breaking news
Nagarkurnool District News
-
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం
కొల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని.. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్నర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్లాపూర్లో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేసి.. నిజమైన పేదలకు అన్యాయం చేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఓవైపు ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతుంటే.. స్థానికంగా మాత్రం అందుకు విరుద్ధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించాలని వారు కోరారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కేవరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. సీపీఐ నాయకులు ఇందిరమ్మ, కుర్మయ్య, కిరణ్కుమార్, తుమ్మల శివుడు, యూసూఫ్, జంగం శివుడు, చందు, శంకర్, శివకృష్ణ, శేఖర్, దామోదర్, రమేశ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వేతన వెతలు..
జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లకు 6 నెలలుగా అందని జీతాలు ●సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు రావడం లేదు. డెయి లీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తుండగా.. ఇప్పుడు వేతనాలు నిలిచిపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి కార్మికులు నిరవదిక సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో హాస్టళ్ల నిర్వహణపై ఆందోళన నెలకొంది. గతంలో కలెక్టర్ గెజిట్ ద్వారా డెయిలీ వేజ్ లేబర్కు వేతనాలు చెల్లించేవారు. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా రూ. 13,500 చొప్పున వేతనం లభించిందని కార్మికులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ 64 అమలు చేయడంతో వేతనం తగ్గిందని అంటున్నారు. ఎక్కడైనా ఏళ్లు గడిచిన కొద్ది జీతం పెరగాల్సి ఉండగా.. ఈ జీఓ ఫలితంగా తమ జీతం రూ. 11,700కే పరిమితమైందని ఆవేదన చెందుతున్నారు. ఈ వేతనం సైతం ఆరు నెలలుగా నిలిచిపోవడంతో వారిలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. డైలీ వేజ్ వర్కర్ల వేతనాలను ఒక్కో జిల్లాల్లో ఒక్కో తీరుగా అమలు చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని ఖమ్మం తదితర జిల్లాల్లో కార్మికులకు ప్రతినెలా రూ. 26వేల వరకు అందుతోందని.. జిల్లాలో మాత్రం కేవలం రూ. 11,700 అందుతోందని కార్మికులు వాపోతున్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు అందించాలని, తమకు టైం స్కేల్ వర్తింపజేయాలని, ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టళ్ల కార్మికుల పరిస్థితి దైన్యం నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్ గిరిజన ఆశ్రమ హాస్టళ్ల ఎదుట నిరవదిక సమ్మెకు దిగిన కార్మికులు జిల్లాలోని 29 గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సుమారు 150మంది కార్మికులు డెయిలీ వేజ్ లేబర్గా పనిచేస్తున్నారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, వంట పని, విద్యార్థులకు వడ్డించడం తదితర పనులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల భోజనం మెనూలో చేసిన మార్పుల ఫలితంగానూ తమపై పనిభారం పెరిగిందని అంటున్నారు. అయితే సుమారు 15 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్నా.. నెలకు రూ. 11,700 మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోని వేతనాలతో తాము ఇబ్బందులు పడుతుండగా.. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. -
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి..
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా విలువలను కాపాడటంలో స్ఫూర్తిగా ఉండాలి. ప్రజల అభిప్రాయాలను తెలిపే పత్రికలను ప్రభుత్వాలు గౌరవించాలి. ఆంధ్రప్రదేశ్లో పాత్రికేయులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. – బవాండ్ల వెంకటేశ్, టీఎన్జీవో ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలపై దాడులను ప్రజలు సహించరు. ప్రతిపక్ష నాయకుల ప్రెస్మీట్లను ప్రచురించినా కేసులు పెట్టడం అన్యాయం. – పొదిల్ల రామయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, నాగర్కర్నూల్ పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. భావ ప్రకటన హక్కులో భాగమైన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు కాపాడాలి. పత్రికల్లో వచ్చిన వార్తలను ఏకీభవించకపోతే రిజాయిండర్, ఖండన ఇవ్వాలి. కానీ, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. ఏకంగా పత్రికా ఎడిటర్పైనే కేసులు పెట్టి పోలీస్స్టేషన్లో విచారించడం కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉంది. – బోనాసి రామచందర్, న్యాయవాది, నాగర్కర్నూల్ -
రాజీయే రాజమార్గం
● నేడు జాతీయ లోక్అదాలత్ ● అప్పీల్ లేకుండా కేసుల పరిష్కారం ● కక్షిదారులకు సత్వర న్యాయంకల్వకుర్తి టౌన్: కోర్టు పరిధిలోని చిన్నచిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్ చక్కటి వేదికగా చెప్పవచ్చు. కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదుర్చుకోవడమే గాక, ఇరువర్గాలకు న్యాయం జరిగేలా న్యాయస్థానాలు పరిష్కార మార్గాలు చూపుతాయి. ఇక్కడ కుదిరిన రాజీ కేసులను అప్పీల్ చేసుకోవడానికి వీలు లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం 4వ జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. లోక్అదాలత్లో మోటార్ వెహికిల్ యాక్టు, ఆబ్కారీ, రుణాలు, కుటుంబ తగాదాలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత జూన్లో నిర్వహించిన 3వ జాతీయ లోక్అదాలత్లో 17,495 కేసులను పరిష్కరించగా.. రూ. 58,37,519 జరిమానా వసూలైంది. కాగా, లోక్అదాలత్లో కేసుల పరిష్కారంతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోక్అదాలత్కు వచ్చే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు.జాతీయ లోక్అదాలత్లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. చిన్నచిన్న కేసుల్లో రాజీ కుదుర్చుకోవడానికి లోక్అదాలత్ ఉపయోగంగా ఉంటుంది. కక్షిదారులు, నిందితులుగా ఉన్నవారు వారి సమీపంలోని పోలీస్స్టేషన్లో సంప్రదిస్తే.. వారికి అక్కడి పోలీసులు సహాయం అందిస్తారు. – వెంకట్రెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి -
షేర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్లు
● గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో షేర్వాల్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలో షేర్వాల్ టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ముందుగా 20వ వార్డు ఈదమ్మగుడి సమీపంలో లబ్ధిదారుడు రవిశంకర్ ఇంటిని సందర్శించి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారుడికి అప్పగించాలని ఆయన సూచించారు. అనంతరం 13వ వార్డులో బొంద మల్లమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇటుకలు అవసరం లేకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో కేవలం 20 రోజుల్లోనే ప్రభుత్వం అందించే రూ. 5లక్షలతో పక్కా ఇల్లు నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో మోడల్ హౌస్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీకి మొత్తం 442 ఇళ్లు మంజూరు కాగా.. 248 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగిలిన ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించి.. వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. షేర్వాల్ టెక్నాలజీతో కొనసాగుతున్న ఇళ్ల పనుల పూర్తిపై మున్సిపల్, గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. -
కుటుంబ పోషణ భారంగా మారింది..
మాకు ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదు. నెలల తరబడి జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. రోజంతా పనిచేస్తున్నా సరైన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నాం. నెలనెలా వేతనాలు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలి. – పద్మ, గిరిజన పాఠశాల వర్కర్, మన్ననూర్ మేమంతా 15 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు మాత్రం పెరగలేదు. గతంలో నెలకు రూ. 13,500 ఉంటే, జీఓ 64 వచ్చిన తర్వాత రూ. 11,700కి తగ్గింది. కనీస వేతన చట్టం అమలుచేసి మాకు టైం స్కేల్ వర్తింపజేయాలి. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. – ఓంప్రకాశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లాలోని 29 ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు మార్చి నెల వరకు వేతనాలు సక్రమంగా అందాయి. వారికి అవసరమైన బడ్జెట్ కూడా ఉంది. ఇటీవల ప్రభుత్వం ఆన్లైన్ వెబ్సైట్లో తెచ్చిన మార్పుల కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. త్వరలోనే వారి సమస్యలు పరిష్కారమవుతాయి. కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. – ఫిరంగి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి -
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించాలి
అచ్చంపేట రూరల్: విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని విద్యుత్శాఖ ఎస్ఈ కేవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ ఫైబర్ వైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. స్తంభాలపై 15మీటర్ల ఎత్తులో కేబుళ్లను అమర్చుకోవాలని.. ఒక్కో స్తంభానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సపోర్టింగ్ వైర్లు కేబుల్ గరిష్ట బరువు మీటర్కు 200 గ్రాములకు మించరాదన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారని.. ఇకపై నెలవారీ బిల్లులు వసూలు చేస్తామన్నారు. ప్రమాదకరంగా మారిన వైర్లను సరిచేసుకోవడానికి కొంత గడువు ఇస్తామని.. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన పరిశీలించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నుంచి మన్నెవారిపల్లిలోని ఎస్ఎల్బీసీకి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఎస్ఈ వెంట ఎస్ఏఓ పార్థసారధి, ఏఈ ఆంజనేయులు, సిబ్బంది మహేశ్, లక్ష్మణ్, లాలయ్య తదితరులు ఉన్నారు. -
జర్నలిస్టులపై కేసులు అన్యాయం
ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పత్రికలు రాసే కథనాలను విమర్శలుగా తీసుకుని వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి కానీ, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం సరికాదు. ‘సాక్షి’ పత్రికపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాల పనితీరుపై కథనాలు రాసే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ రాసిన కథనాల్లో ఏదైనా తప్పులు ఉంటే వాటిని ఆధారాలతో సహా నిరూపించుకోవాలి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా విమర్శను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప విమర్శ చేసే వారిని హింసకు గురిచేస్తాం.. టార్గెట్ చేస్తాం.. అంటే కుదరదు. ఒక రచయిత, జర్నలిస్టుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం అన్యాయం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ అధికారం ఉందనే అహంతో పత్రికల స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదు. అధికారం ఐదేళ్లు మాత్రమే.. చివరగా సమాజానికి జర్నలిజం అనేది శాశ్వతం. రాజకీయాల ముసుగులో అధికారంలో ఉన్నామనే అహంతో ‘సాక్షి’ దినపత్రికపై కేసులు మోపడం కక్షసాధింపులకు దిగడం సరికాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమాజ శ్రేయస్కరం కాదు. ఒకవేళ పత్రికా ప్రకటనలలో తప్పుగా ఉంటే వాటికి వివరణ కోరాలి తప్ప ఫోర్త్ ఎస్టేట్పై ఉక్కుపాదం మోపడం దారుణమైన చర్య. – కొత్త కల్యాణ్రావు, ఎన్ఆర్ఐ, కేఎంఆర్ ట్రస్టు చైర్మన్, చిన్నంబావి ప్రభుత్వం ఎవరైనా ప్రజా, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రెస్మీట్లు పెట్టడం భావ ప్రకటన రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని ప్రభుత్వం కాలరాయడం హాస్యాస్పదం. ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదు. ఇప్పటికై నా ఏపీ సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడితే వారికే మంచిది. – జనార్దన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట -
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
కందనూలు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నట్లు డీఐఈఓ వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఏర్పాటుచేసిన స్వాగతోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉందన్నారు. ఇందుకు అధ్యాపకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు తెలకపల్లి: వైద్యసిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శుక్రవారం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఇన్చార్జి డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు ఏఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు.. ప్రభుత్వ అనుమతులు తదితర వాటిని పరిశీలించారు. అయితే ఆస్పత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత పత్రాలను డీఎంహెచ్ఓ కార్యాలయానికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు ఉన్నారు. -
పత్రికల గొంతు నొక్కడం
● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు ● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం.. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు న మోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. – వి.నరేందర్చారి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్నగర్ అప్రజాస్వామ్యం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కేలా వ్యవహరించడం శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు’ అని జర్నలిస్టు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం.. జర్నలిస్టులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడం ఏమాత్రం హర్షణీయం కాదన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలో కేసులు పెట్టడం దిగజారుడుతనమని.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలు సమర్థనీయం కాదంటూ.. ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులకు సంఘీభావం ప్రకటించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య. పోలీసులు కూడా కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడం తగదు. ఎన్నికల సమయంలో రాజకీయ పా ర్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరపున ప్రశ్నించడం సహజం. ఎడిటర్ స్థాయి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఏకంగా జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం దారుణం. – చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్కర్నూల్ జర్నలిజంపై దాడి సరికాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
జలం.. పైపైకి
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలోనే సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈసారి భూగర్భజలాలు ఏకంగా 5 మీటర్ల పైకి ఉబికివచ్చాయి. సాధారణంగా జిల్లాలో 10 మీటర్ల లోతులో ఉండే భూగర్భజలాలు ఈ ఏడాదిలో ఆగస్టు నెల నాటికి ఎన్నడూ లేనంతగా పైకి చేరాయి. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సగటున 3.45 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణానికి మించిన వర్షపాతంతో భూగర్భ జలాలు ఉబికివచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు జలకళ సంతరించుకుంది.ఈ సీజన్లో అధిక వర్షపాతం..జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సాధారణ వర్షపాతానికి మించి 85.4 శాతం అధిక వర్షం కురిసింది. ఇంకా సెప్టెంబర్ నెలలోనూ నమోదయ్యే వర్షపాతంతో సగటు వర్షపాతం మరింత పెరగనుంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 339.4 మి.మీ., కాగా, ఈ ఏడాది ఇప్పటికే 629.3 మి.మీ., వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్లో ఆగస్టు నెల నాటికే సాధారణ వర్షపాతం కన్నా 85 శాతం అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 420.4 మి.మీ., తక్కువగా వంగూరు మండలంలో 269.8 మి.మీ వర్షం కురిసింది.కోడేరు శివారులో నిండిన చెరువుసాధారణ వర్షపాతం 339.4మి.మీ.,కురిసింది 629.3 మి.మీ.,అధిక వర్షపాతం 85.4 శాతం -
చెరువులు, కుంటలకు జలకళ..
ఈ వానాకాలం సీజన్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 1,056 చెరువుల్లో సుమారు 850 చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. గతేడాది వరకు నీరు లేక అడుగంటిన మోటారు బోర్లు ఈసారి భూగర్భజలాల మట్టం పెరగడంతో పునరుజ్జీవం పొందాయి. జిల్లాలోని సుమారు 67 శాతం భూభాగంలో నీటిమట్టం భారీగా పెరిగి 5 మీటర్ల కన్నా తక్కువ లోతులోనే భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. ప్రధానంగా పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, తాడూరు, పెద్దకొత్తపల్లి, వంగూరు, లింగాల, చారకొండ, తిమ్మాజిపేట, అమ్రాబాద్, తెలకపల్లి మండలాల్లో భారీస్థాయిలో భూగర్భజలాలు పైకి ఉబికివచ్చాయి. -
శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు సిబ్బంది నిరంతరం కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్ఐలు ఎస్ఐలుగా పదోన్నతి పొందడంతో ఎస్పీ కార్యాలయంలో గురువారం వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్బీలో పనిచేస్తున్న సీహెచ్ సుధీర్కుమార్ ఎస్ఐ ప్రమోషన్తోపాటు గద్వాలకు, చారకొండలో పనిచేస్తున్న అంజయ్య ప్రమోషన్తోపాటు మహబూబ్నగర్కు, పోలీస్ కంట్రోల్ రూంలో పనిచేసున్న శ్రీనివాసులు ప్రమోషన్తోపాటు నారాయణపేటకు బదిలీ అయ్యారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ సీఐ కనకయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు కబడ్డీ జట్ల ఎంపిక ఉప్పునుంతల: మండలంలోని వెల్టూరు జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో శనివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల కబడ్డీ జట్లు ఎంపిక చేస్తామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక కోసం వచ్చే క్రీడాకారులు 2009 నవంబర్ 30లోపు జన్మించి, 55 కిలోల బరువు కలిగి ఉండి.. ఆధార్, ఎస్ఎస్సీ మెమో, బోనోఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేష్ (99516 29694, మోహన్లాల్ (99125 24385)లను సంప్రదించాలని సూచించారు. గాలి కాలుష్యంతో అనారోగ్య సమస్యలు నాగర్కర్నూల్ క్రైం: కలుషితమైన గాలిని దీర్ఘకాలంగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపడంతోపాటు శ్వాసకోశ వ్యాధులకు గురవుతారని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. గురువారం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి, నీలిఆకాశంపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వాహనాల వలన, ఇంటి నుంచి వెలువడే చెత్త, పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా కార్బన్ మోనాకై ్సడ్ వంటి ఉద్గారాలు వెలువడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ తదితర వ్యాధులు రావడంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. ప్రతి ఒక్కరు వాయు కాలుష్యాన్ని నివారించాలని, వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో విస్తృతమైన అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. -
నష్టపరిహారంపై అందేనా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాటకంగా వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండ మండలంలో 62 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఉప్పునుంతల, వంగూరు, కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, అచ్చంపేట, చారకొండ, వెల్దండ మండలాల్లో 35 మి.మీ., మించి వర్షం కురిసింది. మరోవైపు భారీ వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచి ఆరుతడి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. నాగర్కర్నూల్ మండలంలో.. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. పత్తి, వరి, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలను వర్షపు నీరు ముంచెత్తడం, రోజుల తరబడి పంట నీటిలో మునిగి ఉండటంతో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ మండలంలో 149 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 206 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు. కాగా.. జిల్లాలో అత్యధికంగా 207 ఎకరాల్లో వరి, 103 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని చాలా మండలాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నా పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగర్కర్నూల్, కల్వకుర్తి, కోడేరు, లింగాల, తాడూరు, తెలకపల్లి మండలాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. మిగతా మండలాలకు సంబంధించి పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ఇప్పటికే వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందించే పరిహారంపై ఆశలు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండలం వర్షపాతం ఊర్కొండ 62.0 ఉప్పునుంతల 60.8 వంగూరు 59.8 కల్వకుర్తి 46.3 పెద్దకొత్తపల్లి 45.5 కొల్లాపూర్ 40.5 అచ్చంపేట 39.5 చారకొండ 37.5 వెల్దండ 35.5 కోడేరు 28.8 పెంట్లవెల్లి 24.5 బల్మూరు 23.3 పదర 21.3 తాడూరు 16.5 తెలకపల్లి 15.5 నాగర్కర్నూల్ 15.5 బిజినేపల్లి 15.5 లింగాల 10.1 జిల్లాలో పంట నష్టం వివరాలు.. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం ఊర్కొండ మండలంలో అత్యధికంగా 62 మి.మీ., వర్షపాతం ఇటీవల వర్షాలకు జిల్లావ్యాప్తంగా 311 ఎకరాల్లో పంటనష్టం -
తీరని యూరియా వెతలు
ఉప్పునుంతల/ బిజినేపల్లి: యూరియా కోసం అన్నదాతలకు వెతలు తీరడం లేదు. స్థానిక పీఏసీఎస్ వద్ద వారం పదిరోజుల నుంచి రైతులు నిత్యం పడిగాపులు కాస్తున్నారు. గురువారం ఒక్కో రైతుకు రెండేసి బస్తాల చొప్పున పీఏసీఎస్ ద్వారా 720 బస్తాలు, గ్రోమోర్ సెంటర్ ద్వారా 286 బస్తాలు పంపిణీ చేశారు. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 13,000 యూరియా బస్తాలు రైతులకు అందజేశామని మండల వ్యవసాయధికారి రమేష్ తెలిపారు. అయితే పంటలకు మోతాదుకు మించి అధికంగా యూరియా వేసుకుంటే వచ్చే అనర్థాలను వివరించినా రైతులు వినడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిజినేపల్లిలోని యూరియా విక్రయ కేంద్రాన్ని గురువారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా విక్రయ కేంద్రాల వద్ద ఏలాంటి ఆందోళనలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ సిబ్బందికి సూచించారు. -
ఇంటర్ ఫలితాలు మెరుగుపర్చాలి
నాగర్కర్నూల్: జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు అధికారులు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్, ఇంటర్ కేజీబీవీలు, ఇతర సంక్షేమ శాఖలు, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 83 ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిధిలో మొదటి సంవత్సరంలో వందశాతం ఎన్రోల్ చేయాలని ఆదేశించారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన, చిన్నపాటి మరమ్మతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వెంటనే ఆయా పనులు పూర్తిచేయాలన్నారు. విద్యలో నాణ్యత పెరగాలని, లెక్చరర్స్ సమయపాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్పై వ్యక్తిగతంగా దృష్టి పెట్టి, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని, అందుకు తగ్గట్టుగా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సిద్ధం కావాలని తేల్చిచెప్పారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్కుమార్ తదితరులుపాల్గొన్నారు. వందశాతం లక్ష్యం సాధించాలి బ్యాంకు అధికారులు రుణ పంపిణీ లక్ష్యాలను వందశాతం సాధించాలనే పట్టుదలతో పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారులకు అనేక సంక్షేమ పథకాల కింద రుణాలను మంజూరు చేస్తున్నాయని, ఆ రుణాలు నిజమైన అర్హులకు చేరేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎం సూర్యఘర్, స్టాండ్ ఆఫ్ ఇండియా, పీఎంఈజీపీ, ముద్రా లోన్లు నిర్దేశించిన మేరకు చేపట్టాలన్నారు. ఇందిరా మహిళా శక్తి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన
అచ్చంపేట: అడవులను రక్షించడం అందరి బాధ్యత అని, అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా 33 శాతం అడవులు పెంచేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖ ఆధ్వర్యంలో అచ్చంపేట ఫారెస్ట్ డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. మానవాళి మనుగడ సాఫీగా సాగాలంటే అడవుల శాతం పెరగాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి వీర మరణం పొందిన 34 మంది అటవీ అమరవీరుల సేవలను మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి, మాజీ ఎంపీపీ రామనాథం, మార్కెట్ చైర్మన్ రజిత, ఫారెస్ట్ డివిజనల్ అధికారులు చంద్రశేఖర్, రామ్మూర్తి, రేంజ్ అధికారులు ఈశ్వర్, దేవరాజ్, మక్దూం, వీరేష్, గురుప్రసాద్, సుబ్బుర్, జూనియర్ అటవీ అధికారుల సంఘం సభ్యులు ముజీబ్ ఘోరి, రాంబాబు, హన్మంతు, తేజశ్రీ, వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనే
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్ సీజన్లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది. ● ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఈ ఏడాది ఇదే సీజన్లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొ న్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ● గతేడాదితో పోలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. ● గతేడాదితో పోలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్కర్నూల్ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
అచ్చంపేట రూరల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సివిల్ కోర్టు జడ్జి స్పందన కోరారు. బుధవారం పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. ఈ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీపీఓ మురళీమోహన్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు నాగరాజు, శంకర్, ఎస్ఐలు విజయభాస్కర్, పవన్కుమార్, వెంకట్రెడ్డి, రాజేందర్, సద్దాం, గిరిమనోహర్రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రమేష్, తిరుపతి, నరేందర్, ఊషన్న, పాండు, భాస్కరాచారి, రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు
తెలకపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కార్వంగ గ్రామంలో పల్లె దవాఖానా ప్రారంభించి, సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి నియోజకవర్గానికి అదనంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవికుమార్, నాయకులు గోపాస్ చిన్న జంగయ్య, యాదయ్య, మధు, బండ పర్వతాలు, వైద్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు తెలకపల్లి: మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోలగుండ నాయకుడు సుధాకర్రావు, మదనాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర్రావుతోపాటు 60 మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వంశవర్ధన్రావు, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య, సుమిత్ర, వెంకటయ్యగౌడ్ తదితరలు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మపోరాట స్ఫూర్తి ఆదర్శం
నాగర్కర్నూల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రదర్శించారని, ఆమె పోరాటం స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్చార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదగిరి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ తబితా రాణి, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.రాజ్యాంగ రక్షణ కోసం ఏకం కావాలికల్వకుర్తి రూరల్: రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ ప్రజలంతా ఏకం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ ఫలాలు సామాన్యులకు దక్కడం లేదన్నారు. దేశంలో 42 కోట్ల మంది దారిద్యరేఖకు దిగువన ఉన్నారని, 80 కోట్ల మంది ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 11 ఏళ్లలో పాలనలో సామాజిక అంతరం మరింత పెరిగిందని ఆరోపించారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శర్వాణి, ఏపీ మల్లయ్య, కాశన్న, పరశురాములు, హనుమంతు, చెన్నయ్య, చంద్రశేఖర్, ఖలీల్ విద్యార్థులు పాల్గొన్నారు.17 నుంచి బీజేపీఆధ్వర్యంలో కార్యశాలకందనూలు: ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా కార్యశాల నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సేవా పక్షం–2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని మండల, మున్సిపాలిటీల్లో 75 యూనిట్లకు తగ్గకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 18వ తేదీ ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ అంశాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీలో స్థాయిలో చిత్ర లేఖనం, శక్తికేంద్రం, మండల కేంద్రంలో స్వచ్ఛభారత్, 21న నమో మారథాన్, యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. 25న ప్రవాస్–బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, దీనదయాళ్ జీకి నివాళులర్పించడం, జిల్లా స్థాయిలో మేధావులతో సమావేశం, డాక్యుమెంటరీ ప్రదర్శన, ఖాదీ స్టాల్, 27న దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాలు పంపిణీ, 28న విశిష్ట (పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ విభూషన్, అర్జున అవార్డ్ పొందిన వ్యక్తులకు సన్మానం, అక్టోబర్ 2న మహాత్మా గాంధీజీకి నివాళులు, లాల్ బహదూర్ శాసీ్త్ర చిత్రపటానికి పుష్పాంజలి, ఖాదీ ఉత్పత్తుల కొనుగోలు కార్యక్రమాలను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్, మంగ్య నాయక్, రాజవర్ధన్రెడ్డి, కృష్ణ దితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఉప్పునుంతల: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనుల జాతరలో మంజూరైన పనులను శ్రద్ధతో గడువులోగా పూర్తిచేయాలని డీఆర్డీఓ చిన్న ఓబులేశ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు కొరటికల్లో వన మహోత్సవంలో భాగంగా హరితహారంలో నాటిన మొక్క లు, గతంలో ఉన్న చెట్లను ఆయన పరిశీలించారు. ఈజీఎస్లో చేపట్టిన పండ్ల తోటలు, పామాయిల్ తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ ఆర్థిక సంత్సరంలో నిర్దేశించిన విధంగా ఈజీఎస్లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనుల జాతర లో మంజూరైన పశువుల షెడ్లు, ఇతర యూనిట్లను త్వరగా ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, ఈజీఎస్ ఈసీ కుర్మారెడ్డి, టీఏ సింగోటం, ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లయ్య, రమేష్ పాల్గొన్నారు. -
కిచెన్ గార్డెన్లతో పోషకాహారం
నాగర్కర్నూల్: అంగన్వాడీల్లో నమోదైన చిన్నారులు, గర్భిణిలు, బాలింతల ఆరోగ్యంపై ప్రభు త్వం మరింత దృష్టి సారించనుంది. వారికి పోషకాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు చేపడుతుంది. వంటకు వినియోగించే కూరగాయలను అంగన్వాడీ కేంద్రాల్లోనే పండించేలా చర్యలు తీసుకుంటుంది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేసింది. ఇక ఎంపిక చేసిన అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో చేసిన వంటకాన్ని చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు పెట్టనున్నారు. జిల్లాలో.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,131 అంగన్వాడీ కేంద్రా ల ఉండగా.. ప్రస్తుతం 89 కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక్కో కిచెన్ గార్డెన్కు రూ.10 వేలు కూడా నిధులు కేటాయించగా అంగన్వాడీ కేంద్రా ల ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలను పెంచనున్నారు. వంకాయ, బెండకాయ, పాలకూర, టమాట, తోటకూర, మెంతెంకూర వంటి పోషకాలు ఉన్న కూరగాయల సాగు పెంచనున్నారు. దీంతోపాటు కూరగాయల పెంపకంపై పిల్లలకు అవగాహన కూడా కల్పిస్తారు. ఇప్పటికే నిధుల వినియోగంపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కూడా కల్పించారు. ప్రస్తుతం మంజూరు చేసిన రూ.10 వేలు ఎలా వెచ్చించాలనే విషయం గురించి వివరించారు. ఈ నిధులను విత్తన కొనుగోలు, కుండీలు, మట్టి ఇతర పనిముట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా మొదటి విడతలో అంగన్వాడీ భవనాల్లో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు. సీడ్ కార్పొరేషన్ ద్వారా.. ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి విత్తనాల పాకెట్లను నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేశారు. దీనికి సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రూ.500 చొప్పున చెల్లిస్తారు. సంవత్సరానికి రూ.వెయ్యి నిర్వహణకు అందజేస్తారు. అయితే ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంటుంది. కేటాయించిన రూ.10వేలలో నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలను నాటేందుకు భూమిని సిద్ధం చేసే ఖర్చుల కోసం రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది. విత్తనాలను పంపిణీ చేశాం కిచెన్ గార్డెన్లకు సంబంధించి ఇప్పటికే ఎంపిక చేసిన 89 అంగన్వాడీలకు విత్తనాలు పంపిణీ చేశాం. గర్భిణులు, పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు కిచెన్ గార్డెన్ల నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది. – రాజేశ్వరి, జిల్లా సంక్షేమాధికారిణి జిల్లాలో 89 అంగన్వాడీలకు మంజూరు ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు కేటాయింపు ఇప్పటికే విత్తనాలు పంపిణీ గర్భిణులు, చిన్నారులకు ప్రయోజనం -
యూరియా పక్కదారి పడితే చర్యలు
నాగర్కర్నూల్/పెద్దకొత్తపల్లి: జిల్లాలో యూరియా పంపిణీ పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లావ్యాప్తంగా యూరియా లభ్యత, డిమాండ్, సరఫరాపై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద అధికారులు నిఘా పెంచి, యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని, రైతులకు యూరియా సమయానికి అందేలా చూడాలన్నారు. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంట సాగైందని, 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 19,859 మెట్రిక్ టన్నులు అందాయని, ఇంకా 15,885 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచాలని, ఇప్పటివరకు రైతులకు 12 వేల లీటర్ల నానో యూరియాను అందించినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులకు నష్టం కలగకుండా.. పంట సాగులో ఎలాంటి నష్టం జరుగకుండా ఉండేందుకే విత్తన, ఎరువుల డీలర్లకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలో వ్యవసాయ సంబంధిత ఇన్ఫుట్ వ్యాపారాలు నిర్వహించే డీలర్లకు శిక్షణ, విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు డీఏఈఎస్ఐ (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) అనే డిప్లొమా కోర్సును తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శిక్షణలో డీలర్లు రైతులకు సరైన మార్గదర్శకత్వం అందించగలిగే స్థాయిలో అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం పొందుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 4, 5వ బ్యాచ్లకు చెందిన 75 మంది డీలర్లకు డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. ఇప్పటి వరకు 200 మంది డీలర్లు ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు, డివిజన్ వ్యవసాయ అధికారులు చంద్రశేఖర్, పూర్ణచంద్రారెడ్డి, కార్యాలయ వ్యవసాయ అధికారి శివ, కేవీకే పాలెం కోఆర్డినేటర్ శ్రీదేవి, కేడీఆర్ పాలెం ప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, పెద్దకొత్తపల్లి ఏఓ శిరీష, ఏఈఓలు వినోద్, జానకీరాం, సింగిల్విండో కార్యదర్శి వెంకటస్వామిగౌడు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాల తనిఖీ కొల్లాపూర్: పట్టణంలోని మైనార్టీ గురకుల పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం, వంటగదిని పరిశీలించారు. వంట సామగ్రి, స్టాక్ నిల్వకు సంబంధించిన రికార్డులను చూశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరూప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్కు వారి మామ జైపాల్రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేవరకద్రలో మండల పార్టీ అధ్యక్షుడిపై లేని కేసు పెట్టి జైలుకు పంపించారని.. కాంగ్రెస్లో చేరితే కేసు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, క్రషర్ నిర్వాహకులపై జీఎస్టీ, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఆలోచన చేసి ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోలేనిదురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్కు పేరు వస్తుందనే పడావు పెట్టారు సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం -
ఎర్ర చెల్క భూములు పేదలకు పంచాలి
తెలకపల్లి: ఎర్రచెల్క భూములను పేదలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని గడ్డంపల్లిలో కామ్రేడ్ లింగోజీరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతాలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో లింగోజీరావు పాత్రం మరవలేనిదన్నారు. గడ్డంపల్లిలో పేదలకు భూములు పంచాలని పెద్దఎత్తున ఉద్యమించి.. 400 ఎకరాల భూమిని పంపిణీ చేయించారని గుర్తుచేశారు. పేదల కోసం అనునిత్యం పరితపించే నాయకుడు అని కొనియాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. రజాకారు లాంటి సినిమాలు తీసుకొచ్చి మతం రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్ తరాలు తెలంగాణ పోరాటాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కామ్రేడ్ లింగోజీరావు స్ఫూర్తితో గడ్డంపల్లిలో ఉన్న ఎర్రచెల్క భూములు పేదలకు పంచేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అర్.శ్రీనివాసులు, మండల కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్, నాయకులు మధు, జగదీశ్, విజయగౌడ్, బుచ్చన్న, మల్లయ్య, తిరుపతి, నిరంజన్ పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి అధికారి
మద్దూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్ఐ కె.అమర్నాథ్ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్ఐ డబ్బులు తీసుకొని మహబూబ్నగర్కు కారు లో వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్యాల యం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న లంచం డబ్బులను రికవరీ చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. రైతు నుంచి రూ. 5వేల లంచంతీసుకుంటూ పట్టుబడిన మద్దూరు ఆర్ఐ -
ఫిజియోథెరపీపై అవగాహన ఉండాలి
నాగర్కర్నూల్ క్రైం: శారీరక సమస్యల నివారణకు ఫిజియోథెరపీ చికిత్స ఎంతో ఉపయోగకరమని.. ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీపై అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అ న్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాత కలెక్టరేట్ భవనం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతి వ్యక్తి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. జీవనశైలిలో వచ్చే మార్పులకు అను గుణంగా మారాలని సూచించారు. అనంతరం తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ సమన్వయంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డా.రోహిత్, రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్రెడ్డి, యూత్ కోఆర్డినేటర్ కుమార్, తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎన్ సుమంత్, కార్యదర్శి చంద్రపాల్రెడ్డి, డా.సృజన, జి.లలిత, యశ్వంత్, రాజశేఖర శర్మ పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాలపెంపునకు కృషి చేయాలి
కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికల్లో విద్యాప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. డీఈఓ స్వయంగా గణితం బోధించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. గణితశాస్త్రంలో మెళకువలు పాటిస్తే సులభంగా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని ఉపాధ్యాయులకు డీఈఓ సూచించారు. -
బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి
నాగర్కర్నూల్: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలుచేయాలని.. తహసీల్దార్లు ఉదయం 10:30 గంటలలోగా కార్యాలయానికి హాజరు కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్తో కలిసి నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓలతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రజావాణి అర్జీలు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, మీసేవ దరఖాస్తులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను శుక్రవారంలోగా సమర్పించాలన్నారు. భూములు రిజిస్ట్రేషన్కు సంబంధించి స్లాట్ బుక్ చేసిన వారికి అదే రోజు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని.. తహసీల్దార్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ తహసీల్దార్ను ఇన్చార్జిగా నియమించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా సాదాబైనామాల సంఖ్య, వాటి ప్రస్తుత స్థితి, చట్టపరమైన సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. మీసేవ ద్వారా ఆదాయ, కుల, రెసిడెన్షీ వంటి సర్టిఫికెట్ల జారీ పెండింగ్లో ఉంచకుండా వెంటనే ఆమోదం తెలపాలని సూచించారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనధికారికంగా విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓలు జనార్దన్రెడ్డి, భన్సీలాల్, సురేశ్బాబు, మాధవి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు రవికుమార్, వెంకట్, శోభ ఉన్నారు. ● రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను పక్కాగా రూపొందిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మంగళవారం వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 460 గ్రామపంచాయతీలకు గాను 214 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 1,224 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 6,47,342 ఓటర్లు ఉన్నారని.. వీరిలో 3,23,015 మంది పురుషులు, 3,24316 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంల గోదామును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్ ఉన్నారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి 65 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు సకాలంలో విధులకు హాజరు కావాలి భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
పాలమూరుకు మరో మణిహారం!
జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్ను హెచ్ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్ రింగ్రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అలైన్మెంట్కు సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాప్లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్ను విడుదలచేయనుంది. ● ఉమ్మడి మహబూబ్నగర్లోని ఆమన్గల్, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కొందుర్గు మండలాల్లో ఆర్ఆర్ఆర్ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లా బాలాగనర్ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమోనిగూడలు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్ ఆర్ను పరిమితం చేశారు. డిజైన్ మార్పుతో బాలానగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్ రోడ్ వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్రోడ్డు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి బాలానగర్ మండలం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్ఆర్ఆర్ చుట్టూ మాల్స్, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు డిజైన్ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ జంక్షన్గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్రోడ్ -
న్యూస్రీల్
జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ రెఫరీగా బాబునాయక్ అచ్చంపేట రూరల్: మండలంలోని దేవులతండాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు బాబునాయక్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ రెఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అఖిలభారత బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24నుంచి 28వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్లో జరిగే 71వ సీనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఆయన రెఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఎంపికపై బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్గౌడ్తో పాటు పలువురు హర్షం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం నాగర్కర్నూల్ రూరల్: ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం సాగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజా సంఘాలు సిద్ధం కావాల్సిన అవసరముందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని.. వాటిని సరి చేయకపోతే సీపీఐ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కమ్యూనిస్టులు ఎన్నికలప్పుడు మాత్రమే అవసరం.. తర్వాత లేదనే విధంగా జిల్లా మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు కేశవులుగౌడ్, నర్సింహ, పెబ్బేటి విజయుడు, శివశంకర్, కృష్ణాజీ, శ్రీనివాస్, శివుడు, వెంకటయ్య, శంకర్గౌడ్, రవీందర్, ఇందిరమ్మ, లక్ష్మీపతి తదితరులు ఉన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద జ లాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వ లో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జ లాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూ సెక్కు లు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసె క్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
ఆలయాల మూసివేత
అచ్చంపేట రూరల్/వెల్దండ: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 7గంటల వరకు ఆలయాన్ని మూసి ఉంచనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ● వెల్దండ మండలం గుండాలలోని శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 2గంటలకు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ద్వార బంధనం చేశారు. సోమవారం తెల్లవారుజామున 5గంటలకు గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం పూజలు, సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి కందనూలు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి.. ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో వలంటీర్లను నియమించి.. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలన్నారు. అనంతరం ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. కాగా, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడిగా టి. రమేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, యూనియన్ నాయకులు విశ్వేశ్వర్రెడ్డి, రాజేశ్, సతీశ్, రాజేందర్రెడ్డి, వెంకటేశ్వర శెట్టి, వనజ, చేతనప్రియ పాల్గొన్నారు. -
ఎర్రజెండా వారసత్వాన్ని ప్రజలకు అందించాలి
వనపర్తి రూరల్: తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు, పోరాటాల వారసత్వాన్ని ప్రజలకు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ రాజు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. దుష్ప్రచారం చేస్తూ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. ఆ రోజుల్లో జాగీర్దారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ఎంతోమంది పోరాటంలో పాల్గొని విజయం సాధించారని గుర్తుచేశారు. డబ్బులు ఇవ్వకుండా అన్ని కులాల వృత్తిదారులతో ఊడిగం చేయించుకోవడాన్ని నాటి కమ్యూనిస్టు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, నర్సింహారెడ్డి తదితరులు ఎందరో ఈ పోరాటాలకు నాయకత్వం వహించారని.. వారి త్యాగ ఫలితాన్ని కమ్యూనిస్టులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని.. గవర్నర్ బిల్లును ఆమోదించాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ముఖ్య నాయకులు మండ్ల రాజు, మేకల ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, సాయిలీల, ఆది, ఆర్ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
నిధులు అందించాలి..
ప్రతి సంవత్సరం నిధులను ఆలస్యంగా విడు దల చేస్తున్నారు. దీంతో పాఠశాలల నిర్వహణ కష్ట ంగా మారుతుంది. చిన్నచిన్న అవసరాలకు హెచ్ఎంలు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొంది. త్వర గా నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది. – కృష్ణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాఠశాలలకు నిధులు ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. త్వరలో నిధులు విడుదలయ్యే విధంగా కృషి చేస్తాం. హెచ్ఎంలు చొరవ తీసుకొని ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. – రమేశ్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ● -
యమపాశాలు..
● ఇళ్లపై వేలాడుతున్న వైర్లతో ప్రమాదాలు ● వానాకాలంలో పొంచి ఉన్న ముప్పు ● ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని వ్యవసాయ పొలాలు, ఇళ్ల మధ్య విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. వానాకాలంలో విద్యుత్ తీగలతో ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల విద్యుత్ సమస్యలకు ఏళ్లుగా పరిష్కారం లభించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో ప్రాణాలు పోకముందే అధికారులు స్పందించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కర్రలే స్తంభాలు.. జిల్లాలోని పలుచోట్ల వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఏళ్లుగా విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు నోచుకోక రైతులు కర్రలనే స్తంభాలుగా ఏర్పాటుచేసుకొని విద్యుత్ సరఫరా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంట్ తీగల నడుమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాగు పనులు చేసుకుంటున్నారు. రోడ్ల పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు సైతం కంచె, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. నేలపైనే నిర్లక్ష్యంగా ఉంచిన ట్రాన్స్ఫార్మర్లు దారిన వెళ్లే రైతులు, పశువుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. పట్టని అధికారులు.. వానాకాలానికి ముందే విద్యుత్శాఖ సమాయత్తమై సమస్యలపై దృష్టిసారించాల్సి ఉండగా.. కొన్ని పనులకే పరిమితమవుతున్నారు. ఫలితంగా రైతులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించిన రైతులకే స్తంభాలు, విద్యుత్ తీగలు ఏర్పాటుచేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ పొలాల్లో విరిగిన స్తంభాలు, ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలను సరిచేయడం లేదు. ఇళ్లపై వేలాడుతున్న తీగలతో ప్రమాదం ఉందని తెలిసినా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రహదారి పక్కన వీధిలో నడిరోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. నడిరోడ్డులోనే స్తంభం ఉండటంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూర్: మండలంలోని కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొండారెడ్డిపల్లిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమై.. ఇందిరమ్మ ఇళ్లు, ఎంప్లాయిమెంట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీరోడ్లు, ఆర్అండ్బీ రోడ్డు, సోలార్, నాలుగు లైన్ల రహదారి, పాలశీతలీకరణ కేంద్రం, యూనియన్ బ్యాంకు, పోస్టాఫీస్, అంగన్వాడీ కేంద్రం భవనాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం పనుల పురోగతిపై తప్పనిసరిగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. పనుల పూర్తిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, పీఆర్ ఈఈ విజయ్కుమార్, ఎల్డీఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు ఇబ్బందులు రానివ్వొద్దు
కల్వకుర్తి టౌన్/వెల్దండ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించడంతో పాటు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శనివారం కల్వకుర్తి సీహెచ్సీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులతో చాలా మంది ఆస్పత్రులకు వస్తున్నారని.. వారికి తగు పరీక్షలు నిర్వహించాలన్నారు. డెంగీ, మలేరియా వంటి కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయితే వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా కాన్పుల కోసం వచ్చే గర్భిణులను ముందుగానే అడ్మిట్ చేసుకొని సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువులతో పాటుగా, చిన్నారులకు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలను పక్కాగా ఆన్లైన్లో నమోదు చేయాలని.. లేనిచో చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆయన రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ● వెల్దండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని ఇన్చార్జి డీఎంహెచ్ఓ పరిశీలించారు. వర్షాలకు భవనం దెబ్బతినడంతో ప్రభుత్వం రూ. 40లక్షలతో మరమ్మతు చేయిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పీహెచ్సీని త్వరలోనే సొంత భవనంలోకి మారుస్తామన్నారు. ఆయన వెంట సీహెచ్సీ సూపరిటెండెంట్ శివరాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ భీమానాయక్, వైద్యులు విజయ్, శివ, యశోద, సింధు, ప్రోగ్రాం ఆఫీర్ లక్ష్మణ్నాయక్, పర్వతాలు, సిబ్బంది ఉన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
● రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిన బీఆర్ఎస్ ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వనపర్తి: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పు ల కుప్పగా మార్చేశారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. శనివారం పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి హాజరై లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో రూ.8.19 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, ప్రజల దీవెనతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజామోద పాలన చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రూ.రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తింపజేశామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామ న్నారు. ప్రజాపాలనలో తొలి విడతగా రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని చెప్పారు. రానున్న కాలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నా రు. భూ భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు భరోసా కల్పించామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.. ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం రేవంత్రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి పాలమూరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని ప్రజా ప్రభుత్వం మరో సారి నిరూపించిందని.. గతంలోనూ వైఎస్సార్ హ యాంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. పేదోడి సొంతింటి కల సాకారం.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో తొలివిడత నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక చేసినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, బ్రహ్మం, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం తప్పని నిరీక్షణ
పెద్దకొత్తపల్లి సింగిల్విండో వద్ద బారులు తీరిన రైతులు పెద్దకొత్తపల్లి: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో చోట యూరియా కోసం బారులు తీరుతున్నారు. రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి నానా అవస్థలు పడుతున్నారు. పెద్దకొత్తపల్లి సింగిల్విండోకు వారం రోజులుగా యూరియా రాలేదు. శనివారం రెండు లారీల యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. సింగిల్విండో కార్యాలయం చుట్టూ క్యూ కట్టగా.. అధికారులు పట్టాదారు పాస్పుస్తకంపై రెండు బస్తాల యూరియాను అందజేశారు. అయితే రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
పంటల లెక్క పక్కా..
● అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు ● సేకరించిన వివరాలు ఆన్లైన్లో నమోదు ● జిల్లాలో 4,64,876 ఎకరాల్లో వివిధ పంటల సాగు నాగర్కర్నూల్: జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు పొలంబాట పట్టారు. ఈ ఏడాది వానాకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో సర్వేకు కొంత ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ చివరి వరకు సర్వే పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానాకాలం సాగుకు సంబంధించి వరినాట్లు, ఇతర పంటల విత్తనాలు నాటడం పూర్తి కావడంతో సర్వే వేగవంతం చేశారు. పంటల వివరాలను పూరి్ాత్స్థయిలో ఏఈఓలు ప్రత్యేక యాప్తో పాటు డిజిటల్ క్రాప్ సర్వే యాప్లో నమోదు చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా.. జిల్లాలో ప్రస్తుతం క్లస్టర్ల వారీగా సర్వే కొనసాగుతోంది. మొత్తం 142 క్లస్టర్లలో అక్టోబర్ చివరి వరకు సర్వేను కొనసాగించి.. నవంబర్ 1న అన్ని గ్రామపంచాయతీల్లో రైతుల పేర్లు, వారు సాగుచేసిన పంటల వివరాలను ప్రదర్శిస్తారు. అనంతరం రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి.. నవంబర్ మొదటి వారంలో తుది జాబితాను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ సర్వే ద్వారా రైతులు ఏఏ పంటలు వేశారనే కచ్చితమైన సమాచారం తెలియడంతో పాటు పంటల దిగుబడి మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. 20,153 ఎకరాల్లో మాత్రమే.. జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం 4,64,876 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో ప్రధానంగా పత్తి 2,67,079 ఎకరాల్లో, వరి 1,36,406, కంది 3,564, మొక్కజొన్న 52,274, జొన్న 4,272, మినుములు 1,281, వేరుశనగ 157, ఆముదం 31, మిగతా పంటలు మరికొన్ని ఎకరాల్లో సాగుచేశారు. అయితే ఇప్పటివరకు 20,153 ఎకరాల్లో మాత్రమే పంట సర్వే పూర్తయింది. ఇంకా 4,44,723 ఎకరాల్లో పంటలను సర్వే చేయాల్సి ఉంది. -
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు..
అక్కడక్కడ నెలకొన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసి పీఏసీఎస్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఓనంబర్ 44 ఆధారంగా దశాబ్ధాలుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న సీఈఓలు, ఆఫీస్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించాం. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు కల్పించి పనిచేసే వారిని ప్రోత్సహించడంతో పాటు నిర్లక్ష్యం వహించే వారితోనూ పని చేయించేందుకు ఒక్కరిద్దరు మినహా.. దాదాపుగా అందరికి స్థానచలనం కల్పించాం. ఉద్యోగం చేసేచోటే నివాసం ఉండేలా ఆదేశాలిచ్చాం. రైతులకు అన్నివేళల్లో అందుబాటులో ఉండాలని సూచించాం. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్నగర్ ● -
ఉపాధ్యాయ వృత్తి మహత్తరమైనది
అచ్చంపేట: తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అని మన సంస్కృతి చెబుతుందని, అలాంటి ఉపాధ్యాయ వృత్తి మహత్తరమైనదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సత్యం, అసత్యం మధ్య తేడాను అర్థం చేయించి, చీకటి నుంచి వెలుగులోకి పయనించేలా తీర్చిదిద్దేది గురువులే అన్నారు. అలాగే, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తూ, బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు అవసరమైన వనరులు అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వస్తువులు కల్పించిందని, విద్యార్థులకు రుచికరమైన భోజనంతోపాటు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పాఠశాలల ప్రారంభం రోజే అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్కుమార్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ రజిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు. ● ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 151 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్, ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారి జ్యోతితో కలిసి శాలువాలతో సత్కరించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
అందుబాటులోకి కొత్త కాలేజీలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పీయూలోని అకాడమిక్ భవనం పైభాగంలో ఎడమ వైపు ఉన్న తరగతి గదులు ఇంజినీరింగ్, కుడి వైపు ఉన్న గదులు లా కళాశాల విద్యార్థులకు కేటాయించారు. కాగా ఆరు నెలల క్రితమే గదుల నిర్మాణం ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థులకు అవసరమైన డ్యూయెల్ డెస్క్లు, టేబుళ్లు తదితర వాటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్సుల్లో కలిపి మొత్తం 191 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేసింది. ఇంజినీంగ్లో చేరిన విద్యార్థులకు కళాశాలతోపాటు హాస్టల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరికి కృష్ణవేణి బాలికల హాస్టల్ కొత్త భవనంలో వసతి ఏర్పాటు చేశారు. అలాగే వీరు కళాశాలలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలని అనే అంశాలపై ఓరియంటేషన్ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. త్వరలో రెండు కళాశాలల తరగతులు ప్రారంభించనున్నారు. లా, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు గెస్టు ఫ్యాకల్టీని అధికారులు నియమించారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం మూడు గ్రూప్లకు సంబంధించి 11 మందిని అధ్యాపకులకు ఇంటర్వ్యూలు, డెమో చేపట్టిన తర్వాత నియమించారు. అలాగే లా కళాశాలకు సంబంధించి 6 పోస్టుల భర్తీకి బుధవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 6 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 10 మందిని షార్ట్లిస్టు చేశారు. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. వీటితోపాటు లా, ఇంజినీరింగ్ కళాశాలలకు నాన్ టీచింగ్ సిబ్బందిని వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నవారిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6 మందిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక లా విద్యార్థులు మొత్తం 120 మంది లా సెట్ ద్వారా ఎంపికై , ఆన్లైన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారి లిస్టును ప్రభుత్వం పీయూకు పంపించింది. 45 విద్యార్థుల బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి గురువారం వరకు పీయూలో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పీయూ లా కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 120 మందితో పీయూను ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థులకు కళాశాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. – మాళవి, లా కళాశాల ప్రిన్సిపాల్ పీయూలో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇంజినీరింగ్లో గదులతోపాటు డ్యూయెల్ డెస్కుల్, టేబుల్స్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు కళాశాలలకు సంబంధించి సిబ్బంది నియామకం ప్రక్రియ సైతం పూర్తయ్యింది. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● పూర్తయిన తరగతి గదుల నిర్మాణం, డ్యూయెల్ డెస్కుల ఏర్పాటు ఆయా కోర్సులో ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్ల ప్రక్రియ ‘లా’లో 45 మంది, ఇంజినీరింగ్లో 191 మంది చేరిక ఓరియంటేషన్ క్లాస్లు పూర్తి.. త్వరలో తరగతులు ప్రారంభం -
సీఈఓలకు స్థాన చలనం
నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి.. ● ఉమ్మడి పాలమూరు జిల్లాలో 78 మంది బదిలీ ● రెండు విడతల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీబీ అధికారులు ● జీఓనంబర్ 44 సర్వీస్ రూల్స్ వర్తింపుతో సాధ్యమైనట్లు చర్చ వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ రూల్స్ను వర్తింపజేసేందుకు విడుదల చేసిన జీఓనంబర్ 44 ఆధారంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు వారం వ్యవధిలో రెండు విడతల్లో స్థాన చలనం కల్పించారు. నాలుగు దశాబ్దాల కాలంలో పీఏసీఎస్లలో పనిచేసే సీఈఓలు, ఇతరల ఉద్యోగులను బదిలీ చేసిన దాఖలాలు లేవు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఇతర పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్న పీఏసీఎస్ల దశ మారుతున్న దృష్ట్యా పూర్తిగా సంఘం పరిధిలో పనిచేసే ఉద్యోగులే అయినా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని జీఓ విడుదల చేసిన విషయం విధితమే. ఈ జీఓ ఆధారంగా సిబ్బందికి బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ డీసీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 మంది సీఈఓలను, తాజాగా బుధవారం మరో 33 మందిని బదిలీ చేస్తూ డీసీసీబీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను సీఈఓల్లో 80 శాతం సానుకూలంగా తీసుకోగా.. 20 శాతం వ్యతిరేకిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకేచోట పని చేయడంతో పాలనలో కొంత నిర్లక్ష్యం.. మూస పద్ధతి పాటిస్తున్నారన్న ఆరోపణలకు ఈ బదిలీలతో చెక్ పడుతోందని అధికారులు, డీసీసీబీ పాలకవర్గం భావిస్తోంది. కొందరు పని చేయడానికి బద్ధకిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. -
భక్తిశ్రద్ధలతో మిలాన్ ఉన్ నబీ
కందనూలు: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలో ముస్లింలు మిలాన్ ఉన్ నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం జామా మసీదు కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్ ఆధ్వర్యంలో మౌలానా ఉస్మాన్ రజా యజ్దాని ఆధ్యాత్మిక బోధన చేశారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఈ భూగోళం మీద ప్రవక్త జన్మదినం జరుపుకొంటామన్నారు. ప్రవక్త మహమ్మద్ భూమి పైకి వచ్చిన తర్వాతే ఇస్లాం మతం గొప్పదనం ఏమిటో సమాజానికి తెలిసిందన్నారు. సర్వ మానవాళికి ఒక గొప్ప జీవితాన్ని అందించిన మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళికి దేవుడు పంపిన మార్గదర్శకుడని కొనియాడారు. దీంతోపాటు ప్రవక్త గొప్పదనాలను ఇస్లాం ధర్మానికి ప్రవక్త చూపిన సన్మార్గాలను వివరించారు. -
విద్యారంగంలో సేవకు..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్నగర్లోని ఎంబీసీ (ఎయిడెడ్) పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్రెడ్డి కొన్నేళ్లుగా విద్యారంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచడం, వనరులు అరకొర ఉన్నప్పటికీ విద్యార్థులు పాఠశాల యాజమాన్యం సహాయ, సహకారాలతో మెరుగైన విద్య అందించడంలో తనదైన పాత్ర పోషించారు. విద్యార్థులకు కావాల్సిన వసతులు, వనరులు సమకూర్చడంలో పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఆర్వోప్లాంట్, బోర్, డ్యూయెల్ డెస్కుల్, బోర్డులు సమకూర్చారు. సమాజ సేవ చేస్తాం ప్రభుత్వం ఉత్తమ అవార్డు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. దీని ద్వారా మరింత సమాజ సేవ, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషిచేస్తా. పేద విద్యార్థులకు అన్నిసౌకర్యాలతో కూడిన విద్య అందించే దిశగా అడుగులు వేస్తాం. ఇందుకు సహకరించిన డీఈఓ ప్రవీణ్కుమార్, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు. – జగదీశ్వర్రెడ్డి, ఎంబీసీ పాఠశాల హెచ్ఎం -
గురుభ్యోనమః
● బోధనతోపాటు ఆటపాటల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులు ● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి ● బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి ప్రతి ఒక్కరి నడవడిక, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే దార్శనికులు గురువు. అజ్ఞానపు చీకట్లను తొలగిస్తూ.. వెలుగుల జ్ఞానాన్ని ప్రసరింపజేసే ప్రత్యక్ష దైవం గురువు. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు నైతిక విలువలతోపాటు క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పిస్తూ.. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుతున్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. -
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారిలో బి.రఘు (బల్మూరు), ఎ.శ్రీనివాసులు (పెద్దపల్లి), ఎన్.జగపతిరెడ్డి (చందుబట్ల), పి.రాములు (కోండ్రావుపల్లి), ఎ.మాధవరెడ్డి (గాజర), ఎండీ షఫి (చేగుంట), ఎన్.వెంకటేశ్వర్రెడ్డి (తుమ్మన్పేట), పరమేశ్వరయ్య (నందివడ్డెమాన్), ఎం.శైలజ (ముష్టిపల్లి), ఎస్.పద్మ (గుండూరు), ఎ.వాణి (పెంట్లవెల్లి), ఎ.సువర్ణ (మంగనూర్), బి.అనురాధ(బల్మూర్), ఎన్.చంద్రశేఖర్ (పెద్దకొత్తపల్లి), విమలాదేవి(తూడుకుర్తి), వి.గీత (చారకొండ), కె.రామన్గౌడ్ (చందుబట్ల), డి.నిరంజన్ (అమ్రాబాద్), ఎన్.సత్యశ్రీ (పెద్దకొత్తపల్లి), మైబమ్మ (రంగాపూర్), జమాల్ అహ్మద్ (ఎల్లికల్), నందకిషోర్యాదవ్(ఎల్లికల్), ఎన్.వెంకటయ్య (నాగర్కర్నూల్), డి.ప్రభాకర్(బిజినేపల్లి), పి.కృష్ణవేణి (నార్లాపూర్), సన్వాజ్బేగం (కార్వంగ), ఈ.శ్రీనివాసులు (తర్నికల్), ఎ.వీరేష్ (ఐతోలు), వి.సూర్యకళ (బిజినేపల్లి), డి.నాగమణి (పెద్దూరు), కె.రాంబాబు (బుద్దసముద్రం), సాయిప్రకాష్రెడ్డి (పెద్దకార్పాముల), కె.రవీందర్నాయక్ (నర్సాయిపల్లి), బి.సత్యనారాయణ (చారకొండ), టి.గోపాల్ (గోకారం), జి.విజయ్కుమార్ (తర్నికల్), ఆర్.సాధన (అచ్చంపేట), పి.రామగోపాల్గౌడ్ (రామాజిపల్లి), కె.ప్రశాంత్కుమార్ (శేరిఅప్పారెడ్డిపల్లి), అరుణ (మారేపల్లి), ఎం.పుష్పవతి (పోతిరెడ్డిపల్లి), జి.మురళీధర్రావు (నాగర్కర్నూల్), కె.కోటేశ్వర్రావు (తుమ్మలపల్లి) బి.జైపాల్(వట్టిపల్లి), బి.ఉమాదేవి (చిన్నముద్దునూర్), ఎస్.స్రవంతి (వెల్దండ), కె.రాజబాయి(అచ్చంపేట), ఎన్.మాధవి (లింగాల), కె.ఉమాదేవి (వెల్దండ), ఎస్.నిరోష (బిజినేపల్లి), వి.నాగరాజు (వెల్దండ) ఉన్నారు. -
వెళ్లిరావయ్యా.. విఘ్నేశ్వరా..
జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గురువారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. డీజే మోతలు, డప్పు చప్పుళ్ల నుడుమ జరిగిన శోభాయాత్రలో చిన్నారులు, యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలతో హోరెత్తించారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మ ఆడారు. పట్టణ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం కేసరి సముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. అంతకు ముందు మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు అనంతరం లడ్డు వేలం నిర్వహించారు. మరిన్ని 9 లో..ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలి -
కఠిన చర్యలు తప్పవు
సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆర్ఎంపీలను ఆశ్రయించొద్దు. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే పీహెచ్సీలను, జిల్లా ఆస్పత్రులను ఆశ్రయించాలి. – డా.రవికుమార్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ, నాగర్కర్నూల్ -
సీజనల్ వ్యాధులతో బెంబేలు
●నాగర్కర్నూల్ క్రైం: రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో సీజనల్ వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ ప్రాంతాల్లో వర్షాలతో తాగునీరు కలుషితమవుతుంది. వాటిని తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతుండటంతో దోమల వ్యాప్తి పెరిగి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా వ్యాధులు రోజురోజుకూ పెరిగిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో ఆరేళ్ల చిన్నారి టైఫాయిడ్ బారిన పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్ఎంపీల చేతివాటం జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలామంది జ్వరాల బారిన పడుతుండటంతో గ్రామాల్లో ప్రజలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వారు వచ్చిరాని వైద్యంతో అవసరం లేని టెస్టులతో పాటు యాంటిబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎంపీలకు జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లలో కమీషన్లు ముట్టజెబుతుండటంతో చాలా మంది రోగులను రెఫర్ చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఆర్ఎంపీలను కట్టడి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను పలువురు కోరుతున్నారు. రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు స్థాయికి మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మార్చిలో 1, జూలైలో 9, ఆగస్టులో 26 డెంగీ కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్, చికెన్గున్యా, మలేరియా కేసులు నమోదుకానట్లు వెల్లడిస్తున్నారు. కాగా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో నమోదవుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా కేసులు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించకపోవడం గమనార్హం. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకపోయినప్పటికీ విషజ్వరాల పేరిట యాంటిబయాటిక్స్తో వైద్యం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో పాటు స్కానింగ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వలస కూలీలను బడిలో చేర్పించి..
కొల్లాపూర్ మండలంలోని సింగోటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న భృంగ కృష్ణప్రసాద్ విద్యాబోధనతోపాటు నైపుణ్యాలను నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో సోమశిల పాఠశాలలో పనిచేయగా ప్రారంభంలో 80 మంది విద్యార్థులు ఉండగా, వారి సంఖ్యను 142కు పెంచారు. కృష్ణాతీరంలో వలస జీవులుగా ఉన్న మత్స్యకారుల పిల్లలను బడిలో చేర్పించారు. నదికి అవతలి వైపు ఉన్న విద్యార్థులను నిత్యం పాఠశాలకు చేరేలా బోటు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం సింగోటం పాఠశాలలో తరగతి గదులను పేయింటింగ్తో అందంగా తీర్చిదిద్దా రు. ఈ పాఠశాలలో 72 మంది విద్యార్థుల నుంచి వారి సంఖ్యను 119కి పెంచడంలో ఎంతో కృషిచేశారు. -
ఆవిష్కరణల వైపు అడుగులు..
చిన్నముద్దునూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖరరావు సైన్స్ టీచర్గా పాఠాలు చెబుతూనే.. విద్యార్థులకు నిజ జీవితంలోనూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణల వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఔషధ మొక్కల ఆకుల చూర్ణంతో కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేసే విధానాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మానవుని మెదడు ఆకృతిని వర్ణించేందుకు హెల్మెట్ రూపంలో మోడల్ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. వినూత్న పద్ధతిలో పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
మత్స్యశాఖలో గందరగోళం
●సాక్షి, నాగర్కర్నూల్: జిల్లా మత్స్య సహకార సంఘం పాలకవర్గం, అధికారులకు మధ్య వివాదం రచ్చకెక్కుతోంది. జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో గతేడాది చేపల పంపిణీకి సంబంధించిన బుక్ ఆఫ్ రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు అందుబాటులో లేవని, తమకు అందించాలంటూ జిల్లా మత్స్యశాఖ అధికారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చైర్మన్ వర్సెస్ ఆఫీసర్.. జిల్లాలో గతేడాది మత్స్యశాఖ ద్వారా చేపట్టిన చేపపిల్లల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు మత్స్య సహకార సంఘాల నాయకులతో పాటు అధికార వర్గాల నుంచి పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల చెరువుల్లో రికార్డుల్లో కన్నా తక్కువ సంఖ్యలో చేపపిల్లలను వదిలారని, చెరువుల లీజు పునరుద్ధరణ, కొత్త సభ్యత్వాలు, మత్స్యకారుల ఇన్యూరెన్స్ క్లెయిమ్ విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని మత్స్య సహకార సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం, చెరువులు లేకున్నా ఉన్నట్టు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల చంద్రసాగర్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మత్స్య సహకార సంఘం చైర్మన్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు దిగారు. మత్స్యశాఖ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు సహకార సంఘం నాయకుల వద్ద ఉండటంపైనా పంచాయతీ పోలీస్స్టేషన్ వరకు చేరింది. జిల్లాలో పలుచోట్ల చెరువులు లేకున్నా బోగస్ పేర్లతో చెరువులు సృష్టించి చేపలను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో వీరమ్మ చెరువు, వీరమాని చెరువు, వెంకటేశ్వర చెరువు, వెంకటేశ్వర ట్యాంకు తదితర పేర్లతో చెరువులు ఉన్నట్లుగా సృష్టించి కొంతమంది మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు ఆయా చెరువుల్లో చేపల పంపిణీ చేసినట్లుగా మాయ చేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లల పంపిణీ విషయంలో అక్రమాలకు బాధ్యులెవరు అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. సహకార సంఘం నాయకులు, అధికారుల మధ్య పంచాయితీ పరస్పర అవినీతి ఆరోపణలు, విమర్శలతో రచ్చ చెరువుల లీజు, చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రికార్డుల మిస్సింగ్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు రికార్డులు మత్స్యశాఖ కార్యాలయంలో ఉండాలి. ఇప్పటి వరకు మాకు అప్పగించలేదు. మా వద్ద ఒక్క రికార్డు కూడా లేదు. ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం. గతంలో క్షేత్రస్థాయిలో లేని చెరువులు ఉన్నట్లుగా పేర్కొని అక్రమాలకు పాల్పడ్డారు. వాటిపై విచారణ కొనసాగుతోంది. – రజని, జిల్లా మత్స్య శాఖ అధికారిణి -
తీరని.. యూరియా కొరత
ఉప్పునుంతల/కల్వకుర్తి రూరల్/తెలకపల్లి/అచ్చంపేట రూరల్: స్థానిక పీఏసీఎస్ వద్ద బుధవారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలివచ్చి క్యూలో నిలబడ్డారు. ఈ క్రమంలో మండలంలోని జప్తీ సదగోడుకు చెందిన మొగిలి అనిత అనే మహిళా రైతు క్యూలో నిల్చొని స్పృహతప్పి పడిపోవడంతో తోటి రైతులు ఆందోళనకు గురయ్యారు. కొంతసేపటికి ఆమె తేరుకొని మేల్కొనడంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. ఆలస్యంగా వెళ్తే యూరియా బస్తాలు దొరకవనే ఆలోచనతో ఏమీ తినకుండ వచ్చి క్యూలో గంటల తరబడి నిల్చుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలే ఇస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్యభర్తలు ఇద్దరు వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. అందుబాటులో ఉన్న 600ల బస్తాలను ఒక్కో రైతుకు రెండేసి బస్తాల చొప్పున అందించినట్లు ఏఓ రమేష్ తెలిపారు. ఇప్పటివరకు మండలంలో ఈ వానాకాలం సీజన్లో 11,312 బస్తాల యూరియాను పంపిణీ చేశామన్నారు. గతేడాదిని పోల్చుకుంటే ఇప్పవరకే 3,601 బస్తాలు అదనంగా అందించామని పేర్కొన్నారు. ● కల్వకుర్తి పీఏఎస్ కార్యాలయానికి బుధవారం యూరియా లోడ్ వస్తుందనే సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ శాఖ అధికారి సురేష్, పీఏసీఎస్ సిబ్బంది రైతుల నుండి ఆధార్, పాసు పుస్తకాల జిరాక్స్లు సేకరించి పేర్లు నమోదు చేసుకొని టోకెన్లు అందించారు. 280 బస్తాల యూరియా అందుబాటులో ఉండడంతో ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు సీఈఓ వెంకట్రెడ్డి తెలిపారు. ● తెలకపల్లి మండలంలోని సింగిల్ విండో కార్యాలయం వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. కానీ యూరియా స్టాక్ లేకపోవడంతో చేసేదేం లేక చాలా మంది రైతులు వెనుతిరిగారు. ● అచ్చంపేట పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతు లు బారులు తీరారు. వారం రోజులుగా యూరి యా కోసం తిరుగుతున్నా.. ఒక బస్తా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి ● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే.. ● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.. ● అప్పుడే వలసలు ఆగుతాయి.. ● ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి ● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం పాలమూరుకే మొదటి ముద్ద.. పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్ట్లను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్లకు గ్రీన్చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్లో కోల్పోయినవి కమర్షియల్ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్తో పాటు వికారాబాద్– కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, బీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్జీడీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డులు మా వద్దే ఉన్నాయి..
జిల్లా మత్స్య సహకార సంఘం సంబంధించి బుక్ ఆఫ్ రికార్డులు, వాటా, తీర్మానాలు, బైలా, క్యాష్ పుస్తకాలు నా వద్దే ఉన్నాయి. ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేవు. రికార్డులు మాయం అయ్యాయని చెప్పడం అవాస్తవం. మత్స్య శాఖ ఏడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న విధంగా చెరువుల్లో చేపల పంపిణీ చేపట్టలేదు. నమోదు చేసిన దానికన్నా తక్కువ సంఖ్యలో చేపలను వదిలి అక్రమాలకు పాల్పడ్డారు. – వాకిటి ఆంజనేయులు, చైర్మన్, జిల్లా మత్స్య సహకార సంఘం గతేడాది చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయి. రికార్డుల్లో 1.30 లక్షల చేపలు ఉంటే చెరువులో 30 వేల చేపపిల్లలే పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులు అడిగితే ఇవ్వలేదు. బ్యాంకుఖాతాలో డబ్బులు దుర్వినియోగం చేశామన్నది అవాస్తవం. సభ్యత్వాలకు సంబంధించిన డబ్బులు జాయింట్ బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయి. – సత్యనారాయణ, డైరెక్టర్, జిల్లా మత్స్య సహకార సంఘం -
భూ సేకరణ పనుల్లో వేగం పెంచుతాం
నాగర్కర్నూల్: రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని వేగంగా సేకరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే, రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, వనరుల నిర్మాణాలు, అభివృద్ధికి కావాల్సిన భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవనం నుంచి కేంద్ర ప్రభుత్వం కేబినేట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.అమరేందర్తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిలో 142.98 ఎకరాలు అవసరం కాగా ఇప్పటివరకు 129.52 ఎకరాల భూమిని సేకరించామని, ఇంకా 18.48 ఎకరాల భూమిని రానున్న నెల రోజుల్లో సేకరించిప్రాజెక్టు నిర్మాణానికి అందజేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ జిల్లా మండల కేంద్రంలోని శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక అధికారులు ఉన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
ఓటర్ తుది జాబితా విడుదల
నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆయా జాబితాలను పంచాయతీ బోర్డులపై అతికించి, వాటిపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 31న వాటిని పరిశీలించి మంగళవారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 460 గ్రామ పంచాయతీలు, 4,102 వార్డులు, 4,102 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 6,47,342 ఓటర్లు ఉన్నారని, అందులో 3,23,016 మంది పురుషులు, 3,24315 మంది మహిళా ఓటర్లు, 11 మంది ఇతరులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా వివరాలు పొందుపరిచారన్నారు. నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కందనూలు: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టణ శివారులోని గగ్గలపల్లి తేజ కన్వెన్షన్హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ స్థాయిల ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీల పాఠశాలల నుంచి 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆమోదంతో ఎంపిక చేసినట్లు సూచించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పండుగలు నిర్వహించాలి కందనూలు: వినాయక మండపాల నిర్వాహకులు విగ్రహాల ఎత్తులను చూడకుండా భక్తులు ఆకర్షించేలా సంప్రదాయాలకు అనుగుణంగా అలకరించి భక్తిశ్రద్ధలతో పండుగల నిర్వహించాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హకీం వీధిలో త్రిదళన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమానికి నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆకాంక్షించారు. డీజేల ఏర్పాటు వల్ల అనేక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ప్రవీణ్, నిఖిల్, చందు, ఈశ్వర్, చంద్రకాంత్, నితిల్ సాయి, భరత్ నంబి, మణికంఠ, బాలు తదితరులు పాల్గొన్నారు. -
భూ కబ్జాలు, జీఎస్టీ ఎగ్గొట్టిన చరిత్ర ‘మర్రి’ది
● హైదరాబాద్ చుట్టూ నీ భూ బాగోతం అంతా తెలుసు ● ఒకసారి బీఆర్ఎస్ గాలికి, రెండోసారి నా పుణ్యాన గెలిచినవ్: కూచుకుళ్ల నాగర్కర్నూల్: హైదరాబాద్ చుట్టూ మర్రి జనార్దన్రెడ్డి చేసిన భూ బాగోతాలు మొత్తం తెలుసని, రూ.500 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం బలవంతంగా వసూలు చేసిన చరిత్ర మర్రి ది అని ఎమ్మెల్యే కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేసి వాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత కొడుకు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆరు నెలలు సతాయించిన ఘనత నీదన్నారు. పదేళ్లు నియోజకవర్గాన్ని కబ్జాల పేరుతో బ్రష్టు పట్టంచారని దుయ్యబట్టారు. 2014లో బీఆర్ఎస్ గాలికి, 2018లో నా పుణ్యాన గెలిచావని అన్నారు. రూ.కోటి తీసుకుని మహిళా శక్తి భవనాన్ని ఊరికి దూరంగా కట్టించిండని ధ్వజమెత్తారు. ఆర్టీఓ కార్యాలయాన్ని 14 కిలో మీటర్ల దూరంలో రియల్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కొల్లాపూర్ చౌరస్తాలో, తెలకపల్లిలో భూమి కబ్జా చేసిన మాట వాస్తవ కాదా అని ప్రశ్నించారు. హైదరబాద్లోని కొండకల్ భూమలుపై నా లెటర్ ప్యాడ్తోనే ఫిర్యాదు చేశావన్నారు. జక్కా రఘునందన్రెడ్డిని అడ్డుపెట్టుకుని అవినీతి పాల్పడి, అవసరం తీరాక ఆయనను తరిమేశాడని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ నాయకులు హబీబ్, కోటయ్య, సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కావలి శ్రీను, సునేంద్ర, జక్కా రాజ్కుమార్, నిజాం పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● బీఆర్ఎస్ ధర్నాలో మాజీమంత్రిశ్రీనివాస్గౌడ్ డిమాండ్ సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్ చౌరస్తాలో యూరియా కొరత, కేసీఆర్పై సీబీఐ అక్రమ కేసును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో మాజీమంత్రి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అక్రమంగా సీబీఐ కేసులు పెడితే తాము భయపడేది లేదని చెప్పారు. కేవలం ఐదేళ్ల కాలంలో చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డలోని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టుపైనే రాద్ధాంతం చేస్తూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సక్రమంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలం పడిన కష్టాన్నంతా కాంగ్రెస్ గంగలో కలిపేస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ యూరియా కష్టాలను చూడలే దన్నారు. ఆటో డ్రైవర్లతో డబ్బులు పంపిస్తే యూరి యా బస్తాలు ఇంటికి చేరేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రోజుల తరబడి క్యూలో ఉంటే టోకె న్లు ఇస్తున్నారని, ఒక కుటుంబానికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఒక్క సంచి యూరియా కోసమేనా కాంగ్రెస్కు ఓటేసిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరు తో సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్టుకు మరమ్మతు చేయాలనే చెప్పిందని, అవినీతిపై ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం తగదు
నాగర్కర్నూల్: మునిస్పాలిటీల్లో ఆస్తి పన్ను, నీటి బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వన మహోత్సవం, వరదలు– నష్టాలు, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రెవెన్యూ పన్ను వసూళ్లు, భవన నిర్మాణ అనుమతి, భూమి క్రమబద్ధీకరణ పథకం, సీసీ రోడ్లు– డ్రెయినేజీల నిర్మాణం, వీధిదీపాలు, జంతు జనన నియంత్రణ కేంద్రం, ఫిర్యాదులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వార్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా మున్సిపల్ కమిషనర్లు, పట్టణ అభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది తక్షణమే సమన్వయం చేసుకుని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్థిక వనరులను బలోపేతం చేసేందుకు ఆస్తి పన్ను, నీటి చార్జీల వసూళ్లు చేపట్టాలన్నారు. కొత్త గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి కనెక్షన్లు సకాలంలో మంజూరు చేయాలన్నారు. ప్రణాళిక కింద చేపట్టిన అభివృద్ధి, శానిటేషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పాడుబడిన, శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే గుర్తించి అందులో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. ఎల్ఆర్ఎస్ కింద రుసుంలు చెల్లించిన పౌరులకు త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. భూ భారతి దరఖాస్తుల పెండింగ్పై అసహనం లింగాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. లింగాల తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. మండలంలో మొత్తం 652 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 82 మాత్రమే పరిష్కరించడంపై అసహనం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్లో ఉంచడంపై తహసీల్దార్ను ప్రశ్నించారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్–2025 చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పాండునాయక్, డీటీ కృష్ణాజీ, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఉన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ్మ, జాతీయ మాజీ కమిషన్ సభ్యులు ఆచారి అన్నారు. మంగళవారం మండలంలోని కుప్పగండ్లలో ఆరు గ్యారంటీల అమలు కోసం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు వారు సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి 20 నెలలు గడిచినా నేటికీ నెరవేర్చడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 భృతి, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, వృద్ధాప్య పింఛన్ పెంపు, ఇంట్లో ఇద్దరు వృద్ధులకు నూతన పింఛన్, రైతులకు రైతు భరోసా రూ.15 వేలు తదితర హామీల ఊసే లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో నిర్మించిన సీసీరోడ్లు, శ్మశాన వాటికలు ఇతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శారదమ్మ, మాజీ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు దుర్గాప్రసాద్, కృష్ణగౌడు, యాదగిరి, బాలస్వామి, సుబ్బయ్యగౌడు తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాలు.. రాస్తారోకోలు
● యూరియా కోసం కొనసాగిన అన్నదాతల ఆందోళనలు ● పలుచోట్ల రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు అచ్చంపేట/ బిజినేపల్లి/ తిమ్మాజిపేట: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. యూరియా కోసం ఏదోఒకచోట రైతులు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేపట్టడం నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం అచ్చంపేటలోని లింగాల చౌరస్తాలో రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు పోకల మనోహర్ మాట్లాడుతూ ఎరువుల కోసం గోసపడిన ఎనుకటి రోజులు మళ్లీ ఈ ప్రభుత్వంలో వచ్చాయని, పంటలకు అవసరమైన యూరియా అందించాల్సిన సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నెల రోజుల నుంచి రాత్రనకా.. పగలనకా.. విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని, వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా తడుస్తూ క్యూలో పడిగాపులు కాస్తూ రోజంతా లైన్లో ఉన్నా ఒక్క యూరియా బస్తా దొరకకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పర్వతాలు, వంశీ, రవీందర్రావు, రమేష్రావు, శివ, కుత్బుద్దీన్, రహమత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ● బిజినేపల్లిలోని పీఏసీఎస్ గోదాం, గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా సరఫరా ఆలస్యంపై ఆగ్రహించిన రోడ్డుపై బైఠాయించి వాహనాలు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఈ విషయమై ఏఓ కమల్కుమార్ వివరిస్తూ రైతులకు మంగళవారం టోకెన్లు ఇచ్చి బుధవారం యూరియా అందిస్తామని పేర్కొన్నారు. ● తిమ్మాజిపేటలోని ప్రధాన రహదారి సమీపంలో ఉన్న తెలంగాణ ఆగ్రో దుకాణం వద్ద యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో యూరియా తమకు దొరుకుతదా.. లేదా అనే ఆందోళనతో ఒక్కసారిగ టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో రైతులను అదుపు చేయలేక దుకాణదారు కొద్దిసేపు దుకాణం మూసివేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి అక్కడికి చేరుకుని అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం రైతులు వెనుదిరిగారు. రాస్తారోకో చేపట్టిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బిజినేపల్లిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు అచ్చంపేట అంబేడ్కర్ చౌరస్తాలో రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు -
మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనవద్దు
నాగర్కర్నూల్ క్రైం: వినాయ చవితి నిమజ్జనంలో మద్యం తాగి పాల్గొనకూడదని, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నాగనూల్ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని, భక్తులు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. నాగనూలు చెరువు వద్ద నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుద్దీపాలతోపాటు రెండు క్రేన్లను, గత ఈతగాళ్లు, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులన్నీ నిండాయని, నిమజ్జన సమయంలో మద్యం తాగి చెరువుల వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా నిమజ్జన ప్రదేశానికి వస్తే చెరువులో దిగకుండా జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే డయల్ 100, నాగర్కర్నూల్ పోలీస్ కంట్రోల్ రూం నం.87126 57709కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తదితరులున్నారు. -
అరకొర యూరియాతో అవస్థలు
నాగర్కర్నూల్ రూరల్: యూరియా కోసం అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. రెండు బస్తాల యూరియా కోసం పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు నిరాశే ఎదురవుతుండటంతో సోమవారం జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కష్టపడి సాగుచేసిన పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని.. 15 రోజులుగా ఆధార్కార్డు, పట్టాదారు పాస్పుస్తకాలతో వస్తున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా స్టాక్ వస్తుందని.. రైతులందరికీ అందేలా చూస్తామని అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
రాజీ మార్గంతో సమయం ఆదా
నాగర్కర్నూల్: రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసు ఉన్నతాధికారులు, ఎకై ్సజ్శాఖ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. 13న జరిగే జాతీయ లోక్అదాలత్లో కక్షిదారులు సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను రాజీ చేసుకునేలా పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని.. లోక్అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకునే ఇరు వర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, సీఐ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సమయపాలన పాటించకుంటే చర్యలు
● గురుకులాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి ● స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్: అధికారులంతా సమన్వయంతో పనిచేసి వందశాతం లక్ష్యాలను చేరుకోవాలని.. వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారదర్శకతపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో పురోగతి, పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విధిగా పాటించాలన్నారు. ఈ నెల నుంచి బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు విడుదలచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి శాఖ ప్రగతి నివేదికలను తనకు పంపించాలన్నారు. అధికారులు సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల నుంచి కలెక్టర్ అనుమతుల కోసం వచ్చే ప్రతి ఫైల్ ఈ ఆఫీస్ ద్వారానే పంపించాలని ఆదేశించారు. జిల్లా అధికారులకు కేటాయించిన గురుకులాలను తప్పనిసరిగా సందర్శించాలని.. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. గురుకులాల్లో బోధనా పద్ధతులు, వసతి, ఆహారం, ఆరోగ్య అంశాలపై సమీక్ష జరిపి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మండలాల ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా రూపొందించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ● సీజన్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. భారీ వర్షాలు, వరద సహాయం తదితర అంశాలపై కలెక్టర్కు పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను జిల్లాస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువులు, కుంటలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్యఉద్దేశమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 69 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
చేపపిల్లల పంపిణీపై నీలినీడలు..
జిల్లాలో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే చేప పిల్లల పంపిణీ చేపట్టాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఈసారి జిల్లాలో సుమారు 2.60 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గతంలో నిర్వహించిన చేపపిల్లల పంపిణీ రికార్డులు లేకపోవడం, జమాఖర్చుల వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
లింగాల: విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చాలని, మరుగుదొడ్లు సరిపోను లేవని విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ పాఠశాలలో అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గిరిజన విద్యార్థినుల చదువుకోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మండల కేంద్రంలో నిర్మించే నూతన పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించుటకు అవసరమైన స్థలాన్ని నిర్దారించారు. కార్యక్రమంలో ఎంఈఓ బషీర్ అహ్మద్, విద్యాశాఖ ఏఈ కోటేశ్వర్రావు, మార్కెట్ డైరెక్టర్ ముక్తార్, నాయకులు పాల్గొన్నారు. -
మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి
నాగర్కర్నూల్ క్రైం: గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో పీఎం జన్మన్ సంచార వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కోతకు గురికావడంతో రవాణాపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా గర్భిణులను ప్రసవ తేదీ కంటే 10 రోజుల ముందుగానే అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అదే విధంగా చిన్నారుల టీకాకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలని.. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి టీ డయాగ్నొస్టిక్ హబ్కు పంపించాలని సూచించారు. గిరిజన ప్రాంత ప్రజలకు సంచార వైద్యసేవలు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా.లక్ష్మణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి ఉన్నారు. ● సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా గ్రామస్థాయిలో డ్రై డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నామన్నారు. డెంగీ బారినపడిన వారిఇంటి సమీపంలోని 100 ఇళ్లల్లో ఫీవర్ సర్వే నిర్వహించి దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆర్ఎంపీలు కేవలం ప్రథమిక చికిత్స మాత్రమే అందించాలని.. ఎవరైనా పరిధికి మించి వైద్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
8నుంచి సదరం శిబిరాలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 8నుంచి 24వ తేదీ వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ చిన్నఓబులేషు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 12, 15, 19, 22, 26 తేదీల్లో శారీరక దివ్యాంగులకు, 20న వినికిడిలోపం ఉన్నవారికి, 10, 23 తేదీల్లో కంటిచూపు లోపం ఉన్న వారికి, 17, 24 తేదీల్లో మానసిక దివ్యాంగులకు సదరం శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. శిబిరాలకు వచ్చే వారు తప్పనిసరిగా మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత తేదీ రోజున మెడికల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.యూరియా సరఫరాలో విఫలం : సీపీఎంబిజినేపల్లి: రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు విమర్శించారు. సోమవారం బిజినేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా, నానో యూరియాను ప్రభుత్వం రూ. 900 అందిస్తుండగా.. బ్లాక్ మార్కెట్లో రూ. 1500 వరకు విక్రయిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయడం రైతులకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీలో అనేక ఆంక్షలు పెడుతూ.. రెండు ఎకరాలకు మించి ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు కొంపల్లి అశోక్, చంద్రశేఖర్, పరశురాం, మల్లేష్ తదితరులు ఉన్నారు.అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లువెల్దండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. మండల కేంద్రానికి మొత్తం 46 ఇళ్లు మంజూరయ్యాయని 35 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 20 మందికి మొదటి విడతలో రూ.1. 20లక్షల నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయని వివరించారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, మట్ట వెంకటయ్యగౌడు, బచ్చు రామకృష్ణ, ఎర్రశ్రీను ముదిరాజ్, పురుషోత్తంచారి, అలీ,బాబా, లక్ష్మణస్వామి తదితరులు ఉన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
కందనూలు: మహబూబ్నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కందనూలు విద్యార్థులు అండర్–20 విభాగంలో శ్రీను గోల్డ్ మెడల్, నవీన్కుమార్ బ్రౌంజ్ మెడల్, అండర్– 18 విభాగంలో ఉదయ్కిరణ్ గోల్డ్మెడల్, అండర్– 20 బాలికల విభాగంలో స్వప్న గోల్డ్ మెడల్ పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడంతో క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఉత్సాహంగా గణనాథుడి నిమజ్జనోత్సవం
గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కందనూలు: జిల్లాకేంద్రంలో ఆదివారం గణేశ్ నిమజ్జనోత్సవం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని పలు వినాయకులను ఆదివారం ఐదోరోజు నిమజ్జనం చేయడానికి ప్రధాన వీధుల వెంట డప్పులతో నృత్యాలు చేస్తూ, భజనలతో యువకులు కేసరిసముద్రం చెరువులో గణేశ్లను నిమజ్జనం చేశారు. జిల్లాకేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. -
రుణాల చెల్లింపులు సులభతరం
● ఇకపై నెలవారీ డబ్బులు సెల్ఫోన్లోనే బ్యాంకులకు చెల్లింపు ● మధ్య దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకు ప్రయత్నం ● అక్రమాలకు చెక్.. పారదర్శకతకు పెద్దపీట అచ్చంపేట రూరల్: పట్టణ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు ఆన్లైన్ బ్యాంకింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాల సభ్యులు రుణాల చెల్లింపునకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకొని మధ్యవర్తులు మహిళల నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకులో జమ చేయకుండా కాజేస్తున్నారు. ఇటీవల వీటిపై మెప్మా అధికారులకు ఫిర్యాదులు రావడంలో ఆన్లైన్ బ్యాంకింగ్పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. నేరుగా సభ్యులు బ్యాంకులో జమ చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలక సంఘాల్లో మెప్మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా గ్రూపుగా, వ్యక్తిగతంగా బ్యాంకు రుణాలు అందిస్తున్నారు. గ్రూపులో పది మంది సభ్యులు ఉండగా.. వచ్చిన రుణాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. చెల్లింపుల సమయంలో అందరూ కలిపి కడతారు. కొన్ని సంఘాల్లో సభ్యుల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకొని బ్యాంకులో జమ చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని ఓ గ్రూపులో ఇలాంటి సమస్య ఎదురైంది. ఇకపై అలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం అమలులోకి తీసుకొచ్చారు. బ్యాంకులో నేరుగా జమ చేయడం, గూగుల్ పే, ఫోన్ పే చేసి రసీదును గ్రూపు సభ్యులకు చూపించాలి. ఆ సభ్యురాలు చెల్లింపు చేసుకున్నట్లు నమోదు చేసుకుంటారు. జిల్లా పరిధిలో ఇలా.. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నాం. దళారీ వ్యవస్థ లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. మహిళా సంఘ సభ్యురాళ్లు బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్పై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాం. సభ్యులు నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం వల్ల అక్రమాలు జరగవు. – శ్వేత, మెప్మా ఏడీఎంసీ -
ఫేస్.. భేష్
●జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్న ‘ముఖగుర్తింపు’ హాజరు కందనూలు: ప్రభుత్వ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది అనధికారిక గైర్హాజరుకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ హాజరును క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 816 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 3,962 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వీరిలో 3,946 మంది ఎఫ్ఆర్ఎస్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత శనివారం 3,146 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాగా, 324 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 468 మంది సెలవుల్లో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 79.72 శాతం హాజరును బట్టి పారదర్శకతను సూచిస్తున్నాయి. గతంలో కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకుండా, రిజిష్టర్లో సంతకం చేసి వెళ్లిపోయేవారు. కొందరు ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపారాలు చేసుకునేవారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న వారే ఎక్కువ. దీంతో మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు ఆలస్యంగా రావడం, సాయంత్రం ముందుగానే ఇంటిముఖం పట్టడం వంటివి పరిపాటిగా మారింది. సమీపంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం విస్మరించారు. ముందస్తు సమాచారం లేకుండానే విధులకు గైర్హాజరైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చాక గైర్హాజరును నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విధానం పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో ఉపాధ్యాయులు హాజరును నమోదు చేసుకోవడానికి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేయడంతో ఉపాధ్యాయుల బాధ్యతను పెంచింది. ఉపాధ్యాయుల పారదర్శకతకు బాసటగా నిలుస్తున్న ప్రక్రియ పాఠశాలకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుండటంతో తప్పనిసరిగా రాక మెరుగుపడిన సమయపాలన, తరగతుల నిర్వహణ గైర్హాజరుకు చెక్ పెడుతున్న విద్యాశాఖాధికారులు -
కేంద్రం పరిశీలనలో..
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి ఏర్పాటు, వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాం. ముబాయి, బెంగుళూరు జాతీయ రహదారులను కలుపుతూ ఏర్పాటవుతున్న చించోలి– భూత్పూర్–167 అనుసంధానంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మొదటి దశలో చించోలి రహదారిని మన్ననూర్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారు. – నరేందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది నల్లమల ప్రజల చిరకాల ఆంకాక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. జాతీయ రహదారి– 44 నుంచి నాగర్కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు(మాచర్ల) వరకు 165 కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పాటు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి
నాగర్కర్నూల్ రూరల్: ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలని, సంస్థలోకి యూనియన్లు అనుమతించాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రవీందర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రీజియన్ ఆర్టీసీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికులు పని భారంతో సతమతమవుతున్నారన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడం వల్ల వాటి నిర్వహణలో అనేక లోపాలు వస్తాయని వాటిని వెంటనే ఆర్టీసీకి అప్పగించాలని, దీని వలన లాభాలు వస్తాయని చెప్పారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకళాపాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, వెంకటయ్య, ప్రేమలత, సుమలత, వెంకటేష్, చింతలయ్య, అయూబ్, అర్జున్, అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అజిలాపూర్ పాఠశాలకు ఉపాధ్యాయుల నియామకం వెల్దండ: మండలంలోని అజిలాపూర్ పాఠశాలకు జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్దండ ఇన్చార్జ్ ఎంఈఓ చంద్రుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శనివారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇక్కడ 8 తరగతులకు గాను 5 మంది మాత్రమే ఉపాధ్యాయుల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణితం, ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థుల ఇబ్బందులు తీర్చేందుకు డీఈఓ స్పందించినట్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం ఉర్దూ మీడియం హైస్కూల్ నుంచి భాస్కర్రావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా, వెల్దండలోని జిల్లా పరిషత్ పాఠశాల నుంచి అశోక్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, అదేవిధంగా సాజిదా స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టులు బోధించేందుకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. సోమవారం వారు విధులకు హాజరై విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తారని ఎంఈఓ చంద్రుడు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని ఖండించాలి శాంతినగర్: బాధిత ప్రజలను కలిసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, బాధిత ప్రజలను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ పీపుల్స్ జాక్ రాష్ట్ర కోకన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య అన్నారు. రాజోళి మండలంలోని పెద్దధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ బాధితులను కలవడానికి వారు వెళ్తుండగా శాంతినగర్ పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. అనంతరం శాంతినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇథనాల్ కంపెనీ వల్ల వాయు, జల, భూగర్భ కాలుష్యం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఇథనాల్ కంపెనీని వ్యతిరేకించకుండా యజమానులకు వత్తాసు పలుకుతూ, కంపెనీ నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలన్నారు. హైదరాబాద్ నుంచి మేధావులు వచ్చారని తెలుసుకున్న పెద్దధన్వాడ, మాన్దొడ్డి ప్రజలు, రైతులు కలుకుంట్ల వద్ద వెళ్తున్న వారిని కలుసుకుని తమ గోడు వెలిబుచ్చారు. ఆయా గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారితో వివరించారు. -
రాష్ట్రం దాటుతున్న యూరియా
పెంట్లవెల్లి: రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఎంతోమంది రైతులు ఇబ్బందులు పడుతూ రోడ్లపై ధర్నాలు చేస్తూ, రాస్తారోకోలు చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని సొసైటీ నుంచి మంచాలకట్ట మీదుగా రాయలసీమకు కృష్ణానదిపై రోజూ వందలాది యూరియా సంచులను ఇంజిన్బోటు ద్వారా యేరు దాటిస్తున్నారు కొంతమంది దళారులు. గతంలో కూడా పలుమార్లు యూరియాను దాటిస్తే సొసైటీకి తెలియజేసినా చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా యూరియాను యేరు దాటిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
యూరియా కోసం బారులు
ఉప్పునుంతల/తాడూరు: రెండు బస్తాల యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. పీఏసీఎస్ల వద్ద పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఉప్పునుంతల, తాడూరు పీఏసీఎస్లకు యూరియా వస్తుందని సమాచారం అందుకున్న రైతులు.. వేకువజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. సాగుచేసిన పంటలకు అవసరమైన యూరియాను ఎలాగైనా సమకూర్చుకోవాలని గంటల తరబడి నిరీక్షించారు. అయితే పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు ఆధారంగా ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఉప్పునుంతలలో 450 బస్తాలు, తాడూరులో 300 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొంత ఆలస్యంగా వచ్చిన చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. -
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం
నాగర్కర్నూల్: మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రెండు నెలల కాలంలో ఎకై ్సజ్, పోలీస్శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ప్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే మాదకద్రవ్యాల విక్రేతలు, రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. హానికరకమైన మత్తు పానీయాలు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయన్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ
మన్ననూర్: గిరిజన సంక్షేమశాఖ, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో డీడీయూ–జీకేవై తెలంగాణ పథకం కింద గ్రామీణ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆర్డ్వేర్ అసిస్టెంట్, ఆటో మొబైల్, టు విల్లర్ సర్వీసింగ్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వర కు మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మోడల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 98857 65688 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. గురువుల పాత్ర ఎనలేనిది కల్వకుర్తిటౌన్: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిదని కల్వకుర్తి సీనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టీఎల్ఎం మేళాలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగేందుకు గురువులు అందించే ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిదన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో అర్థవంతంగా విద్య అందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎంఈఓ శంకర్నాయక్, ఎస్ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు. రైతులు వదంతులు నమ్మొద్దు పాన్గల్: మండలంలో యూరియా కొరత లేదని.. రైతులు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి యూరియా సరఫరాపై అధికారులతో ఆరా తీశారు. అలాగే వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. యూరి యా కొరత ఉందనే పుకార్లతో రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకుంటున్నారన్నారు. మండలంలోని సింగిల్విండో కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 13,500 బస్తా లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రోజుకు 750 బస్తాల చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసే యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానం ద్వారా ఎకరాకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్న ట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని.. వారికి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేరకు యూరియా అందిస్తామన్నారు. ఆయ న వెంట కార్యాలయం సిబ్బంది ఉన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి పండుగను మతసామరస్యానికి ప్రతీకగా అన్నివర్గాలు నిర్వహించుకుంటున్నాయని.. గణేశ్ ఉత్సవాలను కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలన్నారు. గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు. జిల్లాలో 2వేల విగ్రహాలను ప్రతిష్ఠించారని.. అన్నింటికీ జియోట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. తొమ్మిది రోజుల్లో నిమజ్జనాన్ని పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఉన్నారు. ● సమాజంలో ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలువాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లో శనివారం కై ండ్నెస్ వాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎంతో మంది ఎన్నో వస్తువులను నిరుపయోగంగా పడేస్తుంటారని, అలాంటి వాటిని సేకరించి పేదలకు పంచాలన్న ఉద్దేశంతో కై ండ్నెస్ వాల్ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు
మన్ననూర్: విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని డీఈఓ రమేశ్కుమార్ సూచించారు. శనివారం మన్ననూర్లోని గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థులు శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో న్యాప్కిన్స్ తయారీ వివరాలను డీఈఓ తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ బాలకిషన్ ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
చారకొండ: స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని డీపీఓ శ్రీరాములు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని సారంబండతండా, కమాల్పూర్, గైరాన్తండా పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. అన్ని గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా ర్యాంపులు, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని శిథిల ఇళ్లలో నివాసముంటున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ నారాయణ ఉన్నారు. -
పరేషాన్లో డీలర్లు
● చౌకధర దుకాణాల నిర్వహణకు తప్పని అవస్థలు ● జిల్లాలోని డీలర్లకు రూ. 3.80 కోట్లు పెండింగ్ ●రేషన్ డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో కమీషన్ ఇవ్వకపోవడంతో డీలర్లపై ఆర్థిక భారం, ఒత్తిడి పెరుగుతుంది. కమీషన్ విడుదల చేయడంతో పాటు డీలర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. – సాదిక్పాషా, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేషన్ డీలర్ల కమీషన్కు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. డీలర్ల కమీషన్ విడుదలకు సబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఎంత కమీషన్ రావాలనే వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. – నర్సింహారావు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి 3న సీఎం రేవంత్ రాక అడ్డాకుల: మూసాపేట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన రెండో యూనిట్ను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా మూసాపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం మహబూబ్నగర్ ఎస్పీ జాన కి, ఎమ్మెల్యే జి.మధుసూ దన్రెడ్డి పరిశీలించారు. నాగర్కర్నూల్: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతినెలా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించే డీలర్లకు కష్టాలు తప్పడం లేదు. 5నెలలుగా రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమీషన్ చెల్లించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా ఫలితం లేకుండా పోతుందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అప్పులు చేసి రేషన్ దుకాణాలను కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. అసలే స్టాక్ పాయింట్ల నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో చాలా వరకు 1నుంచి 4 కిలోలు తక్కువగా వస్తుండగా.. కమీషన్ సైతం ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లాలో 558 దుకాణాలు.. జిల్లాలో 558 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 2,64,174 రేషన్ కార్డులు ఉండగా.. దాదాపు 8లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతినెలా 5,431 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. క్వింటాకు రూ.1.40 చొప్పున ప్రతినెలా రేషన్ డీలర్కు కమీషన్ ఇస్తున్నారు. జిల్లాలోని డీలర్లకు ప్రతినెలా రూ. 76.03లక్షల కమీషన్ అందాల్సి ఉండగా.. ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో చౌకధర దుకాణాల నిర్వహణ భారంగా మారింది. సుమారు రూ. 3.80కోట్ల కమీషన్ పెండింగ్లో ఉండటంతో దుకాణం అద్దె, కరెంటు బిల్లు, హమాలీ, తూకం వేసే సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ఆందోళనకు సిద్ధం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేషన్ డీలర్లు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. పెండింగ్లో ఉన్న కమీషన్తో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరుతున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీలోగా రేషన్ డీలర్ల కమీషన్ ప్రభుత్వం విడుదల చేయకుంటే మరుసటి రోజు 5న ఒక రోజు రేషన్ దుకాణాలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీటితో పాటు పలు డిమాండ్ల సాధనకు దశలవారీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు. -
డీడీ కట్టిన ప్రతిరైతుకు ట్రాన్స్ఫార్మర్లు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్/ పెంట్లవెల్లి: ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, డీడీలు కట్టిన రెండు నెలల్లో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దావాజిపల్లిలో, అయ్యవారిపల్లి, కొండూరు, మొలచింతలపల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు, పెద్దదగడలో రూ.3 కోట్లతో చేపట్టనున్న శ్రీతిరుమలనాథస్వామి ఆలయ మల్టీ కల్చరల్ ఆడిటోరియం నిర్మాణానికి, కల్వకోల్ క్రాస్రోడ్ నుంచి మైలారం వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం కాళ్లు అరిగేలా తిరిగాల్సిన అవసరం లేదని, డీడీలు కట్టిన రైతులకు రెండు నెలల్లో సామగ్రి అంతా ఇచ్చి కనెక్షన్లు ఇస్తారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోందని, దళారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దన్నారు. ఎవరైనా ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే మహిళాసంఘాల ద్వారా వారికి రుణాలు ఇప్పించి, బిల్లు వచ్చాక తిరిగి రుణం చెల్లించేలా చూస్తామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్సాగర్, మాజీ సర్పంచ్ గోపాల్, నాయకులు నర్సింహయాదవ్, రామన్గౌడ్, గోవింద్గౌడ్, కబీర్, నర్సింహనాయుడు, ధర్మతేజ, నాగిరెడ్డి, భీంరెడ్డి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు
నాగర్కర్నూల్: గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. భారీ వర్షాలు, తాగునీటి నిర్వహణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, గ్రామ పంచాయతీ, ఆర్థిక నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్, రెండో సాధారణ ఎన్నికలు ముందస్తు ఏర్పాట్లుపై డివిజనల్, మండల పరిషత్, పంచాయతీ అధికారులు, కార్యదర్శులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో బోర్లు, నీటి ట్యాంకులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని, మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని, దోమల పెరగకుండా నీటి నిల్వ తొలగించడం, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కూలిపోయే స్థితిలో ఉండే ఇళ్లను గుర్తించి వాటిలో ఎవరూ నివాసం ఉండకుండా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, అందుబాటులో లేకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవరాయలు, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఆర్డీఓ చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 2న ఓటర్ల తుది జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 460 గ్రామాల వారిగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాను సిద్ధం చేసి 4102 వార్డులతో ప్రచురించామని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతోపాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం జిల్లాస్థాయి రాజకీయ పార్టీ నేతలతో భేటీ, శనివారం మండల స్థాయి రాజకీయ పార్టీ నేతలతో ఎంపీడీఓల భేటీ, 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, 2న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామన్నారు. ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో రాష్ట్ర వెబ్సైట్లో పొందుపరిచామని, ప్రతి ఓటర్ తమ ఓటుహక్కు జాబితాలో ఉందో.. లేదో.. చెక్ చేసుకోవాలని సూచించారు. -
ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కందనూలు: ప్రతి క్రీడాకారుడు ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం అన్నారు. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల అభిరుచిని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజా నజీమ్ అలీ, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
యూరియా కోసం పడిగాపులు
ఉప్పునుంతల: మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్ద శుక్రవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. గురువారం యూరియా అందని రైతులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. స్టాక్ ఉన్న 150 బస్తాలను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఆగ్రో రైతు సేవాల కేంద్రాలకు యూరియా సరఫరాను ఇచ్చిన అధికారులు ప్రస్తుతం కేవలం పీఏసీఎస్కు మాత్రమే ఇవ్వడంతో అవసరానికి సరిపడా యూరి యా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం 580 బస్తాలు రావడంతో రెండు రోజులపాటు రైతుకు రెండేసి బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశామని పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు తెలిపారు. -
సీఎం ఇలాకాలో భూసేక‘రణం’!
‘కొడంగల్–నారాయణపేట’కు అడుగడుగునా అడ్డంకులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రూపకల్పన.. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డిజైన్లో మార్పు.. అయినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. జీఓ 69అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పాత డిజైన్ ప్రకారం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు. 350 మంది రైతులకు పరిహారం అందజేత.. తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ● తొలి రెండు ప్యాకేజీల్లో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు చేపట్టిన భూసేకరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఆయా మండలాల భూ నిర్వాసిత రైతులు ఎకరాకు రూ.14 లక్షల పరిహారం సరిపోదంటూ భూ సేకరణను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలతో సుమారు 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నారాయణపేటలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తాము ప్రాజెక్ట్కు వ్యతిరేకం కాదని.. బహిరంగ మార్కెట్ విలువననుసరించి 2013 చట్ట ప్రకారం పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. రాస్తారోకో చేస్తున్న భూ నిర్వాసిత రైతులు తొలి దశలో భూసేకరణ లక్ష్యం 1,957 ఎకరాలు 3 నెలలుగా సేకరించింది 597 ఎకరాలే.. కాట్రేవులపల్లి నుంచి కానుకుర్తి వరకు మిన్నంటిన నిరసనలు పరిహారం పెంచే వరకూ ఆందోళనలు తప్పవని రైతుల హెచ్చరిక ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్ కాల్వలు, పంప్హౌస్లు, ప్రెషర్ మెయిన్లు, లీడ్ చానెల్, డెలివరీ సిస్టర్న్లతో పాటు సివిల్, ఎలక్ట్రిక్ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. 2026 ఆగస్ట్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మలి దశలో కానుకుర్తి నుంచి కొడంగల్ నియోజవర్గ పరిధిలోని బొంరాస్పేట మండలంలోని చెరువు వరకు నీటిని తరలించనున్నారు. దీనికి టెండర్లు పిలవాల్సి ఉంది. -
14 ఎకరాలు కోల్పోతున్నాం..
మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వ్యవసాయంతో పాటు ఆయిల్పాం, కాస్మోటిక్ ఆయిల్ మిషన్, గేదెల షెడ్డు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం. – శ్రీనివాస్రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్కుర్తి ఉన్న ఎకరన్నర భూమిని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. మాది నిరుపేద కుటుంబం, భూమిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం. – భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్కుర్తి -
రాజకీయ నాయకులతో సమీక్ష
● ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● జిల్లాలో 6,47,342 మంది ఓటర్లు ● వచ్చె నెల 2న తుది జాబితా ● ఓటరు నమోదులో మహిళలదే పైచేయి అచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం ఓటరు ముసాయిదా తుది జాబితా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉండగా.. 4,102 వార్డులు ఉన్నాయి. వీటికి గాను 4,102 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,342 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 3,23,015 మంది పురుషులు, 3,24,316 మంది మహిళలు, 11 ఇతరులు మంది ఉన్నారు. పురుషుల కంటే 1,301 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. ఇక జిల్లాలోని 20 మండలాల వారీగా పరిశీలిస్తే.. అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు, వెల్దండ, బిజినేపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీఓల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలిపే అవకాశం కల్పించారు. ఆదివారం ఈ అభ్యంతాలపై డీపీఓ ఆధ్వర్యంలో పరిష్కారం చూపనున్నారు. అనంతరం వచ్చే నెల 2న అన్ని గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని డీపీఓ పేర్కొన్నారు. -
విద్యాధికారుల నిర్లక్ష్యంపై అసహనం
నాగర్ కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం డీఈఓ రమేష్కుమార్తో కలిసి ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలపై ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. నెలలో ఎంఈఓ 20 పాఠశాలలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు 12 పాఠశాలలు పర్యవేక్షించి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పొందుపరచాల్సి ఉండగా.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూడైస్ విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదన్నారు. కేవలం తాడూరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయన్నారు. డిజిటల్ పద్ధతిలో బోధన తెలకపల్లి: డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కారువంగ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. చిన్న చిన్న ఉదహారణలతో గణితాన్ని బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందన్నారు. -
వసతులున్నా.. ఆటలు అంతంతే!
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని జిల్లాల్లో మైదానాలు ఉన్నప్పటికీ కోచ్లు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణకు దూరమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు తమకున్న ఆసక్తితో క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణనిస్తున్నారు. కాని కోచ్లు లేకపోవడంతో చాలా క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వెనుకబడుతున్నారు.● మహబూబ్నగర్లోని ప్రధాన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికం. ఇంత గతంలో కోచ్లతో కళకళలాడిన ఈ స్టేడియం ప్రస్తుతం నలుగురు కోచ్లతోనే నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్లుగా కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ కోచ్లు మాత్రమే ఉన్నారు. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ కోచ్ శిక్షణ ఇస్తారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ ఉండగా ఇండోర్ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో బ్యా డ్మింటన్ కోచ్ మాత్రమే ఉన్నారు. మిగతా క్రీడలకు శిక్షకులు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. కబడ్డీ, హాకీ, ఖో–ఖో, హ్యాండ్బాల్, ఇండోర్లో బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నీస్ తదితర క్రీడలకు కోచ్ల అవసరం ఉంది.● 2007 నుంచి స్టేడియంలలో శాశ్వత పద్ధతిన కోచ్ల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కోచ్లు కూడా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడాశాఖ పరిధిలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంతో పాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియం, జడ్చర్లలోని మినీ స్టేడియం, సీసీకుంట అల్లీపూర్, భూత్పూర్ మండలం పోతులమడుగులో మినీ ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. మెయిన్ స్టేడియంలో ఐదుగురు, అల్లీపూర్లో కబడ్డీ కోచ్ మాత్రమే ఉన్నారు.● వనపర్తిలో ఒక క్రీడా ప్రాంగణం, మరో ఇండోర్ స్టేడియం ఉండగా ఒక్క కోచ్ కూడా లేరు. హాకీ అకాడమీలో ఇద్దరు కోచ్లు ఉన్నారు.● నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటలో మినీ స్టేడియంలు, కల్వకుర్తిలో ఇండోర్ స్టేడి యం ఉన్నాయి. కొల్లాపూర్కు ఇటీవల అథ్లెటిక్స్ కోచ్ రాగా కల్వకుర్తిలో ఫుట్బాల్ కోచ్, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ ఉన్నారు.● నారాయణపేట జిల్లా మక్తల్లో స్టేడియం ఉండ గా ఒక్క కోచ్ లేరు. ధన్వాడలో ఒక రెజ్లింగ్ కోచ్, నారాయణపేటలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ ఉన్నారు.● గద్వాలలో స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఎర్రవల్లి చౌరస్తాలో ఇండోర్ స్టేడియం ఉన్నాయి. గద్వాలలో ఖేలో ఇండియా ఫుట్బాల్ కోచ్ మాత్రమే ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా మైదానాల్లో వాచ్మెన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.నిధుల కొరతయువజన, క్రీడాశాఖలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2006 వరకు వార్షిక నిర్వహణ పేరిట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు నిధులు మంజూరు చేసేది. ఈ నిధులతో క్రీడల నిర్వహణ, క్రీడాసంఘాలకు ఆర్థికసాయంతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు టీఏ, డీఏలు చెల్లించేవారు. కాని ప్రస్తుతం నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక క్రీడాశాఖలు ఏర్పాటు చేసినా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. నూతన క్రీడాపాలసీలో కోచ్ల నియామకంతో పాటు క్రీడాశాఖలను బలోపేతం చేయాలని సీనియర్ క్రీడాకారులు కోరుతున్నారు.హ్యాండ్బాల్ కోచ్ను నియమించాలి.. ప్రధాన స్టేడియంలో 1997 నుంచి 2006 వరకు రవికుమార్ హ్యాండ్బాల్ కోచ్గా పనిచేసినప్పుడు ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అనంతరం నేను 2009 వరకు కోచ్గా పనిచేసి అనివార్య కారణాలతో మానేశాను. తర్వాత కోచ్ నియామకం చేపట్టలేదు. అయినా క్రీడపై ఉన్న ఆసక్తితో ఇప్పటికీ శిక్షణనిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శాశ్వత పద్ధతిన కోచ్ను నియమిస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు.– ఎండీ జియావుద్దీన్, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు, మహబూబ్నగర్ప్రతిపాదనలు పంపించాం..కోచ్ల నియామకంపై ఇదివరకే ప్రతిపాదనలు పంపించాం. నూతన క్రీ డాపాలసీతో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరగనుంది. స్టేడియంలలో కోచ్ల నియామకం జరిగే అవకాశం ఉంది. క్రీడా శిక్షణతో నైపుణ్యంగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. గ్రామీణస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసుకోవచ్చు.– ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ -
బాధలు వినండయ్యా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట బారులు తీరి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షించినా అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాలను మాత్రమే విక్రయిస్తున్నారు. యూరియా కొరత నేపథ్యంలో తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం సైతం జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట యూరియా కోసం నిరీక్షిస్తూ రైతులు బారులు తీరడం కనిపించింది. సాగుచేస్తున్న పంట విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలే ఇస్తుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.5 లక్షల ఎకరాల్లో సాగుజిల్లాలో ఈ సారి వరి, మొక్క జొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం సుమారు 5 లక్షల ఎకరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పీఏసీఎస్ల పరిధిలో యూరియాకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఆయా చోట్ల నిల్వలు అడుగంటకముందే అధికారులు అప్రమత్తమై సరిపడా స్టాక్ను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, రోజుల తరబడి స్టాక్ తెప్పించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట తదితర మండలాల్లో యూరియా సరఫరా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధిక వినియోగం, నిల్వతో డిమాండ్జిల్లాలో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అందుకు తగినంత సరఫరా లేకపోవడంతో పలుచోట్ల కొరత ఏర్పడుతోంది. వరి నాట్ల పూర్తయిన తర్వాత పిలకల దశంలో పైరు ఎదుగుదల కోసం రైతులు విస్త్రృతంగా యూరియాను వినియోగిస్తున్నారు. రైతులు అవసరానికి మించి పంటలకు ఎక్కువగా యూరియా వినియోగించడం, కొరతగా ఉందన్న కారణంతో చాలామంది రైతులు ఎక్కువ బస్తాలను ముందుగానే స్టాక్ చేసి పెట్టుకోవడంతో కృత్రిమంగా కొరత తలెత్తుతోందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు దుకాణాల్లో నిల్వలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు.జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన యూరియా – 20,336 టన్నులురెండు బస్తాలే ఇస్తున్నారు..నేను రెండు ఎకరాల్లో వరి, మరో నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఉదయం 8 గంటల నుంచే వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద లైన్లో నిల్చున్నా. ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. లారీ లోడు వచ్చిన గంటలోపే అయిపోయింది. సరిపడా యూరియా ఇచ్చి ఇబ్బందులు తొలగించాలి.– జంగయ్య, రైతు, చెరుకూర్, వెల్దండ మండలంకృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు..జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాం. ఈసారి జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో అదనపు యూరియా కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ఎవరైనా ఎమ్మార్పీకి మించి యూరియా అమ్మినా, కృత్రిమంగా కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటాం.– యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
మట్టి గణపతులను పూజిద్దాం
నాగర్కర్నూల్: వినాయక చవితి కోట్లాది మంది భక్తులను ఒకచోట చేర్చుతుందని, ఈ సందర్భంగా మట్టి గణనాథులను ప్రతిష్ఠించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతులను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి గణపతులను మాత్రమే పూజిద్దామని కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. మట్టి అయితే నీటిలో సులభంగా కరుగుతుందని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు, వాటిపై ఉపయోగించే రసాయనిక రంగులు నీటిలో కరుగుతూ నదులు, చెరువులు, కాల్వలు, బావులు వంటి నీటి వనరులను కలుషితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జలచర జీవులకు ప్రాణసంకటంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ దివ్య, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి జిల్లావ్యాప్తంగ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను అధికారులు వేగంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన 39 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం వాటిని ఆయా అధికారులకు కేటాయించారు. కలెక్టర్ బదావత్ సంతోష్, -
పీయూలో ‘సబ్స్టేషన్’ వివాదం..!
పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క గజం ఎక్కువ తీసుకోం.. పీయూలో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుదీర్రెడ్డి, ఈఈ, ట్రాన్స్కో లేఖ రాశాం పీయూలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్శాఖ అధికారుల వి/్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్చాన్స్లర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. రోడ్డు విస్తరణ పనుల్లో మరింత భూమి.. పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. 500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం ఎకరా కేటాయించారని విద్యుత్ అధికారుల వాదన అధిక భూసేకరణపై వీసీ లేఖ.. నేటికీ స్పందించని ట్రాన్స్కో పీయూ భూమి కాపాడాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 13 ఫిర్యాదులు రాగా.. ఇందులో 5 భూతగాదా, 4 భార్యాభర్తల మధ్య గొడవ, 2 ఇరువర్గాల గొడవ, 2 ఇతర ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి జిల్లాలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు పోలీసుశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గణేష్ మండపాల కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 24గంటల పాటు ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపంలో మద్యపానం, జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. -
మళ్లీ అదే తప్పు!
అడ్డగోలుగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు కాంట్రాక్టుల అప్పగింత ● ఈఎస్ఐ, పీఎఫ్లేక ఉద్యోగుల ఇబ్బందులు ● బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని అగ్రిమెంట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ● నిబంధనలు పట్టించుకోని అధికారులు ● ఏజెన్సీలపై ఎన్నాళ్లీ ఉదాసీనత? నాగర్కర్నూల్: అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ఏజెన్సీలు ఆటలాడుతున్నాయి. ఏజెన్సీలకు అధికారులు కూడా సహకరిస్తుండడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో కొన్ని ఏజెన్సీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్, ఈఎస్ఐని చెల్లించడంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్నిసార్లు వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో పాటు కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించి ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అక్రమాలకు పాల్పడ్డ వారికి కాంట్రాక్టు రద్దు చేసి మరొకరికి ఇచ్చారే తప్పా.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక వేళ కొంత నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఏజెన్సీలకు కొంత భయం ఉండే అవకాశం ఉంటుంది. ఏజెన్సీలు మారుతున్నాయే తప్పా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి భరోసా ఉండడం లేదు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. జిల్లాలో ఎంప్యానెల్ ఏజెన్సీలు 26 ఉండగా.. అందులో దాదాపుగా 700 నుంచి 800 వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఏజెన్సీలకు సంబంధించి ఏ శాఖలోనైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అప్పగించే సమయంలో బ్యాంక్ పీఎఫ్, ఈఎస్ఐలకు సంబంధించి మూడు నెలలకు సరిపడా డబ్బులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సదరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినా ఆ డబ్బును అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయవచ్చు. బ్యాంక్ గ్యారెంటీకి ఇచ్చిన డబ్బులు ఖాతాలోంచి తీయడానికి వీలుండదు. కాంట్రాక్ట్ ముగిసిన తరువాత సంబంధిత అధికారి ఎన్ఓసీ ఇస్తేనే బ్యాంక్ నుంచి సదరు డబ్బులు ఏజెన్సీకు సంబంధించిన వారు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్లోనూ బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇవ్వాలని నిబంధనలే స్పష్టంగా ఉన్నా.. ఏ అధికారి కూడా పాటించడం లేదు. పరిశీలిస్తాం.. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని పోస్టులను ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి అగ్రిమెంట్ చేసిన మాట వాస్తవమే. నిబంధనలకు సంబంధించి ఒకసారి పరిశీలన చేస్తాం. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, ఇన్చార్జి డీఎంఅండ్హెచ్ఓ -
టాస్క్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కల్వకుర్తి రూరల్: నిరుద్యోగ యువతకు స్కిల్స్ నేర్పించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తదితరులు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరం, ఐటీఐ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. వీటన్నింటిలో ఐటీఐ ప్రాంగణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ ఐటీఐతో పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశాలతో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో రూ.1.50 కోట్ల అంచనాతో 4 అంతస్తుల్లో నిర్మించే సెంటర్లో ప్లేస్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ఫండమెంటల్ స్కిల్స్, జావా, పైథాన్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు సుంకిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వివరించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తిలో ఐటీ టవర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. టీ హబ్, వీ హబ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఈఓ చెప్పారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జయమ్మ విజ్ఞప్తి మేరకు కళాశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రాఘవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షానవాజ్ ఖాన్, అధికారులు ఉన్నారు.అగ్నివీర్కు దరఖాస్తు ఆహ్వానంకందనూలు: నాగర్కర్నూల్ జిల్లాలోని యువత భారత వైమానిక దళం అగ్నివీర్లో చేరేందుకు ఆసక్తి గలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై ఉండి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని htt p//agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 78391 26939, 63002 95901 నంబర్లను సంప్రదించాలని కోరారు.56 ‘మీసేవ’ నిర్వాహకులపై చర్యలునాగర్కర్నూల్: నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్న జిల్లాలోని 56 మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 128 మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా పని చేయాల్సిన మీసేవ కేంద్రాలు నిబంధన లు అతిక్రమించి రైతులు, ప్రజలు, విద్యార్థుల నుంచి అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కేంద్రాలు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అధిక వ సూళ్లకు పాల్పడుతున్నట్లు తమ వద్ద సమాచా రం ఉందన్నారు. జిల్లాలో 26 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, మరిన్ని ఆధార్ కేంద్రాలు నెలకొల్పేందుకు మీసేవల నుంచి దరఖాస్తుల కోరుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఈ డిస్ట్రిక్ మేనేజర్ నరేష్, మీసేవ కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల హామీలు నెరవేర్చాలినాగర్కర్నూల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, రూ.18వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్ అమలు చే యాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా వైద్యధికారి డీఎంహెచ్ఓ రవికుమార్కు సమ స్యలతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, శంకర్నాయక్, అంతటి కాశన్న, కళావతి, చెన్నమ్మ, వసుందర పాల్గొన్నారు. -
చైర్మన్, కమిషనర్ పోకడలపై గుస్సా..
అచ్చంపేట: స్థానిక మున్సిపల్ సర్వసభ సమావేశం సాయంత్రం 4గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. అధికారులు ఆలస్యం చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అలకబూనారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వచ్చిన తర్వాతే సమావేశం ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో కొంతమంది కౌన్సిలర్లు ఒకానొక సమయంలో బయటికి వెళ్లిపోయారు. మున్సిపల్ లుకలుకలు బయటపడుతాయని బుజ్జగించడంతో ఎమ్మెల్యే వచ్చే సమయంలో తిరిగి కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 5.45గంటలకు ప్రారంభమైన సమావేశానికి విలేకరులను సైతం అనుమతించలేదు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో అవినీతి బాగోతాలు బయటపడుతాయనే ఆందోళనతోనే రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా చైర్మన్, కమిషనర్ వైఖరిపై వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు బాహాటంగా మున్సిపల్ గ్రూపులో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండు ముందు స్టీట్ వెండర్స్ను తొలగించే విషయంలో వైస్ చైర్మన్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ తీరును దుయ్యబట్టారు. మున్సిపాలిటీలో ప్రొటోకాల్ రగడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ రగడ సాగుతోంది. వార్డుల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నా.. స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా చైర్మన్, కమిషనర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలలో మున్సిపల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో కొందరు కౌన్సిలర్లు ప్రోటోకాల్ రగడపై పోటాపోటీగా విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తమను గౌరవించేవారని, తాము రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డామని, కొందరు పైసలతో పదవులను కొనుకొని వ్యాపారంలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నియంత పోకడ మానకపోతే త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
జటప్రోల్ ఆలయాల అభివృద్ధికి కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● రూ.4.8 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పెంట్లవెల్లి: దశాబ్దాల దీప, ధూప, నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామంలో పురాతనమైన మధనగోపాలస్వామి, అగస్తేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న జటప్రోల్ గ్రామ ప్రజల ఆశ త్వరలోనే నెరవేరబోతుందన్నారు. రూ.3.80 కోట్ల వ్యయంతో మధనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక గదులు, కోనేరు పార్కు, కళావేదిక వంటివి నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులు, కళాకారులు ప్రతిరోజు నాట్య ప్రదర్శన చేయడానికి ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతిరోజు దీప, ధూప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని అర్చకులకు సూచించారు. అనంతరం జటప్రోల్లో పునర్నిర్మించిన అగస్తేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సైతం రూ.కోటి వెచ్చించడం జరిగిందని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్తో మాట్లాడి అభివృద్ధి పనులను నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సురభీ రాజావంశస్థులు ఆదిత్య లక్ష్మణరావు, ఆర్డీఓ భన్సీలాల్, నాయకులు గోవింద్గౌడ్, రామన్గౌడ్, నర్సింహయాదవ్, గోపాల్, గోపినాయక్, నాగిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలి
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన గిరిజన సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిరంగాల్లో వెనకబడిన గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు మైదాన, ఏజెన్సీల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుచేయాలన్నారు. గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 12శాతం పెంచాలని.. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దేశ్యానాయక్, శంకర్ నాయక్, అశోక్, లక్పతి, దశరథం, హరీశ్నాయక్, వాల్యా, రమేశ్, మల్లేశ్, వెంకటేశ్, శ్రీను, నరేందర్, అనిత ఉన్నారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం కల్వకుర్తి రూరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని టీఎన్జీఓ భవన్లో డివిజన్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడిగా సురేష్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రాజేష్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, నూతన పెన్షన్ విధానంపై ఆందోళన చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమ కార్యాచరణలో భాగంగా పబ్లిక్ గార్డెన్లో జరిగే సమావేశంలో పాల్గొంటామన్నారు. సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కో చైర్మన్ సురేందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహారావు, నెహ్రూ ప్రసాద్, బాలరాజు, కృష్ణారెడ్డి, రాజేందర్రెడ్డి, జమీల్ అహ్మద్, ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ నూతన కార్యవర్గం ఎన్నిక కందనూలు: వాలీబాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (పైకా భవన్)లో ఆదివారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి పోచప్ప ప్రకటించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా వంకేశ్వరం నిరంజన్, ఉపాధ్యక్షుడిగా ఊరుకొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా పశుల వెంకటేష్, సహాయ కార్యదర్శిగా వీరప్ప ఎన్నికయ్యారు. కార్యక్రమంలో హనీఫ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం కల్వకుర్తి రూరల్: దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిద్దామని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ట్రస్టు చైర్మన్ జూలూరు రమేష్బాబు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉత్సవ కమిటీ సమావేశంలో కమిటీ అధ్యక్షుడిగా గంధి రవి, 2026 సంవత్సర అధ్యక్షుడిగా కల్మిచర్ల గోపాల్ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించామని, ఈసారి కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు శేఖర్, వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కల్వ మనోహర్, డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిచాని బాలకృష్ణ, నాయకులు కల్మచర్ల రమేష్, శివ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన విద్య బోధించాలి
వెల్దండ: విద్యార్థులకు మెరుగైన బోధన చేయడంతోపాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన వెల్దండలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పాఠశాలలోని స్టోర్ రూం, వంట గదులను కలియదిరిగారు. విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం నూతన మెనూ ప్రకారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే స్థానిక మోడల్ హైస్కూల్, ఇంటర్మీడియట్ హాస్టల్ను తనిఖీ చేసి మాట్లాడారు. విద్యా బోధన, భోజన సదుపాయం, ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు విద్యతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టెస్టు బుక్ మేనేజర్ నర్సింహులు, మోడల్ హాస్టల్ ఇన్చార్జ్ మంజుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం
● ‘పనుల జాతర’ కోసం రూ.20,200 కోట్లు మంజూరు ● మహిళలకు వడ్డీలేని రుణాలు ● అన్నిరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ● రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్/ వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, మాధవానిపల్లి, మొల్కమామిడి, తుర్కపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పనుల జాతరలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.17.81 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జి, సాగునీరు, ఇతరత్రా అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎంపీడీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా డీఎస్పీ పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. -
ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం
కల్వకుర్తి రూరల్/ వెల్దండ: నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం రహదారుల నిర్మాణం చేపట్టడంతోపాటు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కల్వకుర్తి, వెల్దండ మండలాల్లోని యంగంపల్లి నుంచి జిల్లెల్ల గ్రామానికి రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే జీడిపల్లి తండా, పెద్దాపూర్లో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, వెంకటాపూర్ తండా, కంటోనిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ధితో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయన్నారు. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతగా చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాడిరైతుల సౌకర్యార్థం పశువైద్యశాలను మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉండడంతో వారి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్రెడ్డి, నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్కుమార్, కిషోర్రెడ్డి, డీఎల్పీఓ నర్సిరెడ్డి, పీఆర్ డీఈఈ బస్వరాజు, వెల్దండ తహసీల్దార్ కార్తీక్కుమార్, ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. -
పొదుపుతో భద్రత
● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 60ఏళ్లు నిండిన మహిళలతో ప్రత్యేక గ్రూపులు ● బ్యాంక్ లింకేజీ రుణాలు ● కొనసాగుతున్న అర్హుల గుర్తింపు ప్రక్రియ ● నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంకు ఖాతాలు ●ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. జిల్లాలో 20వేల మందిని చేర్చేందుకు టార్గెట్ ఉండగా.. ఇప్పటి వరకు 5,246 మందిని గుర్తించగా ఇందులో 60ఏళ్ల వయస్సు దాటిన వారు 2,315 మంది, దివ్యాంగులు 684 మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. – ఓబులేష్, డీఆర్డీఓ అచ్చంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వారిని స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసేలా సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి డబ్బు పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో కిశోర బాలికలను చేర్పించేందుకు సెర్ఫ్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 ఏళ్లు నిండిన వారిని తొలగిస్తున్నారు. కానీ కొత్త పాలసీలో వీరితో మళ్లీ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలకు వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురిలో సంఘటితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొదలైన కార్యాచరణ నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12 నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13,239 మహిళా సంఘాలు ఉండగా వాటిలో 1,47,123 మంది సభ్యులు ఉన్నారు. దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకరానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు. -
యూరియా కొరత సృష్టిస్తే సహించం
ఉప్పునుంతల: ఎరువుల డీలర్లు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడి.. కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం ఉప్పునుంతలలోని ఆగ్రో రైతు సేవాకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యారియాకు సంబంధించిన స్టాక్ రికార్డులను పరిశీలించారు. రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను తీసుకెళ్లాలని సూచించారు. ఎరువుల వాడకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. పీహెచ్సీలో మందుల నిల్వలు, వార్డుల శుభ్రత, పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. -
బాలికలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: బాలికలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోక్సో చట్టంపై పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. పోక్సో చట్టం బాలికలకు రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే, సదరు వ్యక్తి కఠినంగా శిక్షించబడటంతో పాటు జైలుశిక్ష అనుభవిస్తాడన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించి.. బాలికలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. వచ్చేనెలలో నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, సీనియర్ సివిల్జడ్జి వెంకట్రామ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి శృతిదూత పాల్గొన్నారు. -
సాగులో మెళకువలు చెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పుడు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు సురవరం సుధాకర్రెడ్డి గ్రామానికి వచ్చిన సమయాల్లో రాజకీయాల గురించి అడిగి తెలుసుకునే అలవాటు. అలాగే ప్రతి సంక్రాంతికి యు వతను ప్రోత్సహించడానికి క్రీడాపోటీలు నిర్వహించేవారు. తనతోపాటు కూర్చున్న యువకులకు క్రీడలు, జీవితంలో రాణించడం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. అందరితో ఎంతో అనోన్యంగా ఉండేవారు. – వీరేష్, మండల అధ్యక్షుడు, ఏఐవైఎఫ్ -
కొండ్రావుపల్లెతో ప్రత్యేక అనుబంధం
సాక్షి, నాగర్కర్నూల్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి మరణంతో నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లెలో విషాదం నెలకొంది. సురవరం సుధాకర్రెడ్డి అమ్మమ్మ ఊరు అయిన కొండ్రావుపల్లెలోనే 1942 మార్చి 25న జన్మించారు. గ్రామంలోని వద్ది రాంరెడ్డి మనవడిగా సుధాకర్రెడ్డి గ్రామస్తులకు సుపరిచితుడు. బాల్యంలో ఎక్కువ సమయం పాటు కొండ్రావుపల్లెలోనే గడిపేవాడు. ఎంపీగా, జాతీయ స్థాయి కమ్యూనిస్టు అగ్రనేతగా ఎదిగినా తనకు సమయం కుదిరినప్పుడల్లా కొండ్రావుపల్లెకు వచ్చి బంధువులతో ఆత్మీయంగా గడిపేవాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ● -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్రెడ్డికి ఘనంగా నివాళి ● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు ●సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు. అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు. -
పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆర్ఐ స్టోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్ఐ స్టోర్లో ఆర్ముడ్ రిజర్వు ఫోర్స్కు సంబంధించిన వివిధ రకాల పోలీసు సామగ్రిని భద్రపర్చనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమైనప్పుడు వాటిని వినియోగిస్తామన్నారు. పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఓల్డ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోల్ లైట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఎస్ఐ గోవర్ధన్, ఏఆర్ ఎస్ఐలు గౌస్పాషా, కళ్యాణ్, ప్రశాంత్ ,శివాజీ పాల్గొన్నారు. ఆన్లైన్లో నీటిపన్ను చెల్లింపునకు అవకాశం నాగర్కర్నూల్: వంద రోజుల ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథ, మున్సిపాలిటీ నల్లా కనెక్షన్లు ఆన్లైన్ చేయడం జరిగిందని.. ఇకపై ఆన్లైన్లోనూ నీటిపన్ను చెల్లించవచ్చని నాగర్కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు నీటిపన్నును నేరుగా లేదా ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. ఇదివరకే ఎవరైనా మ్యానువల్గా నీటిపన్ను చెల్లించి రశీదు పొందితే.. ఆ వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 91827 06723 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ప్రతి చిన్నారికి టీకాలు తప్పనిసరి బిజినేపల్లి: ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాధినిరోధక టీకాలు వేయాలని డీఎంహెచ్ఓ కె.రవికుమార్ వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. వ్యాక్సిన్ శీతలీకరణ స్థితి, క్షేత్రస్థాయి సిబ్బంది ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకెళ్తున్నారు.. టీకాకరణ నమోదు వంటి పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం బిజినేపల్లి, మంగనూర్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో టీకాకరణ ప్రక్రియను డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా వందశాతం టీకాకరణ లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. 39మంది ఎస్ఏలకు జీహెచ్ఎంలుగా పదోన్నతి కందనూలు: జిల్లాలో 39మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. ఎస్ఏల పదోన్నతుల ప్రక్రియ బుధవారం రాత్రి నుంచి ప్రారంభం కాగా.. గురువారం వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఎస్ఏలకు శుక్రవారం రాత్రి ఆర్డర్ కాపీలు ఇవ్వగా.. శనివారం ఆయా పాఠశాలల్లో రిపో ర్టు చేశారు. అదే విధంగా 106 మంది ఎస్జీటీలు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వీరిలో 84 మంది ఎస్ఏలుగా, 22 మంది పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నట్లు జిల్లా విద్యాశా ఖ అధికారులు తెలిపారు.శనేశ్వరుడికి తైలాభిషేకాలు బిజినేపల్లి: నందివడ్డేమాన్లోని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తులచే ప్రత్యేక పూజలు చేయించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో అవకతవకలు
● పెద్దకొత్తపల్లిలో ఎరువుల దుకాణం సీజ్ ● జిల్లా కేంద్రంలో డీలర్కు షోకాజ్ నోటీసు నాగర్కర్నూల్/పెద్దకొత్తపల్లి/కల్వకుర్తి రూరల్: రైతులకు యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఎరువుల డీలర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. పెద్దకొత్తపల్లిలోని అరుణోదయ సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణంలో శనివారం డీఏఓ యశ్వంత్రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే 15 రోజులుగా సంబంధిత డీలర్ పీఓఎస్ మిషన్లో రైతుల వివరాలను నమోదు చేయకుండా నేరుగా ఎరువులు విక్రయించినట్లు గుర్తించారు. పెద్దకొత్తపల్లికి 270 బస్తాల యూరియా వస్తే.. 40 బస్తాల యూరియాను పీఓఎస్ మిషన్లో నమోదు చేయకుండా విక్రయించడంతో 15 రోజులపాటు డీలర్ లైసెన్స్ను రద్దు చేసి దుకాణాన్ని సీజ్ చేసినట్లు డీఏఓ తెలిపారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న నాగార్జున ఫర్టిలైజర్స్ డీలర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొందరు డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని డీఏపీ, యూరియాను రూ. 200 వరకు అధికంగా విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పైసలిస్తేనే పనులు చేస్తున్నారు..
● అధికారుల తీరుతో మత్స్యకారులకు ఇబ్బందులు ● జిల్లా మత్స్యశాఖ అధికారిణిని సస్పెండ్ చేయాలి ● రసాభాసగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం అచ్చంపేట రూరల్: జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని.. అధికారుల తీరుతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆరోపించారు. శనివారం మండలంలోని చంద్రసాగర్ చేపల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని సమావేశం ఎజెండా అంశాలను చదివి వినిపించారు. ఈ క్రమంలో కొందరు డైరెక్టర్లు కలగజేసుకుని అసలు ఎజెండా అంశాల్లో మత్స్యకారుల సమస్యలు లేవని.. తమకు సమావేశం సమాచారం కూడా నామమాత్రంగా తెలియజేశారని.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సంఘం చైర్మన్ వాకిటి ఆంజనేయులు మా ట్లాడుతూ.. జిల్లాలో మత్స్యకారులకు గుర్తింపేలేదని, జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని కూడా తూతూ మంత్రంగా నిర్వహించారన్నారు. అధికారు ల వల్ల మత్స్యకారులకు ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. సంఘాల మధ్య పంచాయితీలు పెట్టడంతో పాటు కార్యాలయంలో చిన్నచిన్న పనులకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. స్టేజీపై నుంచి డైరెక్టర్లు కిందకు దిగి నేలపై బైఠాయించారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ విజయభాస్కర్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సర్వసభ్య సమావేశం గురించి నెల రోజుల ముందుగానే సమాచారం అందించాం. వారి మధ్య కుర్చీల కొట్లాట ఉంది. నాపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. సంఘానికి సంబంధించిన రికార్డులు కనిపించడం లేదు. ఈ విషయంపై మాట్లాడితే ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక మహిళా ఉద్యోగి అని చూడకుండా ప్రవర్తించడం సరైంది కాదు. – రజని, జిల్లా మత్స్యశాఖ అధికారిణి -
ద్వీపానికి సొబగులు
అమరగిరి ద్వీపంలో పర్యాటకులకు సకల వసతులు ● వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్తో పర్యాటకుల ఆకర్షణ ● రూ.68.10 కోట్ల అంచనాతో పనులు ● నల్లమల అడవి, కృష్ణానది అందాలను ఆస్వాదించేలా రూపకల్పన అమరగిరి ఐలాండ్లో టూరిజం వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకులకు అధునాతన వసతులను కల్పించనున్నాం. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో సందర్శకులకు ఈ ప్రాంతం మంచి డెస్టినేషన్ అవుతుంది. టూరిజం అభివృద్ధి ద్వారా కొల్లాపూర్ ప్రాంత రూపురేఖలు మారుతాయి. కేవలం ఏడాది కాలంలోనే పనులను పూర్తి చేస్తాం. – జూపల్లి కృష్ణారావు, మంత్రి అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ వ్యయం రూ. 45.84 కోట్లు సాక్షి, నాగర్కర్నూల్: చుట్టూ పచ్చగా కళకళలాడుతున్న నల్లమల కొండలు, మధ్యలో నుంచి నీలిరంగు పులుముకొని పరవళ్లు తొక్కుతూ సాగిపోయే కృష్ణమ్మ.. ఆ నది మధ్యలో ప్రకృతి ప్రేమికులు సేద దీరేందుకే ఆశ్రయం ఇచ్చిందా అన్నట్టుగా ఉన్న దీవి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరంలోని అమరగిరి ద్వీపంలో పర్యాటకుల కోసం సకల వసతులు ఏర్పాటు చేయనున్నారు. రూ.68.10 కోట్ల వ్యయ అంచనాతో ప్రభుత్వం వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఒకేచోట పర్యావరణం, అడవులు, ఆధ్యాత్మికత, రీక్రియోషన్, వెల్నెస్, వాటర్స్పోర్ట్స్ అందుబాటులో ఉండేలా ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. పర్యాటకం, ఆధ్యాత్మికం ఒకేచోట.. పర్యాటకంగా విస్త్రృత అవకాశాలు ఉన్న కృష్ణాతీరంలోని అమరగిరి ద్వీపంలో సమీపంలో పురాతన ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు ఆరోగ్యం, ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్(సాస్కి) స్కీమ్ కింద నిధులను వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా అమరగిరి సమీపంలో కృష్ణానదిలో ఉన్న సుమారు 8 ఎకరాల ద్వీపంలో వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ ద్వీపంలో పర్యాటకుల వసతి కోసం రూ.45.84 కోట్ల వ్యయంతో 30 వరకు కాటేజీల నిర్మాణం, కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇన్డోర్ గేమ్స్, స్విమ్మింగ్పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వాచ్టవర్, వ్యూ పాయింట్, జెట్టీబోట్స్, ధ్యాన మందిరం సౌకర్యాలను కల్పించనున్నారు. పర్యాటకులు ఒకసారి ద్వీపంలో ప్రవేశించాక అధ్యాత్మిక, పర్యా టక అనుభూతులను ఒకేచోట ఆస్వాదించేలా ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. కృష్ణాతీరంలోని సోమశిలలో వీఐపీ ఘాట్ వద్ద బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. కొల్లాపూర్ మండలంలోని లలితా సోమేశ్వర ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలకు అనుసంధానిస్తూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. సోమశిల వీఐపీ ఘాట్ – రూ.1.60 కోట్లు సోమశిల వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.68.10 కోట్లు ఈగలపెంట అరైవల్ జోన్, ప్రోమోనోడ్ రూ.8.36 కోట్లు ఈగలపెంట రివర్ క్రూయిజ్ నోడ్ – రూ.7.69 కోట్లు అమరగిరి వద్ద కృష్ణానదిలో ఉన్న ద్వీపంఈగలపెంట చెంచు మ్యూజియం – రూ.3.60 కోట్లు అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్లో ఈగలపెంట రివర్ క్రూయిజ్ నోడ్ కింద పనులు చేపట్టనున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను వీక్షించేలా రూఫ్ టాప్ కేఫ్ నిర్మాణం, వ్యూయింగ్ డెక్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, గోల్ఫ్ కార్ట్, లైటింగ్, ఎలక్ట్రికల్ పనులు చేపట్టనున్నారు. ఈగలపెంటలోనే చెంచు మ్యూజియం నిర్మాణం ద్వారా స్థానిక చెంచుల జీవన స్థితిగతులపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు. ఈ సర్క్యూట్ పరిధిలో పర్యాటకుల కోసం వసతులు, పార్కింగ్, రోడ్డు సౌకర్యాలను విస్త్రృతం చేయనున్నారు. -
పొదుపుతో భద్రత
● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 60ఏళ్లు నిండిన మహిళలతో ప్రత్యేక గ్రూపులు ● బ్యాంక్ లింకేజీ రుణాలు ● కొనసాగుతున్న అర్హుల గుర్తింపు ప్రక్రియ ● నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంకు ఖాతాలు అచ్చంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వారిని స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసేలా సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి డబ్బు పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో కిశోర బాలికలను చేర్పించేందుకు సెర్ఫ్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 ఏళ్లు నిండిన వారిని తొలగిస్తున్నారు. కానీ కొత్త పాలసీలో వీరితో మళ్లీ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలకు వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురిలో సంఘటితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12 నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13,239 మహిళా సంఘాలు ఉండగా వాటిలో 1,47,123 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. జిల్లాలో 20వేల మందిని చేర్చేందుకు టార్గెట్ ఉండగా.. ఇప్పటి వరకు 5,246 మందిని గుర్తించగా ఇందులో 60ఏళ్ల వయస్సు దాటిన వారు 2,315 మంది, దివ్యాంగులు 684 మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. – ఓబులేష్, డీఆర్డీఓ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకరానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అచ్చంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ పోలీసులకు సూచించారు. శుక్రవారం అచ్చంపేట పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నియంత్రణకు సమష్టి కృషి చేయాలని ఎస్ఐ విజయభాస్కర్కు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు తదితరులు ఉన్నారు. -
కళాశాలల్లో వసతులేవి..?
● ఏడింటిలో పూర్తిస్థాయిలో వసతులు లేవని గుర్తించిన వీసీ ● మరో 7 కళాశాలలకు షోకాజ్ నోటీసులు ● గతంలో అప్లియేషన్ తనిఖీలు నిర్వహించిన అధికారులపై విమర్శలు విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదని మరోసారి తేటతెల్లమైంది. చాలా కళాశాలల్లో అర్హులైన సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో లేకపోవడం, ల్యాబ్స్, మరుగుదొడ్లు, విద్యార్థులు కళాశాలకు రావడం లేదని తదితర అంశాలపై విద్యార్థి సంఘాల నాయకులు వీసీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పలు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో 7 కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం వంటివి గుర్తించి.. ఆయా కళాశాలలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అయితే నోటీసులకు అన్ని కళాశాలల నుంచి సమాధానం రావడంతో వాటిని పరిశీలించి తదుపరి చర్యలను తీసుకోనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఓ కళాశాలపై చర్యలు సైతం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. డిగ్రీతోపాటు ఇతర కళాశాలలపై నిర్వహించాల్సిన అప్లియేషన్, ర్యాటిఫికేషన్ను అధికారులు ఇప్పటి వరకు నిర్వహించకపోవడం గమనార్హం. నామమాత్రంగా చేశారా.. పీయూ పరిధిలోని 29 బీఈడీ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో అప్లియేషన్ కోసం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారులు సంబంధిత కళాశాలలో నిబంధనలు పాటించని వాటికి సిబ్బంది, వసతులు తదితర అంశాలను సమకూర్చుకోవాలని రిమార్క్ రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు రిమార్కు చూపించారా.. లేక నామమాత్రంగా తనిఖీలు చేశారా.. అనేది ప్రశ్నగా మిగిలింది. తాజాగా అప్లియేషన్ తనిఖీలు చేసిన కళాశాలల్లోనూ వసతులు లేవని విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేసే వరకు చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు కళాశాలలను ఒక వీసీ నేరుగా వసతులపై తనిఖీలకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కిందిస్థాయి సిబ్బంది ప్రైవేటు కళాశాలల్లో పర్యవేక్షణను పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో వీసీ నేరుగా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మికంగా గతంలో తనిఖీలు నిర్వహించి.. వసతులు, నిబంధనలు పాటించని మొత్తం 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చాం. వారు సమాధానం ఇస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీ కళాశాలలపై కూడా ర్యాటిఫికేషన్, అప్లియేషన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సెయింట్ మేరీస్ కళాశాలపై చర్యల్లో భాగంగా 50 శాతం సీట్లను కుదించాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ గతంలో మొదటిసారి తనిఖీలు నిర్వహించిన క్రమంలో కళాశాలల్లో లేని వసతులపై రిమార్కులు కళాశాలల వారికి చూపించాం. మార్పులు లేనందుకు మరోసారి వీసీ నేరుగా తనిఖీలు చేసి.. వసతులు లేని 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. గతంతో పోల్చితే తనిఖీలు మెరుగుపడ్డాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ పీయూ వీసీ శ్రీనివాస్ మొత్తం 10 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇందులో 7కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో సెయింట్ మేరీస్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, నలంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆదర్శ కళాశాల ఎడ్యుకేషన్, శ్రీవాసవీ ప్రతాపరాజ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలమూరు కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కొన్నింటిలో ర్యాటిఫికేషన్ సమయంలో చూపించిన అధ్యాపకులు తనిఖీల సమయంలో లేకపోవడం, ల్యాబ్స్, లైబ్రరీలు, ఇతర వసతులు లేకపోవడం, ఉన్న సిబ్బందిలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు లేకపోవడం వంటివి ఉన్నాయి. వీటితోపాటు ఎస్డీఎం కాలేజీ ఆఫ్ లా వనపర్తికి నోటీసులు ఇచ్చారు. ఈ కళాశాల ప్రారంభం నుంచి సిబ్బందికి సంబంధించి అసలు ర్యాటిఫికేషన్ చేయించుకోలేదని, అందుకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన కళాశాలల్లో సెయింట్ మేరీస్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కళాశాలలో బీఈడీలో ఇన్టెక్ 100 మంది కాగా ఇందులో 50 శాతం సీట్లకు కోత విధించారు. అంటే 50 సీట్లను తక్కువగా అడ్మిషన్ చేసుకోవాల్సి ఉంది. త్వరలో మరిన్ని కళాశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. -
గణపతి ఉత్సవాల్లో డీజేలపై నిషేధం
అచ్చంపేట రూరల్: గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులతో అచ్చంపేట ఎస్ఐ విజయభాస్కర్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గణపతి ఉత్సవాల్లో డీజేలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి డీజేలు తీసుకొస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గణపతి మండపాలకు పోలీసు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. యువత భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. నిమజ్జనం ర్యాలీలో పాల్గొనే వాహనాలకు ఫిటెనెస్ ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, సీఐ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్ఐలు విజయభాస్కర్, పవన్కుమార్, ఫైర్ ఆఫీసర్ శంకర్, విద్యుత్శాఖ అధికారులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
‘తాత్కాలికంగా వంతెన నిర్మిస్తాం’
లింగాల: మండల కేంద్రం సమీపంలో అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న చిన్నవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్అండ్బీ డీఈ జలంధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్రావు పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 లక్షలు కేటాయించింది. అప్పట్లో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. వర్షాలకు వాగు ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోవడంతో విషయాన్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా తాత్కాలికంగా వంతెన పక్క నుంచి సిమెంట్ పైపులు వేయించి రాకపోకలకు ఆటంకం కలుగకుండా చూస్తామని డీఓ తెలిపారు. నిధులు విడుదలయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి: డీఎంహెచ్ఓ తెలకపల్లి: కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ రవికుమార్ సూచించారు. మండలంలోని బొప్పల్లి, పెద్దూరు ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గర్భిణులకు 5వ నెలలోనే ప్రణాళిక తయారు చేయడంతో పాటు సాధారణ కాన్పులు చేయాలన్నారు. కాన్పు సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే గుర్తించి జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, డెంగ్యూ జ్వరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులకు ఆదేశించారు. -
అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
తిమ్మాజిపేట: మండలంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న పనుల జాతర కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామ సమీపంలో నిర్మించిన పశువుల షెడ్డును అధికారులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని హనుమాన్తండాలో పశువుల కొట్టం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
పెంట్లవెల్లి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంగంపల్లితండాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, కలెక్టర్ బాదావత్సంతోష్తో కలిసి ఆయన శుంకుస్థాపన చేశారు. రూ.1.40 కోట్లతో పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ఎంగంపల్లితండాలో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్వాడీ సెంటర్కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. మేనిఫెస్టో సంబంధం లేకుండా భవిష్యత్లో ఇంకా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ వేగంగా, నాణ్యతగా రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు. 98 జీఓ నిర్వాసితులపై సీఎంతో చర్చిస్తా పెంట్లవెల్లి మండలంలోని యంగంపల్లితండాలో 98 జీఓ నిర్వాసితులను మంత్రి కలిసి, తొందర్లోనే ఉద్యోగం లేదా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సమస్యపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లంతా కలిసి సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తామని ఆయన నిర్వాసితులకు మాట ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయసింహ, ఎంపీడీఓ దేవేందర్, రామన్గౌడ్, వేణుగౌడ్, మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నల్లపోతుల గోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ కబీర్, భీంరెడ్డి, గోపినాయక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
● ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ● ఇంటర్మీడియట్తో పాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు ● బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు ● టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. ఆన్లైన్ విధానంలోనే.. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
12 గంటలు దాటినా విధులకు రాలే..
● తహసీల్దార్పై ఎమ్మెల్యే అసహనం ● ఫోన్లో కలెక్టర్కు ఫిర్యాదులింగాల: విధులను విస్మరించే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హెచ్చరించారు. ఎమ్మెల్యే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. కార్యాలయంలో ఆయా విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే తహసీల్దార్తో పాటు కింది స్థాయి సిబ్బంది విధులకు హాజ రు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో సకాలంలో పనులు కాకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలయినా తహసీల్దా ర్ విధులకు రాకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న వారిని స్థాన చలనం కల్పిస్తామన్నారు. కార్యాలయంలో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆరోపించారు. అధికారుల పనితీరు గురించి కార్యాలయం నుంచే కలెక్టర్తో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. భూ భారతికి సంబంధించి మొత్తంలో 5,836 దరఖాస్తులు రాగా.. అధికారుల నిర్లక్ష్యం వల న వాటి పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు. కాంగ్రెస్లో చేరికలు మండలంలోని అవుసలికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ తిరుపతిరెడ్డితో పాటు లింగాల, ఎంసీ, డీసీ తండాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ, మాజీ ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్..
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు సాధ్యపడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఇంజినీరింగ్ కళాశాలలు రావడంతో భవిష్యత్లో వేల సంఖ్యలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తద్వారా కార్పొరేట్ కంపెనీలు జిల్లాకు వచ్చి.. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు మొదలు, హాస్టల్ ఇతర వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ● -
స్టేడియం ఊసేది..?
ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి ●ఎన్టీర్ మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి. – ఎంఎన్గౌడ్, ఏఆర్ఎం క్రికెట్ అకాడమీ హెడ్కోచ్ స్టేడియం కోసం వందలాది క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటికీ మా వంతుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులో స్టేడియాలు లేక ఖాళీ స్థలాలు, మైదానాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్లను అభినందించలేదు. పతకాలు సాధించిన తర్వాత ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు. – ఎడ్మ శ్రీనుయాదవ్, మాస్టర్ అథ్లెటిక్ అసోషియేషన్ జిల్లా కార్యదర్శి అచ్చంపేట: జిల్లాలో అత్యంత ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నా.. సాధన చేసేందుకు సరైన స్టేడియాలు, వసతులు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, రాష్ట్ర, జోనల్ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు జిల్లాలో కొకోల్లలు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్లో ఇండోర్ స్టేడియాలు ఉన్నా నిర్వహణ లేక క్రీడాకారులకు అనుకూలంగా లేవు. కల్వకుర్తిలో ఫుట్బాల్ కోచ్ మినహా ఎక్కడ కూడా కోచ్లు లేరు. నాగర్కర్నూల్లో మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉన్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ నైపుణ్యాలు ఉన్న క్రీడాకారులను వెలికితీస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటనలు ఇస్తున్నా.. ఆయన పుట్టిన సొంత జిల్లాలో స్టేడియాల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 2003 డిసెంబర్ 8న అప్పటి ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేయగా.. అప్పటి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి పి.రాములుు శంఖుస్థాపన చేశారు. 2004లో ప్రభుత్వం మారడంతో రూ.10లక్షలు ఖర్చు చేసి చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 2011 నవంబర్లో ఎమ్మెల్యే రాములు రూ.20లక్షలు కేటాయించి పనులు మొదలు పెట్టగా.. భవన నిర్మాణం, షెడ్డు పిల్లర్లు పనులు పూర్తి చేశారు. రూ.30లక్షలు ఖర్చు చేసినా స్టేడియం పనులు పూర్తి కాలేదు. 2013 జూన్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి మరో రూ.30లక్షల నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ షెడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశారు. సింథటిక్ గ్రౌండ్, గ్యాలరీ, సైడ్ వాల్స్, ప్లాట్ఫాం, లైటింగ్, డ్రెసింగ్ రూం, ఆఫీసు రూం పనులు చేయాల్సి ఉంది. ఇండోర్ స్టేడియానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో తర్వాత అధికారంలో వచ్చిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, గువ్వల బాలరాజు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2019లో రూ.2కోట్ల నిధులు మంజూరైన ఇంత వరకు పనులు మొదలు కాలేదు. అచ్చంపేట ప్రాంతంలో షటిల్ క్రీడాకారులున్నా.. కోర్టులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పబ్లిక్ క్లబ్, ఇతరులు ప్రతి ఏటా డివిజన్, జిల్లా స్థాయి షటిల్ పోటీలు నిర్వహిస్తున్నారు. పబ్లిక్ క్లబ్, ప్రైవేట్ వ్యక్తులు వేరువేరుగా రెండు షటిల్ ఇండోర్ నిర్మాణాలు చేపట్టారు. ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి సౌకర్యాలు లేకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రూ.10కోట్లు మంజూరైన మొదలు కాని పనులు నల్లమలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో అచ్చంపేటలో ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మించారు. ఆ తర్వాత ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభించడంతో క్రీడాకారుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఉన్న స్టేడియంలో కొన్నేళ్లుగా ప్రతి ఏటా రెండు పర్యాయాలు జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా 2021లో స్టేడియం చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి కొంత దూరం పొడిగించారు. అక్కడక్కడ లైటింగ్ ఏర్పాటు చేసిన సౌకర్యాలు మరిచారు. 2018లో రూ.1.5కోట్లు, 2023లో రూ.6.50కోట్లు నిధులు మంజూరైన పనులు ప్రారంభించలేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. స్టేడియం విస్తరణ పనులు చేపట్టి రాజీవ్ఎన్టీఆర్ పేరుగా మారస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటించినా.. ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. -
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ నాగర్కర్నూల్: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విపత్తు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా అత్యధికంగా వర్షపాతం నమోదైందని, మరోసారి అల్పపీడనం ఏర్పడే హెచ్చరికలు ఉన్నందున నెల రోజుల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే స్పందిచాల్సిన విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా శాఖలకు సంబంధించి నష్ట వివరాలను కలెక్టర్ అందించాలన్నారు. పూడికతీతలో వేగం పెంచాలి జిల్లాలో ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పూర్తి చేయాలని, వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా చూడాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృదాలు ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక చర్యల్లో కీలకంగా వ్యహరించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎండీఆర్ఎఫ్ ద్వారా ముందస్తు చర్యలు పక్కాగా చేపడితే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చన్నారు. విపత్తు సహాయ చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వర్షపాత తీవ్రతను గుర్తించి అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆగస్టు 14న జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, వరద నీటి ప్రవాహం కారణంగా లోలెవెల్ కాజ్వేలు మునిగిపోగా.. భారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించామని వెల్లడించారు. అంతకుముందు నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చర్లతిర్మలాపూర్, సిర్సవాడలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వారు పరిశీలించారు. వరదలతో ధ్వంసమైన రహదారులు, చెరువులు, వాగులు, వంతెనలు, తాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ పొలాలు, విద్యుత్ లైన్లకు వీలైనంత వేగంగా మరమ్మతు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఊర్కొండ: రైతులకు అవసరమైన యూరియాను ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు వి క్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. బుధవారం మండలంలోని రైతు కేంద్రం, పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ మండల రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని, ఎవరైనా డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. డీలర్లు విధిగా స్టాక్ బోర్డులను అప్డేట్ చేయాలని ఆదేశించారు. రైతులు వారి అవసరం మేరకు ఎరువులు తీసుకోవాలని కోరారు. యూరియాను అధికంగా వాడడం వల్ల పంటకు చీడ పీడలు ఆశించి, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. సాధారణ యూరియాతో పోలిస్తే నత్రజని వినియోగ సామర్థ్యం నానో యూరియాలో ఎక్కువగా ఉంటుందని, నానో యూరియాను ఇతర పురుగు మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల రైతులకు శ్రమ, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మండలంలో గతేడాది వానాకాలంలో 151 మె.టన్నుల యూరియా సరఫరా చేయగా.. ఈ ఏడాది 427 మె.టన్ను యూరియా సరఫరా చేశామన్నారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కిరణ్కుమార్, ఏఓ దీప్తి పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి
కల్వకుర్తి టౌన్: ప్రతి ఒక్కరూ వారి పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు వినాయక మండపాలను రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించొద్దని కోరారు. తప్పనిసరిగా పోలీస్శాఖ వారు రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో వారి మండపాలను రిజిస్ట్రర్ చేసుకోవాలన్నారు. వీటికి తోడు మంటపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బుక్లోనూ విధిగా పోలీసు వారి తనిఖీలను రాసేలా చూడాలని పేర్కొన్నారు. నిమజ్జనానికి డీజేలను వాడకుండా.. భక్తిగీతాలను ఆలపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎస్ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీను, మున్సిపల్ ఏఈ షబ్బీర్, వినాయక మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు. సాయంత్రమే నిమజ్జనం చేయాలి తిమ్మాజిపేట: వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు డీజేలతో కాకుండా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు ఆలపిస్తూ నిర్వహించాలని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ సూచించారు. తిమ్మాజిపేటలో ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం రోజు సాయంత్రం 4 లేదా 5 గంటలకు వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రారంభిస్తే పెద్దలు, మహిళలు, చిన్నారులు వీక్షించి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతక ముందు పోలీస్స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ అశోక్రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు
వెల్దండ: మండల కేంద్రంతో పాటు కొట్ర, పెద్దాపూర్, కుప్పగండ్ల, తిమ్మినోనిపల్లి, బైరాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు కోళ్లు, పొటేళ్లు కోసి అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భూపతిరెడ్డి, చిందం కృష్ణయ్య, మట్ట వెంకటయ్యగౌడ్, నిరంజన్, విజేందర్రెడ్డి, ఎర్ర శ్రీను, తాటికొండ కృష్ణారెడ్డి, రాజేందర్రెడ్డి, ఆనంద్ తదితరులు ఉన్నారు.వెల్దండలో బోనాలతోఊరేగింపుగా వస్తున్న మహిళలు -
జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు
నాగర్కర్నూల్: వర్షాల కారణంగా జన జీవనానికి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని చర్లతిర్మలాపూర్ రోడ్డుపై నిలిచిన వరద నీటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉయ్యాలవాడ నుంచి చెర్లతిర్మలాపూర్ వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, శిథిలావస్థ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి కోసం పునరావాసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ్, నాగర్కర్నూల్ ఆర్డీఓ సురేష్బాబు తదితరులు ఉన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చే యాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, నీటి పారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ వంటి రంగాల్లో పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ విజయ్కుమార్, డీఈఓ రమేష్కుమార్, డీఆర్డీఏ చిన్న ఓబులేష్, కల్వకుర్తి ఆర్డీఓ జనార్ధన్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్సింగ్, ఆర్అండ్బీ, విద్యుత్ డీఈ, డైరీ, ఉపాధి కల్పన అధికారులు పాల్గొన్నారు. -
20 ఏళ్లుగా ఎదురుచూపే..
