అన్నదాన శిబిరాలను ప్రారంభించాలి
శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన వెళ్లే భక్తులు, శివస్వాములు ఇబ్బందులు పడకుండా దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేయాలి. డివిజన్ పరిధిలోని 15 మంది తహసీల్దార్లు, అదే సంఖ్యలో డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలను విధులకు కేటాయించాం. వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు 13 మెడికల్ క్యాంపులు, ఒక్క శ్రీశైలంలోనే ఉచిత వైద్యశిబిరాలు 30 ఏర్పాటు చేశాం. భీమునికొలను, కై లాసద్వారం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి కల్పించారు. ఆత్మకూరు–దోర్నాల వరకు రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. పాదయాత్ర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలి. – నాగజ్యోతి, ఆర్డీఓ


