విజయ డెయిరీ చైర్మన్కు సన్మానం
నంద్యాల(అర్బన్): అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కుట్రలు చేసినా విజయ డెయిరీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్వితీయ విజయం సాధించింది. విజయ డెయిరీ చైర్మన్గా ఎస్వీ జగన్మోహన్రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. కర్నూలులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో 12 మంది డెయిరీ డైరెక్టర్లు.. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్ జగన్మోహన్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తొలిసారి 2021 జనవరిలో, ప్రస్తుం రెండో సారి ఎన్నిక కావడంపై డైరెక్టర్లు, డెయిరీ ఎండీ ప్రదీప్కుమార్ చైర్మన్ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్ 15న 12 మంది డైరెక్టర్లు తనను చైర్మన్గా ఎన్నుకున్నారన్నారు. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలు ఉన్నందున చైర్మన్ ఎన్నికను ప్రకటించలేదన్నారు. నామినేషన్లు వాయిదా పడటంతో డైరెక్టర్లు తనను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.