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు దాదాపుగా 20ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కేఎల్ఐ కాల్వ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి వరకు ఉంది. ఇందులో భాగంగా వంగూర్, చారకొండ, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని నాగిళ్ల రైతులకు సాగునీరు అందించడానికి 65 కి.మీ పొడవున డీ–82 కాల్వ తవ్వకాలు చేపట్టారు. దీంతో దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు అంచనా వేశారు. నిరంతరం ఏదో ఒకచోట.. ఇటీవల డీ–82 కాల్వ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్నా తరుచుగా తెగిపోతుండడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. మండలంలోని లింగారెడ్డిపల్లి వద్ద కాల్వ తెగడంతో అధికారులు సరిచేశారు. పోతేపల్లి, వెల్దండ శివారులోనే ఒకే చోట 5 సార్లు కాల్వ తెగిపోయింది. చొక్కన్నపల్లి వద్ద ఒకసారి, బండోనిపల్లి సమీపంలో ఒకసారి, చారకొండ మండలం జూపల్లి వద్ద మరోసారి కాల్వలకు గండ్లు పడడంతో సాగునీరు వృథాగా పోతుంది. 60వేల ఎకరాల సాగునీరు బీడు భూములకు డీ–82 కాల్వ ద్వారా కల్వకుర్తి నియోజవర్గంలో దాదాపుగా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వంగూర్ మండలంలో కొంత భాగం కలుపుకొని చారకొండ, వెల్దండ మండలాల్లో 40 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో 29వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని జంగారెడ్డిపల్లి చివరి ఆయకట్టు వరకు 25 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో మరో 29వేల ఎకరాలకు పైగానే సాగునీరు పారుతుందని కేఎల్ఐ అధికారులు తెలిపారు. వెల్దండ మండలంలోని భర్కత్పల్లికి నీరు చేరుకోక ముందే డీ–82 కాల్వకు ఎక్కడో ఒకచోట గండిపడుతుంది. సాగునీటి కోసం రైతులకు తిప్పలు వెల్దండలో తరుచుగా తెగుతున్నడీ–82 కాల్వ కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
భూ సమస్యలు పరిష్కరించాలి
చారకొండ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జనార్దన్రెడ్డి కల్వకుర్తి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చారకొండకు విచ్చేసిన సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. భూ భారతి రికార్డులను పరిశీలించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ విద్యాధరిరెడ్డి, సీనియర్ అస్టిస్టెంట్ శ్రీనునాయక్, ఆర్ఐలు భరత్, సుజాత, సిబ్బంది ఉన్నారు.నిబంధనలు అతిక్రమించొద్దుకోడేరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హౌజింగ్ జిల్లా అధికారి సంగప్ప హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి 72 ఇళ్లు మంజూరయ్యాయని, ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి రవితేజ, కారోబార్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.చెంచుల చెంతకు ఓపెన్ యూనివర్సిటీకల్వకుర్తి టౌన్/బల్మూర్: విద్యకు నోచుకోని గ్రామీణ, చెంచు పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీలు, చెంచులు, గోండులు తదితర జాతులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం రూ.500 లకు విద్య అందిస్తుందని ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ (ఎల్ ఎస్ఎస్బీ) వై.వెంకటేశ్వర్లు తెలిపారు. కల్వకుర్తి పట్టణంతో పాటు బల్మూర్ మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ–143 స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం బిల్లకల్, చెంచుగూడెం, గ్రామాల్లో ఓపెన్ యూనివర్సిటీ విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచులకు విద్య లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి దొరకక పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన చెంచు జాతులతో పాటు ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్టైఫండ్ ఆధారిత, ఉచిత విద్య అందిస్తుందని తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగిన వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ పరంగి రవి, సాల్మన్, కల్వకుర్తి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
శిశు సంజీవని సేవలు వినియోగించుకోవాలి
అచ్చంపేట రూరల్: జిల్లాలో ఉన్న శిశు సంజీవని కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలోని శిశు సంజీవని ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. శిశువులకు వెంటనే టీకాలు వేయించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులకు సూచించారు. శిశు సంజీవనిలో తక్కువ బరువుత, అవయవ లోపాలతో పుట్టిన చిన్నారులకు, పసిరికలు తదితర అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నడింపల్లి, చందాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పల్లె దవాఖానా డాక్టర్లు ప్రతిరోజు ఓపీ సేవలు అందించాలని, క్రమం తప్పకుండా అధిక రక్తపోటు, మధుమేహ రోగులను పరీక్షించి మందులు వాడేటట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ అంటు వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
లైసెన్స్ లేని డ్రైవర్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు చేస్తున్నా మారని తీరు నాగర్కర్నూల్ క్రైం: వాహనాలను నడపాలంటే లైసెన్సు తప్పనిసరి అని మోటారు వాహన చట్ట నిబంధనలు చెబుతున్నప్పటికీ.. తమకేమి సంబంధం లేదంటూ మైనర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ద్విచక్రవాహనాల నుంచి భారీ వాహనాలను సైతం నడుపుతున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో మైనర్లు ర్యాష్డ్రైవింగ్ చేస్తూ తరుచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల మైనర్ల ర్యాష్ డ్రైవింగ్తో పలువురు ఆసుపత్రుల పాలయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అడ్డు చెప్పాల్సిన తల్లిదండ్రులు అప్పటికప్పుడు వారి అవసరం కోసం మైనర్లకు వాహనాలు ఇస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్నా.. జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే జరిగే పరిణామాలతో పాటు విధించే శిక్షల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మైనర్ల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. జిల్లాలోని పలువురు విద్యార్థులు యథేచ్ఛగా ద్విచక్ర వాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ద్విచక్రవాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకొస్తే సదరు యాజమాన్యం గుర్తిస్తారని వాటిని దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పాఠశాలల సమయంలో తనిఖీలు నిర్వహిస్తే ద్విచక్రవాహనాలను నడిపే మైనర్లను గుర్తించే ఆస్కారం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. రెండేళ్లలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాతో పాటు కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో 2024 సంవత్సరంలో 270 కేసులు నమోదు చేసి రూ.1.35 లక్షల జరిమానా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు చేసి రూ.65 వేల జరిమానా విధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ డ్రైవింగ్పై తనిఖీలు నిర్వహించే సమయంలో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడం పాటు జైలుకు పంపిస్తాం. – గైక్వాడ్ వైభవ్రఘునాథ్, ఎస్పీ వాహనాలతో దూసుకుపోతున్న మైనర్లు ర్యాష్ డ్రైవింగ్తో తరచూ ప్రమాదాలు విద్యాసంస్థలకు సైతం వాహనాలు తీసుకెళ్తున్న వైనం -
‘సర్కారు’కు సౌర వెలుగులు
అచ్చంపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలోనే సౌర విద్యుత్ అందనుంది. తద్వారా విద్యుత్ ఆదా కావడంతో పాటు ఆయా శాఖలకు భారంగా మారుతున్న విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ఊరట కలగనుంది. ఇప్పటికే కలెక్టరేట్లో సౌర విద్యుత్ వినియోగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ అందించేందుకు గాను సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వివరాలు సేకరించేందుకు ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించారు. ప్లాంట్ల ఏర్పాటుకు వివరాల సేకరణ.. పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల వివరాలను టీజీ రెడ్కో అధికారులు సేకరిస్తున్నారు. ఏ భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది? అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందనే వివరాలను మండలస్థాయి నుంచి సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రామపంచాయతీ, పాఠశాలలు, కళాశాలల భవనాలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం నెలకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది..? ఎంత విద్యుత్ బిల్లు వస్తోందనే వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. ఈ లెక్కన తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న భవనాలకు హెచ్టీ సర్వీస్ కింద సోలార్ ప్లాంట్లను బిగించనున్నారు. రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు కరెంటు బిల్లులు వచ్చే కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద 3 నుంచి 5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాలమైన భవనాలు కలిగి, ఎక్కువ విద్యుత్ వినియోగించే కార్యాలయాలకు హెచ్టీ సర్వీస్ కింద 100 కిలోవాట్లకు పైగా సోలార్ ప్లాంట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు.. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కేటాయిస్తే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. నివేదిక పంపిస్తాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్ని కార్యాలయాలకు పక్కా భవనాలు ఉన్నాయి.. ఈ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఎంత మేర ఏర్పాటుచేసే అవకాశం ఉందనే వివరాలు సేకరిస్తున్నాం. ఇందుకు ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించారు. వారు వివరాలు సేకరించి అందజేస్తారు. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. – మనోహర్రెడ్డి, డీఎం, రెడ్కో మహబూబ్నగర్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు వివరాలు సేకరిస్తున్న టీజీ రెడ్కో అధికారులు ఇప్పటికే కలెక్టరేట్లో ఏర్పాటు -
పాత ఇళ్లలో ఉంటే ప్రమాదమే..
భారీ వర్షాల నేపథ్యంలో రోజుల తరబడి తడిసి ఉన్న మట్టి మిద్దెలు, పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఙప్తి చేస్తున్నారు. గతేడాది జూలైలో జిల్లాకేంద్రం సమీపంలోని వనపట్లలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటికే అమ్రాబాద్ మండలం జంగిరెడ్డిపల్లిలో నాలుగు, పెద్దకొత్తపల్లి మండలం దేవునేనిపల్లి గ్రామంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కూలింది. -
‘ఆధార్ ఆధారిత హాజరు సరికాదు’
కందనూలు: ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దేవ సహాయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ నాయకులు మాట్లాడుతూ.. ఆధార్ ఆధారిత హాజరు ద్వారానే వేతనాలు చెల్లించనున్నట్లు వివిధ పత్రికల్లో రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
సీపీఎస్ను రద్దు చేయాలి
కందనూలు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ను తక్షణమే రద్దు చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే నెల 1న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను సమూలంగా రూపుమాపడానికి పీఆర్టీయూ టీఎస్ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా చేపట్టనున్న మహాదర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బావండ్ల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు, పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యదర్శి సురేందర్రెడ్డి, నాయకులు బిచ్చానాయక్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండి కొల్లాపూర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చివరి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కొల్లాపూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99899 45177 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు https://www.kviconline.gov.in/pmegpeotal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. -
ఎడతెరిపి లేకుండా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా వరకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. గ్రామాలను అనుసంధానిస్తూ ఉన్న కాజ్వేలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలో అత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. బిజినేపల్లి, ఊర్కొండ, ఉప్పునుంతల, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మండలాల్లో 20 మి.మీ. మించి వర్షం కురిసింది. వంగూరు, వెల్దండ, చారకొండ మండలాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రం సమీపంలోని నల్లవాగుతో పాటు చర్లతిర్మలాపూర్ – ఉయ్యాలవాడ మధ్యనున్న చెరువు నిండి కాజ్వే మీదుగా నీటి ప్రవాహం ప్రమాదకరంగా కొనసాగుతోంది. ఈ దారిలో వెళ్లే విద్యార్థులను గ్రామస్తులు పుట్టీ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దుందుబీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాడూరు మండలం సిర్సవాడ, కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద రాకపోకలను నిలిపివేశారు. పంటలకు నష్టం.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలను వరద ముంచెత్తుతోంది. బిజినేపల్లి, తాడూరు, కల్వకుర్తి మండలాల్లో సాగుచేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సుమారు 500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పత్తి, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ముసురు వాన తిమ్మాజిపేట మండలంలోఅత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం పలుచోట్ల పంటలను ముంచెత్తిన వరద -
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాం.. మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ అన్ని పూర్తయ్యాక తరలించాలి.. అడవి నుంచి బయటకు తీసుకెళ్లి అక్కడ ఇళ్లు కట్టించి ఇస్తామంటున్నారు. వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇస్తాం అని చెప్పారు. అన్నీ చెప్పినట్టుగా ఇస్తేనే ఇక్కడి నుంచి బయటకు పోతాం. పోడు భూములు, నమ్ముకున్న అడవిని విడిచి పోతే మాకు బతికేందుకు పని కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మానవీయ కోణంలో తరలింపు చేపడతాం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ ● -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూ రు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మె ల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సూర్యమోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసానిచ్చారు. -
‘ప్రకృతి ఒడిలో పాలధార’
అచ్చంపేట రూరల్: ప్రకృతి ఒడిలో అలరారుతున్న శ్రీశైలేషుడి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరుడి క్షేత్రంలో పాపనాశిని గుండం కొండపై నుంచి జాలు వారే జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొన్ని రోజులుగా నల్లమల్ల పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియల నుంచి వచ్చే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. చల్లని వర్షపు నీటిలో తడిసి ముద్దవుతున్నారు. అక్కడే సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పైనుంచి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. -
జల విలయం
సాక్షి, నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని లింగాల, బిజినేపల్లి, తాడూరు, బల్మూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, ఉప్పునుంతల మండలాల్లో 55 మి.మీటర్లకు మించి వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. చారకొండ మండలంలో అత్యల్పంగా 25.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు మత్తడి దూకుతూ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సిర్సవాడ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగుతో పాటు జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మత్తడి ప్రవాహాన్ని కలెక్టర్ సంతోష్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకేంద్రం నుంచి కేసరిసముద్రం మీదుగా ఎండబెట్ల వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల ప్రవాహాల మీదుగా దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం హైఅలర్ట్ భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్ట నివారణకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వరదలు, ముంపు ప్రాంతాల బాధితుల సంరక్షణ, సహాయం కోసం ఇప్పటికే ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు నేరుగా 08540–230201 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. నిలిచిన రాకపోకలు జిల్లాలో దుందుభీ వాగు ప్రవాహం ఉధృతంగా మారడం, పలుచోట్ల చెరువులు మత్తడి దూకి రహదారుల మీదుగా ఉప్పొంగుతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఆటకం ఏర్పడుతోంది. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం చెరువు ఉప్పొంగి నాగర్కర్నూల్–ఎండబెట్ల రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభీ ప్రవాహం ఉధృతం కావడంతో అధికారులు ఈ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ప్రజలు ఎవరూ ఈ మార్గంలో వెళ్లకుండా నిరంతరం పహారా ఏర్పాటుచేశారు. పలుచోట్ల కుండపోత జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంగా మారాయి. పాత ఇళ్లతో ప్రమాదం భారీ వర్షాలకు జిల్లాలోని అమ్రాబాద్ మండలం జంగిరెడిపల్లిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. గ్రామానికి చెందిన మద్దెల అర్జనమ్మ, మంతటి నారమ్మ, కల్వల లక్ష్మమ్మకు చెందిన పాత ఇళ్ల పైకప్పు వర్షానికి తడిసి సోమవారం నేలకూలాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిథిలమైన, పాత ఇళ్లలో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు వాగులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించొద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువును పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదకర స్థితిలో పారుతున్న వాగుల్లో ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, అలాంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. బిజినేపల్లి మండల కేంద్రం నుంచి నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం వారు నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే క్రమంలో రోడ్డుపై ప్రవహిస్తున్న భీమసముద్రం అలుగు ఉధృతికి ద్విచక్ర వాహనం కొద్ది దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అతి కష్టం మీద నీటి ఉధృతి తక్కువ ఉన్న ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని తిరిగి లాక్కొచ్చారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ. వర్షపాతం చెరువులను తలపిస్తున్న పంట పొలాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు పొంగిపొర్లుతున్న వాగుల రహదారులపై రాకపోకలు సాగించొద్దని కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ విజ్ఞప్తి -
చెంచులకు న్యాయ సహాయం అందిస్తాం
కొల్లాపూర్ రూరల్: చెంచులకు అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ నాగర్కర్నూల్ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అమరగిరి గ్రామాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా చెంచుల యొక్క జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని వారికి తమ సంస్థ తరుఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమించి, న్యాయ సహయం అందిస్తామన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని తెలిపారు. బాల్య వివాహలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఉన్న విశ్వశాంతి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధుల యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవా, మండల న్యాయ సేవా సంస్థ చేదోడు వాడోడుగా ఆశ్రమానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి గైర్హాజరైతే చర్యలు తప్పవు
నాగర్కర్నూల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కా ర్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్ప వని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించొద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి జి ల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 30 వినతులు అందగా.. వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కేటాయించారు. ఐటీఐతో బంగారు భవిష్యత్ జిల్లాలోని కల్వకుర్తి, మన్ననూర్లో ఉన్న ఐటీఐ (ఏ.టీ.సీ) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలను పెంచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ఐటీఐలో ఖాళీల భర్తీ కోసం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు, కల్వకుర్తి పట్టణంలోని ఐటీఐ కళాకాలల్లో 2025–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీఐలు టెక్నాలజీ హబ్లుగా మారిపోయాయని, అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ల్యాబ్లు, టాటా టెక్నాలజీస్ సహకారం, ప్రముఖ ఇండస్ట్రీల భాగస్వామ్యంతో యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉండే విద్యార్థులను గుర్తించి, ఐటీఐలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీజీఏటీఈ వైస్ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, జిల్లా కన్వీనర్ మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎస్పీ లక్ష్మణ్స్వామి, ఐటీఐ కల్వకుర్తి ప్రిన్సిపల్ జి.జయమ్మ, జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.రాఘవేంద్రసింగ్, జిల్లా కార్మిక శాఖ అధికారి జె.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన తీజ్ వేడుకలు
లింగాల: గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుతూ తీజ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. లింగాల, సూరాపూర్ తదితర గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ వేడుకలను మొలకల పండుగతో ముగించారు. లింగాల బంజారవాడలోని మేరమ్మ భవాని ఆలయం ఆవరణలో గిరిజన యువతులు నిష్టతతో మొలకలను పెంచారు. చివరి రోజు బంజార వేషధారణతో యువతులు మొలకల బుట్టలను తలపై ఉంచుకొని ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. డీజే సౌండ్ మధ్య ఊరేగింపు అనంతరం పట్టణ సమీపంలోని రామాలయం ఎదుట ఉన్న పెద్దకర్ణం కుంటలో నిమజ్జనం చేశారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. సంప్రదాయానికి ప్రతీక తీజ్ కల్వకుర్తి టౌన్: తీజ్ ఉత్సవాలు లంబాడీల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని భగత్సింగ్ తండాలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీజ్ ఉత్సవాలను గిరిజనులు కనులపండువగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలు కొనసొగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భగత్సింగ్ తండావాసులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యాలు మొలకలతో భారీ ఊరేగింపు