ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ప్రజలకు ఉన్న ఏకై క వజ్రాయుధం ఓటు హక్కు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు మదిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. దీనిని ఎన్నికల కమిషన్ విశేషంగా ప్రోత్సహిస్తోంది. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించినట్లు అవుతుంది. – డాక్టర్ ఏ.సిరి, కలెక్టర్, కర్నూలు
భారత దేశం ప్రజాస్వామ్య దేశం. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల్లో భాగస్వా మ్యం కావాలి. ఇది యువత విధి. భారతదేశ ఎన్నికలు ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శం. యువత తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయి.
– పి.కరుణానిధిమూర్తి, డైట్ కాలేజీ, కర్నూలు
ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ


