21 నుంచి గాదిలింగేశ్వరస్వామి మహోత్సవాలు
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామంలో కొలువైన గాదిలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రాధాకృష్ణ, గ్రామపెద్దలు బుధవారం తెలిపారు. 22న గాదిలింగేశ్వర, సిద్ధేశ్వరస్వామి వార్ల జోడు రథోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు రథోత్సవ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 167పై బుధవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయాయి. మాధవరం నుంచి భరత్కుమార్ బైకుపై ఎమ్మిగనూరుకు వెళ్తుండగా.. గ్రామంలోని చర్చి వద్ద మాధవరం గ్రామానికి చెందిన కురువ ఈరన్న రోడ్డు దాటుతుండగా తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో భరత్కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది స్పందించి అంబులెన్స్లో ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


