Kurnool District News
-
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
చాగలమర్రి: చిన్నవంగలి గ్రామంలో ఓ యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు కుమారుడు చాకలి శ్రీను (20) కూలీ పనులకు వెళ్త జీవనం సాగించేవాడు. శుక్రవారం సమీపంలోని వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం బయనపల్లె గ్రామంలో ఉన్న అవ్వ ఇంటికి వెళ్లి అదే రోజు అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. మిద్దైపె నిద్రిస్తున్న తల్లిదండ్రులు శనివారం తెల్లవారుజామున కిందకు వచ్చి చూడగా శ్రీను నిద్రిస్తున్న గదికి గడియ పెట్టుకుని ఉండటంతో అనుమానంతో పగులగొట్ట చూశారు. ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తన సెల్ ఫోన్ను పగులగొట్టి ఇంట్లో ఉన్న నీటి కుండలో వేసిట్లు గుర్తించారు. కాగా ఓ యువతిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేవ వ్యవహారం విఫలమైందని, ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీను సెల్కు ఎవరో కాల్ చేసి బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారండి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా కర్నూలు(హాస్పిటల్): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని యువతకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా విజ్ఞప్తి చేశారు. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రెడ్క్రాస్ రక్తనిఽధి ఆవరణలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవంగా నిర్వహించుకుంటామన్నారు. ‘తమకు తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే నిస్వార్ధ వ్యక్తులకు గుర్తింపుగా ఈ సంవత్సరం రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి, కలిసి మనం ప్రాణాలను కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 45వేల యూనిట్లు అవసరం కాగా కేవలం 35వేల యూనిట్లు మాత్రమే లభ్యం అవుతోందన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఈ యేడాది చర్యలు తీసుకోవాలని, కళాశాలల్లో అవగాహన కల్పించి యువతను చైతన్యపరచాలని కోరారు. డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మేలు జరుగుతుందని చెప్పారు. గుండెపనితీరు కూడా మెరుగుపడుతుందన్నారు. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి మాట్లాడుతూ రెడ్క్రాస్ ద్వారా ప్రతి సంవత్సరం ఏడు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నామని, అందులో 50 శాతం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, తలసీమియా బాధితులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రక్తదానం చేస్తున్న కర్నూలు మెడికల్ కాలేజి పీజీ వైద్య విద్యార్థులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో రక్తదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, కోశాధికారి డాక్టర్ మాధవీశ్యామల, డాక్టర్ హరిచరణ్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
మహానందిలో వీకెండ్ సందడి
మహానంది: వీకెండ్ కావడంతో మహానంది ఆలయం శనివారం భక్తులతో కళకళలాడుతుంది. వేసవి సెలవులు ముగిసినా వీకెండ్ కావడంతో పలు ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. కోదండరామాలయం, వినాయకనంది, గరుడనంది క్షేత్రాలను సందర్శించి రాతి నంది, పెద్దనంది విగ్రహాలను తిలకించి భక్తులు సేదతీరారు. రాష్ట్రస్థాయి అంధుల చెస్ పోటీలు ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక అంధుల సంక్షేమం వసతి గృహంలో శనివారం రాష్ట్రస్థాయి అంధుల చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ బ్లైండ్ అనుబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రెండవ రాష్ట్రస్థాయి అంధుల చెస్ పోటీలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. పోటీలను రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, మంత్రి తనయుడు ఫిరోజ్, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్రీడా కోట దివ్యాంగులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు భవనాశి నాగమహేష్ భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో కల్నల్ ఫిలిప్, ఖలీల్, వలిబాషా, నాగమహేష్, జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రుద్రభూమిలో ఉద్రిక్తత
● చెట్నెహళ్లిలో శ్మశాన కంచె ఏర్పాటుపై తీవ్ర నిరసన ● కంచెకు వ్యతిరేకంగా భీష్మించిన హిందూ వర్గీయులు ● ఇరువర్గాలతో జేసీ చర్చలు విఫలం ● గ్రామంలో ఉద్రికత.. భారీ బందోబస్తు మంత్రాలయం/మంత్రాలయం రూరల్: తరతరాల రుద్రభూమి కోసం ఊరు ఏకమైంది. కంచె ఏర్పాటుపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా మొదలైన తిరుగుబాటు సాయంత్రానికి ఒకానొక దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. హుటాహుటినా జేసీ సంఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. హిందువుల తిరుగుబాటుతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామంలో శ్మశాన వాటిక విషయంలో ఓ సామాజిక వర్గం, హిందూ వర్గాల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు తలెత్తాయి. తమ ఇళ్లను ఆనుకుని ఉన్న శ్మశాన వాటికలో హిందువుల ఖననాన్ని ఖండిస్తూ సామాజిక వర్గీయులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఇటీవల ఓ రైతు మృతదేహం ఖననం విషయంలో సామాజిక వర్గీయులు అడ్డుపడటం జరిగింది. అప్పటి నుంచి శ్మశాన వివాదం ముదిరిపోయింది. తరాలుగా వస్తున్న శ్మశానాన్ని వదులుకోమంటూ హిందువులు భీష్మించారు. మూడు రోజుల క్రితం కలెక్టరేట్ ఎదుట కూడా నిరసనకు దిగారు. దీంతో శ్మశాన స్థల వివాదాన్ని సద్దుమణిచేందుకు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఇరు వర్గాలతో మంత్రాలయం రెవెన్యూ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమీక్షలో ఇరువర్గాల అభిప్రాయం మేరకు శనివారం కంచె ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో వచ్చారు. కంచె ఏర్పాటు అడ్డగింత.. గ్రామంలోని సర్వే నంబర్ 113లో 3.83 ఎకరాలు, సర్వే నం.114బీలో 1.02 ఎకరాల్లో ప్రభుత్వం రస్తా పొరంబోకు భూమి ఉంది. అందులో 113లోని దాదాపు ఎకరా భూమిలో ఓ సామాజిక వర్గీయులు ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంకొంత భూమిలో గురుబోధకుల సమాధులు ఉండగా.. 0.47 సెంట్ల స్థలం రస్తా పొరంపోగు మిగిలింది. ఈ భూమికి కంచె ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో పూనుకున్నారు. సామాజిక వర్గీయుల ఇళ్ల వైపు 20 అడుగులు వదిలి కంచెను వేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి 56 అడుగుల వెడల్పుతో కంచె వేయాలని ముందుగా కొలతలు వేసి పిల్లర్లు పాతేందుకు మార్కు వేశారు. ఒప్పందం ప్రకారం కంచె వేయడం లేదంటూ ఒక్కసారిగా హిందూ మహిళలు శ్మశాన వాటికలోకి దూసుకువచ్చారు. అంతవరకు దూరంగా ఉన్న మహిళలు దూసుకురావడంతో కంచె నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఇలాగైతే కంచెను వేయనీయమంటూ శ్మశానంలో పనులు నిలిపేసి బైఠాయించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే కూర్చుని శాంతియుతంగా ఆందోళనకు దిగారు. సర్దుబాటుకు ససేమిరా.. కంచె ఏర్పాటుకు హిందువులు అడ్డుపడగా సబ్ కలెక్టర్ జోక్యంతో 40 అడుగుల వెడల్పుకు కుదించారు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారడంతో జాయింట్ కలెక్టర్ నవ్య గ్రామానికి చేరుకున్నారు. హిందువుల కోరిక మేరకు 30 అడుగుల వెడల్పుతో కంచె వేసేందుకు సర్దుబాటు చేశారు. అందుకు ఓ సామాజిక వర్గీయులు ససేమిరా అనడంతో వేరే మార్గం లేక జేసీ వెనుదిరిగారు. అంతకు ముందు జేసీ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని, పంతాలకు వెళ్లరాదని సూచించారు. రాజీమార్గంలో శ్మశాన వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం కలెక్టర్ నిర్ణయం మేరకు కంచె ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అయితే ‘మీకు మొక్కుతాం.. అమ్మా’ మాకు న్యాయం చేయండి అంటూ హిందూ మహిళలంతా జేసీని వేడుకున్నారు. చివరగా ఇరువర్గాలతో సమావేశమైనా ఫలితం లేకపోయింది. శ్మశాన విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తించినా ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలంటూ జేసీ స్థానిక సీఐ రామాంజులుకు ఆదేశించి వెనుదిరిగారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా డీఎస్పీ ఉపేంద్రబాబు నేతృత్వంలో ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇదేమి పైశాచికం!
● బ్రాహ్మణదొడ్డిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తుల ధ్వంసం ● సర్పంచ్ గడ్డివామిని తగులబెట్టిన దుండగలు ● మరో వ్యక్తి ఇంటి బండలను పగులగొట్టిన వైనం సి.బెళగల్: పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ బ్రాహ్మణదొడ్డి గ్రామంలో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. వారి ఆస్తులను తగులబెట్టడంతో పాటు ధ్వంసం చేస్తున్నారు. గ్రామంలో టీడీపీకి చెందిన వారు సర్పంచ్ దస్తగిరి, ఆయన అనుచర వర్గంపై వైరం పెంచుకుని తరచూ ఘర్షణకు దిగుతున్నారు. రెండు నెలల క్రితం సర్పంచ్, అతడి కుటుంబ, బంధువులు, సానుభూతిపరులపై భౌతిక దాడులు చేశారు. ఈక్రమంలో గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం రాత్రి దుండగులు దస్తగిరికి చెందిన చెందిన నాలుగు ట్రాక్టర్ల గడ్డివామిని (పశుగ్రాసంను) నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. అదేవిధంగా గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ఉన్న మేకల రాముడు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న షెడ్ బండలను సైతం ధ్వంసం చేశారు. కాగా గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నా గ్రామంలో టీడీపీ వారు అరాచకాలు సృష్టిస్తూ, ఆస్తులను నాశనం చేస్తుండటంపై గ్రామంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గ్రామంలో అరాచకాలకు పాల్పడే దుంగడులను గుర్తించి, తమకు రక్షణ కల్పించాలని, అదేఽవిధంగా తమకు న్యాయం చేయాలని బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పరమేష్ నాయక్ తెలిపారు. -
ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
● 38.4 తులాల బంగారు, 32.6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం బొమ్మలసత్రం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడి 36 కేసుల్లో నిందితులుగాఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మే రకు శనివారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పాతగుంటూరుకు చెందిన పవన్కుమార్, తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెకు చెందిన శివశంకర్కు గతంలో జైలులో పరిచ యం ఏర్పడింది. అప్పటికే పవన్కుమార్పై 32 చోరీ కేసులు, శివశంకర్కు 21 చోరీ కేసులు పలు ప్రాంతాల్లో నమోదు కాబడ్డాయి. ఇద్దరు కలిసి ఈ ఏడాది నందికొట్కూరు బాలాజీ నగర్లో చోరీకి పాల్పడ్డారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసు కున్న జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుల ఆచూకీని కనిపెట్టి శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా వారిపై గుంటూ రు, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపురం అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనే కాకుండా తెలంగాణలో కూడా కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి 39.4 తులాల బంగారు ఆభరణాలు, 32.6 తులాల వెండి ఆభరణాలు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. -
ఎందుకు అనర్హులం?
నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు స్కూళ్లకు వెళ్తున్నారు. మా పాప హహీరా ఉర్దూ స్కూళ్లో 3వ తరగతి చదువుతోంది. బాబు షారిక్ ప్రైవేటు స్కూలులో 4వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరికీ తల్లికి వందనం పథకంతో రూ.30వేలు వస్తాయనుకున్నాం. గతంలో మా పాపకు అమ్మ ఒడి వచ్చింది. ఇప్పుడు ఒక్కరికీ కూడా రాలేదు. అనర్హుల జాబితాలో పేరున్నట్లు చెబుతున్నారు. మేం ఎందుకు అనర్హులమో అర్థం కావడం లేదు. చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం ఇవ్వాల్సిందే. – షాహిరూన్, పాములపాడు -
పేదలపైన కక్ష
మాది రెక్కాడితేనే కానీ డొక్కా నిండని కుటుంబం. చాలా నిరుపేద కుటుంబం అని గుర్తించి జగనన్న పాలనలో మాకు అమ్మ ఒడి పథకం వచ్చింది. పగిడ్యాలలో నా కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. మాకు ఎలాంటి చరస్థిర ఆస్తులు లేవు. మాకు ఒకే కుమారుడు. చదివించే ఆర్థిక స్థోమత లేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ఇవ్వాలి. జగనన్న పాలనలో అమ్మ ఒడి పథకం ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు. మాలాంటి పేదలపైన కక్ష కట్టి తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేసింది. – లలితమ్మ, పాలమర్రి గ్రామం, పగిడ్యాల మండలం ● ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన ఖాదర్ బాషా, కె.మౌలాబీ అనే దంపతులకు ముగ్గురు కూతుర్లు. 1వ తరగతి, 4వ తరగతి, 7వ తరగతులు చుదువుతున్నారు. గత ప్రభుత్వంలో వీరికి అమ్మ ఒడి పథకం కింద నగదు జమ అయ్యింది. మూడు ఎకరాల భూమి ఉంటే ప్రస్తుతం వారికి 10 ఎకరాల భూమి ఉన్నట్లు చూపి అనర్హులను చేశారు. ● గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన శ్రీనివాస ఆచారి, వి.మహలక్ష్మీ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త వడ్రంగి పని చేస్తూ వారికి ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. మహలక్ష్మీ నిత్య కూలీ పనికి వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో వీరి అమ్మఒడి వచ్చింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద వీరికి 10 ఎకరాల భూమి ఉందని అనర్హులను చేశారు. ● గూడూరు మండలం పొన్నకల్లు, జూలకల్లు గ్రామాలకు చెందిన సచివాలయం పరిధిలో 136 మందిని అనర్హుల జాబితాలో చూపించారు. ఇందులో 91 మంది చిన్న, సన్నకారు రైతులే. ఈ రైతుల భూములకు మూడు, నాలుగు దశబ్దాల క్రితం సాగు నీరు వచ్చేది. రెవెన్యూ రికార్డుల్లో మాగాణి ఉండటంతో నిబంధనలతో అర్హులు కాలేదు. వీరికి గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ఇచ్చింది. ప్రస్తుతం రాలేదు. ● కోడుమూరు మండలంలో ఒకే ఆధార్ నంబరు 19 మంది విద్యార్థులకు చూపిస్తోంది. దీంతో ఎంపీపీఎస్ అనుగొండ, ఎంపీపీఎస్ పులకుర్తి, కర్నూలు శ్రీచైతన్య స్కూల్ , కర్నూలు నారాయణ స్కూల్కు చెందిన విద్యార్థులకు అమ్మ వందనం పథకం అమలు కాలేదు. ● నిబంధనలతో జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు.. తల్లికి వందనం పథకానికి అనర్హులయ్యారు. కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక మరచిపోవడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా అమలు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటే. తల్లికి వందనం పథకం అమలును ఇందుకు నిదర్శనంగా ప్రజలు చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీల విషయాన్ని 2023 మే నెలలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు దాటిపోయింది. అఽధికారంలోకి వచ్చి మొదటి ఏడాది ఎగ్గొట్టి.. సాకులు వెతుక్కుంటూ ఏప్రిల్, మే నెలలో ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకం అంటూ ఈ నెల 12వ తేదీన ప్రకటించి జాబితాలు విడుదల చేశారు. నిబంధనల పేరుతో చాలా మందిని అనర్హులను చేశారు. తప్పుల తడకగా ... ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లివందనం పథకం ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఎలాంటి నిబంధనలు ఉండబోవని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు విధించి తప్పులు తడకగా జాబితా రూపొందించారు. హౌస్హోల్డ్ సర్వే పేరుతో భారీగా కోత విధించారు. మొన్నటి వరకు ముగ్గురుకి మాత్రమే అర్హత ఉండగా వ్యతిరేకత రావడంతో నలుగురికి, ఆ తరువాత ఐదుగురు వరకు పొడిగించారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారమే జిల్లాలో 1,245 మంది తల్లులకు ఆరుగురు, ఆపై పిల్లలు ఉన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వీరందరూ అనర్హులే! ని‘బంధనాలు’ జిల్లాలో 4.49 లక్షల మంది విద్యార్థులు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ సర్వే చేశారు. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా తయారు చేసిన తల్లికి వందనం జాబితాలను జిల్లాలోని 672 సచివాలయాలకు పంపించారు. అర్హులు, అనర్హుల జాబితా వేర్వేరుగా సచివాలయాల్లో ప్రదర్శించి ఫిర్యాదులు తీసుకుంటారు. తుది జాబితాను ఈనెల 30వ తేదీన ప్రకటించి జూలై 5వ తేదీన వీరితో పాటు 1వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూముల విషయంలోనే ఎక్కువగా అనర్హులను చేసినట్లు తెలుస్తోంది. గౌరవ వేతనం వస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సైతం తల్లి వందనం పథకానికి దూరం చేశారు. కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు అనర్హులు తల్లికి వందనం పథకంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల వివరాలు లేవు. ఆ విద్యార్థులను ఈ పథకానికి పరిగణనలోకి తీసుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం అందించింది. యూడైస్ ప్లస్లో కేంద్రీయ విద్యాలయ వివరాలు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిగా ఆ లింక్ తొలగిపోయింది. ఉద్దేశ పూర్వకంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను విస్మరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇద్దరికీ ఇవ్వాలి మాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఒకరు 8, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేలు చొప్పున రూ.30వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆశగా ఎదురు చూశాం. గత ఏడాది వేస్తారని నమ్మి మోసపోయాం. ఈ ఏడాది తల్లికి వందనంలో ఇద్దరు పిల్లలకు గాను ఒకరికి మాత్రమే అకౌంట్లో జమ అయ్యింది. మరొకరికి జమ కాలేదు. మాది నిరుపేద కుటుంబం. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాం. హామీ మేరకు ఇద్దరికీ అమ్మవందనం ఇవ్వాలి. –మహబూబ్బీ, నంద్యాల అస్తవ్యస్తంగా తల్లికి వందనం పథకం అమలు జిల్లాలో 4.49 లక్షల మంది విద్యార్థులు 60 వేల మంది విద్యార్థులు అనర్హులు నిబంధల పేరుతో భారీగా కోత గత ప్రభుత్వంలో అమ్మ ఒడి వచ్చినా.. నేడు రాని వైనం ఫిర్యాదులకు 26 వరకే గడువు.. 30న తుది జాబితా -
ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ఆలూరు/ఆలూరు రూరల్: ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శనివారం ఆయన స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు కేంద్రం మంజూరు చేసిన రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా పల్లె ప్రగతికి అవరోధంగా మారారన్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందించకుండా కూటమి ప్రభుత్వం నయవంచన చేస్తోందన్నారు. ఐదు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిందని, ఈ నిధు లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు గ్రామ పంచాయతీల నిధులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లించారని ఆరోపించారన్నా రు. ఇప్పుడు కూటమి నేతలు ఆ నిధులను ఏమి చేసినట్లన్నారు. ఏడాదిలోనే రూ.1.58 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్ప చేసిందని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కిందన్నారు. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలకు 18 నెలలుగా గౌరవ వేతనం రావడం లేదన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.4.80 కోట్ల గౌరవ వేతనం బకాయి ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. పాలనను పక్కనపెట్టి ఆయన సినిమా షూటింగ్లకే పరిమితం అయ్యారని విమర్శించారు. -
చంద్రబాబు ఏడాది పాలన అంతా అరాచకమే!
కర్నూలు (టౌన్): చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. బూటకపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కల్లూరులోని తన గృహంలో చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్లెట్ను శనివారం ఆవిష్కరించారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల జగనన్న పాలనను చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారన్నారు. జగనన్న హయాంలో రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అవినీతి లేకుండా.. మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హుల అకౌంట్లలో నిధులు జమ అయ్యాయన్నారు. రెండేళ్ల కరోనా సమయంలోనూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత జగనన్నకే దక్కిందన్నారు. మోసం చంద్రబాబు నైజం టీడీపీ అధినేత చంద్రబాబుది మోసం నైజమని కాటసాని విమర్శించారు. ఏడాది పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. మహిళలను దగా చేశారని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉచిత బస్సు, ఏటా 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.1500, 50 సంవత్సరాలు నిండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ. 4 వేలు పెన్షన్ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. తల్లికి వందనం తూతూమంత్రంగా అమలు చేస్తూ రాష్ట్రంలో 30 లక్షల తల్లులకు ఎగనామం పెట్టారన్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలు ప్రజలకు ఏమీ చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏడాదంతా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని కాటసాని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. రాష్ట్రంలో వాస్తవాలను తెలుసుకునేందుకు చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై బుక్లెట్ను జిల్లా కేంద్రంలో, నియోజకవర్గం కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
కలెక్టరేట్ ఏఓగా శివరాముడు బాధ్యతల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్ ఏఓ(పరిపాలన అధికారి)గా ఆర్.శివరాముడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆదోని తహసీల్దార్గా పనిచేస్తున్న ఈయన కలెక్టరేట్ ఏఓగా బదిలీ అయ్యారు. ఇక్కడ ఏఓగా ఉన్న ఐ.విజయశ్రీని నంద్యాల జిల్లాకు కేటాయించారు. ఈక్రమంలో ఆయన ఇన్చార్జి డీఆర్వో బీకే వెంకటేశ్వర్లును కలిసిన అనంతరం చార్జి తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న ఆర్.శివరాముడును ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఇతర ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయాధికారుల బదిలీల్లో కొనసాగుతున్న పైరవీలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ అధికారుల బదిలీల్లో పైరవీల పర్వం కొనసాగుతోంది. ఇటీవలి వరకు ఓర్వకల్లు ఏఓగా పనిచేసిన సుధాకర్ ఆదోని మండల వ్యవసాయ అధికారిగా పోస్టింగ్ కోసం సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఊహించని రీతిలో 20 నెలల క్రితం వరకు దాదాపు ఆరేళ్లు ఏఓగా పనిచేసిన పాపిరెడ్డి మళ్లీ ఆదోని ఏఓ పోస్టు దక్కించుకున్నారు. ఆదోని ఏఓ పోస్టును ఆశించిన సుధాకర్కు ఎమ్మిగనూరు ఫామ్ దక్కింది. అయితే ఆయన ఆదోని ఎమ్మెల్యే ద్వారా వ్యవసాయ శాఖ కమిషనర్పై ఒత్తిడి తేవడంతో పాపిరెడ్డిని వెనక్కి పంపి.. సుధాకర్ను ఆదోని ఏఓగా నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. మార్పులు, చేర్పుల ఉత్తర్వులన్నీ 9వ తేదీతోనే జారీ అవుతుండటం గమనార్హం. కాగా గూడూరు ఏఓగా పనిచేస్తున్న శ్రీవర్ధన్రెడ్డిని మొదట కర్నూలు ఏడీఏ కార్యాలయం టెక్నికల్ ఏవోగా నియమించారు. ఈయనను గుత్తి ఏడీఏ కార్యాలయం టెక్నికల్ ఏవోగా బదిలీ చేశారు. 24 గంటలు గడవక ముందే మళ్లీ కర్నూలు ఏడీఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఇక్కడకి బదిలీ చేసిన మంజుల గుత్తి ఏడీఏ కార్యాలయానికి వెళ్లారు. కంబదహాల్లో దా‘రుణం’ ● పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య సి.బెళగల్: పంటలు పండలేదు.. ప్రభుత్వం నుంచి సా యం అందలేదు.. అప్పులు కుప్పలా పేరుకుపోయాయి.. ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సి.బెళగల్ మండలం కంబదహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపి న వివరాల మేరకు.. బోయ తిమ్మప్ప (55)కు భార్య కుసుమవతి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఉల్లి వేయగా నష్టం వచ్చింది. పెట్టుబడి కోసం రూ.6 లక్షలు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.5 లక్షలు అప్పు చేశారు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. -
కావాలనే ఇలా చేశారు
మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత ఏడో తరగతి పూర్తి అయ్యి ఇప్పుడు 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఐదో తరగతి పూర్తి అయ్యి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్కుమార్ మూడో తరగతి నుంచి నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నాకున్న నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మెట్ట భూమి పది ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉన్నందున మీరు అనర్హులని చెప్పారు. మాకు 9.40 ఎకరాలు మాత్రమే పొలం ఉంది. ఈ ప్రభుత్వం కావాలనే చేసిందో మరేమో అర్థం కావడం లేదు. – ఉలిగమ్మ, బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం -
దిక్కుతోచని వేరుశనగ రైతు
● సీజన్ మొదలైనా ముందుకు సాగని పంపిణీ ● నామమాత్రం కేటాయింపులతో వ్యవసాయ అధికారుల్లో ఆందోళన ● ప్రతి మండలం నుంచి అదనపు కోటాకు డిమాండ్ ● ఉమ్మడి జిల్లాలో వేరుశనగ 66,653 హెక్టార్లు సాగయ్యే అవకాశం ● విత్తన కేటాయింపు కేవలం 14వేల హెక్టార్లకే.. కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు కురుస్తున్నా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు రైతులకు అందడం లేదు. దీంతో పొలాలను బీళ్లుగా వదిలేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు బదిలీల ప్రక్రియలో నిమగ్నం కావడంతో వేరుశనగ పంపిణీ ఊపందుకోలేదు. బదిలీలు కొలిక్కి రావడంతో ఇప్పుడిప్పుడే ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఏఓలు కేటాయింపులను చూసి పంపిణీ ఎలా చేయాలని తల పట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్లో 54,710, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల ప్రకారం వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రధానంగా కే–6 రకం సాగు చేస్తారు. హెక్టారుకు 170 కిలోల విత్తన కాయలు అవసరం. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాకు 1.13 లక్షల క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుంది. అయితే వ్యవసాయ యంత్రాంగం ఉమ్మడి జిల్లాకు 32,181 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అడిగినంత ఇవ్వలేకపోయినా కనీసం గత ఏడాది పంపిణీని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకారం కేటాయించాలి. గత ఏడాది కర్నూలు జిల్లాలో 13,909 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 3,062 క్వింటాళ్ల ప్రకారం 16,971 క్వింటాళ్లు పంపిణీ అయింది. ఈ ప్రకారం కూడా కేటాయింపులు లేకపోవడం గమనార్హం. హెక్టారుకు 1.50 క్వింటాళ్ల ప్రకారం.. అర్ధ ఎకరాకు 30 కిలోల ప్యాకెట్ ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్లు, అంటే 1.50 క్వింటాళ్ల వేరుశనగ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రకారం జిల్లాకు 99,979 క్వింటాళ్ల వేరుశనగ అవసరమవుతుంది. ఉమ్మడి జిల్లాకు కేటాయించింది 11,108 క్వింటాళ్లు మాత్రమే. ఇది కేవలం 14వేల హెక్టార్లకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన వేరుశనగను రైతులు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధ్వానంగా వేరుశనగ కేటాయించడం పట్ల వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ పంపిణీ మొదలు పెడితే రైతుల నుంచి ఏ స్థాయిలో ఇబ్బందులు వస్తాయోనన్న భయం వ్యవసాయ అధికారులను వెంటాడుతోంది. జిల్లాలో 26 మండలాలు ఉండగా.. ప్రతి ఏఓ అదనంగా వేరుశనగ ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారిని కోరుతున్నారు. గత ఏడాది పత్తికొండ మండలంలో 1,310.40 క్వింటాళ్లు, మద్దికెర మండలంలో 851.10 క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఈసారి మాత్రం పత్తికొండ మండలానికి 650, మద్దికెర మండలానికి 490 క్వింటాళ్లు కేటాయించారు. కేటాయించిన వేరుశనగ ఏ మాత్రం సరిపోదని, కనీసం రెట్టింపు చేయాలని ఆయా మండల వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. ఆదోని మండలానికి అదనపు కేటాయింపు మిగిలిన అన్ని మండలాల నుంచి అదనపు వేరుశనగ కావాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి. అలాంటిది ఒక్క ఆదోని మండలానికి మాత్రమే రాజకీయ నాయకుల ఒత్తిడితో అదనంగా 300 క్వింటాళ్లు కేటాయించారు. తక్కిన మండలాల ప్రజాప్రతినిధులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. బయటి మార్కెట్లో క్వింటా రూ.8వేల పైనే మాకు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ సారి వేరుశనగ సాగు చేయాలని మే నెల మూడవ వారంలోనే భూములను సిద్ధం చేసుకున్నాం. గతంలో మాదిరి మే నెల 20 నుంచే వేరుశనగ పంపిణీ చేస్తారనుకున్నాం. అయితే జూన్ నెల మొదటి వారం వరకు విత్తన పంపిణీ ఊసేలేకుండా పోయింది. బహిరంగ మార్కెట్లో కొందామంటే క్వింటా ధర రూ.8వేలకు పైగానే ఉంది. అంత డబ్బులు పెట్టలేక ఉద్యాన పంట సాగు చేస్తున్నా. – మల్లికార్జున, పందికోన గ్రామం, పత్తికొండ మండలం -
సుప్రీం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేసినట్లు సుప్రీం కోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక లాంటివన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరెస్టులు ఆక్రమమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమాననీయంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైందని, ఇందుకు ప్రతి రోజూ పత్రికల్లో, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలే నిదర్శనమన్నారు. నేరం చేశారని ముగ్గురు యువకులను రోడ్డు మీద హింసించారని, అత్యాచారం చేసిన మృగాలను ఈ విధంగానే ఎందుకు శిక్షంచడం లేదన్నారు. రాష్ట్రంలో అకృత్యాలు చేయాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏమైనా లైసెన్సు ఇచ్చారా అని ప్రశ్నించారు. హర్షణీయం కర్నూలు(సెంట్రల్): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసులుకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించడం హర్షణీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కొమ్మినేని కేసు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలమన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఏపీడబ్ల్యూజేఎఫ్ స్వాగతిస్తుందన్నారు. ఇప్పటికై నా పోలీసులు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. -
సాగులో తోడై.. మట్టిలో మాయమై!
పొలం పనుల్లో విద్యుత్ ప్రమాదం ● కాడెద్దు అక్కడికక్కడే మృతి ● ఓ రైతు, మరో కాడెద్దుకు గాయాలు కోడుమూరు రూరల్: ఏరువాక గడిచి వారమైనా కాలేదు. ఎద్దుల సంబరం కళ్లలోనే ఉంది. పిలిస్తే పలికే నేస్తం కళ్లెదుటే కాలమైంది. తోబుట్టువుగా మెలిగి.. సాగులో భాగమైన మూగజీవం ఆ మట్టిలోనే మాయమైంది. పొలం పనులు చేస్తుండగా చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదం ఓ కాడెద్దును బలిగొంది. ఈ ఘటన కోడుమూరు మండలం కొత్తపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తపల్లెకు చెందిన కంచి భాస్కర్కు ఐదెకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం గోరంట్ల జాతరలో రూ.లక్ష పెట్టి కోడెదూడలను కొనుగోలు చేశాడు. వీటిని ఆ కుటుంబం ఎంతో అపురూపంగా చూసుకుంటోంది. వీరి పొలం పనులతో పాటు గ్రామంలో ఇతర రైతులు పిలిచినా కాడెద్దులను కూలీకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతు మేకలగిడ్డయ్య పత్తి పంట సాగు చేయగా.. శుక్రవారం పత్తిలో కలుపు పాసేందుకు భాస్కర్కు చెందిన కాడెద్దులను మాట్లాడుకున్నాడు. అతని కుమారుడు రవి కాడెద్దులతో పత్తి పొలంలో గొర్రు తోలుతుండగా బోరు కనెక్షన్కు ఇచ్చిన కరెంటు వైర్ల సపోర్టు కట్టె తగిలింది. కాడెద్దుల తాకిడికి కట్టె విరిగిపోయి విద్యుత్ తీగలు వాటిపై తెగిపడ్డాయి. రవికి కూడా స్వల్పంగా విద్యుత్షాక్ తగలడంతో వెంటనే అప్రమత్తమై ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపేయాలని కేకలు వేయడంతో సమీపంలోని రైతులు స్పందించారు. అప్పటికే ఓ ఎద్దు మృతి చెందగా, మరో ఎద్దుకు విద్యుత్ షాక్కు గురైంది. స్వల్ప గాయాలైన రవిని కోడుమూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. గాయపడిన ఎద్దును పశువైద్య శాలకు తీసుకెళ్లగా సత్వర వైద్యంతో కళ్లు తెరిచింది. అయితే కళ్లెదుటే ఓ ఎద్దు మృత్యువాత పడటాన్ని ఆ రైతు కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న రైతులను కూడా కంటతడి పెట్టించింది. రూ.లక్షన్నరకు అడిగినా ఇవ్వలేదు కాడెద్దులంటే మాకు ప్రాణం. మూడేళ్ల కాలంలో ఏనాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. మా పొలం పనులతో పాటు ఊర్లో రైతులు పిలిస్తే కూలీకి తీసుకెళ్తుంటాం. చిన్న పిల్లల్లానే వీటిని కూడా చూసుకుంటాం. వారం రోజుల కింద రూ.లక్షన్నరకు అమ్మాలని అడిగినా ఆ ఉద్దేశమే లేదని చెప్పాం. ఈ రోజు కళ్ల ముందరే ఓ ఎద్దు ప్రాణం వదిలింది. మా కుటుంబంలో భాగమైన ఓ ఎద్దు మమ్మల్ని వదిలిపోవడం చాలా బాధ కలిగిస్తోంది. – భాస్కర్ కుమారుడు రవి ఆవేదన -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు
● ఉద్దేశపూర్వకంగా వాహనాల స్వాధీనం ● 25 రోజులైనా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ● మైనింగ్ అధికారులపై జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం ● హంద్రీ–నీవా పనులపై అసహనం ● హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): ‘ ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు .. అక్రమ మైనింగ్ జరు గుతుంటే కేసులు నమోదు చేయండి, కానీ ... రాజకీ య ఒత్తిళ్లతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో శుక్రవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్పై జరిగిన చర్చలో చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ... బెలుం శింగవరం గ్రామ శివారుల్లో గత నెల 20న మైనింగ్ అధికారులు స్థానిక పోలీసుల తో కలిసి దాడులు నిర్వహించి, గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత పేరం రాంశంకర్రెడ్డికి చెందిన ప్రొక్లెయినర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇతరులకు చెందిన గని వద్ద నిలిచి ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం, నోటీసు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పల్లెల్లో బెల్ట్ షాపులతో అనేక అనర్థాలు ... గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపులతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కంటితుడుపు చర్యగా కాకుండా ఎకై ్సజ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారాన్ని కూడా తీసుకొని గ్రామాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిర్మూలించాలన్నారు. ఎక్కడబడితే అక్కడ మద్యం లభిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జరిమానాలను విధించడంతో పాటు స్లైడ్ల రూపంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అభాసుపాలైన విద్యా శాఖ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యా శాఖ పూర్తి స్థాయిలో అభాసుపాలైందని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అనేక మందికి రీవ్యాల్యూయేషన్, రీకౌంటింగ్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫెయిల్ అయిన, మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు? దరఖాస్తు చేసుకున్న వారిలో మంది ఉత్తీర్ణులయ్యారు? ఎంత మందికి మార్కులు పెరిగాయనే అంశాలపై పూర్తి సమాచారాన్ని వచ్చే సమావేశాల నాటికి అందించాలని ఆయన విద్యాశాఖ అధికారులను కోరారు. బిల్లులను వెంటనే పంపించండి వేసవిని దృష్టిలో ఉంచుకొని జెడ్పీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వారంలోగా పంపించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆదేశించారు. ఇయర్ మార్క్డ్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పరిధిలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా జూలై నాటికి పంపించాలన్నారు. ఇంకా ఈ పనులు 129 పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోందని, వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జెడ్పీ ప్రాంగణంలోని చైర్మన్ బంగ్లా నిర్మాణానికి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి రూ.1.25 కోట్లను డిపాజిట్ చేసిన వెంటనే టెండర్లను పిలిచి పీఆర్ ఆధ్వర్యంలో బంగ్లాను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ చెప్పారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. హంద్రీనీవా పనులపై అసహనం జిల్లాలో 88 నుంచి 216వ కిలోమీటర్ వరకు జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వైడనింగ్, లైనింగ్ పనులపై జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అస హనం వ్యక్తం చేశారు. దాదాపు రూ.439 కోట్లతో ఈ పనులను చేపడుతున్నారని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకే పత్తికొండ మండలం పందికోన సమీపంలో (108.1 కిలోమీటర్ ) కాలువ లైనింగ్ దెబ్బతినడం చూస్తే ఈ పనులను ఎంతమేరకు నాణ్యతతో చేపట్టారో అర్థమవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సెల్ఫోన్లో దెబ్బతిన్న లైనింగ్ పనుల ఫొటోలను చూపించారు. జిల్లాలోని వివిధ కెనాల్స్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో మట్టిని తరలిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని బోర్డులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. -
టీడీపీ నాయకులూ.. మదర్సాలనూ వదలరా!
● మంత్రి అనుచరుల మంటూ బెదిరింపులా? ● కర్నూలులో ముస్లింల ఆందోళన కర్నూలు (టౌన్): ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు, అనుచరులు వక్స్ బోర్డు స్థలాలను కబ్జా చేస్తున్నారని, మదర్సాల స్థలాన్ని సైతం వదలరా’ అంటూ ముస్లింలు కర్నూలు నగరంలో ఆందోళన నిర్వహించారు. కర్నూలులో ఉన్న ఒకరిద్దరు మంత్రి దగ్గర ఉంటున్నారని, రాత్రికి రాత్రి మదర్సా స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. స్థలంలో అడుగు పెట్టకూడదంటూ బెదిరింపులు చేస్తున్నారన్నారు. శుక్రవారం మసీదులో ప్రార్థనల అనంతరం కర్నూలు ప్రకాష్నగర్లోని రోజా వీధిలో మదర్సా వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున్న ధర్నా చేశారు. ఈ సందర్బంగా అఫ్సర్ బాషా, సయ్యద్ ఇస్మాయిల్ పీరాలు మాట్లాడుతూ.. రోజా వీధిలో ఉన్న మదర్సా స్థలం కొనుగోలు చేశామన్నారు. ఈ స్థలం వక్ఫ్బోర్డుకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రిజిస్ట్రర్ డాక్యుమెంటు 1432 అని 16 సెంట్లలో ఈ మదరసా ఉందన్నారు. ఇప్పుడు మదర్సా స్థలం రూ. 4 కోట్లు విలువ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీకి చెందిన సూరి మన్సూర్ ఆలీఖాన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రి ఈ మదర్సాను స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు. ఎవరూ అడుగు పెట్టకూడదని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఉన్న మదర్సాను నిర్వీర్యం చేయడమే కాకుండా వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. మదర్సాను తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని మసీదుల నుంచి ముస్లింలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
వైభవంగా తిరుచ్చి ఉత్సవం
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, నైవేద్య సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితుడు జ్వాలా చక్రవర్తి ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఊరేగింపు నిర్వహించారు. జీడీపీలోకి వరద నీరు గోనెగండ్ల: మండలంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే గాజులదిన్నె ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ అలి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దాదాపు 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండగా, శుక్రవారం 600 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరిందని ప్రాజెక్టు ఏఈ వెల్లడించారు. గాజులదిన్నె ప్రాజెక్ట్కు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు. బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి కర్నూలు(అర్బన్): తల్లికి వందనం నిధులు విడుదల కాని ఎస్సీ విద్యార్థులు పోస్టల్/బ్యాంకు ఖతాలకు ఎన్పీసీఐ లింకు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమం సాధికారత అధికారిణి కె.తులసీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 930 మంది తల్లుల ఎన్పీసీఐ మ్యాపింగ్ పెండింగ్లో ఉందన్నారు. అలాగే 2,129 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఎన్పీసీఐ కూడా పెండింగ్లో ఉందన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగిల్ బ్యాంకు అకౌంట్ మాత్రమే ఉండాలని, అది కూడా విద్యార్థి ఆధార్ లింకు ఉన్న బ్యాంకు అకౌంట్కే తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తి చేయాలన్నారు. -
బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు
● భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు ● జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడి కొలిమిగుండ్ల: భూమి అంతర్భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత బెలుం గుహలకు ఎట్టకేలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించనుంది. దేశంలో మేఘాలయలోని క్రైమ్ లియాట్ ప్రాహ్ గుహల తర్వాత రెండవ అతి పెద్ద గుహలుగా నిలిచాయి. ప్రపంచంలో రెండో గుహగా బెలుం గుహలను గుర్తించారు. కొలిమిగుండ్ల–బెలుం ప్రధాన రహదారిలో విస్తరించాయి. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలనే వెల్లడించింది. గుహల అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకోవడంతో బెలుం గుహలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. విదేశీ పర్యాటకులు ఆకట్టుకునేలా ప్రచారం కల్పించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. పదివేల సంవత్సరాల క్రితం చిత్రావతి నది ప్రవాహం వల్ల గుహలుగా ఏర్పడ్డాయి. 3,229 మీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. -
నేడు యువజన, విద్యార్థి విభాగాల నిరసన కార్యక్రమం వాయిదా
కర్నూలు(టౌన్): అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ఈనెల 13న శుక్రవారం వైఎస్సార్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా విమాన ప్రమాద ఘటన బాధాకరమైందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటనలో వైద్య విద్యార్థులు చనిపోవడం మరింత కలచి వేసిందన్నారు. ఇలాంటి విషాద ఘటన సమయంలో నిరసనలు, ర్యాలీలు చేయడం మంచిది కాదని భావించి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు గమనించాలని ఆయన పేర్కొన్నారు.మైనారిటీ విద్యార్థులకు హాస్టళ్లలో ప్రవేశాలుకర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని దూర ప్రాంతాలకు చెందిన మైనారిటీ విద్యార్థులు(బాలురు, బాలికలు) నగరంలోని హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్.సబీహా పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఉన్నాయని, నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోస్టుమెట్రిక్ వసతి గృహం ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు 94408 22219ను సంప్రదించాలన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువు తున్న బాలికల ప్రీమెట్రిక్ వసతి గృహంలో అర్హులైన వారు 90302 62833జీ సంప్రదించాలన్నారు.కుక్కల దాడిలో జింక మృతి...కోడుమూరు రూరల్: కోడుమూరు – కర్నూలు రహదారి పక్కన పొలాల్లో గురువారం ఉదయం సంచరిస్తున్న జింకపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. మృతిచెందిన జింకను చూసిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. బీట్ ఆఫీసర్ రేణుక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పశువైద్యాధికారి చేత జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం దహనం చేశారు.విద్యార్థి అదృశ్యంఆలూరు రూరల్: పెద్దహోతూరు గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి రెండు రోజులుగా కనిపించడం లేదు. ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహానంది, లీలావతి దంపతుల కుమారుడు సుభాష్ చంద్రబోస్ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు క్రికెట్ ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వారి బంధువుల ఇళ్లలో విచారించారు. చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకి లభ్యం కాలేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9121101158కు సమాచారం ఇవ్వాలన్నారు.నీటి కోసం వెళ్తుండగా..పాణ్యం: నీటి కోసం వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సుగాలిమెట్టలో విద్యుత్ అంతరాయంతో నీటి సమస్య ఏర్పడుతోంది. బాలునాయక్ అనే వ్యక్తి నీటి కోసం బైక్పై పాణ్యం వస్తుండగా ఎస్సార్బీసీ కాల్వపై వద్ద వెనుక వస్తున్న ఓ కారు ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. హైవే పోలీసులు క్షతగాత్రుడిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. -
కుక్కల దాడిలో 26 గొర్రె పిల్లలు మృతి
పెద్దకడబూరు: చిన్నకడబూరులో గురువారం సాయంత్రం కుక్కల దాడిలో 26 గొర్రె పిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగయ్యగారి ఈరన్న, దొడ్డి తిమ్మారెడ్డి, పశువుల తిక్కయ్య జీవాల పెంపకం చేపట్టారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి దొడ్డిలో నిలుపుకున్న వారు గురువారం ఉదయం పిల్లలను దొడ్డిలో ఉంచి మందను మేతకు తీసుకెళ్లారు. కాపలా ఉన్న ఇద్దరు కంచెను అడ్డువేసి ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం 3గంటల సమయంలో అటుగా వచ్చిన నాలుగు కుక్కలు దొడ్డిలోకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డాయి. దాదాపు 55 పిల్లలకు పైగా ఉన్న గొర్రె పిల్లల మందపై దాడి చేయగా వాటిలో నాగయ్యగారి ఈరన్నకు చెందిన 14, దొడ్డి తిమ్మారెడ్డికి చెందిన 6, పశువుల తిక్కయ్యకు చెందిన 6 గొర్రెపిల్లలు మొత్తం 26 అక్కడికక్కడే మృతి చెందాయి. సాయంత్రం దొడ్డి దగ్గరకి వెళ్లిన బాధితులు మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి నిర్ఘాంతపోయారు. స్థానికుల సహాయంతో దాడి చేసిన రెండు కుక్కలను చంపేశారు. కుక్కల దాడిలో తమకు రూ. 1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ముందస్తు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి
మద్దికెర: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ముందస్తు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఆయన సందర్శించి అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. జీవన వ్యవహార శైలిలో వచ్చిన మార్పులతో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. రక్తపోటు, షుగర్, క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. వ్యాయామం లేకుండా ఒకే చోట ఉంచి పనులు చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలన్నారు. పచ్చళ్లు, నిల్వ వుంచిన పదార్థాలను పూర్తిగా తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి రాగిణి, సీహెచ్ఓ నిరంజన్ బాబు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్బాషా, ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ పాల్గొన్నారు. -
వైద్యసేవ అమలులో జీజీహెచ్కు మొదటి స్థానం
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మే నెలలో 3,353 మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించిన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో వివిధ విభాగాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద సేవలు అందించినందుకు అన్ని విభాగాధిపతులకు అభినందనలు తెలిపారు. ఈ–హాస్పిటల్ అమలు చేయడానికి పూర్తిస్తాయిలో సమీక్షించారు. రెగ్యులర్గా ప్రతి విభాగ ఓపీ, ఐపీ, డిశ్చార్జ్ వివరాలను ఈ–హాస్పిటల్లో అప్లోడ్ చేయడానికి హౌస్సర్జన్లు, పీజీలు, నర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకునేలా చూసుకోవాలన్నారు. ప్రతిరోజూ ఈ–హాస్పిటల్ అమలు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలని, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్లోని ఆరు అంశాలపై కాల్స్, వాట్సాప్, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని, ఇందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని హెచ్వోడీలకు సూచించారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. ఓపీ విభాగాల్లో సమయపాలన పాటించాలని, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యులకు హెచ్చరించారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హెచ్వోడీలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ విజయానందబాబు, డాక్టర్ రాధారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ మాధవి శ్యామల, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
పిల్లలతో పని చేయిస్తే జైలుశిక్ష
కర్నూలు(అర్బన్): పిల్లలతో పని చేయిస్తే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం స్థానిక న్యాయ సేవా సదన్లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను పనిలోకి అనమతించడం, పని చేయించుకోవడం పూర్తిగా నిషేధమని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ బాల బాలికలతో షాపులు, ఫ్యాక్టరీలు, ఇతరత్రా వాణిజ్య కేంద్రాల్లో పని చేయించుకోవడం నేరమన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 లేదా లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్లను అవిష్కరించి, న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్చౌదరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, డీసీపీఓ శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదాబేగం తదితరులు పాల్గొన్నారు. -
వీరజవాన్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
ఆదోని టౌన్: సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీరజవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మురళీనాయక్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర జవాన్ మురళీనాయక్ జీవితం స్ఫూర్తి దాయకమన్నారు. దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎర్రిస్వామి తదితరులు ఉన్నారు. కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ● కేంద్రం వద్దే ఉపాధ్యాయుల బస కర్నూలు (సిటీ): ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా కొనసాగుతోంది. గురువారం సీనియారిటీ జాబితాలోని సీరియల్ నెంబర్ 1101 నుంచి 2000 వరకు కౌన్సిలింగ్కు పిలిచారు. బదిలీల ప్రక్రియ మొదలైన సమయంలో జారీ చేసిన జీవోలో ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్జీటీ టీచర్లు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సెకండ్ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రతిరోజూ సీనియారిటీ జాబితా వచ్చిన తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రారంభిస్తున్నారు. దీనివలన ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలో తమ నంబర్ వచ్చేంత వరకు రాత్రుల్లో సిల్వర్జూబ్లీ కాలేజీ ఆవరణలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రం దగ్గర బెడ్షీట్లు తెచ్చుకుని నిద్రపోతున్నారు. వెబ్సైట్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, ఒక్కో టీచర్కి కనీసం 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుండటంతో కౌన్సెలింగ్ మరింత ఆలస్యమవుతోంది. -
నిర్లక్ష్యం గడ్డ కట్టి.. సమస్య వెక్కిరించి!
జూపాడుబంగ్లా: గత వైఎస్సార్సీపీ పాలనలో విద్యావ్యవస్థకు పెద్ద పీటవేసి నాడు–నేడు పథకం కింద గ్రామాల్లోని పాఠశాలలను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాడు–నేడు రెండో విడత కింద చేపట్టిన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగడంచ ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు నాడు–నేడు రెండోవిడత కింద రూ.12 లక్షలతో టాయ్లెట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వం రూ.3 లక్షల నిధులతో పాటు తలుపులు, విద్యుత్ సామగ్రి, లెట్రిన్బేషిన్లు, సిమెంట్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా నిధుల మంజూరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పనుల కోసం తెచ్చిఉంచిన 40 సంచుల సిమెంటు బస్తాలు గడ్డకట్టిపోయాయి. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం జాకీర్ను వివరణ కోరగా రూ.12 లక్షలతో పాఠశాలకు టాయ్లెట్లు మంజూరయ్యాయి. రూ.3లక్షల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించాం. ప్రభుత్వం మారిన తర్వాత నిధులు మంజూరు కాకపోవటంతో పనులు నిలిచిపోయాయి. నిధులు మంజూరైతే మళ్లీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. -
థ్యాంక్యూ పోలీస్!
కర్నూలు: ప్రయాణాలు, జనరద్దీలో పొరపాటున జారిపోవడం, దొంగలు అపహరించడం వంటి సంఘటనల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ అప్లికేషన్ ద్వారా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్ ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. గత నాలుగేళ్లలో రూ.20 కోట్ల విలువ చేసే లక్షకు పైగా సెల్ఫోన్లు రికవరీ చేయగా విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో విడత రూ.1.30 కోట్ల విలువ చేసే 604 సెల్ఫోన్లు రికవరీ చేశారు. గురువారం బాధితులను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా చేతుల మీదుగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వారిలో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఇతర వర్గాల వారు ఉన్నారు. తక్కువ వ్యవధిలో మూడు, నాలుగేళ్ల క్రితం పోగొట్టుకుని ఆశ వదులుకున్న వారి చేతికి మొబైల్ రికవరీ మేళాలో ఫోన్ అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీతో పాటు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే 54 సెల్ఫోన్లను రికవరీ చేసిన కర్నూలు సబ్ డివిజన్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబును అడిషనల్ ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసాచారి, సీఐలు నాగరాజ రావు, రామయ్య నాయుడు, సైబర్ ల్యాబ్ సీఐ వేణుగోపాల్, టెక్నికల్ టీమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే కర్నూలు పోలీస్ వెబ్సైట్కు http:// kurnoolpolice.in/mobiletheft ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఐఎంఈ వివరాలతో పాటు ప్రస్తుతం వాడుతున్న సెల్ఫోన్ నెంబర్, వివరాలు పొందుపరచాలి. పోలీసు సేవలకు ఎలాంటి రుసుం ఉండదని అడిషనల్ ఎస్పీ తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేత రూ.1.30 కోట్ల్ల విలువైన 604 సెల్ఫోన్లు రికవరీ ఆనందం వ్యక్తం చేసిన బాధితులు -
వ్యవసాయ అధికారుల బదిలీల్లో భారీగా మార్పులు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయాధికారుల బదిలీల్లో పైరవీలు, కూటమి పార్టీల నేతల సిపారసులు, ముడుపుల వ్యవహారం కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ అధికారుల బదిలీల్లో ముడుపులకు తెరలేపడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయమే వ్యవసాయ అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. పనిచేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ అయి కొత్త పోస్టుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు కొత్త స్థానాల్లో చేరిపోయారు. అయితే పలువురు పెద్ద ఎత్తున పైరవీలు చేసి ముడుపులు ముట్టచెప్పడంతో కొద్దిగంటల్లోనే బదిలీల్లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. పరిపాలనా సౌలభ్యం కింద ఒకరిద్దరి స్థానాల్లో మార్పులు జరుగడం సహజం. అలాంటిది 11 మంది వ్యవసాయాధికారుల బదిలీల్లో మార్పులు జరగడం చర్చనీయాంశమవుతోంది. కొత్త పోస్టులో చేరిన కొద్ది గంటల్లోనే మరో పోస్టులో చేరాల్సి రావడం పట్ల వ్యవసాయ అధికారులు భగ్గుమంటున్నారు. కొత్త పోస్టులో చేరిన కొద్దిగంటల్లోనే మరోచోటుకు బదిలీ -
‘అన్నదాత సుఖీభవ’లో అడ్డగోలు కోతలు
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం రైతులకు భారీగా కోతపెడుతోంది. గత వైఎస్ఆర్సీపీ పాలనలో అర్హత కలిగిన ప్రతి రైతుకు వైఎసార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది 2019–20 నుంచే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వడం విశేషం. 2019–20 నుంచి 2023–24 వరకు ప్రతి ఏటా లబ్ధిపొందే రైతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కూటమి ప్రభుత్వం మాత్రం అన్నదాత సుఖీభవ కింద లబ్ధిపొందే రైతుల సంఖ్యను భారీగా కోతవేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్–6లో భాగంగా రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ఊరూవాడ ప్రకటించారు. చంద్రబాబు మాటలను నమ్మిన రైతులు కూటమి పార్టీలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని విస్మరించారు. 2024–25లో రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయానికి మంగళం పలికారు. 2025–26 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే రైతుల సంఖ్యను భారీగా తగ్గించడం గమనార్హం. 38,755 మంది రైతులకు మొండిచేయి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద జిల్లాల వారీగా అర్హత కలిగిన రైతుల జాబితాలను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతులు 2,55,843 మాత్రమే ఉన్నారు. 2023–24 సంవత్సరంలో పెట్టుబడిసాయం పొందిన రైతుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 38,755 మంది రైతులకు మొండిచేయి చూపుతుండటం గమనార్హం. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేల పెట్టుబడిసాయం రైతులకు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. కటుంబంలో ఎంతమందికి భూములు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఇప్పుడు కుటుంబం యూనిట్గానే అమలుకు సిద్ధమయ్యారు. ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకోవాల్సిందే... అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందే రైతుల సంఖ్యను మరింత తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పెట్టుబడి సాయం పొందాలంటే ప్రతి రైతు ఆర్బీకేల్లో బయో మెట్రిక్ ద్వారా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ–కేవైసీ చేయించుకుంటేనే రైతులకు పెట్టుబడి సాయం అందనుంది.జిల్లాలో 38,755 మంది రైతులకు మొండిచేయి 2023–24లో వైఎస్సార్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు లబ్ధి నేడు 2,55,843 మంది రైతులతో అర్హుల జాబితా విడుదల 2024–25 సంవత్సరంలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న(నేడు) ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తమకు కేటాయించిన సమాయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు గతనెల 19 నుంచి 28 తేది వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. మూల్యాంకనం గత 31 నుంచి ఈ నెల 2వ తేది వరకు చేపట్టారు. ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణతతో జిల్లా చివరి స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది. ఇదిలాఉంటే రెగ్యులర్ పరీక్షల్లో ఏడాది పాటు తరగతులు నిర్వహించినా 66.1 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఆశించిన స్థాయిలో తరగతులు నిర్వహించకపోయినా 72 శాతం ఉత్తీర్ణత రావడం గమనార్హం. 2023 సప్లిమెంటరీ పరీక్షల్లో 45 శాతం, 2024లో కేవలం 30.60 శాతం మాత్రమే ఉత్తర్ణత వచ్చింది. అలాంటిది ప్రస్తుతం భారీగా ఉత్తీర్ణత శాతం నమోదు కావడం చర్చనీయశంగా మారింది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఉద్యోగాల కల్పనలో విఫలం కర్నూలు(సెంట్రల్): ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.సంతోష్కుమార్ విమర్శించారు. కర్నూలులోని సీఆర్భవన్లో గురువారం ఏఐవైఎఫ్ ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు పాల్గొన్నారు. 17న పారిశుద్ధ్య కార్మికులతో యోగా కర్నూలు(సెంట్రల్): ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 17న 5వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా యోగాంధ్ర నిర్వహణపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల స్పెషల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 21న జిల్లాలో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో 10.65లక్షల మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూన్ 14న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో రిహార్సల్ నిర్వహించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. నలుగురు సర్వేయర్ల బదిలీ కర్నూలు(సెంట్రల్): సర్వే శాఖలో పనిచేస్తున్న నలుగురు మండల సర్వేయర్లను పరిపాలన సౌలభ్యం కింద బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిప్పగిరి మండల సర్వేయర్గా ఉన్న జి.చిన్ననారాయణను ఎమ్మిగనూరుకు, నందవరం సర్వేయర్ పి.అక్బర్బాషాను ఆలూరుకు, వెల్దుర్తి సర్వేయర్గా ఎస్.హేమంత్ను కర్నూలు రూరల్కు, కోడుమూరు డిప్యూటీ సర్వేయర్ సునీల్కుమార్ను వెల్దుర్తికి బదిలీ చేశారు. ముగిసిన ఏపీ పీజీసెట్ కర్నూలు కల్చరల్: ఏపీ పీజీసెట్–2025 గురువారంతో ముగిసింది. చివరి రోజు పరీక్షలకు 80 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, దూపాడు సమీపంలోని ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. సెషన్–1లో సైకాలజీ, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రామలింగారెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. -
సన్న బియ్యం నాణ్యతపై అనుమానాలు
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 1,430 స్కూళ్లలో 2,55,718 మందికి ఈ ఏడాది నుంచి సన్న బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్లకు చేరలేదని తెలుస్తోంది. అదేవిధంగా వంట ఏజెన్సీల నిర్వాహకులే ఈ బియ్యం నాణ్యత సక్రమంగా లేవని, రేషన్ బియ్యమే పాలిష్ చేసినట్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చాలా చోట్ల కోడి గుడ్లు, చీక్కీలు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో పాటు రాగా జావ ఎక్కడ కూడా పిల్లలకు అందించకపోవడం గమనార్హం. -
విరుచుకుపడిన వరుణుడు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాపై వరుణుడు విరుచుకుపడ్డాడు. ఏకంగా ఒకేరోజు జిల్లా మొత్తంగా సగటున 31.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడుమూరులో 79.4, అత్యల్పంగా వెల్దుర్తిలో 12.8 మి.మీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. కోడుమూరు. దేవనకొండ, మంత్రాలయం, హలహర్వి తదితర మండలాల్లో భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హంద్రీనదికి కూడా వరద నీరు వచ్చింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 59.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ విత్తనాల పంపిణీ ఊపందుకోని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులు బదిలీల్లో నిమగ్నం కావడంతో విత్తన పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇప్పటి వరకు కేవలం 7400 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. మండలం వర్షపాతం(మి.మీ) కోడుమూరు 79.4 దేవనకొండ 69.4 మంత్రాలయం 60.6 హాలహర్వి 59.6 సి.బెళగల్ 56.4 ఆదోని 48.2 హొళగుంద 48.2 క్రిష్ణగిరి 46.2 పెద్దకడుబూరు 45.6 గూడూరు 45.0 పత్తికొండ 39.6 గరిష్టంగా 79.4, కనిష్టంగా 12.8 మి.మీ వర్షం ఒకే రోజు సగటు వర్షపాతం 31.1 మి.మీ -
రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం
ఓర్వకల్లు: రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు. మీదివేముల గ్రామానికి కాటసానితోపాటు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్గౌడు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జీకే వెంగన్న, వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం వెళ్లారు. రమేష్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీ నుంచి వచ్చిన రూ.2 లక్షల చెక్కును, కాటసాని స్వతహాగా మరో రూ.50 వేలను అందజేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి విలేకరుతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు నేరపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘రెడ్బుక్’ పేరిట నేరం! రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నేర రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని కాటసాని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కాలమైనా హామీల అమలులో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పక్కదోవ పట్టించేందుకు నేరపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా రమేష్ నాయుడు పనిచేసేవాడని, అతను లేకపోవడం పార్టీకి తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే.. తాను ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చానని, దాని వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకొని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని కాటసాని గుర్తుచేశారు. రమేష్ నాయుడి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకనే టీడీపీ వారు ఈ నెల 5న హత్య చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. హంతకులు ఎవరనేది ఇప్పటికే తేలిపోయిందని, హత్య వెనుక ఎవరి పాత్ర ఉందో తనకు తెలుసని, పోలీసులపై ఉన్న నమ్మకంతో చట్టానికే వదిలేస్తున్నామన్నారు. ఈ కేసులో నిజమైన హంతకులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన ఓర్వకల్లు మండలంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఉపేక్షించబోమని హె చ్చరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు చెన్నా రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ప్రవీణ్కుమార్రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నాగతిరుపాలు, హరినాథ్రెడ్డి, మహేశ్వరరెడ్డి, సోమ శేఖర నాయుడు, బీరం పుల్లారెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. పార్టీ నుంచి రూ.2 లక్షల నగదు అందజేత సొంతంగా మరో రూ. 50 వేలు ఇచ్చిన కాటసాని -
పింఛన్ తీసుకొస్తూ వృద్ధుడి మృతి
కోసిగి: పింఛన్ తీసుకుని వస్తూ నిద్రమత్తులో కల్వర్టు నుంచి కిందకు పడిపోయి వృద్ధుడు మృతి చెందాడు. మండల పరిధిలోని ఐరన్గల్– పెద్దభుంపల్లి గ్రామాల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు బుధవారపేటకు చెందిన జగ్గుల మద్దిలేటి(64) గతంలో కడపలో బీడీ కార్మికుడిగా పని చేసేవాడు. ప్రతి నెలా కడపకు వెళ్లి పింఛన్ కోసం తెచ్చుకునేవాడు. ఈ నెల 8న కడపకు వెళ్లి 9వ తేదీన రైలులో మంత్రాలయం రైల్వే స్టేషన్ వచ్చాడు. అక్కడ నుంచి ఎటు వెళ్లాలో తెలియక పట్టాల వెంబడి నడుచుకుంటూ మంగళవారం సాయంత్రం ఐరన్గల్ గ్రామ సమీపానికి వచ్చాడు. పొలాల్లోని కల్వర్టుపైన నిద్రించాడు. కల్వర్టు నుంచి కిందకు పడిపోయి మృతి చెందగా బుధవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గుర్తించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చెరుకుని మృతిదేహాన్ని కర్నూలుకు తీసుకెళ్లారు. -
పనిచేస్తూనే పరలోకాలకు!
సి.బెళగల్: జీవనోధారమైన ఇంటి నిర్మాణ పనులకు వచ్చిన ఓ వ్యక్తి పనిచేస్తూనే మృతి చెందాడు. ఈ దుర్ఘటన మండల కేంద్రం సి.బెళగల్లో బుధవారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందిన జయరాజు (35) కు భార్య సంధ్యారాణితో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ఇంటి నిర్మాణ పనులకు వెళ్లేవారు. బుధవారం స్వగ్రామస్తులతోపాటు ఏనుగబాల కూలీలతో కలసి సి.బెళగల్కు వెళ్లారు. పనుల మధ్యలోనే జయరాజు అస్వస్థకు గురయ్యాడు. విశ్రాంతి తీసుకోవాలని తోటి కూలీలు సూచించినా వినలేదు. గుండెపోటుకు గురై పని ప్రాంతంలోనే అచేతనంగా మారాడు. గమనించిన తోటి కూలీలు స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లగా.. జయరాజు అప్పటికే మృతి చెందినట్లు తెలిపాడు. దీంతో జయరాజు మృతదేహాన్ని కడిమెట్ల గ్రామానికి తీసుకెళ్లారు. కడుపు చేతపట్టుకుని పనికోసం వచ్చిన వ్యక్తి ప్రాణాలే కోల్పోవడంపై పలువురు విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో వ్యక్తి మృతి -
ఫీజులను భరించలేకున్నాం
నాకు వ్యవసాయమే జీవనాధారం. ఇద్దరు పిల్లలు సంతానం. గూళ్యంలోని ప్రయివేట్ పాఠశాలలో ఒక అబ్బాయి ఐదో తరగతికి, మరో అబ్బాయి 3వ తరగతి చదువుతున్నారు. మొదటి అబ్బాయికి అడ్మిషన్ ఫీజు రూ.25 వేలు. 3వ తరగతి చదువుతున్న అబ్బాయికి రూ.20 వేలు దాకా తీసుకుంటున్నారు. స్కూల్ యూనిఫాం, షూకు రూ.6 వేలు అదనంగా చెల్లించాలి. సంవత్సరానికి రూ.50 వేలకు పైగానే ఖర్చు అవుతోంది. అంత డబ్బు చెల్లించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. జూన్ నెల వస్తుందంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్లు ఉంటుంది. – మునిస్వామి, సిద్ధాపురం గ్రామం, హాలహర్వి మండలం -
చిన్నారిపై వీధి కుక్క దాడి
బేతంచెర్ల: పట్టణంలోని బోయపేట కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కదాడి చేసి గాయపరిచిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని బోయపేట కాలనీకి చెందిన మధు, రామాంజనేయులు కుమార్తె మమత తోటి పిల్లలతో కలిసి ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంది. ఒక్క సారిగా వీధి కుక్క మమతపై దాడి చేసి కుడి కాలు, చేతిపై కరిచి తీవ్రగాయాలు చేసింది. పక్కనున్న వారు కేకలు వేయడంతో కుక్క పారిపోయింది. చిన్నారిని వెంటనే స్థానిక వైద్య శాలకు తరలించి వైద్యం చేయించారు. మే నెల 2వ తేదీన హనుమాన్ నగర్ కాలనీల్లో 4 సంవత్సరాల చిన్నారి బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను దూరంగా తరలించి చిన్నారులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మహిళా ఉద్యోగి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదంఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా రు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్ద ముకుంద ప్రియ నివాసముంటున్నారు. ఈమె ప్రతిరోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు హాజరచయ్యేవారు. ఈ క్రమంలో గత నెల 20వ తేదీన స్కూటీపై విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొట్టారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి రుక్మాంద రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునిల్ కుమార్ చెప్పారు. నూతన వధువు ఆత్మహత్య కోడుమూరు రూరల్: చెప్పులు కొనేందుకు భర్త డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ నూతన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన రామాంజినేయులు కుమార్తె శృతి (16)ని కోడుమూరుకు చెందిన నాగరాజుకు ఇచ్చి మేనెల 9న పెద్దలు వివాహం చేశారు. అప్పగింతలనంతరం ఈనెల 7న నూతన వధువు శృతి భర్త నాగరాజుతో కలిసి పుట్టినిల్లు అయిన వర్కూరు గ్రామానికి వెళ్లింది. అక్కడ శృతి తాను కొత్త చెప్పులు కొనేందుకు డబ్బులివ్వాలని భర్తను అడ్డుగగా, భర్త తానే కోడుమూరులో కొనిస్తానని చెప్పాడు. దీంతో భర్తపై అలిగి తీవ్ర మనస్తాపానికి లోనై శృతి అదే రోజు వాస్మోల్ ఆయిల్ తాగి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!
ఉక్కపోతతో అల్లాడుతున్నాం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం 50మందితో బృందంగా వచ్చాం. ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి వెళ్లాం. కంపార్ట్మెంట్లలో ఫ్యాన్లు ఉన్నప్పటికీ అందరికీ సరిపడా గాలి రావడం లేదు. ఉక్కపోతతో అల్లాడిపోయాం. సాధారణ రోజుల్లోనే దర్శనానికి రెండు గంటలు పట్టింది. రద్దీ రోజుల్లో వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. కంపార్ట్మెంట్లలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. – బాలాజీ, గురువాయర్, కేరళ నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలి శ్రీశైలం దేవస్థానంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మా తల్లిదండ్రులతో పాటు మేము శ్రీశైలానికి ప్రతి ఏటా వస్తున్నాం. గతంతో పొలిస్తే కొన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కొన్నేళ్ళ నుంచి ఇవే కంపార్ట్మెంట్లు, ఇవి మాత్రం మెరుగుపడటం లేదు. భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. దేవదాయశాఖ ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. – కార్తికేయ, హైదరాబాద్ శ్రీశైలంటెంపుల్: మనస్సు ప్రశాంత, అధ్యాత్మిక చింతనను పెంపొందించుకునేందుకు పలువురు భక్తులు శ్రీశైల యాత్రకు తరలివస్తారు. మల్లన్న దర్శనానికి వెళ్లాలంటే గంటల తరబడి నరకయాతన పడాల్సిందే. శ్రీశైల దేవస్థానంలో రేకుల షెడ్డులో క్యూ కంపార్ట్మెంట్లు ఉండడంతో ఎండలకు, వానలకు భక్తులు అవస్థలు పడుతున్నారు. తక్కువ మంది భక్తులు పట్టే సామర్థ్యం కలిగిన కంపార్ట్మెంట్లు ఉండడం, భక్తులను దర్శనానికి గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచిఉంచడంతో ఉక్కపోతతో చంటిపిల్లలు, వృద్ధులు, మహిళల అవస్థలు ఆ పరమేశ్వరుడుకే ఎరుక అన్నట్లుగా మారింది.మంగళవారం నుంచి శుక్రవారం వరకు 10వేల నుంచి 15వేల మంది భక్తులు, శని,ఆది, సోమవారా ల్లో 15వేల నుంచి 20వేల మంది భక్తులు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది ఉత్సవాల్లో రోజుకు లక్ష మంది, కార్తీకమాసం, ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో 50వేలకు పైగా భక్తులు ఉచిత క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. రద్దీ నేపథ్యంలో తోపులాటల జరగకుండా దేవస్థానం క్యూ కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. 17 కంపార్ట్మెంట్లలో మొత్తం 10,100 మంది ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే శీఘ్ర(రూ.150), అతిశీఘ్ర(రూ.300) క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు ఎనిమిది కంపార్ట్మెంట్లలో 3, 360 మంది భక్తులు,క్యూలైన్ (స్టాండింగ్) 5,300 మంది భక్తులు,వృద్ధులు, దివ్యాంగుల కోసం 1200 వేచి ఉండే నాలుగు క్యూలైన్లు,ఆలయంలో లోపల 1700 మంది వేచిఉండేలా నాలుగు ప్రత్యేక క్యూలైన్లు మా త్ర మే ఉన్నాయి.మొత్తంగా 25 కంపార్ట్మెంట్లలో 15,500 మంది భక్తులు వేచిఉండే అవకాశం మాత్రమే ఉంది. నిలిచిన టెండర్.. శ్రీశైల దేవస్థానంలో ఉన్న రేకులషెడ్డు క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు పడుతున్న కష్టాలను చూసిన అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.75 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అటు తరువాత క్యూ కాంప్లెక్స్కు టెండర్లు సైతం పిలిచారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో టెండర్ల ప్రక్రియ అర్దాంతరంగా అగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా నూతన క్యూ కాంప్లెక్స్పై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాత రేకుల షెడ్డుల కంపార్ట్మెంట్లలో భక్తులు అవస్థలు పడుతున్నా ఇటు దేవదాయశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. భక్తుల కష్టాలు పరమేశ్వరుడికెరుక.. క్యూ కాంప్లెక్స్లలో భక్తుల కష్టాలు రేకుల కంపార్ట్మెంట్లలో ఉక్కపోత గత ప్రభుత్వంలో రూ.75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్కు శంకుస్థాపన ఏడాదైనా పట్టించుకోని కూటమి ప్రభుత్వంప్రతిపాదనలను సవరించి పంపాం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణంపై గతంలో ప్రతిపాదించిన ప్రతిపాదనలను సవరించి పంపించాం. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రూ.79 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఏ ప్రదేశంలో చేపడతామో తగు ప్రతిపాదనలను రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్, చీఫ్ ఇంజినీర్ అనుమతి కోసం పంపాం. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తాం. త్వరలోనే క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడతాం. – శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీశైల దేవస్థానంలో ఉన్న 25క్యూ కంపార్ట్మెంట్లు రేకులషెడ్డులే కావడంతో భక్తులు ఆయా కంపార్ట్మెంట్లలో ఎండపోతకు, వానలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. క్యూ కంపార్ట్మెంట్లలో ఫ్యాన్లు ఉన్నప్పటికీ వందలాది మంది భక్తులకు కంపార్ట్మెంట్లలోకి అనుమతించడంతో ఫ్యాన్ల గాలి సరిపడడం లేదు. దీంతో చంటి పిల్లలు, వృద్దులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్బాలలో భక్తులకు ఊపిరి ఆడక కంపార్ట్మెంట్ల నుంచి దర్శనానికి వెళ్లకుండా బయటికి వచ్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. గంటల తరబడి క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. -
క‘రుణ’లేక.. కష్టాలు తొలగక!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘పదవులు స్థిరమని భ్రమించే వాళ్లు.. ఓట్లు గుంజి నిను మరిచే వాళ్లు.. నీవే దిక్కని అబద్ధాలు చెప్పే వారు.. హామీలు ఇచ్చి అమలు చేయని వారు.. రోజులు మారాయ్..’’ అనే పాటను రైతులు పాడుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రైతులకు పెద్ద పండుగ. ఎద్దులకు పరుగుపందేలు నిర్వహించి గెలిచిన వృషభాలకు ఆహారంగా ధాన్యం పెట్టి.. అవి తినగా మిగిలిన వాటిని రైతులు తీసుకెళ్లి విత్తనాల్లో కలుపుకుంటారు. ఇలా చేస్తే పంట బాగా వస్తుందనే నమ్మకం రైతుల్లో ఉంది. రైతులను మరచిపోయిన రాష్ట్ర ప్రభుత్వం స్వేదాన్ని చిందిస్తూ సేద్యానికి ఊపిరి పోసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయింది. పుడమితల్లికి సౌభాగ్యాన్ని అందించే అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ ఏరువాక ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. పంటల సాగుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం దక్కలేదు. పెట్టుబడులకు కనీసం బ్యాంకులు రుణాలు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో రైతుల్లో అసంతృప్తి, నిరుత్సాహం, నిరాశ అలుముకున్నాయి. వ్యవసాయంపై ఉత్సాహం కొరవడింది. విత్తు..విపత్తు ఖరీఫ్లో ప్రధానంగా పత్తి 2.34 లక్షల హెక్టార్లలో సాగు కానుంది. అయితే పత్తి విత్తనాల్లో నకిలీలు వెల్లువెత్తుతున్నాయి. లూజు పత్తి విత్తనాలు జోరుగా విక్రయిస్తున్నారు. వేరుశనగ విత్తన కాయల పంపిణీ మొదలైనప్పటికీ రైతులకు అరకొర ఇస్తున్నారు. వేరుశనగ విత్తన కాయల్లో మట్టి, రాళ్లు ఎక్కువగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. రైతులకు పచ్చి రొట్ట ఎరువుల ఇవ్వడం మరచిపోయారు. అన్నదాత సుఖీభవ ఏదీ... 2024 ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్–6లో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2024–25 సంవత్సరం ముగిసిపోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల జాడ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అన్నదాతలకు అన్ని విధాలుగా సాయం అందించింది. ప్రతి ఏటా మే నెల 15 నుంచే విత్తనాల పంపిణీ జరిగేది. ఖరీప్ సీజన్ మొదలవుతుందంటే వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందేది. అలాగే ఉచిత పంటల బీమా కింద పరిహారం పంపిణీ చేసేవారు. ప్రతి ఏటా మృగశిర కార్తె వచ్చే పౌర్ణమి రోజున ‘ఏరువాక’ వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఏరువాక పండుగ రోజూ రైతులకు అవే అవస్థలు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం -
బడికి చేరని కిట్లు
● సి.బెళగల్ మండలం యనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.38 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టారు. పునాదులు వేసి బేస్మెంట్ లెవెల్ వరకు పనులు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పట్టించుకోకపోవడంతో నిలిచిపోయాయి. దీంతో స్కూల్లో చాలీచాలని గదుల్లో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. కర్నూలు బీ క్యాంపులోని బాలికల స్కూల్లో టాయ్లెట్ల దుస్థితి● కర్నూలు నగరంలో బిక్యాంపు బాలురు ఉన్నత పాఠశాలలో సుమారు రూ.5లక్షలకుపైగా ఖర్చూ పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ స్కూల్లో ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఏడాదికిపైగా మూలకు చేరింది. దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందిపడక తప్పని పరిస్థితి. ● జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2.69 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ● ఇందులో నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్, టెక్ట్స్ బుక్స్ ఇవ్వనున్నారు. ● అయితే నోట్ బుక్స్ 15,35,732, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 28,408, బెల్టులు 1 నుంచి 10 వరకు బాలురు, 1 నుంచి 5 వరకు బాలికలకు 1,90,782 వచ్చాయి. ● 6 నుంచి 10 తరగతుల వరకు చదివే బాలికలకు బెల్టులు రావాల్సి ఉంది. ● వర్క్ బుక్లు 2,37,035కు గాను 2,30,783.. టెక్ట్స్ బుక్లు 9,82,400కు గాను 9,54,382 మాత్రమే వచ్చాయి. ● బూట్లు 2,71,006, పిక్టోరియల్ డిక్షనరీలు (ఫస్ట్ క్లాస్) 20,952, యూనిఫాం 2,69,321 మందికి ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉంది. ● పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు మాత్రమే పునఃప్రారంభం రోజున ఇవ్వనున్నారు. ● మిగిలినవి ఈనెల 16వ తేదీ తర్వాత ఇవ్వనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● అసంపూర్తిగానే అదనపు తరగతి గదుల నిర్మాణం ● అస్తవ్యస్తంగా మారిన టాయ్లెట్ల నిర్వహణ ● పాఠశాలలకు అరకొరగానే కిట్లు ● ఇప్పటికీ జిల్లాకు చేరని బూట్లు, యూనిఫాం, బ్యాగ్లు ● చాలా చోట్ల పనిచేయని ఆర్వో ప్లాంట్లు -
విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయ’ం
● 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● వచ్చే నెల 29వ తేదీ వరకు గడువు ● కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యార్థులకు అవకాశందరఖాస్తు ప్రారంభ తేదీ 02-06-2025 దరఖాస్తులకు ఆఖరు తేదీ 29-07-2025 పరీక్ష తేదీ 13-12-2025 సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 08512-246544 ఎమ్మిగనూరురూరల్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. ఉత్తమ విద్యా బోధన అందిస్తూ ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం పేరుగాంచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. ఈ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ప్రకటన విడుదలైంది. జూలై 29వ తేదీ వరకు అన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. బనవాసి జవహార్ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు అందుబాటులో ఉండగా బాలికలకు 30 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. ప్రత్యేకతలు ఇవే.. ● సీబీఎస్ఈతో కూడిన అత్యుత్తమ విద్యా బోధన ● అధునాత కంప్యూటర్ ల్యాబ్ ● పోషక విలువలతో కూడిన ఆహారం ● మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్సీసీ తదితర అంశాలు ● విశాలమైన గ్రంథాలయం. అత్యుత్తమ విద్యాప్రమాణాలు విద్యాలయంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్నాం. విద్యార్థుల సర్వోతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మానసిక నిపుణలతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. కేరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. న్యూట్రీషియన్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో చాలమంది ఉన్నారు. – ఇ.పద్మావతి, ప్రిన్సిపాల్, బనవాసి నవోదయ -
టీడీపీ దాడులకు ఉసిగొల్పుతోంది
కర్నూలు(సెంట్రల్): ఉద్దేశ పూర్వకంగా సాక్షి మీడియా గ్రూపు కార్యాలయాలపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాస ఆచారికి సాక్షి సిబ్బంది వినతిపత్రం సమర్పించారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డీఎస్పీని ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్చార్జ్లు రవికుమార్, లోకేష్ మాట్లాడుతూ రాజధాని అమరావతి అంశంపై ఇటీవల సాక్షి చానెల్లో ఓ పాత్రికేయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సాక్షి సమర్థించడంలేదని, ఆయన అభిప్రాయంతో తమ సంస్థ ఏకీభవించడం లేదన్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుతోపాటు అభిప్రాయం వ్యక్తం చేసిన పాత్రికేయుడు సైతం ఈ అంశంపై విచారం వ్యక్తం చేశారన్నారు. ఈ వ్యవహారంతో సాక్షి గ్రూపునకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కుట్రపూరితంగా తన శ్రేణులను రెచ్చగొట్టి సాక్షి కార్యాలయాలపై దాడులకు ఊసిగొల్పుతోందన్నారు. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం కిందకు వస్తున్న నేపథ్యంలో తమ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని వారు డీఎస్పీని కోరారు.కొవ్వొత్తుల ప్రదర్శనసాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ లక్ష్మీపురంలో ఉన్న సాక్షి యూనిట్ కార్యాలయ సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలియజేశారు. -
‘రైతు సేవలకు’ మంగళం
● ఉమ్మడి జిల్లాలో మూతపడిన 162 ఆర్బీకేలుకర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఇప్పటి వరకు రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయితే రైతుల దేవాలయాలుగా భావిస్తున్న ఆర్బీకేలను కూడా మూసి వేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఒకటి కాదు, రెండు కాదు.. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 162 ఆర్బీకేలను మూసి వేస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్–6 పేరుతో ఆరు హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది ఆ ఊసే కరువైంది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి రైతులు నెత్తిన భారం మోపారు. 2023 ఖరీఫ్, 2023–24 రబీ సీజన్, 2024 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఉచిత పంటల బీమా పరిహారం ఎగవేశారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీకేలను నామరూపాల్లేకుండా చేస్తుండటం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసింది. రేషనలైజేషన్ అంటే భూమి తక్కువగా ఉండి.. ఆర్బీకేలు ఎక్కువగా ఉంటే తగ్గిస్తారు. తగ్గించిన వాటిని భూమి ఎక్కువగా ఉండి ఆర్బీకేలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మార్పు చేస్తారు. అయితే ఈ విధంగా చేయకుండా మూసి వేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849 ఆర్బీకేలు ఉండగా... 28 ఆర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. నేడు రూరల్, అర్బన్ ఆర్బీకేలు 715 మాత్రమే మిగిలాయి. అంటే 162 ఆర్బీకేలు ఇక కనిపించవు.కర్నూలు జిల్లాలో 466 ఆర్బీకేలు ఉండగా.. రేషనలైజేషన్ పేరిట రూరల్, అర్బన్ ఆర్బీకేలను 407కు కుదించారు. నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు ఉండగా.. నేడు 308కు తగ్గిపోవడం గమనార్హం. -
శ్మశానవాటిక కోసం ఉద్యమబాట
మంత్రాలయం: శ్మశాన వాటిక కోసం మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామస్తులు ఉద్యమబాట పట్టారు. గ్రామంలోని రెండువేల మంది సోమవారం ఊరి పొలిమేరలోని అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి 167 జాతీయ రహదారిపై 3 కి.మీ. మీర భారీ ర్యాలీ చేశారు. నినాదాలు చేస్తు పాదయాత్రగా మంత్రాలయం చేరుకున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్, శ్రీమఠం ప్రధాన ముఖద్వారం మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్ వెంటనే బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు గంగుల మల్లికార్జున, అనుమేష్, తిక్కస్వామి డిమాండ్లతో కూడిన వినతిని తహసీల్దార్ రవికి అందజేశారు. భారీ ర్యాలీ కారణంగా మంత్రాలయంలో మూడు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోగా రాకపోకలు స్తంభించిపోయాయి. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి వీహెచ్పీ ఆదోని డివిజన్ కార్యదర్శి హనుమంతరెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్ ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ.. 400 ఏళ్లుగా ఉన్న శ్మశానంలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుపడటం సరికాదన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి శ్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళనలో వీహెచ్పీ కార్యదర్శులు, ప్రముఖ్లు శ్రీరంగ, రవికుమార్, జగదీష్, గోవర్ధన్ నాయుడు, రాజశేఖర్స్వామి, గువ్వల నారాయణ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. రెండువేల మందితో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి -
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినుతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాగిన్లో వచ్చిన అర్జీలను కొన్ని శాఖల అధికారులు వారం రోజులైనా చూడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే కలెక్టర్ జిల్లా కేంద్రంలో లేకపోవడంతో కార్యక్రమం పూర్తి మొక్కుబడిగా సాగింది. డీఆర్వో సెలవులో ఉండటం.. జాయింట్ కలెక్టర్ బి.నవ్య మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్లో పాల్గొనడంతో పీజీఆర్ఎస్కు ‘స్పందన’ కరువైంది. ఎంతో కష్టపడి వ్యయప్రాయాసాలకోర్చి వచ్చిన అర్జీదారులు ఉన్నతాధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
ఆటోల్లో కూర్చొని ఇళ్లముందు మద్యం సేవిస్తున్నారు
కర్నూలు: కర్నూలు బుధవారపేటలో ఇళ్లముందు ఆటోలో కూర్చొని కొంతమంది మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అదే కాలనీకి చెందిన చాముండేశ్వరి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 95 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
పెద్దమ్మ దేవరలో విషాదం
● విద్యుదాఘాతంతో మహిళ మృతి దొర్నిపాడు: డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ దేవరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు...దొర్నిపాడుకు చెందిన బోయ బాల ఉసేని భార్య ఉష మూల పెద్దమ్మ దర్శనం కోసం డబ్ల్యూ గోవిందిన్నెకు సోమవారం తెల్లవారుజామున చేరుకుంది. దర్శనం కోసం వెళ్తుండగా క్యూలైన్ల వద్ద స్తంభాన్ని తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆమె పక్కన మరో ముగ్గురు మహిళలు కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోవెలకుంట్ల వైద్యశాలకు తరలించగా అప్పటికే ఉష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ బొమ్మలసత్రం: పాణ్యం పోలీస్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సోమవారం స్థానిక సీసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు చెందిన కట్టా శివశంకర్, రాజమహేంద్రవరం జిల్లాకు చెందిన వెంకటేశ్వరావును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో 40కి పైగా చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. వారి నుంచి పావు కేజీ బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. దొంగల అరెస్ట్లో ప్రతిభ చూపిన సీఐలు సురేష్కుమార్, కిరణ్కుమార్రెడ్డి సిబ్బందిని అభినందించారు. -
విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు
కర్నూలు సిటీ: నగర శివారులోని ఓ ఫంక్షన్ హాలులో పది, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుకు షైనింగ్ స్టార్స్ పేరుతో సోమవారం ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే వారు కావాలన్నారు. ఆ తరువాత పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బి.దస్తగిరి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి. నవ్య, డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం ● కార్యక్రమంలో కుర్చీలు వేసేందుకు సిబ్బంది లేరు. దీంతో కొంత మంది తల్లిదండ్రులు, విద్యార్థులే కుర్చీలు వేసుకోవాల్సి వచ్చింది. ● ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనాలకు కొంత మంది విద్యార్థులకే టోకన్లు ఇచ్చారు. టోకన్లు అందకపోవడంతో కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. ● ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించినా షైనింగ్ స్టార్స్ ఇవ్వలేకపోయారు. కొన్ని చోట్ల ఎంపికలో కచ్చితమైన నిబంధనలను పాటించకపోవడంతో పేదింటి బిడ్డలు షైనింగ్ స్టార్స్ కాలేకపోయారు. -
ఉపాధ్యాయుల వినూత్న నిరసన
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని డీఈఓ కార్యాలయం ఎదుట వినూత్ననంగా మోకాళ్లపై కూర్కొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారని, మాన్యువల్గా నిర్వహిస్తామని గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ హామీ ఇచ్చారన్నారు. హామీని అమలు చేయాలని కోరితే జీఓలో వెబ్కౌన్సిలింగ్ అని ఇచ్చాం కదా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం మంచిది కాదన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్కు వాట్సప్లో ఉపాధ్యాయులు సందేశాన్ని పంపించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వి.కరుణానిధిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్కుమార్, అప్టా సేవలాల్ నాయక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలి
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నగర కమిటీ అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర రద్దుచేసిన 44 కార్మిక చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే పునురుద్ధరించాలని కోరారు. నిత్యం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు అరికట్టాలని, ఇందుకు రక్షణ చట్టం తేవాలన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హుస్సేన్, వీడియో జర్నలిస్టు రాష్ట్ర నాయకులు హుస్సేన్, జిల్లా నాయకులు సునీల్కుమార్, నగర కార్యదర్శి ఎర్రమల పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన -
పాలన చేతకాక అక్రమ అరెస్టులు
కర్నూలు (టౌన్): సుపరిపాలన చేతకాక కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యాలపై ప్రశ్నించిన వారందరినీ అక్రమ అరెస్టు చేస్తూ ఇంకెన్ని రోజులు భయపెడతారని ఆయన ప్రశ్నించారు. ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడం, జైళ్లకు పంపడం, భయాందోళనలకు గురి చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. విద్యశాఖను సక్రమంగా నిర్వహించడం చేతకాని మంత్రి లోకేష్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
మేమింతే!
మహానంది: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి పనులను అప్పటి ప్రజా ప్రతినిధులు భూమి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పనులు చేసి ప్రారంభించాలి. ఇక్కడ కూటమి నేతలు అదే పనులకు మళ్లీ భూమి చేయడం పరిపాటిగా మారింది. ఇందుకు మహానంది క్షేత్రంలో జరిగిన కార్యక్రమమే నిదర్శనం. మహానంది దేవస్థానంలో రూ. 10.50 కోట్లతో 55 వసతి గృహాల నిర్మాణానికి 2024 ఫిబ్రవరి 14న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. టెండర్లు సైతం పిలవడం, దేవదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు వసతిగృహాల నిర్మాణానికి ప్లాన్లు సైతం పూర్తిచేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మరోసారి సోమవారం అదే పనికి శంకుస్థాపన పేరుతో మరో కొత్త శిలాఫలకాన్ని వేసి పూజలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు తమ్మడపల్లె గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీజీఎఫ్ క్రింద రూ. కోటి మంజూరు కాగా గత ఏడాది మహానంది ట్రస్ట్బోర్డు అప్పటి చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి, దేవదాయశాఖ అధికారులు భూమిపూజ చేశారు. మళ్లీ మరోసారి సోమవారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిలు భూమి పూజలు చేయడం విశేషం. ప్రొటోకాల్ పాటించని మహానంది ఆలయ అధికారులు మహానంది దేవస్థానంలో సోమవారం జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఆహ్వానం లేదని, కనీసం ఫోన్ ద్వారా సమాచారం అందించలేదని మహానంది మండల జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక మహానంది సర్పంచ్ చలం చలం శిరీష, ఎంపీటీసీ సభ్యుడు బంగి వెంకటేశ్వర్లులను సైతం పిలవకపోవడం అధికారుల ఏకపక్ష తీరుకు అద్దం పడుతుందని విమర్శిస్తున్నారు. -
‘మహా’ సమస్యలు!
పార్కింగ్ స్థలం లేక పాట్లు మహానందీశుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు వివిధ వాహనాల్లో వస్తుంటారు. ఇదే అదనుగా భావించిన అధికారులు టోల్గేట్ల కోసం టెండర్లు నిర్వహించారు. కేవలం ఒక టోల్గేట్ టెండర్ ద్వారానే రూ. 1.68 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే, భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు మాత్రం ప్రత్యేక స్థలం లేకపోవడంతో వారు తమ వాహనాలను నంది సర్కిల్ చుట్టూ మాడవీధుల్లోనే నిలుపుకోవాల్సి వస్తుంది. దీంతో ఈప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుంది. ● మహానందిలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువు ● వసతి గదులు, పార్కింగ్ స్థలం లేక అగచాట్లు ● గాల్లో దీపంగా మారిన భద్రత ● వైద్యసేవలకు కానరాని ఆసుపత్రి ● అన్నప్రసాదాలు సరిపోక ఆకలితో అలమటిస్తున్న భక్తులు ● రూ. కోట్లలో ఆదాయమున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు మహానంది: సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలసిన క్షేత్రం మహానంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం దర్శనార్థం దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడాదికి రూ. 17 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఈ క్షేత్రంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరోజు బస చేద్దామంటే సరైన గదుల్లేవు. ఆహ్లాదంగా కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే పరిసరాలు పచ్చగా కనిపించవు. కడుపు నిండా భోజనం చేద్దామంటే అన్నప్రసాదం పంపిణీ పరిమితమే. ఇలా ఒకటేంటి సమస్యలు కోకొల్లలు. ఏ ఆలయంలో నైనా ఒకటి లేదా రెండు సమస్యలు మాత్రమే ఉంటాయి. కానీ మహానందిలో ఉన్న మహా సమస్యలతో భక్తులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. నేడు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి మహానంది ఆలయానికి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కథనం. అన్నమో...మహానందీశా ఏ ఆలయానికి వెళ్లినా భక్తులకు సరిపడా అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఆలయానికి రూ. కోట్ల ఆదాయంతో పాటు అన్నప్రసాద విభాగానికి రూ. 4.45 కోట్లు డిపాజిట్లు ఉన్నప్పటికీ మహానందిలో మాత్రం రోజుకు 200 మందికి, శని, ఆది, సోమవారాల్లో 300 మందికి మాత్రమే అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. ఇందులోనూ నెలకు రూ.లక్ష వరకు వేతనాలు తీసుకునే రెగ్యులర్ ఉద్యో గులు ఇక్కడే భోజనాలు చేయడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి అన్నప్రసాదాల పంపిణీపై దృష్టి సారించి రోజుకు కనీసం 500 నుంచి 600 మందికి పంపిణీ చేపట్టాలని సుదూర ప్రాంత భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రత కరువు మహానంది క్షేత్రంలో గతంలో ఉదయం నలుగురు, సాయంత్రం నలుగురు హోంగార్డులు విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు మాత్రమే విధులు చేపడుతున్నారు. భద్రతా విధులతో పాటు ఉదయం, సాయంత్రం జరిగే అష్టవిధ మహా మంగళ హారతుల సమయంలో ప్రత్యేకంగా విధులు చేయాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ ముఖ ద్వారం వద్ద రెగ్యులర్ ఉద్యోగి అంటూ ఒక్కరూ లేరు. దీంతో ఇటీవల తరచూ చోరీలు జరుగుతున్నాయి. కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాల్లో వరుస చోరీలు జరిగిన విషయం తెలిసిందే. రాజగోపురం వద్ద ప్రైవేటు టెండరుదారులే ఉండటంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక్కడ గతంలో రెగ్యులర్ ఉద్యోగులు విధుల్లో ఉండేవారు. వసతికి అవస్థలు మహానందిలో వసతి గృహాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేవస్థానానికి చెందిన టీటీడీ వసతి గృహాల్లో కేవలం 26, నాగనందిలో 12 గదులు మాత్రమే ఉన్నాయి. వసతి గృహాలు తక్కువగా ఉండటంతో ప్రైవేటు లాడ్జీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో పాటు పార్వతీపురం కాలనీలో గృహాలే లాడ్జీలుగా తయారయ్యాయి. వీటికి ఎలాంటి అనుమతి లేకపోగా అసాంఘిక కార్యకలాపాలకు ఇస్తూ నెలకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. భక్తులు రద్దీ లేని రోజుల్లో రూ. 300 నుంచి రూ. 500 వరకు ఇచ్చే గదులను ప్రతి శని, ఆది, సోమవారాల్లో రద్దీని బట్టి రూ. 1000 నుంచి రూ. 3000 వరకు ఇస్తున్నారు. దీంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. బస్షెల్టర్ కరువు మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన భక్తులు బస్సుల కోసం నిలబడేందుకు స్థలం కరువైంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మహానందీశ్వరస్వామి దర్శనం ముగించుకుని సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే, ఆలయ ప్రాంగణంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో వారి అవస్థలు భగవంతుడికే ఎరుక. 70 ఏళ్ల నాటి పైపులైన్లే గతి మహానంది ఆలయ పరిధిలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పారిశుధ్య పనుల నిమిత్తం సుమారు 85 మందికి తీసుకుని వారికి వేతనాలు ఇస్తున్నా పనులు మాత్రం అలాగే ఉన్నాయి. 70 ఏళ్ల క్రితం వేసిన మంచి నీటి పైపులైన్లు, కాల్వలే గతి అయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కానరాని ఆసుపత్రి మహానంది దేవస్థానం పరిధిలో ఒక్క ఆసుపత్రి లేదు. భక్తులకు అనుకోకుండా ఏదైనా జరిగి వైద్యమవసరమైతే దేవుడే దిక్కు. కొందరు ఇక్కడి కోనేరులో దిగిన తర్వాత మూర్చకు గురవుతుంటారు. తర్వాత కోలుకోలేక ఆలయ పరిధిలోనే మృత్యువాతకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం బెంగళూరుకు చెందిన ఎం.మల్లికార్జున రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. -
వ్యక్తి ఆత్మహత్య
తుగ్గలి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జొన్నగిరిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన రాంపల్లి సతీష్(25)హైదరాబాద్లో చెత్త ఏరుతూ జీవనం సాగిస్తున్నాడు. చెత్త బండి కొనుగోలు, అనారోగ్యంతో ఉన్న తల్లి వైద్యం కోసం రూ.5లక్షల దాకా అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలన్న బెంగతో శనివారం రాత్రి ఇంటిపైన ఉన్న రేకుల షెడ్డులో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య భూమిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి ఆంజినేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. జోరుగా నకిలీ విత్తన విక్రయాలు నందవరం : ఆరు గాలం శ్రమించిన రైతన్నకు కష్టాలు తపడం లేదు..ఓ వైపు నకిలీ విత్తనాలు..మరో వైపు శ్రమించి పంట పడించిన దిగుడులు లేక, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వానలు కురస్తుడడంతో రైతులు పత్తి పంట సాగుకు ఉపక్రమించారు. కొందరు దళారులు జోరుగా నాసిరకం, లూజు విత్తనాల విక్రయాలు కొనసాగిస్తున్నారు. అయినా అధికారుల చర్యలు, తనిఖీలు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం, అధికారులు నకిలీ, లూజు విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుని, నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. లోదుక్కులతో ప్రయోజనాలు అవుకు: భూసార పరీక్షలు, లోదుక్కులతో మంచి ఫలితాలు ఉంటాయని, అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీప్రియ అన్నారు. ఆదివారం అవుకు మండలం సుంకేసుల గ్రామంలో వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి అబ్దుల్ హక్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుస్థిర యాజమాన్యం, భూసార పరీక్షలు, సమగ్ర సస్యరక్షణ, పంటల సమయంలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. బనగానపల్లె మండలం యాగంటిపల్లెలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అందిస్తున్న సేవలను రైతులకు తెలియజేశారు. వర్మీకంపోస్ట్, నాణ్యమైన విత్తనాలు, ట్రైకోడెర్మా విరిడీ, వర్టిసిలియం, సుడో మోనాస్, డైరీ ఫామ్, గొర్రెల ఫామ్, కోళ్ల ఫామ్ ప్రారంభించాలనుకునే వారికి శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణనిస్తున్నామని చెప్పారు. అలాగే కేంద్రం ప్రభుత్వం అందించే పీఎం కిసాన్, పీఎంఎఫ్బీవై పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హార్టీకల్చర్ అసిస్టెంట్ పటాన్ నాయక్, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
విజ్ఞాన పీఠంలో ప్రవేశాలు
● అనాథ బాలురకు అవకాశం కర్నూలు కల్చరల్: నగర శివారులోని జి.పుల్లారెడ్డి నగర్లో ఉన్న విజ్ఞాన పీఠం అనాథ శరణాలయంలో కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని పీఠం కార్యదర్శి సి.మాణిక్య రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 40 మంది అనాథ బాలురు పాఠశాలలో చేరారన్నారు. తల్లిదండ్రులు లేని నిరాశ్రితులుగా ఉన్న బీద బాలుర కోసం గత 50 సంవత్సరాలుగా విజ్ఞాన పీఠం వసతిగృహం నిర్వహిస్తోందని చెప్పారు. జి.పుల్లారెడ్డి దానం చేసిన స్థలంలో విశ్వహిందూ పరిషత్, విజ్ఞాన పీఠం అనాథ శరణాలయా న్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అనాథ శరణాలయంతో పాటు ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అనాథ బాలురు ఉంటే విజ్ఞాన పీఠంలో చేరవచ్చని కోశాధికారి రంగారెడ్డి పేర్కొన్నారు. ఉచిత వసతి, విద్య, వైద్యం అందిస్తామన్నారు. విజ్ఞాన పీఠం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
బయో మైనింగ్ పనులు పూర్తి చేయండి
కర్నూలు (టౌన్): నగర శివారులోని గార్గేయపురంలో జరుగుతున్న బయో మైనింగ్ పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదేశించారు. ఆదివారం డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గార్గేయపురంలోని డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టారన్నారు. డంప్ యార్డులో 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించేలా చెత్త శుద్ధీకరణ లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 43 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు బయో మైనింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన 22 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ట్రామెల్ యంత్రం ద్వారా చెత్తను నాలుగు పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తారని, ప్లాస్టిక్, ఇనుము, గాజు వస్తువులు, రాళ్లు రప్పలను వేర్వేరు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో తనిఖీలు చేపట్టిన కమిషనర్ అంతకుముందు కమిషనర్ నగరంలో తనిఖీలు చేపట్టారు. ఏ.క్యాంపు, బళ్లారి చౌరస్తా, ఏపీఎస్పీ క్యాంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను గమచించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఓ టీ హోటల్ వద్ద అపరిశ్రుంభంగా ఉండటంతో నిర్వాహకుడిపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఏపీఎస్పీ క్యాంపు, బళ్లారి చౌరస్తా వద్ద నూతన బైపాస్ రహదారిని కమిషనర్ పరిశీలించారు. -
అనుమతుల్లేకుండా హంద్రీలో తవ్వకాలు
● నది బఫర్జోన్లో రోడ్డు ● వరద నీరొస్తే కొట్టుకుపోయే అవకాశం ● జల వనరుల శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండానే రోడ్డు నిర్మాణంకర్నూలు సిటీ: నగరం మధ్యలో ప్రవహిస్తున్న హంద్రీనదిలో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. నదిలో తవ్విన మట్టిని తీసి అదే నదిలో ఎలాంటి అనుమతులు లేకుండా బఫర్జోన్లో వేస్తున్న రోడ్డుకు వినియోగిస్తున్నారు. పగలు తవ్వకాలు చేస్తే ఎవరైనా అడ్డుకుండారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో జేసీబీతో పని కానిస్తున్నారు. అధికారులు ఏ మాత్రం తమకు తెలియనట్టు వ్యవరిస్తుండడంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హంద్రీనది బఫర్జోన్లో అక్రమ కట్టడాలు నిర్మించడంతో నది కుచించుకపోయింది. నదికి 2007, 2009లో వరదలు రావడంతో తీర కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇటీవలే నది బఫర్జోన్లోని కట్టడాలను గుర్తించి నది సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. ఇంకా ఇందులో కేసీ కాలువ అక్విడక్ట్ నుంచి జోహరాపురం వరకు ఉన్న హంద్రీనది సరిహద్దులు గుర్తించాల్సి ఉంది. దీనిపై కర్నూలు నగరపాలక సంస్థ అధికారులకు శ్రీశైలం వరద రక్షణ విభాగం ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపించారు. గట్టు కోతకు గురయ్యే ప్రమాదం కోట్ల కిసాన్ ఘాట్కు వెనుకటి భాగం, సిమ్మింగ్పూల్కు ఎదురుగా హంద్రీనదిలో మట్టిని జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వరద నీరు ఎక్కువగా వస్తే ఆ గట్టు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ తవ్విన మట్టిని రాజ్విహార్కి సమీపంలో అంబేద్కర్ భవనం, జెడ్పీ వెనుకటి భాగంలో హంద్రీబ్రిడ్జ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు నడక దారిని నిర్మిస్తుంది కర్నూలు నగరపాలక సంస్థ. ఆ దారిని నిర్మించాలను కోవడంలో తప్పేలేదు. కానీ నది పరిరక్షణ చట్టాల ప్రకారం బఫర్జోన్ ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదనే నిబంధనలను నగరపాలక సంస్థ ఇంజినీర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జల వనరుల శాఖ అనుమతి తీసుకోకుండా రూ.50 లక్షలతో నడక దారిని బఫర్ జోన్లో నిర్మించవచ్చునా అనే విషయం తెలుసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుండడంతో నదిలో పెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. దీనిపై జల వనరుల శాఖ వరద రక్షణ విభాగం డీఈఈ శ్రీనివాస నాయక్ను వివరణ కోరగా నదిలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. బఫర్జోన్లో వేస్తున్న రోడ్డుకు సైతం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతున్నారు. -
ఈఏపీసెట్లో మెరికలు.. మెరుపులు!
కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్య ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు మెరిశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. గత నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు కర్నూలులో 7, నంద్యాలలో మూడు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 12,522 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 11,855 మంది పరీక్ష రాశారు. వీరిలో 8,403 మంది అర్హత పొందారు. అగ్రికల్చర్ స్ట్రీమ్కు 6,370 మంది రిజిస్టర్ చేసుకోగా 5972 మంది పరీక్షల రాశారు. వీరిలో 5305 మంది ఉత్తీర్ణులయ్యారు. నంద్యాల జిల్లాలో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 5,409 మంది రిజిస్టర్ చేసుకోగా 5205 మంది పరీక్షలకు హాజరుకాగా 3648 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ పరీక్షకు 2,849 మంది రిజిస్టర్ చేసుకోగా 2,655 మంది పరీక్షలు రాయగా 2341 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇవీ ర్యాంకులు.. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో కర్నూలు జిల్లాకు చెందిన వంగాల అజయ్ రెడ్డి 12వ ర్యాంకు, కప్పట్రాల చెన్నకేశవ 23వ ర్యాంకు, గోరంట్ల సాయి సాహితి 140వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో దాసి హేమ సాగరిక 21వ ర్యాంకు, రాయల గోవర్ధన్ చౌదరి 65వ ర్యాంకు, సఫా సైఫ్ క్యురైసీ 90వ ర్యాంకు, పడిగాల దీపిక 102వ ర్యాంకు, మేఘనాథ్ అఖిల్ బాలాజీ నాయక్ 104వ ర్యాంకు, జి.సతీష్ చంద్ర రాయల్ 121వ ర్యాంకు, వాకిటీ గురు పరద్వీ 124వ ర్యాంకు సాధించారు. నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థుల్లో యు.రామ్ చరణ్ రెడ్డి రాష్ట్ర సాయిలో ఇంజినీరింగ్ విభాగంలో 4వ ర్యాంకు, పి.ప్రణయ్ రెడ్డి 34వ ర్యాంకు, పి.గురు హర్షిత్ 92వ ర్యాంకు సాధించారు. విద్యార్థి పేరు: వంగల అజయ్ రెడ్డి తల్లిదండ్రులు: వెంకట రమణారెడ్డి, వంగల మాధవి స్వస్థలం: కర్నూలు, మాధవనగర్ ఏపీ ఈఏపీసెట్లో ర్యాంకు: 12వ ర్యాంకు (జేఈఈ అడ్వాన్డ్స్ ఓపెన్ క్యాటగిరి 19, ఆల్ ఇండియాలో ఈడబ్ల్యూస్ పస్ట్ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో 12వ ర్యాంకు) లక్ష్యం: ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ ఫలితాల్లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు నంద్యాల జిల్లా విద్యార్థికి 4వ ర్యాంకు కర్నూలు జిల్లా విద్యార్థులకు 12, 21, 23వ ర్యాంకులుపేరు: పబ్బతి ప్రణయ్రెడ్డి తల్లిదండ్రులు: సుధాకర్ రెడ్డి, రాధమ్మలు ఊరు: పరమటూరు, బండిఆత్మకూరు మండలం ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్: 34 జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్: 182 లక్ష్యం: కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ పేరు: మంచాలముని సాత్విక్రెడ్డి తల్లిదండ్రులు: శ్రీసాయి, నీలిమ ఊరు: గుర్రెడ్డి కాలనీ, బనగానపల్లె ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్: 192 జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్ : 2000 లక్ష్యం: సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
ప్రశ్నించే గొంతు నొక్కే కుట్ర
ఆలూరు: కూటమి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్న సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రశ్నించే గొంతు నొక్కే కుట్ర పన్నుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి విమర్శించారు. ఆదివారం ఆయన హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పత్రికా కార్యాలయాలపై దాడికి పాల్పడి భయపెట్టాలని చూడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు పాలన కొనసాగిస్తారన్నారు. ఎన్నికలకు ముందు అధికార దాహంతో సాధ్యం కాని సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ పేరుతో హామీ ఇచ్చి, వాటిని అమలు చేయకుండా విస్మరించడం దారుణమన్నారు. ఏడాది కూటమి పాలన పూర్తవుతున్నా ఇప్పటివరకు పథకాల జోలికి వెళ్లలేదన్నారు. పథకాల అమలుపై నేడు, రేపు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బాబుకే సాధ్యమన్నారు. రాష్ట్రంలో శాంతిభ్రతలు లోపించి హత్యలు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి -
ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం
కర్నూలు సిటీ: మాన్యువల్గా కాకుండా వెబ్ కౌన్సెలింగ్లో బదిలీలు నిర్వహిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కనీసం స్పందించకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఐక్య వేదిక నాయకులు మాట్లాడారు. గతంలో ఉపాధ్యాయ సంఘాల నాయుకులతో జరిగిన చర్చల్లో ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్గానే నిర్వహిస్తామని హామీ ఇచ్చారన్నారు. పాఠశాల విద్య కమిషనర్ ఇచ్చిన మాటను అమలు చేయలేకపోయారని ఆరోపించారు. వెబ్కౌన్సెలింగ్తో చాలా మంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రతి టీచర్ రెండు వేలకుపైగా ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఇబ్బందింగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో తన మాటే నెగ్గాలి అనే ధోరణిని వీడాలన్నారు. డీఈఓకు విన్నపం బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని డీఈఓను కలసి ఎస్జీటీ టీచర్లు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తమకు ప్రాధాన్యత కేటగిరీ విభాగంలో పోస్టులను ఎంపిక చేసుకోవాలనే విషయం తెలియదన్నారు. మూడు పోస్టులు కలిగిన స్కూళ్లు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవన్నారు. అలాంటి స్కూళ్లలో మాత్రమే ప్రాధాన్యత కేటగిరీ పోస్టులను ఎంపిక చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారన్నారు. మూడు పోస్టులు గల స్కూళ్లలో కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అని, స్కూల్ అసిస్టెంట్ అని ఇక్కడకు పంపించడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మెడికల్ సర్టిఫికెట్ పొంది వారికి ప్రాంతానికి దగ్గరగా ఉండే స్కూళ్లలో అవకాశం వస్తుందని అనుకున్నామన్నారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో తమకు జరుగుతున్న అన్యాయం జరిగిందన్నారు. మాన్యువల్గా కాకుండా వెబ్ కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు? కర్నూలు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు -
గతంలోనూ ఇవే ఇబ్బందులు...
● కర్నూలు కార్పొరేషన్లో షాడో మంత్రి! ● ఫోన్లో అధికారులకు ఆదేశాలు ● ఫీల్డ్లో అభివృద్ధి పనుల తనిఖీ ● పాలనా పరమైన అంశాలపై వాట్సాప్ చాటింగ్ ● ఉన్నతాధికారులకు మించి హడావుడి చేస్తున్న మంత్రి అనుచరుడుకర్నూలు (టౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. కర్నూలు నియోజకవర్గానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయనకు అనుచరులుగా నలుగురు అధికార పార్టీకి చెందిన ప్రెవేటు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రతి వార్డులో పార్టీ తరఫున ఇన్చార్జ్లను నియమించారు. మంత్రి ఆదేశాల మేరకు వీరందరికీ నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రొటోకాల్ ఏర్పాటు చేసింది. కర్నూలు నియోజకవర్గంలోని 33వ వార్డుల పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా వీరికి తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు తెలియ జేయాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తి కార్పొరేషన్లో అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. రాత్రి 10 గంటలు దాటినా అధికారులకు ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పనులు కావాలన్న ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అయన హడావుడి చూస్తే ఉన్నతాధికారికి మించి చేస్తున్నారని మున్సిపల్ ఆధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఒత్తిడి ముఖ్యమైన అధికారుల వద్ద మంత్రి అనుచరుడు గంటల కొద్దీ కూర్చోవడంతో పనులు పెండింగ్లో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఫైళ్లు క్లియర్ కావడం లేదు. ముఖ్యమైన పని ఉంటే వెళ్లవచ్చు.. కానీ అదేపనిగా కలుస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయని ఇంజినీరింగ్ అధికారి వాపోయారు. ఓ రకంగా మంత్రి అనుచరుడు షాడో మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కన్నా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చోటా మోటా నాయకుల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. అతి జోక్యం కార్పొరేషన్లో ఉన్న ముఖ్యమైన అధికారుల గ్రూపుల్లో మంత్రి అనుచరుడు ఉన్నాడు. నిత్యం ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తుంటాడు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా అప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలన్న అనధికారిక ఉత్తర్వులు ఇస్తాడు. ఈయన హడావుడితో నగరపాలక పట్టణ ప్రణాళిక విభాగం, పారిశుద్ధ్య విభాగం, రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్ విభాగం ఇలా.. ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో అధికారులు ఆయన చుట్టూ తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఫోన్లు చేయడమే కాకుండా వాట్సాప్ చాటింగ్ ఎక్కువ చేస్తున్నాడు. కార్పొరేషన్ కమిషనర్ కన్నా.. ఫీల్డ్లో పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన పర్యవేక్షణ, ఆదేశాలు ఒకటేమిటీ.. ఏకంగా కమిషనర్కే ఆదేశాలు జారీ చేసే పరిస్థితి వచ్చింది. అనధికార తనిఖీలు ‘‘మీతో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు’’ అని అధికారులతో మంత్రి అనుచరుడు మాట్లాడుతున్నాడు. పాలనాపరమైన ఆంశాల్లోనూ జోక్యం చేసుకుంటున్నాడు. అధికారులతో కలిసి నిత్యం కాలనీలలో పర్యటనలు చేస్తుంటాడు. అధికారులకు సూచనల ఇవ్వడంతో పాటు కార్యాలయాలను అనధికార తనిఖీ చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈయన రాజకీయ నాయకుడు కాదు. అయినా మంత్రి అనుచరుడిగా మున్సిపల్ అధికారులపై పెత్తనం చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏపీఎస్పీ క్యాంపులో లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పాం. స్థానికంగా పార్టీ బూత్ ఇన్చార్జ్లు ఫిర్యాదులు చేస్తున్నారు. వెంటనే ఏర్పాటు చేయండి’ అంటూ డీఈఈకి వాట్సప్ సందేశం పంపారు. ‘వెంకటరమణ కాలనీలో శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ సక్రమంగా పనులు చేయడం లేదు. వీరిపై చర్యలు తీసుకోండి. వెంటనే వారిని ఇతర శానిటేషన్ డివిజన్కు పంపించండి’ అంటూ మంత్రి నియమించిన ఓ ప్రెవేటు వ్యక్తి కమిషనర్ రవీంద్రబాబుకు, నగరపాలక ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డికి మేసేజ్ పంపించారు. పై రెండే కాదు ఎన్నో సందేశాలను కర్నూలు కార్పొరేషన్లో అధకారులకు పంపుతున్నాడు. ఆయన ఎవరో కాదు మంత్రి అనుచరుడే! ప్రజాప్రతినిధి కాకపోయినా పెత్తనం చెలాయిస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.మంత్రి దగ్గర పనిచేసే ఓ పీఏ గతంలో కార్పొరేషన్లో పెత్తనం చేశాడు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఎదుర్కొన్నారు. అప్పట్లో కమిషనర్ చాంబర్లో గంటల కొద్దీ కూర్చొని మాట్లాడేవాడు. కమిషనర్ను కలిసేందుకు వచ్చిన అర్జీదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తన అనుచరుడు చేస్తున్న వ్యవహారంపై మంత్రి దృష్టి సారించాల్సి ఉంది. అధికారులపై పెత్తం చేస్తూ ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవడాన్ని అరికట్టాల్సి ఉంది. -
రైల్వేస్టేషన్లో తనిఖీలు
కర్నూలు: రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు కర్నూలు రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫామ్తో పాటు వెయిటింగ్ హాల్, పార్సిల్ బుకింగ్ ఆఫీస్, టిక్కెట్ కౌంటర్లతో పాటు వచ్చిపోయే రైళ్లలో కూడా తనిఖీలు చేశారు. కర్నూలు డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు పోలీసు బృందాలు ఆయా కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు గంజాయి, కొకెయిన్, హెరాయిన్తో పాటు నిషేధిత పదార్థాలు, పేలుడు పదార్థాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేశారు. అనుమానితులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి వ్యక్తిగతంగా అడ్రస్సులు సేకరించి ఆరా తీశారు. యూరియా వినియోగంపై పరిశ్రమల్లో పరిశీలనకర్నూలు(అగ్రికల్చర్): పారిశ్రామిక అవసరాలకు యూరియా వినియోగిస్తున్నారా అనే దానిపై వ్యవసాయ శాఖ తనిఖీలు చేపట్టింది. యూరియాను వ్యవసాయానికే కాకుండా వివిధ పారిశ్రామిక అవసరాలకు సైతం వినియోగిస్తుట్లుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెళగల్ ఏఓ మల్లేష్ యాదవ్ ఒక బృందంగా ఏర్పడి ఆదివారం తనిఖీలు చేపట్టారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని లలిత లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, డిటర్జెంట్ పౌడర్, డిటర్జెంట్ కేక్ తయారీ యూనిట్లను పరిశీలించారు. అయితే యూరియా వినియోగిస్తున్న దాఖలాలు కనిపించలేదని ఏడీఏ సాలురెడ్డి తెలిపారు. ‘నైరుతి’ మందగమనం ● 13 మండలాల్లో తేలికపాటి వానలు కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు మే నెలలో ముందస్తుగా పలకరించినప్పటికీ ప్రస్తుతం మందగించాయి. జూన్ నెలతో ఖరీఫ్ సీజన్ మొదలై వారం రోజులు గడిచిపోయినప్పటికీ వర్షాలు నామమాత్రానికే పరిమితం అయ్యాయి. వరుణుడి కరుణ లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి వానలు కురిశాయి. కేవలం 3 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ‘వక్ఫ్’ పరిధిలోకి షాహి జామియా మసీదు ● టీడీపీ నాయకుడు గుజ్రీ రౌఫ్కు ఎదురు దెబ్బ ఆదోని రూరల్: పట్టణంలోని షాహి జామియా మసీదును వక్ఫ్బోర్డు ఆధీనంలోకి తీసుకుని నిర్వహణను చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ మసీదు నిర్వహణకు 2015లో ఎన్నికలు జరగగా టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడు గుజ్రీ రౌఫ్ వర్గం గెలుపొందింది. ఈ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని మరో వర్గం అయిన ఎజాజ్ అహ్మద్, సలావుద్దీన్లు కోర్టుకు ఎక్కారు. ఇందుకు విరుద్ధంగా 2015కు ముందు మసీదు నిర్వహణ లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని ఎజాజ్, సలావుద్దీన్పై గుజ్రీ రౌఫ్ వర్గీయులు కోర్టుకు వెళ్లారు. దీంతో కేసును ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. మసీదును వక్ఫ్బోర్డు ఆధీనంలోకి తీసుకుని నిర్వహణను చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దాదాపు పదేళ్లు అయినా ఎన్నికలు జరగకపోవడంతో గుజ్రీ రౌఫ్ ఇష్టారాజ్యమే చెల్లుబాటు అవుతూ వచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. -
శ్రీమఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి
మంత్రాలయం రూరల్: శ్రీమఠంలో కొలువైన శ్రీరాఘవేంద్ర స్వామిని శనివారం కర్ణాటక హైకోర్టు జడ్జి అశోక్ ఎస్. కినాగి దర్శించుకున్నారు. ఉదయం మంత్రాలయం చేరుకున్న న్యాయమూర్తికి శ్రీమఠం మహాముఖద్వారం వద్ద మఠం అధికారులు శ్రీమఠం ధార్మిక మేనేజర్ శ్రీపతి ఆచార్ స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను కుటుంబ సమేతంగా అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు కాసేపు ముచ్చటించారు. వినికిడి లోపం ప్రాణం తీసింది! ● రైలు పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన గూడ్స్ ఆదోని సెంట్రల్: వినికిడి లోపం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కోసిగి మండల కేంద్రానికి చెందిన జంపాపురం బసన్న (56) ప్రమాదావశాత్తు శనివారం రైలు కింద పడి మృతి చెందాడు. కోసిగి ఎల్సిగేట్ నంబర్.205 అప్లైన్ ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్ రైలు తగిలి తలకు బలమైన రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. వినికిడి సమస్య కారణంగా దూరంగా వస్తున్న గూడ్స్ శబ్దం వినిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి డోన్ టౌన్: ప్రజలు ప్రశాంతంగా జీవించేలా శాంతిభద్రతలను పరిరక్షిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. డోన్ డీఎస్పీ కార్యాలయంపై నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు డీఐజీ కోయ ప్రవీణ్, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి తదితరులు హాజరయ్యారు. మంత్రి బీసీ ఆర్ధిక సహకారంతో పోలీసు పెట్రోలింగ్ కోసం రూ.5.5లక్షలతో కొనుగోలు చేసిన డ్రోన్ను వారు ప్రారంభించారు. అనంతరం ఆర్ అండ్బీ నూతన అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రజల జీవనానికి ఆటంకం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. అనంతరం డోన్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు సీఐలు ఇంతియాజ్బాషా, సీఎం రాకేష్, ప్రవీణ్కుమార్, మోహన్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. -
నీటి కుంటలో పడి బాలిక మృతి
చిప్పగిరి: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఓ బాలిక మృతి చెందన సంఘటన దౌల్తాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలు, శకుంతలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు రూప (10) ఉదయం పొట్టేలును మేపేందుకు గ్రామ సమీప పొలంలోకి వెళ్లింది. అక్కడ ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తూ జారి పడింది. అయితే పక్కనే ఉన్న తోట యజమాని దేవేంద్ర కుమారుడు బాలుడు నితిన్ గమనించి పరుగున వచ్చి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వెళ్లి చూడగా అప్పటికే రూప నీటిలో విగత జీవిగా కనిపించడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం అయితే ఆరవ తరగతిలో చేరాల్సిన బాలిక అనంతలోకాలకు చేరడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
ట్రాక్టర్ శుభ్రం చేస్తుండగా..
రుద్రవరం: ఆలమూరు గ్రామంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శేఖర్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు చంద్ర(22) అప్పుడప్పుడు తమ సొంత ట్రాక్టర్తో సేద్యపు పనులకు వెళ్లేవాడు. ఇందులో భాగంగానే శనివారం పొలానికి వెళ్లేందుకు ట్రాక్టర్ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ ముందుకు కదలింది. ఆపేందుకు యత్నించిన చంద్ర ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కింద పడ్డాడు. అతనిపై చక్రాలు వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
కాంట్రాక్టర్ల కోసమే గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు
● రూ.81వేల కోట్లు పెడితే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం ● ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరరెడ్డి డిమాండ్ కర్నూలు(సెంట్రల్): కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే గోదావరి – బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నారని, దీనివల్ల వెనుకబడిన రాయలసీమలో ఎలాంటి నీటి కష్టాలు తీరవని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు రూ.81 వేల కోట్ల ఖర్చుతో గోదావరి–బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి మూడు లక్షల ఎకరాలకుతోడు కొత్తగా మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని గొప్పలు చెబుతున్నారని, ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడిన రాయలసీమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కోసమే దీనిని నిర్మించ తలపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లకు నిధులు కేటాయిస్తే ఉపయోగం ఉంటుందన్నారు. 2018లో సీఎంగా ఉన్న సమయంలో వేదవతి ప్రాజెక్టును రూ.2 వేల కోట్లతో నిర్మిస్తామని భూమి పూజ చేసి చంద్రబాబు వదలివేశారని గుర్తుచేశారు. జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన ప్రకారం రూ.4 వేల కోట్లు ఖర్చు పెడితే వెలిగొండ పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో కరువుపీడిత 4 లక్షల ఎకరాలు, 100 గ్రామాలకు తాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలోని వరికెపూడిసెల ఎత్తిపోతల పథకానికి రూ.1300 కోట్లు ఖర్చుపెడితే లక్ష ఎకరాలక సాగునీరు, 100 గ్రామాలకు తాగునీరు ఇవ్వచ్చని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ప్రభుత్వం పట్టించుకోకుండా రూ.81 వేల కోట్లతో గోదావరి–బనకచర్ల చేపడితే కాంట్రాక్టర్లకు లాభం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘంజిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
అమ్మను చూసి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: పండగ రోజు అమ్మను పలుకరించి తిరుగు ప్రయాణమైన కుమారుడు మార్గమధ్యలో మృత్యుఒడి చేరాడు. ఆదోని – కర్నూలు రహదారిలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదోని పట్టణంలోని కౌడల్ పేటకు చెందిన అల్లాబకాష్, ఖాజాబానుల కుమారుడు షాకీర్(45)కు ఎమ్మిగనూరు పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉసేన్బీతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెంట్రింగ్ పనులు చేసే షాకీర్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబంతో ఎమ్మిగనూరు చేరుకున్నాడు. అయితే అతని తల్లి ఖాజాబాను ఆదోనిలో ఉండటంతో అప్పుడప్పుడు వెళ్లి పలుకరించి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం బక్రీద్ సందర్భంగా ఆదోనికి చేరుకున్నాడు. అక్కడే తల్లి, బంధువులతో పండగ జరుపుకుని శనివారం ఎమ్మిగనూరుకు బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో బనవాసి ఫారం సమీపంలో స్కార్పియ్ వాహనం ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన షాకీర్ను ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రిలో మృతుడి భార్య, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పండగ పూట విషాదం
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం ● మరో యువకుడికి తీవ్ర గాయాలు ఆత్మకూరురూరల్: బక్రీద్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్ స్మృతివనం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వెలుగోడు పట్టణానికి చెందిన సనావుల్లా(19), సమీర్(20), షేక్షావలి మిత్రులు. వీరు బక్రీద్ పర్వదినం సందర్భంగా స్మృతివనం సందర్శనకు బైక్లో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దారి వెంట వెళుతున్న కొందరు గాయపడిన వారిని వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సనావుల్లా, సమీర్లు మృతి చెందారు. గాయపడిన షేక్షావలికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ నిలుపకుండా పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ రాము, ఎస్ఐ నారాయణరెడ్డి వెలుగోడు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మేము ఎంతో అదృష్టవంతులం
అప్పట్లో అమ్మవారికి ముడుపును కట్టెందుకు కర్నాటి వంశీకుల నుంచే తీసుకు రావాలని పెద్దమ్మ కోరిందట. ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి దేవరకు నెల రోజుల మందు తొలి ముడపు మా ఇంటి నుంచే తీసుకువెళ్తున్నాం. అందుకు మమ్మల్ని పొలిపేర రెడ్డి అని పిలుస్తున్నారు. అమ్మవారికి తొలి సేవ చేసే భాగ్యం మాకు కలగడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. – పొలిమేర రెడ్డి కర్నాటి కృష్టారెడ్డి, డబ్ల్యూ గోవిందిన్నె ఏర్పాట్లు పూర్తి చేశాం దాదాపు 11 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న దేవరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. భక్తులకు దర్శనానికి, మొక్కులు తీర్చుకోవడానికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. – తలారి శీను, ఆలయ కమిటీ సభ్యుడు -
మూల పెద్దమ్మ దేవరకు వేళాయె!
● నేటి నుంచి డబ్ల్యూ గోవిందిన్నెలో దేవర ● 11 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న వైనం దొర్నిపాడు: జిల్లాలో ఎంతో విశిష్టత ఉన్న డబ్ల్యూ గోవిందిన్నె మూల పెద్దమ్మ దేవర నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవానికి గ్రామం ముస్తాబైంది. బంధువులతో అందరి ఇళ్లు కళకళలాడుతున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒక సారి నిర్వహించే పెద్దమ్మ దేవరను గతంలో కరోనా కారణంగా నిర్వహించలేక పోయారు. 11 ఏళ్ల తర్వాత గ్రామ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు దేవర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ ఆదివారం దేవి ఉత్సవం, 9న సోమవారం అమ్మవారికి గండదీప పూజలు, 10న మంగళవారం ఎల్లమ్మ పూజలు నిర్వహించి దేవరను ముగిస్తారు. గ్రామంలో వెలసిన మూల పెద్దమ్మ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన జూదం వంశీకులు తినడానికి తిండిలేక దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవారు. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం జూదం వంశీకులు కర్నూలు ప్రాంతంలో ఓ బ్రాహ్మణ ఇంట్లో చొరబడి మేదర పెట్టెను అపహరించారు. ఇంటికి వచ్చి అందులో చూడగా మూలపెద్దమ్మ విగ్రహం ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరికి అమ్మవారు పూని ‘నన్ను ఇక్కడే కొలువుంచండి మీకు సుఖశాంతులు కల్గుతాయి’ అని చెప్పడంతో ఆ ఇంట్లోనే పెద్దమ్మను ప్రతిష్టించుతారు. దీంతో వారి ఇళ్లే పెద్దమ్మ ఆలయంగా మారిందని స్థానికులు చెబుతారు. మూల పెద్దమ్మ ఎందుకంటారంటే.. ఎక్కడైనా ఆలయాలు చాలా వరకు తూర్పు ముఖం కల్గి ఉండి విగ్రహాలు వాకిటికి ఎదురుగా ప్రతిష్టిస్తారు. ఇక్కడ అలా కాదు. పెద్దమ్మ ఆలయంగా మారిన ఇళ్లు పడమర ముఖం కల్గి ఉంటుంది. జూదం వంశీకులు చోరీ చేసిన పెట్టను మూలకు ఉంచడం, పెద్దమ్మ అక్కడే ఉంచాలని కోరడంతో మూల పెద్దమ్మగా కొలుస్తారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల సందడితో రాఘవేంద్ర స్వామి మఠం కారిడార్ కళకళలాడింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అంతంతమాత్రం తేమలో విత్తనం వేయొద్దు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సంబంధించి అంతంతమాత్రం తేమలో విత్తనం విత్తుకోవద్దని ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త సుజాతమ్మ తెలిపారు. నల్లరేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం ఒక్క రోజులో నమోదైనా లేదా వరుసగా మూడు రోజుల్లో నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవాలని సూచించారు. ఎర్ర నేలల్లో కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజులో 50 మి.మీ వర్షపాతం నమోదైతేనే విత్తనం వేసుకోవాలన్నారు. అంతంతమాత్రం తేమలో విత్తనం వేసుకుంటే మొలక సరిగా రాద ని పేర్కొన్నారు. ప్రస్తుతం పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేందుకు ఇది చక్కటి అదును అన్నారు. వరిలో జనుము, జీలుగ, పిల్లి పెసర వేసుకోవచ్చని, మెట్ట పంటల్లో పిల్లిపెసర వేసుకోవచ్చని వివరించారు. కాగా శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీమఠం అన్నదానానికి రూ.లక్ష విరాళం మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి కడపకు చెందిన రామకృష్ణయ్య అనే భక్తుడు రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. విరాళం అందజేసిన భక్తుడిని శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆశీర్వదించారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అదేవిధంగా అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అండర్ వాటర్ వీడియోగ్రఫీకి సిద్ధం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం ప్లంజ్పూల్లో అండర్ వాటర్ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ సోమవారం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం నుంచి ప్లంజ్పూల్ నీటిలో పరిశోధన జరిపే పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వాల్తేరు నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు శ్రీశైలండ్యాం వద్ద పరికర సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిపుణులు సోమవారం నుంచి ప్లంజ్పూల్లో ఏర్పడిన గోతులను, కాంక్రీట్ సిలండర్ల పటిష్టతను చిత్రీకరిస్తారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
● కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మహిళల్లో ఆందోళన ● ఆడబిడ్డ నిధి పేరుతో మోసం ● ‘తల్లికి వందనం’ అంటూ వంచన ● సున్నా వడ్డీ రుణాలకు దిక్కేదీ? ● చంద్రన్న బీమాకు మంగళం పలికినట్లేనా! సంక్షేమాన్ని మరిచారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం కింద బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15,000 ప్రకారం చెల్లించాలి. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – టి.కృష్ణవేణమ్మ, వర్షిణి గ్రూపు, చెన్నంపల్లి, తుగ్గలి మండలం మోసం చేశారు ఆడబిడ్డనిధి కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం చెల్లిస్తామని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల అమలుపై వెంటనే దృష్టి సారించాలి. – హసీనా, కోడుమూరు అప్పుల ఊబి మిగిలింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తవుతోంది. ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే లింకేజీ రుణాలు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తామని ఇంతవరకు చేయలేదు. మహిళలు అప్పుల ఊబిలో కూరుకపోయారు. –బి.పద్మావతి, 19వ వార్డు, కర్నూలు కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పటై ఏడాది పూర్తవుతున్నా మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. తరుణీమణులకు జీవనోపాధులను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులు 2014లో కూడా డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారు. 2024 ఎన్నికల సమయంలో కూడా మహిళల కోసం ప్రత్యేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో నిజాయితీ ఉండదు అని మహిళలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు హామీలు ఇవీ.. ● ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ.. పేదరికం లేని సమాజం తీసుకువస్తాం’ అంటూ 2024 మే నెలలో ఎన్నికల ప్రచారసభలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ● ‘ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకువస్తాం.. 18 నుంచి 59 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చెల్లిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వర్తింప చేస్తాం’ అని ప్రకటించారు. ● అమ్మకు వందనం కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 నేరుగా ఆడబిడ్డల బ్యాంకు ఖాతాలో వేస్తాం అని హామీ ఇచ్చారు ● ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని సూపర్–6 హామీల్లో ఘనంగా చెప్పారు. ● ‘ఇంతకు ముందు జనాభా నియంత్రణ కోసం ఒకరిద్దరితో సరిపుచ్చుకోమని చెప్పా.. ఇపుడు చెబుతున్నా... ముగ్గురు, నలుగురు ఆడబిడ్డలను కనండి... అడబిడ్డల భవిత్వం నేను చూసుకుంటా’ అని టీడీపీ అధినేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ● ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు రూ.10 లక్షలకు, సహజ మరణాలకు రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇలా చేశారు.. ● అధికారంలోకి వచ్చాక మహిళా సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు మరచిపోయారు. సీఎం పర్యటనలకు మహిళలే అవసరం. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సభలు, సమావేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదు. ● ఆడబిడ్డనిధి గురించి 2025–26 బడ్జెట్లో ప్రస్తావనే లేదు. ఈ పథకాన్ని అమలు చేయరని మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ● తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ● ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని చెప్పినా దానిపై స్పష్టత కరువైంది. ● జిల్లాలో 49,255 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 5.10 లక్షల మంది మహిళలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావచ్చినప్పటికీ సున్నావడ్డీ రుణాల జాడనే లేకుండా పోయింది. 2024–25లో 45 వేల స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.1,800 కోట్ల వరకు లింకేజీ రుణాలు పొందారు. సున్నా వడ్డీ జాడా లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది. ● టీడీపీ కార్యకర్తలకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ప్రమాద బీమా కల్పించిన చంద్రబాబు సామాన్య, మధ్య తరగతి కుటంబాలను గాలికి వదిలేశారు. వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడం మినహా ఎటువంటి పురోగతి లేదు. చంద్రన్న బీమా కోసం కర్నూలు జిల్లాలో 3,500, నంద్యాల జిల్లాలో 2,800 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఏడాది అవుతున్నప్పటికీ చంద్రన్న బీమా అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి అందించిన ఆర్థిక సహాయం పథకం లబ్ధిపొందిన మహిళలు ప్రయోజనం పొందిన ఆర్థిక లబ్ధి (రూ.కోట్లలో) వైఎస్సార్ ఆసరా 2,49,976 568.28 వైఎస్సార్ చేయూత 1,24,045 905.80 సున్నా వడ్డీ రుణాలు 29,520 (గ్రూపులు) 140.36 వైఎస్సార్ బీమా 4,578 45.49 జగనన్న తోడు 92,739 126.81 కళ్యాణమస్తు, షాదీతోఫా 2,952 23.71గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళల సంక్షేమం లక్ష్యంగా పలు పథకాలు అమలు చేశారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, కళ్యాణమస్తు– షాదితోఫా, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ బీమా పథకాలను పకడ్బందీగా అమలు అయ్యాయి. ఈ పథకాల కింద ఐదేళ్లలో మహిళలకు రూ.1810.45 కోట్ల మేర ప్రయోజనం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా.. మహిళల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో మహిళలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మహిళల్లో కొనుగోలు సామర్ధ్యం భారీగా పడిపోయింది. -
చాలా కష్టం ‘గురు’
● ప్రహసనంగా పదోన్నతుల ప్రక్రియ ● సీనియారిటీ జాబితాలో మార్పులు ● జిల్లాలో 639 మంది ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎంలుగా పదోన్నతులు ● కౌన్సెలింగ్కు సీనియారిటీ జాబితాలో 1500 నంబరు వరకు పిలుపు ● 140 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ● కూటమి ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం -
తాగునీటితో దర్జా ‘సాగు’తోంది!
గోనెగండ్ల: ‘మమ్మల్ని ఎవరూ ఆపేది’.. అంటూ ఓ టీడీపీ నేత గాజులదిన్నె ప్రాజెక్ట్లో తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచిన నీటిని దర్జాగా సాగుకు మళ్లించాడు. టీడీపీ నేత ఘన కార్యాన్ని అధికారులు లీకేజీ పేరుతో దాచేస్తుండటం కొసమెరుపు. జీడీపీ కింద సాగునీటికి కేవలం రబీ సీజన్లో మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. అయితే వర్షాధారం కింద ముందస్తు వేసిన పంటలకు నీరందించేందుకు జీడీపీ నీటిని విడుదల చేయడంపై రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు ఆలస్యమై తాగునీటి సమస్య ఏర్పడితే తమ ‘గోడు’ ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు వాపోతున్నారు. జీడీపీ నుంచి పత్తికొండ, డోన్ తదితర పట్టణాలకు తాగునీటి కోసం విడుదల చేస్తారు. ఓ టీడీపీ నేత శనివారం ఎడమ కాల్వ తూము గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1.1 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాలు కురిసి వరద నీరు జీడీపీలో వచ్చి చేరేంత వరకు ప్రస్తుతం ఉన్న ఈ నీటితోనే తాగునీటి పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. నీటి విడుదల అధికారులకు తెలిసే జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై డీఈ విజయ కుమార్ వివరణ కోరగా.. ప్రాజెక్టు ఎడమ కాలువలో ప్రవహిస్తున్న నీరు లీకేజీ మాత్రమేనని, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. జీడీపీ ఎడమ కాల్వ తూము తెరిచిన టీడీపీ నేత తాగునీటి నిల్వలు సాగుకు మళ్లించిన వైనం -
ఏడుగురు మట్కా బీటర్లు అరెస్ట్
కోడుమూరు రూరల్: మట్కా నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులతో పాటు, ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. కోడుమూరుకు చెందిన బోయ వీరరాజనాయుడు, బోయ రెడ్డి రాజు, లింగ బలిజ విజయకుమార్, బోయ దివాకర్, కల్లపరి నాగేష్, బోయ కాశీతో పాటు, గీత అనే మహిళ పత్తికొండ రోడ్డులోని ఖాళీస్థలంలో మాట్కా ఆడుతుండగా సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నామ న్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 మట్కా చీటీలతో పాటు, రూ.2,30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. యువత మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. -
ఆర్టీ‘ఛీ’ బస్టాండ్
ఉలిందకొండ ఆర్టీసీ బస్టాండ్ దివంగత నేత, మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న హయాంలో తన సొంత గ్రామమైన ఉలిందకొండ ప్రజల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. కానీ ఇప్పుడు బస్సులు లేక ఎక్కడికక్కడే మురికి కుంటలుగా నీరు, బస్టాండ్ అంతా తాగుబోతులకు అడ్డాగా మారింది. మద్యం సీసాలు, గ్లాసులు, చెత్తకుప్పలతో దర్శనమిస్తూ దుర్గంధం వెదజల్లుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం బీవీ మోహన్రెడ్డి కుమారుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. ప్రజల కోసం ఉలిందకొండ బస్టాండ్ను అందుబాటులోకి తీసుకురావాలి . – సాక్షి ఫొటోగ్రాఫర్. కర్నూలుఅపరిశుభ్రంగా.. -
స్పెషల్ ‘అదెసివ్’ స్టాంపుల కొరత
● రిజిస్ట్రేషన్ పత్రాల నకలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ● వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న అధికారులు ● రూ.50 ఈ–స్టాంపు తెచ్చుకుంటేనే నకళ్లు జారీ చేస్తున్న వైనం కర్నూలు(సెంట్రల్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఈ–స్టాంపింగ్ పుణ్యమా అని స్టాంపుల కొరత ఏర్పడలేదు. ఈ స్టాంపింగ్ స్టాక్ హోల్డర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తే తప్పా స్టాంపుల కొరత లేదు. అయితే సబ్ రిజిస్ట్రా ర్, రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నకళ్లు, ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీలను పొందేందుకు అవసరమైన స్పెషల్ అదెసివ్ (ప్రత్యేకంగా అతికించే) స్టాంపుల కొరత ప్రస్తుతం వేధిస్తోంది. దాదాపు ఐదారు నెలల నుంచి ఆ స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖాఽ దికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో రిజిస్ట్రేషన్ పత్రాల నకళ్లు, 1983కు ముందు కంటే ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీలను పొందడానికి వీలు ఉంటుంది. అయితే వాటిని పొందడానికి అదెసివ్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయా పత్రాలను పొందేందుకు నిర్ధేశించిన రుసుంను వసూలు చేస్తున్న అధికారులు స్టాంపుల కొరతను మాత్రం అధిగమించడం లేదు. నకలు పొందాలటే రూ.500, పాత ఈసీలు పొందాలంటే దాదాపు 1200, ఇతర పత్రాలను పొందేందుకు కూడా రూ.500 నుంచి రూ.1000 వరకు రుసుంను వసూలు చేస్తారు. అయితే క్రయ, విక్రయదారులు పొందాలనుకున్న సర్టిఫైడ్ కాపీకి సంబంధించి ప్రత్యేకంగా అంటించే (అదెసివ్) స్టాంపులు లేకపోవడంతో వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. ప్రత్యేకంగా రూ.50 ఈస్టాంపు తెచ్చుకుంటే అవసరమైన కాపీని ఇస్తామని చెబుతున్నారు. దీంతో వినియోగదారుడే మళ్లీ రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే అధికారులు మాత్రం నిర్దేశించిన కాపీకి సంబంధించి మొత్తం రుసుం ఒక పక్క కట్టించుకుని మరో పక్క రూ.50 స్టాంపును అదనంగా కొనుగోలు చేసి తెచ్చుకోవాలని చెబుతుండడంతో మోసపోతున్నారు. కాగా రోజుకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 700–1000 వరకు నకళ్లు, ఈసీలు, ఇతర సర్టిఫైడ్ కాపీల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం వెళ్తుంటారు. దీంతో వారిపై రోజుకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు భారం పడుతుంది. అంటే నెలకు ప్రజలపై రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు అదనపు భారం పడుతుంది. పట్టించుకోని ప్రభుత్వం... స్పెషల్ అదెసివ్ స్టాంపుల కొరతపై ప్రభుత్వం నోరుమొదపడం లేదు. దాదాపు 6 నెలలుగా స్టాంపుల కొరత ఉంది. స్థానిక అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదే సమయంలో క్రయ, విక్రయదారులకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాన్ జుడీషియల్ స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పినా ఒకటి, రెండు నెలలకే స్వస్తి పలికింది. దీంతో ఈ – స్టాంపులే దిక్కయ్యాయి. అయితే ఈ స్టాంపింగ్ స్టాక్ హోల్డర్.. వెండర్లకు అవసరమైన స్టాంపులను సరఫరా చేయడం లేదు. అతను తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్ల ను కట్టిస్తేనే ఈ స్టాంపులు ఇస్తానని షరతు విధించి కొందరికే విక్రయిస్తున్నాడు. దీంతో కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర అప్పుడప్పుడు స్టాంపుల కొరత నెలకొని క్రయ,విక్రయదారులు ఇబ్బందులు పడుతు న్నారు. నెలలో ఐదారు రోజులపాటు స్టాంపుల కొరత కృత్రిమంగా వచ్చినా సర్దుకు పోతున్నారు. -
పర్వతారోహకుడికి అర్సెల్ మిట్టల్ కంపెనీ చేయూత
కర్నూలు(సెంట్రల్): మార్గదర్శి–బంగారు కుటుంబం(పీ4) పథకం కింద పర్వతారోహకుడు గోనెగండ్లకు చెందిన సురేష్కు అర్సెల్ మిట్టల్ కంపెనీ చేయూత ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ఇచ్చిన రూ.4 లక్షల చెక్కును కలెక్టర్ తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పీ4 పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి–బంగారు కుటుంబం ద్వారా పేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజా మహేంద్రనాథ్, అర్సెల్ మిట్టల్ కంపెనీ ప్రతినిధులు లక్ష్మీకాంత్, శ్రీధర్, సీపీఓ హిమప్రభాకర రాజు పాల్గొన్నారు. బస్టాండ్లో వృద్ధుడి మృతి డోన్ టౌన్: స్థానిక కొత్త బస్టాండ్లో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ప్రయాణికులు గుర్తించి ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విద్యార్థి సంఘం నాయకుడు శివన్న విషయం తెలుసుకుని స్ఫూర్తి సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సంస్థ వ్యవస్థాపకులు మధు అక్కడికి చేరుకుని మృతదేహం వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా శ్రీశైలంకు చెందిన వెంకటేష్ నాయక్(52)గా గుర్తించారు. మృతుని కుమారునికి, భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మూడు రోజులుగా బస్టాండ్ ఆవరణలో ఉన్న వృద్ధుడు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. వేలంలో రూ.5.20 లక్షల ఆదాయం బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయంలో తలనీలాల సేకరణ హక్కు కోసం శుక్రవారం నిర్వహించిన బహిరంగవేలం ద్వారా రూ.5.20 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ తెలిపారు. మొత్తం నలుగురు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. అవుకు మండలానికి చెందిన పుల్లయ్య అత్యధికంగా పాడి దక్కించుకున్నట్లు చెప్పారు. పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రారెడ్డి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. జేసీబీని ఢీకొన్న కారు కొలిమిగుండ్ల: స్థానిక తాడిపత్రి రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న జేసీబీని ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. తాడిపత్రి వైపు నుంచి వస్తున్న కారు కొలిమిగుండ్లకు చేరుకోగానే రోడ్డు పక్కనే ఓ హోటల్కు చెందిన బోర్డుతో పాటు ఆగి ఉన్న జేసీబీని బలంగా ఢీకొనడంతో ఇన్నోవా కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. -
వలసబాటలో మృత్యుఒడికి..
ఆదోని రూరల్: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..బల్లేకల్ గ్రామానికి చెందిన గోవింద్కు ముగ్గురు కుమారులు కాగా, హనుమంతు (20) చివరి వాడు. గోవిందు అనారోగ్యంతో గత కొంతకాలం క్రితం మృతిచెందగా.. ఉపాధి నిమిత్తం హనుమంతు హైదరాబాద్ వెళ్లాడు. నిర్మాణంలో ఉన్న 12 అంతస్థుల భవనంలో శుక్రవారం స్లాబ్ వేస్తుండగా కాలు జారి కింద పడ్డాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే గాయపడిన యువకుడిని సమీపంలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన బల్లేకల్కు తరలిస్తున్నారు. అన్ని వర్గాల వారికి రుణాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా రైతులకు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు రుణ సదుపాయం కల్పిస్తామని చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా ఆయన బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొదుపు లక్ష్మి గ్రూపులకు కూడా తక్కువ వడ్డీతో రుణాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేడీసీసీబీ 5వ స్థానంలో ఉందని, తమ హయాంలో మొదటి స్థానంలోకి తీసుకరావడానికి కృషి చేస్తామన్నారు. కాగా.. రోడు ప్రమాదంలో మరణించిన తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ విష్ణువర్దన్రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, డీసీవో ఎన్.రామాంజ నేయులు, డీసీసీబీ సీఈవో రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడికి వరుణుడి దెబ్బ
● గత నెలలో భారీ వర్షాలతో దెబ్బతిన పంట ● పురుగు పట్టడంతో పడిపోయిన డిమాండ్ ● రైతులు, వ్యాపారులకు తీవ్ర నష్టం కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే నెలలో కురిసిన అధిక వర్షాలతో దిగుబడి దెబ్బతినింది. అకాల వర్షాలతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో కాయలు నేలరాయి కోలుకోలేక పోయారు. ఉమ్మడి జిల్లాలో 12,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 2023 – 24లో ఎకరాకు సగటున 8 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఈ సారి ఎకరాకు కేవలం 3–4 టన్నుల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇది కూడా అకాల వర్షాల వల్ల రైతులకు దక్కలేదు. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా... 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల వల్ల మే నెలలోనే మామిడిలో విపరీతంగా పురుగు వచ్చింది. పురుగు ప్రభావం వల్ల ధరలు పతనం అయ్యాయి. దీంతో రైతులకు నష్టాలు భరించక తప్పలేదు. సాధారణంగా మామిడి తోటలను కొంద రు రైతులు పూత రావడానికి ముందే వ్యాపారులకు అమ్మేశారు. అయితే వాతావరణ పరిస్థితులతో మామిడిలో నాణ్య త దెబ్బతినడంతో వ్యాపారులు సైతం నష్టపోయారు. మామిడి టన్ను ధర మామూలుగా అయితే రూ.50 వేలకు పైగా ఉండాల్సి ఉండగా ఈ సారి టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.30 వేలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. -
కోలుకోలేక పంచాయతీ కార్యదర్శి మృతి
గోస్పాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక తేళ్లపురి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బొప్ప సుజాత(31) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 28వ తేదీన విధుల నిమిత్తం తేళ్లపురి గ్రామానికి మరొక పంచాయతీ కార్యదర్శితో కలసి బైక్పై వెళ్తుండగా.. వారి వెనుక వస్తున్న కారు హారన్ కొట్టడంతో భయాందోళనకు గురైన ఆమె బైక్పై నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందు తూ కోలుకోలేక శుక్రవారం ఆమె మృతి చెందారు. పంచాయతీ కార్యదర్శిగా ఆమె మొదట్లో సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పుడు గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శిగా ఉయ్యాలవాడ మండలంలో పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్–4 కార్యదర్శిగా గోస్పాడు మండలం కానాలపల్లెలో పని చేశారు. అనంతరం జరిగిన బదిలీల్లో తేళ్లపురి గ్రామంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు, ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, పీఎస్లు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఎంపీడీఓ అమానుల్లా రూ.15 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట ఈఓఆర్డీ నాగఅనసూయ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
పేకాటరాయుళ్ల అరెస్టు
కోసిగి: మండలంలోని పెద్దభూంపల్లి గ్రామ శివారులోని కోసిగి ఆంజనేయ పొలంలో వేప చెట్టుకింద పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేశామని కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందుతులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బలోని హనుమంతు, చిన్న ఉశేని, శివకుమార్, నాగరాజు, చాకలి శివకుమార్, రమేష్, కల్లూరి పద్మయ్య, నాగేంద్ర, జింకల మదసాబ్, మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి చెందిన వడ్డే నరసింహ, ఖాసిం, షేక్ వహాబ్, ఐరన్గల్ గ్రామానికి చెందిన తారాపురం రంగయ్య, జంపాపురం గ్రామానికి చెందిన చిదానంద, సి.బెళగల్ గ్రామానికి చెందిన వీరేష్ పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.52 వేల నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ఫోన్లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. 6 ద్విచక్ర వాహనాలు, 7సెల్ ఫోన్లు సీజ్ రూ. 52వేల నగదు స్వాధీనం -
జనని బ్యాంకు పేరుతో మోసం
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు ● ఇద్దరు అరెస్ట్, రిమాండ్కు తరలింపు కోవెలకుంట్ల: ఎక్కువ వడ్డీ ఆశ చూపి ప్రజలు సొమ్మును డిపాజిట్ల రూపంలో కట్టించుకుని చివరకు ఓ సంస్థ బోర్డు తిప్పేసి ఖాతాదారులను మోసం చేసింది. ఈ ఘటన కోవెలకుంట్లలో చోటు చేసుకుంది. సీఐ హనుమంతునాయక్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్ల పట్టణం గడ్డవీధికి చెందిన గువ్వల పద్మావతి మరికొంత మందితో కలిసి 2021లో స్థానిక ఓంశాంతి భవన సమీపంలో జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని, డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని నమ్మబలికించారు. వీరి మాటలు నమ్మి కోవెలకుంట్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల కు చెందిన ప్రజలు ఇందులో ఖాతాదారులుగా చేరి లక్షలాది రూపాయాలు డిపాజిట్ల రూపంలో జమ చేశారు. డిపాజిట్లు చేసిన కొంత మందికి లోన్ల రూపంలో డబ్బులు అందజేశారు. ఖాతాదారులు జమ చేసిన సొమ్మును స్వాహా చేసేందుకు కుట్రపన్ని సంస్థకు సీఈఓగా ఉన్న వెంకటరమణ తన వ్యక్తిగత ఖాతాకు నగదు బదిలీ చేయించున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాదారుల బాండ్లకు గడవు తీరిపోవడంతో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు సొసైటీ వద్దకు వెళ్లగా సంస్థ యాజమాన్యం బోర్డు తిప్పేయడంతో బాధితులు ఈ నెల 4వ తేదీన కోవెలకుంట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు ఖాతాదారులు రూ. 13.45 లక్షలు డిపాజిట్లు చేసి మోసపోయినట్లు గుర్తించారు. ఇంకా ఎవరైనా సొసైటీలో డబ్బులు జమ చేసి బాండ్ల కాల పరిమితి తీరిపోయి ఉంటే పోలీసులను సంప్రదించాలని సీఐ పేర్కొన్నారు. డిపాజిట్లపై లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని ఖాతాదారులు కూడా ఈ కేసులో నిందితులవుతారని, తీసుకున్న డబ్బులను వెంటనే కట్టాలని హెచ్చరించారు. కేసులో నిందితులైన గువ్వల పద్మావతి, ఆకుల భరద్వాజ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ వివరించారు. -
మాకింత.. మీకింత..
● ఉపాధిలో మితిమీరిన అక్రమాలు ● 50 శాతం పైగా దొంగ హాజరు ● వారంలో చేసిన పని ఆధారంగా ముడుపులు ● ఫీల్డ్ అసిస్టెంట్లపై ఏపీఓ, ఈసీ, టీఏల ఒత్తిడి ● పాత ఫాంపాండ్స్కే మెరుగులు వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ మా కుటుంబంపై వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ఉపాధి పనులు కల్పించడం లేదు. ఫీల్డ్ అసిస్టెంటు, ఏపీఓను కలిసినా ఫలితం లేకపోయింది. ఉపాధి పనులు కల్పించడంలో రాజకీయాలు చూడరాదు. ఒక పార్టీ, ఒక వర్గానికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ పనుల్లేక, ఉపాధి పనులు దక్కక ఇబ్బందులు పడుతున్నాం. – సుభాన్, ఉపాధి కూలీ, గుడికంబాలి, కౌతాళం మండలం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఉపాధి పనులకు వచ్చిన వారికి మాత్రమే మస్టర్లు వేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. దొంగమస్టర్లకు తావు లేకుండా తనిఖీలను ముమ్మరం చేశాం. ఫాంఫాండ్స్ తవ్వకాల్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతాం. – వెంకటరమణయ్య, పీడీ, డ్వామా, కర్నూలు ● మంత్రాలయం నియోజకవర్గంలో ఓ మండలానికి ఈసీ ఇన్చార్జి ఏపీఓగా వ్యవహరిస్తున్నాడు. వారానికి లక్ష రూపాయల పని జరిగితే రూ.20 వేలు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. మాకు ఇచ్చేది ఇచ్చి, మీరు ఎంతైన సంపాదించుకోండని ‘అవినీతి’ సలహా ఇస్తున్నాడు. లేదంటే ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేరని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సంజామల మండలం ఆకుమల్లలో మస్టర్ నెం.4513కి అప్లోడ్ చేసిన ఫొటోకర్నూలు(అగ్రికల్చర్): కూటమి నాయకులు ఉపాధి హామీ పనులను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే అప్పటి వరకున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ అనుచరులకు పట్టం కట్టారు. అది కూడా బేరం పెట్టి మరీ నియామకాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తమ చెల్లించుకున్న మొత్తాన్ని రాబట్టుకునే దిశగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు ఏపీఓల వరకు అన్ని కేటగిరీల ఉద్యోగులు అవినీతిలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో 50 శాతం పైగా దొంగమస్టరు వేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి వారానికి లక్షకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరగుతోంది. కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, హొలగొంద, ఓర్వకల్, క్రిష్ణగిరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు మండలాల్లో అవినీతి తంతు మితిమీరింది. టీడీపీకి చెందిన వారి ఇంట్లో ముగ్గురు, నలుగురు వరకు పనికి రాకపోయినప్పటికీ మస్టరు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఉపాధి పనులకు 97వేల మంది వరకు హాజరువుతున్నట్లు లెక్కలు ఉండగా.. వాస్తవానికి 40వేల మంది కూడా రావడం లేదని తెలుస్తోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో.. 50 శాతంపైగా దొంగమస్టరు వేస్తున్నట్లు సమాచారం. పాత పనులకే మెరుగులు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫాంపాండ్ తవ్వకాలకు పెద్దపీట వేశారు. అయితే గతంలో తవ్విన ఫాంపాండ్లకు మెరుగులు దిద్ది వందల మంది కూలీలు పనిచేసినట్లు మస్టరు వేసి ఒక్కో కూలీ పేరిట రోజుకు రూ.307 స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయం, పత్తికొండ, డోన్ నియోజక వర్గాల్లో ఈ తంతు పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ఏడాది ఒక్క కర్నూలు జిల్లాలోనే 8,500 ఫాంపాండ్లు తవ్వాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 2వేల వరకు ఫాంపాండ్లు తవ్వారు. ఇందులో 75 శాతం పాత వాటికి మెరుగులు దిద్దినవే ఉన్నట్లు స్పష్టమవుతోంది. పండ్లతోటల అభివృద్ధిలో అంకెల గారిడీ ● 2023–24 సంవత్సరంలో ఈ–క్రాప్ ప్రకారం 11,202 ఎకరాల్లో పండ్లతోటలు ఉన్నాయి. ● 2024–25లో ఉపాధి నిధులతో 4,150 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు అంకెల ద్వారా తెలుస్తోంది. ● మరోవైపు ఉద్యాన శాఖ కూడా దాదాపు 1000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు స్పష్టమవుతోంది. ● ఈ ప్రకారం 2024–25లో పండ్లతోటల సాగు భారీగా పెరుగాలి. ● ఈ–క్రాప్ ప్రకారం 2024–25లో 11,650 ఎకరాల్లో పండ్లతోటల సాగు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ● 2023–24తో పోలిస్తే 2024–25లో కేవలం 448 ఎకరాల్లోనే పండ్లతోటల సాగు పెరగడం గమనార్హం. ● ఈ విషయంలో నిధులు భారీ ఎత్తున స్వాహా అవుతుండగా.. నిర్వహణ(మెయింటెనెన్స్) బిల్లులు దారి మల్లుతున్నట్లు తెలుస్తోంది. సంజామల మండలం రెడ్డిపల్లెలో ప్రతి రోజు ఉపాధి హామీ పనులకు రాకపోయినా దాదాపు 50 మంది కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ తమకు అనుకూలమైన వారికి హాజరు వేస్తున్నట్లు సమాచారం. స్థానిక టీడీపీ వర్గీయులు పనికి రాకపోయినా హాజరు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తాము వారం రోజులు పనిచేస్తే రెండు రోజులేచూపుతున్నారని, ఇంటి దగ్గర ఉన్న వారికి లబ్ధి చేకూరుస్తున్నారని పలువురు ఉపాధి కూలీలు వాపోతున్నారు. కౌతాళం మండలం చూడి గ్రామంలో (వర్క్కోడ్: 0213001007/ ఐసీ/19185010164922)ఉపాధి పనికి కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. అయితే పీల్డ్ అసిస్టెంట్ మాత్రం ఏకంగా 28 మంది ఉపాధి పనికి వచ్చినట్లు మస్టర్(హాజరు) వేశాడు. అంటే రికార్డు స్థాయిలో 24 మంది పేర్లతో దొంగ మస్టర్లు వేయడం గమనార్హం. .. ఉపాధి హామీ పథకంలో మితిమీరిన అవినీతికి ఈ రెండూ తాజా ఉదాహరణలు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, అధికార టీడీపీ నేతల జోక్యం అధికమవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోపిడీ కొనసాగుతోంది. -
త్యాగానికి ప్రతీక ‘బక్రీద్’
కర్నూలు కల్చరల్: త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ను జరుపుకుంటారు. త్యాగమయ జీవితమే మానవ జన్మకు సార్థకమన్న అల్లాహ్ ఆదేశాలు పాటించడమే ఈ పండుగ ఉద్దేశం. ఈ వేడుక రోజే సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో హజ్ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ముస్లింలు ఈ పండుగను సంబరంగా చేసుకుంటారు. పండుగ ఇలా.. పండుగ రోజు ప్రతి ముస్లిం శుద్ధి స్నానం చేసి, కొత్త దుసస్తులు వేసుకొని వజూ చేసుకొని, ‘అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్. లాయిలాహ ఇల్లల్లా. అల్లహు అక్బర్. అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్’. అంటూ తజ్వీ చదువుంకుంటూ ఈద్గాహ్లకు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఖాజీ, మౌల్వీ, మౌలానా, హఫీజ్, ఇమామ్ చేత సహపంక్తి సమాజ్ చేసిన తరువాత అరబ్బీ ఖుద్బాహ్, ఉర్దూ బయాన్ చదువుతారు. పండుగ ఎప్పుడు ఎలా ఏర్పడింది.. ఎందుకు చేసుకుంటారనే విషయాలు మత పెద్దలు చెబుతారు. ప్రవక్త ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఆయన తనయుడు ఇస్మాయిల్ జబీవుల్లా మధ్య జరిగిన వాస్తవ ఘటన మేరకు ఏర్పడిన ఈ పండుగ రోజున ముస్లింలు చేయాల్సిన మంచి, పుణ్య కార్యాలను వివరిస్తారు. అనంతరం దువా చేసి, సర్వ మానవాళి మంచి కోసం అల్లాహ్ను ప్రార్థిస్తారు. సమాజంలో చెడు అంతం కావాలని వేడుకుంటారు. దువా పూర్తయ్యాక ఒకరినొకరు ‘ఈద్ ముబార్’ చెప్పుకొని అలింగనం చేసుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని ఇంట్లో చేసుకున్న ‘దూద్ సేమియా, షీర్ ఖుర్మా, కద్దూ ఖీర్, ఖుబానీక మిఠ’ లాంటి తీయ్యని వంటకాలతో వేడుక చేసుకుంటారు. నేడు ఈద్ – ఉల్ –జుహా (బక్రీద్) పండుగ నిర్వహణకు ఏర్పాట్లుశాంతియుతంగా .. పండక్కి ఒక రోజు ముందు ఉపవాసం (రోజా) ఉంటారు. పండుగ రోజున ఈద్ నమాజ్ చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు ఎలాంటి ఆహారం, నీళ్లు తాగకుండా ఉపవాసం ఉంటే రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత ముక్తి కోసం ఖుర్బానీ ఇచ్చి, ఇతరులకు పంచి పెట్టి భక్తి చాటుకుంటారు. ఈ పండుగను ఘనంగా శాంతియుతంగా జరుపుకునేందుకు మత పెద్దలు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల వక్ఫ్, అధికారులు ఈద్గాహ్లల్లో తగిన సదుపాయాలు కల్పించారు. -
ఉలిక్కిపడ్డ మీదివేముల
రమేష్నాయుడిది ముమ్మాటికీ రాజయకీయ హత్యే! ● అధికార పార్టీ నాయకులే హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆరోపణ ● నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్పాణ్యం: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడు హత్యతో ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం ఉలిక్కి పడింది. మృతుడు కర్నూలు మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి ప్రధాన అనుచరుడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందినా, మీదివేముల గ్రామంలో వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చింది. గ్రామంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతోనే ఆ పార్టీ వర్గీయుడైన, స్థానికంగా ప్రజల్లో పట్టు ఉన్న రమేష్ను టీడీపీ వర్గీయులే మట్టుపెట్టి ఉంటారనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా రమేష్నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇదిలాఉంటే హత్యోదంతంపై మృతుని భార్య ఆరుగురు టీడీపీ వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. కాటసానితో పాటు కర్నూలు మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి గురువారం రాత్రే మీదివేముల గ్రామం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్పటేల్తో ఘటనపై చర్చించారు. అధికారి పార్టీ నాయకుల కుట్రే: కాటసాని రమేష్నాయుడు హత్య ముమ్మాటికీ రాజకీయ కారణాలతో జరిగిందేనని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో హత్యలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రామేష్నాయుడిని రాజకీయంగా ఎదుర్కొలేకనే హత్య చేశారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగానికి ఈ హత్య మరో ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు రమేష్నాయుడిపై దాడులకు తెగబడ్డారని, ఈ విషయాన్ని తాము పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ప్రాణం పోయిందన్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎస్పీ విక్రాంత్పాటిల్ను కోరామన్నారు. రమేష్నాయుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామన్నారు. -
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
● తొలి రోజు 88.21 శాతం హాజరు కర్నూలు కల్చరల్: ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 88.21 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఒక్కొక్కటి, కర్నూలు నగరంలో మూడు.. మొత్తం ఐదు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్లో 762 మందికి 673 హాజరు కాగా 89 మంది గైర్హాజరయ్యారు. 88.32 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం సెషన్లో 756 మందికి 666 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరు కాగా 88.10 శాతం హాజరు నమోదైంది. రెండు సెషన్లలో 88.21 హాజరు శాతం నమోదైంది. జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. డీఎస్సీ పరీక్షలు 30వ తేదీ వరకు జరుగుతాయని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆదేశించారు. -
సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా రాధిక
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా బి.రాధికను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు, డీఎస్డబ్ల్యూఓలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న రాధికను ఇక్కడకు బదిలీ చేశారు. రెండు నెలల క్రితం ఇక్కడ రెగ్యులర్ జేడీగా విధులు నిర్వహించిన జె.రంగలక్ష్మిదేవి అమరావతి డైరెక్టరేట్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఆలూరు: ఆలూరు మూడో సచివాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ ఎంపీడీఓ, ఆలూరు ఈఓ వై.ప్రభాకర్రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు సకాలంలో హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వారికి నో టీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పని సరిగా 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేదంటే జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గురుకులాల్లో సీటు ఖరారు చేసుకోండి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు వెంటనే తమ సీటు ఖరారు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి కోరారు. ఇటీవల నిర్వహించిన 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన వారికి ఎంపిక ప్రక్రియ జరుగుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని డీసీఓ కోరారు. మొదటి జాబితాలో అర్హత పొందిన వారు వెంటనే ప్రవేశం పొందాలని, లేనిపక్షంలో వారికి ప్రవేశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాను వెంటనే విడుదల చేస్తామన్నారు. రూ.1.18 లక్షల విరాళం మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిమళ విద్యానికేతన్కు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన దివిజ హన్విక అనే భక్తురాలు రూ. 1.18 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆమెకు శేష వస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల కర్నూలు కల్చరల్: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 8న పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. మెరిట్ కార్డులు www. bse.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి విద్యార్థి ఆధార్ను లింక్ చేయించి డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
రాజకీయంగా ఓర్వలేకనే హత్య
కర్నూలు: రాజకీయంగా ఓర్వలేకనే టీడీపీ వర్గీయులు తన భర్త రమేష్ నాయుడును హత్య చేశారని భార్య లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు(45)ను గురువారం రాత్రి ప్రత్యర్థులు అతి కిరాతకంగా హత్య చేయడం తెలిసిందే. రమేష్ నాయుడు భార్య లక్ష్మిదేవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం కర్నూలు రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మేడం రామాంజినేయులు, మేడం తిరుపాలు, మేడం నాయుడు, మేడం శ్రీనివాసులు, మేడం రాజు, బుగ్గ రాముడులపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇరు వర్గీయుల ఫోన్కాల్ డేటాను విశ్లేషిస్తున్నామని, రెండు రోజుల్లో హత్యకు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ శ్రేణులు మార్చురీ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. పోలీసులకు రమేష్ నాయుడు భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు ఆరుగురిపై కేసు నమోదు -
అర్ధరాత్రి వరకు పదోన్నతుల కౌన్సెలింగ్
● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్నూలు కల్చరల్: జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలకు) ప్రైమరీ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రకియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో కౌన్సెలింగ్ ప్రకియ జరిగింది. ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి 636 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సీనియారిటీ జాబితాలో 1 నుంచి 1000 వరకు ఉన్న ఎస్జీటీలను ఆహ్వానించారు. అర్థరాత్రి వరకు పదోన్నతుల ప్రక్రియ జరిగింది. చాలా మంది ఉపాధ్యాయులు నాట్ విల్లింగ్ ఇవ్వడంతో మరుసటి రోజు కూడా పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల డీఈవో ఎస్.శామ్యూల్పాల్, జనార్దన్రెడ్డి పదోన్నతుల ప్రక్రియను పర్యవేక్షించారు. ఏడీలు సుధాకర్రెడ్డి, అసదుల్లా ఖాన్, సూరింటెండెంట్లు సునీల్, లక్కే నాయక్ పాల్గొన్నారు. -
ఫెయిలైంది ప్రభుత్వమే!
