మూతపడిన బంగారు దుకాణాలు
ఎమ్మిగనూరుటౌన్: పుత్తడి, వెండి ధరలు అమాంతం పెరగడం.. మళ్లీ రోజుల వ్యవధిలో తగ్గుముఖం పడుతుండటంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో హెచ్చతగ్గులను భరిస్తూ వ్యాపారాలు చేయలేమని ప్రభుత్వాలు స్పందించి ధరలను స్థిరీకరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని షరాఫ్ బజార్లో బంగారు వ్యాపారులు తమ దుకాణాలు మూసి నిరసన తెలిపారు. ఽఆభరణాల తయారీకి కొన్న బంగారు, వెండి ధరలు తగ్గుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని గోల్డ్, సిల్వర్ దుకాణాల అసోసియేషన్ నాయకులు పీసీఆర్ వలి, మోహన్, ఖాదర్బేగ్ తదితరులు పేర్కొంటున్నారు. ధరలను స్థిరీకరిస్తే వ్యాపారాలు చేయగలుగుతామని తెలిపారు.


