గ్రీన్‌కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Feb 1 2026 3:11 AM | Updated on Feb 1 2026 3:11 AM

గ్రీన్‌కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

గ్రీన్‌కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఓర్వకల్లు: గుమ్మితం తండా పరిధిని బహుళార్ధక సోలార్‌ పరిశ్రమను స్థాపించిన గ్రీన్‌కో యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహర్‌రెడ్డి ఆయన సతీమణి డీసీసీబీ మాజీ చైర్‌పర్సన్‌ విజయ మనోహరి శనివారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌కు ఫిర్యా దు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ దంపతులు మాట్లాడుతూ.. కాల్వ రెవెన్యూ పరిధిలో తమకు 10 ఎకరాలు భూమి ఉందని, అందులో మామిడి మొక్కలు ఉన్నాయన్నారు. భూమిలో సుమారు 4 ఎకరాల మేర గ్రీన్‌కో యాజమాన్యం వారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మామిడి మొక్కలను తొలగించి వ్యర్థాలను నిల్వ చేసినట్లు తెలిపారు. పొలంలో డ్రిప్‌ పైపులను పగిలి పోయాయన్నారు. ఈ విషయంపై పలుసార్లు కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రీన్‌కో సిబ్బంది నిర్వాకంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement