తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ట
మల్లన్న భక్తులకు కష్టాల దర్శనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయిన దేవస్థానం అధికారులు సోమవారం చేతులెత్తేశారు.
గంటల తరబడి క్యూలైన్లలోనే..
వీఐపీల సేవలో తరలించిన దేవస్థానం అధికారులు శివస్వాములు, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించినట్లు సోమవారం చోటు చేసుకున్న ఘటనలతో వెల్లడైంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండ వేడిని తట్టుకోలేక భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ
ఏర్పాట్లలో వైఫల్యం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
వందల కిలోమీటర్ల దూరం
కాలినడక యాత్ర
ఇరుముడితో శ్రీశైలం చేరుకున్న
స్వాములు
దర్శన ఏర్పాట్లలో చేతులెత్తేసిన
అధికార యంత్రాంగం
గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు
విధిలేక దర్శనం చేసుకోకుండానే
తిరుగుముఖం
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ట
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ట
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ట


