breaking news
Kurnool District News
-
పాగాలంకరణ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న చేపట్టనున్న పాగాలంకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని పాగాలంకరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, సమయానికి నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చూశారు. సంబంధిత దేవస్థాన అధికారులను పాగాలంకరణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రవేశ క్యూలైన్ నుంచి బయటకు వెళ్లే గేట్ వరకు భక్తుల రాకపోకల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, మార్గదర్శక బోర్డులు తదితర అంశాలపై దేవస్థాన సిబ్బందితో సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరి వెంట శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం సబ్ డీఎఫ్వో బబిత, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ఉన్నారు. -
మయూర వాహనాధీశా పాహిమాం
శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు బుధవారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఉంచారు. ఉభయదేవాలయల ప్రధాన అర్చకులు, వేదపండితులు అర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూరవాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మయూర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. శాస్త్రోక్తంగా పట్టువస్త్రాల సమర్పణ శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవా ల్లో బుధవారం ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ది వినా యకస్వామి దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, ఈఓ పెంచలకిషోర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు ఉదయం ఆ దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ డీఈఓ ముద్దాడ రవిచంద్ర పట్టువస్త్రాలు తీసుకు రాగా శ్రీశైల దేవస్థాన ఈవో, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో నేడు: గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభు త్వం తరుఫున స్వామిఅమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీగిరిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పరవశించిన భక్తులు కాణిపాకం, టీటీడీ తరఫున మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ నేడు రావణవాహనంపై దర్శనమివ్వనున్న స్వామిఅమ్మవార్లు -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
● ఆర్టీసీ, ఏపీఎన్జీఓలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకుల మద్దతు ● కర్నూలు నగరంలో ఆటోల బంద్కు పిలుపు కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాలు సర్వం సన్నద్ధమయ్యాయి. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా మద్దతు కూడగట్టారు. ఏపీఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అన్ని వర్గాల కార్మికులు, కర్షకులు, పెన్షనర్లు మద్దతు ప్రకటించారు. దీంతో తెల్లావారుజామున 5 గంటల నుంచే జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొంటుండడంతో ప్రైవేట్, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు స్తంభించనున్నాయి. కర్నూలు నగరంలో ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. -
పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం
కృష్ణగిరి: ఎన్నికల ముందు తాము గద్దెనెక్కితే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసేలేదు. సంపదకు బదులు అప్పులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్పులు కూడా పుట్టడం కష్టమవ్వడంతో అడ్డదారులు వెతుకుతున్నారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్ చార్జీలు తదితరవి పెంచడం ద్వారా కోట్లలో ఆదాయం గడించిన బాబు సర్కారు ఇప్పుడు పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. ప్రజల ముక్కుపిండి వందశాతం పన్నులు వసూలు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. ఈ పరిణామం వారిలో ఆందోళన కలిగిస్తోంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రా అంటూ పేర్లు పెట్టడం తప్ప కింది స్థాయి ఉద్యోగుల బాధలు పాలకులకు పట్టడం లేదని పలువురు గ్రామ కార్యదర్శులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రెండు నెలల ముందే ఇంటి పన్ను వసూళ్లు ప్రతి ఏడాది ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకుగానీ, ఏప్రిల్ చివరకుగానీ పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. కానీ ప్రస్తుత సర్కారు మరెక్కడా అప్పు పుట్టక తమపై పడిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మెడపై కత్తి పెట్టి పన్నులు వసూలు చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 14లోగా వందశాతం పన్నులు వసూలు చేయని వారిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోడౌల యజమాన్యాలు మార్చి నెలాఖరులో తమ పద్దులు సరి చూసుకుని పన్ను కడుతుంటారు. కానీ, ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచడంతో వయసు పైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీలు, షుగర్లు పెంచుకుని ఆనారోగ్యం పాలవుతున్నారు. మరి కొందరైతే సెలవు ఇస్తే వెళ్లిపోదామన్న రీతితో ఇతర దారులు వెతుకున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తామని ఆశలు పెట్టి చివరకు ఇబ్బందులకు గురిచేస్తుందని కూటమిసర్కారుపై పలువురు పంచాయతీ కార్యదర్శులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదీ లక్ష్యం.. కర్నూలు జిల్లాలోని 25 మండలాల్లో 3,56,885 గృహాలు ఉన్నాయి. జిల్లాలో నాన్ట్యాక్సీ, ట్యాక్సీ కింద పన్ను లక్ష్యం రూ. 50 కోట్లు కాగా ఇప్పటి వరకు 50శాతం దాకా వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణగిరి మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 10,121 గృహాలు ఉన్నాయి. ఇక్కడ పన్ను లక్ష్యం రూ. 24,38,000లు కాగా ఇప్పటి వరకు 50శాతం వసూలు చేశారు. మిగిలిన 50 శాతం మూడు రోజుల్లోగా చేయకపోతే వేటు తప్పదనే ఆందోళన మరో వైపు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రిళ్లు గ్రామాల్లోనే బస చేసి.. పన్ను వసూళ్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు రాత్రి పూట కూడా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ ఇంటి, కుళాయి పన్నులు కట్టాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శుల్లో ఎవరికై నా ఏమైనా జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండేదెవరని ప్రశ్నిస్తున్నారు. 14లోగా వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు ఆందోళనలో కార్యదర్శులు ఒత్తిడి వల్ల తమకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ఆవేదన -
కారు చౌకగా రూ.7.20 కోట్లు
కర్నూలు–విజయవాడ జాతీయ రహదారిని అనుకొని ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఎకరా కనీసం రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన విష్ణువర్ధన్రెడ్డి మనువళ్ల పేరిట ఆక్రమించుకున్న భూముల విలువ దాదాపు 7.20 కోట్ల పైనే. రెండేళ్ల క్రితమే చెరువు స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు పెట్టి పూడ్చివేత పనులు చేపట్టారు. ఇందుకోసం సమీపంలోని కొండలు, గుట్టలను తవ్వి చెరువులో అక్రమంగా ఎర్రమట్టి నింపేశారు. ప్రధాన రహదారిని ఆనుకుని నామరూపాలు కోల్పోతున్న చెరువుసాక్షి టాస్క్ఫోర్స్: కోడుమూరు సీనియర్ టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి భూదాహానికి గార్గేయపురం చెరువు బలైపోతోంది. రెండేళ్ల క్రితం చెరువులో తన మనవళ్ల పేరుతో భూమి ఉందని చెప్పి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. సగానికిపైగా చెరువును పూడ్చి వేయించారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, తహసీల్దార్ ఆర్.శివరాముడు చెరువు పూడ్చివేత పనులను నిలుపుదల చేయించారు. చెరువులో ఎవరికీ భూమి ఉండదని, కేవలం నీళ్లు లేని సమయంలో మాత్రమే సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆక్రమణను పూడ్చి యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్లో ఆయన ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ప్రస్తుతం షాడో ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తుండడంతో తిరిగి చెరువును చెరబట్టారు. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఎంత అధికార పార్టీ నాయకుడైతే చెరువును నామరూపాల్లేకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు తాము ఏమీ చేయలేమన్నట్లు నిత్యం ఆ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అనుభవందారుల నుంచి కథ నడిపిన విష్ణు కర్నూలు రూరల్ మండలం రుద్రవరం, నందనపల్లె రెవెన్యూ గ్రామాల పరిధి 214/2, 609, 661, 672, 704 సర్వే నంబర్లలో గార్గేయపురం చెరువు విస్తరించింది. దీనికి అనుకుని 673–1ఏ1.15 ఎకరాలు, 673–1బీలో 1.15 ఎకరాలు, 673/2లో 1.39 ఎకరాలు, 673/3లో 2.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 673–1ఏలో గద్ద దానమ్మ, 673–1బీలో గద్ద నత్తానియేల్, 673/2లో మంగళ శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య, 673/3లో కె.పాపమ్మలు చెరువుకు నీళ్లు రాని సమయాల్లో కళింగర, పుచ్చకాయ, కర్బూజ వంటి పంటలను వేసుకొని జీవనం సాగిస్తుండటంతో అనుభవం దారులుగా గుర్తించారు. వీరికి రెవెన్యూ అధికారులు అప్పట్లో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. అయితే వీరు కేవలం అనుభవందారులే. అమ్ముకోవడానికి ఎలాంటి హక్కులు ఉండవు. ఈ క్రమంలో అనుభవం దారుల నుంచి ఆ భూములను సులభంగా కొట్టేసేందుకు టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే తన బినామీ, సుంకేసులకు చెందిన రేపల్లె సుధాకర్ను రంగంలోకి తీసుకొచ్చాడు. సర్వే నంబర్లు 673/2లో అనుభవం ఉన్న మంగళి శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య ఆధీనంలోని 1.3 ఎకరాలను రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 673–1ఏ, 1బీలలో అనుభవంలో గద్ద దానమ్మ, గద్ద సత్తానియేల్ ఆధీనంలోని 2.30 ఎకరాలు కూడా రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రేపల్లె సుధాకర్ నుంచి 373–2లోని 1.3 ఎకరాలను తన మనువడు సూర్యవర్ధన్రెడ్డి(మైనర్), ఇతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 373–1ఏ, 1బీలలోని 2.30 ఎకరాలను తన మరో మనువడు ఆదిత్యవర్ధన్రెడ్డి(మైనర్)కి అతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా రిజిస్ట్రేషన్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గతాన్ని మరచిన విష్ణుకుటుంబం కోడుమూరు టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి కుటుంబం గతాన్ని మరచి గార్గేయపురం చెరువును ఆక్రమణలోకి తెచ్చుకోవాలని చూస్తోందనే చర్చ జరుగుతోంది. గతంలో నియోజకవర్గంలోని పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి, బతికి ఉన్న సమయంలో ఆయన కుమారుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి గగ్గోలు పెట్టారు. అయితే వారు మాత్రం గార్గేయపురం చెరువును అడ్డంగా ఆక్రమించుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలం నాగులాపురం చెరువుకు సమీపంలోని భూములను కొందరు ఆక్రమించారని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి మద్దతు తెలిపారు. అలాగే విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు రాజావర్ధన్రెడ్డి బతికున్న సమయంలో బి.తాండ్రపాడు చెరువు ఆక్రమణకు గురవుతోందని ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ ట్రిబ్యునల్లో నడుస్తోంది. అదే కుటుంబం ఐదు గ్రామాల రైతులకు సాగు, తాగునీటిని అందించే గార్గేయపురం చెరువు రూపురేఖలు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పూనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నీళ్లు లేని సమయంలో సాగుకు అనుమతి అనుభవం ముసుగులో రిజిస్ట్రేషన్లు ఎకరం రూ.2 కోట్ల విలువ చేసే 3.60 ఎకరాల చెరువు భూమి కబ్జా రెండేళ్ల క్రితం ‘సాక్షి’ కథనంతో అడ్డుకున్న అధికారులు అధికార పార్టీ నేత కావడంతో తిరిగి చెరువు పూడ్చివేత -
ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం
నందవరం: మండలంలోని నందవరం– ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో నందవరం సమీపంలో ఇనుప కడ్డీల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి టాలీ బోల్తా పడింది. బుధవారం ఎమ్మిగనూరు నుంచి నందవరంలో కేజీబీవీ, ఎంపీపీ పాఠశాలలకు పనుల నిమిత్తం చిలకలడోణ గ్రామానికి చెందిన పాండు ట్రాక్టర్లో ఐరన్ లోడ్ చేసుకుని బయలు దేరాడు. మార్గ మధ్యలో నందవరం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిలో అదుపు తప్పి ట్రాక్టర్ టాలీ బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దిగాడు. ఆ సమయంలో రోడ్డులో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనూ ప్రమాదం తప్పింది. కొత్తపేటలో చోరీ హొళగుంద: కొత్తపేట గ్రామంలోని ఆటో డ్రైవర్ హంపయ్య ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు..ఆటోతో ఆలూరుకు వెళ్లగా హెల్పర్గా పనిచేస్తున్న తన భార్య దేవమ్మ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన సమయంలో దొంగలు బీరువాను పగలగొట్టి ఐదు తులాల బంగారు ఆభరణలు, రూ.67 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరామ్నాయక్ సిబ్బందితో కలిసి ఇంటిని పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అలాగే కర్నూలు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాల సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష ఆదోని రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన కర్ణాటకకు చెందిన ప్రవీణ్కుమార్, ఆదోనికి చెందిన బెస్త శివకుమార్లకు ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లీలా సుభాష్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఆదోని తాలూకా పోలీసులు బుధవారం తెలిపారు. ప్రవీణ్కుమార్కు 20 రోజులు జైలు శిక్ష, బెస్త శివకుమార్కు ఏడు రోజులు జైలు శిక్ష పడిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. -
న్యాయ సుధ పరీక్షలు ప్రారంభం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలోని శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు న్యాయ సుధ పరీక్షలు ప్రారంభించారు. శ్రీ మఠం ఉంజలా మండపంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, వ్యాసరాజ పీఠాఽధిపతి శ్రీవిద్యాశ్రీషాతీర్థులు దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు న్యాయ సుధ పరీక్షలు జరగనున్నాయి. మూల్యంకనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖ పండితులను పిలిపించారు. సంస్కృత విద్యార్థుల పరీక్షల ప్రతిభను లైవ్ వీడియో ద్వారా పదాల తప్పులను, ఒప్పులను గుర్తించి మూల్యంకనం చేస్తారన్నారు. మొదటి రోజు ముగ్గురు విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గిరిరాజాచార్, వేద పాఠశాల ప్రిన్సిపాల్ రమణ్రావ్, శ్రీ మన్యాయసుధ విద్యార్థులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి
ఉయ్యాలవాడ: కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని అల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నక్క చిన్న బాలగురప్పకు 50 గొర్రెలు ఉన్నాయి. వాటిని ప్రతి రోజు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం రాత్రి వాటిని గ్రామశివారులో ఉన్న రేకుల షెడ్లో రోజులాగానే ఉంచారు. బుధవారం ఉదయం షెడ్ దగ్గరికి వెళ్లి చూస్తే 20 గొర్రెలు మృత్యువాత పడి ఉన్నాయి. కుక్కల దాడితో జరిగిన ఈ ఘటన వల్ల సుమారు రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని ఉయ్యాలవాడ తహసీల్దార్ ప్రసాద్బాబును కలిసి విన్నవించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె.గురవయ్య ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులకు పీఎం సూర్యఘర్ స్కీం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించుకునే దిశగా అవగాహన కల్పించాలన్నారు. లో ఓల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని, ఓవర్ లోడ్ ఉంటే 11 కేవీ ఫీడర్లను విభజించి అదనపు ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేశ్వరరెడ్డి, శేషాద్రి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్నరాఘవులు, టౌన్ డీఈలు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అదృశ్యం బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైందని తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో విచారించినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
వడివడిగా.. శ్రీగిరి వైపు
నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తున్న భక్తులు కాలినడకన శ్రీగిరి చేరుకుంటున్న భక్తులుశ్రీశైలంటెంపుల్: ఇలకై లాసం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. క్షేత్ర సందర్శనకు భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. క్షేత్రానికి విచ్చేసిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుతీరారు. వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా తరలివస్తున్నారు. శివమాలధారణ చేసిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం ఉచిత, రూ.200, రూ.500, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు వేచి ఉండే ఉచిత కంపార్ట్మెంట్లలో తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలు నిండిపోయాయి. తరలివస్తున్న భక్తజనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు నల్లమల అటవీప్రాంతం నుంచి పాదయాత్రగా శ్రీగిరి చేరుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో ఈ పాదయాత్ర వెంకటాపురం నుంచి నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాస ద్వారం మీదుగా 40 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాగా భక్తుల శివనామస్మరణతో నల్లమల అటవీప్రాంతం మార్మోగుతోంది శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివమాల ధరించిన భక్తులకు దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో నాలుగు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసింది. అలాగే విడతల వారీగా జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే స్పర్శదర్శనాన్ని కల్పిస్తారు. జ్యోతిర్ముడి సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు శివమాలధారణ ఆచరించిన భక్తులకు జ్యోతిర్ముడి సమర్పించేందుకు పాతాళగంగ మార్గంలోని శివదీక్ష శిబిరాలలో జ్యోతిర్ముడి సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద శివస్వాములు సేదతీరేందుకు తాత్కాలిక వసతి, తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం -
21 నుంచి గాదిలింగేశ్వరస్వామి మహోత్సవాలు
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామంలో కొలువైన గాదిలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రాధాకృష్ణ, గ్రామపెద్దలు బుధవారం తెలిపారు. 22న గాదిలింగేశ్వర, సిద్ధేశ్వరస్వామి వార్ల జోడు రథోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు రథోత్సవ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 167పై బుధవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయాయి. మాధవరం నుంచి భరత్కుమార్ బైకుపై ఎమ్మిగనూరుకు వెళ్తుండగా.. గ్రామంలోని చర్చి వద్ద మాధవరం గ్రామానికి చెందిన కురువ ఈరన్న రోడ్డు దాటుతుండగా తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో భరత్కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది స్పందించి అంబులెన్స్లో ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్ పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా 20వ తేదీలోపు రిటర్న్స్ ఫైల్ చేయాలన్నారు. లావాదేవీలు లేకపోయినా నిల్ రిటర్న్స్ దాఖలు చేయడం మరువకూడదన్నారు. నకిలీ బిల్లులతో వ్యాపారం చేస్తూ పన్ను ఎగ్గొడుతున్న బోగస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మైనింగ్ లైసెన్సులు ఇచ్చే ముందే రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. బకాయిలు ఉన్న వారి ఆస్తులు బదిలీ జగరకుండా రిజిస్ట్రేషన్ శాఖ, నిధుల రికవరీకి బ్యాంకర్లు కమర్షియల్ ట్యాక్స్ శాఖ తగిన సహకారం అందించాలన్నారు. జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందుతుందో లేదో లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కమర్షికల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ మాట్లాడుతూ పన్ను వసూళ్లు, బకాయిలు తదితర అంశాలను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై విచారణ
జూపాడుబంగ్లా: కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు కడుమూరు రవిపై డిప్యూటీ డీఈఓ శంకర్ప్రసాద్ విచారణ చేపట్టారు. ‘విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై నంద్యాల డీఈఓ జనార్ధన్రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఈఓ మంగళవారం ఉదయం 10 గంటల్లోగా కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని జూపాడుబంగ్లా ఎంఈఓ–1 చిన్నమద్దిలేటితో కలిసి విచారణ చేపట్టారు. పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరాతీశారు. పలువురు విద్యార్థినులు కడుమూరు రవి ప్రవర్తన తీరును వివరించటంతో పాటు లిఖితపూర్వకంగా డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలకు తెలియజేశారు. ఇందుకు మొదటి తప్పుగా భావించి తనను క్షమించాలని లిఖితపూర్వకంగా తెలియజేసి క్షమాపణలు కోరినట్లు ఎంఈఓ చిన్నమద్దిలేటి తెలిపారు. కాగా విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు. తప్పిపోయిన బాలుడి అప్పగింత ఆత్మకూరురూరల్: బేతంచెర్ల మండలం పేరాయ పల్లె గ్రామానికి చెందిన పది సంవత్సరాల బా లుడు తన అమ్మమ్మతో కలసి శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున భీముని కొలను దగ్గర తన అమ్మమ్మ నుంచి విడిపో యి తప్పిపోయాడు. స్థానికంగా విధినిర్వహణలో ఉన్న అటవీ సిబ్బంది బాలుడిని గుర్తించారు. అయి తే పేరు చెప్పడానికి కూడా భయపడుతున్న ఈ బాలుడిని చివరకు అతి కష్టం మీద అతని అమ్మమ్మ నాగలక్ష్మి వద్దకు చేర్చారు అటవీ సిబ్బంది. -
ఫుడ్ బాస్కెట్తో సురక్షిత ఆహారం
కర్నూలు (అగ్రికల్చర్): ఫుడ్ బాస్కెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల్లో పండించిన సురక్షిత ఆహారం అందించేందుకు తగి న చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.వి.రమణారెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో సెర్ఫ్, ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ స్థాపనపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫుడ్ బాస్కెట్ ద్వారా ప్రతి కుటుంబానికి నిరంతరం పోషకాలతో కూడిన సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామ సంఘాల ప్రతినిధులు ఫుడ్ బాస్కెట్పై పొదుపు మహిళలకు సమగ్ర అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి గ్రామానికి రూ.లక్షతో ఫుడ్ బాస్కెట్ నిధి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ కోఆర్డినేటర్ అరుణ, జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ మాధురి, డీపీఎం నరసమ్మ, వివిధ మండలాల సీసీలు, ఆర్వైఎస్ఎస్ సిబ్బంది, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
అరె..తెల్లకాకి
సాధారణంగా కాకులు నలుపురంగులో ఉంటాయి. అయితే, మండలంలోని సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం తెల్ల కాకి కనిపించింది. స్థానిక మారెమ్మవ్వ దేవాలయం వద్ద తోటి నల్ల కాకుల మధ్య గింజలను తింటుండగా గ్రామస్తులు మొదట పావురమనుకున్నారు. తర్వాత తెల్ల కాకి అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా సెల్ఫోన్లో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో అరుదుగా తెల్ల కాకులు ప్రత్యక్షమవుతుంటాయి. తెలుపు రంగులో ఉండటానికి జన్యుపరమైన మార్పు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. – ఆదోని రూరల్ విద్యుత్ తీగపై కూర్చున్న తెల్ల కాకి -
ఆకలి తీరుస్తూ..సేవలో తరిస్తూ!
● పాదయాత్ర భక్తుల సేవలో దాతలు ● నల్లమలలో పలుచోట్ల అన్నదాన శిబిరాలు ● ప్రతి రోజు లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ ఆత్మకూరు: శ్రీశైలమహాక్షేత్రంలో 1994లో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మాల ధారణ చేసిన శివస్వాములు వారి గ్రామాలనుంచి పాదయాత్రగా బయల్దేరి శ్రీగిరికి చేరుకునేవారు. మార్గమధ్యంలో ఆకలిదప్పులతో ఇబ్బంది పడేవారు. నాడు దీనిని గుర్తించిన కొందరు శివస్వాములు అన్నదాన శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలోకి దాతలు వచ్చారు. ఏటా శివరాత్రి, ఉగాది మహోత్సవాలకు కాలినడకన వెళ్లే భక్తులకు నల్లమలలోని ప్రధాన కూడళ్లలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవలో తరిస్తున్నారు. ● వెంకటాపురంలో 28 ఏళ్లుగా.. శివస్వాముల పాదయాత్ర ప్రారంభమయ్యే వెంకటాపురం గ్రామంలో శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సంతృప్తిగా భోజనం వడ్డించి వారి మన్ననలు పొందుతున్నారు. ● ఏటా లక్షమందికి భిక్ష నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద పెద్దదేవులాపురం గ్రామానికి చెందిన బాలవెంకటరెడ్డి అనే శివస్వామి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. 31 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి కొనసాగిస్తున్నారు. ఏటా దాదాపు లక్షమందికి పైగానే ఇక్కడ భిక్ష స్వీకరిస్తున్నారు. ● పెచ్చెర్వు, దామర్లకుంటలో.. పెచ్చెర్వు, దామర్లకుంట ఫారెస్ట్ క్యాంపుల వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటనారపురెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ సహకారంతో 6 సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాల సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 లక్షల మందికి పైగా భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 24 గంటల వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పెచ్చెర్వు వద్ద గూడూరుకు చెందిన శ్రీవీరభద్రస్వామి దేవస్థాన అన్నదాన కమిటీ నిర్వాహకులు 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ● కై లాసద్వారం వద్ద.... పత్తికొండకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, శివభక్తుడు అయిన మురళీధర్రెడ్డి 25 సంవత్సరాలుగా కై లాసద్వారం వద్ద అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. కాలినడకన కై లాసద్వారం చేరుకున్న భక్తులు ఇక్కడ భిక్ష స్వీకరించి శ్రీశైలమహాక్షేత్రానికి చేరుకుంటారు. అన్నం పర బ్రహ్మస్వరూపం. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అంటారు. ఇలాంటి మహత్తర కార్యక్రమం శ్రీశైల మహాక్షేత్రంలో 400 సంవత్సరాల కిత్రమే ప్రారంభమైందని చెబుతారు. నాటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పలువురు దాతలు సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి కాలినడకన వస్తున్న భక్తులకు మార్గమధ్యంలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆకలి తీరుస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ శిబిరాలను విరివిగా నిర్వహిస్తూ శ్రీశైలేశుడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. -
● అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ నాయకులు ● స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు ● పట్టించుకోని అధికారులు
దౌర్జన్యంగా కబ్జాల పర్వం సాక్షి టాస్క్ఫోర్స్: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా తమను ఎవరూ ఏమీ అనబోరని టీడీపీ నాయకులు బరితెగించారు. కోడుమూరులోని సర్వే నంబర్ 103లో ఉన్న రస్తా పరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ దర్జాగా కబ్జా చేసి షాపు నిర్మాణాన్ని చేపట్టాడు. గత నాలుగైదు రోజుల నుంచి స్థలాన్ని కబ్జా చేసి షాపు నిర్మాణం చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోడు మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిన్నబోయ వీధి లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రధాన రోడ్డు వెంట రస్తా పరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలం కోట్లాది రూపాయల విలువ పలుకుతోంది. అయితే అధికారులు స్థలాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచులిద్దరితో పాటు మరికొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఇప్పటికే కొందరు వ్యక్తులు పరంబోకు స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు తాత్కలిక నిర్మాణాలు చేపట్టారు. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. గతంలో రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు రస్తా పరంబోకు స్థలాన్ని సర్వే చేసి కబ్జాకు పాల్పడిన వారికి నోటీసులు సైతం జారీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రస్తా స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు వ్యక్తులు ఏకంగా దుకాణాలను నిర్మించి అద్దెలకు సైతం ఇచ్చారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కబ్జాకు గురవుతున్నా రస్తా పరంబోకు స్థలాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిలేసుడి మండల పరిధిలోని నక్కలదిన్నెకు రావడంతో ఆ గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. ఉత్సవమూర్తులైన శ్రీజ్వాలానరసింహ్మస్వామి, శ్రీప్రహ్లదవరద స్వామి పల్లకీ మంగళవారం గ్రామానికి చేరుకోగానే ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు. తర్వాత పల్లకీ గ్రామ తెలుపులపై కొలువుదీరగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. ఉద్యాన పంటల సాగు పెంపుపై దృష్టి కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటల సాగును వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేరిట రూపొందించిన యాక్షన్ ప్లాన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాను కూడా చేర్చారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 70 వేలు, నంద్యాల జిల్లాలో 48 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు ఉంది. కర్నూలు జిల్లాలో వచ్చే మాడేళ్లలో 60 వేలు, నంద్యాల జిల్లాలో 45 వేల హెక్టార్లలో అదనంగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. నీటిపారుదల శాఖ, ఏపీఎంఐపీ అనుసంధానంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇదిలాఉంటే 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25, 2025–26లో ఉద్యానశాఖ బడ్జెట్ గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎంఐడీహెచ్, ఆర్కేవీవై పథకాలు అమలులో ఉన్నాయి. వీటి కింద ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా విడుదల కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏవిధంగా పట్టాలెక్కుతుందనేది ప్రశ్నార్థకం. 17 నుంచి జిల్లా స్థాయి శాప్ లీగ్ పోటీలునంద్యాల: ఈనెల 17 నుంచి జిల్లా స్థాయిలో శాప్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు తెలిపారు. మంగళవారం ఆయన శాప్ లీగ్స్ స్పోర్ట్స్–2026 క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో 31 ప్రాధాన్యత గల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తామన్నారు. బాక్సింగ్, చదరంగం, అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, లాంగ్ టెన్నిస్, సాఫ్ట్ టెన్నీస్, ఆర్చరీ, బీచ్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఈత, ఫుట్బాల్, బీచ్ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్మాస్టిక్స్, బీచ్ కబడ్డీ, బ్యాట్మింటన్, జూడో, హాకీ, ఖోఖో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో చెస్ పోటీలు 17వ తేదీన, సైక్లింగ్ పోటీలు 24వ తేదీన నంద్యాలలోని ఇండోర్ స్టేడియం జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 21, 22 తేదీల్లో తిరుపతిలో, 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు విజయవాడలో జరుగుతాయని వెల్లడించారు. ఈ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో వ్యక్తిగత వివరాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్ : 87126 22576 నంబరును సంప్రదించాలన్నారు. 5 గ్యాస్ సిలిండర్ల సీజ్ కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంటీన్లో వినియోగిస్తున్న 5 డొమెస్టిక్ సిలిండర్లను డీఎస్ఓ రాజారఘువీర్ ఆధ్వర్యంలోని బృందం సీజ్ చేసింది. క్యాంటీన్లలో కమర్షియల్ సిలిండర్లను వినియోగించాల్సిన సందర్భంలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించడం నేరమని, అందుకే సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ వివరించారు. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి ఆదోని అర్బన్: ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పెద్దహరివానం గ్రామంలో ఈసంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గజ్జహళ్లి గ్రామానికి చెందిన బొజ్జప్ప(58)పెద్దహరివానంలో నివసిస్తున్నాడు. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కంకర తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య నాగవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ పోలీసులు తెలిపారు. -
మెడికల్ కౌన్సిల్ మెంబర్గా శ్రీహరి ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్) ఎన్నికల్లో సభ్యుడిగా కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 84 మంది నమోదిత వైద్యులు అభ్యర్థులుగా పోటీ చేయగా, ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు ఆన్లైన్ విధానంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి కేవీఎన్. చక్రధర్బాబు మంగళవారం ప్రకటించారు. హెచ్ఆర్డీఏ ప్యానెల్ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 9 మంది ఘన విజయం సాధించారు. అందులో కర్నూలు జిల్లా వాసి డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య మండలిని బలోపేతం చేయడానికి, వైద్యుల గౌరవం, స్వాభిమానాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. -
పాదయాత్రికుడికి అస్వస్థత
ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న అనంతరపురానికి చెందిన శివభక్తుడు రమేష్ భీముని కొలను వద్ద తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీశైలం రేంచ్ అటవీ సిబ్బంది వెంటనే డోలీ కట్టి అందులో కై లాస ద్వారం వద్ద ఉన్న మెడికల్ క్యాంపునకు తరలించారు. వైద్య శిబ్బంది అత్యవసర చికిత్స అందించడంతో కొద్ది సేపటికి కోలుకున్నాడు. అస్వస్థతకు గురైన వ్యక్తిని కొండకోనల్లో మోసుకుని వైద్య శిబిరానికి చేర్చిన అటవీ సిబ్బందిని పాదయాత్రికులు అభినందించారు. హెచ్ఐవీ బాధితులపై వివక్ష తగదు కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐబీ బాధితుల పట్ల వివక్ష తగదని ఏపీ శాక్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆయన మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్, ఐసీటీసీ, మైక్రోబయాలజీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు చేసే విధానం, నెలవారీ రిపోర్ట్లు, హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, మందులు, వైద్యసేవలు, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా అన్ని ప్రాంతాల వారికి సమానంగా మందులు ఇవ్వాలని సూచించారు. సకాలంలో రిపోర్టులను ఆన్లైన్లో నమోదు చేయాలని, సిబ్బంది వారి పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్లు అలీ హైదర్, దేవిశంకర్గౌడ్ ఉన్నారు. -
తుది ఎంపిక జాబితా విడుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యా న్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఫిజిసిస్ట్, ఓటీ అసిస్టెంట్, అనెస్తీషియా టెక్నీషియన్ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా ఫేస్–2 విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 29న జారీ చేసిన నియామక నోటిఫికేషన్ 01/2024కు సంబంధించి ఈ పోస్టులను 1:2 రేషియో పద్ధతిన లిస్ట్ తయారైందన్నారు. జాబితా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్స్, కర్నూలు మెడికల్ కాలేజి వెబ్సైట్లలో (https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in, https://kurnoolmedicalcollege.ac.in) అప్లోడ్ చేశామన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, నకలుతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజీ కార్యాలయంలో వెరిఫికేషన్కు హాజరుకావాలని పేర్కొన్నారు. ముగిసిన ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గత నెల 27వ తేది నుంచి వొకేషనల్ ప్రాక్టికల్, ఈ నెల 1వ తేది నుంచి జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజున 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహించగా 1,184 మందిలో 1,074 మంది పరీక్షకు హాజరయ్యారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,08,37,571 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు. అందులో నగదు రూపేణా రూ.2.98,13,571, నాణేలా రూపంలో రూ.10,24,000 వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 13 గ్రాముల బంగారం, 1080 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు మేనేజర్–2 వెంటేష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు. పెద్దకడబూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడి రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. మంగళవారం ఆమె పెద్దకడబూరు మండల కేంద్రంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గ్రామంలోని 1వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోగులు కూర్చోవడానికి సరైన వసతులు లేకపోవడం, వేస్ట్(చెత్త) ఎక్కడ పడితే అక్కడ వేయడం, రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎంపీడీఓ ప్రభావతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్కుమార్, డీఎస్ఓ రఘువీర్, అధికారులు పాల్గొన్నారు. -
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
మంత్రాలయం రూరల్ : శ్రీశైలంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు శివమాల ధిరించి ఇరుముడితో వస్తుంటారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగిపోయిందన్నారు. అటవీశాఖ, దేవస్థానం అధికారులు ముందుగానే చర్చించి ఈ నెల1వ తేదీ నుంచి శివస్వాములకు అనుమతి ఇచ్చింటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. ఇటీవల ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీటీడీ తరహాలో క్యూలైన్లలో ఉండే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తిరుమల, శ్రీశైలంలో కల్తీ లడ్డూ అంటూ దుష్ప్రచారం చేస్తున్న ‘కూటమి’ నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వై. బాలనాగిరెడ్డి -
దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డూ పై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాల చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆలూరు లోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ సిట్ అధికారులు, సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మారలేదన్నారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందనే అబద్ధాన్ని నిజం చేయాలని తపనపడడం ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలసి కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేలిపోవడంతో తాజాగా శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో సైతం కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామాకు తెలేపారన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించకపోవడం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు. -
ఇకపై డ్రోన్ పెట్రోలింగ్
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఇప్పటివరకు రాత్రి, పగలు ఆయా స్టేషన్ల పరిధిలో క్యూఆర్టీ, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మరో మూడు డ్రోన్ కెమెరాలను జిల్లాకు ఆ శాఖ ఉన్నతాధికారులు కేటాయించడంతో వీటి సేవలను పెట్రోలింగ్కు వినియోగించనున్నారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన మూడు డ్రోన్ కెమెరాలతో పాటు దాతలు రెండు డ్రోన్ కెమెరాలను సమకూర్చారు. తాజాగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ ఆఫీస్) నుంచి మరో మూడు నూతన డ్రోన్ కెమెరాలను కేటాయించగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో పోలీసు శాఖకు సాంకేతికత మరింత దోహదపడుతోంది. ఇందులో భాగంగా కొంతకాలంగా డ్రోన్ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. -
ఇల కై లాసం.. బ్రహ్మోత్సవ శోభితం
● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివన్మామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధనార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. మంగళవాయిద్యాలు మారుమోగగా, భక్తుల శివన్మామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం పరివార దేవతామూర్తులకు ప్రత్యేక కర్పూర నీరాజనాలు సమర్పించి గ్రామోత్సవాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూరవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం మయూరవాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
నీచ రాజకీయాలు మానుకో
చంద్రబాబూ.. దేవుళ్ల పేరుతో కర్నూలు(టౌన్): రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవుళ్ల పేరుతో చేస్తున్న నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హితవు చెప్పారు. కర్నూలులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై చంద్రబాబు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. సీబీఐ నిగ్గుతేల్చినా ఇంకా జంతువుల కొవ్వు, పందికొవ్వు, ఫిష్ నూనె అంటూ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తిరుమల లడ్డూపై అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు శ్రీశైల శైవక్షేత్రం మల్లన్న ఆలయంలో టాయ్లెట్లు క్లీన్చేసే కెమికల్స్ వాడినట్లు చంద్రబాబునాయుడు చెప్పడం దారుణమన్నారు. ‘తిరుమల లడ్డూ, శ్రీశైలం లడ్డూ తిన్న భక్తులు ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారు? అలాంటి కెమికల్స్ కలిపితే చనిపోతారు కదా.. ఎంతమంది చనిపోయారు. కనీస జ్ఞానం లేకుండా హిందువులను అవమానించడం ఏమిటి? ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని పదేపదే చెప్పడం చంద్రబాబు నైజం. 2024 జూన్ 21 నుంచి 25 వరకు నెయ్యి ట్యాంకర్లు తెప్పించింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. జూలైలో 6వ తేదీ, 12వ తేదీన ట్యాంకర్లు వచ్చాయి. అనుమతులిచ్చింది మీ హయంలోనా.. జగనన్న హయంలోనా? వయసు రీత్యా చంద్రబాబుకు మతిమరపు వచ్చింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, రెండురోజుల కిందట శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జీ వంటి ఘటనలు ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. విజయవాడలో రహదారుల విస్తరణ పేరుతో 40 ఆలయాలను కూల్చేసిన ఘనత చంద్రబాబుదే. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలకు అర్థమైంది పవిత్ర తిరుమల, శ్రీశైలం ప్రసాదాలపై ఆరోపణలు సిగ్గుచేటు రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్భగవత్ ఎందుకు స్పందించడం లేదో చంద్రబాబుకు అర్థం కావడం లేదా? వాస్తవాలు తెలుసు కాబట్టే వారు నోరు మెదపడం లేదు. ఇదంతా మంత్రి లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలనే చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీకి, జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపైన, విద్యుత్ చార్జీల పెంపుపైన, రైతన్నను ఆదుకోవాలంటూ చేపట్టిన ప్రజా ఉద్యమాలతో చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలతో మమేకమైన వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టా లనే ఉద్దేశంతో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికి అర్థమైందని ఆయన చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులుయాదవ్, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు కృష్ణకాంత్రెడ్డి, షాషావలీ, పత్తాబాషా, రాజశేఖర్ పాల్గొన్నారు. -
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కోర్టు తీర్పులను సైతం ధిక్కరిస్తూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రతీసారి విఫలమవుతోంది. ఇప్పటికే తిర
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయిన దేవస్థానం అధికారులు సోమవారం చేతులెత్తేశారు. గంటల తరబడి క్యూలైన్లలోనే.. వీఐపీల సేవలో తరలించిన దేవస్థానం అధికారులు శివస్వాములు, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించినట్లు సోమవారం చోటు చేసుకున్న ఘటనలతో వెల్లడైంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండ వేడిని తట్టుకోలేక భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో వైఫల్యం వేలాదిగా తరలివచ్చిన భక్తులు వందల కిలోమీటర్ల దూరం కాలినడక యాత్ర ఇరుముడితో శ్రీశైలం చేరుకున్న స్వాములు దర్శన ఏర్పాట్లలో చేతులెత్తేసిన అధికార యంత్రాంగం గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు విధిలేక దర్శనం చేసుకోకుండానే తిరుగుముఖం -
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు మోసపూరిత మాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్ఫాతిమా తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి జిల్లాలోని దివ్యాంగులు ఎవరూ మోసపోవద్దని ఆమె సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మూడు చక్రాల వాహనాల(స్కూటీ) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరైన వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలోనే నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ 08518 – 277864 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్వ డీఎంహెచ్ఓకు పెన్షన్ నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా పూర్వ డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్కు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్తో పాటు గ్రాట్యూటీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2017 జూన్ 3వ తేదీన ఆదోనిలోని ఆదిత్య నర్సింగ్ హోమ్, స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ఈమె రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా అప్పట్లో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కోర్టు ఒక సంవత్సరం జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. తాజాగా ప్రభుత్వం ఆమెకు వచ్చే పెన్షన్ను నిలిపివేయడమే కాకుండా గ్రాట్యూటీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి బిల్లింగ్, పోల్స్ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఇ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నెల 27న మొదలైన వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మూడు స్పెల్స్లో నిర్వహించారు. ఈ నెల 1వ తేది నుంచి మొదలైన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు స్పెల్స్లో నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1,566 మందిల్లో 1546 మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,341 మందిలో 1,321 మంది హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. -
వెట్టి చాకిరీ చట్టరీత్యా నేరం
కర్నూలు: వెట్టి చాకిరీ చట్ట రీత్యా నేరమని, బాండెడ్ లేబర్తో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై మూడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్ష, రూ.50 వేలు జరిమానా తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవా సదన్లో బాండెడ్ లేబర్ నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రితో పాటు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ఎవరైనా బాండెడ్ లేబర్ కింద పనిచేయించుకుంటే లేదా వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు మాట్లాడుతూ ఆర్టికల్ 23, భారతీయ శిక్షా స్మృతి 370, 370ఎ, 374 గురించి తెలియజేశారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఎస్ఏఆర్డీఎస్ ఎన్జీఓ దామోదర్ రెడ్డి, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్జీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. ఇది మహాపాపం!
● శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి ● మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: తమ రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రకటనలు ఇస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా పాపం చేశారని, శ్రీవారి భక్తులకు వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి సీఎం చంద్రబాబు చేసింది ఘోర అపచారం అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే దుష్ప్రచారానికి పాల్పడ్డారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు అంబటి రాంబాబు పై దాడి పాల్పడి అక్రమ అరెస్టులతో తెరలేపారన్నారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేలిందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో వేసిన నిందలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరుమల ఆలయానికి తెచ్చిన అప్రతిష్టకు ఏ మూల్యం చెల్లిస్తారన్నారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు చివరకు దేవుడినీ వదలబోరని తిరుమల లడ్డూ వ్యవహారంలో రుజువైందన్నారు. శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబునాయుడు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా భృంగి వాహనాన్ని పలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు నారికేళాలు సమర్పించారు. పరి వార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం వెలుపలకి తోడ్కొనివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు భక్తుల శివన్మామస్మరణతో పరమేశ్వరుడి పరమ భక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్య మంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన.. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ ఢోల్ థాషా, మహిళా, పురుషుల వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శనలు అలరించాయి. కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, తప్పె ట చిందు, బీరప్పడోలు, నందికోలసేవ భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీశైలంలో నేడు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భృంగివాహనంపై ఆదిదంపతుల విహారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తరించిన భక్తజనం శ్రీగిరిలో వైభవంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు హంసవాహన సేవలో స్వామిఅమ్మవార్ల దర్శనం -
అంగన్వాడీ స్థలం కబ్జా
● అలువాలలో టీడీపీ నాయకుడి దౌర్జన్యం ● చోద్యం చూస్తున్న అధికారులు ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రజలు గోనెగండ్ల: టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పరాకాష్టకు చేరుతున్నాయి. వారి ఆక్రమణకు పంట పొలాలు, ఇళ్ల స్థలాలు, చెరువుల స్థలాలు సరిపోవడం లేదు. ఏకంగా ప్రభుత్వ భవనానికి కేటాయించిన స్థలాన్నే కబ్జా చేశారు. గోనెగండ్ల అలువాల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అంగన్వాడీ భవనానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా పిల్లర్లు వేశాడు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో గ్రామస్తులతో కలిసి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. గడ్డి వాములు వేసి ఆక్రమణ అలువాల గ్రామంలోని 160 సర్వేలో 25 సెంట్ల వాగు పరంబోకు భూమి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ స్థలంలో ఆర్బీకే, హెల్త్సెంటర్ను నిర్మించారు. అంగన్వాడీ భవనం కోసం 8 సెంట్ల స్థలం కేటాయించారు. ఆ స్థలంపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎస్. ఖాసీం సాహెబ్ కన్నువేశాడు. అదే స్థలంలో ముందుగా గడ్డి వాములు వేశాడు. అంతటితో ఆగకుండా పశువులు లేకున్నా గోకులంషెడ్ నిర్మాణానికి మంజూరు చేయించుకున్నాడు. నోటీసులు ఇచ్చినా.. గోకులం షెడ్ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఎంపీడీఓ క్యాన్సల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. గ్రామస్తులు కోర్టులో కేసు వేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలి అధికారులు నోటీసులు ఇచ్చినా, స్థలం కోర్టు పరిధిలో ఉన్నా టీడీపీ నాయకుడు ఎవరినీ లెక్కచేయకుండా రాత్రికి రాత్రే పిల్లరు వేశారని వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, అలువాల గ్రామస్తులు తెలిపారు. స్థలం విలువ రూ.24 లక్షలు ఉంటుందని, వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. గ్రామస్తులు భాస్కర్ రెడ్డి, రాముడు, మునిస్వామి, రంజాన్ పాల్గొన్నారు. -
డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం
ఆదోని అర్బన్: ఆదోని ఎస్కేడీ కాలనీలో డీఎస్పీ కార్యాలయం పక్కన నివాసముంటున్న ఇల్లులో దొంగలు చోరీ యత్నం చేశారు. ఇంట్లో నివాసం ఉంటున్న కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గత గురువారం రోజున పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దొంగలు ఆదివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టారు. మెయిన్ ద్వారం రాకపోవడంతో మెల్లగా జారుకున్నారు. చుట్టుపక్కల వారు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందజేశారు. డీఎస్పీ కార్యాలయం పక్కనే దొంగలు పడితే ఇతర ప్రాంతాల్లో భద్రత ఉంటుందా అనే ఆందోళన ఆదోని ప్రజల్లో నెలకొంది. ఐదేళ్లకే నూరేళ్లు ● రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ప్యాపిలి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై వెంగళాంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అనంతపురం పట్టణం సిండికేట్ నగర్కు చెందిన ధనుంజయ, చంద్రకళ దంపతులతో పాటు ధనుంజయ సోదరి యమున, ఆమె పిల్లలు లాస్యశ్రీ, శశాంక్(5)తో కలసి సొంత కారులో హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి అనంతపురం పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యలో వెంగళాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో నుంచి శశాంక్ ఎగిరి కింద పడటంతో తలకు బలమైన గాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. ధనుంజయ, చంద్రకళ, యమున లాస్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతి మద్దికెర: పెరవలి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పరమేశ్వరమ్మ (110) సోమవారం మృతిచెందారు. ఈమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వందేళ్ల వయస్సులోనూ తన తల్లి చాలా ఽఆరోగ్యంగా ఉండేవారని, తన పనులు తనే సొంతంగా చేసుకునేవారని కుమారుడు రామిరెడ్డి తెలిపారు. మృతిచెందే ముందు రోజు మాత్రం అన్నం తినలేకపోయారని చెప్పారు. తాను చిన్నతనంలో ఉన్న సమయంలో పెరవలికి మహాత్మాగాంధీ వచ్చారని తాను చూశానని అమ్మ చెప్పేవారని గుర్తు చేశారు. పాదయాత్ర మార్గంలో నిషేధిత వస్తువులు సీజ్ ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుల నుంచి పలు నిషేధిత వస్తువులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. నాగలూటి వద్ద ఏర్పాటు చేసిన చెక పోస్టులో యాత్రికుల బ్యాగ్లను తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అనుమతించడం లేదు. చివరకు బిస్కెట్ ప్యాకెట్ కవర్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. కవర్లు తీ సేసి, పేపర్లలో పెట్టి పంపుతున్నారు. రెండు లీటర్లు పైబడిన నీళ్ల బాటిళ్లకు అనుమతి ఇస్తున్నారు. పలువురు యాత్రికుల నుంచి గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం మంత్రాలయం రూరల్: ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మేకల రాఘవేంద్ర(22) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చెట్నెహళ్ళి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. చెట్నెహాళ్లి గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిలో ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోర్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాఘవేంద్రకు భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు
● మూడు కేజీల గంజాయి స్వాధీనంబేతంచెర్ల: పట్టణ శివారులో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు సీఐ వెంటేశ్వరరావు తెలిపారు. సీఐ వివరాల మేరకు బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీలోని పొదలలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నంద్యాల టౌన్కు చెందిన చాకలి మనోజ్ కుమార్, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన వడ్డె రత్న కుమార్, బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామన్న గంజాయితో పట్టుబడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ మారుతి, వీఆర్వోలు సురేంద్ర బాబు, విజయలక్ష్మి సమక్షంలో వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని వారి వద్ద మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో వీరికి గంజాయి సరఫరా చేసిన నంద్యాల టౌన్ చెందిన మహబూబ్ బాషా ఆలియాస్ ( మరాఠి) పరారీలో ఉన్నాడని, అతని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశామన్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది గిరి, గురుబాబు, రాజు నాయక్, సూర్య రామరాజు, శ్రీనివాస్, వెంకటేష్లను సీఐ అభినందించారు. -
బంగారు పల్లకీలో దివ్యతేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు వైభవంగా విహరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు భారీగా వచ్చారు. తొలుత తుంగభద్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందవనాన్ని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మహా మంగళహారతులు చేశారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతుల కాన్ఫరెన్స్ కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రాకూడదని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో.. కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 9వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీఎం చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి ‘ఫార్మాటివ్’ పరీక్షలు కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి(సోమవారం)నుంచి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు(ఫార్మాటివ్ అసెస్మెంట్)–4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వేర్వేరు సమయాల్లో 6, 7, 8, 9 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు ఫ్రీపైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు 2.70 లక్షల మంది హాజరుకానున్నారు. వణికిస్తున్న చలి కర్నూలు(అగ్రికల్చర్): రాత్రి సమయంలో ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యేవి. ప్రస్తుతం 19.2 డిగ్రీల వరకే పరిమితం అయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చలి ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ప్రాక్టికల్ పరీక్షలకు 103 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఆదివారం 103 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఉదయం 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగగా 2,803 మందికిగాను 2,721 మంది హాజరై 82 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 54 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,989 మందికిగాను 1968 మంది హాజరుకాగా, 21 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. పనుల్లేక వలసబాట కోసిగి: పనుల్లేక ఆర్లబండ గ్రామం నుంచి ఆదివారం 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఇళ్లకు తాళాలు వేసి లారీలో పిల్లపాపలతో కలిసి గుంటూరుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి పనులు లేక పోవడంతో వలస వెళ్తున్నామని చెప్పారు. పిల్లలను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరులో నెలన్నర రోజుల పాటు పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు. -
శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మల్లన్న సమేత భ్రమరాంబ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు అందాయి. ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల ఆలయ చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు, వేదపండితులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు వస్త్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. -
దశమ భాగం దేవుడి సొమ్ము
● బిషప్లు సంతోష్ ప్రసన్నరావు, ఐజక్ వరప్రసాదరావు ప్రార్థనలకు హాజరైన క్రైస్తవులుప్రదక్షిణలో పాల్గొన్న బిషప్లునంద్యాల(న్యూటౌన్): ప్రతి వ్యక్తి సంపాదనలో దశమ భాగం దేవుని సొత్తు అని, దశమ భాగం చెల్లిస్తే దేవుని మెండైన దీవెనలు లభించి వృద్ధి చెందు తారని నంద్యాల డయాసిస్ అధ్యక్షుడు ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు, రాయలసీమ డయాసిస్ పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాదరావు అన్నారు. ఆదివారం పట్టణంలో అతి పురాతన దేవాలయం హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి 121వ ప్రతిష్టోత్సవం, హోలీ క్రాస్ సెయింటనరీ చర్చి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఏటా చేపట్టే కోతపండుగ (కృతజ్ఞతార్పణల) వేడుకలను చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు చర్చీల అభివృద్ధికి ఐమత్యతంతో ముందుకు వెళ్లినప్పుడూ అభివృద్ధి సాధింస్తారన్నారు. ఉదయం 7 గంలకు సెయింటినరీ చర్చి ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి డీనరీ చైర్మన్ కొత్తమాసి జోసెఫ్ మాట్లాడుతూ క్రైస్తవులు ఐకమత్యంతో ఉండి ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏసుక్రీస్తు మానవాళికి లోకరక్ష కుడై జన్మించారన్నారు. ఆయన ఆశయాలనే పాటి స్తూ క్రైస్తవులు దినదిన అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు, డీనరీ చైర్మన్లు నందం ఐజక్, గురువులు పాస్టర్ రాజు, డీనరీ చైర్మన్లు, గురువు లు, డయాసిస్ సెక్రటరీ ప్రభుదాసు, నంద్యాల డయాసిస్ సభ్యులు పాల్గొన్నారు. -
పనుల్లో నిర్లక్ష్యం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. పనులు గడువులోగా పూర్తి కాలేదు. ఓ వైపు ఉత్సవాలు ప్రారంభమైనా ఇంకా పనులు కొనసాగు తున్నాయి. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఉభయ దేవాలయాల్లో పెయింటింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో ముగ్గులకు పెయింటింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి. అలాగే శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జర్మన్ షెడ్ల ఇంకా పూర్తి కాలేదు. క్యూలైన్ల ప్రవేశ మార్గాల వద్ద ఇనుప మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా ఏర్పాటు చేయలేదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికి ఏర్పాట్లు కొనసాగుతుండడంపై..ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఊరూరా బెల్ట్ షాపులు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్హొళగుంద: చంద్రబాబు ప్రభుత్వంలో ఊరూరా బెల్ట్ షాపులు వెలిశాయని, మద్యం మత్తులో పేద ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ అన్నారు. హొళగుందలో పార్టీ నాయకులతో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ తేల్చడంతో టీడీపీ నేతలకు బాధ ఎక్కువ అయ్యిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని వదిలి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. వేదావతి ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని, ఎల్లెల్సీకి తాగునీరు వదలాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ.. హొళగుంద–ఢణాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, నాయకులు వెంకటేష్, తావాఫ్ పాల్గొన్నారు. -
ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని జేఏసీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, దస్తగిరి నాయుడు, వీరేష్, రఘురామయ్య పిలుపునిచ్చారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 85వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్థానిక నాయకులు ఎన్.మల్లికార్జున, ఎస్.కుమార్, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, ఎం.నాగరాజ్, ఎం.విజయ్, జగదీష్, కిరణ్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక కీలకమైన పట్టణంగా, చారిత్రక, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కలిగిన ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆదోనిలో వేలాది పరిశ్రమలు ఉన్నాయన్నారు. జిల్లా అయితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. గుండెపోటుతో విద్యుత్శాఖ ఈఈ మృతి ఆదోని అర్బన్: గుండెపోటుతో ఆదోని డివిజన్ విద్యుత్శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్ ఆదివారం మృతిచెందారు. ఈయన ఐదు నెలల క్రితం కడప నుంచి ఆదోని కి బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈఈగా పదోన్నతి పొందారు. ఆదివారం ఉదయం స్వగృహంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం వెంటనే 8వ వేతసంఘాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దాపోస్టాఫీసులో అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్అండ్ ఎంటీఎస్ యూనియన్ కర్నూలు డివిజన్ సంయుక్త ద్వైవార్షిక సమాశాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం బిహార్ ఎన్నికల కోసం హడావుడిగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా...ఎన్నికలు ముగియగానే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని జీడీఎస్లు, పెన్షర్ ఉద్యోగుల కోసం వేతన సంఘంలోకి తీసుకొని అమలు చేసేలా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెకు యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కె.మురళీ, వై.మర్రెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. మారథాన్లో కర్నూలు యువకుడి ప్రతిభ కర్నూలు(సెంట్రల్): ఆరోవిల్లే అంతర్జాతీయ మారథాన్లో కర్నూలుకు చెందిన గంగాధర్ తన ప్రతిభ చూపారు. కఠినమైన 42 కిలోమీటర్ల ఆరోవిల్లే మారథాన్ను 4.40 గంటలకు పూర్తి చేసి మెడల్ అందుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సమీపంలోని ఆరోవిల్లేలో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. గతంలో కూడా గంగాధర్ హైదరాబాద్, వైజాగ్, 2025 సెప్టెంబర్లో కేంద్రపాలిత ప్రాంతం లడక్లోని హిమాలయ పర్వతాల్లో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసి మెడల్ సాధించారు. గల్లంతైన వ్యక్తి మృతి నంద్యాల(అర్బన్): మూడు రోజుల క్రితం కేసీ కెనాల్లో గల్లంతైన నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(43) మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఈనెల 6న వ్యవసాయ పనుల నిమిత్తం బైక్తో కేసీ కెనాల్ కట్టపై వెళ్తూ ప్రమాదవశాత్తు సుబ్రమణ్యం కాల్వలో పడి పోయాడు. ఎంత గాలించినా మృతదేహం ఆచూకీ దొరకలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ శివారు వద్ద కాల్వలో మృతదేహం తేలియాడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం సుబ్రమణ్యం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సింగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ బస్సులు కై లాస ద్వారం నుంచి శ్రీశైల క్షేత్రం వరకు వెళ్లనున్నాయి. నందిసర్కిల్ నుంచి గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠ జంక్షన్, మల్లమ్మ కన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రపార్క్, సిద్దరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా మళ్లీ నందిసర్కిల్ చేరుకుంటాయి. ప్రస్తుతం నాలుగు బస్సులు ఉండగా, 10, 11న ఎనిమిది, 12 నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులు భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు. -
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ అహోబిలం క్షేత్రంలో స్వాతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో నల్లమల పులకించి పోయింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన పావన లక్ష్మీనృసింహ స్వామిని, సుదర్శనమూర్తులను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకళశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పల్లెదారి..అధోగతి
అధ్వానంగా నిట్రవట్టి గ్రామ రహదారిగుంతలు పడిన గూళ్యం–సిద్ధాపురానికి వెళ్లే రోడ్డు కర్నూలు(అర్బన్): నాగరికతకు చిహ్నాలుగా నిలిచిన రోడ్ల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చకపోవడం, ప్యాచ్ వర్కులు చేపట్టకపోవడవంతో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని పలు రోడ్లకు నెలన్నర వ్యవధిలో రెండు పర్యాయాలు మంజూరు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ఎస్పీ) కింద జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోడ్ల పనులను మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. రూ.60.09 కోట్ల అంచనా వ్యయంతో 111.110 కిలోమీటర్ల మేర రోడ్లను బలోపేతం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంజూరు చేసిన ఈ రోడ్లలో ఒక్క రోడ్డు (కటారుకొండ ఫామిన్ రోడ్ మల్యాల ఆర్ఎస్ నుంచి తెగదొడ్డి జంక్షన్) మాత్రం రూ. 8.23 కోట్లతో 14.960 కిలోమీటర్ల వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 25 రోడ్లు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల లోపు అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ రోడ్లకు సంబంధించి అప్పట్లోనే పాలనా అనుమతులు మంజూరు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి టెండర్లను ఆహ్వానించ లేదు. కాగా, నెలన్నర రోజుల కాలయాపన అనంతరం ఇవే రోడ్ల పనులను రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పేరుతో ప్రభుత్వం ఈ నెల 4న తిరిగి తాజాగా మంజూరు చేస్తూ జీఓఆర్టీ నంబర్: 64ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీఓలో కంటే తాజాగా నాలుగు కిలోమీటర్ల మేర రో డ్డును, అంచనా వ్యయాన్ని రూ.2 కోట్లు మాత్రమే పెంచారు. అయితే ఈ పనులను ఏ పద్దు కింద విడుదల చేయనున్న నిధులతో చేపట్టాలనే అంశంపై స్ప ష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాబార్డు రుణం లేదా కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులతో చేపట్టే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమయం మంజూరు అయిన పనులు కిలోమీటర్లు మొత్తం రూ. (కోట్లలో) 2025 డిసెంబర్ 26 111.110 రూ.60.09 4/02/2026 26 115.244 రూ.62.67 రోడ్లు వేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో రెండు సార్లు అవే రోడ్లు మంజూరు ఎక్కడా కనిపించని పనులు ప్రజలకు తప్పనితిప్పలు -
బడిలో జ్ఞాపకాల జడివాన
● పండుగ వాతావరణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ● 68 ఏళ్ల క్రితం బ్యాచ్ నుంచి హాజరైన పూర్వ విద్యార్థులు పాఠశాల మ్యాగజైన్ను ఆవిష్కరిస్తున్న జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తదితరులు హాజరైన పూర్వ విద్యార్థులుకొలిమిగుండ్ల: దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు క్లాస్ రూమ్ల్లో అల్లరి, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, గ్రౌండ్లో ఆడుకున్న ఆట, పాటలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. ‘రేయ్ ఎలా ఉన్నావ్..ఏం చేస్తున్నావు..పిల్లలు ఏం చేస్తున్నారు..పెళ్లిళ్లు అయిపోయాయా.. ఇలా ఎంతో ఆత్మీయంగా చాలా సంవత్సరాల తర్వాత కలుసు కున్న మిత్రులు సందడిగా గడిపారు. ఏడు పదుల వయస్సులోనూ హుషారుగా తమ బాల్య స్నేహితులతో చిన్న పిల్లలైపోయి సరదాగా గడిపారు. మధుర క్షణాలన్నీ ఆదివారం కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. పాఠశాల ప్రారంభమైన 1958 బ్యాచ్ మొద లు కొని ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి అయిన మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరక్టర్ వీడీ రాజగోపాల్ సహచర మిత్రులతో కలిసి ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వ్యహరించి విజయవంతం అయ్యేలా కృషి చేశారు. పూర్వ విద్యార్థులు వెయ్యికి మందికి పైగానే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పాఠశాల ఆవిర్భవానికి కారకులైన దివంగత గవర్నర్, కేంద్రమంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చిత్ర పటానికి జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అప్పట్లో పాఠశాలను నిర్మించిన మీర్జాపురం నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ‘మేము మా పాఠశాల’ పేరుతో తయారు చేసిన మ్యాగజైన్ను ఆవిష్కరించి పూర్వ విద్యార్థులకు అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. 1962లో మొదటి ఎస్సెల్సీ బ్యాచ్ విద్యార్థి అయిన రిటైర్డ్ హెచ్ఎం వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు. మైదుకూరు, అనంతపురంలో డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్, వెంకట శివారెడి పాఠశాలలో చదువుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా బ్యాచ్లు వారీగా ఏర్పడి ఇష్టాగోష్టిగా చర్చించుకున్నారు. చదువుకున్న సమయంలోని తరగతి గదుల్లో కూర్చుని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కొండప్ప, సర్పంచ్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
వెదురు కర్రల వాహనం స్వాధీనం
బండిఆత్మకూరు: వెదురు కర్రలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నామని బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సాసిర్జా ఆదివారం తెలిపారు. మొబైల్ పార్టీ సిబ్బంది నారాయణాపురం పరిసరాల్లో గస్తీ నిర్వనిర్వహిస్తుండగా వెదురుకర్రల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పరమటూరు వైపు వెళ్లిందన్నారు. వాహనాన్ని వెంబడించి కొత్తకోట హైవే జంక్షన్ వద్ద శనివారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్తో పాటు ఉన్న మరో వ్యక్తివాహనాన్ని వదిలి పరారయ్యారన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనా న్ని నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయానికి తలరించామని తెలిపారు. అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి వెదురు కలపను తరలిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాసిర్జా, మొబైల్పార్టీ డీఆర్ఓ నాగేంద్రయ్య, సిబ్బంది రత్నప్రభావతి పాల్గొన్నారు. -
ఫూలే విగ్రహంపై దాడి దారుణం
కర్నూలు(అర్బన్): తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై దాడి దారుణమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలులోని ఫూలే సర్కిల్లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మి, ఖధీరుల్లా, కేవీపీఎస్ ఆంనద్బాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఫూలే విగ్రహాన్ని కూలగొడుతూ కాళ్లతో తన్ని బహుజనుల మనోభావాలను కించపర్చారన్నారు. ఫూలే చరిత్ర తెలుసుకోకుండా ఆయన విగ్రహంపై దాడి చేయడం సిగ్గుచేట్టాన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మనువాదులపై చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతినిధి జయన్న, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు చిరంజీవి, పెరికల రంగస్వామి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, కంది వరుణ్ కుమార్, సత్యనారాయణ, బీఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మహిళా ఐక్యవేదిక నాయకులు ఈరమ్మ, పెద్దక్క, అమీనాబీ, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
పిన్నాపురం వృషభాల జయకేతనం
తుగ్గలి : మస్తానయ్యస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం ముక్కెల్లలో నిర్వహించిన రాతి దూలం లాగుడు పోటీల్లో పాణ్యొం మండలం పిన్నాపురం వృషభాలు విజేతగా నిలిచాయి. పోటీలను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. పోటీల్లో పిన్నాపురం వెంకటకృష్ణయ్య వృషభాలు 3,874 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. తర్వాత స్థానాల్లో నాగర్కర్నూలు జిల్లా రాయవరం అక్షరరెడ్డి వృషభాలు, అనంతపురం జిల్లా ఏ నారాయణపురం షేక్ మహమ్మ ద్ షరీద్ వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గోవర్ధన్రెడ్డి వృషభాలు, వైఎస్సార్ కడప జిల్లా చెర్లోపల్లి, చిన్నరంగాపురం విష్ణువర్ధన్రెడ్డి, దనదీప్రెడ్డి, నాగర్కర్నూలు జిల్లా రాయవరం ధనుష్రెడ్డి ఎద్దులు నిలిచాయి. ఎద్దుల యజమానులకు దాతలు రూ.50 వేలు, ట్రాక్టర్స్ సంఘం రూ.40 వేలు, పెద్ద వెంకటేష్, బిజ్జె నాగప్ప, కిల్లె శ్రీనివాసులు కలిసి రూ.30 వేలు, పెద్ద మునెప్ప రూ.20 వేలు, ఎస్ రంజిత్ రూ.10 వేలు, కుర్వ శ్రీనివాసులు రూ.5వేలు అందజేశారు. -
గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు
● పర్యాటక ప్రదేశంగా గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని గుర్తించిన అధికారులు పాణ్యం: జల సోయగాలతో అలరించే గోరుకల్లు జలాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని సేకరించినా పట్టించుకోవడం లేదు. భారీగా పర్యాటకులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని గోరుకల్లు గ్రామస్తులు ఆశించినా ఫలితం లేకుండా పోయింది. గోరుకల్లు జలాశయం వద్ద 86.43ఎకరాల భూమి అందుబాటులో ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు, యువకులు ఎంతో సంతోషించారు. అప్పట్లోనే గోరుకల్లుతో పాటు పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఐదు ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి చేసేందుకు భూమిని కేటాయించారు. అయితే గత ప్రభుత్వంలో మొదలైన ప్రక్రియ ఎన్నికల కారణంగా 2024లో వాయిదా పడింది. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం గోరుకల్లును సందర్శించేందుకు వచ్చేవారు స్వల్పదూరంలో ఉన్న శ్రీ దుర్గాభోగేశ్వర స్వామి, శ్రీవల్లి సుబ్రమణ్యం స్వామి, శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను చూడవచ్చు. నూతన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి సమీక్షలు చేపట్టలేదు. ఫైళ్లు కదలకపోవడంతో గోరుకల్లు గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గోరుకల్లు వద్ద భూమి ఉందని ప్రతిపాదనలు పంపించాం. వాటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శుభకుమార్ ఎస్ఈ -
వ్యర్థాల నిర్వహణతోనే పర్యావరణ పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియల అంశాలపై కలెక్టర్ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మునిసిపాలిటీల్లో రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, వాటిలో ఎన్ని టన్నులు పొడి, ఎన్ని టన్నులు తడి చెత్తలుగా వస్తాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తడి చెత్తను విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు, పేపర్ వంటి వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వేలో పురోగతికి చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మిగనూరు, ఆదోని మునిసిపల్ కమిషనర్లు గంగిరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. -
ఓటరు జాబితాలపై ఆదేశాలు ఇచ్చాం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మార్చి 9వ తేది నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడతాం. రెవెన్యూ అధికారుల నుంచి అసెంబ్లీ ఓటరు జాబితాలను తీసుకొని వార్డుల వారీగా విభజించి ఓటరు జాబితాలను రూపొందించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త పంచాయతీలకు సంబంధించి 21 మండలాల నుంచి తమకు అందిన 38 ప్రతిపాదనలను సీపీఆర్కు పంపించాం. కొత్త పంచాయతీల ఏర్పాటు సీపీఆర్ పరిధిలో ఉంటుంది. – జీ భాస్కర్, కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి -
అతి శుభ్రతా.. ఓ రోగమే!
● కర్నూలు నగరంలోని గణేష్నగర్లో ఉంటు న్న ఓ వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతాధికారి. ఏ చిన్న పని చేసినా వెంటనే చేతులు కడగటం ఆయన నైజం. ఎంతగా అంటే ఎవ్వరికై నా షేక్హ్యాండ్ ఇచ్చినా సరే వెంటనే దగ్గరున్న పేపర్తో తుడుచుకోవడమో లేక శానిటైజర్తో కడుక్కోవడమో చేస్తుంటారు. ● నంద్యాలకు చెందిన రామేశ్వరమ్మ గృహిణి. ఇంటికి ఎవ్వరైనా వచ్చి వెళ్లారంటే చాలు వారు వెళ్లిన వెంటనే ఇళ్లంతా శుభ్రం చేస్తుంది. ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సైతం తాళం వేశామా లేదా, తలుపులన్నీ మూశామా లేదా, గ్యాస్ బంద్ చేశానా.. లేదా.. అని మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంది. బయటకు ఎక్కడికై నా వెళ్లినా సరే ఇంటిపైనే ధ్యాస. ..సమాజంలో ఇలాంటి వారు మీకు కూడా తరచూ కనిపిస్తుంటారు కదూ. ఇదో చాదస్తమనో, అనుమానమనో లేక ఇతర పేర్లేవో పెట్టుకుని సర్దుకుంటారు. కానీ ఇది కూడా ఒక లాంటి మానసి క రోగమని వైద్యులు చెబుతున్నారు. దీనినే వైద్యపరిభాషలో ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ (ఓసీడీ) అంటారు.కర్నూలు(హాస్పిటల్): ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్(ఓసీడీ) వ్యాధి గురించి అవగాహన ఉన్న కుటుంబసభ్యులు మాత్రమే బాధితులను వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్, చికిత్స ఇస్తుంటారు. మిగిలిన వారు జీవితాంతం అలాగే బాధపడుతున్నారు. ఓసీడీ అనేది ఒక భిన్నమైన మానసిక సమస్య. ఇలాంటి వారిని చూసి సమాజంలోని చాలా మంది జాలి చూపడం, ఏహ్యభావంతో చూడటం, విస్సుక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఒక ఆరోగ్య సమస్య ఉందన్న విషయమూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకుంటే ఏమనుకుంటారోనని.. మదనపడుతుంటారు. వారి సమస్యను ఇతరులతో చెప్పుకోలేరు, బయట పడే మార్గం వెతుక్కోలేక నరకం అనుభవిస్తుంటారు. ఓసీడీతో బాధపడేవారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఎంతగా అంటే సమాజంలో 3 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కొందరిలో 18 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో సమస్య వచ్చిన ఐదేళ్ల తర్వాత గుర్తించి వైద్యులను కలుస్తుంటారు. ఇటీవల ఈ మానసిక సమస్య గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తుండటంతో అవగాహన పెంచుకుని వైద్యులను కలుస్తున్నారు. ఓసీడీ లక్షణాలు ● ఓసీడీతో బాధపడుతున్న వారికి ఒకే ఆలోచన పదే పదే వస్తుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా ఉన్నా, అర్థంలేని ఆలోచనలను బాధితులు గుర్తించినా, వాటిని నిగ్రహించుకునే శక్తి మాత్రం వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడలేక, అవసరమైన పనులపై శ్రద్ధ చూపలేక వారు నిరంతరం ఆందోళనకు గురవుతుంటారు. ఈ ఆలోచనలనే ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటారు. ● అతి శుభ్రతకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతుంటారు. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. ● అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. అతిభయం, అతి క్రమశిక్షణ వీరికి ఉంటుంది. వీరు తమ అజాగ్రత్త కారణంగా ఇతరులకు హాని కలిగిస్తామేమోనని భయపడుతుంటారు. ● తమను ఇతరులతో పోల్చి చూసుకోవడం, ఇతరులను పరీక్షించడం చేస్తుంటారు. సెక్స్వల్ లేదా ఇతర రకాలుగా హాని కలిగిస్తాయనే ఆలోచనలు వచ్చే వారు తమ తప్పుడు ఆలోచనలకు క్షమించాలని దైవాన్ని వేడుకుంటూ ఉంటారు. ● వీరు ఇంట్లో కూడా హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచడం, బయట పారేయడం చేస్తుంటారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగానికి ప్రతి రోజూ వంద మంది దాకా వివిధ మానసిక జబ్బులతో చికిత్స కోసం వస్తారు. వారిలో 2 నుంచి 3 శాతం మందిలో ఓసీడీ లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, కౌన్సిలింగ్ ద్వారా నయం చేస్తాం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అటు బాధితులకు, కుటుంబసభ్యులు, కార్యాలయంలో అయితే సహొద్యోగులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. – డాక్టర్ నాగేశ్వరరావు, మానసిక వ్యాధుల విభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలుఓసీడీ సమస్యకు కారణాలు పలు కారణాలతో మెదడులో కలిగే రసాయన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో స్ట్రెప్టకోకస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి రావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు, మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికై నా ఈ సమస్య వచ్చే అవకాశాలు 33 శాతం ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని మాత్రం లేదు. ప్రతిదీ శుభ్రంగా ఉండాలనుకుంటున్నారా...! శుభ్రంగా లేకపోతే నచ్చడం లేదా ! ఈ లక్షణాలతో పెరుగుతున్న బాధితులు ఇది కూడా ఒక రోగమేనట వైద్యపరిభాషలో ఓసీడీగా పరిగణన -
గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి
● సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం కర్నూలు సిటీ: విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో సాధించాలని సినీ నటుడు పద్మశ్రీ డా.బ్రహ్మానందం అన్నారు. శనివారం కర్నూలు నగరంలోఓ ఫంక్షన్ హాలులో రెసోనెన్స్ స్కూల్స్, కాలేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందంతో పాటు, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జి వెంకటేష్, రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, రాగమయూరి విద్యా సంస్థల అధినేత కె.జే రెడ్డిలు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వచ్చాయని, పక్కంటి పిల్లలతో పోల్చీ తిట్టకూడదన్నారు. ఏ విషయాన్నైన ఒత్తిడితో కాకుండా ప్రేమగా చెప్పి ఒప్పించాలన్నారు. అక్కినేని నాగేశ్వరరావుకు చదువు రాకపోయినా సినీరంగంలో ఆయన ఎంతో గొప్పగా రాణించారన్నారు. రాయలసీమ ముఖ్య ద్వారం అయిన కర్నూలులో రెసోనెన్స్ విద్యా సంస్థలు 11 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంలో సీబీఎస్ఈ సిలబస్ నర్సరీ నుంచి పదవ తరగతి వరకు డే స్కాలర్, రెసి డెన్షియల్ విధానంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏడేళ్లలోనే తిరుగులేని విజయాలను రెసోనెన్స్ విద్యా సంస్థలు సాధించాయన్నారు. అదే ప్రమాణాలతో ఇక్కడ కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. -
శ్రీగిరి.. ఓంకార ఝరి
ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలను తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో విద్యుత్ వెలుగుల్లో స్వామిఅమ్మవార్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆదివారం శ్రీశైల ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పించనున్నారు. – శ్రీశైలం టెంపుల్విద్యుత్ దీపాలంకరణలో శ్రీశైల ఆలయం -
నల్లమల లోయలో బొలెరో వాహనం బోల్తా
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సద్దాం శనివారం బొలేరో వాహనంలో వరి గడ్డి కట్టలతో గిద్దలూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు సద్దాం ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని శిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
కోనేటి రాయుడికి కిరణాభిషేకం
ఉయ్యాలవాడ: ఇంజేడు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోనేటి రాయుడిని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. స్వామి వారికి ప్రీతికరమైన రోజైన శనివారం రోజున సూర్య కిరణాలు ఆలయంలోకి చేరి స్వామి వారిని తాకడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తులు స్వామి వారితో పాటు సూర్య భగవానునికి నమస్కరించుకున్నారు. అలాగే మండల పరిధిలోని ఆర్.జంబులదిన్నె, ఉయ్యాలవాడ, సుద్దమల్ల గ్రామాలలో వెలిసిన అభయాంజనేయస్వామి, శ్రీ లక్ష్మి నరసింహ కంబగిరి స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు అనంతయ్య, లక్ష్మణస్వామి, భాస్కరశర్మ, కమలేష్శర్మలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
బాధితుల ప్రయోజనాలు కాపాడాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధికర్నూలు: ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవా సదన్లో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ తదితరులు హాజరయ్యారు. ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, విధానాలు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ కోర్టు కేసుల నిర్వహణ, నిరుపేదల తరపున ట్రయల్ కోర్టు, ట్రిబ్యునల్స్, హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు కేసులు వాదించడం చేయాలని తెలిపారు. సమిష్టి పరిహారాలు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, సయోధ్య ద్వారా కృషి చేయాలని కోరారు. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు, న్యాయ సేవా సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 9 నుంచి 11 వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు కర్నూలు(సెంట్రల్): అటవీ, ఎండోమెంట్ శాఖల్లోని ఫారెస్టు బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్, తండేల్(ఫారెస్టు), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడు–2(ఎండోమెంట్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ పరీక్షలను ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల సమన్వయాధికారి/డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఏపీపీఎస్సీ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీక్షల నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9,958 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తోపాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డుతో వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు. ఉల్లి పరిహారం అక్రమాలపై విచారణ కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లింపులో అక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’లో ఈనెల 7న ప్రచురితమైన ‘నష్టాన్ని దాచి.. కష్టాన్ని దోచి’ కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇప్పటి వరకు అక్రమాలు దేవనకొండ మండలంలో వెలుగు చూశాయి. హార్టికల్చర్, రెవె న్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దేవనకొండ మండలంలోని బేతపల్లి, బండపల్లి, బంటుపల్లి, చెల్లెలిచెలిమల గ్రామాల్లో విచారణ చేపట్టారు. మరో రెండు, మూడు రోజులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. వాయిస్ క్లోనింగ్ మోసాలతో జాగ్రత్త కర్నూలు: వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏఐ వాయిస్ క్లోనింగ్కు సంబంధించిన స్కామ్లు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర ఆర్థిక సహాయం కోరితే వారి గుర్తింపును నిర్ధారించడానికి తెలిసిన, ధృవీకరించబడిన నంబర్ ద్వారా స్నేహితుడు లేదా బంధువులను సంప్రదించాలని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు, www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. -
రైస్మిల్లో కొండ చిలువలు
బండిఆత్మకూరు: మండల కేంద్రంలోని ఓ పాత రైస్ మిల్లో శనివారం అటవీ అధికారులు రెండు కొండ చిలువలను పట్టుకున్నారు. శనివారం ఉదయం రైస్మిల్ వైపు వెళ్లిన స్థానికులకు రెండు కొండ చిలువలను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు లింగాపురం ఎఫ్బీఓ హైమావతితో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక పరికరాలతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఒక కొండ చిలువ ఏడు అడుగులు, ఇంకొకటి ఆరు అడుగుల పొడవు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటుతో అసిస్టెంట్ లైన్మన్ మృతి గడివేముల: తిరుపాడు గ్రామంలో అసిస్టెంట్ లైన్మన్గా పనిచేస్తున్న వెంకటరమణ (46) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఈ మేరకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గడివేముల ఏఈ ఖలీల్ పాషా, డిప్యూటీ ఎక్యూటివ్ ఇంజినీర్ సుబ్రమణ్యం, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ, కాంట్రాక్టర్ శేషాద్రిగౌడ్, సిబ్బంది శివ, రవి, నరేంద్ర, మండల సిబ్బది, తదితరులు నివాళులర్పించారు.వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం వెల్దుర్తి: చెరుకులపాడు గ్రామంలో మతి స్థిమితం లేని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రంగడు, రాములమ్మ దంపతులు ఇంట్లోనే కిరాణషాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. వెల్దుర్తికి చెందిన బంధువైన ఓ వృద్ధురాలు శుక్రవారం బ్రహ్మంగుండం కోనేరులో పడి మరణించింది. వృద్ధురాలి అంత్యక్రియలకు రాములమ్మ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. రాములమ్మకు మూడు నెలలుగా చావు కబురు విన్నా, ఇతరత్రా సందర్భాల్లో మతి స్థిమితం కోల్పోయేది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న రాములమ్మ తమ కిరాణ దుకాణంలో విక్రయానికి ఉంచిన పెట్రోల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బంగారు దుకాణంలో భారీ చోరీ ● రూ. 40 లక్షల ఆభరణాలు అపహరణ బనగానపల్లె: పట్టణంలోని రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయానికి అతి సమీపంలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. స్థానిక శ్రీని వాస జ్యువెలర్స్ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ చోరీలో 18 తులాల బంగారు ఆభరణాలు, ఐదు కేజీల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ విషయం వెలుగు చూడటంతో ముందుగా ట్రైనీ డీఎస్పీ రాజసింహ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. గ్యాస్ కట్టర్తో షట్టర్ తాళాలను తొలగించినట్లు గుర్తించారు. నంద్యాల నుంచి ఫింగర్ ప్రింట్స్ అధికారులు దుకాణాన్ని పరిశీలించి నిందితుల వేలిముద్రలు సేకరించారు. సాయంత్రం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు దుకాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. చోరీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. నిందితుడి అరెస్టు కర్నూలు: కర్నూలు శివారు బాలాజీ నగర్లో నివాసముంటున్న ఎన్.దేవరాజు (70) హత్య కేసులో నిందితుడు ఎద్దుల రవికుమార్ను తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మృతుడు దేవరాజు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో స్వీపర్గా పనిచేసి 2011లో ఉద్యోగ విరమణ పొందాడు. ఇతనికి ఐదుగురు సంతానం ఉన్నారు. నాలుగో కుమారుడైన రవికుమార్ ఈనెల 5వ తేదీ డబ్బుల కోసం తండ్రితో గొడవ పడి బలంగా నెట్టడంతో తీవ్ర గాయాలతో దేవరాజు మృతిచెందాడు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ వల్లనే గాయాలకు గురై దేవరాజు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం సాయంత్రం తాండ్రపాడు గ్రామ శివారులోని రింగ్ రోడ్డు బ్రిడ్జి కింద (సఫా కళాశాల వద్ద) అరెస్టు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజోమూర్తి తెలిపారు. -
పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ఆత్మకూరు: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపా రు. శివభక్తులు పాదయాత్రగా వెళ్లే వెంకటాపురం – నాగలూటి అటవీ మార్గాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీ మార్గంలో ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే మల్లన్న భక్తులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మార్గమధ్యలో గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామన్నారు. అటవీ మార్గంలో అస్వస్థకు గురైన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెచ్చెరువు ప్రాంతంలో వైద్యశాల అందుబాటులో ఉందన్నారు. అటవీ మార్గంలో భక్తులు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్, సీఐ మహేశ్వర్రెడ్డి, పాములపాడు ఎస్ఐ తిరుపాల్, ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ ప్రణతిబాయి, డీఆర్వో జాకీర్హుసేన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రథోత్సవం
పత్తికొండ: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. పత్తికొండ పట్టణంలోని తేరుబజార్లో వెలసిన వీరబ్రహేంద్రస్వామి తిరునాల సందర్భంగా శనివారం నిర్వహించిన రథోత్సవానికి భక్తజనం పోటెత్తారు. తేరుబజారు నుంచి సుంకంగేట్ వరకు పురవీధులు జనసంద్రంగా మారాయి. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో రథాంగ హోమంనిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తుల హర్షధ్వానాల మధ్య రథాన్ని ముందుకు కదలించారు. భక్తులు స్వామి వారి రథంపైకి అరటిపండ్లును విసురుతూ భక్తిని చాటుకున్నారు. స్వామికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా
గ్రావెల్ కోసం చేపట్టిన తవ్వకాలతో రూపుమారిన కొండజగనన్న కాలనీలో ఎర్రమట్టిని తవ్వుతున్న పొక్లెయిన్ కల్లూరు: కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తడకనపల్లెలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను, జగనన్న లేఅవుట్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 337లో లెవలింగ్ పేరుతో గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన హయాంలో నిరుపేదలకు భూములు పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి టీడీపీ నాయకులు కొండ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చే సాకుతో గ్రావెల్ దందా చేస్తున్నారన్నారు. పొలాన్ని సాగులోకి తెచ్చుకోవాలంటే మూడు, నాలుగు అడుగుల లోతులో చదును చేస్తారని, ఇక్కడ 15 అడుగుల లోతు మట్టిని అడ్డంగా తవ్వేస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చారు? ఇక్కడ ఎంత లోతు మట్టి తవ్వారో పరిశీలించాలన్నారు. అధికారం ఎప్పుడ్డూ శాశ్వతం కాదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులందరిపై విచారణ తప్పదన్నారు. తడకనపల్లె, పెద్దటేకూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారని.. నియోజకవర్గంలో పూడిచెర్ల, ఉప్పులపాడు, తడకనపల్లె గ్రామాల్లో అక్రమ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. జగనన్న కాలనీలో దురాక్రమణలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే దుండగలు దురాక్రమణకు పాల్పడుతున్నారని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడకనపల్లెలోని 86వ సర్వే నెంబర్లో జగనన్న కాలనీ పేరిట లేఅవుట్ వేశామన్నారు. గ్రామానికి చెందిన 80 మందితో పాటు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల పేద ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు దుండగలు జగనన్న కాలనీలో దురాక్రమణ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన లేఅవుట్ను పరిశీలించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు కబ్జాలకు గురువుతున్నా అధికారులు మౌనం వహించడం తగదన్నారు. 15 అడుగుల లోతు మట్టి తరలింపు పత్తాలేని రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని జగనన్న కాలనీ ప్లాట్ల ఆక్రమణపై ఆగ్రహం -
బీఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగించుకోవాలి
● ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంకర్నూలు (హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం అన్నారు. కర్నూలు బిజినెస్ ఏరియా సాధిస్తున్న ఫలితాలను సమీక్షించేందుకు శనివారం ఆయన కర్నూలు వచ్చారు. బీఎస్ఎన్ఎల్ భవన్ కార్యాలయంలో ఉద్యోగులు, వ్యాపార భాగ స్వాముల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు బిజినెస్ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎఫ్టీటీహెచ్ ప్లాన్లో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్పార్క్ను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూ.399కే 50 ఎంబీపీఎస్ స్పీడ్తో 3300 జీబీ డేటాను, అపరిమితమైన కాల్స్ సౌకర్యాలను సంవత్సరం పాటు అందిస్తుందన్నారు. సంవత్సరం తర్వాత నెలకు రూ.449గా ప్లాన్ మారుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాంచైజీలు, టీఐపీల సమస్యలను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడచిన మూడ త్రైమాసికాలకు మంచి ప్రతిభ చూపిన డివిజన్ ఇంజినీర్లు, బీబీఎంలు, ఫ్రాంచైజీలు, టీఐపీలకు ప్రోత్సా హాక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్, డీజీఎం కె.రాజేశ్వరరావు, ఐఎఫ్ఏ డి.శ్రీలత, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం -
పేద ప్రజల కడుపు కొడితే ఊరుకునేది లేదు
ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను దుండగులు స్వార్థంతో చదును చేస్తున్నారని కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సరిహద్దు రాళ్లు పాతిన భూముల్లో ఎవరి సహకారం, అండదండలతో తొలగించారని మండిపడ్డారు. పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతల సహకారంతోనే ఇదంతా సాగుతోందన్నారు. ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా అక్రమించాలని తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పేద ప్రజల తరపున న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఆయన వెంట గ్రామ నాయకులు కె.టైలర్ రాముడు, వేణురెడ్డి, కృష్ణారెడ్డి, విసి స్వాములు, భాస్కర్, శీను, కార్పొరేటర్ నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, కేశవరెడ్డి, హనుమంతురెడ్డి, శివారెడ్డి, తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో శివస్వామి మృతి
కోడుమూరు రూరల్: శివరాత్రి సందర్భంగా మాల ధరించి ఇరుముడితో శ్రీశైలానికి పాద యాత్రగా బయలుదేరిన ఓ శివస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోడుమూరు– కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు చెందిన వీరేష్ (35) శివ మాల ధరించి శుక్రవారం ఉదయం శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. మార్గమధ్యలో కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి సమీపంలో రహదా రిపై నడుచుకుంటూ వెళుతుండగా, కోడుమూరు నుంచి కర్నూలు వైపు ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తూ పాదయాత్ర భక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరేష్కు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న వీరేంద్ర అనే యువకుడికి, బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరేష్ కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాదంపై కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రూ. వందతో ఏమార్చిరూ. 2.60 లక్షలు అపహరణనందికొట్కూరు: బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసుకుని వెళ్తున్న ఓ వృద్ధుడిని గుర్తు తెలియని దుండగులు ఏమార్చి రూ. 2.60 లక్షలు అపహరించారు. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి పెద్ద పుల్లారెడ్డి శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో రూ. 2.60 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి బైక్పై బయల్దేరాడు. వృద్ధుడి బైక్ను వెంబడించిన ఇద్దరు యువకులు మార్గమధ్యలో రోడ్డుపై రూ.వంద నోటు వేసి.. ‘పెద్ద య్య నీ డబ్బులు కిందపడ్డాయి’ అని చెప్పారు. పుల్లారెడ్డి బైక్ నిలిపి వంద నోటు తెచ్చుకునేందుకు వెళ్లగా.. బైక్పై ఉన్న రూ.2.60 లక్షల నగదుతో ఇద్దరు యువకులు పరారయ్యారు. బాధితుడు మిడుతూరు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబులేసు తెలిపారు.జగనన్న కాలనీలో గ్రావెల్ తవ్వకంకల్లూరు: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తడకనపల్లెలో 86వ సర్వే నంబర్లో లే ఔట్ వేసింది. జగనన్న కాలనీ లో కొందరు దుండగులు ప్లాట్లను చదును చేస్తూ ఎర్ర మట్టి తవ్వుతున్నారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వీబీఆర్ పరిసరాల్లో చిరుత సంచారం
● భయం గుప్పిట్లో స్థానికులువెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్) పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన వీబీఆర్ సమీపంలో ఓ చిరుత సంచ రిస్తూ నెమలిపై దాడి చేసిన దశ్యాలను అక్కడున్న ఓ మత్స్యకారుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ పరిసరాల్లో వ్యవసాయ పనులు నిర్వహించే రైతులు, అలాగే రిజర్వాయర్ను సందర్శించేందుకు వచ్చే యాత్రికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అడవి జంతువుల సంచారం పెరుగుతోందని, రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు, వెలుగోడు ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటంతో అప్పుడప్పుడు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అడవి జంతువులు సంచరించడం సహజమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరా ల్లో మత్స్యకారులు, రైతులు గుంపులుగా వెళ్లాలని, వన్యప్రాణులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. -
మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు
● సీబీఐ తేల్చినా మళ్లీ ఏక సభ్య కమిషనా? ● తప్పు చేశారు, ఇకనైన నోరు మూసుకోండి ● ఏ ఆధారాలతో శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు ● జగనన్నను డ్యామేజ్ చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు(టౌన్): ‘‘అత్యున్నత సీబీఐ నిగ్గు తేల్చింది. ప్రజలందరికీ అర్థమైంది. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురూ తిరుమల లడ్డూ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెన్నాళ్లీ రాజకీయం చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో సొంత మనిషి చనిపోతే మూడు రోజుల తరువాత ముఖాలు ఎలా ఉంటాయో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిల ముఖాలు అలానే ఉన్నాయన్నారు. పవిత్ర తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇరికించాలని చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారన్నారు. హిందూ వ్యతిరేకిగా జగనన్నను చేయాలనుకోవడం వారి మూర్ఖత్వమన్నారు. ఇప్పటికే తప్పు చేశారని, ఇకనైనా మరింత పరువు పోకుండా నోరు మూసుకోవాలని సలహా ఇచ్చారు. కింద పడినా తామే గెలిచామన్న రీతిలో మళ్లీ ఏకసభ్య కమిషన్ దర్యాప్తు అనడం సిగ్గుచేటన్నారు. తిరుమల పవిత్రను దెబ్బతీయాలనుకుంటే ఆ భగవంతుడు కూడా క్షమించబోడన్నారు. విజయవాడలో 40 గుళ్లను కూల్చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జగనన్న హయాంలో తిరుమలలో గోవులను కాపాడేందుకు ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారని, అర్చకుల జీతాలు, కార్మికుల వేతనాల పెంపు, తిరుమలలో 9వేల మందికి ఇళ్ల పట్టాలు, అమరావతి, హైదరాబాద్, వైజాగ్, జమ్ముకశ్మీర్, భువనేశ్వర్లలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నారు. శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు దారుణం పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారుణమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎస్వీ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఏ ఆధారాలతో శ్రీశైలంపై ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీశైలంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో టాయిలెట్లు క్లీనింగ్ చేసే కెమికల్ వాడుతున్నారని చంద్రబాబు ఎలా ప్రకటించారన్నారు. ఏమైనా ల్యాబ్ రిపోర్టు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయస్సు రీత్యా మతి చెడిందన్నారు. కూటమి పాలన వైఫల్యంతోనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
శివయ్యా.. వచ్చేస్తున్నాం!
ఆత్మకూరు: శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమల మీదుగా భక్తుల అడుగులు శ్రీశైలం వైపు పడుతున్నాయి. ఏటా శివరాత్రికి 20 రోజులు ముందుగానే భక్తులు పాదయాత్రగా కదిలేవారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించేవారు. కొందరు సుదూర ప్రాంతాల ఉంచే పాదయాత్రగానే శ్రీశైలం చేరుకునే వారు. అయితే ఈ ఏడాది నల్లమలలో పులుల గణన కారణంగా భక్తుల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈనెల 8వ తేదీ నుంచి మాత్రమే అనుమతి ఇస్తామని అటవీ అధికారులు ప్రకటించారు. అయితే పులుల గణన యుద్ధప్రాతికన పూర్తి చేసి రెండు రోజుల ముందుగానే శుక్రవారం నుంచి భక్తుల పాదయాత్రకు ఫారెస్టు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో పాదయాత్ర భక్తులు వెంకటాపురం నుంచి బయలుదేరారు. నాగలూటి, పెచ్చెరువు, దామర్లకుంట, సీతమ్మభావి, కత్తులకొండ భీమునికొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుని అక్కడి నుంచి హఠకేశ్వరం మీదుగా సాక్షి గణపతి చేరి మొక్కులు చెల్లించి అనంతరం శ్రీశైల మల్లన్న ను దర్శించుకుంటారు. తొలిరోజు దాదాపు 1000 మందికి పైగా భక్తులు శ్రీశైలం వైపు పాదయాత్రగా కదిలారు. ఈనెల 15వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇల కైలాసమైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు తరలిరానున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులను వెంకటాపురం వద్ద అటవీ అధికారులు తనిఖీ చేసి పంపుతున్నారు. నిప్పు పెట్టే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రిని అనుమతించడం లేదు. కాలినడకన శ్రీశైలయానికి అటవీమార్గంలో వెళ్లే భక్తులు అటవీశాఖ నిబంధనలను పాటించి సహ కరించాలి. ప్రతి భక్తుడి బ్యాగులు పరిశీలించి సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టె, గుట్కా తదితర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్రధానంగా అటవీ మార్గంలో వెళ్లే పాదయాత్ర చేసే భక్తులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించరాదు. అరణ్యంలోకి ప్లాస్టిక్ను తీసుకెళ్లడం, అడవికి నిప్పు పెట్టే అగ్నిపెట్టెలు, మద్యం తదితర వాటిని నిషేధించాం. రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే సమయంలో శబ్దం చేయరాదు. – జాకీర్హుసేన్, ఫారెస్టు డీఆర్వో నల్లమల మీదుగా భక్తుల పాదయాత్ర ప్రారంభం పులుల గణన నేపథ్యంలో ఆలస్యంగా అనుమతి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం -
సీఎంకు ఆదోని జిల్లా సెగ
● కలుగొట్ల సభలో విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకుల ఆందోళన ● అదుపులో తీసుకున్న పోలీసులు ఎమ్మిగనూరు టౌన్: కలుగొట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ గ్రామ సభలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఆదోని జిల్లా కావాలంటూ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. సభలో ఒక్కసారిగా లేచి నినాదాలు చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. సీఎం చంద్రబాబు ఇలాంటి వారుంటారు డైవర్షన్ చేయడానికి అంటూ మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులో తీసుకొని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో వైపు సీఎం ప్రసంగిస్తుండగానే రైతులు, మహిళలు సభ మధ్యలోనే తిరుగుముఖం పట్టారు. జనం పలుచగా హాజరు కావడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. -
పంటకు కాపలా పులి
రబీలో సాగు చేసిన పంటలు కోతకు వస్తున్నాయి. అయితే నల్లమల అటవీ సమీపంలో ఉండటంతో పశు, పక్షాదుల నుంచి రక్షణ కరువైంది. అటవిలో నుంచి పందులు, జింకలు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. మరో వైపు పక్షుల గుంపు పంటలపై వాలి క్షణాల్లో దిగుబడులను తినేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు రైతులు దిగుబడులను కాపాడుకునేందుకు కొందరు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి వివిధ శబ్దాల ద్వారా తరమేస్తున్నారు. మరి కొందరు దిష్టి బొమ్మలు, పెద్ద పులి, చిరుత పులులు, కొండ ముచ్చులు వంటి వాటి బొమ్మలను ఏర్పాటు చేసి భయపెడుతున్నారు. రుద్రవరం, ఎల్లావత్తుల, ఢీకొట్టాల, హరినగరం, నర్సాపురం, ఆలమూరు, చిత్రేనిపల్లె, కొటకొండ, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె తదితర గ్రామాల పరిధిలోని రైతులు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. – రుద్రవరం -
అగ్రికల్చర్ అసిస్టెంట్పై క్రిమినల్ కేసు?
ఆలూరు: హాలహర్వి మండలం నిట్రవట్టి రైతుసేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం. విజయ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ రాజు, ఆలూరు ఏడీఏ చెంగల్రాయుడు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. శుక్రవారం ఈ విషయాన్ని ఏఓ జిలానీ బాషా తెలిపారు. అగ్రికల్చర్ అసిస్టెంట్గా నంద్యాల జిల్లాకు చెందిన ఎం. విజయ్ 2020 ఆగస్టు 17న నిట్రవట్టి రైతుసేవా కేంద్రానికి వచ్చాడు. రైతులకు అందుబాటులో ఉంటూ తొలుత రెండేళ్లు సక్రమంగా విధులు నిర్వర్తించాడు. ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇస్తామని గ్రామ రైతుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి గత ఏడాది నుంచి అదృశ్యమయ్యాడు. ఈ–క్రాప్ బుకింగ్లోనూ డబ్బులు వసూలు చేశాడు. గ్రామ రైతుల వద్ద రూ. 5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి మార్క్ఫెడ్ అధికారులకు చెల్లించకుండా ఎగనామం పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ఆలూరు ఏడీఏ, హాలహర్వి ఏఓకు మార్క్ఫెడ్ అధికారులు చెప్పారు. దీనిపై ఏఓ జిలానీ బాషా శుక్రవారం విచారించారు. -
నీటి కోసం సచివాలయం ముట్టడి
ఆలూరు: హత్తిబెళగళ్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని అధికారులు పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం ఆలూరు గ్రామ రోడ్డు సమీపంలో సచివాలయం వద్దకు పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడిని పరిష్కరించేంత వరకు ఉద్యోగులను బయటకు వెళ్లనీయమని భీష్మించారు. అనంతరం వారు ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, తదితరులకు సమాచారాన్ని చేరవేశారు. సంబంధిత అధికారులు సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన విధుల్లో ఉన్నామని, వచ్చిన తర్వాతనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే ‘వారు వచ్చే వరకు మా గొంతులు ఎండిపోవాలనా... ఇప్పటికే 20 రోజులుగా నీళ్లు లేక విలవిలాడుతున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. నీ ప్రేమ బంగారం కాను..! కొందరు పశుపోషకులు మూగజీవాల పట్ల చూపించే ప్రేమను వెలకట్టలేనిది. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే వృషభాలను యజమానులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్దికెరలో మద్దమాంబ తిరుణాల సందర్భంగా రాతి దూలం పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు వచ్చాయి. యాడికి చెందిన వీరశేఖర్ అనే వ్యక్తి వృషభాలకు దోమలు కుట్టకుండా దోమతెరలను కట్టారు. రైతు జాగ్రత్తలు చూసి స్థానికులు అభినందించారు. – మద్దికెర -
శ్రీశైలం.. ‘మహా’ శోభితం
● రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● 11 రోజుల పాటు నిర్వహణశ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు చేస్తారు. శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆర్జితసేవల నిలుపుదల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఉభయ దేవాలయంలో స్వామిఅమ్మవార్లకు జరిగే గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం తదితర అన్ని ఆర్జితసేవలను పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తులందరికి కేవలం స్వామివారి ఆలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు దేవస్థాల తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తారు. 15న పాగాలంకరణ బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 9న భృంగి, 10న హంస, 11న మయూర, 12న రావణ వాహన సేవ, 13న స్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ, 14న గజ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 15న ప్రభోత్సవం ఉంటుంది. అదే రోజు నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు రథోత్సవం 16న వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవ యాగాలకు 17న పూర్ణాహుతి చేస్తారు. అశ్వ వాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు 18న నిర్వహిస్తారు. -
నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసుకొని నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధరలు లభిస్తాయని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఒక రైతు తెచ్చిన వాములో మట్టి, పొట్టు, పుల్లలు అధికంగా ఉండటంతో క్వింటాకు రూ.11 వేలు మాత్రమే ధర లభించిందన్నారు. ఆ సమయంలో తాము తనిఖీ చేయగా రైతు ఈ ధరకు అమ్మానని, క్యాన్సిల్ చేసుకుంటానని తెలుపడంతో అంగీకరించామన్నారు. వామును అక్కడే క్లీన్ చేసుకొని శుక్రవారం అమ్మకానికి పెట్టడంతో క్వింటా ధర రూ.24 వేలు పలికిందన్నారు. నేటి నుంచి టమాట విక్రయాలు నిలిపివేత పత్తికొండ: వ్యవసాయ మార్కెట్లో శనివారం నుంచి టమాట విక్రయాలను నిలిపివేస్తున్నట్లు మార్కెట్యార్డు కార్యదర్శి కార్నలిస్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టమాట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో టమోట విక్రయాలను నిలుపుదల చేశామన్నారు. ఇతర కూరగాయల మార్కెట్ రోజూ యథావిధిగా కొనసాగుతుందన్నారు. 8న పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక మహాసభలు కర్నూలు(అర్బన్): కర్నూలు డివిజన్ ఎన్ఎఫ్పీఈ గ్రూప్ సీ, పోస్ట్మెన్, ఎంటీఎస్, జీడీఎస్ యూనియన్లు సంయుక్తంగా ద్వైవార్శిక మహాసభలను ఈ నెల 8న స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు గిరిబాబు, ఈశ్వరయ్య, శమంతకరెడ్డి, లక్ష్మికాంత్, మహ్మద్జానీ, రమేష్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసు ప్రాంగణంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్ర నాయకులు శ్రీధర్, మురళీతో పాటు అఖిల భారత నాయకులు కూడా హాజరవుతారన్నారు. మహాసభల్లో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తామన్నారు. అలాగే మూడు యూనియన్లకు సంబంధించి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు నేరం మంత్రాలయం రూరల్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వివాహాల సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి విజయ తెలిపారు. మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక ఆవరణలో సీడీపీవో రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. డిస్టిక్ కో ఆర్డినేటర్ బాలు, వన్స్టాఫ్ సెంటర్ అధికారి స్వప్న, నాలుగు మండలాల ఐసీడీఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇచ్చిన సూక్ష్మ సేద్యం లక్ష్యాలను అధిగమించేందుకు పట్టుదలతో పనిచేయాలని ఉద్యానశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్ డైరెక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులోని ఉద్యాన భవన్లో కంపెనీల డీసీవోలు, ఎంఐ ఇంజినీర్లు తదితరులుతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 9,750 హెక్టార్లు పూర్తి చేశారన్నారు. మార్చి 15లోపు వంద శాతం లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 10 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్య సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొ న్నారు. బిందు, స్ప్రింక్లర్ల పరికరాలపై జీఎస్టీని తగ్గిందని, యూనిట్ వ్యయంపై 7 శాతం ఆదా అవుతుందన్నారు. ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఆదనపు పీడీ ఫిరోజ్ఖాన్, నంద్యాల జిల్లా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం
పాదయాత్ర భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయ సహకారాలు అందిస్తాం. మార్గమధ్యలో భక్తులకు అస్వస్థతకు గురైతే వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించేందుకు పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. చిన్నచిన్న దెబ్బలు, గాయాలైన కూడా అటవీ సిబ్బంది వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సిన వైద్యసేవలు అందిస్తాం. ఈ ఏడాది తొలిసారిగా వెంకటాపురం, దామర్లకుంట వద్ద అటవీశాఖ ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. – విఘ్నేష్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
అన్నదాన శిబిరాలను ప్రారంభించాలి
శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన వెళ్లే భక్తులు, శివస్వాములు ఇబ్బందులు పడకుండా దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేయాలి. డివిజన్ పరిధిలోని 15 మంది తహసీల్దార్లు, అదే సంఖ్యలో డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలను విధులకు కేటాయించాం. వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు 13 మెడికల్ క్యాంపులు, ఒక్క శ్రీశైలంలోనే ఉచిత వైద్యశిబిరాలు 30 ఏర్పాటు చేశాం. భీమునికొలను, కై లాసద్వారం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి కల్పించారు. ఆత్మకూరు–దోర్నాల వరకు రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. పాదయాత్ర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలి. – నాగజ్యోతి, ఆర్డీఓ -
వైఎస్ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
● వైఎస్సార్సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్యకర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పన్నీటి కాశయ్య అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ రజక ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ రజక విభాగాన్ని ఏర్పాటు చేసి తనను అధ్యక్షులుగా నియమించారన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రజక నేతలను కలుస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పా రు. ఇప్పటి వరకు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని, ఆయా జిల్లాల్లోని రజకులు, బీసీల్లో వైఎస్ జగన్ పట్ల ఎనలేని అభిమానం, ప్రేమ చెక్కు చెదరలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష, బలమైన పట్టుదల ఉన్న వారిని గుర్తించి వైఎస్సార్సీపీ రజక విభాగంలో జిల్లా, నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో రజకులతో పాటు మిగిలిన బీసీ కులాలప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. 2024 ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల రజక జనాభా ఉందన్నారు. రజకుల ఓట్లతోనే ముఖ్యమంత్రిగా జగన్ను చూడాలనే బలమైన ఆశయంతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భారతీ, స్థానిక వైఎస్సార్సీపీ రజక నేతలు బలరామ్, గోల్డ్మెన్ శ్రీనివాసులు, బబ్లూ, బాబ్జీ, వెంకటేష్, సింగారం రంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి కర్నూలుకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్యను స్థానిక నేతలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. -
రథవీధిలో టాయిలెట్లా..?
శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఉన్న వీధిని రథవీధి అని అంటారు. ఈ వీధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిర్వహించే వాహనసేవల గ్రామోత్సవం ఈ రథవీధిలో నిర్వహిస్తారు. అయితే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటిని ఏర్పాటు చేయడం మంచిదేకానీ.. వాటిని రఽథవీధిలో ఉంచడంపై భక్తులు మండిపడుతున్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవం తిరిగే ప్రదేశంలో టాయిలెట్లు ఏర్పాటు చేయడంపై దేవస్థాన అధికారుల తీరును భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటిని ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ -
పోరాటాలను ఉద్ధృతం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు నంద్యాల(న్యూటౌన్): కార్మిక హక్కుల రక్షణకు పోరాటాలు ఉద్ధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షతన ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గఫూర్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, గౌరవాధ్యక్షుడిగా శాంతిరాముడు, కోశాధికారిగా ఏసురత్నం, చీఫ్ ప్యాట్రన్గా దస్తగిరిరెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీమెంట్ పేరుతో ఉద్యోగులకు, కార్మిక వర్గానికి పాలకులు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీస వేతనాలు లేక చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోతుందని, కార్మికులను, కష్ట జీవులతో కారు చవకగా పని చేయిస్తూ పెట్టుబడి, కార్పోరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించా రు. కార్మికుల హక్కుల కోసం లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలను పని చేయాలని నిర్ణయించడం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. మహిళా ఉద్యోగుల, మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్కుమార్, రాజశేఖర్, రామచంద్రుడు, నాగేశ్వరరావు, నరసింహనాయక్, లక్ష్మణ్, బాలవెంకట్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పద్మావతికే.. ఫలహారం!
శ్రీశైలంటెంపుల్: వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి.. అన్న చందంగా తయారైంది శ్రీశైలంలో పద్మావతి ఏజెన్సీ పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడికి బంధువు సంస్థ అని చెప్పుకుంటూ ఏడు ప్రముఖ ఆలయాల్లో పద్మావతి ఏజెన్సీ శానిటేషన్, హౌస్కీపింగ్ పనులు దక్కించుకుంది. శ్రీశైలంలో కూడా ఆ సంస్థ చేపట్టిన శానిటేషన్, హౌస్కీపింగ్పై భక్తుల్లో 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తికి చెందిన ఏజెన్సీ కావడంతో అధికారులు ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ..నిబంధనలకు విరుద్ధగా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణలో శానిటేషన్ అతి ముఖ్యమైనది. శానిటేషన్ పనుల నిర్వహణ కోసం ప్రతి ఏడాది జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించి, 1000 మందితో 11 రోజుల పాటు శానిటేషన్ పనులు చేపడతారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా శ్రీశైలంలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీకే అప్పగించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభు త్వ పెద్దలతో పద్మావతి ఎండీకి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎవరు నో చెప్పకుండా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల శానిటేషన్ పని విలువ సుమారు రూ.45 లక్షలు వరకు ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ద్వారానే టెండర్లు నిర్వహించి శానిటేషన్ పనులు చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం గత నిబంధనలకు భిన్నంగా పద్మావతి ఏజెన్సీకే మల్లన్న ఫలహారం అందేలా ట్రస్ట్బోర్డు, అధికారులు చక్రం తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఏటా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో శానిటేషన్ టెండర్ల నిర్వహణ ఈ ఏడాది టెండర్లు నిర్వహించకుండా పద్మావతి ఏజెన్సీకే అప్పగింత -
అహోబిలేశుడికి నీరాజనం
ఆళ్లగడ్డ: అహోబిలేశుని పార్వేట పల్లకీ గురువారం చింతకుంటకు చేరింది. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె నుంచి తెల్లవారు జామున ఎంవీనగర్కు చేరుకుంది. అక్కడ ఎంపీడీఓ కార్యాయలయం, డీఎస్పీ, పోలీస్ సర్కిల్ కార్యాలయాల్లో విశేష పూజలు అందుకున్న అనంతరం చింతకుంట గ్రామం చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న ఉత్సవమూర్తులకు సంప్రదాయ ప్రకారం వీఆర్వో బారెడ్డి రాజగోపాల్రెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి వెళ్లి స్వాగతం పలికారు అనంతరం పల్లకీని భుజాలపై మోస్తూ మొదటి తెలుపుపై కొలువుంచారు. ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వాములను గ్రామస్తులు బారులు దీరి దర్శించుకున్నారు. గ్రామంలోని పలు తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ పల్లకీకి ప్రజలు విశేష పూజలు చేశారు. ప్రధాన వీధుల్లో బొమ్మలు, గాజుల అంగళ్లు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో తిరునాల వాతావరణం నెలకొంది. ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అరెస్ట్ ● మద్యం మత్తులో బస్సు డ్రైవింగ్ ● ప్రయాణికుల ఫిర్యాదుతో అరెస్ట్ పాణ్యం: మద్యం మత్తులో ఉన్న ఇద్ద రు ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 26 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్య లో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాణ్యం సమీపంలో బస్సు డ్రైవర్ రహదారిపై ఉన్న బారికేడ్స్ను ఢీకొని, ర్యాష్ డ్రైవింగ్ చేయడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బలపనూరు వద్ద బస్సును నిలిపేశారు. ఇద్దరు డ్రైవర్లను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్కు పంపించి కావేరి బస్సును స్టేషన్కు తరలించారు. హైదరాబాద్కు చెందిన డ్రైవ ర్లు ఆంజినేయులు, విశ్వనాథ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. -
గో సంరక్షణనిధికి విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దాత శ్రీరామమూర్తి రూ.1,23,456 విరాళాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే అనంతపురానికి చెందిన బి.రూపేష్సింగ్ రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. గూడూరు బార్ లైసెన్స్ కోసం లాటరీ కర్నూలు(సెంట్రల్): గూడూరులోని బార్ లైసెన్స్ కోసం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీసినట్లు డీఆర్వో సి.వెంకట నారాయణ మ్మ తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో జిల్లా ప్రొమిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధి కారి ఎం.సుధీర్బాబుతో కలసి వచ్చిన నాలుగు దరఖాస్తులను పరిశీలించారు. వారి సమక్షంలోనే సక్సెస్ఫుల్ అండ్ రిజర్వ్ దరఖాస్తులను నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరిటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు మంజుల, చంద్రహాస్ పాల్గొన్నారు. 105 ఏళ్ల వృద్ధురాలి మృతి కొత్తపల్లి: ఎం.లింగాపురం గ్రామంలో 105 ఏళ్ల చిమ్మె రత్న మ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. ఈమె 1921లో జన్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వయస్సు పైబడడంతో గురువారం ఆమె మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈమెకు నలుగురు కుమారులుగా, ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 40కిపైగా ఉంది. బైక్ల దొంగ అరెస్ట్ నంద్యాల: బైక్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను నంద్యాల వన్టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత నెల 25వ తేదీన కర్నూలు పట్టణానికి చెందిన నరసప్ప అనే వ్యక్తి బస్టాండ్ బయట బైక్ పార్కింగ్ చేసి బస్సు విచారణ కోసం వెళ్లి వచ్చేలోపు బైక్ కనిపించలేదు. ఈ చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్వలి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం పట్టణంలోని చెరువు కట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా మహమ్మద్ వలిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద నుంచి స్కూటీ, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు వలిపై గతంలో కర్నూ లు, ఓర్వకల్లు, ఆత్మకూరు, బేతంచెర్ల, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమో దు అయ్యాయన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నంద్యాల కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్కు ఆదేశించారన్నారు. పురాతన శివాలయం పరిశీలన నందవరం: రాయచోటి గ్రామంలోని పశ్చిమ చోళుల కాలం నాటి చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గురువారం గ్రామంలోని శివాలయంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామి నాయక్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్రనాయుడు, సైట్ ఇంజనీర్ జి.పి శ్రీనివాసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆలయాన్ని సందర్శించి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ గ్రామంలో వెయ్యేళ్లు పైగా చోళుల కాలం నాటి శివాలయ పునరుర్ధణ చర్యలు చేపడుతునట్లు తెలిపారు. -
పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేశారు. అయితే పాసు పుస్తకం ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. భూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే రీసర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు వ్యతిరేకించారో తెలియడం లేదు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. – తువ్వదొడ్డి ఆనంద్, ముక్కెళ్ల, తుగ్గలి మండలం నా పొలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే రీసర్వే చేశారు. జీయో కోఆర్డినేట్స్తో కూడిన పాసుపుస్తకాన్ని ఇచ్చారు. అయితే దానిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తది మాత్రం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. బ్యాంకులో రుణం కోసం వెళ్తే పాసు పుస్తకం అడుగుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. – సోమేష్, మూగలదొడ్డి, కోసిగి మండలం -
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు
కర్నూలు సిటీ: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్లో 223 మంది, హైయర్లో 85 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి ఎస్ఏపీ క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో ఈ నెల 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయన్నారు. టైలరింగ్ లోయర్ పరీక్షకు 141 మంది, హైయర్ పరీక్షకు 60 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షకు ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ నెల 18, 19 తేదీల్లో పరీక్ష జరుగనుందన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ తెలిపారు. బాలుడిపై వీధి కుక్కల దాడి ఆళ్లగడ్డ: వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. తొమ్మండ్రు వీధికి చెందిన దస్తానంద, రజియా దంపతుల కుమారుడు ఆరేళ్ల దివికేశ్ ఇంటి ముంద సైకిల్తో ఆడుతుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కుక్కల దాడి నుంచి బాలుడిని రక్షించారు. ఈ దాడిలో బాలుడి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలున్ని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు. -
కల్వర్టు గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి/కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులు, మద్దమ్మ ఒక్కగానొక్క కుమారుడు బోయ హరికృష్ణ (25) వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇటీవల కాలు బెనికింది. కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన బొల్లారం నాగమద్దయ్యతో పరిచయం ఉండటంతో ఇద్దరు కలిసి బైక్పై నాటువైద్యం చేయించుకునేందుకు గోనెగండ్ల ఆలువాల గ్రామానికి వెళ్లాడు. నాటు వైద్యం చేయించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో వెంకటగిరి, ఎర్రకత్వ గ్రామాల మధ్య కల్వర్టు కోసం తవ్విన గుంత వద్ద డైవర్షన్ రోడ్డు వేసినా అందుకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయక పోవడంతో వేగంగా వస్తున్న వారు పది అడుగుల గుంతలో పడిపోయారు. బైక్ వెనుక కూర్చున్న చెరుకులపాడు బోయ హరికృష్ణ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, నాగమద్దయ్య గాయాలపాలయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో అటుగా వచ్చిన వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, సంఘటనా స్థలంలో సూచికలు లేకుండా నిర్మాణాలు చేపట్టిన సదరు కాంట్రాక్టరుపై సైతం చట్టపరమైన చర్యలకు విచారణ చేస్తున్నట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు బోయ హరికృష్ణకు వెల్దుర్తి పట్టణం కొండపేటకు చెందిన యువతితో రెండు నెలల క్రితమే వివాహమైంది. కల్వర్టు నిర్మాణం వద్ద సూచికలు ఏర్పాటు చేయని వైనం బైక్పై వెళ్తూ గుంతలో పడిన ఇద్దరు ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు -
రికార్డుల నిర్వహణ ఇలాగేనా?
● హార్టికల్చర్పై అవగాహన ఎక్కడ కల్పించారు? ● డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహంకొత్తపల్లి: ఉపాధి హామీ అధికారులపై డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ మేరి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అనుబంధ సంస్థలలో జరిగిన పనులపై 18వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వహణ అంతా అస్తవ్యస్థంగా ఉందన్నారు. చేసిన పనుల ఫొటోలు లేకపోవడంతో ఎక్కడ, ఎప్పుడు పనులు చేశారో తనిఖీ అధికారులు గుర్తించలేకపోయారన్నారు. రికార్డుల నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు. హార్టికల్చర్పై రైతులకు అవగాహన ఎవ్వరూ కల్పించినట్లు లేదన్నారు. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త్తలు తీసుకోవాలన్నారు. 2024–25లో రూ.9.90 కోట్లతో జరిగిన 961 పనులపై సామాజిక తనిఖీ చేయగా 1.79 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించారన్నారు. హార్టికల్చర్ కింద రైతుల పొలాల్లో మొక్కలు లేనందున మొక్కలు లేని చోట రీ ప్లాంటేషన్ చేయకపోతే రైతుల నుంచి రీప్లాంటేషన్కు రూ.96,796 రీకవరి చేయాలని ఆదేశించారు. మిగిలిన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏపీడీ వెంకటరామిరెడ్డి, అడిషనల్ విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ చంద్రమోహన్, ఏపీఓ విమలమ్మ, పీఆర్ఏఈ మద్దిలేటి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు. -
ప్రతి పేజీ మోసమే!
కర్నూలు(సెంట్రల్): పట్టదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్తగా రాజముద్రతో ఇస్తామని ఊరించింది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇప్పటికీ అరకొరగానే మంజూరు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీటిని రైతులకు అందించేందుకు ఎమ్మిగనూరు మండలం కలుగోట్లలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 472 గ్రామాలకు 254 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి 1.92,472 మంది రైతులకు జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల ముందు రీసర్వేపై చంద్రబాబుతో పాటు పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల భూములు లాక్కుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే రీసర్వేను నిలుపుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే 2025 జనవరి 20 నుంచి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు–భూరక్ష పథకం పేరు మార్చి ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరిట రీసర్వే చేపడుతుండటం చూసి రైతులు అవాక్కవుతున్నారు. రెండేళ్ల తరువాత రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇస్తున్నా జిల్లాకు అరకొరగానే మంజూరయ్యాయి. మొత్తం 1,92,472 మంది రైతుల్లో 84వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు చేరాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పులే తప్పులు గత ప్రభుత్వం మంజూరు చేసిన జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టదారు పాసు పుస్తకాలను రద్దు చేసిన చంద్రబాబునాయుడు.. వాటి స్థానంలో రాజముద్రదతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాటిలో వివరాలు సక్రమంగా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఎల్పీ నంబర్, పేరు, ఇంటి పేరు, పాసు పుస్తకం నంబరు తదితర వివరాల్లో అచ్చు తప్పులు ఎక్కువగా దొర్లడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల తరువాత ఇస్తున్నా వాటిలో అన్నీ తప్పులే ఉండటం పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ రీసర్వేపై టీడీపీ, జనసేన దుష్ప్రచారం అధికారంలోకి రాగానే తిరిగి రీసర్వేకు శ్రీకారం పాత పుస్తకాలను రద్దుచేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొరగానే పాసుపుస్తకాలు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు రైతుల అవస్థలు నేడు కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటన -
9న అప్రెంటిస్ మేళా
కర్నూలు సిటీ: ఏపీ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని బి.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ(బాలికలు)కాలేజీలో మేళా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు మేళాలో పాల్గొంటారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఆన్లైన్లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ httpr:/apprenticerhipindia.gov.in అనే పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మేళాకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు బదిలీ కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖకు సంబంధించిన జిల్లా వనరుల కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన ఇక్కడ రిలీవ్ కానున్నట్లు సమాచారం. ఖజానా శాఖలో ఇద్దరికి పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ శాఖలో ఇద్దరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఖజాన శాఖ డైరెక్టర్ మోహన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓగా పనిచేస్తున్న విజయమ్మకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరుగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేశారు. గూడూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న భాగ్యమ్మకు ఎస్టీఓగా పదోన్నతి లభించింది. ఈమె ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ అధికారిగా బదిలీ అయ్యారు. కర్నూలు సబ్ ట్రెజరీ ఎస్టీఓగా శ్రీనివాసరాజు కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ అధికారిగా శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న విక్రాంత్ జనవరి 31న పదవీ విరమణ పొందారు. ఈ పోస్టులో శ్రీనివాసరాజును నియమించారు. గతంలో శ్రీశైలం ఎస్టీఓగా పనిచేసిన ఆయన ఆరు నెలలుగా సెలవుల్లో ఉన్నారు. పంటల నమోదు 52 శాతమే కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ పంటల నమోదు సుదీర్ఘంగా సాగుతోంది. రబీ సీజన్లో సాగు చేసిన శనగ, జొన్న, వాము తదితర పంటల కోతలు ముగింపు దశకు చేరుకున్నాయి. పంటల నమోదు మాత్రం 50 శాతం కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 8,32,213 సర్వే నెంబర్లకు సంబంధించి 13,46,416 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి సర్వే నెంబర్కు వెళ్లి పంట ఉన్నా.. లేకపోయినా నమోదు చేయాల్సి ఉంది. హాలహర్వి, కౌతాలం, ఆలూరు, ఓర్వకల్ మండలాలు రబీ పంటల నమోదులో పూర్తిగా వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు 3,62,774 సర్వే నెంబర్లను నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 6,14,760 ఎకరాలను ఈ–క్రాప్లో నమోదు చేశారు. రబీ సీజన్ ముగింపు దశకు చేరినప్పటికీ 52 శాతం వరకే మాత్రమే పంటల నమోదు పూర్తయింది. తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలోని పరిమళ తీర్థ పుష్కరిణిలో గురువారం రాత్రి ప్రహ్లాదరాయలు తెప్పోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ మఠం మూల బృందవనం నుంచి పల్లకీలో ప్రహ్లాదరాయలు ఉత్సమూర్తిని ఊరేగింపుగా పరిమళ తీర్థ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేపట్టిన తెప్పోత్సవాన్ని తిలకేంచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. పరిమళ పుష్కరిణి మండపంలో ముందుగా పూలతో పుష్పార్చన, అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు మహా మంగళ హారతులు చేపట్టి భక్తులు హారతి ని దర్శించుకున్నారు. అనంతరం పుష్కరిణిలో మండపం చుట్టూ ప్రహ్లాదరాయలు తెప్పోత్సవంలో విహరిస్తూ భక్తులను పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. -
సంకల్పదారులు
సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు (సెంట్రల్): ‘చలో పోతిరెడ్డిపాడు’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సభ ఏర్పాట్లకు కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను బైరెడ్డి పరిశీలించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పార్టీలో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆత్మకూరులో భోజన వసతిని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రైతుల ‘సునామీ’ ● భారీగా తరలివచ్చిన రాయలసీమ రైతులు జూపాడుబంగ్లా: ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు రైతులు సునామీలా తరలివచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టుపెట్టి సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేందుకు చేపట్టిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభ విజయవంతం కాకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నినా ఫలితం లేకుండా పోయింది. సభ నిర్వహణకు కేవలం 18గంటల ముందు మాత్రమే అనుమతులు మంజూరైనా వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంటు బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్ నిర్ణీత సమయానికి సభను ముస్తాబు చేయించారు. అంచనాలను మించిపోయి రాయలసీమ జిల్లాల నుంచి 10 వేల మందికిపైగా రైతులు తరలివచ్చారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2.30గంటల వరకు కొనసాగింది. అప్పటిదాకా సభా ప్రాంగణానికి సుదూర ప్రాంతాల్లోని రైతులు తరలివస్తూనే ఉన్నారు. రైతులు, ప్రజలు సభాప్రాంగణం వద్దకు మినహా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల పథకం చూసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రైతులు పోలీసుల వైఖరిని తప్పుపడుతూ వెనుదిరిగారు. -
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
పోరాట గళం: బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిసాక్షి, నంద్యాల: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు. సొంత ప్రయోజనాల కోసం సీమకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేయాల్సిన ఆలోచన ఎలా వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ లిఫ్ట్ పథక నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నిలిపి వేయడాన్ని నిరశిస్తూ రైతులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా.. రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై వైఎస్సార్సీపీ కన్నెర్ర చేసింది. తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మకై ్క సీమ రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుని తీరతామని ప్రతినబూనింది. చంద్రబాబు చేస్తున్న ప్రజాకంఠక పాలనను వివరించేందుకు చలో పోతిరెడ్డిపాడు సభకు పిలుపునిచ్చింది. ఒక్క పిలుపుతో రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు ఉత్సాహంగా ఉరకలేస్తూ భారీగా తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే.. పోతిరెడ్డిపాడు సభ ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించకుంటే రాజకీయంగా సమాధి కడతామని హెచ్చరించారు. చంద్రబాబుకు చేతకాకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి.. సభ ప్రారంభానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని సందర్శించారు. అక్కడ ఆగిపోయిన పనులను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోతులపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరి వరకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చలో పోతిరెడ్డిపాడు సభను విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం రెండు గంటల పాటే నిర్వహించాలని నిబంధన విధించారు. కేవలం ఒక రోజు ముందు అనుమతి ఇవ్వడంతో సభకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేరని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యేలా సభ సాగింది. ఉదయం నుంచే గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పది వేలకు పైగా వచ్చిన జనం సమయం లేకపోవడంతో కేవలం నాలుగు వేల మంది కూర్చునే సామర్థ్యంతో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకే కుర్చీలు మొత్తం ఫుల్ అయ్యాయి. సభకు అటు ఇటు దాదాపు ఐదు వేల మంది నిల్చొని తమ అభిమాన నాయకుల ప్రసంగాలను వీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు సభ సాగింది. సభ పూర్తయ్యే వరకు ప్రజలు, రైతులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ మద్దతును ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో పాటు రాయలసీమ లిఫ్ట్ పథకానికి చంద్రబాబు ఎలా దగా చేశారో నేతలు వివరించారు. సీమ అంటేనే చంద్రబాబుకు గిట్టదని.. తన రాజకీయ జీవితంలో ఏనాడూ సీమ అభివృద్ధిని, రైతుల కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదని తెలిపారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన హయాంలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని గణాంకాలతో వివరించారు. వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభ నామమాత్రంగా సాగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు మొదట భావించాయి. కానీ, సభ ప్రారంభమయ్యే సమయానికి వారి అంచనాలు తలకిందులయ్యాయి. సభకు ప్రజలు పోటెత్తారు. సుమారు పది వేల మందికి పైగా జనాలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు. దారులన్నీ పోతులపాడు వైపే... చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు వాహనాలలో తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ప్రాంతమంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. కర్నూలు – ఆత్మకూరు హైవే నుంచి పోతులపాడు గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో నాయకులు, ప్రజలు హైవే నుంచి నడుచుకుంటూ వచ్చారు. రైతులు పొలం గట్ల వెంబడి అడుగులో అడుగు వేసుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాతో సభకు వచ్చిన అభిమాని ఫ్లెక్సీల ప్రదర్శన సభకు వచ్చిన యువకులు సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేలా ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. ‘రాయలసీమ ద్రోహి.. తెలంగాణ పక్షపాతి.. చంద్రబాబు డౌన్ .. డౌన్’ అంటూ రాసిన ప్లెక్సీలను ప్రదర్శించడంతో పాటు భారీ ఎత్తున నినాదాలు చేశారు. పులి కథతో ఆకట్టుకున్న బైరెడ్డి సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడిన మాటలు ఆకట్టుకోవడంతో పాటు అందరినీ ఆలోచింపజేశాయి. చిన్నపాటి కథతో చంద్రబాబు నైజాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు. ఒక వేటగాడు పులితో భయంకరంగా ఫైట్ చేసి చంపేసిన తర్వాత తనకు గాయాలు కావడంతో మందు తెచ్చుకోవడానికి వెళితే.. ఈ లోపు చంద్రబాబు లాంటోడు వచ్చి.. పులి గోళ్లు.. పళ్లు ఎత్తుకెళ్లి .. పులిని నేనే చంపాను అంటూ ఊరంతా టాం... టాం.. వేసుకున్నట్లు... చంద్రబాబు తీరు కూడా అంతేనని చెప్పడంతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మోగింది. కదంతొక్కిన రాయలసీమ రైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపాటు తక్కువ సమయం ఉన్నా భారీగా తరలివచ్చిన కర్షకులు రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాలని వైఎస్సార్సీపీ ముఖ్య నేతల డిమాండ్ లేదంటే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక -
దిగుబడి భళా..ధర డీలా!
మండల పరిధిలోని ముక్కమల్ల గ్రామంలో ఓ రైతు శనగ పంట ఇరగ్గాసింది.ఈ ఏడాది రబీ సీజన్లో వేసిన శనగ విత్తనానికి వాతవారణం అనుకులించడంతో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ముక్కమల్ల గ్రామానికి చెందిన పోచ వెంకట రామిరెడ్డి రైతు ఐదు ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. నూర్పిడి చేశాక ఎకరాకు 14 క్వింటాలు దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి అయినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు. ప్రభుత్వ స్పందించి శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు – సంజామల -
పరమేశ్వరా.. నిర్లక్ష్యం చూడవా!
శ్రీశైలంటెంపుల్: మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తుల రాక కూడా మొదలైంది. అయితే క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండుమూడురోజుల ముందే ఉత్సవ శోభ కనిపించేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో పరమేశ్వరా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఏవీ అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుకు సాగని పనులు శ్రీశైలంలో జర్మన్షెడ్లతో తాత్కాలిక క్యూ కంపార్ట్మెంట్, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇరువైపులా భక్తులు సేదతీరేందుకు జర్మన్ షీట్లతో భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద టెంజైల్ షెడ్తో మరో క్యూ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆలయ గోపురాలకు, ఉభయ దేవాలయాలకు విద్యుద్దీకరణ, చలువ పందిళ్లు, షామియానాలు, ఉద్యానవనాల్లో, ఆరుబయలు ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ప్రధానరోడ్డుకు ఇరువైపులా గ్రావెల్తో చదును చేసే పనులు, పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పాతాళగంగ వద్ద ఇనుప మెష్తో బారికేడింగ్, ప్రధాన రోడ్లలో డివైడర్లకు పెయింటింగ్, తాత్కాలిక టాయిలెట్లు తదితర పనులు ఇంకా పూర్తి కాలేదు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇంకా ఇవ్వలేదు. మరో మూడు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా ఈ పనులన్నీ పూర్తవుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. సమీక్షలకే సరి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేది నుంచి 18వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం విస్తృ త ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. దేవస్థాన ఈఓ ఆధ్వర్యంలో రెండు సార్లు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సారి, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో సహా దేవస్థాన అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు చేశారు. క్షేత్ర పరిధిలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అయినా, ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
వైద్యం వికటించి శిశువు మృతి!
నందికొట్కూరు: పట్టణంలోని ఓ వైద్యశాలలో వైద్యం వికటించి ఆరునెలల శిశువు మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కుమ్మరి పేటకు చెందిన షాకీర్బాషా, అజిదాబాను దంపతుల కుమారుడు అబ్దుల్ రహిమాన్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తల్లిదండ్రులు స్థానిక అనసూయ హాస్పటల్కు తీసుకెళ్లారు. మూడు రోజుల నుంచి డాక్టర్ శ్రీనివాసులు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఆ బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి జోక్యం చేసుకొని విచారించి డాక్టర్ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఆదోని రూరల్: ఆదోని–ఎమ్మిగనూరు జాతీయ రహదారిలో స్కూటర్కు కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. తాలూకా ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.... ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్కుమార్ (30) ఎర్రకోటలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను బుధవారం స్కూటీపై ఆదోని మండలంలోని పెసలబండ దేవరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు (కేఏ41 ఎంఏ3367) అతివేగంగా వచ్చి వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న పవన్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పవన్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రులు జయలక్ష్మి, హనుమంతు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. టిప్పర్కు రూ. 2.45 లక్షల జరిమాన డోన్ టౌన్ : జాతీయ రహదారిలో దత్తాత్రేయ స్వామి గుడి వద్ద బుధవారం ఓ టిప్పర్ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వెల్దుర్తి వద్ద జరుగుతున్న రైల్వే పనులకు వినియోగిస్తున్న ఈ వాహనానికి సంబంధించి రెండేళ్లుగా ఫిట్నెస్, రోడ్డు ట్యాక్స్ చెల్లించలేదు. అధికారులు బుధవారం దత్తాత్రేయ స్వామి తనిఖీలు నిర్వహిస్తుండగా కనిపించడంతో రూ. 2.45 లక్షల జరిమాన విధించి టిప్పర్ను డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు తిప్పరాదని, ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు. -
ఏటీఎం దొంగ దొరికాడు
నంద్యాల: బ్యాంకు పాసుపుస్తకంలో లావాదేవీల ప్రింటింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడిని ఏ మార్చి ఏటీఎం ద్వారా రూ.1.24లక్షలు నగదు కాజేసిన దొంగ పట్టుబడ్డాడు. నంద్యాల ఏఎస్పీ మందా జావలి తెలిపిన మేరకు వివరాలు.. గత నెల 29వ తేదీన శ్రీనివాససెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన వృద్ధుడు సుబ్బరాయుడు బ్యాంకు పాసు పుస్తకంలో ప్రింటింగ్ కోసం వచ్చాడు. అక్కడే కాపుకాచి ఉన్న వెల్దూర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండన్నగారి సిద్దేష్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి నగదు డ్రా చేసుకుంటే ప్రింటింగ్ వస్తుందని నమ్మబలికించాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.1000 తీసి ఇవ్వమని ఏటీఎం ఇచ్చి పిన్ నంబరు చెప్పాడు. డబ్బు డ్రా తర్వాత వృద్ధుడికి నకిలీ ఏటీఎం ఇచ్చాడు. అతను ఇంటి వద్దకు వెళ్లిన కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.1.24 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్యాంకు వద్ద, ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి బుధవారం నంద్యాల బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు ఇదే తరహాలో కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు 11 కేసులు ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఏటీఎంల వద్దకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వడం, పిన్నంబరు చెప్పడం చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీఅభినందించారు. -
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్వరలో జన ఔషధి
నంద్యాల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో జన ఔషధి మెడికల్ షాప్ అందుబాటులోకి రానుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్ రూమును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో ఈ షాపులను ప్రారంభిస్తోందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి, జిల్లా చైర్మన్ దస్తగిరి, జిల్లా సెక్రెటరీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని బాషా, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్బాష, రెడ్ క్రాస్ డీఎఫ్ఓ సమీ, ఫార్మసిస్టు ఇంద్రజ, మున్సిపల్ ఇంజినీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచార నిందితులను అరెస్టు చేయాలి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని అంబేడ్కర్ నగర్లో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఐద్వా, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాఘవేంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.అరుణ, బాధితురాలి కోడళ్లు, కృషమ్మ, మేరీ మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీన అంబేడ్కర్ నగర్లో 50 ఏళ్ల వృద్ధురాలిపై అత్యంత పాశవికంగా కళ్లలో కారం చల్లి.. చేతులు కట్టేసి ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఆమెను కర్రలు, రాళ్లతో కొట్టి హింసించారని, ఇది మానవ జాతికే అవమానకరమన్నారు. నిందితులకు మరో మహిళ సహకరించడం దురదృష్టకరమని, అత్యాచారం జరిగి ఆరు రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం తగదన్నారు. పోలీసులే కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ జోక్యం చేసుకొని నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే గ్రామస్తులతో కలసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
ఆలూరు రూరల్: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఆలూరు పోలీసు స్టేషన్ ఆవరణలో బుధవారం ఎస్ఐ మన్మధ విజయ్తో కలిసి సీఐ రవి శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత నెల జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులో నివాస ఉంటున్న సరోజమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి భర్త ఫోన్ నంబర్ అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లో కేసు ఛేదించారు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి, రుద్రవరం మండల నందనపల్లె గ్రామానికి చెందిన తిరుపతి సురేష్ స్నేహితులు. నేర ప్రవృత్తి కలిగిన వీరే ఆలూరు వచ్చి సరోజమ్మ మెడలోని బంగారు చైను దోచుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం ఆలూరు మండలంలోని అంగసకల్లు గ్రామ రోడ్డులో నిందితులు కనిపించడంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ చైన్ స్నాచర్లపై తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని ఉండవల్లి పీఎస్లో రౌడీ షీటర్ ఉందని, అలాగే వివిధ పోలీసు స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు. -
మల్లన్న దర్శనానికి జర్మనీ దేశస్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి జర్మనీ దేశస్తులు తరలి వచ్చారు. బుధవారం ఆ దేశానికి చెందిన సుమారు 20 మందితో కూడిన బృందం శ్రీశైలానికి చేరుకొని ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనానికి వెళ్లారు. జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. విదేశీ భక్తులను చూసిన స్థానికులు, యాత్రికులు వారితో మాటామంతి కలిపి, ఫొటోలు దిగేందుకు అసక్తి చూపారు. ప్లాస్టిక్ ప్లేట్ల వాహనాలు సీజ్ శ్రీశైలంప్రాజెక్ట్/ఆత్మకూరు రూరల్: శ్రీశైలం శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద బుధవారం ప్లాస్టిక్ ప్లేట్లను తరలిస్తున్న రెండు వాహనాలను శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పరమేశు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన తిరుమలశెట్టి, శ్రీకాంత్ టాటా ఇంట్రాల్ ఏపీ 39 ఏజె 4604 వాహనంలో 6,000 ప్లాస్టిక్ ప్లేట్లు శ్రీశైలంలోని భ్రామరి హోటల్కు తెస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పల్లె శివరామకృష్ణ అనే మరో వ్యక్తి శ్రీశైలంలోని రెడ్ల అన్నదాన సత్రానికి 1,30,000 ప్లాస్టిక్ ప్లేట్లను తెస్తున్నాడు. శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ వాహనాలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అటవీ అధికారి మాట్లాడుతూ నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతమని తెలిపారు. ఇటువంటి ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధమని, ఎవరైనా ఇటువంటి వస్తువులు కలిగి ఉన్నా, తరలించినా అటవీ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముథూట్, అపోలో ఫార్మసీలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఆయా ఉద్యోగాలకు పది నుంచి డిగ్రీ, ఫాం(బీడీఎం) చదివిన వారు అర్హులని, వయసు 21–35 సంవత్సరాలు ఉండాలన్నారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు. వ్యక్తి బలవన్మరణం డోన్ టౌన్ : పట్టణంలోని కొండపేటకు చెంది న రామసుబ్బయ్య (41) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన కొన్నేళ్ల నుంచి తాగుడుకు బానిసై ఏం పని చేసేవాడు కా దు. అయితే, ఉన్నట్టుండి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులుఓ గదిలో నిద్రిస్తుండగా మరో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రామసుబ్బయ్య అక్క లక్ష్మీదేవి ఫిర్యాధు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుష్టును నిర్మూలిద్దాం గోస్పాడు: కుష్టువ్యాధిపై అవగాహన పెంచుకొని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. బుధవారం నంద్యాలలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార వాహనం ద్వారా ఊరూరా ప్రజలకు కుష్టుపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం నంద్యాల: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 491 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానం ద్వారా 474 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 17 దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
ఆటోలతో విన్యాసాలు చేసి.. పోలీసులకు చిక్కి!
● ముగ్గురు యువకులు అరెస్టు.. ఆటోలు సీజ్ కర్నూలు: కర్నూలు–హైదరాబాద్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆటోలతో ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మూడు పోలీసు బృందాలను రంగంలోకి దింపి మమతా నగర్కు చెందిన శివ మల్లేష్, పేరపోగు అఖిల్, అశోక్ నగర్లోని శ్రీకృష్ణ కాలనీకి చెందిన గనమూరు జయసింహలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈనెల 1వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో పై ముగ్గురు నిందితులు పంచలింగాల సర్కిల్ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి ఆటోలను తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ సరదా కోసం రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. -
మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు, వేరుశనగ ధరలు పడిపోతున్నాయి. ప్రధానంగా కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గరిష్టంగా క్వింటా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8వేల లోపునకు పడిపోయింది. మార్కెట్కు కందులు 3,655 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,609, గరిష్ట ధర రూ.7,901 లభించింది. సగటు ధర రూ.7,801 నమోదైంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లలో కందుల ధరలు మరింత అధ్వానంగా ఉంటున్నాయి. కాగా వేరుశనగ ధర గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.15వేలకు చేరింది. ఈ ధర మూన్నాళ్ల ముచ్చటగా మారింది. మరుసటి రోజు నుంచే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు మార్కెట్కు 406 క్వింటాళ్ల వేరుశనగ వచ్చాయి. కనిష్టంగా రూ.5,625, గరిష్ట ధర రూ.9,018 లభించింది. నాలుగైదు రోజుల వ్యవధిలోనే క్వింటాపై రూ.6 వేల వరకు తగ్గడం గమనార్హం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి గోనెగండ్ల: చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ సుధాకర్ సూచించారు. బుధవారం మండల కేంద్రం గోనెగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక(హరిజన వాడ)పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలతో మాట్లాడి వివిధ సబ్జెక్టులలో వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట జేఎస్డబ్ల్యూ స్నేహలత, ఎంఈఓలు రామాంజినేయులు, నీలకంఠ, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు. సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులు కర్నూలు: ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 6న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బందోబస్తుకు నాలుగు జిల్లాల పోలీసులను వినియోగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు, 88 మంది ఎస్ఐలు, 297 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 485 మంది కానిస్టేబుళ్లు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, రెండు సెక్షన్ల ఏఆర్ పోలీసులు, 14 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్యేక అధికారిగా ఆజాద్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు ఉత్సవాల ముఖ్య అధికారిగా ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు సిబ్బందిని నియమించారు. వసతి గది, అటెండర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీఆర్వోను ఆదేశించారు. -
చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులతో నిలిచిన నీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పే చిత్రం ఇదీ..జూపాడుబంగ్లా: రాయలసీమ ప్రజలు తమ గర్జనను వినిపించే సమయం ఆసన్నమైంది. సాగునీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ‘తాకట్టు’పై శంఖారావం పూరించే మహోన్నత అవకాశం లభించింది. గురువారం పోతులపాడు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ‘సీమ’ అకాంక్ష ప్రదర్శితం కానుంది. అనుమతివ్వకపోయినా కచ్చితంగా ‘చలో పోతిరెడ్డిపాడు’ నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్, ఎమ్మెల్సీ ఇసాక్బాష, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమతులు మంజూరయ్యాయి. వెంటనే పోతులపాడు గ్రామంలోని వెంకటశివారెడ్డి, చిన్నశాంతన్న పొలంలో రైతుశంఖారావం సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు. అడ్డంకులను దాటుకుని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవటానికి కారణమైన సీఎం చంద్రబాబు మోసాన్ని రైతులు, ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 5న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. అందులో భాగంగా జనవరి 30న పోతులపాడు గ్రామంలో సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ ఆదేశాలతో 30వ తేదీ సాయంత్రం ఆత్మకూరు డీఎస్పీ రాంమాజనేయనాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించారు. దీంతో అక్కడ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు 6 కిలోమీటర్ల పరిధిలో సభ నిర్వహించవద్దని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తరిగోపుల క్రాస్రోడ్డు వద్ద రైస్మిల్ సమీపంలో సభ నిర్వహణకు మరోసారి కాటసాని రాంభూపాల్రెడ్డి, బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, దారా సుధీర్, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అయినా సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. వెంటనే పోతులపాడులో సభ నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే సభకు రాయలసీమ జిల్లాల్లోని రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన మోటార్లు బిగించని ప్రాంతంనందికొట్కూరు: తల్లిలాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టడంపై రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. రాయలసీమ జిల్లాలోని 52 నియోజకవర్గాలకు, నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు కష్టాలు తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకంతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు కాల్వలోకి ఎత్తిపోయవచ్చు. రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు కష్టాలు తీరుతాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు సీఎం చంద్రబాబు ఆపేశారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆంక్షలు విధిస్తూ భారీ బందోబస్తు చలో పోతిరెడ్డిపాడు సభ నిర్వహణకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంతో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభకు వచ్చే వారు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సభకు ఎలా వచ్చారో ముగిసిన తర్వాత అలాగే వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చూసేందుకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు శంఖారావం పేరుతో ‘చలో పోతిరెడ్డిపాడు’ పోతులపాడులో ముమ్మరంగా సభ ఏర్పాట్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాటసాని, సిద్ధార్థరెడ్డి, దారాసుధీర్ రాయలసీమ రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపు -
వ్యక్తిగత కక్షలతోనే హత్య
పత్తికొండ: ఏపీ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ను వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. బుధవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్టు చూపి వివరాలను వెల్లడించారు. బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ ఏపీ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ సామాజికవర్గ సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలోని మైనార్టీ వర్గానికి చెందిన షేక్ సుభాన్వలి కుటుంబంతో కొద్ది రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. గతంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వేధించారన్న కారణంతో సుభాన్వలి కుటుంబ సభ్యుల్లో ఒకరిపై తుగ్గలి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అంతేకాకుండా సుభాన్ కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి పక్కనున్న స్థలం సమస్యలో రమేష్ జోక్యం చేసుకొని కొంత స్థలాన్ని అవతలి వర్గానికి ఇప్పించడంతో కక్ష పెంచుకున్నారు. సమీప బంధువైన లింగనేనిదొడ్డి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ పొలం విషయంలోనూ రమేష్ కలుగజేసుకొని పొలం సర్వే చేయించడంతో పాటు దాదాపు 2 ఎకరాలు ఇతరులకు స్వాధీనం కావడానికి కారణమయ్యాడనే బాధ పెంచుకున్నారు. ప్రతి పనిలో అడ్డుతగులుతూ ఆర్థికంగా నష్టం చేస్తుండటంతో రమేష్ను అంతమొందించేందుకు నిర్ణయించుకున్నారు. వాకింగ్కు వెళ్లిన సమయంలో.. గత జనవరి 30న సాయంత్రం గ్రామంలో తన నివాసం నుంచి బొందిమడుగుల రమేష్ కృష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల గ్రామం వైపు వాకింగ్కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించి నిందితులు ట్రాక్టర్ ఇంజిన్తో ఢీకొట్టారు. ఇనుపరాడ్డులు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని రమేష్ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అయితే కోలుకోలేక ఈనెల 31న మరణించాడు. నిందితులు అరెస్టుకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తుగ్గలి ఇన్చార్జి ఎస్ఐ మల్లికార్జున ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటితో పాటు హత్య కేసు నమోదు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించి బుధవారం తుగ్గలి మండలం రాతన గ్రామం చెరువుకట్ట దగ్గర షేక్ సుభాన్వలి, షేక్ హుశేన్పీరా, షేక్షావలి, షేక్ షేక్షావలి, షేక్ మాబాషా, షేక్ షాకీర్, షేక్ షరీఫ్, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ లాల్బాషా, షేక్ మౌళాలి, షేక్ మహమ్మద్లను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డులను పత్తికొండ మండలం చందోళి క్రాస్రోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించేందుకు సహకరించిన రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్ఐ మల్లికార్జున, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఇదిలాఉంటే పాతకక్షలతో జరిగిన హత్యకు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు. వారందరిపై న్యాయ సలహా తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. 12 మంది అరెస్టు హత్యకు ఉపమోగించిన ఆయుధాలు స్వాధీనం -
రేషన్ బియ్యం పట్టివేత
కర్నూలు(సెంట్రల్) : మండల పరిధిలోని ఈ తాండ్రపాడు సమీపంలో బొలెరో వాహనంలో 23 బ్యాగుల్లో తీసుకెళ్తున్న 1050 కేజీల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఎరుకల రాముడు అనే వ్యక్తి పందుల కోసం బియ్యం తీసుకెళ్తన్నట్లు మంగళవారం సమాచారం రావడంతో డీఎస్ఓ ఎం.రాజారఘవీర్ ఆధ్వర్యంలో బృందం దాడి చేసింది. బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శతాధిక వృద్ధుడి మృతి కొలిమిగుండ్ల: కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా స్వయంగా తన పనులు తానే చేసుకునే తిమ్మనాయినపేటకు చెందిన శతాధిక వృద్దుడు ఖాశీం సాహెబ్ (103) మంగళవారం సహజ మరణం చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి నిద్ర కు ఉపక్రమించే సమయంలో కన్ను మూశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 1923లో ఆయ న జన్మించాడు. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలంలోని అబ్దులాపురం కాగా తిమ్మనాయినపేటకు చెందిన నూరూబ్ను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. భార్య పన్నెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాలుగు తరాలను చూసిన ఖాశీం సాహెబ్ చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకునేవారు. బీపీ,షుగర్ వంటి వ్యాధులు కూడ లేకపోవడం గమనార్హం. అక్రమ మద్యం ధ్వంసం డోన్ టౌన్: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని మంగళవారం డోన్ ఎక్స్జ్ పోలీసులు ధ్వంసం చేశారు. పట్టణ శివారులో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 680 లీటర్ల నాటు సారా, దాదాపు 261 లీటర్ల మద్యంను అసిస్టెంట్ ఎక్స్జ్ సూపరింటెండెంట్ రాముడు, నంద్యాల,డోన్ ఎక్స్జ్ సీఐలు లక్ష్మణ్, వరలక్ష్మి, ఎస్ఐ సోమశేఖర్, పట్టణ సీఐ ఇంతియాజ్బాషా ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అలాగే పట్టుబడిన 8 వాహనాల్లో 7 వేలం వేయగా రూ.96,200 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైన్షాపులో చోరీ కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డులో ఉన్న పీఆర్ వైన్ షాపులో సోమవారం అర్ధారాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి వైన్ షాపునకు చెందిన రేకుల షెడ్డు రేకు తొలగించి లోపలకు వెళ్లారు. రూ.40 వేలు విలువ చేసే మద్యం బాటిళ్లు, రూ.1.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు వైన్షాపులో క్యాషియర్గా పని చేసే పుట్ట బాలమద్దిలేటి మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీ నంద్యాల(అర్బన్): పట్టణంలోని చాంద్బాడ, సరస్వతి నగర్లలో ఉన్న 52, 119 రేషన్ షాపుల్లో మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉండటంతో సంబంధిత డీలర్లపై 6ఏ కేసు నమోదు చేశారు. -
వాతావరణ సమాచారంలో ఏడబ్ల్యూఎస్ ముఖ్య పాత్ర
ఓర్వకల్లు: ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులను గమనిస్తూ ఖచ్చితమైన వాతావరణ సమాచారం సేకరణలో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్లూఎస్) కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. మంగళవారం కలెక్టర్ మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో ఏపీ ట్రాన్స్ కో ఆవరణలో అమర్చిన ఏడబ్ల్యూఎస్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఆర్టీజీఎస్కు అనుసంధానం చేశారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా వర్షపాతం, నేలలో తేమశాతం, వాతావరణ పీడనం, గాలి, ఉష్ణోగ్రతల వంటి వివరాలను ఆటోమేటిక్గా ఆన్లైన్లో నమోదు చేస్తాయని తెలిపారు. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి, వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడానికి సంబంధిత వాతావరణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్రానికి సంబంధించిన యంత్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరుగకుండా చూడాలని, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డీవైఎస్ఓ భాస్కర్, రామాంజనేయులు, ఏఎస్ఓ సరళకుమారి, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలించిన కలెక్టర్ డాక్టర్.సిరి -
ఏఐ టెక్నాలజితో కచ్చితమైన క్యాన్సర్ చికిత్స
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆధునిక ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా కచ్చితమైన చికిత్స అందిస్తున్నాము. లీనియర్ యాక్సిలేటర్ మిషన్ ద్వారా క్యా న్సర్ కణితికి ఎంత మేరకు రేడియేషన్ ఇవ్వాలో ఏఐ నిర్ణయిస్తుంది. అలాగే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ద్వారా తీసిన స్కానింగ్లను విశ్లేషించి నివేదిక ఇస్తుంది. పలు రకాల ఆపరేషన్లు చేయడంలోనూ ఈ టెక్నాలజి ఎంతో ఉపయోగపడుతోంది. –డాక్టర్ సీఎస్కే ప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు -
బాబుపాలనలో బిహార్గా మారిన ఏపీ
● రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది ● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రపద్రేశ్ బిహార్గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకపాలన నడుస్తోందన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, పెట్రోలు బాంబులు వేసి ఇళ్లను తగలబెట్టడం, మహిళా మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ గుండాలు దాడులు చేయడం దారుణమన్నారు. ఏపీకి బిహార్ సంస్కృతిని తీసుకువస్తున్నారన్నారు. కూటమ సర్కారు రెండేళ్ల పాలనలో రెడ్ బుక్ అమలు తప్ప.. సంక్షేమ పాలన కనిపించడం లేదన్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇండియాలో కాకుండా పాకిస్తాన్లో ఉన్నామా... అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. మీరు అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందడం నిజం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అభాసుపాలు చేసేందుకు పవిత్ర తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక చెంప పెట్టులాంటిదన్నారు.అయినా, వారు మారలేదని ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్న డీజీపీ స్పందించకపోవడం విచారకరమన్నారు. -
రెండో పంటకు అవకాశం లేకనే వలస
మాకు ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. ఖరీఫ్లో పత్తి సాగు చేశాం. గత ఏడాది నవంబర్ నెలకే పూర్తయింది. రెండో పంట లేకపోవడంతో ఉపాధి కరువైంది. అరకొరగా కల్పిస్తున్న ఉపాధి పనులకు వెళ్లినా వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. బతుకుదెరువుకు గుంటూరు ప్రాంతానికి వలస వచ్చాం. – ఈడిగ శ్రీనివాసులు, కామన్దొడ్డి, కోసిగి మండలం మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కిందనే వ్యవసాయం. ఖరీఫ్లో కంది సాగు చేశాం. అయిదు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడితే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పంట నవంబర్ నెలకే పూర్తయింది. రబీలో ఈ భూములను ఖాళీగా ఉంచుకున్నాం. పశ్చిమ ప్రాంతం మీదుగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా రెండో పంట వేసుకునే అవకాశం లేకపోతోంది. – మధుసూదన్రెడ్డి, ఆస్పరి సాగునీటి వసతి లేక పశ్చి మప్రాంతం పూర్తిగా వెనుకబడింది. రెండో పంటకు అవకాశం ఉంటే పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు ఉండవు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు సాకారమైతేనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. డీపీఆర్లు సిద్ధమయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. – నాగభూషణం రెడ్డి, రైతు, హెబ్బటం, హొళగుంద మండలం -
● టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక దందా ● చోద్యం చూస్తున్న అధికారులు
తుంగభద్రలో ఇసుక తోడేళ్లు నందవరం : తెలుగు తమ్ముళ్ల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో నాగలదిన్నె, చిన్నకొత్తిలి, నదికై రవాడి, గంగవరం గ్రామాల్లో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల్లో నది ఒడ్డు నుంచి కొందరు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక రవాణా దందాకు అధికారపార్టీ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. అక్రమ రవాణా సాగుతుందిలా.. మండలంలోని నాగలదిన్నె, చిన్నకొత్తిలి, గంగవరం, నదికై రవాడి, గురజాల గ్రామాల్లోని తుంగభద్ర నది ఒడ్డు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఎమ్మిగనూరుకు తరలిస్తున్నారు. 10 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 100 ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తున్నారు. నాగలదిన్నె మీదుగా కె. పేట, కనకవీడు గ్రామాల నుంచి, అలాగే మిట్ట సోమపురం, సోమలగూడూరు గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ముంచుకొస్తున్న నీటి ఎద్దడి.. తుంగభద్ర నదిలో నుంది అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాగలదిన్నె గ్రామంలో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అక్కడ ఇసుకలో నీటి గుమ్మీలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇసుకాసురులు నీటి గుమ్మీల వద్దనే ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో నాగలదిన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కమ్ముకొస్తున్న క్యాన్సర్!
కర్నూలు(హాస్పిటల్):రంగు రంగులతో అందంగా కనిపించే పదార్థాలు, గుమగుమలాడే ఘాటైన సువాసనలు మనిషిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఆకర్షణీయంగా ఉన్న నిషేధిత రంగులను దట్టించి తయారు చేసిన పదార్థాలను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆరగించేస్తున్నారు. అవి శరీరంలోకి వెళ్లాక క్రమంగా విషతుల్యం చేస్తున్నాయి. కొన్నిరోజులకు అవి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనిషి ఆయువు తీస్తున్నాయి. ఇలాంటి పదార్థాల్లో స్వీట్స్, బేకరి ఐటమ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఐస్క్రీమ్లు, కూల్డ్రింకులు, ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్లు, రంగులు కలిపిన చికెన్ పకోడీలు, గోబీమంచూరియాలు, బజ్జీలు, బిర్యానీలు, గ్రేవీ పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు తదితరవి ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వైద్యులు నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో ఈ విషయం వెల్లడైంది. నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. క్యాన్సర్పై అవగాహన పెరగడంతో ప్రజలు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించే ఓపీకి 60 నుంచి 70 మంది వరకు రోజూ చికిత్స కోసం వస్తున్నారు. ఇన్పేషంట్లుగా నిత్యం 120 పడకలకు గాను 150 నుంచి 170 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ మూడు మేజర్, మూడు మైనర్ కలిసి నెలకు 180 నుంచి 200 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఆధునిక యంత్రాల ద్వారా 50 నుంచి 55 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. ఇవేగాక ఒమెగా హాస్పిటల్, అమీలియో హాస్పిటల్, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లలోన్లూ రోజూ 250 నుంచి 300 మంది దాకా క్యాన్సర్ రోగులు చికిత్స కోసం వెళ్తున్నారు. వీరిలో ఎక్కువగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణకోశ క్యాన్సర్, పేగు క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. క్యాన్సర్ రావడానికి కారణాలు క్యాన్సర్ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం (రొమ్ము, గర్భాశయం, పేగు, మూత్రపిండాల క్యాన్సర్లు), 40 శాతం పొగాకు (నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు), 10 శాతం ఇన్ఫెక్షన్లు(హెచ్పీవీ, హెపటైటిస్ బి వల్ల వచ్చే కాలేయ క్యాన్సర్) కారణం. మిగిలిన 25 శాతం క్యాన్సర్ల (రక్తం, ఎముక, ప్యాంక్రియాస్ల క్యాన్సర్)లకు సరైన కారణాలు లేవు. సంవత్సరం సర్జికల్ ఆంకాలజి మెడికల్ ఆంకాలజి రేడియేషన్ ఆంకాలజి 2019-20 8,596 10,846 8,306 2020-21 9,564 12,325 9,325 2021-22 10,396 14,214 10,103 2022-23 12,659 15,045 12,435 2023-24 14,269 16,568- 13,993 2024-25 13,326 17,245- 14,328 2025-26 11,325 14,239- 11,958 క్యాన్సర్ లక్షణాలు ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము క్యాన్సర్లో రొమ్ము వద్ద చను మొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పేగుల్లో బల్లలు ఏర్పడటం, పురీషనాళంలో నొ ప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లో నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, బ్రెయిన్ క్యాన్సర్లో భరించలేని తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత. క్యాన్సర్ లక్షణాలు దాని రకంపై ఆధారపడి ఉంటాయి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా వైద్యం నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం -
అగ్ని ప్రమాదంలో నలుగురికి గాయాలు
కర్నూలు: కర్నూలు పాతబస్తీ బండిమెట్ట అంబాభవా ని ఆలయ సమీపంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. శివస్వాములకు భిక్ష ఏర్పా టు చేసేందుకు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ మారుస్తుండగా పక్కనే ఉన్న దీపం సెగ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే వంట పనిచేస్తున్న లలితాబాయి, తులసి, కిట్టు, లక్ష్మి తదితరులు గాయపడ్డా రు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మాజీ ఎమ్మెల్యే చేయూత కర్నూలు(టౌన్): పాతబస్తీలో నెలరోజుల వయస్సు ఉన్న శిశువుకు గుండె సంబంధిత సమస్య తెలెత్తింది. చికిత్స కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు కిమ్స్ అసుపత్రికెళ్లగా పరీక్షించి ఆపరేషన్ అవసరమని, ఇందుకు రూ. లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేని మైనార్టీ వర్గానికి చెందిన ఆ దంపతులు వారం రోజుల క్రితం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ను కలిసి సమస్య విన్నవించారు. వెంటనే ఆయన స్పందించి కిమ్స్ ఆసుపత్రి యజమాన్యాంతో మాట్లాడి శిశువుకు అవసరమైన గుండె ఆపరేషన్ చేయించారు. మంగళవారం ఆ దంపతులు బిడ్డను తీసుకొని మాజీ ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రంలో ఆటవికపాలన
● టీడీపీ నేతలు బందిపోట్లుగా మారారు ● పెట్రోల్ బాంబులతో మాజీ మంత్రి ఇంటిపై దాడి అమానుషం ● వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు బొమ్మలసత్రం: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్లపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం, కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన దుష్ప్రచారం అందుకు ఉదాహరణ అన్నారు. సిట్ నివేదికలో లడ్డూలో కొవ్వు కలవలేదని తేలటంతో ఇప్పుడు మరో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దుష్ప్రచారంపై గొంతెత్తిన అంబటి రాంబాబు, జోగి రమేష్, వంశీ, నాని లాంటి మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటం దారుణమన్నారు. లీగల్ సెల్ స్టేట్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ టీడీపీ లడ్డూపై ఆరోపణలు చేస్తున్నట్లుగా లేదని సాక్షాత్తు ఆ దేవదేవుడిపై ఆరోపణల దాడి చేస్తున్నట్లుగా ఉందన్నారు. తప్పుడు ప్రచారమని ప్రపంచానికి తెలియటంతో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. లీగల్సెల్ పట్టణాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ గీతం యూనివర్సిటీకి రూ. 1000 కోట్ల భూములు కేటాయించారని ప్రశ్నిస్తే దాడులు, లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ రిపోర్టు చూపితే దౌర్జన్యాలు, కేసులు ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఇచ్చే సందేశమేమిటో చెప్పాలన్నారు. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కంప్లైంట్లు వేసి పోలీసులపై చట్టపరమైన చర్యలకు దిగుతామన్నారు. టీడీపీ నాయకులకు వారు చుట్టంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు సుహేల్రాణా, జీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్దమాంబకు నీరాజనం
● వైభవంగా అమ్మవారి రథోత్సవం అశేష భక్తజనం మధ్య రథోత్సవం మద్దికెర: మద్దమాంబ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండల కేంద్రం మద్దికెరలో వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కంకుమార్చన, విశేషపూజలు, మహామంగళ హారతి తదితర కార్యక్రమాలతో పాటు నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారికి ఆకు పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథంలో కొలువుంచారు. అనంతరం రథం ముందు హోమం కాల్చి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు మద్దమాంబకు జై అంటూ రథాన్ని ముందుకు లాగారు. రథం పైకి అరటిపండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు. ఈ వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లోని సివిల్, మోటార్ వెహికల్ ప్రమాదాలు, వివాహ సంబంధమైన కేసులు, భూసేకరణ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్, మున్సిపల్ ట్యాక్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పది సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల పరిష్కారానికి ఈ ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కల్లూరు, మద్దికెరలో అతి పెద్ద గోదాములు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని కల్లూరు, మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి పెద్ద గోదాములు నిర్మించుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ ప్రాజెక్టు (డబ్ల్యూఎల్జీఎస్పీ) కింద ఒక్కో సంఘం పరిధిలో 2,500 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించడానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకులోని ఫ్యాక్స్ డెవలప్మెంటు సెల్ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. ఈ గోదాములు నిర్మించాలంటే కనీసం 2 ఎకరాల భూమి అవసరం. మద్దికెర, కల్లూరు సహకార సంఘాలకు ఈ స్థాయిలో భూములు ఉండటంతో డబ్ల్యూఎల్జీఎస్పీ కింద గోదాముల నిర్మాణానికి సహకార శాఖ చర్యలు చేపట్టింది. డబ్ల్యూఎల్జీఎస్పీ 33 శాతం సబ్సిడీ ఇస్తుంది. జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాము వ్యాపారుల సిండికేట్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారుల సిండికేట్ కొనసాగుతోంది. మార్కెట్లో వాముకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సిండికేట్ కారణంగా ధరలు పెరుగకపోగా తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం మార్కెట్కు వాము 994 క్వింటా ళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,011, గరిష్ట ధర రూ.26,800 లభించగా..సగటు ధర రూ.12,6 99 మాత్రమే నమోదైంది. ఈ నెల 2న వాముకు లభించిన గరిష్ట ధర రూ.30,303 ఉండగా.. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. మార్కెట్కు వాము భారీగా వచ్చేలా ఒకటి, రెండు చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేయడం పరిపాటిగా మారింది. ఆర్యూలో విద్యార్థుల మధ్య గొడవ కర్నూలు (సెంట్రల్) : రాయలసీమ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. పీజీ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఏడాదిలో విద్యార్థుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం ఇది నాలుగో సారి. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఓబులేసు అనే విద్యార్థిపై మూడో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో నోటి వెంబడి రక్తం వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు కొందరు కలగజేసుకుని దాడిని సద్దుమణిగించారు. అయితే, దాడిచేసిన బీటెక్ విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. వర్సిటీలో తరచూ విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల మధ్య గొడవలు ర్యాగింగ్కు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై వైస్ చాన్స్లర్ వి.వెంకటబసవరావు స్పందిస్తూ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ లేకుండా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దాడి సంఘటనపై విచారణ చేయిస్తానని వివరించారు. అహోబిలేశుడికి బ్రహ్మరథం ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడికి ఊరూరా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి పార్వేట మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం ఉత్సవ పల్లకీ ఎస్ లింగందిన్నెలో కొలువు దీరింది. పొలిమేరకు చేరుకున్న పల్లకీకి గ్రామస్తులు స్వాగతం పలికారు. -
చంద్రబాబు ద్రోహంతో సీమ భవిష్యత్ ప్రశ్నార్థకం
పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహంతో రాయలసీమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. రాయలసీమలో కరువును తరమికొట్టేందుకు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రాయలసీమ ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ను తెలంగాణకు తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మంగళవారం పాణ్యం పార్టీ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను ఎమ్మెల్సీ ఇసాక్బాషా, పార్టీ నేతలతో కలసి కాటసాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగులు నీరు ఉండగానే తెలంగాణ ప్రభు త్వం ప్రాజెక్టులకు నీరు మళ్లించి వాడుకుంటుందన్నారు. అదే తరహాలోనే రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారన్నారు. దాదాపుగా రూ. 3వేల కోట్లకు పైగా వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుకు మో టార్లు అమర్చితే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని చెప్పినా ఇంత వరకు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. బాబు చేసిన ద్రోహం సీమ ప్రజలు గుర్తు పెట్టుకుని బుద్ధి చెబుతారన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు ఐదు ఉమ్మడి జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాజెక్ట్లకు ప్రాణం పోశారన్నారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే కారణంతోనే పనులు నిలిపేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్రెడ్డి, రామలక్ష్మయ్య, సుబ్బరాయుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, రామచంద్రుడు, అశోక్రెడ్డి, కృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి, భాస్కర్, చంద్రశేఖర్రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజ యవంతం చేయాలన్నారు.బహిరంగ సభకు తరలిరండి -
రాష్ట్రపతి పాలన విధించాలి
ఆలూరు రూరల్: ‘టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. టీడీపీ దాడులను నిరసిస్తూ మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలసి ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిట్ అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు అసత్య ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలనే కుట్ర జరుగుతోందన్నా రు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తున్న చంద్రబాబు సీమ ద్రోహిగా నిలిచిపోతారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఈ నెల 5వ తేదీన రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత కేవలం అమరావతిని మాత్రమే పట్టించుకుంటున్నారే తప్పా. రాయలసీమ సాగు ప్రాజెక్టులను విస్మరించారన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలూరు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, నాయకులు వెంకటేషులు, భాస్కర్, శివ, మల్లేష్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. -
మూతపడిన బంగారు దుకాణాలు
ఎమ్మిగనూరుటౌన్: పుత్తడి, వెండి ధరలు అమాంతం పెరగడం.. మళ్లీ రోజుల వ్యవధిలో తగ్గుముఖం పడుతుండటంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో హెచ్చతగ్గులను భరిస్తూ వ్యాపారాలు చేయలేమని ప్రభుత్వాలు స్పందించి ధరలను స్థిరీకరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని షరాఫ్ బజార్లో బంగారు వ్యాపారులు తమ దుకాణాలు మూసి నిరసన తెలిపారు. ఽఆభరణాల తయారీకి కొన్న బంగారు, వెండి ధరలు తగ్గుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని గోల్డ్, సిల్వర్ దుకాణాల అసోసియేషన్ నాయకులు పీసీఆర్ వలి, మోహన్, ఖాదర్బేగ్ తదితరులు పేర్కొంటున్నారు. ధరలను స్థిరీకరిస్తే వ్యాపారాలు చేయగలుగుతామని తెలిపారు. -
4 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతివ్వండి
● ఫారెస్టు అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి నల్లమల మీదుగా పాదయాత్రకు వెళ్లే భక్తులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డితో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శ్రీశైలం మహాక్షేత్రానికి గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో పాదయాత్ర భక్తులకు నల్లమల మీదుగా వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. భక్తులు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలన్నారు. ప్రస్తుతం పులుల గణన జరుగుతున్నందున ఇబ్బందులు తలెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అటవీశాఖ అనుమతులతో వెంకటాపురం నుంచి దోర్నాల వరకు రహదారి విస్తరణ చేపడుతామన్నారు. శివరాత్రి భక్తులకు మెరుగైన వసతులు శ్రీశైలంప్రాజెక్ట్: శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం చేరుకునే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం దేవస్ధానం ౖచైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావుతో కలసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దిగువన లింగాలగట్టు వద్ద లోలెవల్ పుష్కరఘాట్లను పరిశీలించారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాపులు, సీఐలు జీవన్ గంగనాథబాబు, గంటా సుబ్బారావు ఉన్నారు. -
పోలీసు డాగ్ ‘టీనా’ మృతి
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో 9 ఏళ్ల పాటు సేవ లందించిన పోలీస్ డాగ్ టీనా వృద్ధాప్య సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇది ల్యాబ్ బ్రీడ్ జాతికి చెందిన ఫీమేల్ జాగిలం. టీనా మృతదేహానికి దిన్నెదేవరపాడు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్ పోలీసు సిబ్బంది కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందు పాతరలు పసిగట్టడంలో దిట్ట మందు పాతరలను పసిగట్టడంలో టీనా దిట్ట. వివిధ వీఐపీ బందోబస్తులో, పీఎం, సీఎం బందోబస్తు విధులలో మంచి సేవలు అందించింది. ఎన్నికల విధులు, శ్రీశైలం శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, వీఐపీ విజిట్స్, మంత్రాలయం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని టీనా సేవలను పోలీసు అధికారులు కొనియాడారు. 2013లో పది నెలల పాటు తెలంగాణ, మొయినాబాద్ ఐఐటీఏలో కఠోర శిక్షణ పూర్తి చేసుకుని 2014లో జిల్లాకు వచ్చింది. నాటి నుంచి నుంచి డాగ్ హ్యాండ్లర్గా ఏఆర్ కానిస్టేబుల్ సుంకిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. -
కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది శూన్యం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిచిప్పగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది శూన్యం అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పోలవరానికి రూ. 3,300 కోట్లు తప్ప ఏమీ లేదన్నారు. నిత్యం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి చంద్రబాబు సాధించింది ఏముందని ప్రశ్నించారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే వారు, ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన రూ. 3,300 కోట్లతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలా పూర్తి చేస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు
కర్నూలు(హాస్పిటల్): జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా ఈనెల 17న విద్యార్థులందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు 0–5 ఏళ్ల వరకు అందించాల్సిన వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికారులు డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మల్లికార్జున, డీపీఎంఓ డాక్టర్ శైలేష్ కుమార్, డెమో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాలకు వచ్చే విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. బిల్లింగ్, పోల్స్ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ పాల్గొన్నారు. కర్నూలు: రైల్వే, ఆదాయ పన్ను శాఖలో నా అల్లుడు, స్నేహితుడి కుమారుడికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముంబైకి చెందిన ప్రవీణ భద్రినారాయణ ఖండేల్వాల్, మిథున్ దాస్లు రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్కు చెందిన మన్సూర్ అహ్మద్, దేవదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పత్తికొండ లక్ష్మీనగర్కు చెందిన లోకేష్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలసి ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్లైన్ నగదు దోపిడీ, కుటుంబంలో వేధింపులు, ఆస్తి తగాదాలపై ఎక్కువమంది ఫిర్యాదు చేశారు. వాటన్నిటిపై చట్ట పరి ధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి తదితరులు కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో తమ సమస్యలు చెప్పుకుంటున్న అర్జీదారులు -
రెవెన్యూ సమస్యలే అధికం
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం నిర్వహించారు. మొత్తం 238 అర్జీలు రాగా అందులో రెవెన్యూ క్లినిక్లకు సంబంధించినవి అధికంగా 136 ఉన్నాయి. అర్జీలు ఇచ్చినవారు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఏఒక్క అర్జీ కూడా నిర్ణీత సమయంలోపు పరిష్కారం కాకుండా ఉండకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇస్తే పరిష్కారానికి సులభం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అర్జీలను స్వీకరించారు.కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులా?
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలని కోరారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం నేతల దూషణలను వీడియో క్లిప్పింగ్లతో చూపించారు. అనంతరం ఎస్వీ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయంలో ఏనాడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదన్నారు. పాలన చేతకాక అసహనంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నేతలను ఎంచుకొని దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజని.. ఇలా అనేక మంది వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఇళ్లను ధ్వంసం చేయడం, దాడులకు తెగబడటం అత్యంత దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు రాష్ట్రంలో అరాచక శక్తులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ‘పొరబాటున మాటలు దొర్లాయి’ అని ఒక వైపు మాజీ మంత్రి అంబటి మీడియాను పిలిచి వివరణ ఇచ్చినా, దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీ వ్యవహారంలో అభ్యంతరం చెప్పినందుకే ఈ దాడులు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రకం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని తేలిపోయిందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ లేదంటూ సీబీఐ విచారణలో తెలిపోవడంతో చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తూ, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఎస్వీ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ నేతలు దూషించారన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, పట్టాభి, వంగలపూడి అనిత, నారాయణ అవమానకరంగా మాట్లాడినా కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ఎల్లకాలం అధికారంలో ఉండబోరన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం మారితే ఇప్పుడు దాడులు చేస్తున్న టీడీపీ నా యకులు, కార్యకర్తల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. అప్పుడు కాపాడటానికి చంద్రబాబు, లోకేష్ ముందుకురారని, సినిమా షూటింగ్ల్లో పవన్ కళ్యాణ్ ఉంటారన్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కొంత మంది పోలీసు అధికారుల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులు యాదవ్, కటారి సురేష్, తిరుమలేశ్వర రెడ్డి, కార్పొరేటర్ క్రిష్ణ కాంత్ రెడ్డి, కిషన్, పత్తాబాషా, రామాంజనేయులు పాల్గొన్నారు. కర్నూలు రెండో పట్టణ సీఐకి ఫిర్యాదు కల్తీ నెయ్యి కేసుపై సిట్ చార్జ్షీట్కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ నాగరాజును కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ మాజీ సీఎంకు వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోస్టర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు పరువు పోయిందనే దాడులు వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
వేరుశనగ ధర తగ్గుతోంది
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అన్ని మార్కెట్ల్లో వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం మూడు మార్కెట్ల్లో కూడా ధరలు తగ్గడం గమనార్హం. ఎమ్మిగనూరు మార్కెట్లో గరిష్ట ధర రూ.6,980, ఆదోనిలో రూ.8,900, కర్నూలు మార్కెట్లో రూ.9,790 లభించింది. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ధర దయనీయంగా ఉండగా.. కర్నూలు మార్కెట్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇటీవల క్వింటా వేరుశనగ ధర రూ.15వేల వరకు చేరుకుంది. – వాము వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. మార్కెట్కు వాము 1120 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,222, గరిష్ట ధర రూ.30,303 లభించింది. సగటు ధర రూ.16,099 మాత్రమే నమోదైంది. వ్యాపారుల సిండికేట్ వల్ల వాము రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
చౌడేశ్వరి మాతా.. రక్షమాం!
శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాల సందర్భంగా సోమవారం సాయంత్రం కోడుమూరులో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. తొలుత అమ్మవారి రథానికి దైవచార అటకార సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు ‘చౌడేశ్వరి మాతా.. రక్షమాం’ అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ ఎర్రిస్వామి తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. – కోడుమూరు రూరల్ -
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచకుండా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారం చేపట్టిన మొదట్లో ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని ఆశలు చూపింది. ప్రభుత్వ మాటలు నమ్మిన ఆయా వర్
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రుణాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, బీసీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ నెలలో హడావిడి చేసింది. ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్ను కూటా కేటయించినట్లు నమ్మబలికింది. పేదలు అనేక అకష్టాల మధ్య దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే నేటి వరకు రుణాలపై ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. జగనన్న పాలనలో అనేక పథకాల ద్వారా ఆన్ని వర్గాల ప్రజలకు నగదు బదిలీ జరిగింది. – ఆర్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఆయా కార్పొరేషన్లకు పాలక వర్గాలను నియమిస్తున్నారే కానీ, నిధులు కేటాయించడం లేదు. ఇప్పటి వరకు ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖాలాలు లేవు. నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణలో శూన్యం. ఆయా కార్పొరేషన్ల కార్యాలయాలు బోసి పోయాయి. అధికారులకు కేవడం రికవరీకే పరిమితమవుతున్నారు. ప్రస్తుత బడ్జెట్లోనైనా ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. – గౌస్దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి కర్నూలు(అర్బన్): స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. పేద వర్గాలను సంతృప్తి పరిచేందుకు గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో రుణాలు అందిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. కష్టాల మధ్య ఆన్లైన్ చేసిన తమ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో, కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొనింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్భాటాన్ని చూసి పేద వర్గాలకు చెందిన యువత పోటీపడి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే చివరకు ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మాట మార్చింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత, పేద వర్గాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. సైట్ను క్లోజ్ చేసి చోద్యం! జిల్లాలోని 2,034 మంది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.41.23 కోట్ల మేర సబ్సిడీపై రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం 2025 ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనను నమ్మి దాదాపు 27 వేల మంది అనేక కష్టాల మధ్య దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, మండలాలు, మున్సిపాలిటీల వారీగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. తీరా నేడో, రేపో రుణాలు అందుతాయనే సంతోషంతో ఉన్న బీసీ వర్గాలకు రుణాలకు సంబంధించిన సైట్ క్లోజ్ చేశారనే చావు కబురును చల్లగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీ రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోరాదని తేల్చేశారు. దీంతో గత తొమ్మిది నెలలుగా దరఖాస్తు చేసుకున్న వారందరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దిక్కుతోచని స్థితి జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 973 మందికి రూ.40.73 కోట్ల మేర సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ 4న వార్షి ప్రణాళికలను విడుదల చేశారు. అర్హులైన ఎస్సీలకు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ( 40 నుంచి 60 శాతం వరకు సబ్సిడీ ) రుణాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన వారు ఏప్రిల్ 14 నుంచి మే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసింది. దీంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉన్నా మే నెల 11న దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ ఓబీఎంఎంఎస్ క్లోజ్ అయ్యింది. అయితే సైట్ను ఎందుకు క్లోజ్ చేశారంటే ... లబ్ధిదారులకు అనుకూలమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా యూనిట్లను మారుస్తున్నామంటూ ప్రభుత్వం బుకాయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వివిధ యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పథకం లబ్ధిపొందిన వివిధ వర్గాలు జమ అయిన మొత్తం (రూ.కోట్లలో) వైఎస్సార్ చేయూత 1,24,045 రూ.905.80 వైఎస్సార్ ఆసరా 2,49,976 రూ.568.28 కళ్యాణమస్తు, షాదీ తోఫా 2952 రూ.23.71 జగనన్న తోడు 92,739 రూ.126.81 వైఎస్సార్ బీమా 4578 రూ.45.49 వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు 29,520 (గ్రూపులు) రూ.140.36 జగనన్న చేదోడు 1,02,452 రూ.102.45 వైఎస్సార్ కాపునేస్తం 26,152 రూ.39.22 ఈబీసీ నేస్తం 64,733 రూ.97.10 మొత్తం: 6,97,147 రూ.2,049.22అదే దారిలో మైనారిటీ, గిరిజన రుణాలు.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందించాల్సిన రుణాల్లో జాప్యం చోటు చేసుకోగా, మైనారిటీ కార్పొరేషన్లో అరకొరగా దరఖాస్తులను స్వీకరించి వెంటనే నిలిపివేసినట్లు సమాచారం. గిరిజన కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలకు సంబంధించిన వార్షిక ప్రణాళిక నేటికి కూడా రూపొందించనట్లు తెలుస్తోంది. ఎస్సీ, బీసీలకు తొమ్మిది నెలలుగా అందని రుణాలు మైనారిటీ, గిరిజన రుణాలపై పెదవి విప్పని చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీలకు రూ.40.73 కోట్లు, బీసీలకు రూ.41.23 కోట్లు అంటూ ఆర్భాటం గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, బీసీ వర్గాలు దరఖాస్తులపై నేటికి స్పష్టత కరువే -
మంచాలమ్మా.. దీవించమ్మా!
మంత్రాలయం: మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాలో తయారు చేయించిన బెల్లం అచ్చులతో, చెరకు గడలతో, గడ్డితో ఆదివారం అలంకరించారు. విశేష పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం మహాద్వారం నుంచి ‘మంచాలమ్మా.. దీవించమ్మా’ అంటూ భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి కుంకుమ అర్చన, అభిషేకం చేశారు. అనంతరం మూల బృందవనానికి నిత్య పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి, మహా మంగళ హారతి చేశారు. శ్రీ మఠం ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పూజ నిర్వహించారు. బళ్లారి జిల్లాలో తెక్కలకోటకు చెందిన ఏడు వందల మంది భక్తులు కాలినడకతో 120 కిలో మీటర్లు దూరం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్నారు. -
‘సూక్ష్మ’ ఊతం..‘సాగు’కు దైన్యం
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్లో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇచ్చినా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత రాలేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఎయిర్పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులను సాధించడంలో కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలు విఫలమయ్యారని తేటతెల్లం అయ్యింది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్ పరిశ్రమలకు ఇప్పటి వరకు ఇచ్చే రూ.10 కోట్ల రుణాన్ని రూ.20 కోట్ల వరకు పెంచారు. జిల్లాలో ఇవి 1500 ఉన్నాయి. మరోవైపు ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. జిల్లాలో 5 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో ఎంపీలు వివరణ కోరాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడకు నేరుగా రైలు లేదు కర్నూలు నుంచి రాజధాని అమరావతి(విజయవాడ)కి వెళ్లేందుకు నేరుగా రైలును కేటాయించలేదు. అలాగే 48 ఏళ్లుగా ప్రతిపాదన ఉన్న కర్నూలు–మంత్రాలయం కొత్త రైల్వేలైన్, పంచలింగాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రిహబులిటీ వర్కుషాపునకు నిధులు ఇవ్వలేదు. కాచిగూడ – గుంటూరు ఎక్స్ప్రెస్ను విజయవాడ వరకు పొడిగించాలనే డిమాండ్ను పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె హైస్పీడు రైళ్లు కర్నూలు మీదుగా వెళ్లే అవకాశం ఉంది. వేతన జీవులకు ఊరట కర్నూలు జిల్లాలో ట్రేజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా మరో 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబులను సవరించారు.రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీంతో దాదాపు 20 వేల మందికి పన్ను నుంచి మినహాయింపు కలిగే అవకాశం ఉంది. జిల్లాకో బాలికల హాస్టల్ జిల్లాలో 6,20,658 లక్షల మంది రైతులు ఉన్నారు. ధరలు పతమైన సమయంలో కంది, మినుములను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి, అధికోత్పత్తి వంగడాల సృష్టి కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ఏర్పాటు చేస్తామని, పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. జిల్లాకో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఊతమివ్వని బడ్జెట్ ఇది. ఏపీ, తెలంగాణలకు పెద్దగా ఉపయోగపడని బడ్జెట్ ఇది. విశ్వ విద్యాలయాలకు ఏమాత్రం నిధులు లేవు. కర్నూలు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. ఇది ప్రాంతీయ అసమానతలకు దారి తీసే అవకాశం. పరిశ్రమలు, వ్యవసాయానికి చేయూతను ఇచ్చారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి ఏ మాత్రం నిధులు ఇవ్వలేదు. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్ప్రొఫెసర్కేంద్ర బడ్జెట్తో పేదలకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. టీడీపీ, బీజేపీ ఎంపీలు 21 మంది ఉన్నా బడ్జెట్లో నిధులు రాలేదు. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్ ప్రస్తావన లేదు. అమరావతికి రైలు లేదు. రైతులకు కనీస మద్దతు ధరపై మాట్లడలేదు. ఇది పూర్తిగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్. బడ్జెట్ సవరణలో ఏపీకి నిధులపై ఎంపీలు పోరాటం చేయాలి. – ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి గుండుసున్నా నిధులు వచ్చాయి. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ, ఇది సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్. ఎన్నికలు ఉన్నా తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల కోసమే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏపీకి ఒక్కప్రాజెక్టకు నిధులు లేవు.– బి.గిడ్డయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ కేంద్ర బడ్జెట్లో ఏపీకి, కర్నూలుకు నిధులుసాధించడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో రిక్తహస్తం చూపారు. రైతులకు కనీస మద్ధతు ధరపై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ బడ్జెట్తో ఉపయోగం లేదు –డి.గౌస్దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఈ బడ్జెట్ దేశ దిశ గతిని మార్చేది. అభివృద్ధి సాధించాలి. ఆ ఫలాలు పేద,మ ధ్య తరగతి వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 12.75 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు మేలు చేకూర్చారు. – సాయి ప్రదీప్, జిల్లా అధికార ప్రతినిధి, బీజేపీ కేంద్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన సూక్ష్మ పరిశ్రమలకు లబ్ధి చేకూరే అవకాశం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో వైఫల్యం -
అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్
బనగానపల్లె: యనకండ్ల గ్రామానికి చెందిన ఎస్సీ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు దాట్ల అమర్నాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆదివారం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 15వ తేదీన ఘటన జరగడంతో ఆమె మానసికంగా కుంగిపోయి వారం రోజుల తర్వాత మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కల్పన దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితుడు దాట్ల అమర్నాథ్ రెండు కేసులు ఉన్నాయని, గ్రామంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తెలిందన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
‘సర్’తో మానవ హక్కుల ఉల్లంఘన
● ప్రముఖ కాలమిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం ఫాసిజం వైపు అడుగులు వేస్తోందని, ప్రశ్నించే వారిని జైళ్లలో వేసి నోర్లు మూయిస్తున్నారని ప్రముఖ కాలమిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కర్నూలులోని లలితా కళా సమితిలో పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు ఓంకార్ ఆధ్యక్షతన ‘మానవ హక్కుల పరిరక్షణ–మన ముందున్న సవాళ్లు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ద్వారా దేశంలో కోట్లాది మంది పౌరుల ఓటర్లను తొలగించి వారి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో అక్రమల చోరబాటుదారుల ను అరికట్టడానికి సర్ను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంత వర కు ఎంతమంది వలసదారులను గుర్తించిందో మాత్రం చెప్పడంలేదన్నారు. కానీ సర్ పేరు తో బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో కోట్లాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉపన్యాసకులుగా హాజరైన సీపీడీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచే శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కదాని పట్టించడమే కాక వారి మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ద్వారా ముస్లిం మైనార్టీ ఓటర్లను తొలగించేందుకే బీజేపీ సర్ను తెచ్చిందని ఆరోపించారు. అనంతరం కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం.తేజోవతి, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి, సీపీడీఆర్ఎస్ తెలంగాణ ఇన్చార్జ్ ఎస్ జానీ బాషా ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాము, చంద్రుడు, రమేష్, గోవిందరాజు, హనీఫ్, జహీర్, ప్రియాంక పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచన పాలన సాగిస్తోందని, టీడీపీ గుండాలు విధ్వాంసాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు శనివారం హత్యాయత్నానికి పాల్పడి, ఆయన కారుకు నిప్పటించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆదివారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బానాయించి అరెస్టు చేయడం అమానుష చర్యగా అభివర్ణించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమన్నారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంబటి అక్రమ అరెస్టు కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ప్రమాదం లడ్డూలో కల్తి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సిట్ ఆధికారుల విచారణలో భాగంగా లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టుకు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంబటి రాంబాబుపై దాడికి పాల్పడి అక్రమ అరెస్టు తెరలేపారనన్నారు. అరెస్టులతో ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. పోలీసుల అత్యుత్సాహం చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల అత్యుత్సాహం చేస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేసి రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడిపిస్తున్నారని విమర్శించారు. ఎల్లాకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని పోలీసులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. నిరసనలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున కో–ఆప్షన్ మెంబర్ బాషా, జిల్లా నాయకులు చిన్న ఈరన్న, నాయకులు వెంకటేషులు, శివ, హనుమంతప్ప, భాస్కర్, నెట్టెకల్లు, బి.మల్లికార్జు, ఎల్లప్ప, వరుణ్, జే.వీరేష్, ధనుంజయ, ఈరన్న, రొక్కప్ప, చంద్ర, నాగేష్, బి.ఈరన్న, నాగప్ప, రామలింగ, మల్లప్ప, వీరభద్రి, వీరేష్, మునెప్ప, సురేంద్ర, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తోట సాగు చేశా..
మాకు 3.76 ఎకరాలు ఉన్నా గతంలో పంటలు పండక, పెట్టుబడులు కూడా రాక అప్పులై వాటిని తీర్చేందుకు రాజంపేట, రైల్వేకోడూరు వలస పోయే వాళ్లం. ఉపాధి పథకం అమలు చేసిన తర్వాత మా బతుకులు మారిపోయాయి. మామిడి చెట్లు నాటాం. మూడేళ్ల పాటు చెట్లను పెంచుకునేందుకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏటా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఉపాధి పథకంతో ఎంతో మేలు జరిగింది. వలసలు పోకుండా సొంతూళ్లోనే ఉంటున్నాం. – ఆర్ గోలేనాయక్, సన్నకారు రైతు, మీటేతండ 20 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్షాలు ఒత్తిడి తేవడంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది. ఎంతో మంది పేదలు, రైతులకు ఆసరాగా నిలిచిన పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీబీజీ రామ్జీ పేరు మార్పు తప్ప ఒరిగేదేమీ లేదు. చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు. ఉపాధి పథకాన్ని తల లేని మొండెంగా తయారు చేసింది. 125 రోజులకు పని దినాలు పెంచుతున్నట్లు చెప్పి నిధులు తగ్గించింది. కొత్త చట్టంతో పేదల పొట్ట కొడుతోంది. – నబీ రసూల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి -
భక్తిశ్రద్ధలతో శివయ్య జాతర
ఆదోని అర్బన్: మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని ఆదివారం శ్రీ శంభులింగేశ్వరస్వామి మండల దీక్ష శివ భక్తులు శివయ్య జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వామి శైలేంద్రనాథ్ స్వామి ఆధ్వర్యంలో శివ భక్తులు శివలింగాన్ని వాహనంలో కొలువుంచి ప్రధాన రహదారిలో ఓం నమఃశివాయ అను నామస్మరణతో ఊరేగించారు. ఆదోనిలో ప్రధాన రహదారులంతా ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగింది. డోలు, సన్నాయిల మధ్య శివస్వాములు చిందులు, శివతాండవం చేసుకుంటూ ఊరేగింపు ముందు శివయ్య జాతరను వైభవంగా నిర్వహించారు. శివయ్య ఊరేగింపులో శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై సంతపేట, బంగారు బజారు, మార్కండేయస్వామి, నిర్మల్ టాకీస్, కోట్ల కూడలి, పాత బస్టాండు మీదుగా శంభులింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంది. అనంతరం శివభక్తులకు అన్నదానం జరిగింది. -
ప్రత్యేక ఉద్యమం.. జేఏసీ చోద్యం
● టీడీపీ నాయకులను వదిలేసి రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న వైనం ● జేఏసీ తీరుపై పట్టణ ప్రజల విమర్శలుఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు జిల్లా కోసం టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డినో, టీడీపీ నాయకులనో అడ్డుకొంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకు విరుద్ధంగా జేఏసీ నాయకులు ఆదివారం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్రెడ్డి వాహనాన్ని అడ్డుకుని విడ్డూరపు నాటకం ఆడారు. వాహనం దిగి వచ్చిన రాజీవ్రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతల మాటలను చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ వింటుందని చెప్పినా ఆందోళనకారులు వినలేదు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉండగా అంతకుమునుపే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ర్యాలీ చేసిన అధికార టీడీపీ నాయకులను జేఏసీ నాయకులు ఎందుకు అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేయడం, ఆయన ఇంటిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన రాజీవ్రెడ్డిని ఎందుకు అడ్డగించారని, ఇందులో ఏదో మతలబు ఉందని అన్నారు. -
46 ఏళ్ల తర్వాత..
కర్నూలు(సెంట్రల్): కోడుమూరు మండలం లద్దగిరి జెడ్పీ పాఠశాలకు చెందిన 1979–80వ బ్యాచ్ పూర్వపు విద్యార్థులు 46 ఏళ్ల తరువాత అపూర్వ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాలులో అప్పటి విద్యార్థి, నేటి అనంతపురం డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 46 ఏళ్ల తరువాత మళ్లీ ఒకే వేదికపైకిరావడంతో బాల్య స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యా రు. పాఠశాల తరగతి గదులు, ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యార్థి జీవితంలోని మధుర క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. హోదాలు, బాధ్యతలను పక్కనబెట్టి మళ్లీ విద్యార్థులుగా మారిన ఆ మధుర క్షణాలు సమ్మేళానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కటే నవ్వులు, కన్నీళ్లు, ఆనందం కలసి ఈ సమావేశాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చాయి. కాగా.. ఈ సమ్మేళనంలో 15 మంది పూర్వ విద్యార్థుల ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా అప్పటి విద్యార్థి, సాహిత్యాభిమాని ఉమ్మరాజు చిన్న ఓబులేసు రచించిన శ్రీషిరిడి సాయి స్తోత్ర శతకాన్ని స్నేహితులు ఆవిష్కరించారు. -
గ్రీన్కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఓర్వకల్లు: గుమ్మితం తండా పరిధిని బహుళార్ధక సోలార్ పరిశ్రమను స్థాపించిన గ్రీన్కో యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహర్రెడ్డి ఆయన సతీమణి డీసీసీబీ మాజీ చైర్పర్సన్ విజయ మనోహరి శనివారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ సునీల్కుమార్కు ఫిర్యా దు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ దంపతులు మాట్లాడుతూ.. కాల్వ రెవెన్యూ పరిధిలో తమకు 10 ఎకరాలు భూమి ఉందని, అందులో మామిడి మొక్కలు ఉన్నాయన్నారు. భూమిలో సుమారు 4 ఎకరాల మేర గ్రీన్కో యాజమాన్యం వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మామిడి మొక్కలను తొలగించి వ్యర్థాలను నిల్వ చేసినట్లు తెలిపారు. పొలంలో డ్రిప్ పైపులను పగిలి పోయాయన్నారు. ఈ విషయంపై పలుసార్లు కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రీన్కో సిబ్బంది నిర్వాకంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
ఆళ్లగడ్డ: గంజాయి దిగుమతి చేసుకుని విక్రయాలు చేపడుతున్న ఐదురుగురు ముఠా సభ్యులను శనివారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ వివరించారు. శిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామా నికి చెందిన జింకల మద్దిలేటి దగ్గరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసులు బోయిలకంట్ల గ్రామ సమీపంలోని కాశినాయన ఆశ్రమం దగ్గరకు గంజాయి తీసుకుని వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడ మాటు వేశారు. అక్కడ మద్దిలేటి, కోడూరు శ్రీనివాసులుతో పాటు దండబోయిన గురుస్వామి, షేక్ అబ్దుల్ నబీ, మెఘల్ గఫార్బేగ్ గంజాయిని తరలించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోడూరు శ్రీనివాసుల ద్వారా ఒడిశా నుంచి గంజాయి సరఫరా చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించారు. ఐదుగురికి రిమాండ్ -
నాపరాతి గనిలో ట్రాక్టర్ బోల్తా
● డ్రైవర్ మృతి అవుకు(కొలిమిగుండ్ల): నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు శనివారం దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. అవుకు మండల పరిధిలోని రామాపురానికి చెందిన బోయ వెంకటరాముడు(45) నాపరాళ్ల లోడింగ్తో పాటు డ్రైవర్గా వెళుతుంటాడు. ఈ క్రమంలోనే ఉదయం ట్రాక్టర్లో గ్రామానికి సమీపంలోని గనిలోకి వెళ్లి నాపరాళ్లను లోడ్ చేసుకొని బయలు దేరాడు. గని మధ్యలోకి రాగానే ఇంజిన్, ట్రాలీకి మధ్యనున్న పిన్ కట్ కావడంతో అదుపు తప్పి ఇంజిన్ భాగం గని గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటరాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గనిలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా అనివార్య కారణాలతో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీవారి లడ్డూను రాజకీయ లబ్ధికి వాడుకోవడం దుర్మార్గం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి చిప్పగిరి: శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవమని, స్వామి ఆలయంలో ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూనూ కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు వాడుకోవడం దుర్మార్గమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరి కాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక్క అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆధారం లేకుండా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎలా అరోపణలు చేస్తారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ గుడి మెట్లను శుభ్రం చేసి నటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సీబీఐ సిట్ చార్జిషీట్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, సర్వర్ఖాన్, సేనాపతి, జయన్న, మహానంది, నెట్టికంటి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దే పింఛన్లు మాటల్లోనే!
హాలహర్వి: చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంటోంది. ప్రతినెలా వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. చింతకుంట గ్రామంలో శనివారం సచివాలయ సిబ్బంది ఓ ఆలయం వద్దకు కూర్చొని పింఛన్లుదారులను అక్కడికే రప్పించుకున్నారు. దీంతో ఇళ్ల నుంచి పింఛను పంపిణీ ప్రాంతాలకు చేరుకునేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ నోటి మాటలకే పరిమితమవుతోంది. 2024 జూలై నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నా ఆచరణలో 20 నుంచి 30 శాతం వరకే పంపిణీ జరుగుతోంది. శనివారం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగింది. సర్వర్ సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైంది. 10 గంటల వరకు సర్వర్ వేధించడంతో అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 గంటల తర్వాత సచివాలయాల్లోనే పంపిణీ చేయడంతో అతి కష్టం మీద వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతూ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కల్లూరులో పింఛన్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కోడుమూరు, సీ.బెళగల్, కర్నూలు, ఆదోని, డోన్, బనగానపల్లి, అవుకు తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రానికే పరిమితమైంది. ఇదిలాఉంటే కర్నూలులోని కొత్తపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్ల పంపిణీ చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 91.53 శాతం పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 2,13,117 పింఛన్లు ఉండగా 1,94,311 పంపిణీ చేశారు. ఈ జిల్లాలో 91.18 శాతం పంపిణీ పూర్తయింది. -
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
కర్నూలు(సెంట్రల్): నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియ ప్రాంగణంలో నవోదయ 2.0 లో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఉపా ధి కల్పనకు సంబంధించిన కర్నూలు నగరంలోని 20 మంది బంగారుపేట వాసులకు ఇండియన్ బ్యాంకు ద్వారా మంజూరైన ఆటోలు, తోపు డు బండ్లు, కంకర మిల్లర్లను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని సూచించారు. నాటుసారా తయారీ మాని ముందుకు వచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపుతామని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ డీసీ శ్రీదేవిమాట్లాడుతూ.. బంగారుపేటలో ఇంకా మిగిలిపోయిన వారందరూ సారాను కాయడం మాని స్వయం ఉపాధితో బతికేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం ద్వారా అర్థిక సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రూ.20 లక్షల విలువైన వాహనాలను కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు, మెప్మా పీడీ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి
దేవుడి పేరు చెప్పుకుని ప్రజలను మభ్య పెడుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కోరారు. ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్లో కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వెంకటేశ్వరస్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళను అత్యాచారం చేసి ఐదుసార్లు అబార్షన్ చేయించిన ఘనత ఆ ఎమ్మెల్యేకే చెల్లించిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
దేవుడంటే బాబుకు నమ్మకమే లేదు
బొమ్మలసత్రం: తిరుమల పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అన్నారు. పట్టణంలోని గుడిపాటిగడ్డ వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూప్రసాదాన్ని రాజకీయానికి వాడుకోవడం తగదన్నారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుదాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
ఆదోని రూరల్: ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వెట్టి చాకిరి (బాండెడ్ లేబర్) నుంచి 21 మందికి విముక్తి కల్పించారు. ఆదోని ఇన్చార్జి సబ్కలెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కపటి–నాగలాపురం గ్రామాల మధ్య ఉన్న ఇటుకల బట్టీలో మూడు నెలలుగా ఒడిశా, ఛత్తీస్ఘడ్, రాష్ట్రాలకు చెందిన 21 మంది వెట్టి చాకిరి పరిస్థితుల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 16 మంది పెద్దలు కాగా, అందులో పురుషులు ఏడుగురు, మహిళలు 9 మంది, ఒక బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. ఇటుకల బట్టీలో పని చేయించేందుకు ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి, అనంతరం వారిని తీవ్రంగా వెట్టి చాకిరి చేయించేవారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా విడుదల చేయించారు. విడుదలైన వారందరికీ ప్రభుత్వం తరపున రిలీజ్ సర్టిఫికెట్లు అందజేశారు. బాధితులకు రావాల్సిన వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, వారిని సొంత ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్కలెక్టర్ తెలిపారు. వెట్టి చాకిరి నేరమని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఎవరైనా ఈ విధమైన అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తంగాకుండా కార్మిక శాఖ అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాని సబ్కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వెట్టి చాకిరి నుంచి 21 మందికి విముక్తి -
పాప ప్రక్షాళన చేసుకోండి
తిరుపతి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారని, వారు తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితువు పలికారు. కృష్ణగిరి మండలం కర్ల కుంట గ్రామం తిరుమలరాయుడు స్వామి దేవాలయంలో శనివారం ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఎదుట టెంకాయలు కొట్టారు. భక్తుల మనోభావాలను గాయపరిచిన ‘కూటమి’ నేతలు బహిరంగ క్ష మాపణ చెప్పాలనే పోస్టర్ను అవిష్కరించారు. హిందువుల మనోభావాలను కించపరచిన సీఎంచంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు తిరుమలలో ముక్కును నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
దురుద్దేశంతోనే..
ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసిందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతల వక్రబుద్ధి మారాలని కోరుతూ శనివారం రుద్రవరం మండలం శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరిహార పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం చేరుకున్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. -
ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ
ఎమ్మిగనూరురూరల్: మండల పరిఽధిలోని చెన్నాపురం గ్రామం మలుపు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కోటేకల్ గ్రామానికి చెందిన బోయ ఉరకుందు ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి తమిళనాడుకు చెందిన లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఎద్దుల బండి ఎదురుగా వస్తున్న బోలెరోను ఢీకొట్టడంతో బండిపై ఉన్న బోయ కురుకుంద, ఎమ్మిగనూరుకు చెందిన బొలెరో డ్రైవర్ ఉరుకుందకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బండి పూర్తిగా ధ్వంసం కాగా, ఎద్దు కొమ్ము విరిగి గాయపడింది. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్, వాష్ అండ్ గో కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీ సులు జిల్లా అంతటా చర్యలు చేపట్టారు. రహదారులపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివా రం తెల్లవారుజాము వరకు స్టాప్, వాష్ అండ్ గో కార్యక్రమంలో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్లలోని జాతీయ రహదారులలో లారీలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలెరో వాహనాలను ఆపి వాహన సంబంధిత పత్రాలు, లైసెన్సులతో పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. తెల్లవారుజామున కునుకు తీయకుండా ముందు జాగ్రత్తగా డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి జా గ్రత్తలు సూచించారు. అతి వేగంతో నడపరాదని, రాంగ్ రూట్లలో వెళ్లకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్ జైల్ను మండల లీగల్ సెల్ చైర్మన్, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ హెల్ప్ ఐఎడ్ డెస్క్, క్లినిక్ను తనిఖీ చేసి దాని గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే లీగల్ సెల్ హెల్ప్లైన్ 15100 సమాచారం ఇవ్వాలన్నారు. వృద్ధ, పేద ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి గురు ప్రసాద్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మహిళ అదృశ్యం నంద్యాల(అర్బన్): మండలంలోని అయ్యలూరు మెట్ట గ్రామానికి చెందిన సుప్రియ అదృశ్యమైనట్లు రూరల్ పోలీసులు తెలిపా రు. ఈనెల 29వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన సుప్రియ తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు భర్త ప్రశాంత్ బంధువులు, సన్నిహితుల వద్దకు వెళ్లి విచారించినా ప్రయోజనం లేకుండా పోయింది. సుప్రియ కనిపించలేదంటూ శనివారం ప్రశాంత్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవా సహాయం
● లీలా వెంకటశేషాద్రి కర్నూలు: దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు శనివారం కర్నూలు సీ క్యాంప్లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో మాజీ సైనికుల కోసం నల్సావీర్ పరివార్ సహాయత యోజన 2025లో భాగంగా ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ప్రారంభించామన్నారు. ఈ క్లినిక్లో న్యాయవాది, పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వీరు మాజీ సైనికులకు చట్టబద్ధమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయాన్ని అందించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులన్నా. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్ఆర్ రత్నరూత్, న్యాయవాది విజయ, పారా లీగల్ వాలంటీర్ మధుసూదన్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం చేరుకునే పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధి కారి శ్రీనివాసరావు అన్నారు. శనివారం వారు క్షేత్ర పరిధిలోని కై లాసద్వారం, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను దేవస్థానం ఇంజినీరింగ్, సంబంధిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా కై లాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక చలువ పందిర్లను (తాత్కాలిక షెడ్డు) పరిశీలించారు. కై లాసద్వారం, భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా చేస్తుండాలని ఆదేశించారు. కై లాసద్వారం వద్ద మొత్తం 60 వేల లీటర్లు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కై లాసద్వారం, హఠకేశ్వరం వద్ద భక్తులకు అన్నదానం చేసే భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలకు దేవస్థానం తరుఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పా టు చేయాలన్నారు. ఆతర్వాత హఠకేశ్వరాలయం వద్ద దేవస్థానం నిర్మిస్తున్న నీటి సంపు నిర్మాణాన్ని పరిశీలించారు. దేవస్థానం నిర్మిస్తున్న జల్లు స్నానాల ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు సుబ్బారెడ్డి, చంద్రశేఖరశాస్త్రి, స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరమేశుడు, బీట్ ఆఫీసరు ఆర్. బాలాజీ ఉన్నారు. -
7న నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరు రూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం 9వ, 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. శనివారం ఆమె స్థానిక విద్యాలయంలో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి లేటరల్ ఎంట్రీ పరీక్షకు 9వ తరగతికి 1,014 మంది.. 11వ తరగతికి 1,382 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 9వ తరగతి ప్రవేశానికి బనవాసి నవోదయ, మాచాని సోమప్ప బాలికల పాఠశాలలో.. 11వ తరగతికి బనవాసి ఏపీఆర్ గురుకుల పాఠశాల, ఎమ్మిగనూరులో, ప్రభుత్వ బాలుర పాఠశాల, జెడ్పీ హైస్కూల్ వీవర్స్ కాలనీ, శ్రీ నీలకంఠేశ్వర జెడ్పీ హైస్కూల్, మాచాని సోపమ్ప ఇంగ్లీష్ మీడియం హైస్కూళ్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. సందేహాలంటే 08512–294545 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఐసీడీఎస్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): శిశు గృహ, బాల సదనాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పి.విజయ తెలిపారు. కర్నూలులోని శిశు గృహలో రెండు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ( ఈడబ్ల్యూఎస్ –1, ఎస్సీ త్రీ –1 ) వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. అలాగే పెద్దపాడు బాల సదనంలో హౌస్ కీపర్ –1 ( ఓసీ ), పత్తికొండ బాల సదనంలో ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ –1 ( ఓసీ ) పోస్టులను పార్ట్టైం పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 9వ తేది లోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు. విద్యార్హతలు, పూర్తి వివరాలకు వెబ్సైట్: https://kurnool.ap.gov.in// కార్యాలయ నోటీస్ బోర్డును పరిశీలించాలని పేర్కొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శ్రీశైలం: ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడను కూల్చి వేయడం దారుణమని, బ్రాహ్మణులు అంటే చులకనగా కనిపిస్తున్నారా అని దేవస్థానం అధికారులను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడ దుర్గ గుడికి సంబంధించిన భూములు మొదలుకొని విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములను టీడీపీ పందేరం చేస్తోందని విమర్శించారు. కరివేన సత్రం ప్రహరీ గోడ కూల్చివేతను సమాచార లోపం అని దేవస్థానం అధికారులు కప్పిపుచ్చుకోవడం సబబు కాదన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఏసీ చంద్రశేఖర్ రెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించడం కాదని, సస్పెండ్ చేయాలన్నారు. సత్రం పరిశీలనకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడం దారుణం అన్నారు. మూడు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మె ల్యే ప్రధాన పురవీధిలో విలేకరులతో మాట్లాడారని, తాను కాటేజీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మహానంది హుండీ ఆదాయం రూ. 37.47 లక్షలు మహానంది: మహానందిలో శనివారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.37.47 లక్షల ఆదాయం లభించింది. స్థానిక అభిషేక మండపంలో ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. 36 రోజులకు శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు కోదండ రామాలయం, ఆంజనేయస్వామి, వినా య క నంది ఆలయాల ద్వారా రూ.36,97,920, గో సంరక్షణ విభాగం ద్వారా రూ.16,695, నిత్య అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.32,511 వచ్చిందన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ కేసీ తిరుపాలు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రంగారెడ్డి, చిన్నమ్మ దంపతుల కుమారుడు పార్థసారధిరెడ్డి (33) ఎంసీఏ పూర్తి చేసి హైదారబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తల్లి చిన్నమ్మ చనిపోవడంతో రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శనివారం ఉదయం గ్రామంలోని కొత్తపల్లె హుసేన్ పశువుల పాక వద్ద పార్థసారధిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని శరీరంపైన ఎలాంటి గాట్లు లేకపోవడంతో అనారోగ్యమా, ఇతర కారణమా అనేది పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి చూడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఐ తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీయడం ఘోర అపచారం
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: రాజకీయ స్వార్ధం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేశారని, ఇది ఘోర అపచారం అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో కార్యకర్తలతో కలసి శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎదుట టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. గతంలో చంద్రబాబు అలిపిరి సంఘటన నుంచి బయటకు వచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, హనుమాపురం ఈరన్న, మంత్రాలయం మండల కన్వీనర్ భీమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