కర్నూలు కల్చరల్: పదో తరగతి మూల్యాంకనంలో ఫెయిలైంది విద్యార్థులు కాదని ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్ అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎస్యూ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో డిప్యూటీ ఈవో భూషణ్, ఏడీ అసదుల్లా ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఎలాంటి ఫీజులు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు పదో తరగతి మార్కుల ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపేయాలన్నారు. మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు మణిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయికుమార్, నగర అధ్యక్షులు అన్సూర్, నాయకులు సంతోష్, మధుమోహన్, హేమంత్, సృజల్ తదితరులు ఉన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
కోడుమూరు రూరల్: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఇన్చార్జ్ సీఐ మన్సురుద్దీన్ విలేకరులకు వెల్లడించారు. కోడుమూరుకు చెందిన గుజరాతి వినోద్కుమార్, మాదిగుండు వేణుగోపాల్, కోసూరు సోమశేఖర్, పలవారి భాస్కర్రెడ్డి ఈనెల 3న జరిగిన ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను టీవీలో చూస్తూ సెల్ఫోన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా ఎస్ఐ ఎర్రిస్వామి తన సిబ్బందితో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తేలడంతో బెట్టింగ్లో పెట్టిన రూ.3,40,000 నగదు, నాలుగు సెల్ఫోన్లను సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. బెట్టింగ్ రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ ఎర్రిస్వామి, ఏఎస్ఐ శంకర్నాయక్, హెడ్కానిస్టేబుళ్లు మద్దేశ్వర్, మహబూబ్బాషా, మురారి, కానిస్టేబుళ్లు జగదీష్, విజయకుమార్, భాస్కర్, ఓంకార్లను సీఐ అభినందించారు. రూ.3,40,000 నగదు స్వాధీనం -
మొక్కలు నాటి సంరక్షించండి
వెల్దుర్తి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మైనింగ్ శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) రవిచంద్ సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన రాయలసీమ జోన్ విజిలెన్స్ స్క్వాడ్ ఏడీ వెంకటేశ్వర్లుతో కలిసి మండల పరిధిలోని బోయనపల్లె కాంతారెడ్డి ఇరన్ ఓర్ మైన్లో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ భూమిపై ప్రతి జీవి మనుగడకు చెట్లు ఆధారమన్నారు. ప్రకృతిలో భాగమైన చెట్ల ద్వారానే మనిషికి శ్వాస, ఆహారం, ఆరోగ్యం, ఆనందం దొరుకుతుందన్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. -
మత్తు పదార్థాలను అరికట్టాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మత్తు పదార్థాల సాగు, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో గంజాయిసాగు, రవాణా, నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకంపై జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్తో కలిసి అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సహరించాలన్నారు. హెల్త్, ఎకై ్సజ్, మునిసిపల్ శాఖలు తమ ప్రతి కార్యక్రమంలో ఈ అంశాన్ని ఎజెండగా చేర్చుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ వినియోగించినా, గంజాయి సాగు చేసినా సంబంధిత వీఆర్వోతోపాటు సర్పంచ్లపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహరించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ముద్రించిన పోస్టర్లను సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. జనరల్హాస్పిటల్లో ఉన్న డిఅడిక్షన్ సెంటర్కు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిఅడిక్షన్ సెంటర్లో టెస్టింగ్ కిట్స్ లేకపోతే వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ తీసుకోవడంతో కలిగే దుష్పరిమాణాలను గోడల మీద రాయించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పంట సీజన్ మొదలవడంతో గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 7 ఎన్డీపీపీఎస్ కేసులను గుర్తించామన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర రవీంద్రబాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
కౌలు రైతు ఆత్మహత్య
దేవనకొండ: మండలంలోని వెలమకూరు గ్రామ సమీపంలో కౌలు రైతు బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన బోయ హరిబాబు(36) వెలమకూరు గ్రామంలో ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ అక్కడే కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగా పండక సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని చెల్లించే మార్గంలేక గ్రామ శివారులోని జమ్మి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారు గొలుసు అపహరణ కర్నూలు (అర్బన్): నగరంలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలోని టెలికాం నగర్లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సుశీలమ్మ తమ ఇంటికి సమీపంలోని టైలర్ షాప్నకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో అదే దారిలో నడుచుకుంటూ వచ్చిన అగంతకుడు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మందుబాబులకు జైలు శిక్ష మంత్రాలయం రూరల్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన నలుగురికి ఎమ్మిగనూరు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ జరిమానా విధించారు. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మద్యం తాగుతూ రాఘవేంద్రపురానికి చెందిన మల్లికార్జున, హనుమంతుతో పాటు నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన రాముడు, దాసరి మల్లికార్జున పట్టుబడ్డారు. గురువారం వారిని కోర్టులో హాజరు పర్చగా ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించిన్నట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు. వైద్యం కోసం వెళ్తూ మార్గమధ్యంలో.. బండి ఆత్మకూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యలో మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెలుగోడు మండల కేంద్రలోని గాంధీనగర్కు చెందిన హుసేన్బాషా (33) పాత ఇనుము సామగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గురువారం హుసేన్బాషాను తీసుకుని ద్విచక్రవాహనంపై చికిత్స నిమిత్తం నంద్యాలకు బయలుదేరారు. బండి ఆత్మకూరు గ్రామ సమీపానికి చేరుకోగానే అతడిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
వెండర్ టెండర్.. రూటే సప‘రేటు’
● స్టాంపులు కావాలంటే రిజిస్ట్రేషన్ చలానాలు తన ఖాతా మీద కట్టించాలని షరతు ● కట్టకపోతే స్టాంపులు ఇవ్వకుండా వేధింపులు ● రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు నాన్ జ్యుడీషియల్.. ఇటు ఈ–స్టాంపులు దొరక్క విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు కర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం జిల్లాల(మార్కాపురం నియోజకవర్గం)కు సంబంధించిన ఈస్టాంపింగ్ వెండర్ టెండర్ను నర్సిరెడ్డి దక్కించుకున్నారు. అతడు తన వెండర్ ద్వారా క్రయ, విక్రయాదారులకు ఈస్టాంపులను సరఫరా చేయాల్సి ఉంది. అయితే తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ–స్టాంపులు, చలాన్ల విక్రయాలకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లిస్తుంది. అయితే ఈ–స్టాంపింగ్ల కంటే చలాన్లపైనే అతడికి కమిషన్ ఎక్కువగా ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో తన దగ్గర ఈ–స్టాంపులు కావాలంటే రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను కూడా తన ఖాతా పేరిట కట్టించాలని షరతు విధిస్తున్నాడు. దీంతో కొందరు కొన్ని చలాన్లను కట్టించైనా తీసుకెళ్తున్నారు. కొందరు ఏమీ కట్టించకుండా స్టాంపులను కొనుగోలు చేసేందుకు వస్తుండడంతో కొర్రీ వేస్తున్నాడు. నాలుగు జిల్లాలపై దాదాపు 150 మందికి పైగా వెండర్లు ఉంటారు. వారందరూ అతని బాధితులే. పెండింగ్లో రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ఈ–స్టాంపింగ్ వెండర్ కోసం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వారికి వెండర్ పర్మిషన్ను అతడే ఇవ్వాలి. అయితే వచ్చిన అర్జీలను అతడు తొక్కి పెట్టి ఉన్న వెండర్లలో కొందరికి ఈస్టాంపులు ఇచ్చి మిగతా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా దరఖాస్తుదారులు వచ్చి తమ రిజిస్ట్రేషన్ పని ఎంత వరకు వచ్చిందని అడిగితే కనీస సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. నర్సిరెడ్డి వ్యవహారంపై కొందరు రిజిస్ట్రేషన్ శాఖ ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు, డీఐజీలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోంది. కొన్ని సమయాల్లో కృత్రిమ కొరత.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సమయాల్లో స్టాంపుల కొరత వస్తూ ఉంటోంది. ఇందుకు కారణం అటు ప్రభుత్వం నాన్జ్యుడీషియల్ స్టాంపులను సరఫరా చేయకపోవడం..ఇటు ఈస్టాంపింగ్ స్టాక్ హోల్డర్ తన స్వార్థంతో ఈస్టాంపులను సక్రమంగా సరఫరా చేయకపోవడమేనని తెలుస్తోంది. నెలలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఒక్కోసారి దాదాపు ఐదారు రోజులు స్టాంపుల కొరత ఏర్పడుతుంది. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అయితే వారంలో ఒక్కరోజైనా స్టాంపుల కొరత ఉంటుందని బాధితులు వాపోతున్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తులతో పోటెత్తింది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, ఆ తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణభోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తులు బారులు తీరారు. 9న విత్తనాల కోసం ఆందోళన కర్నూలు(సెంట్రల్): రైతులకు నాణ్యమైన విత్తనాలను 90 శాతం సబ్సిడీపై సరఫరా చేయాలని కోరుతూ జూన్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం తెలిపారు. గురువారం కర్నూలులోని సీఆర్ భవన్లో ఆందోళన కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్లు ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడినా విత్తనాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వకుండా జాప్యం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ అధికారిగా కొండయ్య కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమం, సాధికారత అధికారిగా శ్రీశైలం ప్రాజె క్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా విధులు నిర్వ హిస్తున్న పి.కొండయ్యకు ఇన్చార్జి బాధ్య తలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ శాఖకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి దేవి ఇన్చార్జ్గా వ్యవహరించారు. డీఐఈఓకు ఆర్ఐఓ బాధ్యతలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ జిల్లా వృత్తి విద్యాధికారిగా పని చేస్తున్న డా.సి. సురేష్ బాబును జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా నియమిస్తూ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి (ప్రస్తుతం ఈ పోస్టును డీఐఈఓగా మార్పు చేశారు)గా పని చేస్తున్న జీవీఎస్ గురువయ్య శెట్టి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు లాలెప్ప, పరమేశ్వరరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 835 అడుగులు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 835 అడుగులకు చేరుకుంది. బుధవారం నుంచి గురువారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 19,785 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 4,598 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కుడిగట్టు కేంద్రంలో 0.906, ఎడమగట్టు కేంద్రంలో 0.842 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 867 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 55.0470 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలి కర్నూలు(సెంట్రల్): కరోనా సమయంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 7,8 తేదీల్లో సంతకాల సేకరణ, 9న రైల్వే స్టేషన్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
జిల్లాలో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ
● అనేక మందికి వ్యాధి లక్షణాలు ● జీజీహెచ్ను ఆశ్రయిస్తున్న రోగులు ● జేఎన్1 వైరస్గా అనుమానం ● ఇప్పటికే 20 పడకలతో ప్రత్యేక వార్డు ● నామమాత్రంగా కోవిడ్ పరీక్షలు ● వంద పరీక్ష కిట్లతో సరిపెట్టిన ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య అధికంగానే ఉంటోంది. నాలుగైదేళ్ల క్రితం ఆ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ప్రాణాలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని రంగాలను కుదేలు చేసింది. దీని దాటికి ఎన్నోవేల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లక్షలాది మంది తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. చికిత్స చేయడానికి కనుచూపు మేరలో డాక్టర్ కనిపించని పరిస్థితి. ఉన్నా ఆసుపత్రిలో పడకలు లభించని దుస్థితి. ఇలాంటి వైరస్ మళ్లీ వస్తోందన్న ప్రతిసారీ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఇప్పుడు కూడా వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు ఏవీ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం.కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ మహమ్మారి మరోమారు భయపెడుతోంది. ఈ విషయంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో అధికారులు నోరు మెదపని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విస్తరిస్తున్న జేఎన్–1 వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భరోసా కల్పిస్తున్నా.. ఎప్పుడు ఎలా విజృంభించి ప్రాణాలను తీస్తుందోననే భయం వెంటాడుతోంది. ప్రజలు కోవిడ్ బారిన పడితే చికిత్స అందించేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నా.. నామమాత్రమేనని తెలుస్తోంది. ఆసుపత్రిలోని పాత గైనిక్ విభాగంలో 20 పడకలతో కోవిడ్ వార్డుగా మార్పుచేసి.. ప్రతి పడకకూ ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఆసుపత్రిలోని పూర్వ ఐడీ వార్డులో ఏర్పాటు చేసిన నెగిటివ్ ప్రెజర్ రూమ్ నిరుపయోగంగా ఉంది. గతంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకులు పనిచేస్తున్నాయో లేదో కూడా ఇప్పటి వరకు తెలుసుకోని పరిస్థితి. అప్పటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పనిచేయడం లేదని సమాచారం. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ సరిపోతుందనే భావనలోనే అధికారులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కోవిడ్ లక్షణాలతో ఇటీవల పలువురు రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరికి ఉన్న లక్షణాలను గుర్తించిన వైద్యులు కోవిడ్గా నిర్ధారించి చికిత్స రాసి పంపుతున్నారు. అంతేగానీ లక్షణాలతో వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించడం లేదు. తప్పనిసరైతే తప్ప రోగులకు కోవిడ్ కిట్ల ద్వారా పరీక్షించకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రికి వంద టెస్ట్ కిట్లను మాత్రమే పంపడం చూస్తే కోవిడ్ను అడ్డుకోవడంలో ఎంతటి చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది. కోవిడ్ లక్షణాలతో వచ్చిన వారిని గతంలో ప్రత్యేకంగా ఓపీ నెం.99ను క్రియేట్ చేసి అందులో పరీక్షించేవారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు లేవు. జనరల్ ఓపీల్లో సాధారణ రోగుల తరహాలోనే పరీక్షిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పీహెచ్సీల్లో కానరాని ఏర్పాట్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వస్తోందంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కోవిడ్ను ప్రాథమికంగా నిర్ధారించేందుకు కనీసం ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి రోగులకు యాంటిబయాటిక్స్, పారాసిటమాల్, స్టెరాయిడ్స్ ఇచ్చి పంపుతున్నారు. గతంలో జిల్లాలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, అందరికీ ఇమ్యూనిటి వచ్చి ఉంటుందని, కాబట్టి ఎలాంటి కోవిడ్ వైరస్లు వచ్చినా ఏమీ కాదనే ధీమాలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా కోవిడ్ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడవద్దని, ప్రకటనలు కూడా ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఏడుగురికి పాజిటివ్ ● ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధునికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నాడు. ● మంత్రాలయం మండలం పారందొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్ నిర్ధా రణ కావడంతో ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు. ● కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న 54 ఏళ్ల ఓ వైద్యురాలు కోవిడ్ బారిన పడ్డారు. ఈమె హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ● కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్లకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలుకు చెందిన 20 ఏళ్ల యువతికి, అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి గురువారం పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఒక పీజీ వైద్య విద్యార్థిని ఉన్నారు. 5,709 60 ఏళ్లు పైబడిన వృద్ధులు165 16ఏళ్లలోపు యువకులు 1,037 పాజిటివ్ డయాలసిస్ పేషెంట్లు9,939 16–60 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు 1.45 లక్షలు ఉమ్మడి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కోవిడ్ బాధితులు876 రెండు వేవ్లలో మరణాలుకర్నూలు పెద్దాసుపత్రిలో కోవిడ్ కేసులు ఇలా.. సంవత్సరం కేసులు 2020 6,607 2021 9,206 ( గమనిక: 2022లో మూడో వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. )897 పాజిటివ్ గర్భవతులు -
అప్కాస్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అప్కాస్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అప్కాస్ ఇంజినీరింగ్ ఉద్యోగులు 30 రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రెండు రోజుల క్రితం సమ్మె బాట పట్టారు. ఈ మేరకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వారికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్కాస్ కింద పనిచేసే ఉద్యోగులకు రూ.13 వేల వేతనం మాత్రమే చెల్లిస్తుండటం దారుణమన్నారు. రేషన్ కార్డులు మంజూరు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇతర సిబ్బందికి లభిస్తున్న 69 సెలవులను మంజూరు చేయాలన్నారు. ఉద్యోగంలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్వీ వెంట వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి షరీఫ్, మైనార్టీ నగర అధ్యక్షుడు పట్టా బాషా కంటూ, బాబు, మధు, శివ తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ -
‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు
వైఎస్సార్సీపీ పాలనలో పూర్తయిన పనులు ప్యాకేజీ పూర్తయిన అంచనా మొత్తం నెంబర్ పనులు (రూ.లక్షల్లో) 40 23 రూ.3,663.60 41 35 రూ.4,333.99 42 10 రూ.1,851.33 43 06 రూ.596.03 44ఏ 01 రూ.1,503.74 44సీ 01 రూ.870.10 మొత్తం 76 రూ.12,818.79గత ప్రభుత్వంలో రూ.295.64 కోట్లతో ప్రారంభం ● 139 పనుల్లో ఏడాది క్రితమే 76 పూర్తి ● మిగిలిన పనులు పూర్తి చేయని కూటమి ప్రభుత్వం ● సేఫర్ స్టేజ్ ముసుగులో కాలయాపన ● రూ.196 కోట్ల పనులను రూ.51 కోట్లకు కుదింపుకర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు(ఏపీఆర్ఆర్పీ) కింద చేపట్టిన గ్రామీణ రోడ్ల పనుల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఈ పనులను పూర్తి చేయలేక, ‘సేఫర్ స్టేజ్’ పేరిట కాలయాపన చేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలో రూ.295.64 కోట్లతో 19 ప్యాకేజీల్లో 139 పనులను చేపట్టారు. ఇందులో 329.77 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, పలు బ్రిడ్జీలు నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మొత్తం పనుల్లో రూ.12,818.79 లక్షల అంచనాతో రూపొందించిన 76 పనులు పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి అప్పట్లోనే రూ.5,946.79 లక్షల బిల్లులను కూడా చెల్లించారు. ఇంకా చేసిన పనులకు సంబంధించి రూ.2,761.48 లక్షల బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ బిల్లులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన 63 పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనులను పూర్తి చేయలేక ‘సేఫర్ స్టేజ్’ పేరిట పలు కారణాల వల్ల ప్రారంభం కాని పనులను నిలుపుదల చేస్తూ, పురోగతిలో ఉండి ఆగిపోయిన పనులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మాత్రమే చేపట్టేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.19,695.32 లక్షలతో పూర్తి చేయాల్సిన పనులను రూ.5,164.98 లక్షలకు కుదించి ప్రతిపాదనలు పంపారు. అయితే నెల రోజులు కావస్తున్నా ఈ పనులకు కూడా ఆమోదం లభించని పరిస్థితి నెలకొంది. రద్దయిన 29 పనులు ఏపీఆర్ఆర్పీ గ్రాంట్ కింద మంజూరై, వివిధ కారణాల వల్ల ప్రారంభం కాని పనులను సేఫర్ స్టేజ్లో రద్దు చేశారు. మొత్తం ఏడు ప్యాకేజీల్లో రూ.3,888.83 లక్షల విలువైన 29 పనులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే పురోగతిలో ఉన్న బిలో గ్రావెల్ సబ్ బేస్ కింద ఉన్న 9 పనులను సేఫ్ క్లోజింగ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. పల్లె పండుగ బిల్లులకు గ్రహణం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రూ.150.04 కోట్లతో 1,916 పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.23.75 కోట్లు మాత్రమే విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ 14న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అంతర్గత రోడ్ల నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శరవేగంగా పనులను పూర్తి చేశారు. అయితే ఐదు నెలలు గడచినా బిల్లులు విడుదల చేయకపోవడం గమనార్హం. రూ.51.64 కోట్లతో ప్రతిపాదనలు ఏపీఆర్ఆర్పీ పనులను సేఫర్ స్టేజ్లో పూర్తి చేసేందుకు ఈఎన్సీ ఆదేశాల మేరకు రూ.51.64 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం లభించిన వెంటనే ఆరు ప్యాకేజీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపడతాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా పూర్తి చేసిన పనులకు బిల్లులు మరో పదిహేను రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. – వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కర్నూలు కల్చరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. గురువారం నగర శివారులోని నగర వనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, జిల్లా అటవీ శాఖ అధికారిణి పి.శ్యామల నగర వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ‘ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’ అనే థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఙ చేశారు. నగర వనంలో చిల్డ్రన్స్ పార్క్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్, అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో రవిశంకర్, నగర పాలక సంస్థ కమీషనర్ రవీంద్రబాబు, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటలాడుకుంటూ అనంతలోకాలకు..
● బావిలో పడి బాలుడి మృతి దేవనకొండ: ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ పదేళ్ల బాలుడు బావిలో పడి మృతిచెందాడు. ఈ దుర్ఘటన నల్లచెలిమల గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరేష్, కమల దంపతులు సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పొలం పనులకు వెళ్తూ తమ ఇద్దరు పిల్లల్ని కూడా తమ వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా పక్క పొలంలో పిల్లలతో కలిసి ధనుష్(10) అనే బాలుడు ఆటలాడడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ధనుష్ బావిలో కాలు జారి పడిపోగా, తోటి పిల్లలు కేకలు వేశారు. తల్లిదండ్రులు వచ్చి పిల్లవాడిని బయటికి తీసేలోపు మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళ ఆత్మహత్య కోవెలకుంట్ల: పట్టణంలోని గుద్దేటి వీధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన అరుణ(51) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతురాలి కుమారుడు వినయ్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పనుల్లేక.. ఉరికి వేలాడి! వెల్దుర్తి: కుటుంబ పోషణకు పనిచేద్దామన్నా ఎవరూ ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి పట్టణం 15వ వార్డులో మల్లిపల్లి సంజీవులు(47) నివాసముంటున్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఈయనకు భార్య మల్లేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం వివాహమైన కుమార్తెను చూసేందుకు మంగళవారం భార్య, కుమారుడు వెంకట్రాంపల్లె వెళ్లారు. బుధవారం తిరిగి రాగా సంజీవులు ఊరితాడుకు వేళాడుతూ కనిపించాడు. కూలీ పనులు దొరకక, ఆర్థిక ఇబ్బందుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే గుర్తింపు
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదవీ విరమణ తర్వాత కూడా గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో పీఆర్ డీఈఈగా పదవీ విరమణ పొందిన సూర్యనారాయణరెడ్డిని బుధవారం ఎస్ఈ ఆధ్వర్యంలో పీఆర్ ఇంజనీర్లు ఘనంగా సన్మానించారు. స్థానిక జిల్లా పరిషత్లోని విశ్వేశ్వరయ్య భవన్లోని ఎస్ఈ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఈ సి.మద్దన్న, డీఈఈలు రవీంద్రారెడ్డి, బండారు శ్రీనివాసులు, హరిదాసు ఈరన్న, కర్రెన్న, మహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, ఏఈలు విజయభాస్కర్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో పనిచేసిన సూర్యనారాయణరెడ్డి ఎంతో అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. ప్రతి ఒక్కరు తమ విధులను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమ తరహాలో చేపడుదాం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ఏడాది ఉద్యమ తరహాలో చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశమందిరంలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అన్ని శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలన్నారు. ప్రకృతిలోని సహజవనరుల ఆధారంగా సాగు చేసే విధానమైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్పై లోతైన అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..
● యువతకు ఆశాకిరణంగా కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ● ఉచిత భోజన వసతి, హాస్టల్ సదుపాయం ● ఇప్పటి వరకు 9,342 మందికి శిక్షణ.. 3,701 మందికి రుణాలు ● కొత్తగా పురుషులకు ఫోర్ వీలర్ డ్రైవింగ్లో శిక్షణ ఈ చిత్రంలోని మహిళ పేరు ఉమాదేవి. బేతంచెర్లకు చెందిన ఈ మహిళ టైలరింగ్లో 30 రోజుల శిక్షణ పొందారు. శిక్షణ పొందిన తర్వాత కర్నూలులో టైలర్ షాపు పెట్టుకున్నారు. నెలకు రూ.25 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.ఈ మహిళ పేరు శోభారాణి. కర్నూలులో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఈ మహిళ బ్యూటీ పార్లర్లో శిక్షణ పొందారు. శిక్షణ తర్వాత బ్యాంకు రుణసదుపాయం కల్పించింది. ఈమె కర్నూలులో బ్యూటీపార్లర్ఏర్పాటు చేసుకున్నారు. నెలకు అన్ని ఖర్చులు పోనూ రూ.30 వేల వరకు నికరాదాయం పొందుతున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (రూరల్ సెల్ప్ ఎంప్లాయిమెంటు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్–ఆర్ఎస్ఈటీఐ) అండగా నిలిచింది. నాణ్యమైన ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు హాస్టల్ వసతి కల్పిస్తోంది. స్వయం ఉపాధిలో రాణించేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 2023 ఆగస్టు 5న ఆవిర్భవించింది. కొద్ది నెలల క్రితం వరకు కల్లూరు మండల తహసీల్దారు కార్యాలయం దగ్గర ఉన్నా కెనరా బ్యాంకు 3వ అంతస్తులో నిర్వహించేవారు. శిక్షణ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున చేపట్టాలనే లక్ష్యంతో బి.తాండ్రపాడు సమీపంలో డీఆర్డీఏ ట్రైనింగ్ సెంటరు పక్కన సొంత భవనాన్ని నిర్మించారు. 2024–25లో 35 బ్యాచ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో బ్యాచ్లో గరిష్టంగా 35 మంది ప్రకారం 1,225 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది 44 బ్యాచ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఒక బ్యాచ్కి శిక్షణ ఇవ్వాలంటే కెనరా బ్యాంకు రూ.2లక్షల వరకు భరిస్తోంది. శిక్షణ ఇచ్చే అంశాలు పురుషులకు.. 2వీలర్ మోటర్సైకిల్ సర్విసింగ్/రిపేరీ, సెల్పోన్ సర్వీసింగ్, ఫొటోగ్రఫీ –వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్, ప్లబింగ్–శానిటరీ, ఎలక్ట్రికల్ మోటర్ రీవైండింగ్– పంపుసెట్ రిపేరి, టైలరింగ్ అండ్ డ్రస్ డిజైనింగ్ ఫర్మెన్, సీసీటీవీ కెమెరా ఇన్టలేషన్, సరీసింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్(ట్యాలీ), పుట్టగొడుగుల తయారీ, గొర్రెల పెంపకంలో శిక్షణ ఇస్తారు. కొత్తగా 4 వీలర్ డ్రైవింగ్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చే అంశాలు మహిళలకు.. టైలరింగ్ అండ్ డ్రస్ డిజైనింగ్, బ్యూటీపార్లర్ మేనేజ్మెంటు/పెళ్లికూతురు మేకప్/మెహంది వర్క్, జ్యూట్బ్యాగ్ తయారీ/కూరగాయల బ్యాగుల తయారీ, వస్త్ర చిత్ర కళా ఉద్యమి(జర్దోషి, మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింట్స్), అగరుబత్తిల తయారీ, కొవ్వొత్తుల తయారీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్(ట్యాలీ), పచ్చళ్లు, బేకరీ ఉత్పత్తులు, మసాల పౌడర్ల తయారీలో శిక్షణ ఇస్తారు. బ్యాంకుల రుణాలు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శిక్షణ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ కూడా ఇస్తోంది. ఈ సర్టిఫికెట్తో బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందవచ్చు. ఇప్పటి వరకు 354 బ్యాచ్లకు సంబంధించి 9342 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో 6,671 మంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో స్థిపనడ్డారు. 3,701 మందికి కెనరా బ్యాంకుతో పాటు బ్యాంకులు రుణ సదుపాయం కూడా కల్పించాయి. ‘పది’ చదివిన వారికి అవకాశం కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థతో ఉమ్మడి జిల్లా యూనిట్గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పూర్తిగా గ్రామీణ ప్రాంత యువతీ యువకులకే అవకాశం కల్పిస్తున్నాం. శిక్షణ పొందిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో ప్రోగ్రామ్లో 35 మందికి అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం 10 తరగతి చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం. – పుష్పక్కుమార్, డైరెక్టర్, కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, కర్నూలు ఈ చిత్రంలో కనిపించే యువతి పేరు పి.హసీనా బేగం. కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 30 రోజుల పాటు బ్యూటీపార్లర్లో శిక్షణ పొందారు. శిక్షణ పొందినట్లు సంస్థ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. శిక్షణ పొంది బ్యూటీ పార్లర్లో ఈమె జాబ్ చేస్తున్నారు. -
పేలిన గ్యాస్ సిలిండర్.. దగ్ధమైన దుకాణాలు
ఓర్వకల్లు: వంట గ్యాస్ సిలిండర్ పేలడంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఓర్వకల్లులో జరిగిన ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులు, స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని కెనరా బ్యాంక్ ఎదురుగా దుకాణాలను అద్దెకు తీసుకొని ఉస్తేపిల్లి వెంకటేశ్వర్లుశెట్టి, నందికొట్కూరుకు చెందిన శేషఫణి శెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వెంకటేశ్వర్లుశెటిక్టి చెందిన శ్రీరామబేకరీలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పక్కనే పున్న రెండు ఫ్రిడ్జ్లకు వ్యాపించడంతో అందులోని కూలర్ గ్యాస్ను దట్టమైన మంటలు వీచాయి. దీంతో దుకాణంలోని బేకరి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికాలు దగ్ధమయ్యాయి. ఈ మంటలు పక్కనే పున్న శేషఫణిశెట్టికి చెందిన లక్ష్మీ ఎలక్ట్రికల్ దుకాణంలోకి వ్యాపించాయి. అందులోని ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లంబర్ సామాన్లు, ప్లాస్టిక్ పైపులు కాలి బాడిదయ్యాయి. ప్రమాదం కారణంగా బేకరీలో రూ.4 లక్షలు, ఎలక్ట్రికల్ దుకాణంలో రూ.8 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. -
ఇవీ సౌకర్యాలు
● కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్(ట్యాలీ)లో శిక్షణ పొందేందుకు డిగ్రీ అర్హత కలిగి ఉండాల్సి ఉంది. మిగిలిన కనీస విద్యార్థత 10 వతరగతి ఉంటే చాలు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారందరు అర్హులే. ● ఉమ్మడి జిల్లా యూనిట్గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ● మహిళలు శిక్షణ పొందే సమయంలో పురుషులు ఉండరు. పురుషులు శిక్షణ పొందే సమయంలో మహిళలు ఉండరు. ● ప్రతి రోజు రోజుకు ఒక్కో రకం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో ప్రతి రోజు గుడ్లు, రాత్రి భోజనంలో ప్రతి రోజూ అరటి పండు ఇస్తారు. భోజనంతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు. -
క్షేత్రస్థాయి వ్యవస్థలను బలోపేతం చేయాలి
కర్నూలు(సెంట్రల్): క్లిష్ట పరిస్థితుల్లో మహిళలను ఆదుకునేలా క్షేత్ర స్థాయిలో వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మిషన్ శక్తిలో భాగంగా అమలవుతున్న వన్స్టాప్ సెంటర్, మహిళా హెల్ప్లైన్, నారీ అదాలత్, శక్తి సదన్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో ఉన్న మహిళలను ఆదుకునే వన్స్టాప్ సెంటర్లను జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల, డివిజన్ కేంద్రాల్లో బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం అంగన్వాడీలు, మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నిర్మళకు సూచించారు. వన్స్టాప్ సెంటర్ అసంపూర్ణంగా ఉండడంతో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని పీడీ నిర్మళను ఆదేశించారు. మహిళా హెల్ప్లైన్, నారీ అదాలత్, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శక్తి సదన్కు సంబంధించి ఒకేషనల్ ట్రైనింగ్ తీసుకున్న మహిళలకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమల శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అక్కడున్న మహిళలను స్వయం సహాయక గ్రూపుల్లో చేర్పించి స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ.. వన్స్టాప్ సెంటర ద్వారా సర్వీసు రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని, పరిహార కేసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషినల్ ఎస్పీ హుస్సేన్పీరా, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, డీఈఓ శామ్యూల్పాల్ పాల్గొన్నారు. -
కారు లోపల ఊపిరాడక బాలుడి మృతి
డోన్ టౌన్: కారు డోర్లు లాక్ అయ్యి ఊపిరాడక అందులో ఉన్న ఈశ్వర్(11) అనే బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన బుధవారం దొరపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మీ దంపతుల కుమారుడు ఈశ్వర్ ఆడుకుంటూ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళళ్లి డోర్ వేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత డోర్లు లాక్ అయ్యాయి. డోర్ గ్లాస్లు పూర్తిగా మూసి ఉంచడంతో ఊపిరి ఆడక అచేతనంగా మారాడు. బాలుడు విగతజీవిగా కారులో పడి ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మందగించిన నైరుతి ● జాడ లేకుండా పోయిన వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ముందస్తుగా ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపడం లేదు. తొలకరి వర్షాలు కనుమరుగయ్యాయి. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. మే నెలలో అధిక వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కూడా గత నెల 26న విస్తరించాయి. ఈ ప్రభావం వల్ల ఒకటి, రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు విస్తరించిన తర్వాత నుంచి వాటిలో చురుకుతనం తగ్గిపోయింది. గాలి తీవ్రత పెరగడంతో వర్షాలు కురుస్తాయో లేదోననే ఆందోళన నెలకొంది. జూన్ నెల మొదటి నాలుగు రోజుల్లో 1 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ నమోదు కావాల్సి ఉంది. నల్లరేగడి నేలల్లో ఒకే రోజు లేదా మూడు రోజుల్లో 75 మి.మీ వర్షాలు పడినప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సాధారణ సాగు 4,22,540 హెక్టార్లు. ప్రధానంగా పత్తి సాధారణ సాగు 2,34,409 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 5,066 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. -
విద్యుత్ వైర్లు, స్టార్టర్ బాక్స్ల చోరీ
హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు (తెక్కలకోట రస్తా) వెళ్లే దారిలోని పొలాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాదాపు రూ.లక్షకు పైగా విలువైన విద్యుత్ మోటర్ వైర్లు, స్టార్టర్ బాక్స్లు ఎత్తుకెళ్లారు. దాదాపు 30కు పైగా మోటర్లకు సంబంధించిన వైర్లను, రెండు స్టార్టర్ బాక్స్లను చోరీ చేశారు. విషయం తెలుసుకున్న హొళగుందకు చెందిన తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు సిందువాళ కృష్ణయ్య, రైతులు గిరిమల్ల, లక్ష్మన్న, అబ్దుల్ సుభాన్ తదితరులు చోరీ జరిగిన పొలాలను పరిశీలించారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.100కు పైగా ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగా వైర్లును కత్తిరించారని రైతులు తెలిపారు. వెంటనే దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం
ఊరూరా బెల్ట్షాపులు.. బాటిల్పై రూ.10–20 అ‘ధన’ం ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిప్రశ్నించారు.. వదిలేశారు!‘జత్వానీ’పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఏదీ!? బాలీవుడ్ నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేకపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ఈ ఘటన జరిగినా, ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా జనసేన, టీడీపీ ఈ అంశాన్ని వాడుకున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రీతి తల్లి పార్వతి కలిసినా ప్రయోజనంలేకపోయింది. ఈ విషయమై పార్వతి స్వయంగా మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రూ.1635.50 కోట్లు ( ఆడబిడ్డ నిధి అమలు చేయకపోవడంతో మహిళలకు వాటిల్లే నష్టం ) రూ.593.47 కోట్లు ( అన్నదాత సుఖీభవ అమలు చేయకపోవడం వల్ల రైతులకు కలిగే నష్టం ) సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ కూటమి పాలనలో అవినీతి తాండవిస్తోంది. బహిరంగంగానే నేతలు, పార్టీ శ్రేణులు అక్రమాలకు తెగబడ్డారు. నేటితో సార్వత్రిక ఫలితాలకు సరిగ్గా ఏడాది. ఈ ఏడాది ‘కూటమి పాలన’ను విశ్లేషిస్తే మోసం, దగా మినహా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇట్టే తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 18,712 వలంటీర్లను తొలగించి రోడ్డున పడేయడం, సూపర్సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం.. చివరకు పింఛన్, రేషన్ కావాలన్నా సచివాలయాల చుట్టూ, రేషన్ దుకాణాల చుట్టూ తిరిగే దారుణ పరిస్థితి కల్పించడం గమనార్హం. ఆదోని, శ్రీశైలం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, కర్నూలు, పాణ్యంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఇసుక, గ్రావెల్ దందా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఆదోనిలో డబ్బులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే అనుచురులు ఏకం గా భౌతిక దాడులకు దిగారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఇద్దరూ ఇసుక దోపిడీకి తెగబడిన ఆడియో కూడా వైరల్ అయింది. ‘సీఐకి రూ.50వేలు ఇచ్చినా, ఎమ్మెల్యేకి చెప్పి ఇసుక తోలుతున్నా, దమ్ముంటే రమ్మను జయరాం’ అని నాగిరెడ్డి బహిరంగంగానే బెదిరించారు. ఆళ్లగడ్డలో ఇసుక కావాలంటే ఏ పల్లెకు వెళ్లినా, ఎంతకు కొనుగోలు చేసినా ట్రిప్పునకు రూ.2వేల చొప్పున బీట్యాక్స్ చెల్లించాల్సిందే. పాణ్యం నియోజకవర్గం పూడిచెర్లతో పాటు పలు చోట్ల గ్రావెల్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండల టీడీపీ నేతల ఫోన్ సంభాషణలో ‘ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్తోనే కొడతా.. రమ్మను’ అని మట్టి అక్రమ తరలింపు విషయంలో బరితెగించి మాట్లాడటం గమనార్హం. ‘పచ్చ’పాతమే.. మంత్రి టీజీ భరత్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే తానే రంగంలోకి వస్తానని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఇటీవల బహిరంగంగానే హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉండడం లేదని.. ఆధార్ కార్డు చూసి పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేయాల్సిన నేతల ‘పచ్చ’పాతం ప్రభాకర్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. పాలనలో ‘విశ్వసనీయత’ వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 20న ప్రమాణస్వీకారం చేశారు. జూలై 12న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 99శాతం ప్రవేశపెట్టారు. ఐదేళ్లూ వాటికి నిధులు కేటాయించారు. మేనిఫెస్టోకు విశ్వసనీయత, ప్రజలకు మాట ‘చెప్పామంటే...చేయాలంతే’ అనేలా పాలన సాగించారు. ఐదేళ్లలో ముఖ్య పథకాలకు జిల్లాకు రూ.10,136.85కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అదుపు తప్పిన శాంతిభద్రతలు జిల్లా ఎస్పీల చేతుల్లో ఏ అధికారం లేదు అన్న భావన సీఐ, ఎస్ఐలలో బలంగా పాతుకుపోయింది. ఇటీవల ఏసీబీకి చిక్కిన నాలుగో పట్టణ సీఐ మధుసూదన్గౌడ్ టీడీపీ ఏజెంట్లా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతలతో పాటు ఏకంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఏదైనా సమస్య కోసం ఫోన్ చేసినా, స్టేషన్కు వెళ్లినా బాహాటంగానే ‘మీది ఏది జరగదు. మీ కు తెల్సు! ఎందుకు స్టేషన్కు వస్తారు!’ అని బా హాటంగానే మాట్లాడారంటే ‘లా అండ్ ఆర్డర్’ ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఆళ్లగడ్డ పరిధిలోని చెన్నంశెట్టిపల్లెలో రవీంద్ర అనే వ్యక్తి ట్రాక్టర్ తెచ్చుకుని బాడుగకు ఇసుక తోలుతుంటే హరిప్రసాద్ అనే ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. తన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపినా ట్రాక్టర్ ఆపి వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. పత్తికొండ సీఐ జయన్న అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధింపులు తాళలేక ప్రవీణ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఉద్యమబాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రజాగ్రహానికి గురైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పిల్లల చదువులు, రైతుల వ్యవసాయం అన్నీ సంక్షోభంలో పడ్డాయి. దీంతో ప్రజాక్షేత్రంలో ఆందోళన బాట పట్టింది. గతేడాది డిసెంబర్ 13న రైతులకు మద్దతుగా ‘రైతు పోరు’, అదే నెల 27న విద్యుత్ చార్జీల పెంపుపై కలెక్టరేట్ల ముట్టడి, ఈ ఏడాది మార్చి 12న యువపోరుతో ఆందోళన నిర్వహించారు. ఏడాదిలో 61మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం ఏస్థాయిలో నిర్లక్ష్యం చేసిందో ఇట్టే తెలుస్తోంది. నేటితో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఏడాది ‘సూపర్ సిక్స్’ హామీలను పూర్తిగా గాలికొదిలిన చంద్రబాబు ఊరూరా బెల్ట్షాపులతో ఏరులై పారుతున్న మద్యం మద్యం షాపులు పూర్తిగా టీడీపీ నేతల చేతుల్లోనే.. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అడుగడుగునా అవినీతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాదిలో 61 మంది రైతుల ఆత్మహత్య నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ రూ.6,609.28 కోట్లు ( సూపర్సిక్స్కు మంగళం పాడటంతో ఏడాదికి జిల్లాకు కలిగే నష్టం ) మద్యం పాలసీ ద్వారా కూటమి ప్రభుత్వం భారీగా దండుకుంటోంది. విపక్షపార్టీ నేతలకు దుకాణాలు వచ్చినా వారి నుంచి బలవంతంగా లాక్కుని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. తెలంగాణవాసులు వడ్డెంపూడి నరేశ్(షాపు నెంబర్ 36), విజయ్, భరత్ గౌడ్ (షాపు నెంబర్24), వింజమూరి కృష్ణారెడ్డి(షాపు నెంబర్ 22) దుకాణాలు దక్కాయి. వీరికి కోడుమూ రు టీడీపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్రెడ్డి, అనుచరుల నుంచి ఫోన్లో బెదిరింపులు వచ్చాయని, ఫోన్ నెంబర్తో సహా ముఖ్యమంత్రి, ఇన్చార్జ్, ఎకై ్సజ్, హోంమంత్రులకు, సీఎస్, కలెక్టర్కు మెయిల్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. తామూ టీడీపీ సానుభూతి పరుల మే అని ఇంత అన్యాయం ఏంటని ఫిర్యాదులో పే ర్కొన్నారు. ఈ ఉదాహరణలు చూస్తే జిల్లాలో మద్యం దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. గత 5 ఏళ్లలో ఏ పల్లెలో ఒక్క బెల్ట్దుకాణం లేదు. ఈ ఏడాది ప్రతీ పల్లెలో బెల్ట్షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినోత్సవం కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి పథకాలు అమలు చేయకపోవడంపై నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.కర్నూలు(టౌన్): ఏడాది గడిచినా ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి పిలుపు నిచ్చా రు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కన్నా రెండింతలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాడన్నారు. గతంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి సేవలు అందించిన వలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి ఏకంగా ఉద్యోగాలే లేకుండా చేశాడన్నారు. ఇక రేషన్ కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయన్నారు. కూటమి సర్కార్ ఎండీ యూ వాహనాలను తొలగించడంతో వాటి నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనపై బుధవారం వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.స్థానిక గౌరి గోపాల్ ఎదురుగా ఉన్న ధర్మా చౌక్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. -
ఇంటింటికీ మద్యం సరఫరా ఘనత బాబుది
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి చాగలమర్రి: కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీని రద్దు చేసి ఇంటింటికి మద్యం సరఫరా చేస్తుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా పరిశీలకులు కల్పలతారెడ్డి, అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. మంగళవారం వారు మాజీ ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పార్టీ నేత భూమా కిశోర్రెడ్డితో కలిసి తోడేండ్లపల్లె గ్రామాన్ని సందర్శించి ఇటీవల హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తరఫున రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఊరూరా బెల్ట్షాపులతో మద్యం ఏరులై పారుతుందన్నారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. తోడెండ్లపల్లె చిన్నారి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న, చంద్రబాబు పాలనలో తేడాను ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్ బాబులాల్, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, ఆళ్లగడ్డ ఎంపీపీ రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అహోబిలేశా.. బీ ట్యాక్స్ కట్టలేము!
