మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

మహిళ దుర్మరణం

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

కర్నూలు (సిటీ): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పంచలింగాలకు చెందిన ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి స్పల్పగాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఉండవల్లి సమీపంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బస్తిపాటి నాగరాజు చిన్న కుమారుడు నాగరాజు వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి మండలం కంచిపాడులో జమ్ములమ్మ దర్శనం నిమిత్తం స్వగ్రామం పంచలింగాల నుంచి కారులో బయలుదేరారు. ఉండవల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బైక్‌ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోగా అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో మనెమ్మ (60) అనే మహిళ మృతిచెందగా మద్దిలేటి, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు ఎంపీకి స్వయాన చిన్నమ్మ. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ ప్రమాద విషయం తెలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement