పంటకు కాపలా పులి
రబీలో సాగు చేసిన పంటలు కోతకు వస్తున్నాయి. అయితే నల్లమల అటవీ సమీపంలో ఉండటంతో పశు, పక్షాదుల నుంచి రక్షణ కరువైంది. అటవిలో నుంచి పందులు, జింకలు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. మరో వైపు పక్షుల గుంపు పంటలపై వాలి క్షణాల్లో దిగుబడులను తినేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు రైతులు దిగుబడులను కాపాడుకునేందుకు కొందరు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి వివిధ శబ్దాల ద్వారా తరమేస్తున్నారు. మరి కొందరు దిష్టి బొమ్మలు, పెద్ద పులి, చిరుత పులులు, కొండ ముచ్చులు వంటి వాటి బొమ్మలను ఏర్పాటు చేసి భయపెడుతున్నారు. రుద్రవరం, ఎల్లావత్తుల, ఢీకొట్టాల, హరినగరం, నర్సాపురం, ఆలమూరు, చిత్రేనిపల్లె, కొటకొండ, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె తదితర గ్రామాల పరిధిలోని రైతులు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు.
– రుద్రవరం