● పుణ్యక్షేత్రంలో ఆగని పచ్చ దందా ● నాలుగు నెలల క్రితం వంద లాడ్జీ నిర్వాహకులతో మామూళ్ల ఒప్పందం ● మాట వినని 17 లాడ్జీల యజమానులపై అధికారులతో వేధింపులు ● ప్రస్తుతం కప్పం కట్టిన ముగ్గురికి మినహాయింపు ● అనుమతులు లేవంటూ 14 లాడ్జీలు కూల్చేస్తామని నోటీసులు సాక్షి టాస్క్ ఫోర్స్: ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెతికినా.. అందందే తమ అవినీతి, అక్రమ సంపాదన అన్న చందంగా మారింది.. ఆళ్లగడ్డలో నియోజకవర్గంలో అధికార పార్టీనేతల దందా. అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ ముఖ్యనేత ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లాడ్జీలనూ వదలడం లేదు. ఎవరికీ అనుమతులు లేవు అంటూ.. పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో నెలల తరబడి వేధింపులకు పాల్పడి వసూళ్ల దందాకు తెరలేపారు. కొందరు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో 14 లాడ్జీలు కూల్చి వేస్తామని నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు సుమారు 100 వరకు నిర్మించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై అధికార పార్టీ ముఖ్యనేత కన్నుపడటంతో వెంటనే వసూళ్ల బాధ్యత ఓ తమ్ముడికి అప్పగించారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న వాటికి నోటీసులు ఇచ్చి బెదిరించారు. ఇదేమిటనీ ప్రశ్నిస్తే ‘అన్న’ దగ్గరకు వెళ్లి ఎంతో కొంత ఇస్తామని మాట్లాడుకోమని సలహా ఇచ్చారు. అయినా ఎవరూ స్పందించక పోవడంతో ఇవన్నీ కాలువపై ఉన్నాయి.. అని ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ ఆధీనంలో ఉన్న పొలంలో కట్టారని తహసీల్దార్, సర్వేయర్ ఇలా అన్ని శాఖల అధికారులతో సర్వే చేయించారు. భయపడిన చాలా మంది మామూళ్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే 17 లాడ్జీల నిర్వాహకులు కప్పం కట్టేందుకు ముందుకు రాక పోవడంతో విద్యుత్ అధికారులను పంపించి దౌర్జన్యంగా కరెంట్ కట్ చేయించారు. దీంతో ఆందోళన చెందిన మరో ముగ్గురు వెళ్లి బీ ట్యాక్స్ కట్టారు. ఇక మిగిలింది 14 మందికి ‘మీ లాడ్జీలను కూల్చి వేస్తామని’ అంటూ మంగళవారం మరోమారు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇదేంటి మొన్నటి దాక 17 లాడ్జీలు అన్నారు. ఇప్పుడు 14 ..ఎందు కు అని అధికారులను ఆరా తీయగా..ఆ ము గ్గురు బీ ట్యాక్స్ కట్టా రు.. మీరు కట్టేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం సాక్షిలో ప్రచురితమైంది. అహోబిలం క్షేత్రంలో అనుమతులు లేని లాడ్జీలపై వార్తా కథనం ఇది. ఆ తర్వాత ఈ లాడ్జీలకు అనుమతి లేదని కరెంట్ కట్ చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించక పోవడంతో కరెంట్ కట్ చేశారు. అయితే ఇప్పుడు వీరభద్ర, వేదపాఠశాల, సుదర్శన్ కాంప్లెక్స్ అనే మూడు లాడ్జీలకు నోటీసులు ఇవ్వక పోవడంతో ఆ లాడ్జీల నిర్వాహకులు పెద్ద మొత్తంలో బీ ట్యాక్స్ కట్టారని, అందుకే అవి సక్రమమయ్యాని గుసగుసలాడుకుంటున్నారు. డబ్బులు ఇస్తాం.. క్రమబద్ధీకరిస్తారా ? అహోబిలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిర్మాణాలకు చాలా వాటికి అనుమతులు లేవు. అధికార పార్టీ నేతలు రూ. లక్షలు డబ్బులు ఇవ్వండి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇస్తాం. మరో నెలకో ఏడాదికో వచ్చి మళ్లీ అక్రమ నిర్మాణాలే కదా డబ్బులు ఇవ్వమంటే ఎలా? అడిగినంత డబ్బులు ఇస్తాం.. అన్ని క్రమబద్ధీకరణ చేసి ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా చెప్పండి. లేకుంటే వారికి ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు వచ్చి కప్పం కట్టాలని బెదిరిస్తే ఏం చేయాలి. – లాడ్జీ యజమాని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. నేను కొత్తగా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నా. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం 14 మందికి నోటీసులు ఇవ్వమని ఈఓపీఆర్డీ ఆదేశాలు ఇవ్వడంతో వారికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది. – సుదర్శన్రెడ్డి, పంచాయతీ సెక్రటరీ -
ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయులు
కర్నూలు: కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామంలో రెడ్డిపోగు వెంకటేశ్వర్లు (55) దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. ఆమె చనిపోవడంతో రెండవ భార్య రెడ్డిపోగు సువేదమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కూతురు సంతానం. రెండో వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్య పిల్లలకు ఆస్తి పంపకాలు చేశాడు. అయితే కొంతకాలం క్రితం మరో 2.20 ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో కూడా తమకు వాటా ఇవ్వాలంటూ మొదటి భార్య పిల్లలతో కొంతకాలంగా గొడవ జరుగుతోంది. పలుమార్లు ఆస్తి కోసం తగాదా జరిగినప్పటికీ వెంకటేశ్వర్లు వాటా ఇవ్వలేనని తేల్చిచెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం వెంకటేశ్వర్లు పొలంలో ఉండగా మొదటి భార్య పిల్లలు కృష్ణ, స్వాములు, చిన్నస్వాములు, లక్ష్మి, రేణుక, చిన్న రేణుకతో పాటు మరో పది మంది కుటుంబ సభ్యులు అతని కంట్లో కారం కొట్టి ఇనుపరాడ్లు, కట్టెలతో బాదడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. రెండో భార్య సువేదమ్మ వచ్చి ఆయన్ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించిన గంటలోపే మృతిచెందాడు. సువేదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి భార్య కుమారులు, కుమార్తెలతో పాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ శ్రీధర్ తెలిపారు. -
క్వార్టర్ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
● కర్నూలు కలెక్టర్ను ఆదేశించిన లోకాయుక్త కర్నూలు(సెంట్రల్): కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ఏ, బీ, సీ క్వార్టర్లను దుర్వినియోగం చేస్తున్న అనధికార వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను లోకా యుక్త ఆదేశించింది. ప్రభుత్వ క్వార్టర్లు దుర్వినియోగమవుతున్నాయని జగన్ అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నిర్దేశిత ఫార్మాట్లో ఫిర్యాదు లేకున్నా.. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన విషయం కావడంతో విచారణకు స్వీకరించినట్లు లోకాయుక్త తెలిపింది. ఏ, బీ, సీ క్యాంపుల్లోని క్వార్టర్ల ప్రస్తుత స్థితిగతిని తెలుసుకునేందుకు వెంటనే సర్వేను నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించింది. ప్రతి ఇంటిని సర్వే చేసి ఆక్రమణకు గురైనా, వ్యాపార సంస్థలకు లీజు ఇచ్చినా, అనధికార వ్యక్తులు ఉన్నా గుర్తించి పూర్తి వివరాలను రికార్డులో డీఆర్వోతో నమోదు చేయించాలని ఆదేశించింది. అనధికార వ్యక్తులు, సబ్లీజుకు ఇచ్చిన సందర్భాలు ఉంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ ఆదేశించారు. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైఎస్సార్ కడప క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సారానికి 4, 5 తరగతుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాల్గవలో ప్రవేశానికి 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31, ఐదవ తరగతిలో ప్రవేశానికి 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 మధ్య జన్మించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న వారు అర్హులన్నారు. ఈనెల 19లోగా https:// apsportsschool.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శారీరకదారుఢ్య పరీక్షలకు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న విద్యార్థులు అదే నెల 10, 11వ తేదీల్లో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరవుతారన్నారు. మరింత సమాచారం కోసం 8712622576 నంబరును సంప్రదించాలన్నారు. ఇసుక మాయం సి.బెళగల్: మండల కేంద్రంలోని రెవెన్యూ ఆధ్వర్యంలో ఉన్న ఇసుక మాయమైంది. మండల పరిధిలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయ ఆవణంలో ఇసుకను నిల్వ చేశారు. కాగా మండల రెవెన్యూ అధికారుల నిఘా లేకపోవడంతో ఇసుకను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఒకపక్క తహసీల్దార్ కార్యాలయం.. మరో పక్క పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ సీజ్ చేసిన ఇసుక మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తంను వివరణ కోరగా విచారిస్తానని సమాధానం ఇచ్చారు. ఎస్ఐ పరమేష్నాయక్ దృష్టికి తీసుకెళ్లగా తాము కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించామని, ఇసుక మాయంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని చెప్పారు. -
వక్ఫ్ చట్ట సవరణను ఉపసంహరించుకోండి
కర్నూలు(సెంట్రల్): వక్ఫ్ చట్ట సవరణను ఉపసంహరించుకోకుంటే ముస్లిం మహిళలే ముందుండి ఉద్యమాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నారని ముస్లిం పర్సనల్ లాబోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు జలీసా సుల్తానాయాసీన్, అఖిల భారత ప్రజాతంత్రమహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, జమాతే ఇస్లామియా ఏ హింధ్ సభ్యులు కుద్దుసా, నాసిర ఖానం కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం నగరంలోని మెరిడియన్ ఫంక్షన్ హాలులో సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాంగం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తాహేరున్సీ, పర్వీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం వక్ఫ్ భూములను బడా బాబులకు కట్టబెట్టేందుకే చట్ట సరవణ చేసిందని విమర్శించారు. ఎంపీల సంఖ్యా బలం ఉందని ముస్లింల ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా వక్ఫ్ చట్ట సవరణ చేయడం తగదన్నారు. ముస్లింల ఆస్తులను కాజేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలో బీజేపీ పాలు పంచుకుందన్నారు. తమ వక్ఫ్ ఆస్తుల్లో ముస్లింమేతరుల పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. నతరం మెరిడియన్ ఫంక్షన్ హాలు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం ఎదుట కాసేపు నిరసన చేపట్టి కలెక్టర్ పి.రంజిత్బాషాకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, నాయకురాళ్లు అరుణ, జయమ్మ, పుష్పావతి, పద్మావతి పాల్గొన్నారు. -
గుండె పోటుతో మహిళ మృతి
వెల్దుర్తి: ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు స్థానిక పాతబస్టాండ్లోనే గుండెపోటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. బోగోలుకు చెందిన గొల్ల అయ్యమ్మ(62) అనారోగ్యంతో బాధ పడుతుండటంతో భర్త అయ్యస్వామి, కుమార్తె, అల్లుడు కలిసి మంగళవారం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో వెల్దుర్తికి చేరుకున్నారు. పాతబస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా తీవ్ర అస్వస్థతకు గురై అయ్యమ్మ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, డ్యూటీ పోలీసుల సాయంతో స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా పాతబస్టాండులో బస్షెల్టర్ ఉన్నా ప్రయాణికులకు అనుకూలంగా లేకపోవడంతో బస్సుల కోసం ఎండా, వానల్లో నిలుచుని ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే కోవలో అయ్యమ్మ కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో నిలుచొని ఉండటంతో అసలే అనారోగ్యంతో ఉన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారులు పాతబస్టాండులో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీల మృతి
బనగానపల్లె రూరల్: మండలంలోని ఎస్ కొత్తూరు గ్రామ సమీపంలో నాపరాయి లోడు ట్రాక్టర్ బోల్తాపడి కూలీలు ఎం శివారెడ్డి(49), ఎన్ అబ్దుల్రసూల్ (50) దుర్మరనం చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పలుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డి, నందవరం గ్రామానికి చెందిన ఎన్ అబ్దుల్రసూల్ మంగళవారం నాపరాయి లోడింగ్ కోసం కూలీ పనికి వెళ్లారు. పలుకూరు గ్రామం నుంచి నాపరాయిని నంద్యాలకు తరలించేందుకు ట్రాక్టర్ ట్రాలీపై కూర్చొని బయలుదేరారు. నందివర్గం రైల్వే వంతెన దాటిన తరువాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీ బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాలీపై కూర్చున శివారెడ్డి, అబ్దుల్రసూల్పై నాపరాళ్లు పడటంతో శివారెడ్డి అక్కడికక్కడే మృతిచెండాడు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్రసూల్ను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షిచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. మృతుడు శివారెడ్డికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్ అబ్దుల్రసూల్కు భార్య హుస్సేన్మీతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసీ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి.. గోస్పాడు: కేసీ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి కౌలు రైతు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివ రాలు.. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి శ్రీకాంత్రెడ్డి(30) గోస్పాడు మండలం సాంబవరం గ్రామ సమీపంలో ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పొలా న్ని దుక్కి దున్నేందుకు మంగళవారం ట్రాక్టర్తో కేసీ కాల్వ గట్టు మీదుగా శ్రీకాంత్రెడ్డి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి కేసీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న శ్రీకాంత్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ సుధాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు వెంకటసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇళ్ల స్థలాలు ఇచ్చి హామీ నిలుపుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకారం సొంతిల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని, అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేంత వరకు సీపీఐ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల సీపీఐ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రామకృష్ణ మాట్లాడారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. చేత కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి ఇంత వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తల్లికి వందనం, మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వెంటనే అమలు చేయాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు తవిచ్చేలా వాహనాలను రద్దు చేసి మళ్లీ షాపులను తీసుకురావడం మంచిపద్ధతి కాదన్నారు. అనంతరం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ.. పట్టణంలో ఇళ్లు లేని 13 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని, ఇప్పటివరకు 2470 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ మహిళ సోమవారం పాముకాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన తవిసి కొండ తిమ్మయ్య భార్య రంగమ్మ (46) గ్రామంలో వేరుశనగ పంట తొలగింపు పనులకు వెళ్లి పైరును తొలగిస్తుండగా చేతికి పాముకాటు వేసింది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం బేతంచెర్ల సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి నలుగురు సంతానం ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు ఎడమ వైపు తీవ్ర గాయాలతో వ్యక్తి రోడ్డుపై పడిఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వయస్సు 47 సంవత్సరాలు ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు, ఛామన చాయ రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నీలం, పసుపు రంగు గీతలు కలిగిన రెడీమేడ్ ఫుల్ షర్టు, ఎరుపు రంగు గీతలు కలిగిన లేత నీలి రంగు నిక్కర్ ధరించాడు. ఆచూకీ తెలిసినవారు 91211 01078 నంబర్కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
రెండో రోజూ పడిగాపులే!
కర్నూలు(సెంట్రల్): రేషన్ దుకాణల్లో రెండో రోజు సర్వర్ సమస్య తలెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ సక్రమంగా రాకపోవడంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లాలోని 1,233 రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ కారణంగా కార్డుదారులు షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. జిల్లాలో మొదటిరోజు ఆదివారం 18 శాతం, రెండో రోజు 16 శాతం మంది కార్డుదారులకు మాత్రమే సరుకుల పంపిణీ పూర్తయింది. క్షణికావేశంలో వివాహిత బలవన్మరణం పత్తికొండ: స్థానిక కుమ్మరగేరికి చెందిన కుమ్మరి కల్పన (28) క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇళ్లు శుభ్రం చేసే విషయంలో భర్త రాజశేఖర్ఆచారితో చిన్నపాటి వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన కల్పన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయన్న తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి దుర్మరణం బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో చాకలి నాగేశ్ (28) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన చాకలి నాగేష్ ట్రాక్టర్ లోడింగ్ పని నిమిత్తం కూలీగా వచ్చారు. ట్రాలీలో నాపరాయి లోడ్ వేసుకొని డ్రైవర్ రామాంజనేయులుతో కలిసి బేతంచెర్ల గ్రామానికి వాహనంలో బయల్దేరారు. పలుకూరు గ్రామ సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను తప్పించే క్రమంలో డ్రైవర్ స్టీరింగ్ను తిప్పడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కుర్చున్న చాకలి నాగేశ్ కింద పడగా నాపరాళ్లు అతనిపై పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య రమాదేవి, ఇద్దరు సంతానం ఉన్నారు. -
నిర్వహణ ‘మరుగు’న పడి
పాఠశాల విద్యలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు జీఓ 117 తీసుకొచ్చి 6 రకాల బడులను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 117 జీఓను రద్దు చేస్తామనే ప్రచారం చేసింది. అయితే ఎన్డీఏ కూటమిలో ఆ జీఓను రద్దు చేసేందుకు ఆస్కారం లేకపోవడంతో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరిట 6 రకాల బడులను 9 రకాలుగా మార్పు చేస్తూ గందరగోళానికి పాల్పడుతోంది. వాస్తవానికి 2017 అప్పటి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలు 29, 42 కారణంగా ప్రాథమిక విద్య నిర్వీర్యమైంది. ఫలితంగా అప్పట్లో జిల్లాలో 79 స్కూళ్లు మూతపడ్డాయి. అమలుకాని తల్లికి వందనం ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అదిగో.. ఇదిగో అంటూ బడ్జెట్ సమావేశాల్లో ఏప్రిల్, మే నెల చివరిలో ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అంసెబ్లీలో మాటిచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే జూన్లో స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాక ఇస్తామని నాలుక మడతేయడం గమనార్హం. కొండలా ఫీజు బకాయిలు పేద విద్యార్థుల చదువులకు ఫీజులు భారం కాకూడదని యూనివర్సిటీలలో ఎంత ఫీజులు ఉంటే అంత మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన కింద తల్లిదండ్రులపై నయాపైసా భారం పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. విశ్వ విద్యాలయాలు నిర్ణయించిన ఫీజు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే చెల్లించింది. అయితే నేడు కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు అందక కొందరు, పరీక్షలు రాయలేక మరి కొందరు మధ్యలోనే చదువులు మానేయాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా 2024–25 ఏడాదిలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఫీజులు సుమారు రూ.71 కోట్ల బకాయి ఉంది. అరకొరగానే విద్యా కానుక తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుడదని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వై.ఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం అయ్యాక జగనన్న విద్యా కానుక పేరిట కిట్ల రూపంలో యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు, బెల్ట్, డిక్షనరీలు, సాక్సులు, నోట్ పుస్తకాలను అందజేశారు. ఏటా సుమారు 2.90 లక్షల మంది విద్యార్థులకు ఒక్కో కానుక కిట్టు రూ.2 వేల ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ పథకంగా మార్పు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, కిట్లలోని వస్తువులు చేరని పరిస్థితి. బ్యాగ్లు ఒక్క మండలానికి మాత్రమే రాగా.. బూట్లు, పిక్టోరియల్ రిక్షనరీల ఊసే కరువైంది. నాణ్యత లేని మధ్యాహ్న భోజనం కూటమి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మద్యాహ్న బడి భోజనంగా మార్పు చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన మెనూను కొనసాగిస్తున్నా నాణ్యతను విస్మరించింది. వంట ఏజెన్సీలను ఎలాంటి కారణం లేకుండా తొలగించి టీడీపీ వర్గీయులకు కట్టబెట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇంటర్ పిల్లలకు మద్యాహ్న భోజనం పెడతామని ఈ ఏడాది జనవరి నుంచి మొదలు పెట్టినా ఇప్పటి వరకు ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం. టాయ్లెట్ల నిర్వహణ అస్తవ్యస్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బాల, బాలికలకు వేర్వేరుగా అత్యాధునిక మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ప్రతి రోజూ శుభ్రం చేసేందుకు 1,741 మంది ఆయాలను నియమించారు. శుభ్రం చేసేందుకు అవసరమైన రసాయనాలను సైతం పంపిణీ చేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో టాయ్లెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. జిల్లాలోని 240 ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లకు ఈ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. ‘చిక్కీ’పోయిన మాధ్యాహ్న భోజనంఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. జిల్లాలోని 23 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నెల నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకు రూ.20 లక్షలకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 1నుంచే 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభించారు. కానీ విద్యార్థులకు కోడి గుడ్లు, చిక్కీలు ఇవ్వలేదు. తరగతి గది అధోగతి!కార్పొరేట్ చేతిలో సెకండరీ విద్య డిజిటల్ విద్యకు గ్రహణంజిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,436 ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించింది. వీటిని ప్రతి రోజు శుభ్రం చేసేందుకు 1,741 మంది ఆయాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. ఆయాలకు గతంలో రెగ్యులర్ వేతనాలు వచ్చేవి. నేడు మూడు, నాలుగు నెలలు అయినా అందని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మన బడి నాడు–నేడు కార్యక్రమానికి గ్రహణం పట్టింది. అప్పట్లో జిల్లాలో మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ.166.25 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో 1,051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల పనులు పునాదులకే పరిమితం అయ్యాయి. జిల్లాలోని 90 స్కూళ్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీబీఎస్ఈ స్కూళ్లుగా మార్చగా, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కుట్ర చేస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్(ఐఎఫ్పీ) ద్వారా డిజిటల్ విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్యాబ్లతో పాటు, బైజుస్ డిజిటల్ కంటెంట్ను చేరువ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీటిని పట్టించుకోకపోగా.. ట్యాబ్ల పంపిణీని నిలిపేసింది. ఇంటర్మీడియెట్లో సంస్కరణల పేరిట గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ను సభ్యులుగా నియమించి సెకండరీ విద్యను కార్పొరేట్కు తాకట్టు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేస్తామని.. కాలేజీలు పునఃప్రారంభం రోజు నాటకి కొత్త పాఠ్యపుస్తకాలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఇంత వరకు ఒక్క పాఠ్య పుస్తకం కూడా అందించలేకపోయారు. -
లంచగొండి పోలీసులకు రిమాండ్
కర్నూలు: రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లను రిమాండ్కు ఆదేశిస్తూ రాయలసీమ జిల్లాల ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య సోమవారం తీర్పు చెప్పారు. సీఐ మధుసూదన్ గౌడ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ దాడి కేసులో నిందితుడు బెస్త రవి నుంచి కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న నిర్మల్ హోటల్లో రూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐ, హెడ్ కానిస్టేబుల్ ఇళ్లలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించారు. సీఐ ఇంట్లో భారీగా బంగారు నగలు, స్థిరాస్తి పత్రాలు బయట పడినట్లు తెలిసింది. తనిఖీల అనంతరం పంచనామా పూర్తి చేసి మున్సిఫ్ కోర్టు ఆవరణలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. ఇదిలాఉంటే ఎస్పీ విక్రాంత్ పాటిల్ సిఫారసు మేరకు సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు నీరుగార్చేందుకు ఒత్తిళ్లు సీఐ మధుసూదన్ గౌడ్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రికి బాగా కావలసిన అధికారి. ఈ నేపథ్యంలో కేసు తీవ్రతను తగ్గించి మాధ్యమాల్లో ప్రచారం కాకుండా తీవ్ర ఒత్తిడి చేసినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. సీఐ గత ఏడాది ఆగస్టులో నాలుగో పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టారు. పోస్టింగ్ కోసం అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు ముడుపులు ముట్టజెప్పి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాత కేసులను కూడా తిరగదోడి డబ్బులు దండుకున్నట్లు స్టేషన్లో పనిచేసే ఉద్యోగులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సీఐ పోస్టు ఖాళీ కావడంతో పలువురు పోస్టింగ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి, నంద్యాలకు సమీపంలోని సర్కిల్లో పనిచేస్తున్న మరో సీఐ, గతంలో కర్నూలు అర్బన్ తాలూకాలో పనిచేసి బదిలీపై వెళ్లి వీఆర్లో ఉన్న మరో సీఐ ఈ సర్కిల్ పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
ప్లాస్టిక్ కాలుష్యంతో అనారోగ్యం
కర్నూలు(సెంట్రల్): సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణంపై ప్లాస్టిక్ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముద్రించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతమై కూర్చుందన్నారు. ప్లాస్టిక్ను నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిషోర్కుమార్రెడ్డి పాల్గొన్నారు. 30 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు మలేరియా నివారణ మాసోత్సవాలను ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మలేరియా నివారణ మాసోత్సవాలపై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఆర్యూలో కొత్త కోర్సులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రీషన్, నాలుగు సంవత్సరాల బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు తెలిపారు. సోమవారం వర్సిటీలోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వీసీ వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వనరులు(రెనేబుల్ ఎనర్జీ), డ్రోన్ టెక్నాలజీలకు సంబంధించి క్యాంపస్ విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనున్నామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా సెమినార్లు, కాన్ఫరెన్స్లతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రతి డిపార్ట్మెంట్కు రూ.50 వేల నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వివిధ పీజీ కోర్సులతో పాటు, ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు కొరతను అధిగమించడానికి తాత్కాలిక అధ్యాపకులను నియమిస్తామన్నారు. ఇంజినీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాల్లో రూ.2 కోట్లతో అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పీజీ సెమిస్టర్ పరీక్షల నుంచి ఆన్లైన్ వా ల్యుయేషన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామన్నారు. వర్సిటీ పునః ప్రారంభమయ్యాక టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులకు ఫేషియల్/ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెడతామన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పిల్లల చదువు భారమవుతోంది
మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు కర్నూలులోని కెవిఆర్ కాలేజీలో చదువుతున్నారు. మరొకరు సీ క్యాంపు దగ్గర ఉన్న కాలేజీలో చదువుతున్నారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఫీజుల పథకం కింద మొత్తం ఫీజులు చెల్లిస్తామని చెప్పినారు. కానీ ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మాలాంటి పేదలు పిల్లలను చదివించుకోవాలంటే భారంగా ఉంది. ఆ డబ్బులు ఇచ్చింటే కొంచెం ఊపిరాడేది. – మణెమ్మ, రైతు కూలీ, సింగవరం ఆ బడులను చూస్తే చదువుకోవాలనిపిస్తాది గత ప్రభుత్వం బడులను ఎంతో బాగా కట్టించింది. వాటిని చూస్తేనే పిల్లలకు బడికి పోవాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రయివేట్ స్కూళ్లు మాన్పించి ప్రభుత్వ బడికి పంపించినారు. మధ్యాహ్న భోజనం కూడా చానా బాగుందని అందరూ చెబుతుండ్రి. ఇప్పుడేమో ఆ స్కూళ్లను ఎవరూ పట్టించుకుంటలేరు. కొన్ని స్కూళ్లను తీసేస్తున్నారంట. ఇంకా బాగు చేయాలి కానీ, ఇలా చేస్తే పిల్లలు ఎట్టా బాగుపడతారు. – ఎలీసా, ఉల్చాల గ్రామం ● -
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): అర్జీదారులు సంతృప్తి చెందేలా వినతులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్)లో భాగంగా కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తనిఖీల వివరాలను గ్రామల వారీగా తనకు అందించాలని సూచించారు. డ్రోన్ ధర రూ.10 లక్షలా! ● బహిరంగ మార్కెట్లో బ్యాటరీ సహా రూ.8 లక్షలే.. ● కొనుగోలుకు ముందుకురాని గ్రూపులు కర్నూలు(అగ్రికల్చర్): పలు కంపెనీల డ్రోన్లు బహిరంగ మార్కెట్లో రూ.8 లక్షలకే లభిస్తున్నాయి. బ్యాటరీ లేకుండా అయితే రూ.6 లక్షలు, బ్యాటరీతో కలిపి రూ.8 లక్షలకే క్వాలిటీ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వ్యవసాయ శాఖ అందజేస్తున్న డ్రోన్ల ధరలో భారీగా వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశమైంది. వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న డ్రోన్ల యూనిట్ కాస్ట్ రూ.9.81లక్షలు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో విహంగ, డ్రోగో కంపెనీలు కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తున్నాయి. యూనిట్ కాస్ట్లో ఎఫ్ఎంజీ కిసాన్ డ్రోన్ గ్రూపులు 50 శాతం చొప్పున రూ.4.90 లక్షల ముందుగానే చెల్లించాల్సి ఉంది. మిగిలిన 50 శాతం బ్యాంకు లోన్ కింద సమకూరిస్తేనే యూనిట్ గ్రౌండ్ అవుతుంది. జిల్లాకు 35 డ్రోన్లను మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఐదు గ్రూపులు మాత్రమే 50 శాతం మొత్తాన్ని చెల్లించాయి. సిబిల్ స్కోర్ కారణంగా బ్యాంకుల నుంచి లోన్ పొందడం గగనమవడం.. యూనిట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండటం పట్ల గ్రూపు సభ్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సబ్సిడీ విత్తనాలకు రైతుల పేర్లు నమోదు కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వ్యవసాయ శాఖ స్పందించింది. సబ్సిడీపై వేరుశనగ, పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు, ఇతర విత్తనాలు పొందేందుకు రైతులు వెంటనే సంబంధిత రైతుసేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి కర్నూలు జిల్లాకు 10,261.50 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 8,766 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించింది. వేరుశనగతో సహా విత్తనాల కోసం ఆర్ఎస్కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులు నాన్ సబ్సిడీ చెల్లించి వేరుశనగ పొందవచ్చని సూచించారు. ఒక రైతుకు వేరుశనగ సాగుచేసే భూమిని బట్టి గరిష్టంగా 10 ప్యాకెట్లు( మూడు క్వింటాళ్లు) ఇస్తారు. కిలో పూర్తి ధర రూ.93 ఉండగా.. 40 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక ప్యాకెట్లో 30 కిలోల వేరుశనగ విత్తనం కాయలు ఉంటాయి. ప్యాకెట్ పూర్తి ధర రూ.2,790 ఉండగా.. సబ్సిడీ రూ.1,116 ఉంటుంది. సబ్సిడీ పోను రైతులు రూ.1,674 చెల్లించాల్సి ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరారు. ఎరువులు తరలిపోకుండా తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో జిల్లా నుంచి రసాయన ఎరువులు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా బార్డర్ చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ రంజిత్బాషా ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు మండలంలో పంచలింగాల, మంత్రాలయం మండలంలో మాధవరం, హాలహర్వి మండలంలో చింతకుంట, కౌతాలం మండలంలో బాపురం, ఆదోని మండలంలో పెద్దహరివాణం గ్రామాల్లో బార్డర్ చెక్పోస్టులు ఉన్నాయి. జిల్లాకు వచ్చిన ఎరువులను హోల్సేల్ డీలర్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలించే ప్రమాదం ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. రసాయన ఎరువులు ఇతర రాష్ట్రాలకు తర లించడాన్ని సమూలంగా నిర్మూలించేందుకే ప్ర త్యేక టీములు ఏర్పాటయ్యాయి. ప్రతి చెక్పోస్టు ప్రత్యేక టీమ్లో డిప్యూటీ తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. -
ఎమ్మిగనూరులో టీడీపీకి షాక్!
● పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 21వ వార్డు కౌన్సిలర్ ● త్వరలో కౌన్సిలర్ బాటలో మరికొందరు ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలో కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్వత్వానికి 21వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీజీఏ. వాల్మీకి దయసాగర్ సోమవారం రాజీనామా చేయటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. 11 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చురుకై న కార్యకర్తగా అనేక బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎర్పడి సంవత్సరం కావస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో సొంత పార్టీ నేత, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజీనామా కూటమి ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చినట్లయింది. కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, అయినా అధికార పార్టీకి రాజీనామా చేయటం గమనార్హం. కౌన్సిలర్ బాటలోనే మరికొందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఉద్యోగాల పేరుతో మోసం
● పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు కర్నూలు: ఇంటర్ చదివిన మా అమ్మాయి, అబ్బాయికి కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫరూక్ అనే వ్యక్తి రూ.2.26 లక్షలు తీసుకుని మోసగించాడని కర్నూలు అరుంధతి నగర్కు చెందిన డి.ఉమాబాయి ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 83 ఫిర్యాదులు రాగా, చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించారు. -
సర్వర్ పనిచేయక.. సరుకులు అందక !
రేషన్ సరుకులకు మళ్లీ జనానికి తిప్పలే. దుకాణం తెరిచి ఉందో లేదోనని పిల్లలను చూసి రమ్మని పంపడం ఇక మీదట కార్డుదారులు అలవాటు చేసుకోవాల్సిందే. ఇంట్లో ఎవరో ఒకరు పని మానుకొని దుకాణం వద్ద పడిగాపులు కాయాల్సిందే. అంతేకాదు.. ఇప్పుడు సర్వర్ పని చేస్తుందో లేదోననే బెంగ కూడా కార్డుదారులను వేధిస్తోంది. ఒకటో తేదీ నుంచి సరుకుల పంపిణీ ప్రారంభం కాగా అస్తవ్యస్త పంపిణీ స్వాగతం పలకడం తెలిసిందే. ఇక రెండో రోజు సోమవారం కర్నూలు నగరంలో సర్వర్ సమస్యతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ కారణంగా కార్డుదారులు దుకాణాల చుట్టూ రోజంతా తిరగడంతోనే సరిపోయింది. రాత్రి సమయంలోనూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో సరుకులు తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
వెన్నుపోటు దినానికి వలంటీర్ల మద్దతు
కర్నూలు(సెంట్రల్)/ బొమ్మలస్రతం: వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఈ నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు నిరసన దినానికి వలంటీర్ల సంపూర్ణ మద్దతు ఉంటుందని నంద్యాల, కర్నూలు జిల్లా వలంటీర్ల సంఘం అధ్యక్షులు హరికృష్ణ, నూర్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు మొదట బలైంది వలంటీర్లేనని, రూ.10 వేల జీతం ఇస్తానని ఊడదీయడంతో ఉపాధి లేకుండా రోడ్డన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమనే కాకుండా సమాజంలోని మహిళలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు కూడా వెన్నుపోటు పోడిచారన్నారు. ఎండీయూ బండ్లను నడుపుకొని ఉపాధిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వెన్నుపోటు దినానికి వలంటీర్లు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలపాలని ఆయన కోరారు. జలప్రసాద కేంద్రంలో మంటలు మహానంది: మహానంది దేవస్థానం ప్రాంగణంలోని బుకింగ్ కౌంటర్ (చిన్న గేటు) వైపు ఉన్న జలప్రసాద కేంద్రంలో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది శ్రీనివాసులు, దశరథ మరమ్మతులు చేస్తుండగా తీగల వద్ద షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే అప్రమత్తమై పరుగులు తీస్తూ బయటికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి సరిచేయడంతో ప్రమాదం తప్పింది. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య ఆస్పరి: మండల కేంద్రానికి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద సోమవారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన మంగళి నాగేశ్ (45)కు భార్య సుజాత ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్దకూతురు లక్ష్మికి వివాహం చేశారు. నాగేశ్ పోలకల్ గ్రామం నుంచి కర్నూలులో ఉంటున్న కూతురు లక్ష్మి, అల్లుడు శివ వద్దకు వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. మద్యం అలవాటు ఉన్న నాగేశ్కు మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో సోమవారం ఆస్పరి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా పొలాలకు వెళ్లే రైతులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లి చూసేసరికి నాగేశ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో భార్య సుజాత, కుటుంబసభ్యులు వచ్చి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో?
● సున్నిపెంటలో శ్రీశైల దేవస్థాన సిబ్బందికి వసతి గృహ సముదాయాలు ● రూ.39 కోట్లతో 297 గృహాలతో క్వార్టర్స్ ● అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు చర్యలు ● దేవదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు.. త్వరలో టెండర్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఉద్యోగులకు వసతి గృహ సముదాయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సున్నిపెంట గ్రామంలో ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలాన్ని దేవస్థానం బదలాయించి ఆ ప్రదేశంలో వసతి గృహాలను నిర్మించింది. ఏ, బీ, సీ మూడు బ్లాకులుగా విభజించి మొత్తం 297 గృహలను రూ.39 కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే దేవస్థాన వసతి సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడు బ్లాకుల్లో 297 గృహాలు శ్రీశైల దేవస్థానం రెగుల్యర్ ఉద్యోగులు సుమారు 260 మంది ఉంటారు. వీరికోసం ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలోని సున్నిపెంటలో ఇరిగేషన్ శాఖకు చెందిన 20 ఎకరాలలో వసతి గృహ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడు బ్లాకులుగా విభజించి క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టారు. ఏ–బ్లాకులో మొత్తం 4 భవనాలు ఉన్నాయి. ఒక్కొ భవనంలో 27 గదులు నిర్మిస్తున్నారు. ఈ గృహాలను అటెండర్లు, వాచ్మన్లు, కిందిస్థాయి సిబ్బంది (నాల్గవ తరగతి ఉద్యోగుల) కోసం ఎకనామీ క్లాస్గా నిర్మించారు. అలాగే బి–బ్లాకులో మొత్తం నాలుగు భవనాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో 27 గదులు నిర్మించారు. సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు తదితరుల కోసం నిర్మించారు. ఇందులో సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఉంటాయి. అలాగే సీ–బ్లాకులో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో 27 గదులు నిర్మించారు. రెండు బెడ్ రూంలు, హలు, కిచెన్ ఉండేలా నిర్మించారు. సూపరింటెండెంట్, సహాయ కార్యనిర్వహణాధికారి తదితర వారి కోసం నిర్మిస్తున్నారు. ఏ, బీ, సీ బ్లాకులలో మొత్తం 297 వసతి గృహలు నిర్మించారు. ఆయా గృహాల సముదాయాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్ పూర్తిచేసి, దేవస్థానానికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అదనపు సౌకర్యాలకు ప్రతిపాదనలు దేవస్థాన ఉద్యోగుల క్వార్టర్స్లో అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉంది. అలాగే అటవీ జంతువులు రాకుండా చుట్టూ ఫెన్సింగ్, తాగునీటి కోసం శ్రీశైలం డ్యాం నుంచి పైప్లైన్, స్టోరేజ్ ట్యాంకులు, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా పనులకు టెండర్లు పిలిచేందుకు ఇంజినీరింగ్ అధికారులు దేవదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. చీఫ్ ఇంజినీర్ స్వయంగా క్షేత్రానికి వచ్చి పరిశీలించి అనుమతులిస్తారు. ఆగస్టుకంతా ఉద్యోగస్తులను తరలిస్తాం శ్రీశైల దేవస్థానం ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వసతి గృహ సముదాయం పనులు దాదాపు పూర్తయ్యాయి. క్వార్టర్స్లో తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తాం. ఇప్పటికే వసతి గృహ సముదాయాన్ని ఐఐటీ నిపుణులు పరిశీలించారు. త్వరలో లాటరీ పద్ధతిలో ఉద్యోగులకు గృహాలు కేటాయిస్తాం. విద్యుత్ అంతరాయం లేకుండా 33/11 కె.వి.సబ్స్టేషన్ను సైతం ఏర్పాటు చేయబోతున్నాం. ఆగస్టు నెల చివరి నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు ఇబ్బందులు లేకుండా శ్రీశైలం నుంచి వసతి గృహాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
నోట్లో మాత్రలు కుక్కి భర్త, మరిది అమానుషం
వెల్దుర్తి: ఓ వివాహితపై భర్త, మరిది హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన షెహనాజ్కు, తడకనపల్లె గ్రామానికి చెందిన మౌలాలికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం కలుగలేదు. మౌలాలి తన తమ్ముడు నాసిర్తో కలిసి ప్రస్తుతం వెల్దుర్తి పట్టణంలోని వడ్డెగేరిలో నివాసముంటున్నారు. గురువారం రాత్రి షెహనాజ్ పరిస్థితి విషమంగా ఉందని ఆమె సోదరి అబ్దుల్లాకు సమాచారం అందడటంతో ఆమెను వెల్దుర్తి సీహెచ్సీకు తరలించాడు. అప్పటికే జ్వరం, కడుపునొప్పి, మోకాళ్ల నొప్పి ఇతరత్రా మందుమాత్రలు 40 వరకు ఆమె తిన్నట్లు తెలుసుకున్న వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం షెహనాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షెహనాజ్ను వదిలించుకోవాలని కుట్రతోనే ఆమె భర్త మౌలాలి, మరిది నాసిర్లు మందుమాత్రలు బలవంతంగా కుక్కి హత్యాయత్నం చేసినట్లు బాధితురాలి అక్క నస్రీన్, బావ సుభాన్, తమ్ముడు అబ్దుల్లా శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షెహనాజ్ భర్త మౌళాలి, మరిది నాసిర్లను స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. -
టీడీపీ నేతల బరితెగింపు
కొలిమిగుండ్ల: చింతలాయిపల్లెలో వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆదివారం టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడటంతో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు గాయపడ్డారు. గ్రామానికి చెందిన జమాల్రెడ్డి అమ్మవారికి మొక్కుబడి కార్యక్రమం చేయడంతో విందుకు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి చంద్రమోహన్రెడ్డితో పాటు పలువురు నాయకులను ఆహ్వానించారు. అబ్దులాపురం రోడ్డు లో వాహనం నిలిపి టీడీపీ నాయకుల ఇంటి మీదు గా నడుచుకుంటు వెళ్లారు. విందు పూర్తయ్యాక తిరిగి వస్తుండగా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా సిమెంట్ రోడ్డుపై ట్రాక్టర్ ఇంజిన్, బైక్ అడ్డుపెట్టారు. అయినా ఆగకుండా ముందుకు సాగడంతో వెనుక నుంచి కట్టెలు, రాడ్లు విసిరివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈగొడవలో వైఎస్సార్సీపీ నాయకుడు నీలం సంజీవకుమార్రెడ్డితో పాటు కార్యకర్తలు రవీంద్రబాబు, కంబగిరిరాముడుకు గాయాలయ్యాయి. ఆతర్వాత వైఎస్సార్సీపీ నాయకులు ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కార్యకర్త లు, మహిళలు అధిక సంఖ్యలో చంద్రమోహన్రెడ్డి ఇంటి వద్ద గుమికూడారు. సీఐ రమేష్బాబు సిబ్బందితో అక్కడికి చేరుకొని వైఎస్సార్సీపీ నాయకులను మందలించడంతో ఒక్కసారిగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని కాకుండా మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నా రని సీఐతో వాగ్వాదానికి దిగారు. అక్కడే సీసీ రోడ్డుపై కూర్చోని నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు పథకం ప్రకారం వాహనాలు అడ్డుపెట్టి దాడికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇరు పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి -
జెడ్పీలో బదిలీల కౌన్సెలింగ్
● రాజకీయ పైరవీలు లేకుండా నిబంధనల మేరకు బదిలీలు ● హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలుకర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బదిలీల్లో జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక జెడ్పీలోని చైర్మన్ చాంబర్లో ఉద్యోగుల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి కేడర్లో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన ఉద్యోగుల జాబితా, జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాలను డిస్ప్లే చేస్తూ, సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ కొనసాగించారు. జెడ్పీ పరిధిలో ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి అయిన జాబితాలో పరిపాలనాధికారులు 05, సీనియర్ అసిస్టెంట్లు 15, జూనియర్ అసిస్టెంట్లు 17, టైపిస్టులు 03, రికార్డు అసిస్టెంట్లు 03, టైబ్రరీ అసిస్టెంట్లు 05, ల్యాబ్ అసిస్టెంట్లు 04, ఆఫీసు సబార్డినేట్లు 04, స్వీపర్లు 01 మంది ఉన్నారు. అలాగే ఐదేళ్ల లోపు ఉండి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ముగ్గురు ఎంపీడీఓలతో పాటు మిగిలిన కేడర్లలో 74 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి అయిన వారితో పాటు రిక్వెస్ట్ పెట్టుకున్న వారు మొత్తం 134 మంది వివిధ కేడర్లలోని ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. బదిలీలను కోరుకున్న మెజారిటీ ఉద్యోగులు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం ఆఫీస్ బేరర్స్, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ... పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సెలింగ్ నిర్వహించడంపై పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ... ఆర్డబ్ల్యూఎస్లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మినిస్ట్రీయల్ ఉద్యోగుల బదిలీలను నిర్వహించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ బి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరిగాయి. ఆయా జిల్లాల పరిధిలోని కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఐదేళ్లు పైబడిన వారిని, రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకొని బదిలీలు నిర్వహించారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు సూపరింటెండెంట్లు, 30 మంది సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టెక్నికల్ ఆఫీసర్లు, నలుగురు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లతో పాటు పలువురు ఆఫీసు సబార్డినేట్లు ఉన్నారు. -
ప్రసూతి విభాగంలో కోతుల బెడద
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కోతుల బెడద అధికమైంది. ఈ విభాగంలో ఉదయం నుంచి రాత్రి వరకు కోతులు మందలు మందలుగా వస్తూ రోగులు, వారి సహాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల విభాగం, న్యూరాలజి, ఎండోక్రైనాలజి, గైనకాలజి విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు సైతం ఇవి చేరుకుంటూ వారి వద్ద ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. వార్డులోని వరండాల్లో భోజనం చేస్తున్న వారిపైనా దాడికి దిగి ఆహార పదార్థాలను లాక్కెళ్తున్నాయి. వార్డు బయట బైక్లు, స్కూటీలు, కార్లలో ఉంచిన పదార్థాలు, వస్తువులను సైతం తనిఖీ చేసి పారవేస్తున్నాయి. అందులో తినుబండారాలు ఉంటే వాటిని తీసుకెళ్తున్నాయి. మూకుమ్మడిగా వచ్చే వీటిని ఎలా తరిమేయాలా అని సెక్యూరిటీ గార్డులు తలపట్టుకుంటున్నారు. – కర్నూలు(హాస్పిటల్) -
‘ఉపాధి’ కూలీల ఆకలి కేకలు!
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే కూలీలకు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. ఈ పథకం కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపు నిలిచి పోయాయి. జిల్లాలో రూ.182 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు అవుతున్నా నిధులు రాలేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న సీఎం చంద్రబాబు.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు ఎందుకు తేలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెక్కలు వంచి పనిచేసిన కూలీలకు వేతనాలు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. పేదల కుటుంబాల్లో సంక్షోభం ఉపాధి వేతనాల కోసం జిల్లాలో 1.50 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొళగుంద, ఆస్పరి తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. ఈ ఏడాది మార్చి నెల 15 వరకు ఉన్న ఉపాధి వేతనాలను చెల్లించించారు. మార్చి నెల 16 నుంచి దాదాపు రెండున్నర నెలలుగా ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి వేతనం కూడా ఇవ్వలేదు. మొత్తం 30 లక్షల పని దినాలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఒక పని దినం విలువ రూ.307 ఉండగా.. కూలీలు చేసే పని పరిమాణాన్ని బట్టి సగటున రోజుకు రూ.290 వరకు వేతనం పడుతుంది. ఈ ప్రకారం కూలీలకు చెల్లించాల్సిన వేతనాల మొత్తం దాదాపు రూ.87 కోట్లు ఉంటుంది. వేతనం అందకపోవడంతో పేదల కుటుంబాల్లో సంక్షోభం నెలకొంది. వేసవిలో ఉపాధి పనులకు అత్యధికంగా 1.16 లక్షల మంది కూలీలు హాజరయ్యారు. వేతనాలు లేకపోవడంతో నేడు కూలీల హాజరు 80 వేలకు పడిపోయింది. పనులు తప్ప నిధులు శూన్యం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్లెపండుగ అంటూ హడావుడి చేసింది. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, గోకులం షెడ్లు వంటి వాటిని చేపట్టారు. జిల్లాలో 800 సీసీ రోడ్లు, 1254 గోకులం షెడ్లు నిర్మించారు. అయితే ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. పల్లె పండగ పేరుతో హడావుడి చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు నేడు మౌనంగా ఉండిపోయారు. సీసీ రోడ్లకు దాదాపు రూ.65 కోట్లు, గోకులం షెడ్లకు రూ.16 కోట్ల నిధులు నెలల తరబడి పెండింగ్లో ఉండిపోయాయి. వాటర్షెడ్ కింద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రూ.6 కోట్లు, మెటీరియల్ కాంపోనెంటు కింద చేపట్టిన పండ్లతోటల అభివృద్ధి తదితర వాటికి దాదాపు రూ.8 కోట్ల బిల్లులు ఇవ్వాల్సి ఉంది. వేతన.. వేదన జిల్లాలో జరుగుతున్న ఉపాధి పనులతో పాటు గోకులం షెడ్లు తదితర వాటిని పర్యవేక్షించేందుకు జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులకు అద్దె వాహనాలు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పీడీ, అడిషినల్ పీడీ, ఐదుగురు ఏపీడీలు ఏడు అద్దె వాహనాలు వినియోగించారు. ఎనిమిది నెలలుగా అద్దె వాహనాలకు బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే ఉపాధి హామీ పథకం పనులను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పర్యవేక్షించే సిబ్బందికి (800మందికి) మూడు నెలలుగా వేతనాలు అందలేదు. గతంలో ఎన్నడూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని ఉపాధి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వద్దు ఉపాధి కూలీలకు వేతనాలు మార్చి నెల 16 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఉపాధి ఉద్యోగులకు కూడా మార్చి నుంచి వేతనాల్లేవు. జిల్లాలో 30 లక్షల పని దినాలకు వేతనాలు విడుదల కావాల్సి ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే అన్నింటికి నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. – వెంకటరమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు ప్రభుత్వం ఏం చేస్తుందో? వ్యవసాయ పనులు లేనపుడు మాకు ఉపాధి పనులే ప్రధాన ఆధారం. నేను. నా భార్య, కుమారుడు, కోడలు మొత్తంగా నలుగురం ఉపాధి పనులకు వెళ్తున్నాం. మార్చి నెల 16 నుంచి ఇప్పటి వరకు చేసిన పనికి వేతనాలు అందలేదు. కూలీలకు వారం.. వారం వేతనాలు చెల్లిస్తే ఉపశమనం కలుగుతుంది. రెండన్నర నెలలుగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. పేదలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. – బంగి ఈరన్న, తుగ్గలి ఎలా బతకాలి ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లి మండుతున్న ఎండల్లో మధ్యాహ్నం 11 గంటల వరకు ఉపాధి పనులకు వెళ్లి రెక్కలు వంచి పనిచేశాం. రెండున్నర నెలలుగా కూలి చెల్లించకపోతే ఎలా బతకాలి. సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తే ఆదివారం కూలీ డబ్బులు చేతికి అందితే సంతృప్తి ఉంటుంది. ఉపాధిలో మాత్రం రెండున్నర నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – వి.ఉలిగమ్మ, గుడికంబాలి, కౌతాళం మండలం 30 లక్షల పని దినాలకు నిలిచిపోయిన చెల్లింపులు పేద ఇళ్లల్లో తీవ్ర ఇబ్బందులు అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం -
ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ ( సివిల్, ఏపీఎస్పీ) అభ్యర్థులకు కర్నూలులోని 16 కేంద్రాల్లో మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు శివారుల్లోని జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల, బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, కేవీ సుబ్బారెడ్డి కళాశాల, అతీనా స్కూల్, మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్, శంకరాస్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరిగిన తీరును పరిశీలించారు. 7,597 మంది అభ్యర్థులకు గాను 6,947 మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షకు హాజరైనట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు జరిగాయన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా, డీఎస్పీలు శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, సీఐలు, ఎస్ఐలు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించారు. -
మెడికల్ దుకాణాలపై అధికారుల దాడులు
కర్నూలు(హాస్పిటల్): ‘ఔషధం...ప్రాపగండం’ శీర్షిక గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో కర్నూలు నగరంలోని 25 మెడికల్షాపుల్లో కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. హోల్సేల్ ప్రాపగండ కం డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలతో పాటు ఆసుపత్రుల్లోని ఫార్మసీలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో మందుల ధరలు, వాటి నాణ్యతలు, మందుల లేబుళ్లను పరిశీలించారు. మొత్తం 25 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్ట నిబంధనలను పాటించని షాపులను గుర్తించి ఆ షాపులపై చర్యలు తీసుకునేందుకు నివేదికలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు డి.హరిహరతేజ, షేక్ పర్వీన్ సుల్తానా(కర్నూలు), పి.హనుమన్న(అనంతపురం), దాదా కలంధర్(నంద్యాల), ఎస్.జయరాముడు, పి.కేశవరెడ్డి(అన్నమయ్య), జి.మాధవి(వైఎస్ఆర్ కడప) పాల్గొన్నారు. -
కేజే రెడ్డి కొనుగోలు చేసిన భూములు రద్దు చేయాలి
● నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల డిమాండ్ కర్నూలు (టౌన్): కొంపల్లి తండా, ఉలిందకొండ, ఎర్రకత్వ గ్రామాల్లో కేజే రెడ్డి తన అనుచరుల పేరు మీద కొనుగోలు చేసిన భూముల క్రయవిక్రయాలను వెంటనే రద్దు చేయాలని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది క్రిష్ణ, బీసీ జన సభ నాయకులు శేషుఫణి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా గ్రామాల్లో నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. భూములు అన్యాయంగా కొల్పోయిన వారితో సభ్యులు మాట్లాడారు. తాము సాగు చేసుకుంటున్న భూములను కేజే రెడ్డి బలవంతంగా లాక్కున్నారని, ఎకరా రూ. 50 వేలు చెల్లించి రూ. 6 లక్షలు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని బాధితులు కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కేజే రెడ్డి రైతులను భయపెట్టి వారి భూములను తన అనుచరుడైన నాగరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన నాగన్న అతని కుమారులు సంజీవ్, విష్ణు, అశోక్ అనే వ్యక్తులపై కేజే రెడ్డి తప్పుడు కేసులు నమోదు చేయించి వారిని ఉలిందకొండ పోలీసుల సాయంతో గ్రామం నుంచి బహిష్కరించారని చెప్పారు. అన్యాయంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఽచంద్రబాబు, సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, పోలీసులు నాగన్నను హింసించినందుకు నష్ట పరిహారం రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య పోరాట సమితి నాయకులు షేక్ బాజీద్, న్యాయవాది రఘనాథరెడ్డి, రామకుమార్ పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య బనగానపల్లె రూరల్: నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన అబ్దుల్గని(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకట రమణ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అబ్దుల్గని మద్యానికి బానిస కావడంతో కుటుంబీకులు మందలించారు. దీంతో మనస్తాపంతో జీవితం పై విరక్తి చెంది ఆదివారం రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య ఫకూర్బీ, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మిల్క్ వ్యాన్ దగ్ధం ప్యాపిలి: జాతీయ రహదారిపై పోతుదొడ్డి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మిల్క్ వ్యాన్ దగ్ధమైంది. హైదరాబాదు నుంచి పలమనేరుకు వెళ్తున్న మిల్క్వ్యాన్ పోతుదొడ్డి వద్దకు రాగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే వ్యాన్ను రోడ్డుకు ఓ వైపు ఆపి దిగాడు. కొద్ది సేపటికే మంటలు వ్యాన్ మొత్తానికి వ్యాపించడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. ఆటో బోల్తా – బాలుడి మృతి ప్యాపిలి: పట్టణ సమీపంలో ఆదివారం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు చెందాడు. పట్టణానికి చెందిన రంగస్వామి కుమారుడు దివాకర్ (12) ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో దివాకర్ పైన పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బాబుది వెన్నుపోటు చరిత్ర
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వెన్నుపోటు చరిత్రను ఎవరు మరచిపోగలరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై ఈనెల 4న చేపడుతున్న వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కర్నూలు గిప్సన్ కాలనీలోని తన నివాసంలో కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. నగర మేయర్ బీవై రామయ్య, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయమనోహారి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో మంత్రి పదవి అనుభవించి ఆ పార్టీకే వెన్నుపొడిచారన్నారు. తరువాత మామ వంచన చేరి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన విషయం ఎవరూ మరచిపోలేరనప్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు ఇస్తామని ఎన్నికల్లో సమయంలో హామీ ఇచిక్చ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ● కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నైజం అబద్ధాలు చెప్పడమేనన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. అమరావతి తప్ప ఇతర ఏ జిల్లాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ● కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ విజయమనోహరి మాట్లాడుతూ.. మహిళలను, నిరుద్యోగులను, రైతులను టీడీపీ మోసం చేసిందన్నారు. కర్నూలు ఆర్ఎస్ రోడ్డులో దేవాలయం ఎదురుగా టానిక్ అనే మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. ● వెన్నుపోటు దినం పోస్టర్లను వైఎస్సార్సీపీ నేతలు అవిష్కరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, పార్టీ నాయకురాలు మంగమ్మ, భారతి, కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, జుబేర్, రాజేశ్వర రెడ్డి, ఆర్షియా ఫర్హీన్, షేక్ అహమ్మద్, యూనుసుభాషా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేంత వరకు ప్రభుత్వంపై పోరాటం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మేయర్ రామయ్య -
పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీపై కూటమి కుట్ర
బేతంచెర్ల: టీడీపీ నాయకుల స్వార్థ రాజకీయాలతో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీపై నీలినీడలు కమ్ముకుంటు న్నాయి. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ కల్పన విష యంలో టీడీపీ నాయకులు కొత్త నాటకానికి తెరలేపడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే నష్టాలతో ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో వందలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభు త్వం హయాంలో మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించేందుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన కృషి ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుతం సవ్యంగా కొనసాగుతున్న పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని బెదిరించే ధోరణిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో స్థానికులను రెచ్చగొట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ ప్రాంతవాసుల ఉపాధి కల్పించాలనే నెపంతో సోమ వారం ఫ్యాక్టరీ ఎదుట టీడీపీ ధర్నాకు పిలుపు ఇచ్చింది. అయితే టీడీపీ నేతల తీరును గ్రామస్తులు, కార్మి కులు తప్పుపడుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో స్థానికులను రెచ్చగొడుతున్న టీడీపీ నేతలు ? ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం ధర్నాకు పిలుపు ఇవ్వడంతో కార్మికులు, ప్రజల ఆందోళన -
చెట్నహళ్లిలో అంత్యక్రియల వివాదం
మంత్రాలయం రూరల్: చెట్నహళ్లి గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియల విషయం రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. తమ ఇళ్లను అనుకుని ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించరాదని కొందరు అడ్డుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమకు వేరే స్థలం లేదని అక్కడే అంత్యక్రియలు చేపడతామన్నారు. రెండు నెలలుగా ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం ఉదయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసి కొందరు గ్రామంలోని 167వ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్ల వద్ద అంత్యక్రియలు చేయొద్దంటూ నినదించారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజులు సంఘటన స్థలానికి వెళ్లి ఆందోళనకారులను శాంతింపజేశారు. -
డీఎస్సీపై డౌట్ లోడ్!
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీలో పొర‘పాట్లు’ చోటుచేసుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని డీఎస్సీ జేడీ కార్యాలయం చెప్పింది. అయితే కొందరికి మాత్రమే డౌన్లోడ్ అయ్యాయి. వాటిలోనూ తప్పులు ఉన్నాయి. మొత్తం మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఒకదానికి మాత్రమే హాల్టికెట్ వచ్చింది. ఐడీ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసినా హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదు. సాంకేతిక సమస్యలతో చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందారు. కర్నూలు జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ దృష్టికి తీసుకుపోవడంతో ఆ తర్వాత వారు డీఎస్సీ నిర్వాహకుల దృష్టికి సమస్యను తీసుకుపోయిన తర్వాత కొంత పరిష్కారమయ్యింది. డీఎస్సీకి రాష్ట్రంలో అత్యధికమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో సాంకేతిక సమస్యలతో హాల్టికెట్లలో పొరపాట్లు వచ్చాయని, ఆదివారం ఉదయం లోపు సమస్య సర్దుబాటు అవుతుందని అభ్యర్థులకు డీఈఓ తెలియజేశారు. ఏ కేంద్రంలో ఎంతమంది? ఉమ్మడి జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు మొత్తం 73,605 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 5, నంద్యాలలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ కేంద్రంలో ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు స్పష్టత రాలేదు. నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశమున్నట్లు ఆందోళన చెందుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే ప్రశ్నపత్రం, ఒకే జిల్లా ఒకే ప్రశ్నపత్రం విధానంలో పరీక్షలు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని నెల రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. డౌన్లోడ్ కాని హాల్ టికెట్లు పరిష్కారం చూపని రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న సాంకేతిక సమస్యలు ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ఇదీ నిర్లక్ష్యం.. అదిగో ఇదిగో అంటూ సుమారు 11 నెలలు జాప్యం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిపరేషన్కు సమయం లేకుండా పరీక్షలు నిర్వహించడంపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 45 రోజులు మాత్రమే ప్రిపరేషన్కు అవకాశం ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గత నెల 30వ తేదీ నుంచే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కావాలి. అయితే డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతోనే షెడ్యూల్ ప్రకారం హాల్టిక్కెట్లు డౌన్లోడ్ కాలేదు. -
రజక విద్యార్థులకు 7న ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్లో అత్యంత ప్రతిభ కనబరిచిన రజక విద్యార్థులకు ఈనెల 7న ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీపీ వెంకటేష్ తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో పురస్కారాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 10వ తరగతిలో 450, ఇంటర్లో 800 మార్కులకు పైగా, డిగ్రీలో 80 శాతం, బీటెక్లో 80 శాతం ఉత్తీర్ణత సాఽధించిన వారితో పాటు ఎంసెట్, ఇంజనీరింగ్, మెడిసిన్లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు జూలై 31లోగా 9110396511 నెంబర్ను సంప్రందించాలన్నారు. కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ బండారు లింగమయ్య, మహిళా అధ్యక్షురాలు బాపనపల్లి రాధ, న్యాయవాది జగదీష్ తదితరులు పాల్గొన్నారు కృష్ణానదిలో విద్యార్థి మృతి శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంకు దిగువన కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానిక ఏపీ జెన్కో కార్యాలయ లో పని చేసే ఆశీర్వాదం,కుమారి దంపతుల ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నిఖిల్(17) గుంటూరు జిల్లా పేరేచెర్లలో డిప్లొమో చదువుతున్నాడు. ఇటీవల సున్నిపెంటకు చేరుకున్న విద్యార్థి శనివారం స్నేహితులతో కలసి సరదాగా లింగాలగట్టు బ్రిడ్జి దగ్గర ఈత కొట్టేందుకు వెళ్లారు. కాగా నదిలో ఓ చోట లోతుగా ఉండగా ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం కుటుంబీకులు గాలించగా రాత్రి 8.30 గంటల సమయంలో మృతదేహం లభించగా, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంచి వర్సిటీలో నేడు స్పాట్ అడ్మిషన్లు కర్నూలు కల్చరల్: కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర రావు పేర్కొన్నారు. కర్నూలులోని శంకర మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు ఖండేరిలోని శంక మందిరంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు 96290 32323, 96290 01144 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. -
చదువుకు పేదరికం అడ్డుకారాదు
కోవెలకుంట్ల: చదువుకు పేదరికం అడ్డుకారాదని కార్మిక శాఖ అదనపు కార్యదర్శి, జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు అన్నారు. సంజామల మండలం ఆల్వకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లె పుల్లయ్య శనివారం పదవీ విరమణ పొందారు. పట్టణ శివారులోని వీఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాలులో ఆయనకు పదవీ విరమణ సన్మాన సభ ఏర్పాటు చేశారు. గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి హాజరై తనకు చదువు చెప్పి ఉన్నత స్థాయిలో నిలిపిన ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించి గురుభక్తి చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 1950 సంవత్సరానికి ముందు చదువు మూడు శాతం మందికి మాత్రమే అందేదని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. 2024 కులగణన ప్రకారం అక్షరాస్యత, కుటుంబ మౌలిక సదుపాయాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రుల తర్వాత సమాజంలో ఉపాధ్యాయుడికి సముచితస్థానం ఉందన్నారు. కొలిమిగుండ్ల మండలం కోటపాడు ప్రాథమిక పాఠశాలలో 1990–92 మధ్యకాలంలో తాను పుల్లయ్య సార్ వద్ద చదువు నేర్చుకుని జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపికయ్యానన్నారు. ఆ తర్వాత కాలంలో ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ సాధించానని ఈ సందర్భంగా చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు రాజయ్య, వెంకటసుబ్బయ్య, ఈశ్వరయ్య, హెచ్ఎం హరిప్రసాద్, రిటైర్డ్ హెచ్ఎంలు నాగేశ్వరరెడ్డి, పక్కీరెడ్డి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
కర్నూలు: ఆదోని వాల్మీకి నగర్లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదోని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.91 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు గత నెల 18న క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి నాగరాజును అదుపులోకి తీసుకోగా మిగిలిన ఆరుగురు పారిపోయారు. సాంకేతికత ఆధారంగా మిగిలిన ఆరుగురిని కర్నూలు, హైదరాబాద్, ఒంగోలు, చిలకలూరిపేట, బెంగళూరు సిటీ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నాగరాజుతో పాటు ఆదోని పట్టణానికి చెందిన మసీదుపుర ఇస్మాయిల్ అలియాస్ ఇస్మాయిల్, బోయ మహానంది, బోయ రమేష్, బెంగళూరు సిటీకి చెందిన ఎస్.రాజేష్, ఒంగోలు పట్టణానికి చెందిన అడ్డాల కళ్యాణ్, హైదరాబాద్కు చెందిన రఘు ఆచారి తదితరులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్తో కలసి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నేషనల్ ఎక్సేంజ్ 9, రాధే ఎక్సేంజ్, వజ్రా ఎక్సేంజ్, నేషనల్ 777, మోర్ ఎక్సేంజ్ తదితర క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో వీరు బెట్టింగ్ నిర్వహించినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ను ఆన్లైన్లో ఆడుతూ డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారని ఎస్పీ అన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారన్నారు. బెట్టింగ్ను ఎలాగైనా అరికట్టాలని గత నేర సమీక్ష సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు గట్టిగా ఆదేశించినట్లు తెలిపారు. సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన ఆదోని డీఎస్పీ హేమలత, సీఐ శ్రీరామ్తో పాటు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మునుస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుసేన్ బాషాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రూ.91 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు సీజ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
దిక్కులు చూస్తున్నాం
మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కింద పంటలు సాగు చేస్తున్నాం. ఖరీఫ్ ముంచుకొస్తోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు ముందే వైఎస్సార్ రైతుభరోసా, ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. ఇది రైతులకు ఊరట నిచ్చేది. ఇపుడు రైతులకు చేయూత లేకపోవడంతో దిక్కులు చూస్తున్నాం. – కే.గంగన్న, బస్తిపాడు, కల్లూరు మండలం అప్పులు తెస్తున్నాం కూటమి ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. 2024–25లో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిసాయానికి మంగళం పలికారు. ఈ సారి ముందస్తుగా వానలు పడుతున్నాయి. విత్తనాలు లేవు. ఆర్బీకేల్లో ఎరువులు కరువు. పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. – లింగన్న, మారెళ్ల, తుగ్గలి మండలం -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు (టౌన్): విద్యార్థులను, మహిళలను, రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ నిరసనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. కల్లూరులోని తన గృహంలో పాణ్యం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితుల బహిష్కరణ వంటి దుర్మార్గపు పాలన జరుగుతోందన్నారు. వేలం లేకుండా, క్యాబినెట్లో చర్చించకుండా దేవదాయ భూములను టీడీపీ నాయకులకు అప్పగించేందుకు చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు అత్యుత్సాహం చేయడం తగదన్నారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను అవిష్కరించారు. కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారయణ రెడ్డి, మిడుతూరు శ్రీనివాసులు, పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, భీమేశ్వరరెడ్డి, క్రిష్ణమూర్తి, కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి. అరుణ, సుదర్శన్ రెడ్డి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. 4న వెన్నుపోటు దినం భారీగా నిర్వహిద్దాం పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి