికి రూ.1,57,98,842, గూడూరు సహకార సంఘానికి రూ.1,52,41,998, పసుపుల సహకార సంఘానికి రూ.70,72,847 నష్టాలు ఉన్నాయి. సహకార సంఘాలకు ఉన్న నష్టాలను అధిగమించేందుకు చంద్రబాబు సర్కార్ నుంచి ప్రోత్సాహం లేకుండాపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేటి నుంచి వారోత్సవాలు... 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఆత్మనిర్బర్ భారత్కు సాధకాల సహకారం అనేది ఈ ఏడాది థీమ్. జాతీయ స్థాయిలో సహకార వ్యవస్ధ పటిష్టతకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం నిరాదరణ చుట్టుముట్టింది. వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగే కార్యక్రమంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సహకార వారోత్సవాలను నిర్వహించేందుకు జిల్లా సహకార శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ప్రగతి అంటూ ఏదీ లేకుండా పోయింది. దీంతో 72వ సహకార వారోత్సవాల్లో సహకార ప్రగతి చాటి చెప్పడానికి అధికారులకు అవకాశమే లేకుండా పోయింది. వారోత్సవాలను తూతూమంత్రంగా నిర్వహించనున్నట్లు సమాచారం. పోస్టర్ల ఆవిష్కరణ అఖిలభారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సహకార అధికారి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం సహకార వారోత్సవాలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రారంభించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2019లో వైఎసార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సహకార సంఘాల దశ తిరిగింది. వీటిని బహుళ సేవా కేంద్రాలుగా మార్పు చేసేందుకు తీసుకున్న చర్యలు తీసుకున్నారు. సహకార సంఘాల్లో 2023లోనే కంప్యూటరీకరణ చేసి మినీ బ్యాంకులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా అనేక సంఘాలు ఆస్తులు పెంచుకున్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా రూ.400 కోట్ల వరకు లోనింగ్ జరిగేది. సహకార వ్యవస్థను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ 18 నెలల్లో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు నేటి నుంచి సహకార వారోత్సవాలు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక అధికారుల తికమక! -
టెండర్ ‘క్లాస్’గా కట్టబెట్టేందుకు..!
శ్రీశైలంటెంపుల్: ‘వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి’.. అన్న చందంగా మారింది దేవస్థాన ఇంజినీర్ల వ్యవహారశైలి. అర్హత లేని కాంట్రాక్టర్కు పనులు దక్కేలా తమ పనితనం చూపారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నూతనంగా పాతాళగంగలో తెప్పోత్సవం నిర్వహించాలని దేవస్థాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 18వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ సరఫరా, ట్రాన్స్పోర్టు, ఫిక్సింగ్ చేసేందుకు రూ.21.81 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ పిలిచారు. అక్టోబరు 30న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సాధారణంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 14 రోజుల కాలవ్యవధి ఇస్తారు. కానీ ఈ పనికి మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే కాలవ్యవధి ఇచ్చారు. కాంట్రాక్టర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకు లేక ఏకంగా తమ వారి కోసం నిబంధనలను సైతం మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాము అనుకున్న కాంట్రాక్టర్కే పని దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తూ పప్పులో కాలేశారు. పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు నిబంధనల మేరకు క్లాస్–4, అపైన ఉండే కాంట్రాక్టర్లు అర్హులు అవుతారు. కానీ మన ఇంజినీర్లు టెండర్ షెడ్యూల్లో క్లాస్–5, అపైన వారు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చారు. క్లాస్–5 కాంట్రాక్టర్ రూ.10 లక్షల లోపు పనులు మాత్రమే చేసేందుకు అర్హులు. కానీ ఇక్కడ పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు క్లాస్–4, అపై కాంట్రాక్టర్ అర్హులు. కానీ మన ఇంజినీర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టర్కు పని దక్కేలా క్లాస్–5 టెండర్లో పొందుపరిచారు. ఈ టెండర్కు ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖాలు చేశారు. నేడో, రేపో టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే దేవస్థాన ఇంజినీర్లపై చర్యలు తీసుకుని, మల్లన్న ఆదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ విషయంపై శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం టెండర్లో క్లాస్–5, ఆపైన ఏదేని సివిల్ రిజిస్ట్రేషన్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు. శ్రీశైల ఇంజినీర్ల ఇష్టారాజ్యం ఓ కాంట్రాక్టర్కు హంస వాహనం టెండర్ వరించేలా నిబంధనలు మార్పు క్లాస్–4 వర్క్ను క్లాస్–5గా మార్పులు చేసిన వైనం -
స్నాతకోత్సవ సంబరం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి పాల్గొన్నారు. ఎ.ఎం.గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను గవర్నర్ ప్రదానం చేశారు. పీజీ, ఇంజినీరింగ్ విద్యలో ప్రతిభ కనబరిచి టాపర్స్గా నిలిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. గవర్నర్ కాన్వొకేషన్ సందేశాన్నిచ్చారు. అనంతరం గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు విద్యుత్ రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. స్టార్టప్స్ రంగంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులు అంతా చోదక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు వర్సిటీ ౖవైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వర్సిటీ ప్రగతి నివేదికను వివరించారు. వర్సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోర్సులు, జరుగుతున్న పరిశోధనలను తెలియజేశారు. విద్యార్థులచేత ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి, వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రామకుమార్ 55 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వర్సిటీ రెక్టార్ ప్రొఫెస్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బీవీ జయకుమార్నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు, వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్ సుందరానంద్, ప్రొఫెసర్ భరత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, వర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సునిత, డాక్టర్ శైలజ, ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లోకనాథ, తదితరులు పాల్గొన్నారు. అందరూ గర్వపడేలా యువత ఎదగాలి.. చాన్స్లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ, సమాజానికి రుణం తీర్చుకోడం అందరి ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా యువత ఎదగాలన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులంతా ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. వర్సిటీ నాణ్యమైన బోధన, పరిశోధనల ద్వారా విద్యార్థుల భవితకు బాటలు వేయడం సంతోషకరమన్నారు. డిగ్రీలు సంపాదించుకున్న విద్యార్థులు జ్ఞానంతో సార్థకమైన జీవితాన్ని గడపాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నప్పుడు భవితకు డోకా ఉండదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి దేశాన్ని ప్రగతి పథంలో నిలపాలన్న దేశ ప్రధాని మోదీ ఆశయాలకు నూతన విద్యా విధానం తోడ్పాటు అందిస్తుందన్నారు. -
పది ఇసుక ట్రాకర్ల పట్టివేత
కౌతాళం: ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను బుధవారం ఏరిగేరి గ్రామం వద్ద పట్టుకున్నట్లు తహసీల్దారు రజనీకాంత్రెడ్డి తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉండటంతో మూడు రీచ్లను తాత్కలికంగా బంద్ చేయించామన్నారు. కొంత మంది ఎలాంటి రశీదులు లేకుండా అనుమతులు తీసుకోకుండా కుంబళనూరు వద్ద ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక ఉచితంగా ఉన్న కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడానికి అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లకు మైనింగ్ అధికారుల సూచనల మేరకు జరిమానా విధిస్తామన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడతా..
మాది నందికొట్కూరు. ఆర్యూసీఈలో సీఎస్ఈ బ్రాంచ్తో బీటెక్ పూర్తి చేశాను. బ్యాచ్లో టాపర్గా, కోర్సులో టాపర్గా నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉంది. పాఠాలు బోధించిన అధ్యాపకులు, ఫ్రెండ్స్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడాలన్నది నా లక్ష్యం. – ఖాజ మొయినుద్దీన్, బీటెక్ విద్యార్థి మాది అవుకు మండలం చెర్లోపల్లె. నాన్న దాసరి పెద్దరాజు, అమ్మ రాజ్యలక్ష్మి వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె అయిన నేను చదువు లో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. పీహెచ్డీ రీసెర్చ్ చేయడమే నా లక్ష్యం. – శిరీష, ఎమ్మెస్సీ బాటనీ మాది వెల్దుర్తి. నా తల్లిదండ్రులు హసీనా, ఫరీద్బాబా. నేను ఆర్యూలో 2020–22లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆర్యూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – షేక్ ఇర్ఫాన్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ -
జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కరించేందు కు చర్యలు తీసుకోవాలని జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులతో జాతీయ లోక్ అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీకాదిగన కేసులు, ఎకై ్సజ్, మెటార్ యాక్సిడెంట్, చెక్బౌన్స్, భూసేకరణ, సివిల్ కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రీలోక్ అదాలత్లను పెట్టి త్వరతిగతిన ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి కమాదేవి, అరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ఫోక్సోకోర్టు జడ్జి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు శ్రీవిద్య, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సీనియర్ సివిల్ జడ్జీలు మల్లేశ్వరి, దివాకర్, జూనియర్ సివిల్ జడ్జీలు సరోజమ్మ, అపర్ణ, అనిల్కుమార్, అనూష పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య ఆళ్లగడ్డ: పట్టణంలోని ఎస్వీ నగర్లో ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన యోహాను కూతురు సీతమ్మ (31)కు చందలూరు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఈ మధ్యకాలంలో సీతమ్మ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో ఎస్వీనగర్లో ఉన్న తండ్రికి వద్దకు చేరింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ శివయ్య (50) మృతి చెందాడు. పట్టణంలోని ఎస్వీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ శివయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక పట్టణ శివారులోని టిడ్కో గృహాల్లో ప్రయాణికుడిని దించి తిరిగి వచ్చేక్రమంలో జాతీయ రహదారిపైకి వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివయ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): జీవన ఎరువులు (బయో పర్టిలైజర్స్), సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే కంపెనీల్లో బుధవారం వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా వ్యవసాయ అధికారి జీవన ఎరువులు, సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే సంస్థల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఇందు లో భాగంగా కర్నూలు క్రిష్ణానగర్లోని పుష్పా ంజలి అగ్రీటెక్, చౌరస్తాలోని ఎస్ఎస్ఎల్వీ టెక్నాలజీస్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్రెడ్డి, డీఏవో కార్యాలయం సాంకేతిక ఏవో రాఘవేంద్ర టీమ్ గా వెళ్లి తనిఖీలు చేపట్టారు. వీటిల్లో తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించారు. అనుమతుల పత్రాలు, రికార్డులు, ల్యాబ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్పాంజలి అగ్రిటెక్లో మూడు శ్యాంపుల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. అన్ని రకాల అనుమతులతో జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. -
కష్టానికి ఫలితం
మాది అనంతపురం జిల్లా బత్తలపల్లి. అమ్మలేరు, నాన్న ఉపాధ్యాయుడు. ఆర్యూసీఈలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ పూర్తి చేశాను. బ్రాంచ్లో టాపర్గా నిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను చదువుకున్న కోర్సులో టాపర్గా నిలవడంతో కష్టానికి ఫలితం లభించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రాణించాలని ఉంది. – యశ్విత, బీటెక్ విద్యార్థి మాది ఎమ్మిగనూరు. తల్లిదండ్రులు క్లాత్ బిజినెస్ చేస్తున్నారు. నేను ఎమ్మెస్సీ కంప్యూటర్స్లో పీజీ పూర్తి చేశాను. కోర్సులో డిపార్ట్ మెంట్లో టాపర్గా నిలిచాను. నాల్గవ స్నాతకోత్సవంలో గవర్నర్గా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉంది. కంప్యూటర్స్ రంగంలో ప్రొఫెషనల్గా స్ధిరపడాలని ఉంది. ఎంచుకున్న కోర్సులో ఇష్టంతో చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. – ప్రభావతి, ఎమ్ఎస్సీ కంప్యూటర్స్● -
స్నేహితుడే చంపేశాడు
బేతంచెర్ల: ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరకు హత్యకు దారితీశాయి. ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఆర్ఎస్ రంగాపురంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా(41) అదే గ్రామానికి చెందిన బోయ మదనభూపాల్ స్నేహితులు. వీరు మూడేళ్ల క్రితం గుజిరిషాపు నిర్వహించే వారు. కాగా మద్యం అక్రమ అమ్మకాల కేసులో మహబూబ్ బాషా జైలుకెళ్లాడు. ఆ సమయంలో తన భార్యకు మదనభూపాల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని మహబూబ్ బాషా అనుమానిస్తూ వచ్చాడు. అలాగే గుజిరీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మదన భూపాల్తో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో మహబూబ్ బాషా గొడవ పడగా, స్థానికులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో మధనభూపాల్ బుధవారం తెల్లవారుజామున మహబూబ్ బాషా ఇంటికెళ్లి నిద్రిస్తున్న అతన్ని బళ్లెంతో పొడిచి, రోకలి బండతో తలపై మోది చంపేశాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హతుడి కుమార్తె ఆసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. వ్యక్తి దారుణ హత్య -
రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వర్షసూచన లేదని వ్యవసాయ వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త జి.నారాయణ స్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఇందువల్ల ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18.5 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 74–80 శాతం వరకు ఉండటం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు. గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని మంగళవారం తెల్లవారుజామున హంద్రీనదికి విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ముందు జాగ్రత్తగా నాలుగో క్రస్ట్ గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని హంద్రీనదిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ఎల్లెల్సీ నుంచి 50 క్యూసెక్కుల నీరు జీడీపీలోకి వస్తోందన్నారు. 270 టన్నుల సమీకృత దాణా కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ పాడిపశువుల కోసం సమీకృత దాణా సరఫరా చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. జిల్లాకు 270 టన్నుల దాణాను కేటాయించారని, రైతులకు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 కిలోల బస్తా పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో రూ.555 సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాల ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. కర్నూలు డివిజన్ డీడీగా వసంతలక్ష్మి కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా డాక్టర్ పి.వసంతలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నంద్యాల జిల్లా బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఈమెకు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈమెను ఖాళీగా ఉన్న కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● వెలుగోడు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఏ.వెంకటేశ్వర్లు పదోన్నతిపై కడప డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. -
జిల్లాలో హై అలర్ట్
కర్నూలు: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా అంతటా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఓర్వకల్లు ఎయిర్పోర్టు, దేవాలయాలు, మసీదులు, జాతీయ రహదారులు, టోల్ గేట్లు, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని లాడ్జీలు, వ్యాపార సముదాయాలతో పాటు వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. అనుమానితుల కదలికలు, లగేజీపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
ఏకగ్రీవంగా సహకార ఎన్నికలు
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి జిల్లా శాఖ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. కర్నూలు కృష్ణానగర్లోని సహకార శాఖ డివిజనల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కె.శ్రీనివాసులు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.నాగరమణయ్య ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎం.రామరాజు, సెక్రటరీగా పత్తికొండ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.లక్ష్మీకాంత రెడ్డి, జాయింట్ సెక్రటరీగా షేక్ మున్వర్ బాషా, జాయింట్ సెక్రటరీ (ఉమన్) పి. తిరుమల, కోశాధికారిగా శ్రీ నివాస్, క్యాడర్ సెక్రట రీగా పుష్పలత, ఖలీలుల్లా షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను సహకార శాఖ ఉద్యోగులు అభినందించారు. తమపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీకాంత రెడ్డి జిల్లా సెక్రటరీ నాగరమణయ్య జిల్లా అధ్యక్షుడు -
అలుపెరుగని పోరు
చంద్రబాబు సర్కార్ 17 నెలల వ్యవధిలో ప్రజలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేపడుతోంది. పొగాకు, మిర్చి, టమాట, ఉల్లి రైతులకు మద్దతుగా అనేక పోరాటాలు చేసింది. ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా లు, మీడియా సమావేశాలు నిర్వహించి ఒత్తిడి తీసుకొస్తోంది. అన్నదాత పోరు, యువత పోరు, విద్యుత్చార్జీల పెంపుపై భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజలకు మ ద్దతుగా నిలిచింది. ప్రజా స్పందన చూసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలపై పోలీసు శాఖ అడ్డుకునే ప్రయ త్నం చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుని ఇంటికి 30 పోలీ సు యాక్ట్ ఉందంటూ నోటీసులు అంటించడం చూస్తే ఏస్థాయిలో అవాంతరాలు సృష్టిస్తున్నారో తెలుస్తోంది -
నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు(బుధవారం) కర్నూలుతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసనలు, ర్యాలీలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాల నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆర్ఎస్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయంలోని అర్బన్ తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీలో ప్రజలతో పాటు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరై విజయవంతం చేయాలి. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
టీబీ డ్యాం నీటిపై 14న ఐఏబీ సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ ఇతర కాలువలకు నీటి విడుదల, నిలిపివేత తదితర అంశాలపై ఈనెల 14న బెంగళూరు విధానసౌధలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 125వ నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. గతేడాది డ్యాం 19వ క్రస్టుగేటు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఏర్పాటు చేసిన స్టాప్లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతోపాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి బిగించేందుకు పనులు ప్రారంభించనున్నారు. అందులోభాగంగా ఒక పంటకు(ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఏపీలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంతోపాటు ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్నారు. టీబీ డ్యాం -
వంద శాతం ఫలితాలు సాధించకుంటే నో రెన్యూవల్
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా ల్లో తమతమ సబ్జెక్ట్ల్లో వంద శాతం ఫలితాలు సాధించకపోతే వచ్చే ఏడాదికి రెన్యూవల్ ఉండదని కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని కేజీబీవీ స్కూళ్ల డైరెక్టర్ దేవానందరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని 26 కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో వర్చువల్ స్టూడియోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా జూలై 15 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు విజయపథం కార్యక్రమాన్ని ప్రారంభించామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందని ఆయన తెలిపారు. సమావేశంలో డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు. డైరెక్టర్ దృష్టికి సమస్యలు.. నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేయమంటే గొడవలకు దిగుతున్నారని, స్థానికంగా ఉండేవారు కావడంతో వారి కుటుంబ సభ్యులు వచ్చి తాము ఫలానా పార్టీ నాయ కులమంటూ పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారని పలువురు ప్రిన్సిపాళ్లు డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● కొన్ని కేజీబీవీల్లో రాత్రిళ్లు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఇన్వర్టర్లు మంజూరు చేయాలని కో రారు. ● నాడు–నేడు పనులు నిలిచిపోవడంతో తరగతి గదులు చాలక, డ్రైనేజీ సిస్టం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ●ఇంటర్ పిల్లలకు ల్యాబ్లు నిర్మిస్తున్నా పూర్తి కాలేదని, పరికరాలు పూర్తిగా అందజేయలేదని డైరెక్టర్కు వివరించారు. -
వృద్ధురాలిని కాపాడిన యువకులు
బండి ఆత్మకూరు: కుందూ నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మను మంగళవారం నలుగురు యువకులు కాపాడారు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది బండి ఆత్మకూరు సమీపంలోని కుందూనదిలో దూకింది. స్థానిక యువకులు ఫిదా, సూరజ్, శీను, అఫ్రోజ్ గమనించి ఈశ్వరమ్మను కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఏపీ ఎన్జీజీఓస్ సభ్యత్వ నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పటిష్టతకు మరింత జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరముందని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి జవహార్లాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. పలువురు ఉద్యోగులకు సభ్యత్వం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, వెటర్నరీ పారా సిబ్బంది సంఘాల సమాఖ్య చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయే!
కర్నూలు కల్చరల్: పట్ట భద్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్నాతకోత్సవ (పట్టాల) పండుగ రానే వచ్చింది. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు బుధవారం వర్సిటీలో జరగనున్నాయి. వీటి నిర్వహణకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యాక ప్రస్తుతం జరుగుతున్న ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రానుండటం విశేషం. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రామకుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఆయనే ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నారు. గవర్నర్ పర్యటన ఇలా.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్లర్ హోదాలో ఆర్యూ నాల్గవ స్నాతకోత్సవం, మాంటిస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు రానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గాన రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు వర్సిటీ నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం, విశ్రాంతి తీసుకొని 2.20 గంటలకు బయలు దేరి 2.30 గంటలకు ఏక్యాంప్ మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్కు చేరుకు ని స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 3.30 గంటల వరకు పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. గవర్నర్ పరట్యన నేపథ్యంలో ప్రొటోకాల్ అధికారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏయిర్పోర్ట్ నుంచి ఆర్యూ వరకు ట్రయల్ రన్ నిర్వహించి, సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. ముస్తాబైన వర్సిటీ వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్కు ముస్తాబైంది. పరిపాలనా భవనం, అకడమిక్ బిల్డింగ్స్, వర్సిటీ ముఖ ద్వారాలు, వర్సిటీ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పరిపాలనా భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కాన్వొకేషన్ జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దారు. 75 మందికి బంగారు పతకాలు వర్సిటీలో 60 మంది పీజీ, 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కలిపి మొత్తం 75 మందికి బంగారు పతకాలను గవర్నర్ అందజేయనున్నారు. 283 మంది స్కాలర్స్కు పీహెచ్డీ కాన్వొకేషన్కు దరఖాస్తు చేసుకోగా ఇన్పర్సన్ 138 మంది, పీజీ విద్యార్థులు 889 మంది దరఖాస్తు చేసుకోగా ఇన్పర్సన్గా 256 మంది విద్యార్థులు నేరుగా కాన్వొకేషన్ పట్టాను అందుకోనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం వరకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులకు 17,224 మంది దరఖాస్తు చేసుకోగా అన్ని కోర్సులకు సంబంధించి మొత్తం 18,396 మంది విద్యార్థులు కాన్వొకేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్కు వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తం 2,000 మంది పాల్గొనేలా సభా ప్రాంగణం ముస్తాబైంది. కాన్వొకేషన్కు హాజరయ్యే వారు ఉదయం 10 గంటల్లోగా వేదిక ప్రాంగణానికి చేరుకోవాలి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వర్సిటీ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లను ఆహ్వానించాం. చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ వర్సిటీకి రానున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే స్నాతకోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉంది. – ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, వైస్చాన్స్లర్, ఆర్యూ -
ప్రజల అభ్యున్నతికి సహకారం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజల అభ్యున్నతికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకరిస్తుందని కర్నూలు రీజినల్ హెడ్ నరసింహారావు తెలిపారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్లో మంగళవారం యూబీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని బ్రాంచ్ల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముంబయి నుంచి యూబీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అషిష్ పాండే ప్రసంగంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వివరాలను లైవ్టెలీకాస్ట్ ద్వారా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హంద్రీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కర్నూలు: జొహరాపురం శివారులోని హంద్రీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మంగళవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి క్రీమ్ కలర్ ఫుల్ షర్ట్, లేత నీలి రంగు ప్యాంటు ధరించాడు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 9121101059 లేదా 9985726737, ల్యాండ్ నెంబర్ 08518–240012కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఐటీసీ మార్కెటింగ్ ఏజెంట్ ఆత్మహత్య కర్నూలు: మండల పరిధిలోని ఉల్చాల గ్రామానికి చెందిన రఘువరన్ (23) పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలులోని ఐటీసీలో మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఐటీసీ కంపెనీకి సంబంధించిన లోన్ కలెక్షన్ డబ్బు కంపెనీకి చెల్లించకుండా వాడుకున్నాడు. దీంతో కొంతకాలంగా కంపెనీ నిర్వాహకులు తీవ్ర ఒత్తిడి చేయడంతో వాడుకున్న డబ్బు చెల్లించే మార్గం లేక మనస్తాపానికి గురై సోమవారం ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడివుండగా కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయించారు. కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారవేత్త అరెస్ట్ ● రిమాండ్ తిరస్కరించిన కోర్టు నంద్యాల: వ్యాపారవేత్తను త్రీటౌన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. సరైన విచారణ విధానం పాటించకుండా అరెస్ట్ చూపడంతో జడ్జి రిమాండ్ తిరస్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన వ్యాపారవేత్త బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన మనూ అనే వ్యక్తికి స్థిరాస్థి వ్యాపార లావాదేవీల్లో మోసం చేశారని, త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు చట్టం ప్రకారం నోటీసు ఇవ్వకపోవడం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, చట్టపరమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని జడ్జికి వివరించడంతో రిమాండ్ను తిరస్కరించినట్లు న్యాయవాది నిఖిలేశ్వర్రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామాని కి చెందిన బోయ వెంకట రెడ్డి(25) తిరుపతిలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో పనులు లేకపోవడంతో మూడేళ్లుగా తిరుపతికి వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తూ అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చిపోచేవాడు. మొహర్రం అనంతరం మూడు నెలల క్రితం భార్య పిల్లలతో కలిసి వెంకట రెడ్డి తిరుపతికి వెళ్లాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకుని బైక్పై తిరుపతిలో సరుకులు కొనుగోలు చేసేందుకు బయలదేరాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తలకు తీవ్రమై గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామం మూగలదొడ్డికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య మహేశమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
చిన్నారుల అస్వస్థతపై విచారణ
ఆదోని రూరల్: మండల పరిధిలోని నాగులాపురం గ్రామ అంగన్వాడీ కేంద్రం–2లో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ పీడీ విజయ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సత్యవతి మంగళవారం అంగన్వాడీ కేంద్రం–2ను పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తను, ఆయాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ వాటర్ టెస్టింగ్ టీం తాగునీటిని సేకరించి ల్యాబ్కు తరలించింది. గడ్డ కట్టిన పాలు ఇవ్వడం, భోజనం, వంట పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం వల్లే అస్వస్థతకు కారణమని గ్రామస్తుల ఆరోపణలతో వాటినీ పరిశీలించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఐసీడీఎస్ పీడీ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ కోలుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ డిల్లీశ్వరి, సూపర్వైజర్ పుష్ప, ఆదోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
బరితెగించిన ఇసుకాసురులు
గోరంట్లలో రెచ్చిపోతున్న తమ్ముళ్లు ● హంద్రీ నుంచి రోజుకు 50 పైగా ట్రాక్టర్ల ఇసుక తరలింపు ● సోషల్ మీడియాలో వీడియోల హల్చల్ సాక్షి టాస్క్ఫోర్స్: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ హంద్రీనదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. హంద్రీనది నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి అనుచరులు పగలు, రాత్రి తేడా లేకుండా గోరంట్ల హంద్రీ నది నుంచి రోజుకు 50కు పైగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి చుట్టుపక్క గ్రామాలతో పాటు, క్రిష్ణగిరి, డోన్, పత్తికొండ వంటి ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవలే హంద్రీనదికి వరదలు రావడంతో గోరంట్ల హంద్రీలో భారీగా ఇసుక మేటలు వేసింది. దీన్ని అదనుగా భావించిన విష్ణు అనుచరులు గోరంట్ల హంద్రీ నుంచి పట్టపగలే ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరో 10నుంచి 15రోజుల్లో హంద్రీలో ఇసుకంతా ఖాళీ అయ్యే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. పగిలిపోతున్న మంచినీటి పైపులైన్లు హంద్రీ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో గ్రామానికి మంచినీటి సరఫరా కోసం హంద్రీలో వేసిన పైపులైన్లు పగిలిపోతున్నాయి. దీంతో గోరంట్ల గ్రామంలో రెండు, మూడు రోజులకోసారి మంచినీటి సమస్య తలెత్తుతోంది. ఇసుక తరలింపు వల్లే పైపులైన్లు పగిలిపోతున్నాయని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం పైపులైన్లు పగులుతుండడంతో పంచాయతీకి భారీగా నష్టం చేకూరుతోంది. సోషల్ మీడియోలో పోస్టులు పెట్టి మరీ తరలింపు అనుమతి లేకుండా హంద్రీనది నుంచి ఇసుకను తరలించరాదనే నిబంధనలున్నా గోరంట్లకు చెందిన విష్ణు అనుచరులు బేఖాతర్ చేస్తున్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్ను బట్టి ఒక్కో ఇసుక ట్రాక్టర్ రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పలుకుతుండడంతో తెలుగుతమ్ముళ్లు భారీగా దోచేస్తున్నారు. ఇక్కడి ఇసుక మాఫియా ఒక అడుగు ముందుకేసి హంద్రీనది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించే వీడియోలను సైతం సోషల్ మీడియాలో పెడుతూ హల్చల్ చేస్తున్నారు. బహిరంగంగానే పోస్టులు పెడుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం గమనార్హం. -
పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా?
ఆదోని రూరల్: అన్ని విధాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా అని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్య దర్శి గౌస్దేశాయ్ చంద్రబాబు సర్కారును ప్రశ్నించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆదోని సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ భారీ ధర్నా చేపట్టి వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి పలువురు రాష్ట్ర మంత్రులుగా, కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. అందుకే ఇక్కడి నుంచి చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి బతుకుతున్నారన్నారు. కోసిగి, పెద్దకడబూరు, ఆదోని, ఆస్పరి, ఆలూరు, కౌతాళం మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. రెండో ముంబాయిగా పిలువబడే ఆదోనిలో ప్రస్తుతం పరిశ్రమలు మూతపడి వెలవెలబోతుందన్నారు. కార్మికులకు, యువకులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు పరిశ్రమలు తీసుకువచ్చి వారికి ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగడం లేదని, ఎందుకో పాలకులు వాటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఏటా వంద ల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా చోద్యం చూస్తున్నారన్నారు. ఒడిసి పట్టి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయడం లేద న్నారు. హగరి నదిపై వేదావతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ నిర్మాణం తదితరవి మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయ ఏఓ వసుంధరకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ -
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అరుదైన ఆపరేషన్
● క్యాన్సర్ సోకిన కాలు కోల్పోకుండా కాపాడిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): కార్పొరేట్ ఆసుపత్రు ల్లో జరిగే అరుదైన సర్జ రీ కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళకు ఇక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాలు కోల్పోకుండా కాపాడారు. వివరాలను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. కదిరి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల మహిళ ఎడమ తొడ కింది భాగంలో వాపు, నొప్పితో బాధపడుతూ గత నెల 15వ తేదీన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చికిత్స నిమిత్తం వచ్చారు. ఆమెను పరీక్షించిన ఎముకల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ బ్రహ్మ మహేశ్వరరెడ్డి, డాక్టర్ శివకృష్ణ కండ్రోసర్కోమా అనే ఎముకల క్యాన్సర్గా నిర్దారించారు. అదే నెల 27వ తేదీన ఆమెకు వచ్చిన క్యాన్సర్ పైభాగం వరకు కాలు తీసి వేయకుండా క్యాన్సర్ ఉన్న ఎముక, కండరాలను మాత్రమే తీసివేసి కృత్రిమ ఎముక (మెగా ప్రాస్తెసిస్) వేసి కాలుని కాపాడారు. ఆపరేషన్ సమయంలో, తర్వాత గాని ఎలాంటి ఇబ్బంది రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వాకర్ సహాయంతో ఆమెను నడిపించి సాధారణ జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటి సర్జరీ చేయడం ఇక్కడ మొదటిసారని డాక్టర్ ప్రకాష్ చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు చైతన్యవాణి, బీసన్న, భారతి, వరలక్ష్మి పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు కర్నూలు: ‘నేను బయోమెడికల్ కోర్సు పూర్తి చేశాను. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు సి.క్యాంప్నకు చెందిన రాఘవరెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడ’ని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన నరసింహులు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 99 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సంబంధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈకార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పలువురు వివిధ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. వాటిని సత్వరం పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చునన్నారు. జిల్లాలో పోలీసులు అప్రమత్తం ● ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు కర్నూలు: ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా అంతటా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎస్పీ గుత్తి పెట్రోల్ బంకు దగ్గర చేపట్టిన వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర, జాతీయ, గ్రామీణ రహదారుల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. -
పసిబిడ్డ కిడ్నాప్ కేసులో ముద్దాయి అరెస్టు
కర్నూలు: నాలుగేళ్ల పసిబిడ్డ కిడ్నాప్ చేసిన కేసులో ముద్దాయి బోయ మధును నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. బాలిక తల్లి తెలుగు సునిత అలియాస్ సుమిత్ర కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఎస్ఏపీ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో పేపర్లు ఏరుకోవడం, భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 8న తన కూతురును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తల్లి సుమిత్ర నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం పంచలింగాల చెక్పోస్టు వద్ద అనుమానాస్పదంగా బాలికతో ఉన్న బోయ మధును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన బోయ మధు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటోస్టాండ్ వద్ద నివాసముంటాడు. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం విక్రయించేందుకు హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. బాలికను తల్లికి అప్పగించి నిందితుడిని డోన్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. -
సంచార పశువైద్య కేంద్రాలకు మందులొచ్చాయి
కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశువైద్య కేంద్రాలకు ఎట్టకేలకు మందులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ కేంద్రాలు మనుగడ కోల్పోతున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 5వ తేదీన మూగబోయిన సేవలు అనే శీర్షికపై సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నత స్థాయి దృష్టికి పోవడంతో సంచార పశువైద్య కేంద్రాలకు మందులు సరఫరా అయ్యాయి. 10 రకాల మందులను సరఫరా చేసినట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 1962 పనితీరు మెరుగుపడలేదు. టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే తగలకపోవడం, రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడం ఇప్పటికీ జరుగుతోంది. ఉదయం 11 తర్వాత కాల్స్కు స్పందిస్తున్నట్లు సమాచారం. 12న కర్నూలుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు(సెంట్రల్): ఆర్యూ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలుకు రానున్నారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, డీఐజీ, ఎయిర్పోర్టు డైరెక్టర్లకు రాజ్భవన్ నుంచి సమాచారాన్ని అందించారు. 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గంలో రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 12.20 గంటలకు మాంటెస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకుంటారు. అక్కడ మాంటెస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అడవుల సంరక్షణకు ప్రాధాన్యత కర్నూలు కల్చరల్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధానంగా అటవీ ఉద్యోగులు ఈ బాధ్యతను మరువకూడదని ఆ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ బీవీఏ కృష్ణ మూర్తి అన్నారు. సోమవారం అటవీ శాఖ సర్కిల్ కార్యాలయంలో అటవీ అమర వీరుల దినోత్స వం నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్తో పాటు డీఎఫ్వో శ్యామల, రేంజర్లు, అటవీ శాఖ ఉద్యోగులు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎఫ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో 23 మంది అటవీ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణ లో అమరులయ్యారన్నారు. వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ రమణారెడ్డి, కర్నూలు డివిజన్ ఎఫ్ఆర్ఓ విజయకుమార్, ఏవో అబ్దుల్ సుభాన్, కార్యాలయ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
హైకోర్టు చీవాట్లు పెట్టినా మారని ప్రభుత్వం
కర్నూలు(టౌన్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి పార్టీలు విషం చిమ్మినా ఏనాడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ రోజులను మించిపోయిందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మీడియాతో పాటు తాము కూడా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం మత్తులో ఉన్న బైకర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారన్నారు. లక్ష్మీపురం పరిధిలోని బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే విషయంపై తాము మాట్లాడితే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల ఆఫీసులకు పోలీసులు వెళ్లడం, నోటీసులు ఇవ్వడం ఎప్పుడూ చూడలేదన్నారు. సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు, భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడు, లోకేష్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వీటికి ఎంతమాత్రం భయపడబోం. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. ఏడాదిన్నర పాలనలో చీప్ లిక్కర్, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు లేవని ఈ ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు -
విద్యార్థులతో ముచ్చటించి..సౌకర్యాలపై ఆరాతీసి
హొళగుంద: శిక్షణలో భాగంగా మండల కేంద్రం హొళగుందకు వచ్చిన ట్రైనీ కలెక్టర్లు శివంసింగ్, శివానీ, శివణేంధరణ్, మైఖెల్, నిధి యా, ఆల్ప్రెడ్లు సోమ వారం ప్రభుత్వ పాఠశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టేశారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజానగర్ కాలనీలోని కన్నడ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించి..విద్యాబోధన, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. తర్వాత తహసీల్దారు కార్యాలయం, పోలీస్స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చలవాది రంగమ్మ, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్ తదితరులు ఉన్నారు. -
స్కూటర్ అదుపుతప్పి ..
ఆలూరు రూరల్: స్కూటర్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కురువళ్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. హాలహర్వి మండల కేంద్రానికి చెందిన షేక్షావలి బెంగళూరులో గౌండా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సొంత పని నిమిత్తం ఆలూరు వచ్చి హాలహర్వికి వెళ్తుండగా కురువళ్లి సమీపంలోని హైవే 167లో కుక్కను ఢీకొట్టి స్కూటర్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రయాణికులు గమనించి 108 అంబులెన్సులో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు షేక్షావలికి భార్య షాషా బీ, ఇద్దరు పిల్లలు సంతానం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. లారీ, బొలెరో ఢీ.. ఒకరు మృతి ● మరో ముగ్గురికి గాయాలు చిలుకూరు: లారీ, బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి ఏపీలోని కర్నూలుకు వెళ్తున్న బొలెరో వాహనం చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల వద్దకు రాగానే ఎదురుగా హుజూర్నగర్ నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏపీలోని కర్నూలు పట్టణంలోని ఆర్ఆర్ నగర్కు చెందిన బొలేరో వాహన డ్రైవర్ నల్లబొక్కల రఘు(43) అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వాహనంలో ప్రయాణిస్తున్న ఉపేంద్ర పవన్కుమార్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని విజయవాడకు తరలించారు. అదేవిధంగా లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపుల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ భూమిని గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో వెంకటనారాయ ణమ్మ పాల్గొన్నారు. -
గ్రామాల్లో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు
● కలెక్టర్ సిరికి విన్నవించిన మాజీ ఎమ్మెల్యే కాటసానికర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయ కులు నిరంకుశంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై కల్టెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..కల్లూరు మండలం బొల్లవరంలో ఉన్న నీలం రామచంద్రయ్య గ్రామైక్య సంఘంలో మొత్తం 27 సంఘాలు ఉండగా..ఐక్య సంఘం లీడర్ను కేవలం 14 సంఘాల లీడర్లతోనే ఎన్నుకున్నారని, అన్ని సంఘాల మద్దతుతో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం బుక్కీపర్గా ఉన్న కృష్ణమోహన్నాయుడును కొనసాగించాలని, ఆయన సెల్ఫోన్ను బ్లాక్ చేయడం అన్యాయమని చెప్పారు. అలాగే ఓర్వకల్ మండలం మీదివేములకు చెందిన భూములను ఏపీఐఐసీ సేకరించిందని, ఆ గ్రామానికి చెందిన 37 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే పరిహారం ఇచ్చిందని, బోర్లు, బావులు, చెట్లకు కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రైతులందరికీ పరిహారం ఇవ్వాలని కోరారు. -
విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం
● ట్రిపుల్ఐటీ, ఆర్యూ మధ్య ఒప్పందంకర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఆర్యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్చెయిన్, క్వాంటం, పోస్ట్ క్వాంటం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యూ రిజిస్ట్రార్ విజయ్కుమార్, ట్రిపుల్ఐటీ డీఎం రిజిస్ట్రార్ రాజ్ కుమార్, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కలుషిత ఆహారంతో పదిమంది చిన్నారులకు అస్వస్థత
● ఆదోని మండలం నాగలాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘటన కర్నూలు (అర్బన్): ఆదోని మండలం నాగలాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం కలుషిత ఆహారం తిని పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులకు సంబంధిత అంగన్వాడీ టీచర్ ముందుగా పాలు ఇచ్చారని, మధ్యాహ్నం అన్నం, సాంబారు పిల్లలకు పెట్టినట్లు సమాచారం. ఈ ఆహారం తిన్న వెంటనే పది మంది చిన్నారులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, వైద్య సిబ్బందికి చేరవేయడంతో హుటాహుటిన వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య సహాయం అందించారు. అయితే, 9 మంది చిన్నారులకు అక్కడే శిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందించి, మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. -
దీక్షతో అనంత పుణ్యఫలం
హరిహర సుతుడు అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతం. మనుషుల్లో స్వార్థాన్ని రూపు మాపేందుకు అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిర్మూలించడమే అయ్యప్ప ఆరాధన లక్ష్యం. దీక్షను ఎంత నిష్టగా ఆచరిస్తే అంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది. కార్తీక మాసం మొదలు కొని మకర జ్యోతికి వెళ్లే వారు డిసెంబర్ 3వ తేదీ వరకు దీక్ష స్వీకరించవచ్చు. – బాలస్వామి, పూజారి, భాస్కర్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయం దీక్షా కాలం మండలం రోజులు దేహమే దేవాలయంగా అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, అవిద్యలకు దూరంగా బ్రహ్మచర్యం, చన్నీటి స్నానం, దీపారాధనలు, అయ్యప్ప శరణుఘోష, సాత్వికాహారంతో దీక్షను పాటించాలి. ఈ సమయంలో పాటించే నియమాలను దీక్షానంతరం కూడా పాటిస్తే ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది – సత్యనారాయణ, గురుస్వామి, 21వ పడి అయ్యప్ప స్వామి దీక్ష మండల కాలం జీవన విధానంలో ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది గురు స్వాములు చెప్పారు. దీంతో ఐటీఐ చదువుతున్న నేను మొదటి సారి దీక్ష స్వీకరించాను. చాలా ప్రత్యేకంగా జీవన విధానం మారింది. నియమ నిష్టలతో నిత్యం అయ్యప్పను సేవిస్తూ దీక్షను కొనసాగిస్తున్నాను. ఉదయం, సాయంత్రం ఆలయానికి వెళ్లటం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతోంది. – ఈశ్వర్, కన్నెస్వామి -
దీక్షా నియమాల్లో కొన్ని..
● ప్రతి రోజు వేకువనే చన్నీటితో స్నానం చేయాలి. ● నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి. కన్నె స్వాములు (మొదటి సారి దీక్ష స్వీకరించిన వారు) కచ్చితంగా నలుపు దుస్తులనే ధరించాలి. ● కాళ్లకు చెప్పులు ధరించరాదు. ● ప్రతి సీ్త్రని (భార్యను సైతం) దేవి స్వరూపాలుగా భావించాలి. ● రోజుకు ఒక్క పూట మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ● ఉదయం పాలు పండ్లు మాత్రమే ఆరగించాలి. ● పగటి పూట నిద్ర పోరాదు. ● మద్యం, మాంసం, ధూమపానం, తాంబూలం నిషేధం. ● తల్లిదండ్రులకు, గురుస్వాములకు, తోటి అయ్యప్పలకు, దైవానికి, మహాత్ములకు మాత్రమే నమస్కారం చేయాలి. స్వాముల హోదా కన్నెస్వామి: మొదటి సారి దీక్షను స్వీకరించిన వారు కత్తి స్వామి: వరుసగా రెండో సారి దీక్ష తీసుకున్న వారు గంటస్వామి: వరుసగా మూడో సారి దీక్ష స్వీకరించిన వారు గదస్వామి: వరుసగా నాలుగోసారి దీక్ష తీసుకున్న వారు పెరుస్వామి: వరుసగా ఐదో సారి దీక్షను స్వీకరించిన వారు గురుస్వామి: వరుసగా ఆరోసారి దీక్షను తీసుకున్నవారు. -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● 12న కర్నూలులో ప్రజా ఉద్యమ ర్యాలీ ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న కర్నూలు నగరంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను ఆదివారం సాయంత్రం గిప్సన్ కాలనీలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలులో నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతున్నట్లు చెప్పారు. ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజలు, మహిళలు, విద్యార్థినీ, విధ్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో తమకు అనుకూలమైన టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలకులు పనిచేయాలని, అందుకు విరుద్ధంగా చేస్తే ప్రజలు సహించబోరన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి, కార్పొరేటర్ వి. అరుణ, నాయకులు షరీఫ్, కిషన్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కంటూ, రామాంజనేయులు , లాజరస్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పేదలకు అన్యాయం చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కష్టాలతో జీవనం సాగించేలా పాలన సాగుతోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా, తన అనుచరులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆలూరులో నిర్వహించే ర్యాలీకి సంబంధించి వాల్పోస్టర్లును ఆదివారం ఆలూరులోని ఆర్అండ్బీ అతిథిగృహ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందేలా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు సాధించి, అందులో ఐదు పూర్తి చేశారన్నారు. మిగిలిన వాటిని పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గం అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేసినా ప్రభుత్వంలో కనీసం స్పందనలేదన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు తాము, తమ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, బీసీసెల్ కార్యదర్శులు శ్రీనివాసులు, భాస్కర్, వీరేషప్ప, ఈరన్న, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీలు దేవరాజ్, బాషా, బోయ ఎల్లమ్మ, మోతి ఎల్లమ్మ, నాగమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కిశోర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాలయం..భక్తజనసంద్రం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కల్పతరు క్యూలైన్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్ వేలాదిమంది భక్తులతో కిక్కిరిసి కనిపించింది. నేటి నుంచి ఎస్ఏ–1 పరీక్షలు కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ఎస్ఏ–1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు 6,7 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ జిల్లా సాధారణ పరీక్షల విభాగానికి పంపించారు. అక్కడి నుంచి హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎంఈఓ ఆఫీస్కు పంపుతారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు ఆయా క్లస్టర్ స్కూళ్ల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకపోవాల్సి ఉంటుంది. ఈజీ మనీ కోసం ఆశపడొద్దు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈజీ మనీ కోసం ఆశపడితే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. రూ. లక్ష పెడితే రూ. కోట్లు వస్తాయంటే కచ్చితంగా మోసమే అని తెలిపారు. ఎపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయవద్దని, అలాగే అపరిచిత లింక్స్ క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. నేడు డయల్ యువర్ ‘సీఎండీ’ కర్నూలు (టౌన్): విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 సెల్ నంబర్ను ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు తెలియజేయాలని తెలిపారు. అలాగే వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు, 1800425 155333కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వాట్సప్ నంబర్ 9133331912కు చాట్ చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. -
రూ.1.54 లక్షలు రావాల్సి ఉంది
నేను నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. సెప్టెంబరు 8న కర్నూలు మార్కెట్కు ఉల్లిని తీసుకెళ్తే ఒక లాట్ క్వింటాలు ధర రూ,359, మరో లాట్ క్వింటాలుకు రూ.409 ధరతో వ్యాపారులు కొన్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి బ్యాలెన్స్ అమౌంటు నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని అధికారులు చెప్పారు. మాకు మద్దతు కింద రూ.1.54 లక్షల వరకు రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినప్పటికీ బ్యాలెన్స్ మొత్తం బ్యాంకు ఖాతా జమ కాలేదు. – చిన్నమద్దిలేటి, ఈర్లదిన్నె, సి.బెళగల్ మండలం -
రెండు నెలలైనా డబ్బు జమ కాలేదు
ఆరు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో 4.50 ఎకరాల్లోని ఉల్లి పంటను దున్నేశాం. మిగిలిన ఎకరన్నర భూమిలో పండిన 72 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను గత సెప్టెంబర్ 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకెళ్లాం. వ్యాపారులు క్వింటా రూ.198 ప్రకారం కొన్నారు. మద్దతు ధర రూ.1,200 కాగా.. వ్యత్యాసం రూ.1,002 ప్రకారం రూ.72,144 బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లో విడుదలవుతాయని చెప్పారు. ఇప్పటికి రెండు నెలలవుతున్నా ఆ ఊసే లేదు. రైతులను మోసం చేయడం సరికాదు. – బి.రామలింగడు, లింగందిన్నె, గోనెగండ్ల మండలం -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
కర్నూలు (టౌన్): బీటెక్ విద్యార్థి కుమ్మరి భరత్ కుమార్ (20) ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరు విఠల్ నగర్కు చెందిన ఈ విద్యార్థి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి కుమ్మరి శ్రీరాములు మెడికల్ ఏజెన్సీకి, తల్లి మాధవి పనిమీద ఆదివారం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమ్మరి భరత్ బెడ్రూమ్లో ఉన్న సిలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి ఉరి వేసుకున్న కుమారుడిని చూసి బోరున విలపిస్తూ భర్త శ్రీరాములుకు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడిని ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమారుడు చనిపోవడానికి ఎవరూ కారణం కాదని తల్లిదండ్రులు తెలిపారు. -
కొత్తూరులో సినిమా డైరెక్టర్ సురేందర్రెడ్డి
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూజలు చేశారు. అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి చిత్రాలకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. పాల కోసం వస్తూ.. మహానంది: జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అఫదిమడూరి గ్రామానికి చెందిన పవన్(26) గాజులపల్లె రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నవగ్రహాల ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆలయానికి దగ్గరలోని ఎంసీఫారం వద్ద ఆదివారం ఉదయం పాలు తెచ్చేందుకు బైక్పై వెళ్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన షేక్ జమాల్ బాషా బొలొరో ఢీకొంది. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడటంతో కోలుకోలేక మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం కోడుమూరు రూరల్: కొత్తూరు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వితంతువు మల్లెపూలు లక్ష్మి కన్పించకుండా పోయినట్లు ఆమె తల్లి బైరిపోగు తిరుపాలమ్మ కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మల్లెపూలు లక్ష్మీ అనే మహిళకు 11 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో కొత్తూరు గ్రామాన్ని వదిలి పుట్టినిల్లైన గూడూరు మండలం మునుగాల గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆరు నెలల కిందట లక్ష్మి తిరిగి కొత్తూరు చేరుకుని అక్కడే కుమారిడితో పాటు నివాసముంటోంది. ఈ నేపథ్యంలో గత శనివారం కోడుమూరుకు సంతకు వచ్చిన లక్ష్మి తిరిగి ఇంటికి పోలేదు. అయితే కోడుమూరులోని కొత్తబస్టాండ్ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్చేసి తనను ఇద్దరు వ్యక్తులు వెంటాడుతున్నారని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి బైరిపోగు తిరుపాలమ్మ తన కుమార్తె కన్పించకుండా పోయిన విషయాన్ని ఆదివారం కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడో అంతస్తు పై నుంచి పడి యువకుడు మృతి కర్నూలు: నగర శివారు నంద్యాల చెక్పోస్ట్ కేంద్రీయ విద్యాలయంకు ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్లో ఇంటి నిర్మాణం పనులు చేస్తూ కె.కిరణ్ (24) ప్రమాదవశాత్త్తూ కింద పడి మృతి చెందాడు. కర్నూలు మండలం పడిదంపాడు గ్రామానికి చెందిన బక్కన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. బక్కన్న.. ధనలక్ష్మి నగర్లో శ్రీనివాసులు ఇంటి నిర్మాణం వద్ద వాచ్ మెన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి వెళ్లా డు. ఇంటి నిర్మాణానికి సంబంధించి క్యూరింగ్ కోసం నీళ్లు కొట్టేందుకు కుమారుడు కిరణ్కు చెప్పి ఊరికి వెళ్లాడు. మూడో అంతస్తులో నీళ్లు కొడుతుండగా పైపు కాలికి తగులుకొని అదుపు తప్పి పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి బక్కన్న ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. -
ఆనందం.. ఆధ్యాత్మికం
● కుల సంఘాల ఆధ్వర్యంలో వన భోజనాలు ● ఆటపాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు గంగపుత్రుల వన భోజన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ఎస్వీ మోహన్రెడ్డి కాటసాని రాంభూపాల్రెడ్డిని సన్మానించిన దృశ్యం కర్నూలు కల్చరల్: కార్తీక వన భోజన కార్యక్రమాలు ఆదివారం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు, గోమాత పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. కుల ప్రముఖుల సందేశాలిచ్చారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు అభినందనలు తెలుపుతూ సత్కారాలు చేశారు. ● కర్నూలు రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్లో రెడ్ల కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది. వేలాది మంది కుల సంఘీయులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పుల్లకుర్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాతల సహకారంతో రెండు వృద్ధాశ్రమాలు, పేద రెడ్డి విద్యార్థులకు విద్యానిధి ద్వారా విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడారు. సిని కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన మిమిక్రీతో సందడి చేశారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, ఉపాధ్యక్షులు దొనపాటి ఎల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, లోకేశ్వర్రెడ్డి, జి.పుల్లారెడ్డి ట్రస్ట్ సభ్యులు రాఘవ రెడ్డి, ఏకాంబర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేజే రెడ్డి కేవీ సుబ్బారెడ్డి, సరేష్ రెడ్డి, హనుమంత రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


