breaking news
Nagarkurnool District News
-
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుదాం
తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్నర్సింహ అన్నారు. ఈ నెల 6 నుంచి 14 వరకు చేపడుతున్న సీపీఐ ప్రజాపోరు పాదయాత్రలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నముద్దునూరు, రాంరెడ్డిపల్లి, తాళ్లపల్లి, నడిగడ్డ, రామగిరి, గౌరారం, పర్వతాపూర్, రాకొండ, తెలకపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పూర్తిగా విఫలం చెందారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. గతంలో కార్మికులు 8 గంటలు పనిచేస్తే నేడు 12 గంటలకు పెంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నష్టపరిచే విధంగా 3 చట్టాలను తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. దళిత, గిరిజన వర్గాలకు పెద్దపీట వేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపైన వివక్ష చూపడం బీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్రమోదీకి తగదన్నారు. ఈ విషయాలపై ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేశవులుగౌడ్, బాలమురళికృష్ణ, శివశంకర్, రవీందర్, ఆంజనేయులు, బుగ్గస్వామి, విష్ణు, నరేందర్రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. -
సర్.. 85.51 శాతమే
● జిల్లాలో ముగిసినస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే ● 8,35,408 మంది ఓటర్ల వివరాలు డిజటలైజేషన్ పూర్తి ● లెక్క తేలని ఓటర్లు 1,41,579 ● ఫారాలు ఇవ్వనివారి పేర్లు జాబితాలో నుంచి తొలగింపు ● భవిష్యత్లోనూ కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికీ తిప్పలే అచ్చంపేట: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వే సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం జిల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, బీఎల్ఓల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 9,76,987 మంది ఓటర్లు ఉండగా.. వారికోసం 1,100 మంది బీఎల్ఓలు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. ఇప్పటి వరకు 8,35,408 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా.. ఇది మొత్తం ఓటర్లలో 85.51 శాతంగా నమోదైంది. 1,41,579 మంది ఓటర్ల వివరాలు రకరకాల కారణాలు, తప్పులతో నమోదయ్యాయి. చిరునామా మారడం లేదా ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో అన్ కలెక్టబుల్గా మిగిలాయి. ఓటర్ల నమోదులో దొర్లిన అక్షర దోషాలు, సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫారం సమర్పించ లేదా.. సర్–2026 కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారి పేర్లు ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా ఓటరు జాబితాలో కనిపించవు. ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలి. దీనికి తోడు సర్–2002 ఓటర్ల జాబితాలో ఉన్న మీ ఓటు లేదా మీ బంధువుల ఓట్ల వివరాలు స్వీయ ధ్రువీకరణ ఫారంలో నింపాల్సి ఉంటుంది. సర్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 9లోగా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతోపాటు ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ వ్యవధిలో ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారికి ఈఆర్ఓ నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. దీనికి హాజరై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాాల ధ్రువీకరణ ప్రతాల్లో ఏదో ఒకటి పుట్టిన తేదీ, నివాస చిరునామాగా చూపించాలి. భవిష్యత్లో సర్–2026 ఓటర్ల జాబితా ఓటర్లకు కీలక ఆధారంగా మారనుంది. అక్టోబర్ 12న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేరు రాకుంటే భవిష్యత్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సొంతూరికే జైకొట్టారు.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రెండు ఓట్లు కలిగి ఉండటం నేరం. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో.. ఇప్పుడు డబుల్ ఓట్లకు చెల్లు చీటి ఇస్తూ.. ఒకే ఓటుకు చాన్స్ ఇవ్వడంతో పట్టణాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. గ్రా మాలు, పట్టణాల్లో రెండు ఓట్లు కలిగిన వారిలో చాలా మంది సొంతూరిలోనే ఓటు నమోదుకు ఇష్టపడ్డారు. బతుకుదెరువు, వ్యాపారం, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్లిన వారు ఆధార్ కార్డు, 2020 నాటి ఓటర్ల జాబితా ప్రామాణికంగా తీసుకుని, కొత్త ఫొటోను అందించారు. ఆ తర్వాత తప్పుల సవరణ ఓటర్ల నమోదులో దొర్లిన తప్పులను డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత సరిదిద్దనున్నారు. దీనికి వచ్చే రెండు నెలల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటర్ల నుంచి ఆధారాలు స్వీకరించి.. నోటీసులు ఇచ్చి నమోదులో ఉన్న తప్పులను సరిదిద్దుతారు. ప్రధానంగా పేరులో అక్షర దోషాలు, ఇంటి పేరు తప్పు, డీఎస్సీ ఎర్రర్, వయసులో తేడాలు, కుటుంబ సభ్యుల మ్యాపింగ్లో దొర్లే పొరపాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2002లో ఓటరు జాబితాలో ఉన్న పేరుకు ప్రస్తుత పేరుకు కొద్దిపాటి తేడా ఉన్నవి చాలానే ఉన్నాయి. -
అత్యాధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
పెంట్లవెల్లి: అత్యాధునిక సదుపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని జటప్రోల్లో పాఠశాల పనులను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీపడకూడదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సమానంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తుందన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి పాఠశాలలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు. విద్యతోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, బాలురు, బాలికలకు ప్రత్యేకంగా దాదాపు 2500 మంది విద్యార్థులు చదువుకునేలా పాఠశాల నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలంలోని గోప్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రామన్గౌడ్, గోవింద్గౌడ్, గోపినాయక్, నర్సింహ, వేణుగోపాల్, ఆంజనేయులు, లోకంగౌడ్, భీంరెడ్డి, నాగిరెడ్డి, ఆసిఫ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు -
డ్రెయినేజీ వ్యవస్థ.. అస్తవ్యస్తం
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అచ్చంపేట రూరల్: కార్పొరేట్ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యానాయక్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్యానాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా జైల్భరో నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. నూతనంగా తెచ్చిన కార్మిక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, వీబీజీ రాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గుర్తించుకోవాలని హితవు పలికారు. అనంతరం స్థానిక పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్నాయక్, మల్లేష్, సైదులు, రాములు, శ్రావణ్కుమార్, నాగరాజు, వెంకటయ్య, పర్వతాలు, పద్మ, లక్ష్మి, జ్యోతి, రాధ, అలివేల తదితరులు పాల్గొన్నారు. 16 అడుగులకు చేరిన నీటి మట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు చేరుకుంది. జూరాల వద్ద ఉన్న ఉంద్యాల పంప్హౌస్ ఫేజ్–1 నుంచి రెండు పంపులను నడుపుతూ నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తీలేర్ పంప్హౌస్ ఫేజ్–2 నుంచి రెండు పంపులను రన్ చేసి కోయిల్సాగర్కు 630 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో ప్రాజెక్టు నీటిమట్టం కేవలం 9 అడుగులు ఉండగా.. ప్రస్తుతం మరో 7 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 16.6 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. నీటి ప్రవాహం కొనసాగితే త్వరలో కోయిల్సాగర్ నుంచి ఆయకట్టు కింద పంటలకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. వివరాలు 9లో.. మురుగు కాల్వల్లో మొలిచిన మొక్కలు అసంపూర్తిగా నిర్మాణాలు వర్షాల నేపథ్యంలో దోమల విజృంభణ -
నెర్రెలిచ్చిన చెరువులు.. కుంటలు
జూలైలో భూగర్భజలం మీటర్లలో.. పదర 9.50 వెల్దండ 9.30 ఊర్కొండ 8.92 తిమ్మాజిపేట 10.87 బిజినేపల్లి 9.53 కల్వకుర్తి 8.77 నాగర్కర్నూల్ 11.13 గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, కేఎల్ఐ సాగునీరు పుష్కలంగా రావడంతో చెరువులు, కుంటలు సీజన్ మొత్తం అలుగులు పారాయి. కానీ, ఈసారి సక్రమంగా వర్షాలు కురవకపోవడం, సాగునీరు రాకపోవడంతో చాలా చెరువులు, కుంటలు నెర్రెలిచ్చి కనిపిస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు పడిపోయి బోర్లలో నీరు తగ్గిపోతుంది. జిల్లాలో 1,056 చెరువులు ఉండగా.. వీటిలో 36 పెద్ద చెరువులు ఉన్నాయి. ఇందులో కొంత వరకు నీరున్నా.. ఆయకట్టుకు వదలడం లేదు. కుంటలు, చెరువుల్లోకి కొత్తనీరు రాకపోవడంతో వేగంగా భూగర్భజలాలు పడిపోతున్నాయ ని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మినుముల పంట లాభదాయకం
ఈసారి ఖరీఫ్ సీజన్ ముగిసినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు. రైతులు ఇప్పుడు కేవలం మినుములు సాగు చేస్తే తక్కువ వ్యయంతో, తక్కువ నీటితో అధిక లాభం పొందవచ్చు. ఒకసారి తడిపితే చాలు, ఎరువులు సైతం అవసరం లేదు. అర సంచి యూరియా ఎకరానికి సరిపోతుంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్ మద్దతు ధర రూ.8,200 ఉంది. ఇక ఈ నెల మూడో వారం నుంచి వేరుశనగ సాగు చేసుకోవచ్చు. ఈ పంట సాగు పూర్తయిన తర్వాత మొక్కజొన్న సైతం యాసంగిలో సాగు చేసే అవకాశం ఉంటుంది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి నీరు వస్తేనే పంట.. నేను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. చెరువులో నీరు లేదు. కేఎల్ఐ నీరు చెరువులోకి వస్తుందనే ఆశతో ఉన్నాం. సాగునీరు రాకపోయినా.. చెరువు నిండకపోయినా పంట పండదు. ఈ చెరువు కింద వానాకాలంలో 100 ఎకరాలు సాగుచేసేవారం. ఇప్పుడు 20 ఎకరాల్లోనే సాగైంది. – బాల్రెడ్డి, రైతు, తోటపల్లి జూలై నాటికి సాధారణ వర్షపాతం 204.6 మి.మీ., కురిసిన వర్షపాతం 183.2 మి.మీ., గతేడాది ఈ సమయానికి కురిసిన వర్షపాతం 264.4 మి.మీ., లోటు వర్షపాతం 12 శాతం -
వాగులు పారలే.. చెరువులు నిండలే
జిల్లాలో స్పష్టంగా ఎల్నినో ప్రభావం ● సీజన్ సగం గడిచినా జాడలేని భారీ వర్షాలు ● జూలైలో 6.93 మీటర్ల లోతుకు భూగర్భజలాలు ● ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటికీ ఇబ్బందులే ● ఈ నెల 15 వరకే వరిపంట సాగుకు అవకాశం నాగర్కర్నూల్: జిల్లాలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం చూపిస్తోంది. చెరువులు, కుంటల్లోకి నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన పంట పత్తి సాగు చేసినా వర్షం లేక ఎదుగుదల సమస్యగా మారింది. వాటిని కాపాడుకోవడం, పెరగడానికి నీరు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో అష్టకష్టాలు పడుతున్నారు. రెండో ప్రధాన పంటైన వరి సాగుకు ఆశతో అధికంగా వరినారు పోశారు. తీరా వర్షాలు లేకపోవడంతో సగానికి నాటడానికి ప్రయత్నిస్తున్నారు. నాటిన వరికి ఇప్పుడే నీరు పారడం లేదని పంట చేతికొచ్చే వరకు అనుమానమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేఎల్ఐ సాగునీరు వస్తే పంట చేతికొస్తుందని ఆశతో ఉన్నారు. పంటల కోసం సాగునీరు వదలడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది ఖరీఫ్ సాగులో రైతుకు పంట చేతికొచ్చే వరకు ఆందోళన తప్పేలా లేదు. వరి సాగు అంచనా 1.93 లక్షల ఎకరాలు జిల్లాలో వానాకాలం వరి సాగు అంచనా 1.93 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 1.80 లక్షల ఎకరాల వరిసాగు లక్ష్యం కాగా పూర్తిస్థాయిలో నెరవేరింది. దీంతో వ్యవసాయాధికారులు ఈ ఏడాది 13 వేల ఎకరాల లక్ష్యాన్ని పెంచగా.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ఇప్పటికే వరినారు పోసుకున్నా వర్షం కురవకపోవడం, చెరువుల్లో నీరు అడుగంటి బోర్లు సైతం తక్కువగా పోస్తుండటంతో ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 66,710 ఎకరాలు (31 శాతం) మాత్రమే సాగు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నెల 15 వరకు మాత్రమే వరినాట్లు వేయడానికి అవకాశం ఉందని, ఆ తర్వాత సాగు చేస్తే దిగుబడి సక్రమంగా రాదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేఎల్ఐ ఎత్తిపోతల కింద పంటల సాగుకు నీరు వదలడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం ఆగిపోయింది. పూర్తిస్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు నిండలేదు. ఇప్పుడే సాగుకు నీరు ఇస్తే రాబోయే రోజుల్లో తాగునీటికి కష్టమవుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం వర్షాలు కురవడం అంతంతేనని వాతావరణ శాఖ చెబుతోంది. -
ఎక్లాస్పూర్ కన్నీటి సంద్రం
కన్నవారి కలలు.. కల్లలు ఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై వస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. చెదిరిన.. చదువుల తల్లి ఆశలు బాగా చదువుకోవాలి.. డాక్టర్ కావాలి.. నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి. ఎక్లాస్పురం.. కన్నీరుమున్నీరు మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్పురం.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగా తిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. అయిజలో అంతిమ యాత్ర.. ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. ఏపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ప్రభుత్వం సత్వరమే స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కృషిచేసి ఉంటే ప్రియాంక బతికి ఉండేదని అఖిలపక్ష పార్టీల నాయకులు, గ్రామస్తులు మండిపడ్డారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఏపీ ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బోరుమన్న ఎక్లాస్పూర్.. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్పూర్కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీ రుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రి వెంకటేష్కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్వగ్రామంలో వైద్య విద్యార్థిని ప్రియాంక అంత్యక్రియలు అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు పాడె మోసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ తరలివచ్చిన బంధుగణం.. పార్టీలు, సంఘాల నాయకులు -
రామగిరి బ్రిడ్జికి గ్రహణం!
నాగర్కర్నూల్: కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట – రామగిరి మార్గంలో దుందుభీ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం 2023లో రూ. 45కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం రావడం.. టెండర్ల ప్రక్రియ పూర్తికావడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు 2025 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఐదు నెలలపాటు పనులు సాఫీగా సాగాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురిసి, వాగుకు వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. తీరా వర్షాలు ముగిసి, వరద తగ్గుమొఖం పట్టినప్పటికీ చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో పనులు పునఃప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో డైవర్షన్ రోడ్డు ఏర్పాటుకు భూ సమస్య తలెత్తింది. ఫలితంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఇదీ పరిస్థితి.. రఘుపతిపేట – రామగిరి మార్గంలో దుందుభీ వాగు దాదాపు 500 మీటర్లు (అర కిలోమీరు) పైగా పొడవు ఉంటుంది. 11 ఫిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఒక్కో ఫిల్లర్ మధ్యలో 40 మీటర్ల దూరం ఉంటుంది. అటు చివర, ఇటు చివర రెండు అపార్టమెంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏడు ఫిల్లర్లు నిర్మించగా.. రఘపతిపేట వైపు మరో నాలుగు నిర్మించాల్సి ఉంది. రామగిరి పైపు అపార్టుమెంట్ పూర్తి కాగా.. రఘుపతిపేట వైపు డైవర్షన్ సమస్యతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నాలుగైదు నెలల్లో రూ. 8కోట్ల పనులు చేశారు. అంతలోనే వర్షాలు కురిసి, వరదలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత బిల్లు సకాలంలో రాకపోవడంతో వర్షాలు ముగిసినా పనులను పునఃప్రారంభించలేదు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పనులకు ఆటంకంగా మారింది. వచ్చే అక్టోబర్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఏడాదిన్నరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తగ్గనున్న దూరభారం.. రఘుపతిపేట –రామగిరి నడుమ దుందుబీ వాగు వచ్చిందంటే, రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎవరు వాగు దాటకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా తెలకపల్లి, లింగాల మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ఆర్అండ్బీ రహదారి కావడంతో డబుల్ రోడ్డుగా విస్తరించారు. జీన్కుంట, పోలేపల్లి, ఉప్పరిపల్లి, మామిళ్లపల్లి, దాసర్లపల్లి, రామగిరి తదితర గ్రామాలకు హైదరాబాద్, కల్వకుర్తి నుంచి రావడానికి 30 కి.మీ. దూరం తగ్గుతుంది. వర్షాకాలంలో వాగు వచ్చిందంటే.. ఆయా గ్రామాల ప్రజలు అచ్చంపేట, నాగర్కర్నూల్ మీదుగా వెళ్లాల్సిందే. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగు పడనుంది. మూడేళ్ల క్రితం రూ.45కోట్లు మంజూరు వర్షాకాలంలో ముందుకు సాగని పనులు ప్రజలకు తప్పని ఎదురుచూపులు -
ఆదివాసీ హక్కులను కాపాడుకుందాం
మన్ననూర్: ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆదివాసీల హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్ కోరారు. ఆదివారం మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి ఆదివాసీ మహిళలు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. ఆదివాసీలు తరతరాలుగా ప్రకృతి పరిరక్షణే తమ జీవనంగా మలుచుకున్నారని అన్నారు. వారి సంస్కృతీ సంప్రదాయాలు, సమష్టి జీవన విధానం మానవాళికి మార్గదర్శకమని కొనియాడారు. అదే విధంగా పీవీటీజీ పాఠశాల/కళాశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయిబాబుగౌడ్ పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కందనూలు: నాగర్కర్నూల్ మండలంలోని మంతటి విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా సోమవారం పలు గ్రామాలకు విదు్య్త్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మాన్యానాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మంతటి, గగ్గలపల్లి, వనపట్ల, అవురాసిపల్లి, అనంతసాగర్, గడ్డంపల్లి, రాయిపాకుల, గౌతంపల్లి గ్రామాల పరిధిలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, రైతులు గమనించి, సహకరించాలని ఆయన కోరారు. 13న సహస్ర ఘట్టాభిషేకం అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవాలని కాంక్షిస్తూ ఈ నెల 13న ఉమామహేశ్వర క్షేత్రంలో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, అనురాధ దంపతులచే ఆలయ ఆవరణలో మహా వరుణయాగం ఉంటుందని.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. సాహితీ రంగంలో తనదైన ముద్రవేసిన యశోదారెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: సాహితీ రంగంలో తెలంగాణ సాహితీ దిగ్గజం పాకాల యశోదారెడ్డి తనదైన ముద్రవేశారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు సంచాలకులుగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, సహ సంచాలకులుగా ప్రధాన కార్యదర్శి శాంతారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ పాకాల యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలికమంతా తెలంగాణ, బిజినేపల్లి ప్రాంతానికి చెందినదే అన్నారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సేవలను కొనియాడారు. ఆచార్య చందోజీరావు మాట్లాడుతూ యశోదారెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు వర్తమాన పరిశోధకులుగా, కథా రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభ సదస్సుకు రావూరి వనజ సభాధ్యక్షత వహించగా.. సదస్సులో పలువురు పరిశోధకులు పత్రసమర్పణ చేశారు. సమావేశంలోలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, జి.శాంతారెడ్డి, డాక్టర్ భారతి, ప్రముఖ అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, జయలక్ష్మమ్మ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, గన్నోజు శ్రీనివాసాచారి, కె.వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నియంతృత్వ పోకడలపై తిరుగుబావుట
పెద్దకొత్తపల్లి: నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న పాలకులపై యువత తిరగబడే రోజులు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెద్దకొత్తపల్లి మండలంలోని మారెడుమాన్దిన్నె, సాతాపూర్, నారాయణపల్లి, గంట్రావుపల్లి, మహాసముద్రం, చెన్నపురావుపల్లి, కొండ్రావుపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా బాల్నర్సింహతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీకి అధికారం కట్టబెడితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారన్నారు. దేశ యువతకు పూర్తిగా అన్యాయం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు తన్నీరు నర్సింహ, తుమ్మల శివుడు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
శుద్ధజలం.. పుష్కలం!
కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. ఇకపై కేఎల్ఐతోపాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ శాశ్వతంగా తీరనున్న తిప్పలు గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. -
చుట్టూ తిరిగి వెళ్లాలి..
వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం నిత్యం తెలకపల్లి నుంచి కల్వకుర్తికి వెళ్లి వస్తుంటాం. వానాకాలంలో దుందుభీ వాగు పారితే చుట్టూ 20 కి.మీ. ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో సమయంతోపాటు అదనపు భారం పడుతుంది. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే ఎంతో మందికి మేలు కలుగుతుంది. – సురేశ్, తెలకపల్లి రఘుపతిపేట – రామగిరి గ్రామాల మధ్య దుందుభీ వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి, ప్రజల ఇబ్బందులను తొలగించాలి. – గణేశ్, సర్పంచ్, రఘుపతిపేట రఘుపతిపేట బ్రిడ్జి పనులు రెండు నెలల్లో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. డైవర్షన్ రోడ్డు ఏర్పాటుకు భూ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు నివేదిక పంపాం. వర్షాకాలం ముగిసిన వెంటనే పనులను వేగవంతంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేస్తాం. – శ్రీధర్, ఈఈ, ఆర్అండ్బీ ● -
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: సంక్షేమ పథకాల అమలులో మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పుర్గర్చర్లలో కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.10 వేలు లంచం తీసుకున్నారని లబ్ధిదారు తెలుపగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనం, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. భీమా కాల్వ నుంచి శ్రీరంగాపురం రిజర్వాయర్కు సరిపడా సాగునీరు అందేవిధంగా కాల్వల విస్తరణకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు రైతులకు అందజేస్తున్న ట్రాన్స్ఫార్మర్లతో పాటు పరికరాల వివరాలను అందజేస్తే రైతులందరికి తెలిసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేలా చూస్తామన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కేఎల్ఐ, జూరాల కాల్వల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్పంచ్లు మీసాల పార్వతమ్మ, రామన్గౌడ్, సుదర్శన్రెడ్డి, రాత్లావత్ గోపాల్, బండారు రాములు తదితరులు పాల్గొన్నారు. -
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి..
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి
కందనూలు: తల్లిదండ్రుల కలలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో 990 పైగా మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులతో పాటు పదో తరగతిలో 585 పైగా మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులకు ఆదివారం ఎంపీజే చారిటబుల్ ట్రస్ట్, బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. భవిష్యత్లో ఉన్నతంగా రాణించి.. తల్లిదండ్రులు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభా విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ పచ్చిపాల సుబ్బయ్య, రిటైర్డు డీఈఓ విజయ్కుమార్, బీసీటీఏ నాయకుడు భాస్కర్ పాల్గొన్నారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి లోతట్టు ప్రాంత చెంచులు పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే జీవితాలు వెళ్లదీస్తున్నారు. మన్ననూర్ ఐటీడీఏ ఉన్నా చెంచులకు ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీడీఏలను నిర్లక్ష్యం చేస్తూ బడ్టేట్ కేటాయింపులు లేవు. చెంచులు వివిధ రోగాల బారిన పడి చెంచు జాతి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. – నిమ్మల శ్రీనివాసులు, అదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెంచు, గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కుటుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ ● -
సర్.. రెండు రోజులే!
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 85.50 శాతం డిజిటలైజేషన్ ● వరుస సెలవులు ఉన్నప్పటికీ పూర్తిచేయాలని ఆదేశాలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో దాదాపు పూర్తి కావొచ్చింది. దీనికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బీఎల్ఓలకు ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తేనే ఈ నెల 10 వరకు డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 85.50 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మిగిలినవి 24.50 శాతం కూడా పూర్తిచేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. అయితే శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నప్పటికీ సర్ విధులు నిర్వరిస్తున్న వారు విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. బీఎల్ఓలు వివరాలు ధ్రువీకరించుకుని మరణించి వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ అన్ కలెక్టబుల్ శాతం మహబుబ్నగర్ 7,32,488 6,29,126 1,03,351 85.89 నాగర్కర్నూల్ 7,31,632 6,17,695 1,13,937 84.43 వనపర్తి 2,75,570 2,36,619 38,951 85.87 జో.గద్వాల 5,03,859 4,39,552 64,169 87.24 నారాయణపేట 4,95,574 4,19,055 76,519 84.56 మొత్తం 27,39,123 23,42,047 3,96,927 85.50 ఉమ్మడి పాలమూరులోని జిల్లాల వారీగా సర్ ప్రక్రియను పరిశీలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 84.43 శాతంతో చివరన ఉంది. ఇక ఐదు జిల్లాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజర్ జాబితాతోపాటు ఇతరులు కలిపి మొత్తం 3,96,927 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైరాజర్ జాబితాలో ఉన్న ఓటర్ల తరపున ఎన్యూమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసీ ఓట్లు ఉన్నవారు, గైర్జాజర్ జాబితాలో అత్యధికంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. -
సోమశిలను సందర్శించిన హౌజింగ్ శాఖ డైరెక్టర్
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిలను శనివారం రాష్ట్ర హౌజింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. సోమశిలకు వచ్చిన ఆయనకు జిల్లా పీడీ గోపాల్నాయక్, డీఈ హరినాయక్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ సోమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ కుటుంబ సభ్యులను అధికారులు శాలువాలతో సత్కరించారు. శనేశ్వరుడికి అభిషేక పూజలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని సూచించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్ పాల్గొన్నారు. సిర్సనగండ్ల ఆలయ అభివృద్ధికి సహకరించండి చారకొండ: అపర భద్రాదిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి నిధులు మంజూరు చేయాలని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ అన్నారు. శనివారం దేవాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా శ్రీరామనమిని పురస్కరించుకొని రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, ఈ క్రమంలో సౌకర్యాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా మంత్రి కొంత వరకు నిధులు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆలయాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దడానికి సీఎం రేవంత్రెడ్డి రూ.వంద కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు నాగర్కర్నూల్ ఎంపీ, జిల్లాలోని ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
● గ్రామీణ స్థాయి నుంచే విద్యా ప్రమాణాల పెంపు ● పోటీ ప్రపంచంలో రాణించాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి ● పీయూ నేషనల్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ● హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పడిపోతున్న జీవన ప్రమాణాలు
చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నాయి. సింహభాగం చెంచులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండి అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. రక్తహీనత, టీబీ, మలేరియా, విషజ్వరాలు, క్యాన్సర్, కడుపులో బల్ల (గడ్డ) వ్యాధులు లేని కుటుంబం అంటూ లేదు. పోషకాహారం లోపంతో మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతుండగా మరికొంత మంది వివిధ వ్యాధులతో అరిగోస పడుతున్నారు. వీరి సగటు జీవితకాలం 40 ఏళ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. పెంటల్లో 14 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తుండగా.. 30 ఏళ్లు వచ్చే సరికి ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తున్నారు. మహిళలు అనారోగ్యం పాలవడానికి ఇదే ప్రధాన కారణం. చెంచుల్లో ఎక్కువ మంది ఆహారం తీసుకోకుండా అడవుల్లో దొరికే పండ్లు తింటారు. మరికొందరు ఆహారం లేకుండా మద్యం తాగి.. అనారోగ్యాలను బారినపడుతున్నారు. తిండిలేకపోయినా రోజుల తరబడి ఉంటారు తప్ప సారా లేనిది ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెంచుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఆధునిక జీవనశైలిపై అవగాహన కల్పించే వారు లేకపోవడం, పౌష్టికాహార లోపం, రకరకాల వ్యాధులు, బాల్యవివాహాలు తదితర కారణాలతో అడవి బిడ్డల రోదన.. అరణ్యవేదనగా మిగిలిపోతోంది. అభివృద్ధికి దూరంగా.. అటవీ ఉత్పత్తుల సేకరణే వీరి ప్రధాన జీవనాధారం. వీటి ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మినహాయిస్తే.. చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు లేవు. తెలంగాణ వచ్చాక కూడా ఐటీడీఏ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చెంచుల సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతం ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు, కండ్లకుంట, గీచుగండి, ఆగర్లపెంట, పందిబొర్రె పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అభయారణ్యంలోని చెంచుపెంటల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకుతున్నారు. కి.మీ.,ల దూరంలో ఉన్న బావులు, కుంటలు, బోర్లు, కాల్వల వద్దకు నడిచివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నల్లమల పెంటల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. పలుచోట్ల సోలార్ వ్యవస్థతో విద్యుత్ దీపాలు అమర్చినా సగానికి పైగా పనిచేయడం లేదు. అయితే ఈ చెంచు పెంటలన్నీ (అప్పాపూర్) ఒకే దగ్గరికి చేర్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారుతోంది. రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మంటలు పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. చెంచులకు వైద్య సేవలు అందడం లేదు. మన్ననూర్ కేంద్రంగా పనిచేసిన సంచార వైద్యశాల మూలకుబడింది. అప్పాపూర్లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా తెరుచుకోవడం. ఫలితంగా చెంచులు అనారోగ్యం పాలైతే వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
ప్రతిభావంతులకు భరోసా
● ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు ● పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేత ● జిల్లాలో అత్యధికంగా గౌరెడ్డిపల్లి పాఠశాల విద్యార్థుల ఎంపిక ● ఈ నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ గురువుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా చదివి మోడల్ పేపర్లను సాధన చేసి, మెంటల్ ఎబిలిటీ, గణితం, సోషల్, సైన్స్ సబ్జెక్టులను క్రమం తప్పకుండా అభ్యసించి పరీక్షలో విజయం సాధించాను. ఈ స్కాలర్షిప్ రెండేళ్ల నుంచి ఏడాదికి రూ.12 వేల చొప్పున పొందుతున్నాను. – కార్తికేయ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌరెడ్డిపల్లి, తెలకపల్లి మండలం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో మేం గతేడాది ఐదు మంది విద్యార్థులం ఎంపికయ్యాం. భవిష్యత్లో ఇంకా ప్రతిభా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి పాఠశాలకు పేరు తీసుకొస్తాను. – అంకిత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌరెడ్డిపల్లి, తెలకపల్లి మండలం కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీస్తూ.. వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఎన్ఎంఎంఎస్ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పేద పిల్లలు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇవ్వనుంది. పరీక్షల్లో ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం నాలుగేళ్లపాటు లభిస్తుంది. 50 శాతం మార్కులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 7వ తరగతిలో 50 శాతం, బీసీ, ఇతర విద్యార్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హెచ్ఎం సంతకంతో దరఖాస్తు ఫారాలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 56 మంది విద్యార్థులు జిల్లాలోని తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 2017 నుంచి 2026 వరకు మొత్తం 56 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో నిలబెడుతూ మెరుగై ఫలితాలు సాధిస్తూ జిల్లాస్థాయిలో ముందంజలో నిలుస్తోంది. 24 వరకు గడువు.. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఈ నెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో ప్రతిభచాటిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు రూ.48 వేల ఉపకార వేతనం పొందే అవకాశం ఉంటుంది. నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు. ఎన్ఎంఎంఎస్ పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదటి విభాగంలో మానసిక సామర్థ్య పరీక్షకు 90 మార్కులు కేటాయిస్తారు. రీజనింగ్, ఆర్థమెటిక్ సామర్థ్యం, పదాల భిన్న పరీక్ష, అంకెలు, అక్షరాల ఎకనాలజీ, కోడింగ్– ఢీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్చిత్రాలు, అద్దం, నీటి ప్రతిబింబాలకు సంబంధించి ప్రశ్నలుంటాయి. రెండో విభాగంలో 7, 8 తరగతుల సిలబస్ నుంచి 90 మార్కులకు 90 ప్రశ్నలుంటాయి. వీటిలో గణితం 20 మార్కులు, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 35 మార్కులు, సాంఘికం నుంచి 35 మార్కుల చొప్పున ఉంటాయి. పరీక్ష తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో బహుళైచ్ఛిక రూపంలో ఉంటుంది. -
రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
పెద్దకొత్తపల్లి: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం పెద్దకొత్తపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని దేదినేనిపల్లి, చిన్నకార్పాములు, చిన్నకొత్తపల్లి, జగన్నాథపురం, పాత యాపట్ల, కొత్త యాపట్ల, చంద్రబండతండా, మారేడుమాన్దిన్నె గ్రామాల్లో సీపీఐ పాదయాత్ర సాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఫయాజ్ మాట్లాడారు. మతోన్మాద పాలకుల నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ జెన్–జీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయన్నారు. భవిష్యత్లో నియంత పాలనకు చరమగీతం తప్పదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పాలకులు గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, శివుడు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్కుమార్, లక్ష్మీనారాయణ, సాయిలు, సలేశ్వరం, రాముడు, ప్రకాష్, బాలపీరు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణలే అభివృద్ధికి మూలం
● పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో ఉత్సాహంగా జాతీయ సెమినార్ ● ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, పలు యూనివర్సిటీల వీసీలు ● సామాజిక మార్పుతోనే విజన్–2047 సాధ్యమన్న మంత్రి ● పీయూను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: వీసీ శ్రీనివాస్ ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల స్టాళ్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశం అభివృద్ధి చెందాలంటే విద్య, యువత చేసే ఆవిష్కరణలే మూలం అవుతాయని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో నిర్వహించిన విజన్–2047 ‘ఇంటిగ్రేషన్ సైన్స్, ఇన్నోవేషన్, అండ్ యూత్ ఎంపవర్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజన్–2047 లక్ష్యాలు చేరుకోవాలంటే ముఖ్యంగా దేశంలో శాసీ్త్రయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రి మేధస్సు, డేటాసైన్స్, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్లు, పునరుత్పదాక ఇంధన, అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించనప్పుడే అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ప్రగతి, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమగ్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని వెల్లడించారు. ముఖ్యగా సమాజంలో కార్పొరేట్ వైపు ప్రజలు మెగ్గు చూపడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్య, వైద్యం కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారని, దీని వల్ల రాష్ట్రంలో నూటికి 95 శాతం మంది అప్పుల్లో కూరుకుపోయారన్నారు. పరువు, హంగు ఆర్బాటాల కోసం పెద్దఎత్తున వేడుకలు చేస్తుండటం వల్ల మరిన్ని అప్పులు పెరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కళాకారుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పీయూలో ఐదు క్యాంపస్ కళాశాలలు, ఐదు హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు లా, ఇంజినీరింగ్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే అధునాతన ల్యాబ్లు, లైబ్రరీలు, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించామన్నారు. 170 ఎకరాల విస్తీర్ణంలోని క్యాంపస్లో పచ్చని చెట్లతో విద్యార్థులకు ఆహ్లాదకర వాతారణం అందుతుందని చెప్పారు. అలాగే గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ విద్యార్థులకు పలు కోర్సుల్లో విద్య అందిస్తున్నామని, వారికి తరగతి గదులు, బాల, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. పలు సెషన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్టులు, ప్రొఫెసర్లు తమ ప్రసంగాలను వినిపించారు. సాంస్కృతిక, స్టాళ్ల ప్రదర్శనలు జాతీయ సెమినార్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ కంపెనీలు, స్టార్టప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమానికి హైలెట్గా నిలవగా మంత్రి జూపల్లి స్టాళ్లు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనంజయ, గుల్బర్గా యూనివర్సిటీ వీసీ శశికాంత్ ఉడేకార్, పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, కుమరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు ఎగనామం?
● వృద్ధాప్య కాలం లేకుండా విడుదల చేసిన ప్రభుత్వం ● దరఖాస్తుల స్వీకరణ బాధ్యత కార్యదర్శి, బిల్లు కలెక్టర్లదే.. ● మార్గదర్శకాల్లో కీలక అంశాలు వెల్లడి నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాలకు ఇవ్వడానికి అనుమతి ఇస్తూ.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నూతన ఫారం విడుదల చేసింది. అయితే వృద్ధాప్య పెన్షన్దారులకు మొండిచేయి చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫారంలో ఎక్కడ వృద్ధాప్య పింఛన్ల కాలం లేకపోవడమే ఇందుకు కారణం. వితంతువులు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, గీత, చేనేత ఇతరత్రా కాలాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎన్నో రోజుల నుంచి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే మిగిలినట్లయింది. కాగా ఇతర వర్గాల వారు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ ద్వారా బోగస్ పెన్షను ఏరివేసిన స్థానంలో ఆ సంఖ్యకు అనుగుణంగా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. వారిదే బాధ్యత.. ప్రభుత్వం నూతన పింఛన్ల దరఖాస్తు కోసం ఫారం విడుదల చేసింది. చేయూత పథకం పేరిట విడుదల చేసిన ఫారం నమూనాను ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి ఇతర శాఖల అధికారులకు పంపించారు. అందులో స్పష్టంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతోపాటు పైలేరియా, డయాలసిస్ వారికి మాత్రమే కాలం పేర్కొన్నారు. ఎక్కడా వృద్ధాప్య అని లేకపోవడంతో వారు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు ఫారాలను గ్రామ కార్యదర్శితోపాటు బిల్లు కలెక్టర్లు తీసుకోవాలి. ఆ తర్వాత రూరల్ ఏరియాలో ఎంపీడీఓలు, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి.. ధ్రువీకరించేలా పొందుపరిచారు. పైలేరియా పేషెంట్లకు జిల్లా మలేరియా అధికారి, డయాలసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ ధ్రువీకరించాలని నిబంధనలో పేర్కొన్నారు. జత పర్చాల్సినవి ఇవే.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫారం నింపడంతోపాటు వితంతువులు భర్త చనిపోయిన ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు పెళ్లి కాలేదని, ఒంటరిగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు యూడీఐడీ సర్టిఫికెట్, గీత కార్మికులు సొసైటీలో సభ్యుడిగా ఉన్న పత్రం, చేనేత కార్మికులు టెక్స్టైల్స్ డిపార్టుమెంట్ ధ్రువీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుంది. అధికంగా వృద్ధులే.. కొత్త పింఛన్ల కోసం ఎక్కువగా ఎదురుచేసేది వృద్ధులే. గ్రామాలకు నాయకులు, అధికారులు ఎవరు వచ్చినా.. వారి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వండి అంటూ వేడుకుంటారు. ప్రభుత్వమేమో అధికంగా వృద్ధాప్య పింఛన్దారులు ఉంటారని, ప్రస్తుతం తక్కువగా ఉండే లబ్ధిదారులను ఎంచుకుంటే ప్రభుత్వపై భారం ఉండదని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్లు అయితే వయస్సు 57 ఏళ్లు నిండిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఈ వయస్సు వారికి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల సమయంలో వారికే ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో ఈ వయస్సు వారికి ఇవ్వాలంటే గ్రామంలో 10 నుంచి 100 మంది వరకు లబ్ధిదారులు ఉంటారు. వీరందరికీ ఇస్తే అధిక భారం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వృద్ధాప్య పెన్షన్దారులు దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ఉచిత సలహా ఇచ్చారు. వారిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం. -
నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
నాగర్కర్నూల్/ కందనూలు: జిల్లాలో ఎన్నికల నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేపట్టడంతోపాటు ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లాలో ప్రతిపాదించిన నూతన పోలింగ్ కేంద్రాలు, మార్పులు, పేర్ల సవరణలకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 880 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోవాల్సిన దూరం, గ్రామాల విస్తీర్ణం, ప్రజల సౌకర్యం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం మరో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మరో ఐదు కేంద్రాల లొకేషన్లు, రెండు కేంద్రాల పేర్లను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా 2 కి.మీ., పైగా దూరంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి 27 కొత్త పోలింగ్ కేంద్రాలు, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికిపైగా ఓటర్లు ఉన్న మూడింటి విభజనకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఇవన్నీ అమలులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 880 పోలింగ్ కేంద్రాల సంఖ్య 910కు పెరుగుతుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జనాభా వివరాలను గడువులోగా సేకరించాలి జిల్లాలో జనాభా వివరాలను గడువులోగా సేకరించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలో కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా, విద్య, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ తదితర గణాంకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనతోపాటు అభివృద్ధి ప్రణాళికల అమలుకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 21లోగా గ్రామీణ, పట్టణ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ పూర్తి చేయాలని, వచ్చేనెల 8లోగా సమాచారాన్ని పరిశీలించి వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, సీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
కందనూలు: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న వివిధ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి వారి ఆచూకీ గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేవ్, నాన్– గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్, మాన్యువల్ రికార్డుల నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందేలా ప్రతి కాల్ను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
టూరిజం ఉద్యోగులపై దాడులను సహించం
కొల్లాపూర్ రూరల్: జిల్లాలో ఎవరైనా టూరిజం ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రవీందర్నాయక్, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ తమ్మయ్య హెచ్చరించారు. శుక్రవారం సోమశిలలో టూరిజం ఉద్యోగులపై దాడికి పాల్పడిన స్థలాన్ని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాళ్ల నర్సింహ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రివేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేలా బోటింగ్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దాడికి గురైన పర్యాటక శాఖ ఉద్యోగులు దేవరాజు, శివలకు వైద్యం చేయించి పూర్తి ఖర్చులను టూరిజం కార్పొరేషన్ చెల్లిస్తుందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. కార్యక్రమంలో టూరిజం పోలీసు అధికారులు శివశంకర్, శివప్రసాద్, ప్రేమ్కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసు కొల్లాపూర్: అమావాస్యను పురస్కరించుకొని ఈ నెల 12న కొల్లాపూర్ నుంచి పంచముఖి ఆలయానికి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు కొల్లాపూర్ డిపో మేనేజర్ మల్లేశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ నుంచి డీలక్స్ బస్సు పంచముఖికి బయలుదేరి.. గురువారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో జోగుళాంబ, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాల దర్శనం ఉంటుందన్నారు. రానుపోను ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.500గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కల్వకుర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, ఏటీసీ కళాశాలల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు iti.tela ngana.gov.in వెబ్సైట్లో తమ మొబైల్ నంబర్తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒక సంవత్సరం, రెండేళ్ల ట్రేడ్లలో తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో ఎస్సెస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బోనోఫైడ్, స్టడీ సర్టిఫికెట్లు, ఫొటోతోపాటు ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మొదటి విడతలో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు తమ లాగిన్లోకి వెళ్లి కొత్త ఆప్షన్లు మాత్రమే నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
ఆదేశాలు రాలేదు..
కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ నిబంధనలు, ఫారాలు, ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం. – ఓబులేష్, డీఆర్డీఓ ఎన్నో రోజుల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు.. ఇప్పడని చెబుతున్నా ఎవరూ ఇవ్వడం లేదు. తీరా ఇప్పుడేమో వృద్ధులకు తర్వాత ఇస్తామంటున్నారు. మాకు అన్యాయం చేయొద్దు. దవాఖానాకు, మందులకు పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. పింఛన్ ఇస్తే మేలు జరుగుతుంది. – నూకం నారయ్య, వృద్ధుడు, జూపల్లి -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
నాగర్కర్నూల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఐడీఓసీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జయశంకర్ ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి, అచంచల సంకల్పం కీలక పాత్ర పోషించాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఆయన జీవితాంతం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు నేటికీ సమకాలీనమైనవేనని అన్నారు. యువత జయశంకర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా సేవాభావంతో ముందుకుసాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటయ్య, ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
కందనూలు: తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ, జనరల్ ఆస్పత్రి, ఎంపీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నుంచి చేపట్టిన భారీ అవగాహన ర్యాలీని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిశువు పుట్టిన వెంటనే తొలి అరగంటలో తల్లిపాలు అందించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జననం తర్వాత మొదటి, మూడు రోజుల్లో వచ్చే ముర్రు పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా వంటిదని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకుండా బిడ్డకు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం ద్వారా భవిష్యత్లో రక్తహీనత, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నారు. తల్లుల్లో సైతం రొమ్ము క్యాన్సర్, గర్భాశయ సంబంధిత క్యాన్సర్లు, ఆస్టియో పోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గడమే కాకుండా.. తల్లీబిడ్డ మధ్య ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ బంధం మరింత బలపడుతుందని చెప్పారు. బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో బాలింతల కోసం ప్రత్యేకంగా పాలిచ్చే గదులు, అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిపాల బ్యాంకుల ఏర్పా టుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఎంపీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఎం.పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర పాల్గొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనులకు ఆధార్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో నివసిస్తున్న చెంచు, గిరిజన కుటుంబాల పరిస్థితులు, చిన్నారుల ఆధార్ నమోదు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలోని చెంచు, గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందాలంటే, ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీటీడీఓ కోటాజి, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీఈవో రమేశ్కుమార్ ఉన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలు సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో జరిగే 72వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వివరించారు. -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8 లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అనుసంధానం చేస్తూ ఏఐపీ హబ్గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉన్నత విద్యతో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్వకుర్తి రూరల్: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని స్టేడియంలో రూ.1.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. బీసీ బాలికల గురుకులంలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని.. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనందకుమార్, వైస్చైర్మన్ షాన్వా జ్ ఖాన్, కమిషనర్ మహమ్మద్ షేక్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రమాకాంత్రెడ్డి, సతీశ్, సంతు యాదవ్, బంగారి పాల్గొన్నారు. -
మత్స్యబీజం పడేనా?
నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం అన్నదాతలపైనే కాదు.. చేపల పెంపకంపై జీవనం సాగించే మత్స్యకారులపై కూడా పడుతోంది. వానాకాలం మొదలై రెండు నెలలు దాటినా జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. చెరువుల్లోకి సకాలంలో నీరు చేరకపోతే చేపపిల్లల పెంపకం ప్రశ్నార్థకంగా మారనుంది. తద్వారా మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం చేప విత్తనాల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కేఎల్ఐ నీరు వదిలితే.. శ్రీశైలం జలాశయంలోకి సమృద్ధిగా నీరు చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుంది. అయితే కేఎల్ఐ ద్వారా అక్టోబర్ తర్వాతే కాల్వలకు నీరు వదిలే అవకాశం ఉందని ఇరిగేషన్శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు చేపపిల్లలను చెరువుల్లో వదలకుండా ఉండటం కష్టమే. నీరు ఉన్న చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదిలే అవకాశం ఉంది. కాగా, కేఎల్ఐ నుంచి ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లలోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. వీటితో పాటు సోమశిల, మంచాలకట్టలో నిలిచే శ్రీశైలం బ్యాక్వాటర్లో 30లక్షల చేపపిల్లలను వదలనున్నారు. అదే విధంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వార నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేస్తే.. అక్కడ సైతం చేప పిల్లలు వదిలే అవకాశం ఉంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా 2.20 కోట్ల చేపపిల్లలను వదలాలని లక్ష్యంగా నిర్దేశించారు. 235 సంఘాలు.. 17,900మంది సభ్యులు జిల్లాలో 235 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. 17,900 మంది సభ్యులు ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా మత్స్యకారులు ఉండగా.. చేపల పెంకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చెరువుల్లోకి నీరు చేరకపోతే వీరి జీవనంపై తీవ్ర ప్రభావం పడనుంది. చేప పిల్లల పెంపకంపై నీలినీడలు మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ వర్షాభావంతో చెరువుల్లోకి నీరు రావడం లేదు. దీంతో చేపపిల్లలు పెంపకం కష్టంగా మారి మత్స్యకారుల జీవనం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. చేపపిల్లలు వదలాలంటే చెరువు, కుంటల్లో 60శాతం నీరు కచ్చితంగా ఉండాలి. ఆరునెలలకు చేపపిల్ల 750 గ్రాముల బరువు పెరుగుతుంది. చెరువుల్లోకి నీరు రాకపోతే ప్రభుత్వమే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలి. – వాకిటి ఆంజనేయులు, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయి ంచింది. ప్రస్తుతం చేప విత్తనాల కోసం టెండర్లను ఆహ్వానించడం జరిగింది. 17న తెరిచే అవకాశం ఉంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని అంచనా వేసి, చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – బి.లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి జిల్లావ్యాప్తంగా 1,056 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 36 పెద్ద చెరువులు ఉండగా.. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం, పాలెం, నందివడ్డేమాన్, అచ్చంపేట చంద్రసాగర్ తదితర చెరువుల్లో ప్రస్తుతం కొంతమేర నీరుంది. మిగతా చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. చేపపిల్లల పెంపకానికి చెరువులు, కుంటల్లో 60 శాతం వరకు నీరు ఉండాలి. లేకపోతే చేప పిల్లల పెంపకం కష్టంగా ఉంటుంది. గతేడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఆగస్టు నెలాఖరులోగా దాదాపు అన్ని చెరువుల్లో 2.21కోట్ల చేపపిల్లలను వదిలిపెట్టారు. ఇందుకోసం రూ. 1.87కోట్ల బడ్జెట్ కేటాయించారు. 12,800 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో మత్స్యకారుల్లో గందరగోళం నెలకొంది. -
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
కల్వకుర్తి రూరల్: రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో నకిలీ ఎరువులు వెలుగుచూసిన నేపథ్యంలో గురువారం కల్వకుర్తి మండలం మార్చాల, జీడిపల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఇతర ఎరువులను పరిశీలించారు. అనంతరం దుకాణాల్లోని రికార్డులను పరిశీలించి.. స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని డీలర్లకు సూచించారు. ఎరువులు, విత్తనాలు కొనే రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ జనార్దన్రెడ్డి, ఏడీఏ మంజుల, సీఐ భీంకుమార్, తహసీల్దార్ ఇబ్రహీం, ఏవో సురేశ్ ఉన్నారు. నియంతల ఆటలు సాగనివ్వం : సీపీఐ పెద్దకొత్తపల్లి: దేశంలో విప్లవ శకం మొదలైందని.. ఇక నియంతల ఆటలు సాగవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి నుంచి చేపట్టిన పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజలకు వివరించి.. చైతన్యవంతం చేసేందుకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నర్సింహ, ఇందరిమ్మ, తుమ్మల శివుడు, శ్రీనివాసులు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నేడు పీయూ జాతీయ సదస్సు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఆధ్వర్యంలో గురువారం షాద్నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జాతీయసదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు శాంతివనంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరయ్యే ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. రెండు రోజులు నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ప్రముఖులు మొత్తం 600 మంది అతిథులుగా హాజరుకానున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకాన్నారు. ముగింపు వేడుకలకు కేంద్రమంది కిషన్రెడ్డి రానున్నారు. కాగా.. రెండోరోజు ఉదయం 10 గంటలకు పీయూకు ఉషా, మేరు ప్రతినిధులు రానున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర అన్నారు. హన్మకొండలో శుక్రవారం, శనివారాల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అండర్–6, 8, 10, 12 ఏళ్ల లోపు బాలబాలికలు, కిడ్స్, జాతీయ జావెలిన్ డే సందర్భంగా అండర్–14, 16, 18, 20 బాలబాలికలు, పురుషుల, మహిళల జావెలిన్త్రో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి అభినందించారు. పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్, సునీల్కుమార్, జిల్లా సంఘం సభ్యులు శ్రీనివాసులు, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు పెరగనున్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ● -
భూభారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్కర్నూల్6 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026–8లో uనాగర్కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్కర్నూల్లో స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్ట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళన భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్లోని గాంధీభవన్కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్ రెండు రోజులుగా నిరసన చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం -
పెండింగ్లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అన్యాయం చేయొద్దు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి. – రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ ● -
ప్రతిభకు నిలయాలు.. నవోదయ విద్యాలయాలు
కందనూలు: నవోదయ విద్యాలయాలు ప్రతిభకు నిలయాలుగా నిలుస్తున్నాయని నాగర్కర్నూల్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతాంజలి అన్నారు. బుధవారం వట్టెం నవోదయ విద్యాలయం 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. తాను కూడా వట్టెం నవోదయ విద్యాలయంలోనే 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు జాతికి అత్యుత్తమ పౌరులను అందించే నిలయాలుగా నిలిచాయని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణిమ మాట్లాడుతూ.. ప్రతి ఏటా 10–12 తరగతుల ఫలితాల్లో నవోదయ విద్యార్థులు టాపర్స్గా నిలవడం.. సివిల్ సర్వీసెస్, గ్రూప్ లాంటి పోటీ పరీక్షల్లో అత్యధికంగా నవోదయ విద్యార్థులు ఉండటం ఇందుకు నిదర్శనమని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
‘దోస్త్’.. మరో చాన్స్
నేటి నుంచి ప్రత్యేక రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు ● టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు సువర్ణావకాశం ● 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ● 14న సీట్ల కేటాయింపు డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు మంచి అవకాశం. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన టెక్నికల్ డిగ్రీ కోర్సులు నేటి పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. వీటితో డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. – మదన్మోహన్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్–2 షెడ్యూల్ను ప్రకటించింది. మూడో దశలో సీటు పొందని విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గురువారం నుంచి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలు.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న డిగ్రీ టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ద్వారా అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో రెండేళ్ల అకాడమిక్ బోధన, ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ విధానంలో ప్రత్యేక కోర్సులను రూపొందించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించనున్నాయి. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.. అమ్రాబాద్ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు రాకపోవటంతో కేవలం 6 కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే సమయంలో ఆసక్తి గల విద్యార్థులు టెక్నికల్ కోర్సులను కూడా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. పీహెచ్, సీఏపీ, ఎన్సీసీ, డ్రాపౌట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ కేటగిరీలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన 12న చేపట్టనున్నారు. 14న సీట్ల కేటాయింపు.. అదే రోజు నుంచి 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్.. 17, 18 తేదీల్లో సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, కళాశాలలను ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లుగా నమోదు చేస్తే సీటు లభించే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన అధికారిక షెడ్యూల్లో స్పెషల్ ఫేజ్ వరకు మాత్రమే తేదీలు ప్రకటించారు. స్పాట్ అడ్మిషన్ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. అవి స్పెషల్ ఫేజ్ పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీ సీట్ల ఆధారంగా ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. -
భూ సేకరణలో జాప్యానికి తావివ్వొద్దు
నాగర్కర్నూల్: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూసేకరణ పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అవార్డుల జారీ, రైతులకు పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులు, వివాదాస్పద భూములు తదితర వివరాలను తెలుసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలో 51.10 ఎకరాల భూసేకరణ మాత్రమే పెండింగ్లో ఉందని అధికారులు వివరించారు. అచ్చంపేట ఎత్తిపోతల పరిధిలో సుమారు 2,588 ఎకరాల భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎంజీకేఎల్ఐ పరిధిలో 200, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో 186 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని స్పష్టం చేశారు. ● కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో ప్రకటించే పీజీఐలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు, జిల్లాల పనితీరును సుమారు 70 కీలక సూచికల ఆధారంగా అంచనా వేసి ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో జిల్లా 333 పాయింట్లతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉందని.. ఈ విద్యా సంవత్సరం తొలి స్థానంలో నిలిపేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణారెడ్డి, మాధవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్, ఏఎంఓ కిరణ్కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ నూరుద్దీన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి మాధవరెడ్డి, వెంకటేశ్వర్లుశెట్టి ఉన్నారు. -
సెమినార్కు వేళాయె
మౌలిక వసతులు పొందడం చెంచుల హక్కు ● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● సమస్యలను సత్వరమే పరిష్కరించాలి ● రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ – మన్ననూరు ● హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీసీలు, కేంద్ర విద్యా శాఖ అధికారులు ● రెండోరోజు పీయూను సందర్శించనున్న వీసీలు ● వచ్చే అతిథులకు హోటళ్లలో బస, వాహనాల ఏర్పాటు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన యూనివర్సిటీ అధికారులు – వివరాలు 8లో.. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 800 మంది వరకు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని కన్హాశాంతి వనంలో శుక్ర, శనివారాల్లో సెమినార్లో నిర్వహించనున్న సెమినార్లో మొదటిరోజు ప్రారంభ కార్యక్రమం అక్కడే జరుగుతుండగా.. విద్యార్థుల కోరిక మేరకు రెండోరోజు పలు సెషన్స్ పీయూలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీయూలో ఉషా నిధులు వినియోగించి నిర్మించిన భవనాలు, ఇతర సదుపాయాలను పలు యూనివర్సిటీల వీసీలతో పరిశీలించనున్నారు. అలాగే పీయూ విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, పరిశోధన తదితర అంశాలను వచ్చిన అతిథులకు వివరించనున్నారు. అదేరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతివనంలో జరగనుంది. గత విద్యా సంవత్సరంలో యూనివర్సిటీకి పీఎం ఉషా (ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) కార్యక్రమం కింద రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పీయూలో జాతీయ సెమినార్ ‘విజన్ ఇండియా–2047’ ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ పేరుతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ.36 లక్షలు కేటాయించింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీయూకు మొదటిసారి అవకాశం దక్కినట్లయింది. సెమినార్కు కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రీసెర్చి సాలర్స్, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. నేషనల్ సెమినార్లో వీరు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శాస్త్ర, సాంకేతికతతో కూడిన పరిశోధనలకు సంబంధించి పలు ఎంఓయూలు (మెమోరాండం ఆఫ్ అండ్ స్టాండింగ్) సంస్థలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఇతర యూనివర్సిటీలతోనూ ఎంఓయూలు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీయూకు పలు ప్రాజెక్టులు, పరిశోధనల్లో సహకారం వంటివి లభించనున్నాయి. పీయూలో ప్రతి సంవత్సరం సుమారు 650 నుంచి 750 మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీలు పొందుతున్నారు. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ వంటి డిపార్ట్మెంట్ల వారితోపాటు ముఖ్యంగా బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చదివినవారు ఉన్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన లా కళాశాల, ఇంజినీరింగ్లో మూడు డిపార్ట్మెంట్ల విద్యార్థులు ఉన్న నేపథ్యంలో కార్యక్రమానికి పలు ప్రైవేటు కంపెనీలు వచ్చి.. పీయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసేందుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. నేషనల్ సెమినార్ను ఘనంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ కన్వీనర్గా రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లుగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ వ్యవహరిస్తున్నారు. కమిటీల్లో వివిధ స్థాయిల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు కన్హా శాంతివనంలోనే రెండు రోజుల కోసం వసతి ఏర్పాటు చేయనున్నారు. రెండోరోజు యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మూడు బస్సుల్లో వివిధ యూనివర్సిటీల వీసీలను తీసుకురానున్నారు. ఎయిర్ పోర్టు, బస్టాండ్, రైల్వేస్టేషన్స్ నుంచి వచ్చే అతిథులను ప్రత్యేక వాహనాల ద్వారా శాంతివనానికి తరలించనున్నారు. పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. – మధుసూదన్రెడ్డి, సెమినార్ కన్వీనర్ -
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
కొల్లాపూర్: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి ఈ నెల 14 వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించన్నునట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ తెలిపారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర ధరలను తగ్గించాలని, విద్య, వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఉంచాలని, పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని, మహిళా రిజర్వేషన్లను అమలుచేయాలని, నాలుగు లేబర్కోడ్లను ఎత్తివేయాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని, దళిత ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మీదుగా రైల్వేలైన్ పనులు త్వరగా చేపట్టాలని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు తుమ్మల శివుడు, జంగం శివుడు, నిరంజన్నాయుడు, రమణ, చంద్రయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలకు పంపించాం..
కలెక్టర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల రద్దు చేసి నియామకమైన పాఠశాలలకు పంపించాం. అందరు ఉపాధ్యాయలు విధుల్లో చేరారు. అయితే కొన్నిచోట్ల విద్యార్థులు లేని కారణంగా ఏజెన్సీలోనే వీరిని సర్దుబాటు చేస్తూ పిల్లలు ఉన్న పాఠశాలలకు పంపిస్తున్నాం. దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో వీరిని నియమిస్తున్నాం. మైదాన ప్రాంతాలకు ఎవరినీ తీసుకోవడం లేదు. – రమేష్కుమార్, డీఈఓ మరో టీచర్ను పంపించాలి. మా ఊరిలోని పాఠశాలకు ఇద్దరు టీచర్లే వస్తున్నారు. 43 మంది పిల్లలకు చదువు ఎలా చెప్తారు. మరో టీచర్ డిప్యూటేషన్పై వెళ్లారు. వచ్చినా పాఠశాలకు రావడం లేదు. మరోచోటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులు సక్రమంగా వచ్చేలా చూడటంతోపాటు అదనంగా మరొకరిని నియమించాలి. – మోహన్, విద్యార్థి తండ్రి, తిరుమలాపూర్(బీకే) సిద్దాపూర్కు వెళ్తున్నారు.. మా ఊరి పాఠశాలకు ఉపాధ్యాయులు లేక పిల్లలు సిద్దాపూర్కు వెళ్లి చదువుతున్నారు. పిల్లలు వచ్చిపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుడిని నియమించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూ డా తీసుకెళ్లాం. ఇప్పటికై నా పోస్టును భర్తీ చేయాలి. – రవీందర్, సర్పంచ్, పద్మారంతండా పాఠశాలలు తెరిపించాలి.. ఏజెన్సీ ప్రాంతాల్లో మూతబడిన అన్ని పాఠశాలను అధికారులు తెరిపించాలి. తండాలో పాఠశాల లేక విద్యార్థులను వివిధ ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది. ఉపాధ్యాయ పోస్టు ఉన్న సక్రమంగా వారు రాక పాఠశాలను మూసివేస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయుడిని రప్పించి పాఠశాలలను తెరిపించాలి. – సబావత్ భాస్కర్, చీన్యాతండా● -
వచ్చారు.. వెళ్లారు!
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/ అమ్రాబాద్/ మన్ననూర్: మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో చాలాచోట్ల పాఠశాలలు తెరుచుకోకపోవడంతో పేదలు విద్యకు దూరమవుతున్నారు. సోమవారం ఏజెన్సీ పాఠశాలలో నిర్వహించిన ‘సాక్షి’ విజిట్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. గత రెండేళ్లుగా విద్యార్థులు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. అన్ని పాఠశాలలు తెరిపించాలని ప్రభుత్వం భావించి ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమం నిర్వహించింది. మూతబడిన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించి బడిఈడు పిల్లలను గుర్తించి చేర్పించేలా చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించలేదు. జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్తో 67 బడులు మూతబడగా చాలా వరకు తెర్చుకోలేదు. అత్యధికంగా నల్లమలలోనే మూతబడిన పాఠశాలలు ఉన్నాయి. అచ్చంపేట మండలం ఐనోలు జెడ్పీహెచ్ఎస్ టీచర్ గుండూరు వెళ్లగా తిరిగి యథా స్థానానికి వచ్చారు. శివారుతండా, లింగరోనిపల్లి ఏజెన్సీ ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లో వెళ్లగా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి వారి స్థానాల్లో విధుల్లో చేరారు. అయితే ఇప్పుడు మళ్లీ వీరిని తిరిగి ఏజెన్సీలోని ఇతర పాఠశాలలకు పంపించే దిశగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. నలమలలో విద్యకు దూరమవుతున్న గిరిజన విద్యార్థులు ఏజెన్సీ ప్రాంతంలో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయుల విముఖత వివిధ రకాల కారణాలతో డిప్యూటేషన్లపై మైదాన ప్రాంతాలకు.. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో రద్దు చేసిన జిల్లా విద్యాశాఖ రెండేళ్లుగా స్కూళ్లు మూత.. పిల్లలు ఉన్నచోటికి సర్దుబాటుకు ప్రయత్నాలు సర్దుబాటు ఇలా.. బక్కలింగాయిపల్లి ఉపాధ్యాయుడు ఇన్ సర్వీస్ బీఎడ్ కోర్సు కోసం రెండేళ్లపాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మర్లపాడుతండా పీఎస్ జీరోఎన్రోల్మెంట్ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై పంపించారు. సిద్దాపూర్ పీఎస్లో ఇద్దరు టీచర్లకు ఒకరు మెడికల్ లీవ్లో ఉండగా.. దాస్యతండా టీచర్ను పంపించారు. ఎద్దుమిట్టతండాలో పనిచేస్తున్న టీచర్కు వార్డెన్ పోస్టు రావడంతో వెళ్లిపోయారు. 26 మంది పిల్లలున్న ఈ పాఠశాలకు దుబ్బాతండా టీచర్ను సర్దుబాటు చేశారు. చీన్యాతండా పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు ఖాళీ కారణంగా 5 మంది విద్యార్థులు సిద్దాపూర్ పాఠశాలకు వస్తుండగా లింగరోనిపల్లి టీచర్ను పంపించేలా చూస్తున్నారు. పద్మారంతండాకు చెందిన విద్యార్థులు సమీపంలోని సిద్దాపూర్ వస్తుండగా పద్మారంతండాకు టీచర్ సర్దుబాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఘనపూర్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఇన్సర్వీస్ బీఎడ్ కోసం వెళ్లగా దన్యాలతండా టీచర్ను ఇక్కడికి పంపించారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
కందనూలు: జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై సంబంధిత శాఖలు నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో సమాచార మార్పిడి, సమన్వయం మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు, విద్య, వైద్య, ఎకై ్సజ్ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం పెంచుకుంటూ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నకిలీ ఎరువులు విక్రయించొద్దు జిల్లాలోని నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ ఎరువుల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూ రు, కల్వకుర్తి మండలాల్లో 872 డీఏపీ ఎరువుల బ్యా గులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామ న్నారు. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ఏడుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయన్నారు. జిల్లాలో రైతులు సైతం ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను లైసెన్స్డు డీలర్లు, పీఏసీఎస్లు, ఇతరత్రా అధికారిక విక్రయ కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు. -
నీటికబురు
కలెక్టర్ సమీక్ష.. జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు. గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమారు 60 వేలకుపైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పకడ్బందీగా స్వాతంత్య్ర వేడుకలు నాగర్కర్నూల్: స్వాతంత్య్ర వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ శాఖల తరపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందజేయాలని, జిల్లా ప్రగతిపై సందేశం రూపొందించాలని ఆదేశించారు. కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద గడిచిన వారం రోజులుగా స్థిరంగా ప్రవాహం జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం -
టీబీ వ్యాధిని మొదట్లోనే గుర్తించాలి
కందనూలు: క్షయ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి వెంటనే చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ మండలంలోని పెద్దముద్దునూరు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన క్షయవ్యాధి పరీక్ష శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం పడడం తదితర లక్షణాలు ఉన్నవారు డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని చెప్పారు. క్షయవ్యాధిగ్రస్తులు మాంసకృతులతో కూడిన పౌష్టికాహారాన్ని తినడానికి ప్రతినెల వారి అకౌంట్లో రూ.వెయ్యి జమ అవుతాయని పేర్కొన్నారు. సలహాదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు మన్ననూర్: జిల్లాలో వెయ్యి మంది సలహాదారుల (గైడ్స్) ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలంగాణ సామూహిక జీవనోపాదుల సంస్థ (టీజీఐఎంసీ) స్టేట్ కోఆర్డినేటర్ జయరాం తెలిపారు. మంగళవారం ఆయన మన్ననూర్లోని మండల గిరిజన మహిళా సమాఖ్య భవనంలో 30 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో మహిళా సమాఖ్యలు కొనసాగుతున్న ఒక్కో గ్రామానికి ముగ్గురు గైడ్స్ చొప్పున నియమించడం జరుగుతుందన్నారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టుగా 24 నెలల కాలపరిమితిగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో కొందరు సలహాదారులతో 12 నెలలు పూర్తయిన క్రమంలో కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. సమాఖ్యలకు గైడ్స్గా ఎంపికై న వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవని, భవిష్యత్లో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగావకాశాల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ అధికారుల తనిఖీలు కందనూలు: జిల్లాకేంద్రంలోని పలు దుకాణా ల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సీటీఓ కృష్ణవర్ధన్రెడ్డి తెలిపారు. సీటీఓ కథనం ప్రకారం వివరాలిలా.. పట్టణంలోని బంగారం, వస్త్ర దుకాణాలతోపాటు రైస్మిల్లు ల్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించార న్నారు. ఓ బంగారు దుకాణానికి స్థల మార్పిడి సమాచారం లేనందున రూ.20 వేల జరిమానా విధించారు. అలాగే 2 వస్త్ర దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. ఒక రైస్మిల్లుకు రూ.25 లక్షల పాత బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చామన్నారు. ప్రతి షాపు యజమాని జీఎస్టీ పరిధిలో వ్యాపారం నిర్వహించాలని, ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రేషన్ కోసం ఎదురుచూపులు
కల్వకుర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల ఇబ్బందులను గుర్తించి ఒకేసారి మూడు నెలల రేషన్ సరఫరా కోసం ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో ఈ నెల 1 నుంచి వినియోగదారులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తుండగా.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, వంగూరు మండలాల్లో మొత్తం 132 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో కేవలం 9 రేషన్ షాపులకు మాత్రమే బియ్యం సరఫరా జరిగాయి. దీంతో వినియోగదారులు ఆయా గ్రామాల్లో రేషన్ షాపుల చుట్టూ తిరిగి బియ్యం లేవనడంతో వెళ్లిపోతున్నారు. స్టేజ్–1 నుంచి బియ్యం కల్వకుర్తి ప్రాంతానికి సరిగా రావడం లేదని తెలిసింది. స్టేజ్–2లోనూ సమస్యలు తలెత్తడం వినియోదారులకు శాపంగా మారింది. ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా కావడంతో కొన్ని షాపులలో బియ్యాన్ని నిల్వ చేయడం కూడా సమస్యగా ఉంది. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో బియ్యం సరఫరా ప్రారంభం కాకపోవడంపై వినియోగదారులు, డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ● ఈ విషయమై గోదాం ఇన్చార్జి శశిధర్రావు స్పందిస్తూ.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 షాపులకు బియ్యం సరఫరా చేశామని, మిగతా షాపులకు రెండు రోజుల్లో పంపిస్తామని చెప్పారు. స్టేజ్–2 కాంట్రాక్టర్ తనకు గిట్టుబాటు కావడం లేదని జిల్లా అధికారులకు రేటు పెంచాలని దరఖాస్తు చేసుకున్నారని అందువల్లే సరఫరా నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది
కందనూలు: ఉద్యోగులకు పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్పీ చేతులమీదుగా సుధాకర్రెడ్డికి ఏఎస్ఐ హోదా స్టార్స్ అలంకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా.. బాధ్యతలు మరింత పెంచుతుందని గుర్తించాలన్నారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రాంలాల్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10 అర్జీలు ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమికి సంబంధించినవి, 3 తగు న్యాయం చేయాలని ఫిర్యాదులు వచ్చాయని, ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని విమర్శించారు. మరోవైపు ఎరువులకు కొత్త యాప్లను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఫలితంగా యూరియా కోసం రైతులు తిప్పలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్లు గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, నాయకులు ఐజాక్, నిరంజన్, లింగంముదిరాజ్, అంజినాయక్, ప్రసాద్, అంజిమాస్టర్, శ్రీను పాల్గొన్నారు. 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సోమవారం 11 యూనిట్ల ద్వారా 44.925 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234, దిగువలో 5 యూనిట్లలో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 44.925 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టినట్లు ఎస్ఈ తెలిపారు. రీజియన్కు 12 మంది అప్రెంటిస్ ఇంజినీర్లు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని పది డిపోలకు గాను 12 మంది శిక్షణ ఇంజినీర్ అప్రెంటిస్లను కేటాయించారు. ఇటీవల వీరు నియమితులు కాగా.. బుధవారం ఆయా డిపోలలో చేరనున్నారు. వీరికి మూడేళ్ల పాటు ఆర్టీసీ తరఫున స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. మొదటి ఏడాదిలో నెలకు రూ.18 వేల చొప్పున, రెండో ఏడాదిలో రూ.20 వేల చొప్పున, మూడో ఏడాదిలో రూ.22 వేల చొప్పున పారితోషికం అందుకుంటారు. -
ఆటస్థలం లేదు..
మా గ్రామంలో విద్యార్థులు, యువకులు సరైన ఆటస్థలం లేక చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలంలో విద్యార్థులకు ఆడుకోవడానికి ఏర్పాటు చేయగా.. ఇంకా మిగిలిన స్థలంలో చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. గ్రామ యువకులు, పెద్దల సమక్షంలో తీర్మానం చేసుకొని మిగిలిన స్థలాన్ని ఆటలు ఆడుకోవడానికి కేటాయించాలని గ్రామ పాలకమండలి తీర్మానించింది. ఉన్నతాధికారులు స్పందించి ఆటస్థలం కేటాయిస్తే బాగుంటుంది. – కొట్ర గ్రామస్తులు, వెల్దండ మండలం ● -
ఫాగింగ్ చేస్తున్నాం..
నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో నాలుగు ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. అందులో ఒకటి మరమ్మతుకు గురైంది. దీంతో మూడు యంత్రాలతోనే పలు కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ ఇటీవల పట్టణంలో దోమల బెడద విపరీతంగా పెరిగింది. దోమలను నివారించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టం లేదు. చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి.. పారిశుద్ధ్యం లోపించి అపరిశుభ్రంగా మారాయి. దోమలు, ఇతర కీటకాలు వ్యాపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలి. – పరమేష్, సాయినగర్కాలనీ, నాగర్కర్నూల్ -
టెక్నికల్గా తగ్గించారా!
లెక్కింపు సమయంలోనే. రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందం తనిఖీల సంద ర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్ వెరిఫికేషన్) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీబాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ వర్గాలతో పాటు రైస్ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది. లోపాయికారిగా సర్దుబాటు? మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి.. నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయి న వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్ సప్లయ్ సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్ సప్లయి డీఎస్ఓ గంప శ్రీనివాస్ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్ను జిల్లా మేనేజర్ రవినాయక్కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు. రైస్ మిల్లర్లలో ముదిరిన పోరు.. తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వా హకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టిందని.. స యోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది. విచారణ జరిపిస్తేనే వెలుగులోకి.. శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీ జన్ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటికి మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ తనిఖీ ల్లో బస్తాల సంఖ్యను సరిగ్గా లెక్కించలేదని.. మళ్లీ లెక్కించాలని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియా తో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభు త్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, అధికారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ‘శ్రీ లక్ష్మీబాలాజీ’లో విజిలెన్స్ తనిఖీల్లో కొత్తకోణం వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం పౌరసరఫరాల శాఖపై అనుమానాలు లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం ? సివిల్ సప్లై డీఎస్ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి రైస్మిల్లర్స్ అసోసియేషన్లో ముదురుతున్న పోరు రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ యూనిట్–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్కు చెందిన ఇబ్రహీంబాద్లోని రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్ చేశారు. -
మాలలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను నమ్మించి మోసం చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాలలను రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గం పూర్తిగా తమ ఉనికి కోల్పోయిందన్నారు. ఈ వర్గీకరణను దేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని, దీనికి బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే.. మోదీ దేశమంతా విస్తరింపచేశారని మండిపడ్డారు. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమేనా ఈ దేశ సంపదలో అక్కర్లేదా అని ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, రేవంత్రెడ్డి కేబినెట్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? మాల వర్గంపై కుట్ర చేస్తుంటే ఎన్నాళ్లు చూస్తు ఉండాలని వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నామని వాపోయారు. చెంచా గిరికి అలవాటు పడ్డ కొందరు మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉంటూ.. జాతికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీరం సతీష్కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతికుమార్, డా.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్లో పొరపాట్లకు తావివ్వొద్దు
నాగర్కర్నూల్: ఓటరు డిజిటలైజేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటలైజేషన్ పురోగతి, ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ అమలుపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు పేరు నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు, లింగం, వయస్సు, ఇతర వ్యక్తిగత వివరాల్లో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బూత్ లెవల్ అధికారులు చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి డబుల్ ఎంట్రీలు, నకిలీ నమోదులు, సాంకేతిక లోపాలు లేదా సమాచారం నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరగకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు ఓటరు జాబితాలను పూర్తిస్థాయిలో తప్పులులేకుండా రూపొందించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీఓ అర్చన పాల్గొన్నారు. -
గ్రామాన్ని తరలించొద్దు..
అభివృద్ధి కోసం గ్రామాన్ని తరలించే ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ను కోరుతున్నాం. ఇలా చేసే ముందు గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మా గ్రామంలో అటవీ శాఖ వారి ఆంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రామాన్ని తరలించే పద్ధతిలో విడిచి వెళ్లే వాళ్లకు పారదర్శకంగా అర్హులను మాత్రమే పంపించాలి. కొందరు వేరే ప్రాంతాల్లో నివాసం ఉండి వారికి గ్రామంతో సంబంధం లేకపోయినా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి అధికారులు పారదర్శకంగా చేపట్టాలి. – వటువర్లపల్లి గ్రామస్తులు, అమ్రబాద్ మండలం -
ప్రమాదపుటంచున పర్యాటకులు
●పోలీసుల పహారా అవసరం.. జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల భద్రత చర్యలు చేపడతాం.. జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్ రోడ్ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు నిలుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో ప్రాజెక్టు దిగువ భాగం కళకళలాడుతున్నా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రస్ట్ గేట్ల నుంచి నురగలు కక్కుతూ దిగువకు పారుతున్న నీటి దృశ్యాలను చూసేందుకు, నది అంచునకు వెళ్లి సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఉహించలేని పరిస్థితి నెలకొంది. నిత్యం పోలీసు పహార ఉండాల్సిన అవసరం ఉన్నా.. కేవలం నామమాత్రపు గస్తీ నిర్వహిస్తూ వెళ్తుండటంతో పర్యాటకులు నది అంచున వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి దిగువకు సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంలో దిగువన ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు ముళ్లకంచె ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రాజెక్టు పైభాగం నుంచే పర్యాటకులను తిలకించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎడమ కాల్వ వద్ద మరీ డెంజర్.. జూరాల ఎడమ కాల్వ వద్ద నీటి ప్రవాహం ఉధృతిని గుర్తించలేని యువత ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే చేప ఫ్రైని తిని ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక కర్ణాటక రాయచూర్ నుంచి కూడా పర్యాటకులు భా రీగా వస్తుంటారు. చేప వంటకాలతో పాటు మద్యం అమ్ముతుండటంతో తాగిన మైకంలో యువకులు కాల్వలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలు.. రెండేళ్ల కిందట మహబూబ్నగర్కు చెందిన ఐస్క్రీం విక్రయదారు జూరాల సందర్శనకు వచ్చి నదిలో స్నానం చేస్తూ గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే ఏడాది మహబూబ్నగర్కు చెందిన ముస్లిం యువకుడు సైతం కుటుంబ సభ్యుల కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్ప వరద వస్తుందని తెలిసిన మరుక్షణమే దిగువ నదిలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదు. జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ చూసేందుకు తరలివస్తున్న జనం దిగువ నదిలో సెల్ఫీ ఫోజులు అదుపుతప్పితే ప్రవాహంలో గల్లంతయ్యే ప్రమాదం సూచిక బోర్డులు ఏర్పాటుచేయని ప్రాజెక్టు అధికారులు -
తల్లిపాలే అమృతం
● శిశువు ఎదుగుదలలో వీటి పాత్రే కీలకం ● డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ● జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం ● గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు అమ్మపాలు శిశువుకు అమృతం వంటివి. శిశువు ఆరోగ్యంగా జీవించాలంటే ముర్రుపాలు పట్టించాలి. డబ్బా పాలు తాగిస్తే కలిగే దుష్ప్రయోజనాలపై అంగన్వాడీ టీచర్లు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ లక్ష్యాలు, అందిస్తున్న పథకాలను వివరించాల్సి ఉంది. తల్లిపాలలోని పోషకాలు, తల్లీబిడ్డలకు కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బందితో అవగాహన కల్పించాలి. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి మహబూబ్నగర్ రూరల్: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోత పాలతో ముప్పు పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. -
చివరి దశకు ‘సర్’..
అచ్చంపేట: జిల్లాలో సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు మరో వారం రోజుల సమయం ఉండటంతో అధికారులు వేగవంతం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 9,76,987 మంది ఓటర్లు ఉండగా.. ఈ నెల 1 నాటికి 8,31,764 ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మొత్తం ఓటర్లలో 85.13 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆచూకీ తెలియని ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారు, మరణించిన వారు, ఇలా జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. తేలిన ఓటర్ల లెక్క.. ఓటరు మ్యాపింగ్తో ప్రస్తుతం ఉన్న ఓట్లలో ఎంత వరకు నిజమైనవి.. ఎన్ని డూప్లికేట్ ఓట్లు అనే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 38,885, అచ్చంపేటలో 40,689, కల్వకుర్తిలో 30,012, కొల్లాపూర్లో 35,637 ఓట్లతో కలిపి సుమారు 1,45,223 మంది ఓట్లు లేనట్లు తేలింది. ఈ లెక్కన గతంలో ఉన్న ఓట్లలో 14.87 శాతం తగ్గినట్లే. ఇందులో మరణించిన వారు, డబుల్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు వలస, సిప్టింగ్ అయిన వారు ఉన్నారు. జాగ్రత్తగా తొలగింపు జాబితా.. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, చనిపోయిన వారిని గుర్తిస్తూ.. జాబితాను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. మరణించిన వారి వివరాలను పూర్తిగా పరిశీలించి.. ఇంటి యాజమాని లేదా కుటుంబ సభ్యుల నుంచి సంతకం తీసుకున్న తర్వాతే ఓటు తొలగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ సభలు నిర్వహించి.. మృతులు, వలస ఓటర్లు, ఇతర వివరాలు చదివి వినిపిస్తూ సంతకాలు తీసుకుంటున్నారు. ఇల్లు మారినా, అద్దెకు ఉండి ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారి వివరాలను ఇంటి యాజమానుల నుంచి సేకరిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏల సమక్షంలో ఓట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో 85.13 శాతం డిజిటలైజేషన్ పూర్తి తొలగింపు జాబితాలో 1,45,223 మంది ఓటర్ల వివరాలు నిర్ధారణ కాని ఓట్లపై కుదురుతున్న అవగాహన పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశఽం.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. అయితే జిల్లాకు సంబంధించి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఈ లెక్కన పోలింగ్ కేంద్రాలపై కూడా ప్రభావం పడుతుంది. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని తగ్గుతాయో స్పష్టత రానుంది. తద్వారా సాధారణ ఎన్నికలతో మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఇప్పటికే పలువురు నాయకుల్లో టెన్షన్ మొదలైంది. -
వర్షాభావం రైతన్న ఆగం!
జూలైలో 34శాతం లోటు వర్షపాతం ● రెండు నెలల్లో 183.2 మి.మీ. వర్షం ● కొన్ని మండలాల్లో అతి తక్కువగా వానలు ● పంటల దిగుబడులపై అన్నదాతల్లో ఆందోళన నీరులేక సాగు చేయలే.. ఎనిమిదేళ్లుగా చెరువు కింద రెండు పర్యాయాలు వరిసాగు చేసేవారం. ఈ ఏడాది చెరువులోకి నీరు రాకపోవడంతో సాగు బంద్పెట్టాం. ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకున్న పొలంలో పత్తిసాగు చేశాం. వర్షాభావంతో దిగుబడి వస్తుందో లేదోననే భయం ఉంది. – వెంకటయ్య, రైతు, తుర్కలపల్లి బీడుగా వదిలేశాం.. చెరువులో నీరు లేక ఎప్పుడు సాగుచేసే పొలాలు బీడుగా పెట్టాం. చెరువులో నీరుంటే మంచిగా వరిపంట పండేది. ఈఏడాది ఏమొచ్చిందో వానలే పడతలేవు. చెరువులో నీరు లేకుండాపాయె. బోరు నుంచి నీరు ఆగి ఆగి పోస్తున్నవి. ఈ రెండు నెలలు వర్షాలు రాకపోతే చెరువులోకి నీరు రానట్టే. మేము చాలా నష్టపోతాం. – లక్ష్మీనారాయణ, రైతు, చారకొండ కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలి.. రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగుచేయాలి. డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో పంటల సాగుకు మొగ్గుచూపాలి. కూరగాయల సాగుపై అధికంగా దృష్టి సారించాలి. ఇప్పటికే వరిపంట సాగు చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరుతడి పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. – చంద్రశేఖర్, డీఏఓ నాగర్కర్నూల్: జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఏటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్, జూలై నెలల్లోనే సమృద్ధిగా వర్షాలు కురిసేవి. ఈఏడాది మాత్రం సాధారణ వర్షపాతం సైతం నమోదు కాలేదు. జూన్లో మాత్రమే అక్కడక్కడ కురిసిన వానతో సాధారణ వర్షపాతం 22శాతం దాటింది. అయితే అన్ని మండలాలు, గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇక జూలైలో తీవ్ర వర్షాభావం నెలకొంది. దాదాపు 34శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలకు రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సైతం లోటు వర్షపాతమే నమోదు అవుతుందని వాతావరణశాఖ నివేదిక ఇవ్వడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎగువ ప్రాంతంలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరుగులు పెడుతుండటం రైతుల్లో కొంతమేర ఆనందం నింపుతోంది. 183.2 మి.మీ. వర్షపాతమే.. జిల్లాలో రెండు నెలల సాధారణ వర్షపాతం 204.6 నమోదు కావాల్సి ఉండగా.. 183.2 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. 12శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది 264.4 వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతానికి మించిపోయింది. ఈసారి జూలైలో కొన్ని మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలంలో 69 శాతం లోటు వర్షపాతం, కొల్లాపూర్లో 59శాతం, పెంట్లవెల్లిలో 62శాతం, ఊర్కొండలో 24 శాతం, వెల్దండలో 35 శాతం, వంగూరులో 36 శాతం, కల్వకుర్తిలో 52శాతం, అమ్రాబాద్లో 52శాతం, లింగాలలో 38 శాతం, బిజినేపల్లిలో 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట, బల్మూర్, కోడేరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. -
పారదర్శకంగా ప్రక్రియ..
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. పెండింగ్ మ్యాపింగ్, అనామలీస్, డూప్లికేట్, నోమ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే ఈఆర్వో స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. సందేహాలను నివృత్తి చేస్తాం. ప్రత్యేక ఓటరు సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం. – హేమంత్ కేశవ పాటిల్, కలెక్టర్ ● -
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర
తిమ్మాజిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ తెలిపారు. ఆదివారం తిమ్మాజిపేటలో పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని, సార్వత్రిక విద్య, మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలని, దళిత, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఖాజామైనొద్దీన్, శ్రీనివాసులు, కృష్ణయ్య, మాసయ్య, దేవేందర్, అశోక్ పాల్గొన్నారు. 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు. అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సంప్రదించాలని సూచించారు. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
నాగర్కర్నూల్: దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేరేలా సదరం యూనిక్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ప్) సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఓ అధికారులతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో సదరం యూడీఐడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం చేస్తోందన్నారు. ప్రతి కేంద్రంలో సేవలను వేగవంతం చేసేందుకు ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. గత 75 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,839 మంది దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు ఆమోదించామని, ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి యూడీఐడీ కార్డులు అందేలా కృషిచేస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఓ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి దివ్యాంగులకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. నల్లమల ఏజెన్సీ ప్రాంతాల్లో నివశిస్తున్న చెంచు గిరిజనుల కోసం ప్రత్యేక మొబైల్ సదరం శిబిరాల నిర్వహణతోపాటు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే శ్రవణ లోపం ఉన్న దివ్యాంగులను శాసీ్త్రయ పద్ధతిలో గుర్తించి వారికి కచ్చితమైన ధ్రువీకరణ అందించేందుకు జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సౌండ్ప్రూఫ్ గది ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో డీఆర్డీఓ ఏపీడీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రూ.వెయ్యి కోట్ల గోల్మాల్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్మాల్ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్.. విజిలెన్స్ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్.. ఎక్సెస్.. టెండర్.. ఆ వెంటనే రద్దు.. యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖలోనూ.. 2022–23 రబీ సీఎమ్మార్ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు విజిలెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది. 2022–23 యాసంగి సీఎమ్మార్ ధాన్యం కేటాయింపులు, బకాయిల వివరాలు.. జిల్లా రైస్ ధాన్యం వేలం రద్దుతో బకాయిలు మిల్లులు కేటాయింపులు మిల్లులో (సుమారు (మె.టన్నులు) ఉండాల్సిన రూ.లలో) ధాన్యం (మె.ట) మహబూబ్నగర్ 86 1,34,115 71,060 152 కోట్లు వనపర్తి 191 2,22,437 2,12,175 473 కోట్లు నాగర్కర్నూల్ 83 1,61,009 1,11,395 250 కోట్లు నారాయణపేట 51 1,15,727 66,557 154 కోట్లు జోగుళాంబ గద్వాల 33 36,814 27,195 51 కోట్లు సీఎమ్మార్ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్లో 25 శాతం, అక్టోబర్లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు. 2022–23 యాసంగి సీఎమ్మార్లో మాయాజాలం ఎక్సెస్ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం టెండర్ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో పంచాయితీ సీరియస్గా తీసుకున్న సర్కార్.. డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు విజిలెన్స్ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌర సరఫరాల శాఖలో సైతం.. -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ మండలంలోని బొందలపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసి.. మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారి ఆరోగ్యం, పోషకాహారం, భద్రతపై కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్పష్టం చేశారు. పాఠ్యాంశాలపై వారి అవగాహన, చదివే సామర్థ్యం, రాత నైపుణ్యం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానాన్ని పరిశీలించి విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులలో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించేలా బోధన కొనసాగించాలని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది అనాథలు, వలస కార్మికుల పిల్లలు, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన వారేనని.. అలాంటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. -
ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 7 చివరి తేదీ అని ప్రిన్సిపల్ మదన్మోహన్, అంబేడ్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య తెలిపారు. శనివారం కళాశాల ఆవరణలో ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులతోపాటు ఐటీఐ లేదా ఏదైనా రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసిన వారు కూడా వెంటనే డిగ్రీలో ప్రవేశం పొందవచ్చన్నారు. ఓపెన్ డిగ్రీ విద్యకు రెగ్యులర్ డిగ్రీతో సమాన గుర్తింపు, అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చదువును మధ్యలో ఆపేసిన వారు, గృహిణులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలని, లేకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని, ఆదివారం సైతం కళాశాల తెరిచి ఉంటుందని చెప్పారు. బిడ్డకు తల్లిపాలేసంపూర్ణ ఆహారం కందనూలు: బిడ్డకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణి ప్రసవించిన తర్వాత పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు పట్టించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తేనె, చక్కెర, గ్లూకోస్ నీరు వంటివి ఇవ్వరాదని చెప్పారు. మొదటి మూడు రోజుల తల్లిపాలు బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుందన్నారు. బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత కొంతమంది పిల్లల్లో వచ్చే ఫిజిలాజికల్ జాండ్రీస్ తీవ్రత తగ్గుతుందన్నారు. బిడ్డకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు భవిష్యత్లో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం బారిన పడకుండా నివారించగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ రవిశంకర్, ప్రోగ్రాం అధికారి సురేష్బాబు, రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి లింగాల: మండలానికి మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీ గోపాల్నాయక్ ఆదేశించారు. శనివారం మండలంలోని అప్పాయపల్లి, చెన్నంపల్లి, పద్మన్నపల్లి గ్రామాలను సందర్శించిన పీడీ, ఇతర అధికారులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పంచాయతీల వారీగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిని తెలుసుకొని.. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. మండలానికి 485 ఇళ్లు మంజూరవగా.. ఇప్పటి వరకు 79 ఇళ్లు మాత్రమే పూర్తవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో రెండో దశ ఇళ్లు మంజూరవుతాయని, ఆలోగా మొదటి దశ ఇళ్లను పూర్తి చేయించాలని ఎంపీడీఓ, కార్యదదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ హరిలాల్నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ రాముడునాయక్, ఏఈ నర్సింహ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
నాగర్కర్నూల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ హేమంత కేవశ్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, ఇన్చార్జి హౌసింగ్ పీడీ గోపాల్నాయక్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా అర్హుల తుది జాబితాలను సిద్ధం చేసి వెంటనే కలెక్టరేట్కు పంపించాలని సూచించారు. గుడిసెల్లో నివశిస్తున్న నిరుపేదలు, గృహ రహిత కుటుంబాలు, అత్యంత వెనకబడిన వర్గాలకు చెందినవారిని గుర్తించి.. రెండో విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
మన్ననూరు మీదుగా హైస్పీడ్ రైల్వేలైన్ అలైన్మెంట్ ఖరారు పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్మెంట్ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. డీపీఆర్ రూపకల్పన దిశగా..హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు -
సా..గుతున్న రీ సర్వే
● జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 10 గ్రామాల ఎంపిక ● క్షేత్రస్థాయిలో సహకరించనిలైసెన్స్డ్ సర్వేయర్లు ● కేవలం 13 మందిప్రభుత్వ సిబ్బందితో కొనసాగింపు నాగర్కర్నూల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వే సవ్యంగా సాగడం లేదు. సర్వేయర్ల కొరత ఉండటంతో లైసెన్స్డ్ సర్వేయర్లతో వేగంగా గ్రామాల్లో భూమి హద్దులు, మ్యాపులు, ప్రభుత్వ భూమి గుర్తించాలని నిర్ణయించారు. ముందుగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 4 గ్రామాలు ఎంపిక చేసి రీసర్వేకు గ్రామసభలు నిర్వహించి.. ఆ తర్వాత మరో 70 గ్రామాలను గుర్తించారు. వాటిలో చిన్న కమతాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేసి అక్కడ సైతం గ్రామసభలు పెట్టి భూ రీసర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. మొత్తం ఎంపిక చేసిన పది గ్రామాల్లో గ్రామసభలు పూర్తి కాగా.. రీ సర్వేకు వెళ్లే సమయంలో లైసెన్స్డ్ సర్వేయర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. తమకు న్యాయమైన వేతనాలు ఇస్తేనే వస్తామని మొండికేయడంతో ప్రభుత్వం ఇక్కట్లో పడినట్లయింది. జిల్లాలోని 350 గ్రామాల్లో 11,67,725 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామాలన్నింటిలో సర్వే చేయాల్సిన అవసరం ఉంది. గ్రామసభలు పూర్తి.. ప్రభుత్వం జిల్లాలో భూమి రీసర్వే కోసం పది డీజీపీఎస్ యంత్రాలు మంజూరు చేసింది. ఇది సర్వే వేగంగా చేయడంతోపాటు భూమి సరిహద్దులను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. మొత్తం పది యంత్రాలు ఉండటంతో ఏకకాలంతో పది గ్రామాల్లో రీసర్వే చేయవచ్చు. దీంతో పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాలు తిమ్మాజిపేట మండలంలోని మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్, లింగాల మండలం అంబటిపల్లి, కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామాలు ఎంపిక చేసి గ్రామసభలు సైతం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంపిక చేసిన 70 గ్రామాల్లో మరో ఆరు గ్రామాలు రీసర్వేకు ఎంపిక చేసుకున్నారు. ఇందులో అచ్చంపేట మండలం చెన్నారం, అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్, కల్వకుర్తి మండలం బెక్కర, తాడూరు మండలం అంతారం, వెల్దండ మండలం కర్వెన్నపల్లి, చారకొండ మండలంలోని కమాల్పూర్ గ్రామాలను ఎంపిక చేసి గ్రామ సభలు పూర్తి చేసి భూ సర్వేను సైతం ఆరంభించారు. జిల్లాలో 256 మంది.. భూముల రీ సర్వే చేయాలని, రిజిస్ట్రేషన్ సమయంలో భూమి కొలతలు వేసి మ్యాపులు గీసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు సైతం ఇచ్చింది. ఇలా జిల్లాలో 256 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేశారు. వారిని భూమి రీ సర్వేలో ఉపయోగించుకోవాలని నిర్ణయించగా వారు తమకు నెలవారిగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50 ఇస్తామని చెప్పగా.. ముందుకు రాకపోవడంతో కలెక్టర్ వారితో సమావేశం ఏర్పాటు చేసి ఎకరాకు రూ.60 ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో 13 మంది ప్రభుత్వ సర్వేయర్లు మాత్రమే భూ సర్వే చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. -
చిన్నారులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు
కందనూలు: బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహించిన తనిఖీల్లో బాలకార్మికులు, అనాథలుగా ఉన్న 60 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 42 మంది బాలురు, 18 మంది బాలికలు ఉండగా.. వీరిలో 8 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు ఉన్నారన్నారు. రెస్క్యూ చేసిన పిల్లల్లో 52 మందిని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా అప్పగించగా.. మిగిలిన 8 మంది చిన్నారులను పునరావాసం కోసం స్టేట్ హోంకు తరలించామని చెప్పారు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలతో పనులు చేయించే యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ శంకర్, డీసీఆర్బీ ఎస్ఐ రమేష్, ఎస్బీఐ రాంలాల్, ఉమెన్ ఎస్ఐ ఇందిరమ్మ, ఏఎస్ఐ విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ అధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పునరావాస లబ్ధిదారులకు భూసర్వే పెద్దకొత్తపల్లి: మండలంలోని బాచారం గ్రామానికి పునరావాసానికి వచ్చే లబ్ధిదారులకు ఒక కుటుంబానికి ఐదెకరాల భూమి కేటాయింపు కోసం భూమిని శుక్రవారం జిల్లా సర్వేయర్ గిరిధర్, మండల సర్వేయర్ బాబు ఫారెస్టు భూమి మ్యాపులను పరిశీలించారు. అమ్రాబాద్ అభయారణ్యం పులుల రక్షిత ప్రాంతం నుంచి మొదటి విడతలో 257 కుటుంబాలు పునరావాసానికి వచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు, 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. లబ్ధిదారులకు డిప్ పద్ధతిలో ప్లాట్లు కూడా కేటాయించారు. పాఠశాల, దేవాలయం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పులుల అభయారణ్యం ప్రాంతాల నుంచి సార్లపల్లి, చింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలు, వటువర్లపల్లి గ్రామాల నుంచి 1,400 కుటుంబాలను పునరావాసానికి తరలించాల్సి ఉంది. మొదటి విడతలో 417 కుటుంబాలకు గాను 257 కుటుంబాలు పునరావాసానికి తరలిరావడానికి అంగీకార పత్రాలు అందజేశారు. 160 కుటుంబాలు పునరావాసానికి వచ్చే ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ సర్వే చేసి పట్టాలు అందించడానికి సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉపాధి సిబ్బంది పోరుబాట
అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న వీబీజీ రాంజీ పథకం తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పెన్డౌన్–షట్డౌన్ కార్యక్రమంతో ఈ నెల 27 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురైనట్లు అయింది. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రభుత్వం నేటికీ క్రమబద్ధీకరించకపోవడం, పనికి తగిన వేతనం చెల్లించకపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు వీబీజీ రాంజీ పథకం అమలైనా.. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పట్టారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు వివిధ రకాల ఆందోళనతో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోజువారీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నెల 27న ఎంపీడీఓలు, డీఆర్డీఓ, కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించి ఆందోళనకు దిగిన తాత్కాలిక ఉద్యోగులు తమ హక్కుల సాధనకు విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. మండలస్థాయిలో కేవలం కార్యాలయానికి మాత్రమే పరిమితమవుతూ పెన్డౌన్.. షట్డౌన్ చేస్తున్నారు. వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల పెన్డౌన్.. షట్డౌన్ కార్యాలయాలకే పరిమితమైన సిబ్బంది ముందుకుసాగని వన మహోత్సవం ఆగస్టు 15 నాటికి సమస్యలుపరిష్కరించాలని డిమాండ్ ఉమ్మడి జిల్లాలో 653 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగాగుర్తించాలి.. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు. అయినా ఎప్పటికై నా క్రమబద్ధీకరిస్తారనే ఆలోచనతో విధులు నిర్వర్తిస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇక చేసేది లేక హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టడం తప్పడం లేదు. – బాలయ్య, జిల్లా అధ్యక్షుడు, వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులకు విన్నవించాం.. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ఆందోళన ఉండటంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళుతున్నాం. ప్రస్తుతం కొత్తగా ఇంచార్జి తీసుకోవడం ద్వార పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి తెలుసుకోని, గ్రామీణ ప్రాంతాలలో వీబీజీ రాంజీ పనులు కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు వెలుతాం. – రాంమహేశ్వరరావు, ఇన్చార్జి డీఆర్డీఓ -
భక్తిశ్రద్ధలతో విశ్వశాంతి మహాయాగం
కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ కల్వకుర్తి బీఎస్ఎన్ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మ హాయాగం శుక్రవారం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ద్వాదశ సహస్ర మృతిక శివలింగాలకు వైభవోపేతంగా పంచామృతాభిషేకాలు నిర్వహించి.. మారే డు దళాలు, వివిధ పుష్పాలు, పసుపు, కుంకుమ, గంధం, భస్మంతో అలంకరించారు. పండితుల మంత్రోచ్ఛారణలు, రుద్ర, నమక, చమకాల ఘో షతో కల్వకుర్తి ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. విశేష చండీహోమం మహాలక్ష్మీ హోమం, విశేష లక్ష్మీ పాశుపత, సహిత అష్టలక్ష్మీ సరస్వతి హోమా లను నిర్వహించారు. సాయంత్రం కోటి కుంకుమ, పుష్పార్చనలు, శ్రీచక్ర విశేష అభిషేక అర్చనలు చేశారు. భక్తులు పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ భక్తిపారవశ్యంతో ఉ ప్పొంగారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. బోలా శంకరుడి కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలని కాంక్షించారు. వివిధ పాఠశాలల నుంచి యాగశాలకు వచ్చిన విద్యార్థులు స్వా మీజీ బోధనలను ఆసక్తిగా వినడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయ ణం చేశారు. అనంతరం దాండియా, భక్తి పాటలకు నృత్యాలు చేశారు. దాదాపు 6వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.కార్యక్రమంలో జూ లూరు రమేశ్బాబు, బీచని బాలకృష్ణ, మాచిపెద్ది రా మస్వామి, పోలా సురేందర్, చిగుల్లపల్లి సతీష్, కల్మిచర్ల గోపాల్, గుబ్బ వెంకటేష్, మదన మురళి, పెద్దయ్యగౌడ్, జంగయ్య, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్ డిజిటలైజేషన్ పారదర్శకంగా చేపట్టాలి
కందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ గురువారం జిల్లాకేంద్రంలోని 116వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ఈ ప్రక్రియ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం అన్నారు. ఫారం6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పులు వంటి అంశాలను సంబంధిత దరఖాస్తుల ద్వారా సులభంగా చేసుకోవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ అర్చన, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కమిషనర్ నాగిరెడ్డి, బీఎల్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 38 శాతం తక్కువ నమోదైందన్నారు. అయితే రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల పేర్లు నమోదు చేయండి
కందనూలు: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలు, సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలను కనుగొనే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్కు ఆన్లైన్లో విద్యార్థుల పేర్లు నమోదు చేయాలని డీఈఓ రమేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఏడాది జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్కు ‘స్థిరత్వం కోసం విజ్ఞానం ఆవిష్కరణ’ అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి, ఏసీఎస్సీ సూచించిన ఉపాంశాల్లో ఒక అంశాన్ని ఎంచుకొని ప్రాజెక్టు రూపకల్పన చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్టును తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, ప్రాజెక్టు వివరాలను https://ncrc.in/ వెబ్సైట్లో వచ్చేనెల 15లోగా నమోదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 63025 38858, 91008 76190లను సంప్రదించాలని కోరారు. నేడు డయల్ యువర్ డీఎం కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం సుభాషిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఫోన్ చేయదలచిన వారు సెల్ నం.99592 26292ను సంప్రదించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ కందనూలు: ఉపాధ్యాయుల అంతర్జాతీయ ఎక్స్పోజర్ విజిట్ కోసం జిల్లా నుంచి ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ప్రిన్సిపల్లను ఎంపిక చేయనున్నట్లు డీఈఓ రమేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం గురువారం నుంచి వచ్చేనెల 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ముమ్మరంగా సర్ ప్రక్రియ కొల్లాపూర్: మున్సిపాలిటీలో జరుగుతున్న సర్ నమోదును అదనపు కలెక్టర్ చెన్నయ్య గురువారం పరిశీలించారు. పట్టణంలోని 253, 263, 267 బూత్లలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. స్థానిక బీఎల్ఓలతో మాట్లాడి ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రతి బూత్లో వందశాతం డిజిటలైజేషన్ చేయాలని, సర్ నమోదులో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. మ్యాపింగ్ నిర్వహించే సమయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ వివరాలపై ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఆయన వెంట ఆర్డీఓ భన్సీలాల్, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులున్నారు. -
సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి
ఉప్పునుంతల: ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు పెంచడానికి వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి.. హాజరు రిజిష్టర్, ఇతర రికార్డులు, వివిధ వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిల్లో జరుగుతున్న సాధారణ కాన్పుల వివరాలను తెలుసుకున్నారు. రోజువారిగా వస్తున్న బయటి రోగులతోపాటు ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల వివరాలను డాక్టర్ స్వప్నను అడిగి తెలుకున్నారు. సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు ముసురు వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సబ్ సెంటర్లలోనూ వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు చికిత్స అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు బిక్కునాయక్, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యం.. జలసిరి
● ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట నిర్మాణానికి చర్యలు ● భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రణాళిక ఖరారు ● ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వచ్చేనెల 14 నాటికి పూర్తిచేసేలా గడువు విధింపు నర్వ: ఎల్నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జల సిరి’కి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి కుంట, ఓపెన్ వెల్, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. సామూహిక ఇంకుడు గుంతలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది. పాంపాండ్స్ నిర్మాణం వ్యవసాయ భూముల వద్ద నీటి సామర్థ్యం పెంపొందించడానికి పాంపాండ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. వాటిని రెండు రకాల కొలతలతో ఏర్పాటు చేసుకోవచ్చు. గుంట భూమి కేటాయించి.. 12 మీటర్ల పొడవు, వెడల్పుతో నిర్మిస్తే రూ.80 వేలు, 5 గుంటల భూమి కేటాయిస్తే 20 మీటర్ల పొడవు, వెడల్పు ఉండాలి. దీని ఏర్పాటుకు రూ.4 లక్షలు ఖర్చు చేయనుంది. గ్రామానికో ఊటకుంట ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత కొలతలు తీసుకుంటున్న అధికారులు శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి. -
మరోసారి మూడునెలల రేషన్
జిల్లా పరిధిలో ఇలా.. నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరోదఫా మూడు నెలల బియ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఎల్నినో ప్రభావంతో నెలకొంటున్న కరవు పరిస్థితులు.. రవాణా వ్యయం.. ఇతరత్రా కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన బియ్యం ఆగస్టులోనే లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్లో పంపిణీ చేయగా.. ఆగస్టులో సైతం అలాగే పంపిణీ చేస్తామని ప్రకటించడంతో కొందరు డీలర్లు దుకాణాల్లో స్థలం కొరత ఉందని ఇతరత్రా కారణాలు చూపి నెలవారిగానే బియ్యం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వారి అభ్యంతారాన్ని తోసిపుచ్చి పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూడు నెలల బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 68 శాతం లబ్ధిదారులకు.. జిల్లావ్యాప్తంగా 552 రేషన్ దుకాణాలు ఉన్నాయి. నెలవారిగా ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇచ్చేవారు. కాగా ఈసారి మూడు నెలలకు సంబంధించి 18 కిలోల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు ఇవ్వగా.. ఇప్పుడు 105 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 30 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. అయితే జూలై నెలకు సంబంధించి 2,78,681 తెల్లకార్డుదారులకు 5,866 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా.. రేషన్ షాపుల్లో 68 శాతం లబ్ధిదారులకు సరఫరా చేశారు. 4,011 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా అన్ని దుకాణాల్లో కలిపి 1,855 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 20 మండలాల్లోని 552 రేషన్ దుకాణాల్లో మిగిలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉండటంతో కొందరు కార్డుదారులు ఇతర ప్రాంతాల్లో తీసుకోవడంతో 68 శాతమే సరఫరా అయ్యింది. ఈకైవెసీ తప్పనిసరి.. రేషన్ కార్డు దారులు ఈకైవెసీ తప్పనిసరిగా చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు చివరి తేదీ కావడంతో కార్డులో ఉన్న వారందరూ రేషన్ దుకాణాలు, మీసేవల్లో వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోవాలని, లేకపోతే బియ్యం ఇవ్వడం ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. మొత్తం లబ్ధిదారులు 8,97,738డీలర్లకు సూచించాం.. జిల్లాలోని రేషన్ దుకాణాలకు మూడు నెలల బియ్యం పంపిణీ వేగంగా సాగుతుంది. 20 మండలాల్లోని 552 రేషన్ షాపులకు గాను 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల కోటా తీసుకుపోవాలని డీలర్లకు సూచించాం. లబ్ధిదారులు కచ్చితంగా ఈనెలలోనే ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. – హైదర్అలీ, డీఎస్ఓ జిల్లాకు 17 వేల మె.ట., బియ్యం కేటాయింపు సాఫ్ట్వేర్ సమస్యతో దుకాణాలకు ఆలస్యంగా బియ్యం సరఫరా లబ్ధిదారులకు రేపటి నుంచి.. నెలరోజులపాటు పంపిణీ రేషన్ దకాణాలు 552తెల్లరేషన్ కార్డులు 2,59,984అంత్యోదయ 18,669అన్నపూర్ణ 28 -
అవగాహన కల్పిస్తున్నాం..
వీబీజీ రాంజీ అమలులో భాగంగా జలసిరికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో నిర్మించనున్న ఇంకుడు గుంతలు, బోరుబావుల రీచార్జి, నీటి, ఊటకుంటల గురించి ప్రజలతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీకి రెండు చొప్పున 272 గ్రామాల్లో 544 పాంపాండ్లు.. ఆగస్టు 14 వరకు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇందులో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు, అన్నదాతలు భాగస్వామ్యులు కావాలి. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
పురాల్లో పూర్
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) విషయంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల ప్రజలు వెనుకంజలో ఉన్నారు. సర్ ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి వేల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్ఓలకు తిరిగి చేరకపోవడం గమనార్హం. ఆశించిన దానికంటే తక్కువ మ్యాపింగ్ నమోదువుతుండటంపై ఇటు ఎన్నికల అధికారుల్లోనే కాకుండా.. అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ అలజడి మొదలైంది. ఫలితంగా మెజార్టీ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రయాదం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపనుంది. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్పై దృష్టిపెట్టాల్సిందిగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ పదేపదే చెబుతోంది. ఈ మేరకు వారికి శిక్షణ సైతం ఇచ్చింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పార్టీ ఓటు బ్యాంకుకు అనుకున్న ప్రతి ఒక్క ఓటును డిజటలైజేషన్ చేస్తోంది. ఓటు వేయడం, ఓట్లు కాపాడుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లో ముందుండే పట్టణవాసులు ఇప్పుడు వెనకంజలో ఉండటంతో బీఎల్ఓలకు అధికారులు నోటీసులు ఇచ్చే పరిస్థితి దాపురించింది. ప్రధానంగా 60 శాతం దాటని పోలింగ్ బూత్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇంట్లో ఫారాలు తిరిగి ఇచ్చేవారు లేకపోవడం, మరికొందరు చివరి రోజుల్లో ఇస్తామని వాయిదా వేయడం తదితర కారణాలతో పట్టణ ప్రాంతాల్లో సర్ నెమ్మదించింది. ఎన్నికల సమయాల్లోనూ పట్టణ ఓటర్లు సోమరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ, అసెంబ్లీ, ఎంపీ, ఇతర ఎన్నికల్లో పల్లె ఓటర్లు పోటెత్తితే.. పట్టణ ఓటర్లు చాలామంది ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక్కడ ఉన్న మెజార్టీ ఓటర్లు సొంతూళ్లపై మక్కువ చూపుతుండమే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్పందన అంతంతే.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఎక్కువ శాతం ఫారాలు సేకరించగా.. పట్టణాల్లో మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల వంటి కారణాలతో కొంత మంది ఇవ్వడం లేదు. మరికొందరు రేపు.. మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండేసీ ఓట్లు కలిగిన మరి కొంత మంది పుట్టిన ఊరిలో ఓటు హక్కు ఉంచుకోవాలనే ఉద్దేశంతో పట్టణాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదు. ఫోన్ చేసినా ఓటర్ల నుంచి స్పందన ఉండటం లేదని బీఎల్ఓలు వాపోతున్నారు. మాకు అక్కడ ఓటు హక్కు అవసరం లేదనే సమాధానం కూడా ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఓటు హక్కు కలిగిన చాలామంది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 3 వరకే గడువు.. ఎస్ఐఆర్ కార్యక్రమం ఆగస్టు 3తో ముగియనుంది. ఆలోపే తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మున్ముందు ఓటుహక్కు పొందడంలోనూ ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇప్పటికై నా పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్లు నిర్లక్ష్యం వీడి అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. సర్పై పట్టణ ఓటర్ల నిర్లక్ష్యం మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో ఫారాల పెండింగ్ ఎన్యూమరేషన్ ఇవ్వకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ఓటరు శాతం తగ్గడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అలజడి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికి మరో నాలుగు రోజులే గడువు -
పైసలిస్తే చకచకా పనులు!
● కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా ● రూ.20 వేలిస్తే క్షణాల్లో రిజిస్ట్రేషన్ కల్వకుర్తి టౌన్: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతోంది. అధికారుల వద్దకు నేరుగా వెళ్తే సవాలక్ష నిబంధనలతో రిజిస్ట్రేషన్లు కుదరని చెప్పడం.. ప్రైవేటు వ్యక్తి ద్వారా వెళ్తే ఠక్కున పనులు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి బాధితుల వివరాల మేరకు.. వెల్దండ శివారులోని సర్వేనం.707లోని 19.13 ఎకరాల భూమిలో వెంచర్ ఏర్పాటు చేయగా.. అదే మండలానికి చెందిన మట్ట నాగేశ్వర్గౌడ్, పందెం కృష్ణారెడ్డి ప్లాట్లు కొనుగోలు చేశారు. భూమికి సంబంధించిన న్యాయ వివాదం పరిష్కారమైన అనంతరం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పది రోజుల వ్యవధిలో 8మంది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మంగళవారం కృష్ణారెడ్డి తన ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లగా.. రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ప్రధాన అధికారి చెప్పారు. అతడు నిరాశతో బయటకు వస్తుండగా.. కార్యాలయంలో తిరిగే ఓ ప్రైవేటు వ్యక్తి తనను కలిసి రూ.20 వేలు ఇస్తే పని పూర్తిచేయిస్తానని చెప్పాడు. అత్యవసర పరిస్థితుల్లో అతను చెప్పినట్లే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించగా.. కొద్ది సేపటికే నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పూర్తయింది. అయితే బుధవారం అదే సర్వే నంబర్లోని మరో ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన నాగేశ్వర్గౌడ్కు మాత్రం అధికారులు రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని చెప్పారు. 24 గంటలు కూడా గడవకముందే నిబంధనలు ఎలా మారాయని.. ఒకరికి చేసిన పని మరొకరికి ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం.. డబ్బులు డిమాండ్ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
కందనూలు: విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేశ్ఆచారి డిమాండ్ చేశారు. ఫీజు ల బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులచే సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను అందించకపోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. పేద విద్యార్థుల చదువుపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, యువమోర్చా నాయకులు విజేందర్రెడ్డి, నిశ్వంత్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణ వైభోగం.. మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధ వారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్బగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలతో కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరిరామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. చేపల సంరక్షణపై అవగాహన అమరచింత (ఆత్మకూర్): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు. -
చివరి బిల్లు ఎప్పుడో?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు ● జిల్లావ్యాప్తంగా రూ. 31కోట్లు బకాయి ● వడ్డీ భారం పెరుగుతుందని లబ్ధిదారుల ఆందోళన ● పీఎంఏవై–జీ నిధులు వస్తేనే బిల్లులు అందే అవకాశం నాగర్కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు కలగా మారుతోంది. బేస్మెంట్, రూప్, స్లాబ్ లెవల్ వరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ. 3.40 లక్షలు అందినా.. చివరి విడత బిల్లు కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో ఇంటికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.60లక్షల బిల్లు పెండింగ్లో ఉంది. జిల్లాలో ఇప్పటికే 2,019 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన దాదాపు రూ. 31కోట్ల బకాయిలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా చివరి బిల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పెరుగుతున్న అప్పుల భారం.. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న వెంటనే బిల్లులు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మూడు విడతల బిల్లులు రూ. 3.40లక్షలు మాత్రమే అందగా.. మిగతా రూ. 1.60లక్షలు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–జీ కింద చెల్లించాల్సి ఉంది. బిల్లులు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులకు అప్పు ల భారం తప్పడం లేదు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం అందించే రూ. 5లక్షలతో పాటు మరో రూ. 3లక్షల నుంచి రూ. 6లక్షలకు పైగా అదనంగా వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసుకున్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. రూప్ లెవల్ బేస్మెంట్ ప్రారంభించని నిర్మాణాలుఅప్పుచేసి నిర్మించుకున్నా.. బయట అప్పు తెచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం పూర్తిచేసుకున్నా. ఇంటికి రంగులు సైతం వేసుకున్నా. చివరి బిల్లు దాదాపు రూ. 1.20లక్షలు రావాలి. సకాలంలో బిల్లు రాకపోవడంతో అప్పుపై మరింత వడ్డీ పెరుగుతుంది. వెంటనే బిల్లు ఇప్పించి ఆదుకోవాలి. – సురేశ్, తాడూరు ఆందోళన వద్దు.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలి. బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అ వసరం లేదు. చివరి బిల్లు త్వరలోనే అందుతు ంది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనుల్లో వేగం పెంచడంతో పాటు ఇంకా ప్రారంభించని వారు మొదలుపెట్టాలి. రెండో విడతలో గుడిసెలున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. – గోపాల్నాయక్, పీడీ, హౌసింగ్శాఖ -
జిల్లావ్యాప్తంగా మోస్తరు వాన
● మెట్ట పంటలకు జీవం ● ఆనందంలో ఆన్నదాతలు కందనూలు: జిల్లావ్యాప్తంగా బుధవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురిసిన వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. కొన్ని రోజులుగా వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో సాగు ఆశలు చిగురించాయి. తిమ్మాజిపేటలో అత్యధికంగా 31.0 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో అత్యల్పంగా 16.8 మి.మీ. వర్షం కురిసింది. బిజినేపల్లిలో 30.3 మి.మీ., నాగర్కర్నూల్ మండలంలో 29.3 మి.మీ., బల్మూరులో 25.8 మి.మీ., కల్వకుర్తి మండలంలో 20.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. మోస్తరు వర్షంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. ఆయా ప్రాంతాల్లో సాగుచేసిన జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలకు కొంత మేలు చేసింది. ఇటీవల వర్షాలు కురువక మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు పలుచోట్ల వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షంతో భూమిలో తేమశాతం పెరిగి పంటలు కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడురోజులు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సాగు పూర్తిగా గాడిన పడుతుందని భావిస్తున్నారు. -
అడ్డంకులు తొలగేనా?
●65 శాతం పూర్తి.. జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్కు ఇబ్బందులను తొలగిస్తాం. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ప్రాజెక్టు సేకరించాల్సిన ఎస్డీఆర్ నోటిఫికేషన్ డిక్లరేషన్ అవార్డు భూమి నెట్టెంపాడు 389.88 103.55 91.59 75.34 9.90 గట్టు 462.66 – 9.71 – 212.94 తుమ్మిళ్ల 3.44 – – – 3.44 మల్లమ్మకుంట 567.45 – 67.44 – – భూసేకరణ పరిస్థితి ఇలా.. ఉమ్మడి జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులకు భూసేకరణ సమస్య భూ సేకరణ పూర్తయితేనేపెండింగ్ పనులు ముందుకు పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపైసీఎం ప్రత్యేక దృష్టి అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ వరుస సమీక్షలు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా అంటే.. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. -
మెరుగైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
కల్వకుర్తి టౌన్: ఉపాధ్యాయులు మెరుగైన విద్య అందించినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో సంపూర్ణ ప్రావీణ్యం కల్పించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్సర్వీస్ టీచర్ ట్రైనింగ్ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మంచి అభ్యసన అలవాట్లు పెంపొందితే.. వారి భవిష్యత్ విద్యాభ్యాసం మరింత సులభంగా సాగుతుందన్నారు. పుస్తక పఠనం ద్వారా భాషా నైపుణ్యాలు, పద సంపద, భావవ్యక్తీకరణ, అర్థగ్రహణ సామర్థ్యం పెరుగుతాయన్నారు. విద్యార్థులకు కేవలం ఉపన్యాస పద్ధతిలో కాకుండా, కార్యకలాపాల ఆధారిత బోధన, కథలు, పాటలు, ఆటలు, చిత్రాలు, బొమ్మలు, బోధనా–అభ్యాస సామగ్రి ద్వారా బోధనను ఆసక్తికరంగా మార్చాల ని ఉపాధ్యాయులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నాగర్కర్నూల్/కందనూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపై ఆక్రమణలు, అధిక వేగం, ట్రాఫిక్ నియమాలపై నిర్లక్ష్యం, అవగాహన లోపం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. వాటి నివారణకు దీర్ఘకాలిక కార్యాచరణతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రెండు జాతీయ రహదారులు కలిగిన కల్వకుర్తి ప్రాంతంలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా దిశానిర్దేశిత బోర్డులు, హెచ్చరిక సూచికలు, ప్రతిబింబించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర జంక్షన్ల వద్ద బ్లింకర్ లైట్లు ఏర్పాటుచేసి, వాహనదారులను అప్రమత్తంచేసే చర్యలు చేపట్టాలని తెలిపారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆర్టీఓను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. అచ్చంపేటలో ప్రతి శనివారం నిర్వహించే సంతతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచు, గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని లింగాల, అమ్రాబాద్, పదర, బల్మూర్, అచ్చంపేట మండలాల పరిధిలోని చెంచు గూడాలు, గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. ఆధార్ నమోదు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించి, ముందస్తు సమాచారంతో ప్రతి కుటుంబాన్ని నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆయా మండలాల పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులు తప్పనిసరిగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసి, గిరిజనులకు సేవలు అందించాలని ఎల్డీఎం చంద్రశేఖర్ను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు అందించడం ద్వారా రేషన్, పింఛన్లు, విద్యా పథకాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి హామీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందుతాయని.. ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో పాండు, డీఈఓ రమేశ్కుమార్ తదితరులు ఉన్నారు. -
కల్లుగప్పించి నిఘా!
కబోదిలా ఎకై ్సజ్ శాఖ నటన –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆల్ఫ్రాజోలం వంటి ప్రమాదకర మత్తు పదార్థాల రవాణా, తయారీపై నిఘా కట్టుదిట్టం చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వారు.. తమ కళ్ల ముందే జరుగుతున్న కల్తీ కల్లు విక్రయాలను మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈత, తాటి చెట్ల ఆనవాళ్లే లేకుండా మందుకల్లు పారిస్తున్న మాఫియాకు ముకుతాడు వేయాల్సింది పోయి.. కేవలం మూలాలు తొలగిస్తున్నామంటూ చేతులు దులుపుకొంటున్నారు. నెలనెలా అందుతున్న మామూళ్ల మత్తుతో ఈ దందాకు అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న కృత్రిమ కల్లు విక్రయాలు.. నాశనమవుతున్న పేద కూలీలు, కార్మికుల బతుకులపై ‘సాక్షి’ కథనం.. అనధికారిక దుకాణాలు.. కృత్రిమ కల్లు నిబంధనల ప్రకారం తాటి, ఈత, ఖర్జూర వనాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లు విక్రయించాలి. కానీ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో 75 శాతం వరకు మందు కల్లు విక్రయాలే జరుగుతున్నాయి. అంతేకాదు అన్ని జిల్లాల్లోనూ అధికారికంగా లైసెన్స్ కలిగిన కల్లు దుకాణాలకు మించి 50 శాతం మేర అనధికారికంగా నడుస్తున్నాయి. ● గద్వాల పట్టణ పరిధిలో ఒక డిపో ఉంది. దీని పరిధిలో అధికారికంగా ఎనిమిది దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం సదరు డిపోలో తయారు చేసిన కల్లును ఆయా షాపులకు మాత్రమే సరఫరా చేయాలి. ప్రస్తుతం ఆ డిపో అంశం కోర్టులో పెండింగ్లో ఉండగా.. కల్లు తయారీ నిలిచిపోయింది. కానీ అనధికారికంగా దాని పరిధితో పాటు చుట్టుపక్కల మండలాల్లోని సుమారు 17 గ్రామాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్యామ్యాలతో ఎర.. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కల్లు డిపోల నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారానికి అడ్డుతగలకుండా ఆమ్యామ్యాలు ఎర వేస్తున్నారు. డిపోకు సమకూరిన ఆదాయంలో ప్రాంతాన్ని బట్టి గీత వృత్తి, సొసైటీ దారులకు 40 నుంచి 50 శాతం, పోలీసులకు 3 నుంచి 5 శాతం, ఎకై ్సజ్ శాఖకు 10 శాతం, రాజకీయ నేతలకు 10 శాతం చొప్పున నెలనెలా వాటాలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. దీంతో కళ్ల ఎదుటే దందా జరుగుతున్నా.. ఎకై ్సజ్ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా తయారు చేస్తున్నారంటే.. 100 కేసులు అంటే 2,400 సీసాల కల్లు తయారీకి 2 వేల నుంచి 2,500 లీటర్ల సామర్థ్యమున్న పెద్ద డ్రమ్ములో నీరు పడుతున్నారు. ఇందులో పులుపు, తీపి కోసం కిలో చొప్పున నిమ్మ ఉప్పు/చక్కెర.. తెలుపు రంగు కోసం సిల్వర్ (వైట్).. నురుగుకు పావు కిలో చొప్పున శాక్రిన్, అర కిలో డ్రైఈస్ట్ వేస్తున్నారు. ఆ తర్వాత మత్తు గొలిపేందుకు తగినంత మోతాదులో నిషేధిత ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)లో ఏదో ఒక దాన్ని ఉపయోగిస్తున్నారు. అధిక శాతం మేర ఆల్ఫ్రాజోలం కలిపి కలబెడుతున్నారు. ఆ తర్వాత ఒక్కో సీసాను ఆయా ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ.25కి విక్రయిస్తున్నారు. కళ్ల ఎదుటే కల్తీ కల్లు విక్రయిస్తున్నా మౌనం మత్తు పదార్థాల రవాణా, తయారీ కట్టడికే పరిమితం మామూళ్లే కారణమని అధికారులపై విమర్శలు అనారోగ్య సమస్యలతో కూలీల బతుకులు ఛిద్రం ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిండ్రోమ్తో సతమతం -
30 నుంచి 40 శాతం వరకు బాధితులే..
మందు కల్లుతో అనర్థాలు చాలా ఉన్నాయి. మోతాదు మించి మత్తు కల్పితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వస్తున్న పేద రోగుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మంది ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారే. – డాక్టర్ బాలశ్రీనివాస్, ఫిజీషియన్, జీజీహెచ్, మహబూబ్నగర్ తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దమొత్తంలో ఈత వనాలు పెంచుతున్నాం. మందు కల్లు తయారీపై నిఘా పెట్టాం. తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిషేధిత ఆల్ఫ్రాజోలం ఇతరత్రా మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తప్పవు. – విజయ్భాస్కర్రెడ్డి, ఎకై ్సజ్ శాఖ డీసీ, మహబూబ్నగర్ ● -
శాసీ్త్రయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం
కోడేరు: శాసీ్త్రయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పటేల్ అన్నారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీసీ ద్వారా నిర్వహించగా కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి రైతువేదికలో పాల్గొని మాట్లాడారు. రైతులకు సరైన సమయంలో సరైన సాంకేతిక సలహాలు అందించడం వల్ల వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చన్నారు. రైతులు సంప్రదాయ సాగు విధానాలతోపాటు శాసీ్త్రయ పద్ధతులు అవలంభిస్తే ఉత్పాదకత పెరగడంతోపాటు సాగు వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి చెందిన రైతులు వీరారెడ్డి, లోకేశ్వర్, బాలరాజులను శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు అభినందించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్, మహాత్మజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, ఇందిరమ్మ ఇళ్లు, స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. సర్ డిజిటలైజేషన్ పూర్తిచేయండి.. మండలంలోని పస్పులలో చేపట్టిన సర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా రూపొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సేకరించాలని అవసరమైతే కుటుంబ సభ్యుల సమాచారం తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయరాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఎం కృష్ణ, అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ జమీల్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఆర్ఐ సురేందర్, సర్పంచ్లు సుల్తానమ్మ, మహేశ్వర్రెడ్డి, ఏపీఎం గౌస్, వ్యవసాయాధికారి నాగజ్యోతి, శిరీష, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీసర్వేలో వేగం పెంచాలి
తిమ్మాజిపేట: భూముల రీసర్వేలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మండలంలోని మరికల్ గ్రామంలో భూముల రీసర్వే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సర్వేయర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పైలెట్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎంపిక చేసిన మరికల్ గ్రామంలో భూముల సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేస్తే మీ మండలంలో మరో గ్రామం ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. రీసర్వేకు సంబంధించిన పురోగతి ఏ మేరకు రీసర్వే చేస్తున్నారు.. ఇంకా జరగాల్సిన రీ సర్వే వివరాలను మండల సర్వేయర్ సాయిబాబను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలోని చెరువులు, కుంటల సర్వే కొనసాగుతుందని, సర్వేయర్ల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. లైసెన్సుడ్ సర్వేయర్లు తమకు పారితోషికం రావడం లేదని సర్వేకు దూరంగా ఉంటున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరో ఇద్దరు సర్వేయర్లను కేటాయించాలని కోరగా.. లైసెన్సుడ్ సర్వేయర్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, జిల్లా సర్వేయర్ గిరిధర్, తహసీల్దార్ జయంతి, ఎంఆర్ఐ అ నురాధ, జీపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల రవాణా అంశాలపై సమస్యలు, సలహాలు తెలిపేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నం.94937 33602కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. మద్దిమడుగు ఆలయ హుండీ లెక్కింపు అమ్రాబాద్: పదర మండలంలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం హుండీని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సమక్షంలో లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం రూ.59,38,103 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదు కానుకలతోపాటు మిశ్రమ వెండి 2.600 కిలోలు వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈఓ రంగారావు, అధికారులు పరందామరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, నాగరాజు, అర్చకులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● నల్లమలలోని మద్దిమడుగుక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం ● రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అమ్రాబాద్/ మన్ననూర్: ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన అమ్రాబాద్, పదర మండలాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు. అనంతరం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పక్కనే ఉన్న గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహరాజ్ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన మద్దిమడుగు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ఆలయ సమీపంలో సంతు సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టేందుకు వచ్చినట్లు చెప్పారు. రూ.100 కోట్లతో సంతు సేవాలాల్ మహరాజ్ విగ్రహ ఏర్పాటుతోపాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనల మేరకు అటవీశాఖ అడ్డంకులు లేని ప్రతి చెంచు పెంట, గిరిజన తండాలకు రోడ్లు వేయిస్తామన్నారు. పదర నుంచి మద్దిమడుగు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి మద్దిమడుగు వచ్చి హరిత హోటల్తోపాటు సంతు సేవాలాల్ విగ్రహం ఏర్పాటు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మద్దిమడుగు వరకు మంత్రి సహకారంతో ఏడాదిలోగా డబుల్ రోడ్డు పూర్తి చేస్తానన్నారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన మన్ననూర్లో రూ.9.30 కోట్లతో నిర్మించనున్న పీటీజీ పాఠశాల భవనానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్లే గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అంతకు ముందు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి.. డార్మెంటరీ, కిచెన్, భోజనాలు, తాగునీటి సౌకర్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన విద్యా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, జెడ్పీసీఈఓ గోపాల్నాయక్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ వెంకటయ్య, ఆర్సీఓ కల్యాణి, ఆర్డీఓ యాదగిరి, మద్దిమడుగు ఆలయ ఈఓ రంగారావు, సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ రమణగౌడ్, ఎంపీడీఓ రామన్న, ప్రిన్సిపల్ సాయిబాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక సర్వసభ్య సమావేశాలు
● ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోయినా నిర్వహణ ● పత్యేకాధికారి నేతృత్వంలో సర్పంచులు, కార్యదర్శలు, డివిజన్ అధికారులతో కొనసాగింపు ● ప్రతి 45 రోజులకోసారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● గ్రామాల అభివృద్ధితోపాటుసమస్యల పరిష్కారానికి చర్యలు ● రేపు తేదీలు ఖరారు చేయనున్న జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చాయి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 మండలాల్లో మండల సర్వసభ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమావేశాలు చేపట్టే విధానం, తేదీల ఖరారు కోసం గురువారం జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నాం. మండల ప్రత్యేకాధికారులతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశంలో చర్చించి.. తేదీలు ఖరారు చేస్తాం. – దేవసహాయం, అదనపు కలెక్టర్, ఇన్చార్జి జెడ్పీసీఈఓ మంచి పరిణామం.. ప్రభుత్వం మండల సర్వసభ్య సమావేశాలు 45రోజులకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. దీనివల్ల గ్రామంలోని సమస్యలు అధికారులందరికీ ఒకచోట చెప్పుకొనే అవకాశం లభిస్తుంది. గతంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం సమావేశాలు సమస్యలకు పరిష్కారం చూపే విధించగా పకడ్బందీగా నిర్వహించాలి. – ఆంజనేయులు, సర్పంచ్, జీడిపల్లి నాగర్కర్నూల్: ఇక నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల సర్పంచులు, కార్యదర్శులతోపాటు సంబంధిత మండల అధికారులు సమావేశాల్లో పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సీఈఓ అధ్యక్షతన జిల్లాకేంద్రంలో ఎంపీడీఓలతో సమావేశాలు నిర్వహించి.. ఆయా మండల సర్వసభ్య సమావేశాల తేదీల ఖరారు, నిర్వహించే విధానంపై చర్చించనున్నారు. ఎన్నికల ఆలస్యంతో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి నిర్వహించేవారు. రెండేళ్ల కిందట వారికాలపరిమితి ముగియడంతో ఆ సమావేశాలు లేకుండాపోయా యి. వాటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడంలోనూ ఆలస్యమవుతుండటం వల్ల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పట్టింపు లేకు ండాపోయింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు లేకపోయినా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో.. మండల, జెడ్పీ పాలకవర్గాలు ఉన్న సమయంలో సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా నిర్వహించేవారు. వీటికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు డివిజన్ స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవారు. ఈ క్రమంలో సమావేశాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అధికారుల పనితీరుపై నిలదీసేవారు. కానీ, 2024 జూన్ 24న గత పరిషత్ పాలకవర్గం ముగిసింది. అప్పటి నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు లేకుండా పోయాయి. ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారులు బాధ్యత వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్, కలెక్టర్లు ఈ ఆదేశాలను ఆయా జిల్లాలో వెంటనే అమలు చేయాలని చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల వద్దనే.. సర్వసభ్య సమావేశాలు లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల నాయకులు ఎమ్మెల్యేల వద్ద విన్నవించుకొని అధికారులకు చెప్పించి పరిష్కంచేవారు. సర్పంచులు వచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొని తీర్చుకుంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సర్పంచులు ఎవరి వద్దకు వెళ్లి వారి గ్రామాల సమస్యలు విన్నవించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి
ఎర్రవల్లి: క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. స్థానిక పదో బెటాలియన్లో సోమవారం వార్షిక స్పోర్ట్స్ మీట్–2027లో భాగంగా పలు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమన్నారు. అదే విధంగా సిబ్బందికి క్రమశిక్షణ, సమన్వయం ఉంటుందన్నారు. మూడు రోజులపాటు జరిగే క్రీడా పోటీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా 100, 400 మీటర్ల పరుగుపందెం, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, 5కే రన్, క్రికెట్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, పాణి వెంకటరమణ, ఆర్ఐలు రాజు, ఆర్పీ సింగ్, నరసింహరాజు, శ్రీనివాసులు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఓపెన్ యూనివర్శిటీ కోర్సులు
అమ్రాబాద్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్శిటీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని ప్రిన్సిపాల్, అంబేడ్కర్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ గోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఓపెన్ యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ బీకాం, బీఏ, బీఎస్సీ గ్రూపులు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాలకు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కన్నారు. విద్యార్థులు ఆధార్కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమో, కులము, ఆదాయం సర్టిఫికెట్లు, ఫొటోతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఓపెన్ యూనివర్శిటీ స్టడిసెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
నకిలీ డొంక కదిలేనా?
జిల్లాలో 593 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం ● మరో 38 ఖాళీ సంచుల గుర్తింపు ● ఇంకా 3వేలకు పైగా బస్తాలు విక్రయించినట్లు అనుమానాలు ● పోలీసుల విచారణతో బయటికి చెప్పేందుకు జంకుతున్న రైతులు రూ. 50లక్షలకు పైగా టోకరా.. నివేదిక రాలేదు.. నకిలీ డీఏపీ బస్తాల నుంచి సేకరించిన ముడిసరుకును పరీక్షల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపాం. ఇంకా నివేదిక రాలేదు. వాస్తవానికి ఆ ఎరువులు పూర్తిగా నకిలీవి. వాటితో రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదు. రైతులు ఇలా నమ్మి కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలి. – చంద్రశేఖర్, డీఏఓ -
పోలీసు గ్రీవెన్స్కు 12 ఫిర్యాదులు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలు గ్రామాల నుంచి 12మంది రాగా.. ఎస్పీ స్వయంగా వారి సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. 8 భూ తగాదాలపై, 4 తగు న్యాయం కోసం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కందనూలు: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026లో పదో తరగతి ఉత్తీర్ణులై 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు పదో తరగతి మెమో, బోనపైడ్, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 90594 43450 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. 6 నుంచి పాదయాత్ర నాగర్కర్నూల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6నుంచి 14వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా, దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. యువతను మతం, కులం పేరుతో రెచ్చగొడుతూ, నిరుద్యోగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని పాదయాత్ర ద్వారా తెలియజేస్తామని తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, రవీందర్, కేశవులుగౌడ్, నర్సింహ, శ్రీనివాసులు, ఖాజా, శివుడు, లక్ష్మీపతి, కిరణ్కుమార్, మల్లయ్య, పరుశరాములు, మధుగౌడ్ ఉన్నారు. -
హే.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. రాష్ట్రంలో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు ఆందోళనలో అన్నదాతలు -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
కందనూలు: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఉదయం నుంచి క్యూ కట్టారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. మొత్తం 54 అర్జీలు అందగా.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మాత్రమే కాదని.. ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపే బాధ్యతాయుతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. అధికారులు ప్రతి ఫి ర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా నిర్లక్ష్యానికి గురికాకుండా సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మా భూమిలోకి రానిస్తలేరు..
నా భర్త పేరు అంకూర్ భీమ్రాజ్. మాకు ఊర్కొండ మండలం మాధారం శివారులోని సర్వేనం. 376/30లో ఐదెకరాల గైరాన్ భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిలో 36 గుంటల పొలాన్ని కట్ చేసి.. 1994లో 4.04 ఎకరాల పొలాన్ని పట్టాదారు పాస్బుక్లో నమోదు చేశారు. అప్పటి నుంచి పొలాన్ని సాగుచేస్తున్నాం. 2025లో నాభర్త గుండెపోటుతో మరణించారు. నాటి నుంచి కొందరు వ్యక్తులు మేము సాగుచేస్తున్న భూమి వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మేము స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్తే.. ఆయన కూడా బయటి వారికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. – అంకూర్ అన్నపూర్ణ, మాధారం, ఊర్కొండ మండలం -
సీజేపీ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతాం
చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్పాషా, జహంగీర్పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
● రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● బ్రహ్మగిరిలో పల్లె దవాఖానా ప్రారంభం అచ్చంపేట/వంగూరు: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరిలో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన పల్లె దవాఖానా ప్రారంభించారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండటం కోసమే ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మహిళల ఆర్థికాబివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రూ. 10లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయితే సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని అన్నారు. అంతకు ముందు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ మొయిజ్, అభిలాష్, డా.తారాసింగ్, అంతటి మల్లేష్, చింతల రాజ్గోపాల్, లోక్యానాయక్ పాల్గొన్నారు. -
తలలు పట్టుకుంటున్న బీఎల్ఓలు..
క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి స్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఓవైపు నిర్ణీత గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారులుగా నియమించిన వారి నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలా మంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్కార్డులు ఎప్పుడిస్తారు? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి 1.5 శాతం వేతనంలో కోత విధిస్తూ హెల్త్కార్డులు జారీ చేయకపోవడం తగదని ఎస్జీపీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓల భవనంలో నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్జీపీఏటీ) కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంతవరకు ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోకుండా, హెల్త్కార్డులు జారీ చేయకుండా కాలం గడుపుతోందని ఆరోపించారు. అంతేగాక వైద్యం తమకు తాముగా చేయించుకుంటే రీయింబర్స్మెంట్ ఆపేస్తామనడం సరికాదన్నారు. రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైద్యసేవలు అందక, పెన్షన్ బకాయిలు రాక వంద మందికిపైగా మృతిచెందినా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, బాలస్వామి, వెంకటస్వామి, సురేష్, అంజిలయ్య పాల్గొన్నారు. -
30న ఎల్నినోపై గ్రామసభలు : కలెక్టర్
నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు, రైతులను అప్రమత్తం చేయడం, ముందస్తు చర్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న అన్ని జీపీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామసభల్లో రైతులు, గ్రామస్తులకు ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ‘పసరంటిన కొడవలి’ పుస్తకావిష్కరణ కందనూలు: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రచయిత వనపట్ల సుబ్బయ్య రచించిన పసరంటిన కొడవలి పుస్తకాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మల జీవిత చరిత్ర, తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. మానవ సంబంధాలను పెంపొందించుకుని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రొ.కోటేశ్వర్రావు, వహిద్ఖాన్, వనపట్ల సర్పంచ్ వాసుదేవుడు, కోట్ల నిరంజన్రెడ్డి, కొండకింది మన్యపురెడ్డి, కవులు తగుళ్ల గోపాల్, ఎదిరెపల్లి కాశన్న పాల్గొన్నారు. పక్కాగా ఆరోగ్య సర్వే కందనూలు: ఆరోగ్య సర్వేలో భాగంగా వైద్యసిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి.. ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు, ఈశ్వర్ కాలనీల్లో ఆరోగ్య సర్వేను ఆయన పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలన్నారు. అదే విధంగా టీబీ, పక్షవాతం, క్యాన్సర్తో బాధపడుతున్న వారి వివరాలతో పాటు గర్బిణుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, ఉపాధ్యాయ పోస్టులను భరీ చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సతీష్, సత్యనారాయణ, కరుణాకర్రెడ్డి, మల్లయ్య ఉన్నారు. నేడు హుండీ లెక్కింపు అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లోని హుండీని సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం తాడూరులో ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, హక్కుల సాధన కోసం కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి.. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరుశరాములు, కిరణ్కుమార్, జైపాల్రెడ్డి, ఫయాజ్, శివశంకర్, సత్యం పాల్గొన్నారు. -
‘గోకారం’ నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించి.. తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 237వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గోడును అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాసితులు ప్రకాశ్, పర్వతాలు, నాగయ్య నాయక్, శ్రీరాం, పెద్దయ్య, గోపి, సంజీవ, ఎల్లమ్మ పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు పోరాటం కొల్లాపూర్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు ఎంప్లాయిస్ యూనియన్ పోరాడుతోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. ఆదివారం కొల్లాపూర్లో నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. త్వరలో జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఆయన సమక్షంలో టీఎంయూ, టీజేఎంయూ సంఘాలకు చెందిన 70 మంది ఎంప్లాయిస్ యూనియన్లో చేరారు. సమావేశంలో యూనియన్ డిపో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్గా సిబ్బది నర్సింహారావు, అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ మద్దిలేటి, కోశాధికారిగా సాయిఈశ్వర్, ప్రచార కార్యదర్శులుగా నిస్సార్పాష, రామకృష్ణ, నిరంజన్, ముఖ్య సలహాదారులుగా రామయ్యయాదవ్, జీఎం కృష్ణను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
ఉత్సాహంగా జిల్లా అథ్లెట్ల ఎంపికలు
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 జిల్లా అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. త్వరలో హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు మాట్లాడుతూ.. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర చాంపియన్షిప్కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అంజయ్య, సురేందర్, ప్రసాద్, నిరంజనమ్మ, నారాయణ, తురాబ్, భీమయ్య, జ్యోతి, భారతి పాల్గొన్నారు. -
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. పాలమూరులో సాగు, తాగునీటి ఇబ్బందులు
మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ -
బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు
కొల్లాపూర్: ఎవరైనా 18 ఏళ్లు దాటని అమ్మాయిలకు వివాహాలు చేసినా, వారికి తప్పుడు ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు వివాహాలు జరిపించాలని సూచించారు. తక్కువ వయసులో వివాహం చేయడంతో కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
సొంతూరులోనే ఓటేస్తాం!
పల్లెల్లోనే ఓటరు నమోదుకు మొగ్గు ● స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు పట్టణాల్లో మందకొడిగా.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేయాలి. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లు గుర్తించాలి. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా పేర్కొన్నాలి. ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం అన్కలెక్టబుల్ మహబూబ్నగర్ 7,32,488 5,93,167 86.12 55,743 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 79.38 56,482 వనపర్తి 2,75,570 2,18,488 79.29 16,515 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 83.32 43,961 నారాయణపేట 4,95,574 3,93,911 79.49 45,959 మొత్తం 27,39,123 22,06,332 80.54 2,18,660 ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. -
ఫోన్లో వివరాలు చెబుతున్నారు..
ఓటరు మ్యాపింగ్లో స్థానికంగా లేని వారి ఓట్లు తీయాల్సి వస్తుందని అనుకున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిన వారు, ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు ఫోన్లు చేసి వివరాలు చెబుతున్నారు. కొందరు స్వయంగా గ్రామానికి వచ్చి ఫారాలు నింపి ఇస్తున్నారు. – ఆప్పోజు పద్మ, బీఎల్ఓ, ఉప్పునుంతల పుట్టిన ఊర్లో ఉండాలని.. నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా స్వంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులందరికీ ఓటు హక్కు.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టి, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ -
కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
పర్యవేక్షణ గాలికి..!
20 మండలాల్లో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ మాత్రమే ● జీహెచ్ఎంలకు ఇన్చార్జి బాధ్యతలు ● పాఠశాలల నిర్వహణ, విద్యాపరమైన వ్యవహారాలతో పని ఒత్తిడి ● గాడితప్పుతున్న విద్యావ్యవస్థ ●దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీ అంశాన్ని విద్యాశాఖ పట్టించుకోకపోవడం విచారకరం. జీహెచ్ఎంలకు అదనపు బాధ్యతలతో పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఈఓల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి. – మల్లిఖార్జున్, తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గి విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడి పెరిగి పూర్తి పర్యవేక్షణ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి ఎంఈఓలను నియమించాలి. – మధుసూదన్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్చార్జి ఎంఈఓలు ఉండటంతో ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెగ్యులర్ ఎంఈఓల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. ప్రభుత్వ పాఠశాాలలపై పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. అందరి సమన్వయంతో బడుల బలోపేతానికి కృషి చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ కందనూలు: సర్కారు పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ఇన్చార్జీలతో నెట్టుకొస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యాపరమైన వ్యవహారాల పర్యవేక్షణ నానాటికీ కొరవడుతోంది. జిల్లావ్యాప్తంగా ఒక మండలంలో తప్ప.. మిగతా అన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే అదనపు బాధ్యతలతో ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో విద్యావ్యవస్థ గాడితప్పుతుందోన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా ఇన్చార్జీలే.. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 495, ప్రాథమికోన్నత 124, ఉన్నత పాఠశాలలు 130 ఉన్నాయి. ఒక కల్వకుర్తి మండలంలో మాత్రమే శంకర్నాయక్ రెగ్యులర్ ఎంఈఓ ఉండగా.. మిగతా 19 మండలాల్లో జీహెచ్ఎంలు ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఎమ్మార్సీలో ఎంఈఓతో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, అటెండర్తో పాటు రాత్రి కాపలాదారు ఒకరు ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం ఒక్క విద్యాధికారి మాత్రమే అన్ని తానై పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యవసర పని నిమిత్తం ఎంఈఓ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ వారు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తనిఖీలు.. చర్యలు శూన్యం ప్రైవేటు విద్యాసంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది. అయితే జిల్లాలో కేవలం ప్రభుత్వ బడుల పర్యవేక్షణకు పరిమితమవుతూ.. ప్రైవేటు పాఠశాలల తనిఖీలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల మేరకు యాజమాన్యాలు బోధనకు సంబంధించి విద్యార్హతల వివరాలు యూడైస్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు అనర్హులతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. బోధనా ప్రమాణాలు పాటించని ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యాధికారులు, ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా ఉండకపోవడంతో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షకు మండల విద్యాధికారులు కిందిస్థాయి ఉద్యోగులు, స్కూల్ అసిస్టెంట్లను పంపించడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఓ ఎంఈఓపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల పనితీరుపై సైతం కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఆ ప్రాంత ఉపాధ్యాయుల డిప్యూటేషన్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రంగంలోకి దిగి.. తరచుగా పాఠశాలల తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖలో మార్పు వస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. -
ఫీజు బకాయిలపై నిర్లక్ష్యం తగదు
కందనూలు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజు బకాయి.. బీజేపీ లడాయి అంశంపై ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ. 15వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజులను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉన్నత విద్య చదువుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి.. విద్యార్థుల లడాయి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దన్నోజు నరేశ్చారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి తిరుమల్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ ఉన్నారు. కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు -
తొలి ఏకాదశి వైభవం
పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు జిల్లావ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి.. ఆలయాల్లో విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం, లొద్ది మల్లయ్య క్షేత్రాలతో పాటు సోమశిల సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. సోమశిలలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామి దర్శనానికి క్యూ కట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. 9లో.. -
సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం
నాగర్కర్నూల్/కందనూలు: సోలార్ ఇంధన వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రోత్సహిస్తూ.. గ్రీన్ ఎనర్జీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గ్రీన్ ఎనర్జీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయ పంపుసెట్లను కూడా దశలవారీగా సోలార్ విద్యుత్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. తద్వారా రైతులపై విద్యుత్ భారం తగ్గడమే కాకుండా.. నిరంతర విద్యుత్ సరఫరాకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో విజయవంతంగా అమలవుతున్న సోలార్ విద్యుత్ నమూనాను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, తూడుకుర్తిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. సోలార్ ఎనర్జీ ఏర్పాటుకు 639 ఇళ్లను గుర్తించి, ఇప్పటికే 78 ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగిందని అధికారులు వివరించారు. అలాగే కొండారెడ్డిపల్లిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్, 101 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్శాఖ అధికారి మోహన్రెడ్డి, డీఈ శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనను కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షయ నివారణకు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైతే అక్కడికక్కడే శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. తద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, బాధితులకు సత్వర చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం జరగకుండా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సహాయం, ఉచిత మందులు, వైద్య పరీక్షలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని మండల వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ ఉన్నారు. -
అడ్మిషన్లు ‘ఓపెన్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన మండలాల్లో.. ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం సర్టిఫికెట్కు రెగ్యులర్ కోర్సులతో సమాన ప్రాధాన్యం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఆన్లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్లు.. గతేడాది ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణత పొందినవారు ఇలా.. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
నేడు డయల్ యువర్ డీఎం
కందనూలు: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ డిపో పరిధిలోని ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఫోన్ నంబర్ 99592 26288 ను సంప్రదించి రవాణా సమస్యలు తెలియజేయడంతోపాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను చిన్నజీయర్ స్వామి ఎమ్మెల్యే రాజేష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యారంగంలో మౌళిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కౌన్సిలర్లు, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అచ్చంపేట రూరల్: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్యాసంస్థల బంద్ ప్రశాంతం కందనూలు: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయ కులు తారాసింగ్, వంశీ, శివప్రసాద్, అరుణ్, రామకృష్ణ, కురుమయ్య పాల్గొన్నారు. 8, 9 తేదీల్లో సాహిత్య సదస్సు స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యం అనే అంశంపై రెండురోజులపాటు సాహిత్య సదస్సు ఉంటుందన్నారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యంపై పరిశోధనలు సమర్పించాలనుకున్న సాహితీవేత్తలు, పరిశోధకులు తమ పేర్లను నమోదు చేసుకొని పత్రాలను ముందస్తుగా సంస్థకు పంపించాలని కోరారు. -
కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అమ్రాబాద్: కేసుల నమోదు, పరిష్కారంలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ సంగ్రామ్సింగ్ జిపాటిల్ ఆదేశించారు. అమ్రాబాద్ పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ పల్లె శ్రీనివాసులు తో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్స్టేషన్ పరిసరాలు తిరిగి పరిశీలించారు. కేసుల నమోదు, క్రైమ్ రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ, సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ క్రైమ్రేట్ తగ్గించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ చంద్రయ్య, ఎస్ఐ హన్మంత్రెడ్డి ఉన్నారు. -
డిజిటలైజేషన్లో వేగం పెంచాలి
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి/కోడేరు: సర్పై బీఎల్ఓలు, బీఎల్ఏలు సీరియస్గా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఆయన కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరులోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సర్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా ఇప్పటివరకు జరిగిన ఓటర్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను మంత్రి తెలుసుకున్నారు. నిరక్షరాస్యులైన ఓటర్లు చాలా మంది ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారి ఇళ్ల వద్దకు బీఎల్ఓలు, బీఎల్ఏలు వెళ్లి వారికి అవసరమైన సహయం అందించాలని సూచించారు. బూత్ల వారీగా ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసులు, జమీల్, కాంగ్రెస్ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సత్యం, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రుడికి చేయూత కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండలంలోని నార్లాపూర్కు చెందిన కావలి మల్లేష్ ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ సమయంలో కొల్లాపూర్ పర్యటనను ముగించుకొని అటుగా వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గమనించి తన ఎస్కాట్ వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించి వెంటనే కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కొల్లాపూర్లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
కందనూలు: రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ వ్యవసాయాధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్నినో, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, నీటి సంరక్షణ చర్యలు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావాన్ని తేలికగా తీసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వర్షాభావానికి గురయ్యే మండలాలు, గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా పత్తి, కందులు, మినుములు, పెసలు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, మార్కెటింగ్ అవకాశాలు, కనీస మద్దతు ధరలపై గ్రామస్థాయిలో విసృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వృథాను అరికట్టేందుకు ‘జల ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు దేవ సహాయం, చెన్నయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలి
నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖకు వెంటనే పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రేమ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలు అనేకచోట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అత్యవసరంగా మరమ్మతు చేసి అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించి అన్ని మౌళిక వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఫణి, అర్జున్, చరణ్, యశ్వంత్, అనిల్, రవీందర్, ప్రవీణ్, లక్ష్మణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులతో రాజకీయం చేయడం తగదు
నాగర్కర్నూల్: నకిలీ డీఏపీ సూత్రదారులపై పీడియాక్ట్ నమోదు చేయాలని, రైతుల జీవితాలతో రాజకీయం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందా.. లేక వారి అనుచరుల హస్తం ఉందా అనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వలన వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా తెచ్చిన కరువని దుయ్యబట్టారు. మొక్కజొన్న కొనుగోలులోనూ గన్నీ బ్యాగుల ట్రాన్స్పోర్టు డబ్బులు, బిజినేపల్లిలో రైతులను ముంచిన దళారులు, నకిలీ డీఏపీ సూత్రదారులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన 34 శాతం నీటి వాటాలో కేవలం 22 శాతమే వినియోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీశైలం, హన్మంతురావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలు ● తెలంగాణ స్కూల్గేమ్స్ షెడ్యూల్ విడుదల ● వచ్చేనెల మొదటి వారం నుంచి నాలుగు దశల్లో పోటీల నిర్వహణ మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ 14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. ఎంతో మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు విద్యార్థులకు ఒక వేదికలా ఉపయోగపడుతున్నాయి. ● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్జీఎఫ్ పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నుంచి ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్రీడా షెడ్యూల్ను ఇటీవల విడుదల చేశారు. నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా (జోనల్), రాష్ట్రస్థాయిల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించుకొని పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా షెడ్యూల్ విడుదలకావడంతో ఇక క్రీడల సందడి నెలకొనుంది. ఈవెంట్ క్రీడలు నిర్వహించే సమయం మండలస్థాయిలో టోర్నీలు ఆగస్టు మొదటి, రెండో వారం జోనల్ టోర్నీ కమ్ సెలక్షన్స్(అంతర్ మండలాలు) ఆగస్టు మూడో వారం ఉమ్మడి (జోన్) జిల్లాస్థాయి టోర్నీకమ్ సెలక్షన్స్ సెప్టెంబర్ రెండో వారం రాష్ట్రస్థాయి పోటీలు (పది ఉమ్మడి జిల్లాలస్థాయి) సెప్టెంబర్ నాలుగో వారం ఎస్జీఎఫ్ వివరాలు.. పకడ్బందీగా నిర్వహిస్తాం... ఈ ఏడాది అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలను వ్యాయా మ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గత ఏడాది వనపర్తి జిల్లాలో నాలుగు ఎస్జీఎఫ్ హాకీ టోర్నీలు నిర్వహించాం. ఈ ఏడాది కూడా జిల్లాకే ఏమైనా రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయిస్తే విజయంతంగా నిర్వహిస్తాం. – బి.కుమార్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, వనపర్తి -
నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
కందనూలు: నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం అని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీసుస్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అన్నారు. నేరాల నియంత్రణ, నేరస్తులను త్వరితగతిన గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమైనదని, పట్టణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మంజూరు చేసిన నిధులతో మెగా కంపెపీ, వ్యాపారులు ఇచ్చిన విరాళాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిఘా వ్యవస్థను జిల్లావ్యాప్తంగా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా బిజినేపల్లిలో 32, కుమ్మెరలో 6, నాగర్కర్నూల్ పట్టణంలో 25, తిమ్మాజిపేటలో 17 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సీఐ కార్యాలయం తనిఖీ వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ నాగర్కర్నూల్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారు ఇచ్చే ప్రతి ఫిర్యాదును వేగంగా స్పందించి పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని రౌడీషీటర్ల వివరాలు తెలుసుకుని.. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఎలాంటి కేసులు పెండింగ్లో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
పాన్గల్: ఎల్నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్, శాగాపూర్తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
చేయూతపై ఆశలు..
దాదాపు నాలుగేళ్ల తర్వాత రానున్న కొత్త పింఛన్లు నాగర్కర్నూల్: ఎన్నో ఏళ్ల నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వివిధ కేటగిరిల లబ్ధిదారుల కల ఎట్టకేలకు ఫలించనుంది. గత నాలుగేళ్లుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేసిన పాలక ప్రభుత్వాలు వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా కసరత్తు ప్రారంభించాయి. కొత్త పింఛన్లు ఇవ్వకుండా లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో అర్హులైన భర్త లేక భార్యకు రెండున్నరేళ్ల నుంచి ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ కార్యాలయాలు, మండల పరిషత్ల చుట్టూ పింఛన్ల కోసం ప్రదక్షిణలు చేసేవారు. ఎమ్మెల్యేలు, నాయకులు కలిసిన చోటల్లా దండాలు పెట్టేవారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం కనికరించి.. ఆగస్టు 15న కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై బ్యాంకు ఖాతాలోనే.. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 1,02,976 మం ది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. నెలవారిగా రూ.24.83 కోట్ల మేర నిధులు వారికి అందజేస్తున్నారు. దివ్యాంగులకు రూ.4,016 చొప్పన పింఛను ఇస్తుండగా.. ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు. వీరికి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇక నుంచి పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారానే అందజేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టా ఫీసుల్లో తీసుకునే వా రికి సైతం బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా ఖాతాలు తెరిపించారు. ఇక నుంచి పింఛను లబ్ధిదారుల అందరూ బ్యాంకుల ద్వారానే పెన్షన్ పొందాల్సి ఉంటుంది. వారందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అప్డేట్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. అయితే 2022 ఆగస్టు 31 నుంచి ఈ పథకం ద్వారా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు ఇస్తామని ప్రకటన వెలువడగానే ఆనందపడుతున్నారు. దివ్యాంగులు 12,014 అనర్హులవి ఏరివేత.. ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ అథెంటికేషన్) ప్రక్రియ నిర్వహించింది. మంత్ర యాప్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఆ ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసింది. జిల్లాలో ఉన్న పింఛన్ల లబ్ధిదారుల్లో దాదాపు 2,373 మంది చనిపోయినట్లు గుర్తించారు. మరో 1,860 మంది అందుబాటులోకి రాలేదని తేలింది. మొత్తంగా దాదాపు 4,233పైగా పాత లబ్ధిదారుల పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఆదేశాలు రాలేదు.. కొత్త పింఛన్ల పంపిణీపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సూచనలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ఏ పని చేసుకోలేను.. నాకిప్పుడు 66 సంవత్సరాలు. గత మూడు సంవత్సరాల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు చేతకాక పోవడంతో ఏ పని చేసుకోవడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వం త్వరగా పింఛన్ ఇచ్చేలా చూడాలి. – బాలయ్య, జూపల్లి, చారకొండ మండలం వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు ఆనందంలో అర్హులైన లబ్ధిదారులు కొత్తగా మరో 50 వేల మందికిపైనే అవకాశం జిల్లాలో ఇప్పటికే 1,02,976 మంది లబ్ధిదారులు బీడీ 23 కల్లుగీత 688 -
సర్కారు బడుల్లో ‘లిప్’
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంగ్లంలోనే కాకుండా మాతృభాష తెలుగులోనూ తడబడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో గణితంలోనూ పిల్లలు వెనకబడుతున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం విద్యాశాఖ ఉన్నత పాఠశాలల్లో లిప్ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల పిల్లలకు ఈ విద్యాసంవత్సరం నుంచి అభ్యసన నైపుణ్యాలు పెంపొందించడం కోసం అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే జిల్లాలో ఉపాధ్యాయ నిపుణులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నమూనా పరీక్షల్లో తడబాటు అభ్యసన సామర్థ్యాల్లో పిల్లలు తడబడుతున్నారు. తరగతికి తగినట్లుగా నేర్చకోవడం లేదని స్పష్టమైంది. తెలుగు, ఆంగ్లంతోపాటు కూడికలు, తీసివేతలు కూడా చేయడం లేదని తేలింది. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 7 నుంచి 11 వరకు బేస్లైన్ పరీక్షలు ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి లోపాలను గుర్తిస్తారు. తర్వాత ప్రత్యేక విద్యాబోధన ద్వారా మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటారు. బేస్లైన్, ఎండ్లైన్ పరీక్షల ఫలితాలను పోల్చి విద్యార్థుల పురోగతిని విశ్లేషిస్తారు. దీని ఆధారంగా వెనకబడిన విద్యార్థులకు విద్యాసాయం అందిస్తారు. ఈ ఫలితాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఈ నెల 31లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బేస్లైన్ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను అప్లోడ్ చేయడంపై తెలంగాణ ఎస్సీఈఆర్టీ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విద్యార్థులకు వర్క్బుక్స్.. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)లో భాగంగా 6, 7, 8, 9వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల వర్క్బుక్స్ అందజేస్తారు. ప్రతిరోజు ప్రత్యేకంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా మల్టీలెవల్ విద్యాబోధన చేస్తారు. నిరంతర మూల్యంకనం ఉంటుంది. చదువు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక రీడింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు కాలానుగుణంగా ప్రణాళికలు, లక్ష్య నిర్ధారణ, విద్యార్థుల పురోగతి సమీక్ష, వర్క్బుక్ ఆధారిత బోధనపై దృష్టిసారించనున్నారు. లిప్పై బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఇప్పటికే ఆదేశించారు. ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యసన సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలు వెనకబడిన సబ్జెక్టుల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన ఉపాధ్యాయులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు అమలు చేస్తున్నాం.. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా లిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులపై పోకస్ ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే బేస్లైన్ పరీక్షలు నిర్వహించాం. విద్యార్థులు భాషా ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి. ఫలితాలను గడువులోగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. – రమేష్కుమార్, డీఈఓ నవంబర్ 20 నుంచి.. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 30 వరకు విద్యార్థులకు మిడ్లైడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబరు 10న ఫలితాలు విడుదల చేస్తారు. ఎండ్లైన్ పరీక్షలు 2027 మార్చి 7 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. మార్చి 31న ఫలితాలు ప్రకటించి ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల పురోగతిని నిరంతరం పరిశీలించి అవసరమైన విద్యాసాయాన్ని అందించనున్నారు. -
వీడని మరమ్మత్తు
ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారు లు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ పరిస్థితి.. కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతున్నారు. ఎల్లూరు పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతల కోసం 5 మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. ఐదేళ్ల క్రితం పంప్హౌజ్లోకి నీరు చేరుకోవడంతో ఒక మోటార్, రెండున్నర ఏళ్ల క్రితం మరో మోటార్ దెబ్బతింది. వీటికి మరమ్మతు చేపట్టడంలో ఆలస్యం అవుతుండటంతో మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టుపై తీవ్రభారం తాజాగా వరదలు వచ్చే సీజన్ కావడంతో ఈసారి అదే పరిస్థితి పూర్తిగా నిలిపివేస్తేనే.. ప్రాజెక్టులో మోటార్ల మరమ్మతుకు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లకు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
పెద్దకొత్తపల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం సూచించారు. పెద్దకొత్తపల్లిలోని ఆయిల్పాం కొనుగోలు కేంద్రంలో సేకరించిన గెలలను బుధవారం ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తోటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో పండించే ఉద్యాన తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్పాం సాగుచేసిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై.. 30 ఏళ్ల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం ఉంటుందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 110 టన్నుల గెలలను పెద్దకొత్తపల్లిలోని కేంద్రం వద్ద సేకరించినట్లు పేర్కొన్నారు. టన్నుకు రూ. 23,783 ధర పలుకుతుందని.. సేకరించిన గెలలకు 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. -
లింగసానిపల్లిలో నకిలీ ఎరువుల కలకలం
కల్వకుర్తి రూరల్: ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయ వ్యవహారం కలకలం రేపిన విషయం విదితమే. తాజాగా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో నకిలీ ఎరువులు లభించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్లో డీఏపీకి అధికంగా డిమాండ్ ఉండటంతో పాటు కొందరు రైతులకు నకిలీ ఎరువును అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. లింగసానిపల్లిలో నకిలీ డీఏపీ బస్తాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు రాములు, జంగయ్య ఇళ్లలో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 45 డీఏపీ బస్తాలను గుర్తించి.. పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే నెల రోజుల క్రితం గ్రామానికి డీసీఎంలో తీసుకొచ్చిన డీఏపీని నలుగురు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇద్దరు రైతులు నకిలీ డీఏపీని వినియోగించగా.. మరో ఇద్దరు ఇళ్లలో నిల్వ చేసుకున్నట్లు ఏఓ తెలిపారు. నికిలీ ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
మరో 8 రోజులే..
రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు సమీపిస్తున్న గడువు అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం అచ్చంపేట: అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్లాట్ల యజమానులు గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి.. రాయితీ పొందాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 2020లో చేసిన దరఖాస్తుదారుల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మరికొందరు ప్లాట్లను విక్రయించారు. రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే.. అంతంత మాత్రంగానే ముందుకొచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీలకు దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపులు మాత్రం అంతంత మాత్రమే. ఇందుకు మున్సిపల్ అధికారుల అలసత్వం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతోనే ఈ ప్రక్రియ ఆశాజనకంగా సాగడం లేదు. అప్పట్లో చాలా మందికి ఎల్ఆర్ఎస్ చేసుకునే విధానం తెలియకపోవంతో దరఖాస్తు చేసుకోని ప్లాట్లు కూడా జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. వీటికి కూడా అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరతుంని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేఽశంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలుచేసింది. 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపాలిటీలు వెనకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడం వల్ల చాలా మంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో కేవలం బ్యానర్ల ద్వారా కొద్దిరోజులు ప్రచారం చేసి వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా గడువు ముగిసే సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరే అవకాశం కనిపించడం లేదు. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రకియ పూర్తిచేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్థికంగా లబ్ధిపొందాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 31తో ముగియనున్న రాయితీ అవకాశం ఇంకా చాలా మంది ముందుకు రాకపోవడంతో పెండింగ్లోనే.. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతున్నారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్లను పరిశీలించి.. నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సి ఉంది. అనంతరం రెండో దశ మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. చివరి దశలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
కందనూలు: ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆస్పత్రుల్లో అందించే సేవలకు ధరల పట్టికను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ప్రో గ్రాం అధికారి కె.రవికుమార్, మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి ఉన్నారు. ఉల్లి @ రూ.3,200 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్లో జరిగిన వేలంలో ఉల్లి ధరలు గత వారం ధరలే పలికాయి. బుధవారం ఉదయం పది గంటలకు జరిగిన వేలంలో క్వింటాల్కు గరిష్టంగా రూ.3,200, కనిష్టంగా రూ.2,400 గా నమోదయ్యాయి. సన్నటి పేడు ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,800 పలికింది. ముసురు వానలు కురుస్తుండడంతో మార్కెట్కు ఉల్లి అమ్మకానికి తక్కువగా వచ్చింది. -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
అచ్చంపేట రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ధ్వజమెత్తారు. నీట్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడం.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాలు బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం.. అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం.. వారిపై నిర్బంధ చర్యలకు దిగడం అత్యంత దురదృష్టకరమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను విరమించి.. విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 131ని జారీ చేసింది. వందశాతం ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడంతో పాటు మున్సిపల్ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోంది. తక్కువ ఫీజుతో యజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి. చివరి దాక వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు htt p://bre.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల దరఖాస్తు ఫారం, ఎన్ఆర్ (రెండు కాపీలు), ఎస్బీఐ కలెక్ట్ ఫీజు రశీదు కాపీలను సంబంధిత పాఠశాల హెచ్ఎం ధ్రువీకరించి.. సెప్టెంబర్ 1వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు తమ కుల, ఆదాయ ధ్రువపత్రాలను జతచేయాలని.. ఎన్ఎంఎంఎస్ పరీక్షను డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం కందనూలు: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం రాష్ట్రస్థాయి అండర్–14, 17, 19 ఖోఖో జట్ల ఎంపికలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. తద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడి.. భవిష్యత్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పునాదిగా నిలుస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్ను సంప్రదించాలని కోరారు. సమాజం సేవలో పీయూ ముందుంటుంది మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్లో పీయూఎంఎస్డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులు పుస్తక వి/్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, సర్పంచ్ రాజుగౌడ్, డాక్టర్లు పవన్కుమార్, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్, విజయ, అంజని, మనోహర్, అధ్యాపకుడు గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించం
కందనూలు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం, అలసత్వానికి తావివ్వొద్దన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో రాజీ పడేది లేదని.. ఆస్పత్రిలో ప్రతి విభాగం సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు ఉన్నారు. -
ఓటుహక్కు కాపాడే బాధ్యత బీఎల్ఓలదే
వెల్దండ: సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల ఓటు హక్కును కాపాడే బాధ్యత బీఎల్ఓలదేనని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను నమోదుచేసి ఓటును కాపాడాలన్నారు. ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, నాగులునాయక్, విజయ్గౌడు, నిరంజన్, శ్రీనివాస్రెడ్డి, హనుమంతు నాయక్, అశోక్, అంజి మాస్టర్, కొండల్, శక్రునాయక్ ఉన్నారు. అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు కందనూలు: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న సాయంత్రం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. 28న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 29న పౌర్ణమి గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై 30వ తేదీన నాగర్కర్నూల్కు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ. 2,400 చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొల్లాపూర్ నుంచి గోవాకు ప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి బస్సు సేవలు ప్రారంభమవుతాయని.. ఒక్కో ప్రయాణికుడికి రాను పోను చార్జీ రూ. 3వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు కొల్లాపూర్ నుంచి బస్సు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం గోవాకు చేరుకుంటుందన్నారు. 28న సాయంత్రం 6 గంటలకు బస్సు తిరుగు ప్రయాణమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కొల్లాపూర్కు చేరుకుంటుందని తెలిపారు. బస్సు టికెట్లు బుక్ చేసుకునేందుకు స్థానిక బస్టాండ్లో సంప్రదించాలని డీఎం సూచించారు. -
బైక్ను ఓవర్టెక్ చేయబోయి..
● ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ● డ్రైవర్ దుర్మరణం ● 14 మంది ప్రయాణికులకు గాయాలు ● ఎన్హెచ్–167పై ఘటన తాడూరు: ముందు వెళ్తున్న బైక్ను అతివేగంతో ఓవర్టెక్ చేయబోయిన స్కార్పియో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారులోని 167వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆమనగల్ మండలం కోనాపూర్కు చెందిన శరత్గౌడ్ (28) స్కార్పియో కారులో నాగర్కర్నూల్ వైపు బయలుదేరాడు. గుంతకోడూరు సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయి.. డ్రైవర్ శరత్గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనదారుడు కోట శ్రీనివాస్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి డిపో మేనేజర్ శాలిని, తాడూరు ఏఎస్ఐ బాలునాయక్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
కల్వకుర్తి రూరల్: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం ముకురాల, లింగసానిపల్లి గ్రామాలతో పాటు ఊర్కొండ మండలంలో సాగుచేసిన ఉద్యాన పంటలను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ఈసారి ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండించే కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కరువు పరిస్థితులను తట్టుకునే జామ, ఉసిరి, దానిమ్మ, మామిడి తోటలతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని.. సేంద్రియ, ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేలల్లో తేమ సంరక్షణ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారి మహేశ్వరి, విస్తరణాధికారి శివలీల ఉన్నారు. -
చిగురించిన ఆయిల్ ఆశలు
నర్వ: దేశంలో నూనెగింజల ఉత్పత్తి తగ్గటం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా ప్రతిఏటా రూ.70 వేల కోట్ల ఆయిల్ను దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రారంభంలో ఆసక్తి చూపని రైతులు తదనంతరం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో ముందుకు వస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్పాం ధర రూ.24 వేల వరకు పలుకుతుండడంతో సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలో 2020–21 ఏడాది ప్రారంభంలో 430 ఎకరాలు మాత్రమే ఆయిల్పాం సాగు ప్రారంభించిన అధికారులు 2021లో జిల్లాకు 4.60 లక్షల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 33,999 ఎకరాల్లో విస్తరించగా.. నారాయణపేట జిల్లాలోనే 7 వేల ఎకరాల్లో ఆయిల్పాంను రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు గెలలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి రూ.300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించగా.. మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం సేకరణలో భాగంగా దాదాపు 40 ఎకరాలు కేటాయింపు కొలిక్కివచ్చింది. కోస్గి, మక్తల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సైతం సీఎం రేవంత్రెడ్డిని కోరడంతో ఆయిల్పాం రైతులకు ఆశలు రెట్టింపయ్యాయి. నారాయణపేట 6,907 వనపర్తి 6,400 30 కి.మీ., ఒకటి చొప్పున.. పంట కోత మొదలైనప్పటి నుంచి కొనుగోలు వరకు అయ్యే రవాణా ఖర్చులను ఆయిల్ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లాలో మక్తల్, మరికల్, మాగనూర్, కృష్ణా, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగువిస్తీర్ణం ఇలా (ఎకరాలు).. ‘పేట’ జిల్లాలో మూడు చోట్ల పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు చిత్తనూర్ వద్ద ఆయిల్పాం నర్సరీ, పరిశ్రమకు భూమి కేటాయింపు స్థానికంగా విక్రయించుకుంటేనే రైతులకు ప్రయోజనం ఇన్నాళ్లు ఫ్యాక్టరీ లేకపోవడంతో గెలల విక్రయానికి అవస్థలు నాగర్కర్నూల్ 7,692 జోగుళాంబ గద్వాల 7,700 మహబూబ్నగర్ 5,300 -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కల్వకుర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా చేయడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు తదితర అంశాలపై మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జిల్లాలో కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల పరిస్థితి, ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలు, రహదారుల పక్కనున్న దాబాలు, హోటళ్ల అనుమతులు, భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, అంబులెన్స్ సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమగ్రంగా సమీక్షించి.. అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ప్రతినెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశమై, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి పౌరుడు విధిగా రోడ్డు నిబంధనలను పాటించి, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్టీఓ ఇమ్రాన్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
ఈ–కేవైసీ 77.26 శాతమే!
రేషన్ లబ్ధిదారులకు 31వ తేదీ వరకు గడువు ● జిల్లాలో 6,94,740మంది ఈ–కేవైసీ పూర్తి ● మరో 2,04,445 మంది ఫిజికల్గా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే.. ● త్వరలో స్మార్ట్కార్డులు అందజేత కల్వకుర్తి: బోగస్ రేషన్కార్డుల ఏరివేతతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ–కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ప్రారంభంలో వేగంగా కొనసాగిన ఈ ప్రక్రియ.. కొన్నాళ్ల తర్వాత అధికారులపై ఒత్తిడి తగ్గించడంతో నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఎంతోమంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో ఇప్పటివరకు 77.26 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయింది. తద్వారా చాలా బోగస్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మరణించి వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ చేపడితే మరిన్ని బోగస్ కార్డులు, మరణించిన వారి సంఖ్య తేలనుంది. మిగిలిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ–కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. ముందుంజలో కల్వకుర్తి.. జిల్లాలో కల్వకుర్తి మండలం రేషన్ ఈ–కేవైసీలో మందంజలో ఉంది. మండలంలో 66,140 యూనిట్లు ఉండగా.. 52,400 మంది ఈ–కేవైసీ పూర్తయింది. ఇంకా 13,740 మంది మిగిలారు. రెండో స్థానంలో నాగర్కర్నూల్ మండలం ఉంది. ఇక్కడ 77,326 యూనిట్లకు గాను 59,378 మంది ఈ–కేవైసీ నమోదు చేసుకున్నారు. కొల్లాపూర్ మండలంలో 61,264 యూనిట్లకు గాను 46,613, అచ్చంపేట మండలంలో 66,147 యూనిట్లకు గాను 49,679 యూనిట్ల ఈ–కేవైసీ పూర్తయింది. ఇక స్మార్ట్ కార్డులే.. జిల్లాకు రేషన్ స్మార్ట్ కార్డులు వచ్చాయి. లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ప్రింట్ పేపర్ కాకుండా, ఓటరు కార్డు తరహాలో రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కార్డుపై క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, సంబంధిత రేషన్ దుకాణం వివరాలు వస్తాయి.కార్డు స్థితి వంటి సమాచారం తెలిసిపోతుంది. భవిష్యత్లో సంక్షేమ పథకాలకు సైతం అనుసంధానం చేసే అవకాశం ఉంది. -
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలి
అచ్చంపేట రూరల్: వీబీ–జీ రామ్జీ పథకంతో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీబీ–జీ రామ్జీపై అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. సమావేశంలో ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. -
గీత కార్మికులకు రక్షణగా కాటమయ్య కిట్లు
చారకొండ: గీత కార్మికుల రక్షణకు కాటమయ్య కిట్లు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎకై ్సజ్శాఖ అధికా రి వేణుగోపాల్రెడ్డి అన్నారు. చారకొండ మండల కేంద్రంతోపాటు గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో మంగళవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చారకొండలో కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తయిందన్నారు. త్వరలోనే గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో గీత కార్మికులకు కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కిట్ల వినియోగం, ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి ఇందిర, ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి, శిక్షకులు ప్రశాంత్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
నేడు డయల్ యువర్ డీఎం
అచ్చంపేట రూరల్: ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని, ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డిపో కార్యాలయంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సందేహాలు, సూచనలను సెల్ నం.99592 26291కు కాల్ చేయాలని కోరారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు అమ్రాబాద్: అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, ఇంగ్లిష్ 1, హిస్టరీ 1, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 1, తెలుగు 1, బాటనీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా సబ్జెక్ట్లలో పీజీలో 55 శాతం, (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) ఉన్నవారు అర్హులని, సెట్, నెట్, స్లేట్, పీహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం వరకు ధ్రువపత్రాలను కళాశాలలో అందజేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలలో.. బల్మూర్: మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, తెలుగు, ఇంగ్లిష్, బీఎఫ్ఎస్ఐ, కంప్యూటర్ సైన్స్– అప్లికేషన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు ఒక్కొక్క పోస్టు చొప్పున మొత్తం 9 పోస్టులు ఉన్నాయని, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారం కళాశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి గు రువారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగర్కర్నూల్లో ఉంటాయని, అభ్యర్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
‘సర్’ను గడువులోగా పూర్తిచేయాలి
కందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరుకు ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతోపాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్ పాల్గొన్నారు. -
పొలాలు కోతలకు గురవుతున్నాయి..
శాయిన్పేట చెరువు నీళ్లు, కేఎల్ఐ కాల్వ నీళ్లు పోవడానికి పురాతన కాలం నుంచి ఫిడెల్ కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫిడెల్ కాల్వను పూడ్చివేయడంతో చెరువు, కేఎల్ఐ కాల్వ నీరు మా పొలాల్లోకి వచ్చి పూర్తిగా కోతకు గురై వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఫిడెల్ కాల్వను పునరుద్ధరించి.. కాల్వను పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – తిరుపతయ్య, బాబు, మల్లయ్య, అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం


