breaking news
Nagarkurnool District News
-
పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..
ప్రభావిత వర్గాలు.. పురుషులు 1,071 మహిళలు 1,021 మొత్తం ఓటర్లు 2,092యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. -
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయా వకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది. -
రెండో పోరుకు రెడీ
నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. 520 సర్పంచ్లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడతలో ఇలా.. జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది.. మహబూబ్గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811 నాగర్కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228 నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755 వనపర్తి 94 5 89 294 850 148 702 1,769 జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263 మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826 2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు.. 2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 94,975 96,998 4 1,91,977 నాగర్కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749 జో.గద్వాల 55,710 57,094 3 1,12,807 వనపర్తి 61,553 62,726 2 1,24,281 నారాయణపేట 73,674 76,642 2 1,50,318 నాగర్కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)మహబూబ్గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్, హన్వాడ, కోయిల్కొండ) జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి) నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్) వనపర్తి: 5 (వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత) నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. -
మండలం కనిష్టం బల్మూరు 9.4 అమ్రాబాద్ 9.8 కల్వకుర్తి 9.8 తెలకపల్లి 10.1 పదర 10.4 లింగాల 10.7 తాడూరు 10.9 పెద్దకొత్తపల్లి 11 ఉప్పునుంతల 11.1 వెల్దండ 11.2 అచ్చంపేట 11.2 కోడేరు 11.2 ఊర్కొండ 11.3 బిజినేపల్లి 11.4 తిమ్మాజిపేట 11.5 నాగర్కర్నూల్ 11.6
వణికిస్తున్న చలి సాక్షి, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా చలిపులి వణికిస్తోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకు చలి వణికిస్తోంది. శనివారం జిల్లాలోని బల్మూరు మండలంలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అమ్రాబాద్ మండలంలో 9.8, కల్వకుర్తి 9.8, తెలకపల్లిలో 10.1, పదరలో 10.4, లింగాలలో 10.7, తాడూరు మండలంలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. -
ధన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పురుషులు 4,034 మహిళలు 4,293 మొత్తం ఓటర్లు 8,327 -
నిర్వాసితుల పోరాటంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి
చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని నిర్వాసితులు చేస్తున్న పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ముంపు నుంచి మినహాయించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 12వ రోజు చేసుకున్నాయి. రిలే దీక్షలకు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి జక్క బాలయ్య, లక్ష్మీనారాయణ, బసవరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయి ఉన్న ఫలంగా గ్రామాలను వదిలి వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్థ్యం తగ్గించి, వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేసే వరకు పౌరహక్కుల సంఘం మద్దతు ఉంటుందని చెప్పారు. అక్కడి నుంచి గతంలో గోకారం చెరువును ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించారు. చెరువును ధ్వంసం చేయడం వల్ల ఎంతో మంది మత్స్యకారులు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. -
పకడ్బందీగా వెబ్కాస్టింగ్ నిర్వహణ
సాక్షి, నాగర్కర్నూల్/ నాగర్కర్నూల్/ తిమ్మాజిపేట: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనుండగా.. మొత్తం 40 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును పరిశీలించనున్నారు. 42 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంచారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీఓలు, ఆర్ఓ, ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శనివారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీని జిల్లా కలెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గైర్హాజరైతే కఠిన చర్యలు ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత పోలింగ్ కోసం 1,694 పీఓలు, 2,411 ఓపీఓలతోపాటు వివిధ రకాల బాధ్యతలతో 6 వేల మందికిపైగా సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. ఎన్నికల విధులకు గైర్వాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వారి పేర్ల వివరాలను సస్పెన్షన్కు సిఫారసు చేయాలని తిమ్మాజిపేట మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్కుమార్ను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించుకోవాలని చెప్పారు. -
‘స్వగ్రామాలే’ సవాల్..!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామం’లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ తూడుకుర్తి: నువ్వా.. నేనా.. ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి మహిళలు 2,706 పురుషులు 2,658 మొత్తం ఓటర్లు 5,364 నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడుకుర్తి. నాగర్కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్గా పనిచేశారు. దామోదర్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ -
జనరల్లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
హోరాహోరీగా ‘సంగ్రామం’
సాక్షి, నాగర్కర్నూల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల హోరాహోరు పోరు కొనసాగింది. మొత్తం ఎన్నికల ఫలితాల్లో అంతిమంగా కాంగ్రెస్ పైచేయి సాధించగా.. పలు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. తొలివిడతలో మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు గాను 97 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా.. 39 స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిది చోట్ల ఎన్నికవగా.. బీజేపీకి 5 స్థానాలే వచ్చాయి. జిల్లాలోని తాడూరు మండలం గుంతకోడూరులో సీపీఐ పార్టీ బోణి కొట్టింది. ఆరింట మూడు మండలాల్లో.. మొత్తం ఆరు మండలాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సర్పంచ్ స్థానాలు వచ్చాయి. అయితే మూడు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగింది. తాడూరు మండలంలో మొత్తం 24 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 10 స్థానాలను గెలుచుకుంటే బీఆర్ఎస్ సైతం 9 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ మండలంలో కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్ గట్టి పోటీనివ్వడం గమనార్హం. వెల్దండ మండలంలో 8, తెలకపల్లి మండలం 7, కల్వకుర్తి మండలంలో 7 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. తాడూరు మండలంలోని అల్లాపూర్, ఏటిదర్పల్లి, ఇంద్రకల్, లచ్చురాంతండా, పర్వతాయిపల్లి, సిర్సవాడ, పాపగల్ గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటారు. తెలకపల్లి మండలంలో నడిగడ్డ, బోళ్లగుండం, జమిస్తాపూర్, బోడబండతండా, అనంతసాగర్, పర్వతాపూర్, ఆలేరు గ్రామాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. వెల్దండ మండలంలోని అజిలాపూర్, బర్కత్పల్లి, చెదురుపల్లి, పోతేపల్లి, బొల్లంపల్లి, చెరుకూర్, నగరగడ్డతండా, రాఘాయపల్లి సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్కే దక్కాయి. అలాగే ఊర్కొండ, వంగూరు మండలాల్లో బీఆర్ఎస్ ఐదు స్థానాలు అంతకన్నా తక్కువ స్థానాలకే పరిమితమైంది. సీఎం రేవంత్ సొంత మండలమైన వంగూరులో 19, ఊర్కొండలో 10 స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల నడుమ గట్టి పోటీ మొదటి విడతలో పలుచోట్ల కాంగ్రెస్కు ఏమాత్రం తగ్గని బీఆర్ఎస్ చాలాచోట్ల తక్కువ తేడాతోనే సర్పంచ్గిరిని కోల్పోయిన వైనం మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టిపోటీ కొనసాగింది. కొన్నిచోట్ల నువ్వా.. నేనా అన్న చందంగా చివరి వరకు ఉత్కంఠపోరు కొనసాగగా.. అతి తక్కువ మెజార్టీతో సర్పంచ్లుగా గెలుపొందారు. తాడూరు మండలంలోని గుట్టలపల్లిలో స్వతంత్ర అభ్యర్థి ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారు చిందం అయన్నపై కేవలం 2 ఓట్ల తేడాతో సర్పంచ్ అయ్యారు. తెలకపల్లి మండలం బండపల్లిలో సురేందర్రెడ్డికి కేవలం 4 ఓట్లతో మెజార్టీతో సర్పంచ్గిరి దక్కింది. ఇదే మండలంలోని గట్టునెల్లికుదురులో చల్లా చంద్రారెడ్డి సైతం 7 ఓట్ల స్వల్ప తేడాతోనే విజయం సాధించారు. కల్వకుర్తి మండలం మొకురాల సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు ఎల్లయ్య 12 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి మల్లేశ్ మీద గెలుపొందారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న స్వగ్రామం తెలకపల్లి మండలంలోని గౌరారంలో కాంగ్రెస్కు చెందిన బిరుదు మల్లీశ్వరి 19 ఓట్ల తేడాతోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు. చాలాచోట్ల అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయాలను కోల్పోయారు. అలాగే రెండు, మూడో విడతల్లోనూ ప్రధాన పార్టీలు, అభ్యర్థుల మధ్య హోరాహోరు పోరు కొనసాగనుంది. -
ప్రవాహం.. ప్రమాదం
అమరచింత: ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వలో నీటి ప్రవాహ తీవ్రత, ప్రవహించే నీటితో కలిగే నష్టాల గురించి అవగాహన లేక అమాయక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్నారు. నందిమళ్ల సమీప కాల్వలో ఇలాంటి మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రామన్పాడు వరకు.. జూరాల ఎడమ కాల్వ ద్వారా రామన్పాడుకు నీటి ని క్రమం తప్పకుండా వదులుతుంటారు. కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల, మూలమళ్ల, జూరాల గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోయి రామన్పాడు రిజర్వాయర్లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది.● ఈత సరదా, దుస్తులు శుభ్రం చేసేందుకు వెళ్లి గల్లంతు ● అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు -
ప్రచారానికి తెర..!
రేపు రెండో విడత పోలింగ్కు సన్నద్ధం ● బరిలో 469 సర్పంచ్, 3,087 వార్డు అభ్యర్థులు ● ఇప్పటికే 4 సర్పంచ్, 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం ● ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికార యంత్రాంగం ● సోషల్ మీడియాలో ప్రచార జోరు.. ప్రలోభాల పర్వం స్వతంత్ర/ సీపీఎం/టీడీపీ 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు, నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత జోరు పెంచారు. శుక్రవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో మద్దతుదారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. సాయంత్రం 5 గంటలకు ఎక్కడికక్కడ నిశబ్ధం నెలకొంది. దీంతో సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఆదివారం రెండో విడత పంచా యతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలా ల్లోని 151 గ్రామాలు, 1,412 వార్డులు ఉండగా.. నా మినేషన్ల 4 సర్పంచ్, 142 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 147 పంచాయతీలు, 1,269 వార్డుస్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రత్యక్ష ప్రచారం ముగియడంతో అభ్యర్థులు మిగిలిన రోజును సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించారు. దాదాపు అన్ని పంచాయతీల్లో అభ్యర్థుల పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్న పంచాయతీ, మండల గ్రూపులతోపాటు కుల, యూత్ గ్రూపుల్లోనూ తమ గుర్తులు, హామీలు, గెలిచిన తర్వాత చేపట్టనున్న పనులతో పోస్టులు పెడుతున్నారు. మద్దతుదారులతో కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఉపసర్పంచ్పై గురి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన స్థానాల్లో ఉప సర్పంచ్గా ఎన్నిక కావాలని వార్డు సభ్యులు అనేక మంది పోటీలో ఉన్నారు. పలువురు అభ్యర్థులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవడం తలనొప్పిగా మారింది. మహిళలు బరిలో ఉన్న స్థానాల్లో పతులు, కుటుంబ సభ్యులే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.మద్యం దుకాణాలు బంద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల జరిగే బిజినేపల్లి, నాగర్కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు షాపులు మూతపడనున్నాయి. రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల ప్రచారం ముగించి ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలతో ఎక్కడ చూసినా దావత్లే కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెరపడటంతో ఎక్కడిక్కడ రహస్య మంతనాలు జరుగుతున్నాయి. అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు మందు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. నగదు, నజరానాలు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొంటున్నారు. కొందరు అభ్యర్థులు దావత్లకు విముఖత వ్యక్తం చేస్తుండగా.. వారి సహచరులకు తలనొప్పి తప్ప డం లేదు. మందు, విందులకు వారే నగదు సమకూరుస్తున్నారు. -
నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
కందనూలు/ బిజినేపల్లి: వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 6 పరీక్ష కేంద్రాల్లో 1,432 మంది, నాగర్కర్నూల్ 10 కేంద్రాల్లో 2,249 మంది, గద్వాల 4 కేంద్రాల్లో 997 మంది, వనపర్తి 5 కేంద్రాల్లో 1,099 మంది, నారాయణపేట 2 కేంద్రాల్లో 609 మంది, కొడంగల్ ఒక కేంద్రంలో146 మంది, షాద్నగర్ ఒక కేంద్రంలో 345 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకు గాను 29 పరీక్ష కేంద్రాల్లో 29 మంది సీఎస్లు, 29 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించామని ప్రిన్సిపాల్ తెలిపారు. క్షయవ్యాధి నివారణకు కృషి చేయాలి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని క్షయ వ్యాధి నివారణ అధికారి రఫిక్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్లో భాగంగా జిల్లాలో మొబైల్ ఎక్స్రే యూనిట్ శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధిని పారదోలడానికి వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి తెమడ పరీక్షతోపాటు ఎక్స్రే ద్వారా వ్యాధిని గుర్తించాలనే సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసే టీబీ వ్యాధి గుర్తింపు శిబిరాలకు మొబైల్ ఎక్స్రే మిషన్ తీసుకువెళ్లి వ్యాధి అనుమానితులందరికీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలన కోసం క్యాంపులు ఏర్పాటు చేసి ఎక్స్రే తీయించాలని ప్రోగ్రాం అధికారి టీబీ ఉద్యోగులకు సూచించారు. చేతితో పట్టుకెళ్లే మొబైల్ ఎక్స్రే సాధనం ద్వారా అందరికీ పరీక్షలు చేపట్టాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు అందజేసి నివారణకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు, ఆరిఫ్, శరత్బాబు, ముక్తార్, రాజ్కుమార్, గౌరీకుమార్, సత్యారెడ్డి, రామచంద్రజి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి జూపల్లికి నిరసన సెగ
● ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని గ్రామస్తుల అడ్డగింత పెంట్లవెల్లి: రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో శుక్రవారం రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ మద్దతుదారు తరపున ప్రచారం చేస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది గ్రామస్తులు స్పందిస్తూ ‘మంత్రిగారు.. హామీలపై హామీలు ఇస్తారు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోతున్నారని’ గ్రామ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ మద్దతుదారు మేడిపల్లి సరితాబిచ్చారెడ్డి అన్నారు. మా గ్రామానికి ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గ్రామస్తులు మంత్రితో నిరసన తెలిపారు. ఓటమి భయంతో హామీలు ఇవ్వడం కాదని వాటిని కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం కాదని గోప్లాపూర్ గ్రామాన్ని గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేసి చూపిస్తానని, ఇందుకోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తానని పేర్కొన్నారు. -
సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన
నాగర్కర్నూల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చీఫ్ మేనేజర్ రాకేష్వర్మ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు సిబ్బందికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఖాతాదారులు సైబర్ నేరాల బారిన పడుతున్నారని అలాంటి వారికి అవగాహన కల్పించడానికి బ్యాంకు సిబ్బంది ముందు వరుసలో ఉండాలని సూచించారు. చాలామంది అవగాహన లేక బ్యాంకులలో గాని, 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఫ్రంట్ లైన్లో ఉండే బ్యాంకు సిబ్బంది ముందుగా సైబర్ నేరగాళ్ల బారిన పడినవారు సంప్రదిస్తారని అలాంటి వారికి అవగాహన కల్పించడమే కాకుండా టోల్ ఫ్రీ నంబర్కు ఎలా ఫిర్యాదు చేయాలో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నరేష్కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ లీలావతి, అసోసియేట్స్ దినేష్, భాగ్యలక్ష్మి, అంజలి, షేక్ షరీఫ్, మాధవరావు, వర్షిణి, నవ కిషోర్రెడ్డి, మాధురి, నిఖిత, సర్వీస్ మేనేజర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఓటింగ్.. 86.32 శాతం
● జిల్లాలో ప్రశాంతంగాతొలి విడత పంచాయతీ ఎన్నికలు ● ఉదయం 7 గంటల నుంచే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు ● అత్యధికంగా ఊర్కొండ మండలంలో 89.73.. ● అత్యల్పంగా తెలకపల్లిలో 81.58 శాతం నమోదు పర్వతాపూర్లో ఓటు వేస్తున్న మహిళసాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 86.32 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం ఆరు మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు ఎన్నికలు చేపట్టాల్సి ఉండగా.. ఇందులో 14 సర్పంచ్, 208 వార్డుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా మొత్తం 137 సర్పంచ్, 1,118 వార్డుస్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. తెలకపల్లి మండలం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ఊర్కొండ మండలంలో.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 86.32 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా.. ఇందులో అత్యధికంగా ఊర్కొండ మండలంలో 89.73 శాతం.. తెలకపల్లి మండలంలో తక్కువగా 81.58 శాతం ఓటింగ్ జరిగింది. కల్వకుర్తి మండలంలో 88.02, తాడూరులో 87.54, వంగూరులో 85.85, వెల్దండ మండలంలో 88.43 శాతం ఓటింగ్ నమోదైంది. తెలకపల్లి మండలం చిన్నముద్దునూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. తొలి విడతలో 32 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని తెలుసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు రాజ్యలక్ష్మితోపాటు 55 మంది మైక్రో అబ్జర్వర్లు తొలి విడత ఎన్నికల తీరును నిశితంగా పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ సాగాల్సి ఉండగా చాలాచోట్ల క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించారు. తెలకపల్లి, తాడూరు, వెల్దండ మండలాల్లో ఒంటిగంట దాటినా పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సర్పంచ్, వార్డుస్థానాలకు ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టారు. మండలం 9 గంటలకు 11 గంటలకు ఒంటిగంట ముగింపు కల్వకుర్తి 18.37 52.5 84.21 88.02 తాడూరు 19.69 52.4 80.57 87.54 తెలకపల్లి 14.18 46.9 76.83 81.58 ఊర్కొండ 17.93 51.6 75.63 89.73 వంగూరు 19.59 47.1 72.96 85.85 వెల్దండ 11.92 53.9 61.11 88.43 కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సరళి ఇలా.. -
ఓటెత్తారు..
● జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం ● మహబూబ్నగర్లో అత్యల్పంగా 83.04 శాతం ● అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్లో వెనుకపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 6వేల మందికి పైగా అధికారులు వివిధ హోదాల్లో విధులు నిర్వరిస్తున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో 151 జీపీలకు మొదటి విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 14 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవయ్యాయని.. మిగిలిన 137 సర్పంచ్ స్థానాల్లో 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. అదే విధంగా 1,326 వార్డులకు గాను 208 వార్డులు ఏకగ్రీవమయ్యాయని.. 1,118 వార్డు స్థానాల్లో 2,774 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వివరించారు. కల్వకుర్తి మండలంలో 24 జీపీలు, 214 వార్డులకు గాను పురుష ఓటర్లు 15,803, మహిళా ఓటర్లు 15,703 మంది ఉన్నారన్నారు. ఊర్కొండ మండలంలో 16 జీపీలు, 138 వార్డులకు గాను పురుషులు 8,868 మంది, మహిళా ఓటర్లు 9,119 మంది, వంగూరు మండలంలో 27 జీపీలు, 228 వార్డులకు గాను పురుషులు 16,498 మంది, మహిళా ఓటర్లు 17,000 మంది, వెల్దండ మండలంలో 32 జీపీలు, 270 వార్డులకు గాను పురుషులు 17,163 మంది, మహిళా ఓటర్లు 16,995 మంది, తాడూరు మండలంలో 24 జీపీలు, 216 వార్డులకు గాను పురుషులు 14,968 మంది, మహిళలు 15187 మంది, తెలకపల్లి మండలంలో 28 జీపీలు, 260 వార్డులకు గాను పురుషులు 22,325 మంది, మహిళా ఓటర్లు 22,520, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా మండలాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించే అధికారులు, సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేడు వేతనంతో కూడిన సెలవు మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరిగే మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించిందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన వెసులుబాటు కల్పించాలని సూచించారు. కాగా, ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ సంతోష్ కోరారు. జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్ లేదా బ్యాంక్ పాస్పుస్తకం, కార్మిక మంత్రిత్వశాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువపత్రాలు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, రేషన్ కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం, ప్రీడమ్ ఫైటర్ గుర్తింపు కార్డు, ఆర్టీఐ జారీచేసిన ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ తెలిపారు. -
నేడే తొలి సం‘గ్రామం’
సాక్షి, నాగర్కర్నూల్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో మొత్తం 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 14 సర్పంచ్ స్థానాలతో పాటు 208 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 137 సర్పంచ్, 1,118 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. తొలి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 1గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటే సే అవకాశం కల్పించనున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. గురువారం సా యంత్రమే తొలి విడత ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో పర్యవేక్షణ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల తీరును 55 మంది మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించనున్నారు. తొలి విడతలో గుర్తించిన 32 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కల్వకుర్తి, ఊర్కొండ తదితర మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి, సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ బ్యాలెట్ కంపార్ట్మెంట్ తదితర ఏర్పాట్లను పూర్తిచేశారు. తొలివిడతలో ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 1,92,156 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95,625 మంది పురుషులు కాగా, 96,529 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 447 మంది వెబ్కాస్టింగ్ చేపట్టే పోలింగ్ కేంద్రాలు 32 ఓపీఓలు 3,000 మైక్రో అబ్జర్వర్లు 55 జిల్లాలో 137 సర్పంచ్, 1,118 వార్డులకు ఎన్నికలు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన నేటి సాయంత్రమే ఎన్నికల ఫలితాలు వెల్లడి -
పోలింగ్ విధులుపక్కాగా నిర్వర్తించాలి
కల్వకుర్తి రూరల్/వెల్దండ: పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కల్వకుర్తి మండల పరిషత్ కార్యాలయం, వెల్దండలోని మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. వెల్దండ మండలంలో సమస్యాత్మక గ్రామాలుగా అజిలాపూర్, భైరాపూర్, బొల్లంపల్లి, చెదురుపల్లి, చెర్కూర్, కుప్పగండ్ల, పెద్దాపూర్, పోతేపల్లిని గుర్తించినట్లు తెలిపారు. ఆమె వెంట నోడల్ అధికారి సీతారాం, ఎంపీడీఓలు వెంకట్రాములు, సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం తదితరులు ఉన్నారు. ‘గోకారం’పై మొండివైఖరి తగదు చారకొండ: డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించాలని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం మొండివైఖరితో వ్యవహరించడం తగదని నిర్వాసితులు అన్నారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించాలని పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడంతో పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించడంతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలి అచ్చంపేట రూరల్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు తర్వాతి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గాజుల వెంకటేశ్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు విడుతల్లో ఎన్నికల విధుల బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. తీరిక లేకుండా కష్టతరమైన ఎన్నికల విధులు నిర్వహించడం ద్వారా ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తర్వాతి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు. పరీక్ష ఫీజు చెల్లించండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ ప్రవీణ్కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు థియరీ సబ్జెక్టులకు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.100, ప్రాక్టికల్స్కు రూ.100, ఇంప్రూమెంట్కు రూ.200 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ వారు థియరీ సబ్జెక్టులకు రూ.150, ప్రాక్టికల్స్కు రూ.150, ఇంప్రూమెంట్కు రూ.350 చెల్లించాలని సూచించారు. -
900 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
● నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ● ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ నాగర్కర్నూల్ క్రైం: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మున్ననూర్ వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు, బిజినేపల్లి మండలం మంగనూరులో జిల్లా సరిహద్దు చెక్పోస్టు, వెల్దండ మండలం కొట్ర క్రాస్రోడ్డు వద్ద జిల్లా సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.1,53,000 నగదు సీజ్ చేయడంతో పాటు బెల్టుషాపుల్లో దాడులు నిర్వహించి.. 1,470 లీటర్ల మద్యం సీజ్ చేసి, 150 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.6,90,522 ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు, పాత నేరస్తులు 834 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. లైసెన్స్ కలిగిన 22 ఆయుధాలను జిల్లా ఆయుధ కారాగారంలో డిపాజిట్ చేయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్లో భాగంగా 900 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు ఎస్ఎస్టీ, 20 ఎఫ్ఎస్టీ బృందాలతో పాటు అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు , 44 మంది ఎస్ఐలు, 168 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్స్ ర్యాంక్ అధికారులు, 520 మంది కానిస్టేబుల్స్, 100 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచామని.. విద్వేష పూరిత పోస్టులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలను పోస్ట్ చేసిన, షేర్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. -
గ్రామాల అభివృద్ధిని కోరుకోండి
● పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు అండగా నిలవాలి ● డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధిచేసే వారినే ఎన్నుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, వడ్డీలేని రుణాలు, రైతుభరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ, రూ. 500కే సిలిండర్ తదితర పథకాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు సులభతరమవుతాయని చెప్పారు. గ్రామస్వరాజ్యం స్ఫూర్తితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఆర్థిక వ్యవస్థను బలపరుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మనస్పర్థలు వీడి.. పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులకు ప్రభుత్వం తరఫున శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాకేంద్రంలో ఇప్పటివరకు రూ. 40కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు వివరించారు. జనరల్ ఆస్పత్రి నూతన భవనం శంకుస్థాపన దశలో ఉందని.. జూనియర్ కళాశాల భవనం, నూతన బస్టాండ్ తదితర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు తీగల సునేంద్ర, కావలి శ్రీనివాసులు, నిజాం తదితరులు ఉన్నారు. -
తొలి పరీక్ష..!
డీసీసీ చీఫ్లకు ‘పంచాయతీ’ సవాల్ ● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్ ● నేతల మధ్య సమన్వయమే ప్రధాన సమస్య ● పలు నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా అసంతృప్త నేతలు ● పట్టించుకోని అధిష్టానం తీరుతో అలక ● అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ సత్తా చాటుతామని నూతన అధ్యక్షుల ధీమా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి. -
ఏసీబీ వలలో ఇన్చార్జి విద్యుత్ ఏఈ
వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఇన్చార్జి డీఎస్పీ జగదీష్చందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్లైన్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈని పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జడ్చర్లలో సోదాలు జడ్చర్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ● ఇంటి మీటరు బిగించడానికి రూ.20 వేల లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం -
మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలో మొదటి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. కలెక్టరేట్ నుంచి సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి వీసీలో పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజు ఉదయం 9, 11, ఒంటిగంటకు అందించే పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్తోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, రూట్ ఆఫీసర్లు జోనల్ ఆఫీసర్లు, పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియలను అత్యంత సజావుగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లతోపాటు అవసరమైన చోట్ల పోలీస్ పహారా కొనసాగిస్తామన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు అత్యంత సజావుగా జరిగేలా ప్రతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి పకడ్బందీగా శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్ ప్రక్రియలో చేపట్టే ప్రతి అంశాన్ని వివరించామన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్, డీపీఓ శ్రీరాములు, ఎన్నికల నోడల్ అధికారులు భాస్కర్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆరు మండలాల్లో నిషేధాజ్ఞల అమలు తొలి విడత ఎన్నికలు జరిగే కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా మండలాల్లో ఇక నుంచి ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఆ తర్వాత ఎలాంటి ఊరేగింపులు చేయకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. -
ప్రలోభాల పర్వం
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం ● గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ ● ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల సంఘాలకు రూ.2 లక్షలు ● చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు ● రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’ సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిన్న గ్రామాల్లోనూ భారీగానే.. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు. మద్యం ప్రవాహం.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
సర్పంచ్కు 410.. వార్డులకు 2,639
మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలు ఇలా.. ● మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు ● 7 మండలాల్లో 139 పంచాయతీలు, 1,048 వార్డులకు ఎన్నికలుఅచ్చంపేట: పంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడతకు సంబంధించి బరిలో నిలిచిన వారి లెక్క తేలింది. మూడో విడతలో 158 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 18 సర్పంచ్, ఒక ఉపసర్పంచ్తోపాటు 251 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా ఎస్టీ జనాభా లేని కారణంగా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్నగర్ గ్రామాల్లో సర్పంచ్, 40 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. దీంతో మిగిలిన 139 పంచాయతీల్లో 410 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా.. 1,096 వార్డుల్లో 48 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికలు జరగనున్న 1,048 వార్డులకు 2,639 మంది పోటీలో ఉన్నారు. బరిలో ఉన్న సర్పంచ్,వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం 3 గంటల తర్వాత గుర్తులు కేటాయించడంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏకగ్రీవమైన గ్రామాలు, వార్డులు.. మూడో విడతలో ఎక్కువగా సర్పంచ్, వార్డు స్థానా లు ఏకగ్రీవమయ్యాయి. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో పోటీ లేకుండా సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఇందులో అచ్చంపేట మండలంలో ని కిష్ట్యాతండా, బుడ్డతండా, చెంచుపల్గుతండా, చౌటపల్లి, ఎద్దుమిట్టతండా, పద్మారంతండా, బోల్గట్పల్లి, రంగాపూర్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే ఉప్పునుంతల మండలంలోని సూర్యతండా సర్పంచ్తోపాటు ఆరు వార్డుల అభ్యర్థులు, పదర మండలంలోని జ్యోతనాయక్తండా, గాన్గుపెంట సర్పంచ్తోపాటు ఉపసర్పంచ్, అమ్రాబాద్ మండలం కొత్తపల్లి, వెంకటేశ్వర్లబావి, అమ్రాబాద్ సర్పంచ్లు, చారకొండ మండలం క మాల్పూర్, శేరిఅప్పారెడ్డిపల్లి, లింగాల మండలం అప్పాపూర్ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమైంది. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పోలింగ్.. ఫలితాలు ఈ నెల 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూడో విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.మండలం గ్రామాలు సర్పంచ్లు వార్డు స్థానాలు అచ్చంపేట 38 99 585 అమ్రాబాద్ 20 38 260 బల్మూర్ 23 68 464 లింగాల 23 62 418 పదర 10 22 183 ఉప్పునుంతల 27 74 457 చారకొండ 17 47 272 మండలం గ్రామాలు వార్డులు అచ్చంపేట 9 110 అమ్రాబాద్ 3 46 బల్మూర్ – 16 లింగాల 1 18 పదర 2 17 ఉప్పునుంతల 1 24 చారకొండ 2 20 -
వారసత్వానికి ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం
నాగర్కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభ పరిణామని, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ తల్లి నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చేరవేయడానికి ఈ విగ్రహం దోహదపడుతుందన్నారు. తెలంగాణ స్ఫూర్తి తరతరాలపాటు వికసించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు -
ఎన్నికల విధుల్లో నిబద్ధతతో వ్యవహరించాలి
నాగర్కర్నూల్/ తాడూరు: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించడం ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యత అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు నిర్వహణ, ఓటింగ్ పద్ధతులు, నిబంధనలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది తమ పాత్ర ఎంత ముఖ్యమో గ్రహించి, శిక్షణలో నేర్చుకున్న ప్రతి దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెలుతురు ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలను సజావుగా నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, గెలుపొందిన వార్డు సభ్యుల సమక్షంలో ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. అనంతరం తాడూరులోని ఎమ్మార్సీ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీఓ ప్రశాంత్, తహసీల్దార్ రామకృష్ణయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కందనూలు: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కల్పించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి సోమవారం అదనపు కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార సిబ్బందికి సరైన వసతులు ఏర్పాటు చేయాలని జిల్లాలోని 20 మండల పరిషత్ అధికారులు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే మహిళా పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతులు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన టేబుళ్లు, కుర్చీలు, కరెంటు, మంచినీరు, ఇతరత్రావి ఉండేలా చూడాలని వినతిలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగం
నాగర్కర్నూల్ క్రైం: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్తో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, ప్రతి ఓటరు భయపడకుండా, స్వేచ్ఛగా ఓటువేసే వాతావరణం కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ బూత్ల పరిస్థితిని అధ్యయనం చేసిన డీఐజీ ప్రత్యేక బృందాల గస్తీ, రాత్రివేళలో నిఘా, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణపై మరింత దృష్టి అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, విద్వేషపూరిత పోస్టులు, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యలు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణ, బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు, రౌడీషీటర్ల కదలికలపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్నువినియోగించుకోండి
వెల్దండ: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని జిల్లా సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా ఉందులో నాలుగు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవమైనట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశా రు. కార్యక్రమంలో నోడల్ అధికారి సీతారాం, ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ పరిశీలన నాగర్కర్నూల్: జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం గోడౌన్ సీల్ తెరిచి.. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రతను సమీక్షించారు. గోడౌన్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులున్నారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన కందనూలు: జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను డీఈఓ రమేష్కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు రిజిష్టరు, విద్యార్థుల సామర్థ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేయాలని, ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. -
మిగిలింది.. రెండు రోజులే
సాక్షి, నాగర్కర్నూల్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలిఉంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని 151 సర్పంచ్, 1,326 వార్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో తొలి విడత గ్రామాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపే లక్ష్యంగా హామీలు.. గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు కుల, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గెలుపు కోసం భారీస్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు వ్యక్తిగత పనులపై సైతం హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా ఓటర్ల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వైన్షాపులు బంద్.. తొలి విడత ఎన్నికల నేపథ్యంలో 48 గంటల ముందుగానే వైన్షాపులు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వైన్షాపులను మూసివేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు వైన్షాపులను మూసివేసి ఉంచనున్నారు. వైన్షాపుల మూసివేత నేపథ్యంలో పలు గ్రామాల అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేసి డంపులుగా నిల్వ చేసుకుంటున్నారు. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ గ్రామాల్లో జోరుగా ప్రలోభాల పర్వం 11న పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి -
ఆరుతడికే సాగునీరు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో.. యాసంగి సీజన్కు సాగునీటి వనరులను పకడ్బందీగా వినియోగించడంపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంటకు ఈ సీజన్లో నీటి సరఫరా ఉండదు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని పరిమిత స్థాయిలో సరఫరా చేస్తారు. ప్రధానంగా తాగునీటి అవసరాల మేరకు తగినంత నిల్వ ఉంచుతూనే వారాబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కనీసం 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటి సరఫరా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. మరమ్మతుల నేపథ్యంలో.. ఆర్డీఎస్ కింద ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే శాపంగా మారింది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ పెండింగ్ పనులు, మరమ్మతు కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించలేమని అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో 83,998 ఎకరాల ఆయకట్టు నీటి సరఫరా నోచుకోవడం లేదు. కనీసం వేరుశనగ, మొక్కజొన్న, కంది తదితర ఆరుతడి పంటలను సైతం సాగుచేసుకునే అవకాశం ఉండటం లేదు. యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు వారాబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ఆర్డీఎస్ కింద పరిధిలో పంట విరామం ప్రకటన -
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వరాచారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పటికై నా మేల్కోవాలి.. బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వరా చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం. – శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల ఏర్పాటు ● కోడ్ పక్కాగా అమలు చేసేందుకు ముమ్మర తనిఖీలు అచ్చంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేసేందుకు జిల్లాలో బిజినేపల్లి, మన్ననూర్, వెల్దండ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765పై నిరంతర నిఘా ఉంటుంది. 24 గంటలపాటు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దు మీదుగా జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో అవసరం మేరకు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలు, అనుమానితులను విచారిస్తున్నారు. రూ.50 వేలు మించితే.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చెక్పోస్టుల మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు నగదు, మద్యం తరలింపుపై అప్రమత్తంగా ఉండాలి. నగదు రూ.50 వేల వరకు తీసుకెళ్లొచ్చు. రూ.50 వేలకు పైబడి వెంట తీసుకెళ్తే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా మొదలుకొని తీసుకెళ్లున్న అవసరాలపై లెక్కలు చూపించాలి. వీటితోపాటు మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రేయింబవళ్లు అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రంగంలోకి బృందాలు పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండు, మూడు విడతల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకటి, రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రచారం మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు ఎంసీసీ, స్టాటిస్టికల్ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలు రంగంలోకి దిగాయి. నగదు, మద్యం అక్రమ రవాణా, పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసు, రెవెన్యూ శాఖలు చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ప్రచార చిత్రాల తొలగింపు సహా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను వీడియోలు చిత్రీకరించనున్నారు. -
మళ్లీ.. బీసీ లొల్లి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్లో సాయి ఈశ్వరాచారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది. 42 శాతం ఏమైంది.. స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంఘటితంగా పోరు బాట.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది. మా ఓటు బీసీలకే..42 శాతం రిజర్వేషన్పైసంఘాల పోరు ఇప్పటికే బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు హైదరాబాద్లో సాయి ఈశ్వరచారి మృతితో కదలిక నేడు కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు ఉమ్మడిగా దశల వారీ ఉద్యమబాటకు సన్నాహాలు సం‘గ్రామం’ వేళ మారుతున్న పరిణామాలతో రాజకీయ పార్టీల్లో కలవరం -
చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: వ్యాక్సిన్లను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపర్చడంతోపాటు చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఇన్చార్జి అధికారి శివ అన్నారు. మండలంలోని పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి.. వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ నిర్వహణ విధానం, ఇమ్యూనైజేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్లను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపరచడం, స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం, పిల్లలు, గర్భిణుల ఇమ్యూనైజేషన్ వివరాలు సక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి వాణి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ అధికారి సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరాలయంలో భక్తులు శని నివారణ పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత శని నివారణ పూజలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం భక్తులు బ్రహ్మసూత్ర పరమేశ్వరుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అధ్యాపకులు పనితీరును మెరుగుపర్చుకోవాలి బిజినేపల్లి: అధ్యాపకులు తమ పని విధానాన్ని రికార్డుల్లో నమోదు చేయడం కాదని.. విద్యార్థుల మనస్సులో తమ బోధనలు రికార్డు అయ్యేలా పనిచేయాలని పాలమూరు ఎంవీఎస్ కళాశాల తెలుగు శాఖ హెచ్ఓడీ కృష్ణమూర్తి, పెబ్బేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ప్రసాద్ అన్నారు. శనివారం పాలెంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలను హైదరాబాద్ సీసీఈ ఆదేశానుసారం 2022– 23, 24 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఆడిట్ నిర్వహించి.. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారులు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలను అధిగమించాలంటే ప్రభుత్వ కళాశాలలు ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుష్మ, లైబ్రేరియన్ శ్రీనివాసులు, అధ్యాపకులు స్వప్న, నాగలింగ్, వెంకటేష్, రమేష్, ప్రవళిక, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించండి కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లాకేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 27 వరకు ఆన్లైన్లో చెల్లించి, రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. 5వ సెమిస్టర్ పరీక్ష ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు, 3వ సెమిస్టర్ పరీక్ష 13 నుంచి 20 వరకు, 1వ సెమిస్టర్ పరీక్ష 22 నుంచి 28 వరకు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు. ● ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈఓ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన, గతంలో ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 26 వరకు మీ సేవ, ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ శివప్రసాద్ (సెల్ నం.98856 83314)ను సంప్రదించాలని సూచించారు. -
ఓటులోనూ నారీ శక్తి!
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.. సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్.. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. సంఘాలతో సంప్రదింపులు.. గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లా పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు మహబూబ్నగర్ 2,48,222 2,51,349 4,99,582 నాగర్కర్నూల్ 3,23,016 3,24,315 6,47,342 వనపర్తి 1,90,068 1,92,223 3,82,295 జోగుళాంబ గద్వాల 1,93,627 1,99,781 3,93,418 నారాయణపేట 1,94,124 2,02,410 3,96,541 పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో.. -
పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి. – రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోవద్దు
నాగర్కర్నూల్/ బిజినేపల్లి: జిల్లాలో జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో 55 మంది మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణకు ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించడమే అత్యంత కీలకమని, పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోవద్దని, పోలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల కల్లా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థుల ఏజెంట్లు మినహా మిగతా వారిని, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు అనుమతించొద్దన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 55 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, 55 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీపీఓ శ్రీరాములు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరి సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ నుంచి ఉపసంహరించుకునే వ్యక్తి నుంచి ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మండలంలోని పాలెం క్లస్టర్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అభ్యర్థుల అన్ని పత్రాలను సక్రమంగా నమోదు చేయడం, అభ్యర్థులు పూర్తి సమాచారం అందించడం, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దారు మునీరుద్దీన్, ఎంపీడీఓ కథలప్ప తదితరులున్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం
నాగర్కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. హోంగార్డు రైసింగ్ డే 63వ వేడుకలను శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్లో ముఖ్య అతిథిగా ఏఎస్పీ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 175 మంది హోంగార్డులు ఉన్నారని, మంచి పనితీరును కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించడంతోపాటు వారు హోంగార్డు దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు సైతం ఇన్సూరెన్స్తోపాటు యూనిఫాం అలవెన్స్ చెల్లిస్తుందని, హోంగార్డుల ఆరోగ్య భద్రత కోసం ఇటీవల ఓ బ్యాంకుతో సంప్రదింపులు జరిపామని త్వరలోనే సిబ్బంది అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్రెడ్డి, ఆర్ఐ జగన్, రాఘవరావు, ఎస్ఐ గోవర్ధన్, ఆర్ఎస్ఐ గౌస్పాషా, ప్రశాంత్, కల్యాణ్, శివాజీ, హోంగార్డులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
తెలకపల్లి/తాడూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం తెలకపల్లి, తాడూరు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. అదే విధంగా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి.. గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో మారె్క్ట్ కమిటీ మాజీ చైర్మన్ వల్లభ్రెడ్డి, నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, రాముడు, ప్రభాకర్, సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ..
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు ● -
హక్కు కోల్పోతారు..
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్● -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
వెల్దండ: కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం తిమ్మినోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శారద, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, శేఖర్రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి, వెంకట్రెడ్డి, హరికిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వసతుల కల్పనలో విఫలం అచ్చంపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణలో సరైన వసతులు కల్పించకపోడంతో ఇబ్బందులకు గురయ్యారన్నారు. వంగూరు, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో నిర్వహించిన శిక్షణకు హాజరైన ఉద్యోగులు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా సమకూర్చలేదన్నారు. 50 మందికి పైగా నిలబడే శిక్షణలో పాల్గొన్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొత్త వాహనాలకు మైసమ్మ సన్నిధిలో పూజలు చేశారు. భక్తులతో జాతర మైదానం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ‘ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దుచేయాలని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్సీ అమలుతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తాహెర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్అలీ, కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్, నాయకులు షేక్ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు. ఉచిత శిక్షణ ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉచిత సైకాలజీ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ టెట్ అర్హత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతులను ఉచితంగా బోధించేందుకు అధ్యాపకుడు జనార్దన్రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మొత్తం 70కిపైగా అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● -
దారి తప్పిన సంగ్రామం..!
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వీధికి వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు ఇది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2019లో ఊరంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ నిధులు వస్తే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని ఆశించారు. నజరానా రాకపోవడంతో సాధారణంగా వచ్చే నిధులతో తూతూమంత్రంగా పనులు చేపట్టారు. ఇప్పటికీ పలు వీధుల్లో సీసీరోడ్లు, పంచాయతీకి సొంత భవనం లేదు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన పాత భవనంలోనే కొనసాగుతోంది. ..ఈ ఒక్క గ్రామమే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని అన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పారితోషికం రాక.. నిర్దేశించుకున్న పనులు కాక.. స్థానిక ప్రజల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ట్రెండ్ మారి వేలం పాటల ద్వారా ఏకగ్రీవాలకు క్రేజ్ పెరుగుతుండగా.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయి. యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడం.. దారి తప్పుతున్న సం‘గ్రామం’ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్ ఉవ్ముడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో గత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 322 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 113, నాగర్కర్నూల్లో 80, జోగుళాంబ గద్వాలలో 48, వనపర్తిలో 45, నారాయణపేట జిల్లాలో తక్కువగా 36 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలన్నింటినీ గ్రామస్తులంతా ఒక్కతాటికి వచ్చి ఏకగ్రీవం చేసుకున్నారు. ఆలయ నిర్మాణాల వంటి ప్రధాన పనులు పూర్తి చేస్తామంటూ పలు జీపీల్లో ముందుకు రాగా.. ఆ అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇచ్చారు. కానీ, పెద్దగా వేలం పాటలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. ● జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతకుంట గ్రామాన్ని ఏకగ్రీవం చేసేందుకు కొందరు గ్రామపెద్దలు యత్నించారు. రూ.38.50 లక్షలకు ఏకగ్రీవం చేస్తూ.. సదరు అభ్యర్థి మినహా ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు తీర్మానించగా బెడిసి కొట్టింది. రూ.25 లక్షలు ఇస్తానని ఒకరు ముందుకు రాగా.. ఓ అభ్యర్థి వ్యతిరేకించారు. దీంతోపాటు తన నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టడమే కాకుండా బెదిరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు. మచ్చుకు కొన్ని.. మారిన ట్రెండ్.. డబ్బున్నోళ్లకే చాన్స్? ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ట్రెండ్ మారింది. పలు పంచాయతీల్లో పోటీచేసే ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులతో గ్రామాల పెద్దలు భేటీ ఏర్పాటు చేసి.. ఎవరు ఎంత ఇస్తారంటూ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 550 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 44 జీపీలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మెజార్టీ చోట్ల వేలం పాటల ద్వారానే సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసేలా పెద్దలు చక్రం తిప్పారు. కొన్నిచోట్ల సర్పంచ్ స్థానాల్లో వేలం పాడి పోటీ లేకుండా ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. ఇలా ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువగా రియల్టర్లు, బడా వ్యాపారులే ఉండడం గమనార్హం. దాదాపు 88 శాతం మేర.. ఉమ్మడి జిల్లాలో తొలిదశ ఎన్నికల్లో 44 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 39 గ్రామాల వరకు వేలం ద్వారా పదవులకు తీర్మానం చేసి.. ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేసేలా పెద్దలు చక్రం తిప్పినట్లు నిబంధనలు కఠినం.. కొన్ని ప్రాంతాల్లో వేలం పాటల ద్వారా గ్రామాలను ఏకగ్రీవం చేస్తున్నారనే అంశం ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతో నిబంధనలను మరింత కఠినం చేసింది. నిబంధనల ప్రకారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైన జీపీల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజకీయ నేతల ప్రోద్బలంతో ఉపసంహరించుకున్న వారు మిన్నకుండిపోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలం ద్వారా పదవులు పొందిన వారిపై చర్యలుంటా యా అనేది ప్రశ్నార్థకమేనని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ‘పెద్దల’ చేతుల్లోకి సమస్త గ్రామవాసుల నిర్ణయాధికారం రియల్, వ్యాపార రంగాలకు చెందిన యువతకే గ్రీన్సిగ్నల్ భారీ మొత్తం చెల్లించలేక ఔత్సాహికుల వెనకడుగు పల్లెపోరు పెడదారి పట్టడంతో పలుచోట్ల ‘పంచాయితీ’ యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడమూ కారణమంటున్న మేధావులు -
అద్దె భవనాలే దిక్కు
పోస్టుల భర్తీ ఎప్పుడో.. జిల్లాలో 154 అంగన్వాటీ టీచర్లు, 974 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. కొన్ని కేంద్రాల్లో ప్రైవేటు వ్యక్తులతో పని చేయించుకుంటున్నామని టీచర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. కందనూలు: చిన్నారులకు అక్షరాలు నేర్పించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు లేక చిన్నారులతో పాటు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లోనే బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. వసతులు అంతంతే.. జిల్లావ్యాప్తంగా 1,132 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 932 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాల్లోనూ చిన్నారులకు డిజిటల్ బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆటలు, పాటలతో చిన్నారులను ఆకర్షించే విధంగా వివిధ రకాల ఆటల సామగ్రిని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అద్దె కోసం రూ.వేలు ఖర్చు.. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ఆకర్షణీయంగా ఉండాలి. ఇందుకు సొంత భవనాల్లో అనేక రకాల వసతులు అవసరం. అయితే జిల్లావ్యాప్తంగా 200 వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె రూపంలో ప్రతినెలా రూ.వేలు వెచ్చిస్తున్నారు. కొన్ని చోట్ల పెంకుటిళ్లలోనే కేంద్రాలను కొనసాగిస్తుండటంతో చిన్నారులతో పాటు టీచర్లు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పౌష్టికాహారం నిల్వ చేసేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అన్ని పనులు వారిపైనే.. టీచర్లు లేని చోట ఆయాలు, ఆయాలు లేని చోట టీచర్లు అన్నీ తామై కేంద్రాలను కొనసాగిస్తున్నారు. పిల్లలను కేంద్రాలకు తీసుకురావడంతో మొదలుకొని.. వంట చేయడం, రికార్డులు రాయడం, చదువు చెప్పడం వంటి పనులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక టీచర్లు లేని చోట ఆయాలు కేంద్రాలను నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్వాడీ కేంద్రాలదే. అయితే ఆయా కేంద్రాలకు వచ్చే పాలు, పండ్లు, గుడ్లు ఇతర అంశాలను పక్క కేంద్రాల టీచర్లు చూస్తున్నారు. రెండు విధాలుగా అటు టీచర్లు, ఇటు ఆయాలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయాలు లేకుండా కొనసాగుతున్నవి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువు కనీస వసతులు లేక అవస్థలు భర్తీకి నోచుకోని టీచర్, ఆయా పోస్టులు ప్రభుత్వం దృష్టిసారిస్తేనేపూర్వ ప్రాథమిక విద్య బలోపేతం 974 ప్రతిపాదనలు పంపించాం.. జిల్లాలో 60కి పైగా నూతన భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటాం. – రాజేశ్వరి, డీడబ్ల్యూఓ -
మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ
బిజినేపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణాపై పోలీసు నిఘా ఉంచినట్లు ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం మాంగనూర్ వద్ద ఏర్పాటుచేసిన జిల్లా సరిహద్దు చెక్పోస్టును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల త నిఖీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు, నిషేధిత వస్తువులు రవాణా అయ్యే అవకాశం ఉంటుందని.. చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహ నాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని సూచించారు. శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం నాగర్కర్నూల్ క్రైం: శారీరక దృఢత్వం, మానసికోల్లాసానికి క్రీడలు అవసరమని అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హోంగార్డులకు కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ప్రజ ల రక్షణ కోసం హోంగార్డులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వారిలో మరింత ఉత్తేజం, ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు ని ర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ గౌస్పాషా పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు నల్లమల విద్యార్థి అమ్రాబాద్: మండలంలోని తిర్మలాపూర్ (బీకే) గ్రామానికి చెందిన ఎడ్ల ప్రసాద్ వర్మ జాతీయస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్లలో గతనెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ టోర్నీలో అతడు అత్యుత్తమ ప్రతిభకనబరిచి బ్రౌంజ్ మెడల్ సాధించడంతో పాటు ఈ నెల 16నుంచి 21వ తేదీ వరకు రాజస్థాన్లో జరిగే జాతీయ వాలీ బాల్ పోటీలకు ఎంపికై నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం వరప్రసాద్ వర్మ లింగాల రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు కోడేరు: రైతులు పంట విక్రయం కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వేముల నాయక్ సూచించారు. శుక్రవారం కోడేరు మండలంలోని జనుంపల్లి, తీగలపల్లి, బావాయిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సేకరించాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం జంగయ్య, సీసీలు శేషన్నగౌడ్ ఉన్నారు. -
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
బల్మూర్/లింగాల/ఉప్పునుంతల: ఎన్నికల నిర్వ హణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం బల్మూర్, లింగాల, ఉప్పునుంతల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆర్ఓలు, ఏఆర్ఓలకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎంపీడీఓల పాత్ర కీలకమని.. నామినేషన్లతో మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి పరిమితికి మించి ఎక్కువ మందిని అనుమతించొద్దన్నారు. ఆమె వెంట ఆర్డీఓ మాధవి, జిల్లా నోడల్ అధికారి సీతారాం, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, వెంకటేశ్ ఉన్నారు. రెండు రోజులుగా తిరుగుతున్నా.. నా కొడుకు స్కాలర్షిప్ కోసం కులం సర్టిఫికెట్ అవసరం ఉంది. నేను రెండు రోజులుగా సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా. నోటరీ అఫిడవిట్ కోసం రూ. 500 ఖర్చు అయ్యింది. నోటరీ ఇచ్చినా దరఖాస్తుపై సంతకం పెడుతలేరు. మేం చదువుకోలేదు. మా పేరు మీద కులం సర్టిఫికెట్ లేదు. – రేకులపాటి రోజా, తూడుకుర్తి, నాగర్కర్నూల్ మండలం -
నిబంధనల మేరకే ఏకగ్రీవాలు
సాక్షి, నాగర్కర్నూల్: ‘జిల్లాలోని గ్రామపంచాయ తీల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఏకగ్రీవాలు సజావుగా జరిగేలా దృష్టిసారించాం. ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా విచారణ జరిపిన తర్వాతే ప్రకటిస్తున్నాం. మొదటి విడతలో ఇప్పటివరకు 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఎక్కడైనా ప్రలోభాలకు గురిచేసినా, అభ్యర్థులపై ఒత్తిడి చేసినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలుచేస్తున్నాం. గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.’ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలా కొనసాగుతోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కలెక్టర్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నాం. మొదటి విడత నామినేషన్లు పూర్తికాగా.. 14 జీపీలు ఏకగ్రీమయ్యాయి. వీటిలో 10 జీపీల్లో ఉపసర్పంచ్ ఎన్నిక సైతం పూర్తయ్యింది. రెండు, మూడు విడతల్లో నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ ఇచ్చాం. ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మరోసారి శిక్షణ ఇవ్వనున్నాం. పోస్టల్ బ్యాలెట్తో సహా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశాం. సాక్షి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కలెక్టర్: జిల్లాలో మొత్తం 4,102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. 11,231 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 400 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వీటి పరిధిలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను నియమించాం. పోలింగ్ తీరును వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. సాక్షి: ఎన్నికల కోడ్ అమలుకు ఏ చర్యలు చేపట్టారు? కలెక్టర్: జిల్లాలో ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉల్లంఘనలకు సంబంధించి 230201 నంబర్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై 3 గంటల్లోగా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశాం. మొత్తం 24 గంటల్లోగా సమస్య పరిష్కారం అవుతుంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టీ– పోల్ యాప్ అందుబాటులో ఉంది. జిల్లాలో మూడు చోట్ల చెక్పోస్టులను ఏర్పాటుచేశాం. మరో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయి. చెక్పోస్టు తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 14లక్షల విలువైన మద్యం, రూ. 53వేల నగదు స్వాధీనం చేసుకున్నాం. అభ్యర్థుల ప్రచార ఖర్చులు, సోషల్ మీడియా ప్రచారంపై సైతం దృష్టిసారిస్తున్నాం. సాక్షి: ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ జనాభా లేని గ్రామాల్లో సర్పంచులు ఎన్నిక కాలేకపోతున్నారు. ఆయా గ్రామాల పరిస్థితి ఏంటి? కలెక్టర్: ఏజెన్సీ ఏరియా పరిధిలో అమ్రాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఎస్టీ జనాభా లేదు. అయితే ఏజెన్సీ పరిధిలో స్థానాలను ఎస్టీలకే కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి నివేదించాం. సాక్షి: నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది. అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు ఎలాంటి కారణాలు ఉంటాయి? కలెక్టర్: నామినేషన్ల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. ఇందుకోసం క్లస్టర్ కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశాం. సాధారణంగా రిజర్వుడ్ స్థానాల్లో ఇతరులు నామినేషన్ వేయడం.. కుల ధృవీకరణ సర్టిఫికేట్ సమర్పించకపోవడం.. ఫారాన్ని పూర్తిగా నింపకపోవడం.. ప్రతిపాదకుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం వంటి కారణాల వల్ల నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. నామినేషన్ సమయం సాయంత్రం 5 గంటల తర్వాత సైతం క్యూలో ఉన్న అభ్యర్థులందరి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నాం. సాక్షి: ఎన్నికల్లో పోలింగ్శాతాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అర్హులందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి. పంచాయతీ ఎన్నికల తీరుతెన్నులపై నిశిత పరిశీలన ఏకగ్రీవం కోసం బలవంతం చేస్తే చర్యలు జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బదావత్ సంతోష్ సాక్షి: పంచాయతీల ఏకగ్రీవ ఎన్నికలపై ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.. ప్రలోభాలపై ఫిర్యాదులు అందుతున్నాయా? కలెక్టర్: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 14 జీపీల్లో సింగిల్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమయ్యాయి. వీటిలో రెండు చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. వెల్దండ మండలంలోని రాఘాయిపల్లి, బొల్గట్తండాల్లో ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాం. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. సింగిల్ నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని ఎన్ఓసీ జారీ చేశాకే ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. ఏకగ్రీవం కోసం ఎవరైనా బలవంతం చేస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
అచ్చంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, చారకొండ, లింగాల, పద, ఉప్పునుంతల మండలాల్లో 158 సర్పంచ్, 1,364 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్ణీత సమయం దాటినప్పటికీ.. క్యూలో ఉండటంతో వారిని అనుమతించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పలుచోట్ల అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 656 వార్డు స్థానాలకు 2,190 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండలాల్లో చివరి రోజు దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. నేడు రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు శనివారం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పోటీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. గెలుపోటములపై అంచనాలు వేస్తూ.. తర్జనభర్జన పడుతున్నారు. పోటీ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది.. అనుకూలంగా ఉన్న ఓట్లు.. ప్రత్యర్థులకు పడే ఓట్ల వివరాలు సేకరిస్తున్నారు. పోటీ చేసేందుకు సిద్ధపడిన కొందరు ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా పెద్దలతో సంప్రదింపులు, రాయబారాలు కొనసాగిస్తున్నారు. రెండో విడత బిజినేపల్లి, నాగర్కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో 151 సర్పంచ్, 1,412 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఉందామా.. తప్పుకొందామా? సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన డమ్మీ అభ్యర్థులతో పాటు రెబల్స్కు ఎన్నికలు వరంగా మారాయి. తమకు అధిక సంఖ్యలో ఓటర్ల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. పోటీలో ఉన్న నాయకులు ఉపసంహరణ చేసుకోవాలని కోరినప్పుడు, డమ్మీలు మొదట ససేమిరా అంటూనే ఆపై తమ మనసులోని కోరిక నేరుగా చేప్పేస్తున్నారు. మొదట పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ.. సాగే చర్చలో బేరసారాలు చేస్తున్నారు. చివరకు ఎంతో కొంత సెటిల్ చేసుకుని నామినేషన్లు ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది తమతో మంతనాలు జరిపేందుకు ఎవరు రాకుంటే.. వారే స్వయంగా అభ్యర్థుల వద్దకు వెళ్లి డబ్బులిస్తే పోటీ నుంచి తప్పుకొంటామని బేరసారాలకు దిగుతున్నారు. గెలుపుపై ఆశలు పెట్టుకున్న అవతలి అభ్యర్థులు కొంతలో కొంతనైనా ముట్టజెప్పకపోతారా అని చూస్తున్నారు. మొదటి విడతలో ఇలాంటివి చోటు చేసుకోగా.. రెండు, మూడో విడతల్లోనూ ఈ వ్యవహారం కొనసాగే అవకాశం ఉంది. మండలం జీపీలు సర్పంచ్ వార్డులు దాఖలైన నామినేషన్లు నామినేషన్లు అచ్చంపేట 38 150 312 350 అమ్రాబాద్ 20 90 182 275 బల్మూర్ 23 106 208 464 చారకొండ 17 78 142 267 లింగాల 23 85 206 310 పదర 10 63 92 194 ఉప్పునుంతల 27 84 222 330 మూడో విడత చివరి రోజు సర్పంచ్కు 656, వార్డులకు 2,190 నామినేషన్లు -
కుల ధ్రువపత్రాల కోసం తిప్పలు
సాక్షి, నాగర్కర్నూల్: కుల ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా ఎస్సీ కుల సర్టిఫికెట్ జారీ కోసం రెవెన్యూ అధికారులు కుటుంబసభ్యుల కుల సర్టిఫికెట్ సమర్పించాలని చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు సర్టిఫికెట్ లేని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కుల సర్టిఫికెట్ కోసం అఫిడవిట్ అవసరం లేకపోయినా విద్యార్థులంతా డబ్బులు వెచ్చించి అఫిడవిట్ సమర్పిస్తున్నారు. అధికారులు అఫిడవిట్తో పాటు కుటుంబ సభ్యులకు గతంలో జారీ చేసిన కుల సర్టిఫికెట్ ఉంటేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు కోసం ఈ నెల 8 వరకే సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల జారీకి అధికారులు తిరస్కరిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై నాగర్కర్నూల్ ఆర్ఐ అబిద్ అలీని వివరణ కోరగా.. అఫిడవిట్ అవసరం లేదని, పాత కుల ధ్రువపత్రం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయాల్లో విద్యార్థుల బారులు -
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
పడమటి ఆంజనేయస్వామి రథాన్ని లాగుతున్న భక్తులు మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనులపండువగా జరిపారు. మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. రథాన్ని బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన ఈ వేడుకను ఉమ్మడి పాలమూరుతో పాటు హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో మక్తల్ రాంలీలా మైదానం మార్మోగింది. – మక్తల్ -
నామినేషన్ల జోరు
బరిలో నుంచి తప్పించేలా.. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు గెలుపు కోసం పోటీదారులను బుజ్జగిస్తున్నారు. రెబల్స్ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మూడో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టిసారించారు. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4,102 వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించారు. ఇక రెండో విడత నామినేషన్లపై ఫిర్యాదులకు గురువారం వరకు అవకాశం కల్పించారు. వీటిని శుక్రవారం పరిష్కరిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తర్వాత మిగిలిన వారికి గుర్తులు కేటాయిస్తారు. అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో దశలో నామినేషన్ల జోరు కొనసాగుతుంది. అచ్చంపేట నియోజకవర్గం 7 మండలాల పరిధిలోని 158 గ్రామాలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గురువారం రెండో సర్పంచ్ స్థానాలకు 242, వార్డు స్థానాలకు 626 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మంచి రోజు లేదని చాలామంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. చివరి రోజు శుక్రవారం అభ్యర్థులు ఆయా క్లస్టర్ల కేంద్రాలకు చేరుకుని భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. అచ్చంపేట మండలం హాజీపూర్, చెన్నారం, ఉప్పునుంతల క్లస్టర్లలో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు రావడంతో ఆలస్యమైంది. లింగాల, పద్మనపల్లి, సూరాపూర్, కొత్తకుంటపల్లి పంచాయతీలకు రాత్రి 9.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతలో గురువారం దాఖలైన నామినేషన్లు ఇలా.. ఏడు మండలాల్లో కొనసాగుతున్న మూడో దశ స్వీకరణ రెండోరోజు సర్పంచ్లకు 242, వార్డు స్థానాలకు 626 దాఖలు నేటితో ముగియనున్న చివరి విడత ప్రక్రియ మరోవైపు ఉపసంహరణ, ఏకగ్రీవాలపై ప్రధాన పార్టీల దృష్టి గెలుపు వ్యూహాలపై అభ్యర్థుల కసరత్తు -
పవనసుతా.. పాహిమాం
అమ్రాబాద్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి క్షేత్రం స్వామివారి నామస్మరణతో మార్మోగింది. గత నెల 31న ప్రారంభమైన దీక్షమాల విరమణ బ్రహ్మోత్సవాలు గురువారం మగిశాయి. వేలాది మంది మాలధారణ భక్తులు 41 రోజుల కఠోర దీక్షల అనంతరం ఉత్సవాలలో దీక్షల విరమణ పొందారు. పవనసుతా.. పాహిమాం.. అంజనిపుత్ర వాయునందన, కాపాడయ్యా.. కరుణించయ్యా.. అంటూ భక్తులు స్వామిని స్తుతించిన తీరుతో మద్దిమడుగు క్షేత్రం పులకించిపోయింది. చివరి రోజు ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో గాయత్రి మహాయజ్ఞం దీక్షమాల విరమణ ఉత్సవాల ముగింపు సందర్భంగా గాయత్రి మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి గవ్యాంతర పూజలు, మన్యు సూక్తులతో సమీప కృష్ణానది నుంచి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తెచ్చి 108 కళశాలతో జలాభిషేకం, కుంబాభిషేకం చేశారు. ఆలయం ముందు నిర్మించిన యజ్ఞశాలలో హనుమాన్ మూలవిరాట్ విగ్రహాన్ని ఉంచి వేదపండితులు నీలకంఠశాస్త్రి, వీరయ్యశర్మ, షణ్ముఖశివప్రాదశాస్త్రిల బృందం మంత్రోచ్ఛరణాలతో యజ్ఞం జరపగా.. ఆలయ ఈఓ రంగాచారి, దీక్షమాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ సేవకు వెళ్లదీశారు. యాగశాలలో మహా పూర్ణాహుతి, అవభృతం స్నానం చేయించి అష్టాదశ కళశాలు, 1.25 లక్షల నాగవల్లి దళం (తమలపాకులు) స్వామివారికి సమర్పించారు. వేడుకలకు నాగర్కర్నూల్ జిల్లా నుంచే కాకుండా మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఏపీలోని గుంటూరు, ప్రకాశం తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అంజన్న నామస్మరణతోపులకించిన మద్దిమడుగు చివరిరోజు వైభవంగా గాయత్రి మహాయజ్ఞం ముగిసిన దీక్షమాల విరమణ బ్రహ్మోత్సవాలు -
ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు
అచ్చంపేట రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ హెచ్చరించారు. గురువారం ఆయన అచ్చంపేట మండలంలోని నడింపల్లి, పల్కపల్లి క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మూడో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం అచ్చంపేటలోని పోలీస్స్టేషన్ను పరిశీలించారు. రౌడీషీటర్లు, ఇతర విషయాలపై సీఐ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. -
పొత్తుల రాజకీయం..!
పల్లె పోరులో చిత్రవిచిత్రాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: విజయమే లక్ష్యం.. ఇందుకు ఏదీ అనర్హం కాదు అన్నట్లు ఉంది ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లోని రాజకీయ పరిస్థితులు. పల్లె పోరు తొలి దశలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసి.. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు వారు ప్రచారం మొదలుపెట్టారు. రెండో దశలో నామినేషన్ల స్క్రూటినీ ముగియగా.. అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. చివరి దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా కీలక ఘట్టానికి చేరుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చిత్రవిచిత్ర పొత్తులు చోటుచేసుకున్నాయి. ఒక్కో చోట బీఆర్ఎస్, బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏకమై అభ్యర్థులను రంగంలోకి దింపగా.. ఆయా ప్రాంతాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పైచేయి కోసం ఒకరికొకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకోవడమే ట్రెండ్గా మారిన ప్రస్తుత రాజకీయాల్లో ఊహించని పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఊహించని మద్దతులు కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ఎన్నికల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ, ఎంసీసీ అమలు, బ్యాలెట్ పత్రాల లెక్కింపు తదితర వాటిపై అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓల బాధ్యత అత్యంత కీలకం అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న తప్పిదం కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సమక్షంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు, ఎన్నికల సిబ్బందికి మౌలిక వసతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఓటర్లకు అనుకూల వాతావరణం కల్పించడం, పోలింగ్ మెటీరియల్ సక్రమ వినియోగం, బ్యాలెట్ పత్రాల లెక్కింపు, సీల్ విధానం వంటి అంశాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చోటుచేసుకోకూడదని, తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి దశలో జాగ్రత్తలు పాటించడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్ మాట్లాడుతూ సర్పంచులు, వార్డుసభ్యుల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో చేస్తున్న వ్యయాలపై నిఘా పెట్టాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొదలైన మూడో విడత నామినేషన్ల పర్వం
అచ్చంపేట: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా.. బుధవారం నుంచి మూడో విడత నామినేషన్లు అధికారులు స్వీకరించారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల పరిధిలోని 158 గ్రామ పంచాయతీలకు గాను 93 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి 90 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు మూడో విడత నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డెలికేషన్ కమిటీ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని, మూడో విడతలో జిల్లా లోని ఏజెన్సీ మండలా ల్లోని స్థానాలను వంద శాతం ఎస్టీలకే కేటాయించారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన ఆయా మండలాల్లో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడవద్దని, ఎవరైనా ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలాలు పంచాయతీలు సర్పంచ్ వార్డులు నామినేషన్లు నామినేషన్లు అచ్చంపేట 38 25 312 19 అమ్రాబాద్ 20 09 182 07 బల్మూర్ 23 08 208 08 చారకొండ 17 11 142 21 లింగాల 23 08 206 16 పదర 10 13 92 10 ఉప్పునుంతల 27 19 222 09 మొత్తం 158 93 1,364 90 మండలాల వారీగా. -
నాగర్కర్నూల్
పాత కొత్త ఒక్కో చోట ఒకలా.. రేపటి నుంచి కబడ్డీ టోర్నీ పాలమూర్లోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నుంచి 51వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uఉమ్మడి జిల్లాలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ పడుతున్న వారిలో ఎక్కువ శాతం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే (పాత) ఆయా నియోజకవర్గాల నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట మాత్రం బెట్టి చరిష్మా, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని గ్రహించిన పలు నియోజకవర్గాల నేతలు నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారిని నేరుగా పిలిపించుకుని భవిష్యత్లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని.. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు -
విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి
లింగాల: ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం, మండలంలోని అంబట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోమటికుంట, దత్తారం, శాయిన్పేట పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా విద్యాలయం, అంబట్పల్లి ఉన్నత పాఠశాలలో ఇంటర్, పది విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు రెగ్యూలర్ తరగతులే గాక ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పలు పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరిన విషయం గుర్తించామని, కొత్త భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బషీర్అహ్మద్, జీఈసీఓ శోభారాణి, హెచ్ఎం నిరంజన్, ఎస్ఓ శారద ఉన్నారు. -
ని(గె)లిచేదెవరు..?
అచ్చంపేట: తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు. మొదటి విడతలో కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ తండా, జీడీపల్లి, తెలకపల్లి మండలంలో గట్టురాయపాకుల, ఊర్కొండ మండలం గుంటపల్లి, వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలం కేస్లీతండా, బండోనిపల్లి కలిపి 7 సర్పంచ్ స్థానాలు, 144 వార్డుల ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో వాటిని ఏకగ్రీవ ఎన్నికగా ప్రకటించడమే మిగిలింది. వాటిని గురువారం కలెక్టర్ అధికారికంగా వెలువరించే అవకాశం ఉంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా.. పరిశీలన మంగళవారం, బుధవారం ముగిసింది. మొదటి విడతలో సర్పంచ్ స్థానాలకు 967, వార్డులకు 3,355 నామినేషన్లు రాగా.. రెండో విడతలో సర్పంచ్కు 1046, వార్డులకు 3,810 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సింగిల్ నామినేషన్కు.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కటే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా గెలిచినట్లవుతోంది. సదరు అభ్యర్థి స్వీయ ధ్రువీకరణ పత్రం రిటర్నింగ్ అధికారి అందజేయాల్సి ఉంటుంది. ఆర్ఓ డిక్లరేషన్ను పరిశీలించి ఆమోదిస్తేనే ఆ పదవి ఏకగ్రీవమవుతుంది. ఏకగ్రీవమైన పదవుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఆర్వోలు పంపించినట్లయితే గెజిట్ విడుదల చేస్తారు. అనంతరం ఏకగ్రీవ అభ్యర్థులు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఉపసంహరణ చేయాలంటే.. ఏకగ్రీవాలకు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే పోటీదారులపై తీవ్రమైన ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థి సంబంఽధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితేనే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాలు అవుతుంది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో ఆర్వో విచారణ చేసే అవకాశముంది. మండలం జీపీలు పోటీదారులు వార్డులు పోటీదారులు కల్వకుర్తి 24 153 214 603 తాడూరు 24 159 216 547 తెలకపల్లి 28 197 260 623 ఊర్కొండ 16 90 138 354 వంగూరు 27 192 228 555 వెల్దండ 32 176 270 673 మొత్తం 151 967 1,326 3,355 మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు బిజినేపల్లి 35 246 324 971 కోడేరు 16 129 156 440 కొల్లాపూర్ 18 139 168 426 నాగర్కర్నూల్ 18 131 178 453 పెద్దకొత్తపల్లి 28 201 258 726 పెంట్లవెల్లి 10 64 92 247 తిమ్మాజిపేట 26 136 236 547 మొత్తం 151 1046 1,412 3,810పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు డిసెంబర్ 11న పోలింగ్ రెండో విడత స్క్రూట్నీ.. అభ్యంతరాలు ఉంటే.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలు సమర్పిస్తే ఆర్వోలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఒకవేళ తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి ఆర్డీఓకు ఆప్పీలు చేసుకోవచ్చు. రెండు రోజుల నిర్ణీత గడువులోపు పరిష్కరించుకోవాలి. -
తగ్గనున్న దూరభారం
నాగర్కర్నూల్ క్రైం: స్థానిక ఎస్పీ కార్యాలయం సమీపంలో జిల్లా రవాణా శాఖ నూతన కార్యాలయం నిర్మించేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయం జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో మల్కాపూర్ సమీపంలో ఉండడంతో వినియోగదారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్లాట్లకు ధరలు పెంచుకునేందుకు తమ వెంచర్ పక్కనే డీటీఓ భవనం నిర్మించి ఇచ్చారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రియల్ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలను దూరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కార్యాలయంలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన ఎమ్మెల్యే రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎస్పీ కార్యాలయానికి సమీపంలో 2ఎకరాల భూమిని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి కేటాయించేందుకు కృషి చేశారు. ఇటీవలే భూమిపూజ జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ భూమి పత్రాలను తహసీల్దార్ సమక్షంలో డీటీఓ చిన్న బాలుకు అందజేశారు. అనంతరం నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి భూమిపూజ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాగా మారినప్పటి నుంచి ఉయ్యలవాడ సమీపంలో అద్దె భవనంలో రవాణాశాఖ కార్యాలయానికి సంబంధించిన సేవలు కొనసాగాయి. రెండేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం వారు నిర్మించి ఇచ్చిన భవనంలోకి రవాణాశాఖ కార్యాలయాన్ని మార్చి సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నుంచి ప్రతిరోజు జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి వంద మంది వరకు వివిధ సేవలు పొందేందుకు వస్తున్నారు. ఎస్పీ కార్యాలయం పక్కనే జిల్లా రవాణా శాఖ నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు ప్రస్తుతం జిల్లా కేంద్రానికి 10 కి.మీ. దూరంలో.. అధునాతన వసతుల ఏర్పాటుకు చర్యలు ఇటీవలే ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ ఉగాది వరకు ప్రారంభించేందుకు కసరత్తు జిల్లా రవాణాశాఖ సేవలను ప్రజలకు అందించేందుకు నిర్మిస్తున్న జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని ఉగాదిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన భవనంతో పాటు వాహనదారులకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ట్రాక్ను, ఇతర గదుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. సేవలు మరింత దగ్గరవుతాయి జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల రవాణాశాఖ సేవలు వినియోగించుకునేందుకు ఎంతో సులభంగా ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాలంటే పది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సరైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ ఏదైనా అవసరం పడితే జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉంది. – గోవర్ధన్, నాగర్కర్నూల్ ఉగాదిలోగా.. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా రవా ణాశాఖ కార్యాలయానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. నూతన భవనం ఉగాదిలోగా పూర్తి చేసి అందుబాటు లో తీసుకొస్తాం. రవాణాశాఖ సేవలు పొందేందుకు ప్రజలకు మరింత సులువవుతుంది. – చిన్నబాలు, డీటీఓ, నాగర్కర్నూల్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కందనూలు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సైన్స డిగ్రీ కళాశాలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ఆధ్వర్యంలో ఎకో క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మదన్మోహన్ మాట్లాడుతూ వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం పర్యావరణంపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించారు. కేజీబీవీ విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
నేటినుంచి మూడో విడత
సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అచ్చంపేట, లింగాల, బల్మూరు, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల పరిధిలోని 158 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ కేంద్రాల వద్ద అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 6న శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అప్పీళ్లు చేసుకునేందుకు 7 వరకు అవకాశం ఉండగా.. 8 వరకు అప్పీళ్లను పరిష్కరిస్తారు. 9న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతాయి. 11 క్లస్టర్ల ఏర్పాటు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా మండలాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అచ్చంపేట మండలంలో మొత్తం 38 గ్రామ పంచాయతీలు ఉండగా.. 11 క్లస్టర్లు ఉన్నాయి. చెన్నారం క్లస్టర్ పరిధిలో చెన్నారం, సింగారం, పెద్దతండా, కన్యాతండా, ఎద్దుమిట్టతండా, హాజీపూర్ క్లస్టర్లో హాజీపూర్, బుడ్డతండా, చందాపూర్, అంకిరోనిపల్లి, బ్రాహ్మణపల్లి, పలకపల్లి క్లస్టర్లో పలకపల్లి, లింగోటం, లక్ష్మాపూర్ క్లస్టర్లో లక్ష్మాపూర్, గుంపన్పల్లి, చౌటపల్లి, చెంచుపల్గుతండా, నడింపల్లి క్లస్టర్లో నడింపల్లి, పులిజాల, రంగాపూర్ క్లస్టర్లో రంగాపూర్, బోల్గట్పల్లి, దర్శన్గడ్డ, ఐనోలు క్లస్టర్లో ఐనోలు, శివారుతండా, దుబ్బతండా, కొర్రతండా, చేదురుబావితండా, బొమ్మనపల్లి క్లస్టర్లో బొమ్మనపల్లి, కిష్ట్యాతండా, సిద్దాపూర్ క్లస్టర్లో సిద్దాపూర్, పద్మారంతండా, మన్నెవారిపల్లి క్టస్టర్లో మన్నెవారిపల్లి, జోగ్యతండా, దేవులతండా, మర్లపాడుతండా, ఘనపూర్ క్లస్టర్లో ఘనపూర్, ఆంజనేయులుతండా, అక్కారం, బక్కలింగాయిపల్లి ఉన్నాయి. ఆ గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులేరి? అమ్రాబాద్ మండలంలోని 5 గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎన్నుకునేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులు కరువయ్యారు. అనుకూలమైన రిజర్వేషన్ లేకున్నా.. ఉప సర్పంచ్గానైనా బాధ్యతలు స్వీకరిద్దామంటే వార్డుసభ్యుల మెజార్టీ సైతం దక్కడం లేదు. ఈ మండలంలో మొతం 20 పంచాయతీలు ఉండగా.. తుర్కపల్లి మినహా మిగిలిన 19 జీపీలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో కుమ్మరోనిపల్లి, ప్రశాంత్నగర్, కల్మూలోనిపల్లి, లక్ష్మాపూర్(బీకే), వంగురోనిపల్లి గత కొన్నేళ్లుగా సర్పంచ్, ఉపసర్పంచ్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఎన్నికలే నిర్వహించడం లేదు. ఏజెన్సీ ఏరియా కావడంతో సర్పంచ్ స్థానాలతో పాటు 8 వార్డులకు గాను అందులో నాలుగు వార్డులు సైతం ఎస్టీలకే రిజర్వేషన్ కేటాయించగా.. ఇక్కడ ఆ వర్గానికి చెందిన వారు లేరు. ఫలితంగా ఇప్పటి మూడు పర్యాయాలు ఈ గ్రామాలు సర్పంచ్ పదవికి దూరంగా ఉన్నాయి. తొలి విడత ఉపసంహరణకు నేడే ఆఖరు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో దాఖలైన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. బుధవారమే తుది గడువు కావడంతో పలువురు అభ్యర్థుల నామినేషన్ల విత్డ్రా కోసం బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఓట్ల చీలికతో పార్టీకి నష్టం జరుగుతుందని నచ్చజెప్పుతున్నారు. బీఆర్ఎస్లోనూ ఒకరికన్నా ఎక్కువ మంది నామినేషన్లు వేసిన చోట విత్డ్రా కోసం పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. తొలివిడత ఎన్నికల కోసం ఇప్పటికే నామినేషన్లు వేసిన వారిలో ఎవరు తప్పుకుంటారో.. ఎందరు బరిలో ఉంటారో సాయంత్రం వరకు తేలనుంది. 11 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి 7 మండలాల పరిధిలో 158 జీపీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు -
నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ
నాగర్కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లాలో మొదటి, రెండో విడతలో 13 మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి మొదటి, రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ పరిశీలకులు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయం పర్యవేక్షణలో ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 6 మండలాల్లోని 1,326 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే 3,502 మంది పీఓ, ఓపీఓలను, రెండో దశ ఎన్నికలకు 7 మండలాల్లోని 1,412 పోలింగ్ కేంద్రాలకు గాను 4,106 మందిని నియమించామన్నారు. ప్రతి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు 20 శాతం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. సిబ్బందికి ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని వివరించారు. ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి తెలకపల్లి: రాబోయే పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన తెలకపల్లి, పెద్దపల్లి, ఆలేరు, పెద్దూరు గ్రామాల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఇందుకోసం ముందు నుంచే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని చెప్పారు. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార పదార్థాలు పరిశీలించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అనువైన వాతావరణం కల్పించాలని చెప్పారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్సింగ్జి పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫ్రాడ్కో పుల్స్టాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఫ్రాడ్కో పుల్స్టాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రోగ్రాం ఆరు వారాలలో ఆరు విభిన్న అంశాలపై నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం మంగళవారం నుంచి వచ్చే నెల 12 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేయడం అత్యంత ముఖ్యమన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే అంశం పోలీస్ శాఖలో లేదని, అలా వచ్చే కాల్స్ మోసపూరితమైనవని గుర్తించాలని చెప్పారు. అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారని, అలాంటి పరిస్థితులకు గురైతే ఎలాంటి భయానికి లోనవకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. బ్యాంకులు ఓటీపీల కోసం ఫోన్ చేయవని, అలాంటి కాల్స్కు స్పందించకూడదన్నారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు మొదట లాభం చూపి తర్వాత పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తాయని, అలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ ఉపేందర్రావు, జిల్లా సైబర్ క్రైం టీం, పాలెం యూనివర్సిటీ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్
సరి, బేసి.. రిజర్వేషన్లు కోసి! బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: ఆకాశంలో.. అవనిలో.. అన్నింటా సగం అంటూ మహిళామణులను ఆదరిస్తుంటాం. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లోనూ సగం స్థానాలు మహిళలకు రిజర్వు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళల కోటా తగ్గడంపై అందరూ విస్తుపోతున్నారు. సగం కంటే ఎక్కువ ఉండరాదనే కొత్త నిబంధనల మేరకు అధికారులు మహిళలకు స్థానాలు విభజించగా.. సర్పంచ్, వార్డు స్థానాల్లో సంఖ్య గణనీయంగా తగ్గింది. రాజకీయంగా మహిళలను చైతన్యవంతులను చేసేందుకు రిజర్వేషన్లు కేటాయించడంతో కొత్తతరం మహిళలు తెరపైకి వస్తున్నారు. ఈ రిజర్వేషన్లు చాలామంది రాజకీయ ఎదుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఇదీ అసలు సమస్య.. సర్పంచ్, వార్డుస్థానాలు సరి సంఖ్య ఉన్నచోట సగం మహిళలకు కేటాయించగా.. బేసి సంఖ్య ఉన్న చోటే సమస్య ఉత్పన్నమవుతోంది. ఆ మండలంలో బీసీ కేటగిరికి 3 స్థానాలు ఉంటే అందులో సగం అంటే 1.5 శాతం అవుతోంది. ఈ లెక్కన సగం శాతం కంటే ఎక్కువ ఉంటే 2 స్థానాలు మహిళలకు, జనరల్కు ఒక స్థానం ఇంతకు ముందు కేటాయించేవారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అలాంటి చోట మహిళలకు 1, జనరల్కు 2 స్థానాలు రిజర్వు చేశారు. 7 స్థానాలుంటే 3 మహిళలకు, 4 జనరల్కు కేటాయించారు. అదే గతంలో మాత్రం 7 స్థానాలున్న చోట 4 మహిళలకు, 3 జనరల్కు రిజర్వు అయ్యాయి. అన్ని కేటగిరిల్లో ఇదే విధానం అమలు చేశారు. సంఖ్యా విభజనలో మహిళలకు తగ్గిన స్థానాలు గతంలో కంటే గ్రామాలు, వార్డులు పెరిగినా కేటాయించని వైనం -
కాంగ్రెస్లో లుకలుకలు..!
అమాత్యుల ఇలాకాల్లో ‘అంతర్గత’ పోరు ● మక్తల్లో తారస్థాయికి ‘కోటరీ’ లొల్లి ● ‘మద్దతు’ నేతలతో మంత్రికి పెరిగిన దూరం ● పట్టించుకోవడం లేదంటూ సెకండ్ కేడర్ కినుక ● సీఎం రేవంత్ సభపై ‘అసమ్మతి’ ప్రభావం? ● శ్రీహరి నారాజ్తో వెలుగులోకి విభేదాలు ● ‘కొల్లాపూర్’లో సైతంఇలాంటి పరిస్థితులే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్రెడ్డి వచ్చిన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచ్చినా బాధపడలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మీ ప్రవర్తనతో మనసు గాయపడింది. ఈ తప్పు మరోసారి చేయకండి.’’ ..నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన–విజయోత్సవాల సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఆయన ఇలా నారాజ్ వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మక్తల్ కాంగ్రెస్లో లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. మరో మంత్రి జూపల్లి సొంత ఇలాకా కొల్లాపూర్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక కోటరీ.. దూరంగా నేతలు 2023 ఎన్నికల సమయంలో మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరితో పాటు బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డి, నాగరాజుగౌడ్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడ్డారు. అధిష్టానం వాకిటి వైపే మొగ్గుచూపగా.. ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో మిగిలిన వారు ఏకమై ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా శ్రీహరి గెలుపొందిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు వారందరూ ఐక్యంగానే ఉన్నారు. ఆ తర్వాత పలువురితో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరించడంతో వారి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మంత్రి అయిన తర్వాత గెలుపునకు సహకరించిన వారిలో ఓ వర్గం ప్రత్యేక కోటరీగా ఏర్పడగా.. మిగిలిన నేతలతో శ్రీహరికి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. కనీసం కలవలేని పరిస్థితుల్లో ఆయా నేతలు ఆయనకు దూరంగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అగ్గి రాజేసిన ఆ లేఖలు.. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ముదిరాజ్లకు న్యాయం చేసేలా రాష్ట్ర కేబినెట్లో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అవకాశం కల్పించనున్నట్లు ఎంపీ ఎన్నికల సమయంలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఏకై క ముదిరాజ్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాగా.. ఆయనకే అవకాశం దక్కింది. అయితే మంత్రివర్గంలోకి ఆయనను తీసుకునేందుకు కొన్ని నెలలు పట్టింది. ఈ సమయంలో ‘ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.. మిగతా వారిని పట్టించుకోవడం లేదు’ అంటూ వాకిటి శ్రీహరిపై పలు లేఖలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఇవే శ్రీహరికి, పలువురు నేతల మధ్య అగ్గి రాజుకునేలా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి మధ్య అంతరం పెరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ‘కొల్లాపూర్’లో సైతం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో సైతం అసమ్మతి నెలకొన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఆయనతో పాటు చింతలపల్లి జగదీశ్వర్రావు కాంగ్రెస్ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం జూపల్లికే అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో తొలుత జగదీశ్వర్రావు తాను ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉండి సేవలందిస్తున్నానని.. పార్టీ నుంచి వెళ్లి మళ్లీ వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అధిష్టానం నచ్చజెప్పడంతో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో పాటు ఆయన అనుచరులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో జగదీశ్వర్రావు అసంతృప్తితో ఉన్న ట్లు సమాచారం. మరోవైపు ఇటీవల ఆయన అనుచరులతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. -
అభ్యర్థులను బెదిరిస్తే కఠిన చర్యలు
వెల్దండ: స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఏకగ్రీవం కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాయఘపల్లి గ్రామాన్ని వారు సందర్శించారు. గ్రామ పంచాయతీని ఎస్సీ జనరల్కు కేటాయించగా.. సామ రామచంద్రయ్య, బర్కం గణేష్, సామ వెంకటయ్య, బర్కం యాదయ్య, కమల్ల కొండల్, సామ రాజు నామినేషన్ వేశారు. అయితే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు బహిరంగ వేలం నిర్వహించి సామ వెంకటయ్య గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పోటీలో ఉన్న ఆరుమంది సర్పంచ్ ఏకగ్రీవం చేసేందుకు సుముఖత వ్యక్తం చేయగా బర్కం గణేష్ తిరస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కొంతమంది అతన్ని బెదిరింపులకు పాల్పడి, కొంత నగదు ఇస్తామని ఆశచూపినట్లు బాధితుడు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోలు పెట్టారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్డీఓ జనార్దన్రెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్ధన్రెడ్డి మండల అధికారులతో కలిసి గ్రామానికి చేరుకుని సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం తగదన్నారు. ఇకపై గణేష్ను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయబోమని తీర్మానం చేసి సంతకాలు చేశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్కుమార్, ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్లాల్, ఎంపీఓ లక్ష్మణ్, కార్యదర్శి ప్రేమలత, ఆర్ఐ శంకర్, జీపీఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు నమోదు రాఘాయపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ప్రచారం చేసిన సామ వెంకటయ్యపై ఫ్లయింగ్ స్క్వాడ్ చిందానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. గ్రామంలో డబ్బు ప్రచారం చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
చివరిరోజు నామినేషన్ల జోరు
● సర్పంచ్లకు 441,వార్డు స్థానాలకు 1,881 దాఖలు ● నాగర్కర్నూల్, కొల్లాపూర్ మండలాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో క్లస్టర్ కేంద్రాలకు అభ్యర్థులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలు దాటినప్పటికీ క్యూలైన్లలో బారులుదీరిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నాగర్కర్నూల్, కొల్లాపూర్ మండలాల్లో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ స్థానాలకు సంబంధించి పెద్దకొత్తపల్లి మండలంలో 121, కోడేరు 70, పెంట్లవెల్లి 40, బిజినేపల్లి 104, తిమ్మాజిపేట 106 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు సంబంధించి పెద్దకొత్తపల్లి 461, కోడేరు 317, పెంట్లవెల్లి 170, బిజినేపల్లి 601, తిమ్మాజిపేట మండలంలో 332 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా సర్పంచ్లకు 441, వార్డు స్థానాలకు 1,881 నామినేషన్లు వచ్చాయి. -
మరింత చేరువగా దూరవిద్య
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్లు పెంచడంతోపాటు చదువు మధ్యలో మానేసి చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగా ఓపెన్ స్కూల్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున అడ్మిషన్లు ఇస్తుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 4,600 అడ్మిషన్లు ఇవ్వగా.. ఈసారి ఏకంగా 8,641 అడ్మిషన్లు ఇవ్వడం గమనార్హం. పాఠశాలకు వెళ్లలేని వారు.. చాలామంది ఆర్థిక కారణాలు, ఇతర సమస్యల వల్ల మధ్యలో చదువు మానివేసి ఉంటారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ పూర్తిచేయడంతో పాటు ఇంటర్లో బైపీసీ ఇతర ఆర్ట్స్ కోర్సులు కూడా చదువుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. వారం మొత్తం పనులు చేసుకుని వారంలో చివరి రోజు అయిన ఆదివారం మాత్రం తమకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో తరగతులు వినేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం సిలబస్లో 30 తరగతులు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ఫీజులు చెల్లించిన వాటితోనే స్టడీ పుస్తకాలు కూడా అధికారులు అందజేస్తున్నారు. రెగ్యులర్ వారితో సమానంగా.. ఓపెన్ స్కూల్ ద్వారా చదివితే రెగ్యులర్ సర్టిఫికెట్కు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న సర్టిఫికెట్ను అదే స్థాయిలో గుర్తిస్తారు. ఓపెన్లో ఎస్సెస్సీ పూర్తి చేసి ఇంటర్ రెగ్యులర్గా చదువుకోవచ్చు. ఇక ఓపెన్లో ఇంటర్ చదివితే ఐఐటీ, నీట్తోపాటు ఇంటర్స్థాయిలో ఉండే అన్ని ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వీరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ అడ్మిషన్లు కావడానికి ప్రధాన కారణం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువులు మధ్యలో మానివేసిన వారితో అధికారులు ఎక్కువగా అడ్మిషన్లు చేయించారు. వీటితో పాటు వివిధ సమీకృత కంపెనీలు, సంస్థల్లో కూడా మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి అడ్మిషన్లు చేయించారు.ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓపెన్ స్కూల్ సేవలు గతం కంటే ఎక్కువ అడ్మిషన్లు కల్పించిన అధికారులు చదువు మధ్యలో మానేసిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులకు సదావకాశం పనిచేసుకుంటూనే చదువు కొనసాగించే వెసులుబాటు 2,823 అడ్మిషన్లతో మహబూబ్నగర్ రాష్ట్రంలోనే అగ్రస్థానం -
ప్రాతినిధ్యం కరువు
సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం మేరకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రిజర్వేషన్లను అమలుచేశారు. అయితే జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా.. మూడు మండలాల్లో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. మరో మూడు మండలాల పరిధిలో బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఒక్క సర్పంచ్ స్థానానికే పరిమితం అయ్యింది. అలాగే అమ్రాబాద్, పదర మండలాల్లో అత్యధిక సంఖ్యలో ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ ఆయా మండలాల్లో వారికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఒక్క స్థానం కూడా.. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సంబంధించి జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల్లో బీసీ వర్గాలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వ్ కాలేదు. దీంతో మూడు మండలాల పరిధిలో బీసీలకు రిజర్వేషన్లలో అవకాశం లేకుండాపోయింది. అచ్చంపేట మండలంలో మొత్తం 38 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 27 సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు, మూడు ఎస్సీలకు రిజర్వ్ కాగా, 8 స్థానాలు అన్ రిజర్వ్ అయ్యాయి. అమ్రాబాద్ మండలంలో 20 సర్పంచ్ స్థానాలుంటే 19 స్థానాల్లో ఎస్టీలకు, ఒకటి అన్రిజర్వు అయ్యింది. ఈ మండలంలో తుర్కపల్లి గ్రామం ఒక్కటే జనరల్ ఉంది. పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని స్థానాలను ఎస్టీలకే కేటాయించారు. అలాగే బల్మూరు, లింగాల, చారకొండ మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యింది. బల్మూర్ మండలంలో మొత్తం 23 జీపీలకు గానూ మంగలికుంటపల్లి ఒక్కటే బీసీలకు కేటాయించారు. లింగాల మండలంలో 23 సర్పంచ్ స్థానాలు ఉండగా, క్యాంపు రాయవరంలో బీసీలకు అవకాశం దక్కింది. చారకొండ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే వీటిలో చారకొండ మండల కేంద్రం ఒక్కటే బీసీలకు రిజర్వ్ అయ్యింది. ఊర్కొండ మండలంలో 16 గ్రామాలు ఉంటే ఊర్కొండ, మాధారం గ్రామాలను బీసీలకు కేటాయించారు. మరో మూడుచోట్ల ఒక సర్పంచ్ స్థానానికే పరిమితం అమ్రాబాద్, పదర, అచ్చంపేటలో అన్ని గ్రామాలు ఎస్టీలకే రిజర్వ్ బల్మూరు మండలంలో బీసీలకు ఒకటే సర్పంచ్ స్థానం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఎస్సీ జనాభా ప్రభావిత వర్గంగా ఉంది. అప్పర్ప్లాట్గా పిలుచుకునే అమ్రాబాద్, పదర మండలాల్లో ఎస్సీల జనాభే ఎక్కువ. అయితే ఈ రెండు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానంలో కూడా పోటీ చేసేందుకు ఎస్సీలకు అవకాశం లేదు. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో ఈ మండలాల పరిధిలోని గ్రామాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక్కరు కూడా ఎస్టీ జనాభా లేని కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్నగర్, లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి గ్రామాల్లోనూ ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. దీంతో పోటీ చేసేందుకు ఎస్టీలే లేకపోవడంతో ఈ గ్రామాలు సర్పంచులు లేకుండానే ఉండిపోనున్నాయి. పదర మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. అచ్చంపేట మండలంలోనూ మొత్తం 38 స్థానాలకు గానూ 27 స్థానాల్లో ఎస్టీలకు కేటాయించగా, ఎస్సీలకు 3 సర్పంచ్ స్థానాల్లో అవకాశం దక్కింది. -
వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం ● అభివృద్ధిలో దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు ● మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట/ మక్తల్: ‘పాలమూరు జిల్లాకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్ల కు సరిపడా అభివృద్ధిని చేసుకుందాం.’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత ‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు. -
రాష్ట్రంలోనే మొదటిస్థానం..
ఐదేళ్లతో పోల్చితే నిరక్షరాస్యులు, మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి.. కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు అడ్మిషన్లు పెంచాం. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మహబూబ్నగర్ జిల్లా మిగతా జిల్లాలతో పోల్చితే రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. అడ్మిషన్లు చేరిన వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చక్కని అవకాశం.. వివిధ కారణాలతో బడిమానివేసిన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదువుకునేందుకు ఒక చక్కని అవకాశం. అడ్మిషన్లు గతంలో కంటే చాలా పెరిగాయి. ఓపెన్ స్కూల్లో ఎస్సెస్సీ వంటివి రెగ్యులర్ తరగతుల కంటే కూడా సరళంగా ఉంటాయి. సలువుగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పెరుగుతుంది. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ ● -
ఎయిడ్స్ నివారణకు ముందస్తు చర్యలు
నాగర్కర్నూల్/ కందనూలు: ఎయిడ్స్ వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు ముఖ్యమని, ఎయిడ్స్ నియంత్రణలో సమాజంలోని ప్రతిఒక్కరి పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన లేక వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. ఆస్పత్రులు, రక్త బ్యాంకుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా రక్త నమూనాలను క్షుణ్ణంగా పరీక్షించాలనే చెప్పారు. హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యే వ్యక్తులు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూ సూచించిన మందులు వాడితే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. సరైన సమయంలో మందులు, పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిపై నియంత్రణ సాధ్యమన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, డీఎంహెచ్ఓ రవికుమార్, వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రైతులను అప్రమత్తం చేయాలి.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరిధాన్యం, పత్తి తడవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సూచనలు చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులకు అన్నివిధాలా సహకరించాలని కోరారు. పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల అధికారి వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు రాజ్యలక్ష్మి, భీమ్లానాయక్ హాజరయ్యారు. -
నేటినుంచి నూతన మద్యం పాలసీ
● ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు ● గుడ్విల్ ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారులు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 27న ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్దారులను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు. ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు బెల్ట్ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్ దుకాణాలతోపాటు పట్టణాల్లో సైతం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి. -
స్వయం పాలనకు దూరం
పంచాయతీ ఎన్నికలకు నోచుకోని ఏజెన్సీ గ్రామాలు ●సాక్షి, నాగర్కర్నూల్: ఆ గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీలు లేరు. కానీ గ్రామ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ మాత్రం ఎస్టీ వర్గానికి రిజర్వు అయ్యింది. ఫలితంగా ఈసారి కూడా సర్పంచులు లేని గ్రామాలుగా మిగిలిపోనున్నాయి. అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్నగర్, లక్ష్మాపురం, వంగురోనిపల్లి గ్రామాలు స్వయం పాలనకు నోచుకోవడం లేదు. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో గత పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి సైతం ఇదే పరిస్థితి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఐదేళ్లపాటు ‘ప్రత్యేక’ పాలనలోనే.. అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్నగర్ గ్రామాలు 2018లో కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. 2019లో నిర్వహించిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఆయా గ్రామాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఈ ఐదు గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు లేరు. రిజర్వేషన్లు మార్చాలని అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎన్నికలను బహిష్కరిస్తామని తెగేసి చెప్పినా ఫలితం లేకపోయింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో తాము చేసేదేమీ లేదని అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా గత పంచాయతీ పోరులో పోటీచేసే అభ్యర్థులు లేక ఎన్నికలు నిర్వహించలేదు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే సదరు అధికారులకు అప్పటికే ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో గ్రామాల్లో పర్యవేక్షణ కొరవడింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండక.. సర్పంచ్ పదవులకు నోచుకోక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీ ఏరియా కావడంతో.. అమ్రాబాద్ మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో తుర్కపల్లి మినహా మిగతా గ్రామాలన్నీ ఏజెన్సీ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో 19 గ్రామాల సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. వీటిలో ఐదు గ్రామాల్లో ఎస్టీ జనాభా ఒక్కరు కూడా లేకున్నా ఇదే రిజర్వేషన్ కొనసాగుతోంది. రిజర్వేషన్ మార్చాలని ఏళ్లుగా గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో కుమ్మరోనిపల్లికి అనుబంధంగా ఉన్న వంగురోనిపల్లి కొత్తగా జీపీ అయ్యింది. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డులు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఎస్టీలు లేకున్నా రిజర్వు కావడంతో ఎన్నికలను బహిష్కరిస్తామని గత ఎన్నికల సందర్భంగా గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్విల్తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 54 1,634 49.02 నాగర్కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 అమ్రాబాద్ మండలంలోని ఐదు జీపీల్లో ఎస్టీ రిజర్వు ఎస్టీలు ఎవరూ లేక పోటీచేయలేని దుస్థితి గత ఐదేళ్లు సర్పంచులు లేకుండానే ముగిసిన వైనం ఈసారి సైతం అదే తీరు గత పంచాయతీ ఎన్నికల నుంచి పదవీకాలం పూర్తయ్యేవరకు సర్పంచులు లేకుండానే గడిచిన ఈ గ్రామాల్లో.. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. ఆయా గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోయినా ఇదే రిజర్వేషన్ కొనసాగితే.. ఇక ఎప్పటికీ గ్రామాలకు సర్పంచులు ఉండరన్న ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. సర్పంచులు లేకపోవడంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని.. అభివృద్ధి పనుల ఊసే ఉండటం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మార్చాలని అధికారులను కోరుతున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్ స్థానాలతో పాటు రిజర్వు అయిన వార్డు స్థానాల్లో పోటీచేసేందుకు ఎవరూ లేక నామినేషన్లు దాఖలు కావడం లేదు. దీంతో రిజర్వేషన్ల తీరును నిరసిస్తూ రిజర్వు కాని వార్డు స్థానాల్లో కూడా ఎవరూ పోటీచేయడం లేదు. ఫలితంగా ఆయా గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
రిజర్వేషన్లు సడలించాలి..
మా గ్రామంలో ఎస్టీలు ఒక్కరు కూడా లేరు. రిజర్వేషన్ ఎస్టీ కావడంతో సర్పంచ్గా పోటీచేసే అవకాశమే లేదు. ఈ పరిస్థితితోనే గత ఐదేళ్లు సర్పంచ్ లేకుండా గడిచిపోయాయి. అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు కావడం లేదు. ఈసారి కూడా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ప్రభుత్వం రిజర్వేషన్లు సవరించి ఇతరులకు అవకాశం ఇవ్వాలి. – జక్క మల్లయ్య, వంగురోనిపల్లి, అమ్రాబాద్ మండలం అమ్రాబాద్ మండలంలోని గ్రామపంచాయతీలు ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో రిజర్వేషన్ల మార్పు వీలుకావడం లేదు. పరిస్థితిని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి -
సర్పంచ్ 103, వార్డు స్థానాలకు 95
● రెండో విడత పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు ● 2వ తేదీ వరకు గడువు సాక్షి, నాగర్కర్నూల్: రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల పరిధిలోని 151 సర్పంచ్ స్థానాలతో పాటు 1,412 వార్డు స్థానాలకు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట మండలాల్లో మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 103, వార్డు స్థానాలకు 95 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వ తేదీన రెండో విడత నామినేషన్లకు గడువు ముగియనుంది. తొలి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి.. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల్లో దాఖలైన నామినేషన్లను అధికారులు ఖరారుచేశారు. సర్పంచ్కు 958, వార్డు స్థానాలకు 3,373 నామినేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్ స్థానాలకు కల్వకుర్తి మండలంలో 153, తాడూరులో 158, తెలకపల్లిలో 192, ఊర్కొండలో 91, వంగూరులో 188, వెల్దండలో 176 నామినేషన్లను అర్హత కలిగినవిగా తేల్చారు. వార్డు స్థానాలకు సంబంధించి కల్వకుర్తిలో 603, తాడూరులో 537, తెలకపల్లిలో 633, ఊర్కొండలో 380, వంగూరులో 547, వెల్దండలో 673 నామినేషన్లను అధికారులు ఖరారుచేశారు. రెండో విడత ఎన్నికలకు దాఖలైన నామినేషన్లు ఇలా.. మండలం సర్పంచ్ వార్డు స్థానాలు బిజినేపల్లి 28 33 కోడేరు 14 2 కొల్లాపూర్ 6 2 నాగర్కర్నూల్ 16 26 పెద్దకొత్తపల్లి 28 5 పెంట్లవెల్లి 6 8 తిమ్మాజిపేట 26 19 -
ఏకగ్రీవమే..!
నాగర్కర్నూల్ఆ జీపీలుకాటేస్తున్న ఎయిడ్స్ భూతం ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. -
నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన
● కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ● 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు నారాయణపేట/ మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రూ.558 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల– కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.210 కోట్లతో మక్తల్– నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. అలాగే మక్తల్– పేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సీఎం చేతులమీదుగా అందించనున్నారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు మొత్తం 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
కందనూలు: నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ఆదివారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సెల్ నంబర్ 99592 26288లను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతోపాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని కోరారు. హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు కందనూలు: పాఠశాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన పలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు డీఈఓ రమేష్కుమార్ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని కొట్ర, కొల్లాపూర్, మంతటి, పాలెం, బాలుర పెంట్లవెల్లి, వంకేశ్వరం, మార్చాల, సిర్సవాడ, తెలకపల్లి, కార్వంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంలు పాఠశాలల్లో నిర్వహించే ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలు సరైన పద్ధతిలో చేయకపోవడంతో వాటిని పర్యవేక్షించే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు నిర్లక్ష్యం వహించారని డీఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పర్యవేక్షణ ఎందుకు చేయలేదో నోటీసులు అందిన రెండు రోజుల్లో లిఖిత పూర్వకంగా తమ కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి లింగాల: వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పీహెచ్సీ నిర్వహణ రికార్డులు, మందులను పరిశీలించారు. ప్రతిరోజు ఓపీ ఎంత అవుతుంది.. అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. పీహెచ్సీ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఏఎన్ఎంలు ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వైద్యులతోపాటు మరికొంత మంది వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట వైద్యాధికారి దశరత్, హెచ్ఏ రామచందర్, ఫార్మసిస్టు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి మద్దిమడుగులో దీక్షమాల ఉత్సవాలు అమ్రాబాద్: నల్లమలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్ష మాల విరమణ బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి గురువారం వరకు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, సోమవారం విఘ్నేశ్వరపూజ, పంచగవ్యం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, సహస్రనామర్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, నిత్యౌపాసన, మన్యుసూక్తహోమం, బలిహరణ, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి అమ్మవారి సేవ, మంగళవారం విఘ్నేశ్వర పూజ, గవ్యాంతపూజ, రుద్రహోమం, నిత్యౌపాసన, బలిహరణ, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పం, రాత్రికి శివపార్వతుల కల్యాణం ఉంటుంది. బుధవారం విఘ్నేశ్వరపూజ, గవ్యాంతరపూజ, రుద్రహోమం, నిత్యౌపాసన, హనుమత్ వ్రతం, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి సీతారాముల కల్యాణం జరిపిస్తారు. గురువారం చివరి రోజు గవ్యాంత పూజ, 108 కళశాలతో మహాకుంబాభిషేకం, హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈఓ తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ అరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ అరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్లీడర్గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
ఉద్యమాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ
నాగరకర్నూల్/ నాగర్కర్నూల్ క్రైం: ఉద్యమాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో 29 నవంబర్ 2009లో కేసీఆర్ 11 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రీకారం చుట్టిందన్నారు. నీరు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల హక్కుగా భావించి సాగించిన ఉద్యమం కేసీఆర్ సారథ్యంలోనే సాగిందన్నారు. మలిదశ ఉద్యమానికి నాయకుడిగా ముందుకు సాగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమంతో ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి చరిత్రలో కేసీఆర్ పేరును చెరిపేయడానికి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ధీరుడు కేసీఆర్ అన్నారు. అంతకు ముందు నల్లవెల్లి కూడలిలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నాయకులు బైకాని శ్రీనివాస్యాదవ్, గంగనముని కుర్మయ్య, నాగం శశిధర్రెడ్డి, పోకల మనో హర్, ఎడ్మ సత్యం, తులసీరాం, అర్థం రవి, ప్రదీప్, నర్సింహగౌడ్, వేణుగోపాల్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన తొలి విడత నామినేషన్లు
● చివరిరోజు బారులుదీరిన అభ్యర్థులు ● ఊర్కొండ, వంగూరులో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియసాక్షి, నాగర్కర్నూల్: తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు పూర్తి కాగా.. అప్పటికే క్లస్టర్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్న అభ్యర్థుల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. చివరిరోజున భారీ ఎత్తున నామినేషన్లతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు పోటెత్తారు. శనివారం కల్వకుర్తి మండలంలో సర్పంచ్ స్థానాలకు 86 నామినేషన్లు, వార్డు స్థానాలకు 503 నామినేషన్లు వచ్చాయి. అలాగే తెలకపల్లి మండలంలో సర్పంచ్ 181, వార్డు స్థానాలకు 522, తాడూరు మండలంలో సర్పంచ్ 102, వార్డు స్థానాలకు 476, వెల్దండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 149, వార్డు స్థానాలకు 574 నామినేషన్లు వచ్చాయి. అలాగే ఊర్కొండ, వంగూరు మండలాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్లను స్వీకరించారు. వెల్దండ మండలం బైరాపూర్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు నిల్చున్న అభ్యర్థులుతొలివిడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియగా.. ఐదు చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సీఎం స్వగ్రామం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లెలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే వెల్దండ మండలంలోని బండోనిపల్లి, కేస్లీతండా సర్పంచ్ స్థానాలతో వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలకపల్లి మండలంలోని గట్టురాయిపాకుల, తాళ్లపల్లి గ్రామాల్లో ఒక్కొక్కరి నుంచే నామినేషన్లు రావడంతో ఈ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ తండా సర్పంచ్గా ఇస్లావత్ లక్ష్మి నామినేషన్ ఒక్కటే రావడంతో ఈ గ్రామం ఏకగ్రీవమైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. రెండో విడతలో భాగంగా ఏడు మండలాల్లో ఎన్నికలను నిర్వహించనుండగా.. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి, నాగర్కర్నూల్, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని 151 సర్పంచ్ స్థానాలతోపాటు 1,412 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను డిసెంబర్ 2 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 6న ఉపసంహరణ, 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఆ సర్పంచ్లు, వార్డుసభ్యులు ఏకగ్రీవం
వెల్దండ/ తెలకపల్లి/ ఊర్కొండ: మండలంలోని బండోనిపల్లి, కేస్లీతండా గ్రామ పంచాయతీలకు శనివారం సర్పంచులు, వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బండోనిపల్లి పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో గ్రామస్తులు చర్చించి ఏకగ్రీవం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు శనివారం సర్పంచ్ అభ్యర్థిగా ఎనుముల సంగీత నామినేషన్ వేశారు. అలాగే వార్డుల వారీగా ఇస్లావత్ కిషన్, ఏకుల శారద, మందగల రాములు, ఎనుముల వెంకట్రెడ్డి, కేశమల్ల నాగమ్మ, వావిళ్ల అల్వాల్యాదవ్, సత్తూరి విజయలక్ష్మి, కేతావత్ దేవి ఒక్కొక్క నామినేషన్ వేశారు. దీంతో అధికారులు సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ● కేస్లీతండా ఎస్టీ జనరల్ కాగా.. సర్పంచ్ అభ్యర్థిగా మెగావత్ శ్రీనివాసులుతోపాటు వార్డుల వారీగా మెగావత్ అమర్సింగ్, మెగావత్ లక్ష్మి, డేగవత్ బిచ్చాని, ఇస్లావత్ భీమ్లా, రాత్లావత్ శాంతి, ముడావత్ సంతోష్, రామావత్ ఉమ, రామా వత్ శ్వేత ఒక్కొక్క నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ● తెలకపల్లి మండలంలోని గట్టురాయిపాకుల గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విజయ్ అనే వ్యక్తిని ఏ పార్టీకి సంబంధం లేకుండా సర్పంచ్గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. అలాగే వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ సైతం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ● ఊర్కొండ మండలంలోని గుణగుంటపల్లి పంచాయతీ ఎస్టీ జనరల్కు కేటాయించడంతో జర్పులావత్ రమేష్నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 8 వార్డులకు గాను 4 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా 4 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. -
లేబర్ కోడ్లతో కార్మిక వ్యవస్థ విచ్ఛినం
నాగర్కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యవస్థను విచ్ఛినం చేసేలా ఉన్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కార్పొరేట్ శక్తులకు కార్మికులు ఊడిగం చేసేలా లేబర్ కోడ్లు ఉన్నాయన్నారు. లేబర్ కోడ్లపై కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమన్నారు. కార్మిక వర్గంపై ప్రధాని మోదీ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికలోకం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిపారని ఆరోపించారు. ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, పసియొద్దీన్, పొదిల రామయ్య, శివ వర్మ ఉన్నారు. -
వేలంతో ‘ఏకగ్రీవ’ తీర్మానాలు
నవాబుపేట/‘సాక్షి’నెట్వర్క్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన హెచ్చరికలను ఉమ్మడి పాలమూరు జిలాని చాలా గ్రామాల్లో బేఖాతరు చేస్తున్నారు. గ్రామాభివృద్ధి అంటూ సర్పంచ్, వార్డు స్థానాలను వేలం వేస్తూ స్థానిక పెద్దలే ముందుండి నడిపిస్తున్నారు. ● నవాబుపేట మండలంలోని మండలంలోని దొడ్డిపల్లి జీపీకి సంబంధించి సర్పంచ్, ఉపసర్పంచ్లు ఏకగ్రీవంగా చేసుకునేందుకు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని... ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారితోనే శనివారం నామినేషన్లు వేయించనున్నట్లు సమాచారం. దొడ్డిపల్లిలో 684 మంది ఓటర్లు ఉండగా.. ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం అప్పాయపల్లి తండాలో సర్పంచ్తో పాటు 8 వార్డులకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందేకు తీర్మానం చేశారు. ● గద్వాల మండలం కుర్వపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళాకు రిజర్వ్ కాగా..గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తన భార్యను సర్పంచ్ చేయడం కోసం గుడి నిర్మాణానికి రూ.45 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. వీరాపురం గ్రామంలో సైతం సర్పంచ్ పదవికి జరిగిన పోటాపోటీ వేలంలో ఓ రైతు ఏకంగా రూ.50 లక్షలకు పాటపాడినట్లు సమాచారం. ఇదే మండలం ఈడిగోనిపల్లి రూ.35 లక్షలకు వేలం పాట పాడి ఓ యువకుడు సర్పంచ్ స్థానాన్ని పొందారని తెలిసింది. ● గట్టు మండలంలో మిట్టదొడ్డి సర్పంచు స్థానం రూ.90లక్షలకు వేలంపాట పాడి కొనుగోలు చేశారు. పెంచికలపాడు గ్రామ సర్పంచ్ స్థానాన్ని రూ.31.50 లక్షలు, ఉపసర్పంచ్ పదవికి సైతం వేలం వేయగా రూ. 8.50 లక్షలకు దక్కించుకున్నారు. అరగిద్ద సర్పంచు స్థానం రూ.31 లక్షలు, తుమ్మలపల్లి రూ.30 లక్షలు, తారాపురం రూ.16.50 లక్షలు, కేటీదొడ్డి మండలం రంగాపురం రూ.15 లక్షలు, సుల్తానపురం రూ.8 లక్షలులకు వేలం పాడినట్లు సమాచారం.మల్లాపురం గ్రామంలో కూడా వేలం ద్వారా ఏకగ్రీవం చేసినట్లు తెలుస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో రూ.42 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణానికి ముందుకొచ్చిన సీడ్ ఆర్గనైజర్ సర్పంచ్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే మండలంలో మగ్గంపేట, బిజ్వారం, పెదొడ్డి గ్రామాలలో సైతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిజ మండలం కుర్వపల్లి రూ.7.50 లక్షలకు, కిష్టాపురం రూ.10.35 లక్షలకు వేలం ద్వారా సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
తడిసి మోపెడు..
‘‘అన్నా.. సర్పంచ్ ఎన్నికలు వచ్చినయ్. నామినేషన్లు కూడా మొదలైనయ్. మీ ఊరికి మొదటి విడతలోనే అవుతున్నయ్. తొందరగా గడిచిపోతుంది. మా ఊరికి మాత్రం మూడో విడతలో ఎన్నికలు ఉన్నయి. ఇంకా 20 రోజుల టైం ఉంది. అప్పటిదాక ఓటర్లను ఎట్ల ‘మేనేజ్’ చేసుకునుడో. రోజురోజుకు ఎంత ఖర్చు అయితదో. ఇప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బులు సరిపోతయో లేదో..’ ఇదీ మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ఉన్న ఓ సర్పంచ్ అభ్యర్థి ఆందోళన. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చటే వినిపిస్తోంది. చివరి విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై ఆలోచనలో పడ్డారు. సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలకు కీలకమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆశావహులు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటూ.. ఓటర్ల మెప్పు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 3న, రెండో విడత 14న, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం ఉండటంతో అప్పటిదాకా ఓటర్లను ఎలా అట్టిపెట్టుకోవాలా? అన్న ఆలోచనలో పడ్డారు. రోజురోజుకూ పోల్ మేనేజ్మెంట్ ఖర్చులు పెరుగుతుండటం.. సుదీర్ఘకాలం పాటు ఓటర్లను మేనేజ్ చేయాల్సి ఉండటంతో ఆయా గ్రామాల అభ్యర్థుల్లో దిగులు నెలకొంది. ఈసారి సడలింపుతోపెరిగిన పోటీ.. గతంలో స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు ముగ్గురు పిల్లలు ఉన్న వారు అనర్హులు. 1994 తర్వాత ముగ్గురు పిల్లలు జన్మిస్తే.. వారంతా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న పద్మావతి ముగ్గురు పిల్లల నిబంధన కారణంగా కోర్టు జోక్యంతో జెడ్పీటీసీ స్థానానికి అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధనను సడిలించింది. దీంతో గ్రామాల్లో పోటీదారుల సంఖ్య కూడా పెరిగింది. చాలావరకు గ్రామాల్లో అదనంగా ఒకరు, ఇద్దరు అభ్యర్థులు పెరుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు భారీగా పెరుగుతున్న ఖర్చు మూడో విడత పంచాయతీ పోరుకుఇంకా 20 రోజులు అప్పటివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే.. అభ్యర్థుల్లో గుబులు -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
తిమ్మాజీపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు అన్నారు. శుక్రవారం తిమ్మాజీపేట మండలం కోడిపర్తిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం సీ్త్రనిధి రుణాలపై మహిళా సంఘాల బాధ్యులతో ఆయన ఆరా తీశారు. ప్రభుత్వం అందించిన రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. డీఆర్డీఓ వెంట ఏపీఎం బి.నిరంజన్, టీఏ రాజేశ్, సీసీ నాగరాజు ఉన్నారు. నేడు బీఆర్ఎస్ దీక్ష దివస్ నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉదయం 11:30 గంటలకు దీక్షా దివాస్ ప్రారంభమవుతుందని.. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నేడు డయల్ యువర్ డీఎం కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు 99592 26292 నంబర్ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని కోరారు. ఉత్తమ సేవలకు ప్రశంస కల్వకుర్తి రూరల్: పట్టణానికి చెందిన శివకుమార్ చిన్న వయసులోనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ యువజన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి అధికారిక కార్యాలయంలో ఆ సమితి ప్రతినిధులు సుశీల్ చౌదరి, బిసాతి భరత్లు శివకుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వివేకానంద సేవాబృందం ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలను వారికి వివరించినట్లు ఆయన తెలిపారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నిఘా
నాగర్కర్నూల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై ప్రత్యేకంగా నిఘా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ను అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా కలెక్టరేట్లో మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజువారీ దినపత్రికలు, వివిధ టీవీ ఛానల్స్తో పాటు లోకల్ ఛానల్స్ను పకడ్బందీగా పర్యవేక్షించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అనంతరం హెల్ప్లైన్ సెంటర్ను ప్రారంభించారు. నిరంతరం 08540–230201 నంబర్ అందుబాటులో ఉంటుందని.. ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. హెల్ప్లైన్ సెంటర్ సిబ్బంది దృష్టికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రాము, శివ, వెంకటయ్య పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తెలకపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టిన నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని.. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి తెలకపల్లి, గౌరెడ్డిపల్లి నామినేషన్ కేంద్రాలను ఆయ న పరిశీలించారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు అప్పగించిన ఎన్నికల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రం వద్ద గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. తెలకపల్లి మండలంలోని 7 క్లస్టర్ల పరిధిలో 28 జీపీల సర్పంచ్, 260 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. వారి వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంపీడీఓ తరుణ్, ఎంపీఓ వెంకటయ్య, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ నరేశ్ ఉన్నారు. -
రెండో రోజు నామినేషన్ల జోరు
● సర్పంచ్కు 203, వార్డు స్థానాలకు 345 దాఖలు ● నేటితో ముగియనున్న గడువు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మొదటి విడతగా ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రెండో రోజు శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల పరిధిలోని 151 గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ స్థానాలకు 203 నామినేషన్లు దాఖలు కాగా.. 1,326 వార్డు స్థానాలకు 345 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు 349, వార్డు స్థానాలకు 407 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చేసేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే సమయం మిగిలి ఉంది. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
నాగర్కర్నూల్: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇందులో భాగంగా సాధారణ పరిశీలకులుగా హైదరాబాద్ హెచ్ఎండీఏ జాయింట్ కలెక్టర్ రాజ్యలక్ష్మి, వ్యయ పరిశీలకులుగా గద్వాల జిల్లా ఆడిట్ అధికారి భీమ్లానాయక్ను నియమించారు. ఈ మేరకు గురువారం వారు కలెక్టర్ బదావత్ సంతోష్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, అబ్జర్వర్ లైజింగ్ అధికారి సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనేవిద్యార్థుల్లో క్రమశిక్షణ కందనూలు: క్రీడల ద్వారానే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో 44వ జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువులో రాణించాలంటే నిత్యం ఆటలు ఆడడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసాలు అలవాడుతాయన్నారు. యువతీ, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ నిత్యం క్రీడల్లో నిమగ్నమై అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపులో మంచి మెలకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఏఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడా కిట్టును బాలికలకు, బాలురకు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు -
వేలం.. ‘ఏకగ్రీవం’!
సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ ● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ ● చక్రం తిప్పుతున్న పెద్దలు.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి ● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం ● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరమంటున్న అధికారులు.. పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నారు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడిన వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాట పాడి.. వాయిదా వేసి.. గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాటను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
సీపీఎం మద్దతుదారులతోనే గ్రామాల అభివృద్ధి
నాగర్కర్నూల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి మతోన్మాద చర్యలను తిప్పికొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాగర్ అన్నారు. గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రశాంతంగా ఉన్న గ్రామాలను అశాంతిలోకి నెట్టుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామాలు ప్రశాంతంగా అభివృద్ధి వైపు నడవాలంటే సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు, దేశనాయక్, గీత, ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, నర్సింహ, శంకర్నాయక్, బాలస్వామి, అశోక్, శివవర్మ, నాగరాజు, తారాసింగ్, మధు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ఢీసీసీ..!
కుంపటి రాజేసిన జిల్లా అధ్యక్షుల ఎంపిక ● వనపర్తిలో శివసేనారెడ్డికి ఇవ్వడంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి నారాజ్ ● తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు ఎత్తేసిన చిన్నన్న ● అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం ● ఇటు మహబూబ్నగర్, గద్వాల జిల్లాల్లో ఆశావహ నేతల్లో అసంతృప్తి ● పంచాయతీ ఎన్నికల వేళ పరిణామాలపై ‘హస్తం’ శ్రేణుల్లో గుబులు -
పకడ్బందీగా నిర్వహించాలి
తాడూరు: ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియను గురువారం తాడూరులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ సంబంధించిన 151 సర్పంచ్లు, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు చెప్పారు. తాడూరు గ్రామ సర్పంచ్, 12 వార్డులకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో చేపడుతున్న నామినేషన్ల ప్రక్రియపై ఆరా తీసి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థులు ప్రతిపాదకుడి సాయం, నిర్ణీత రుసుం చెల్లించి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆదివారం పరిశీలన తర్వాత సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటు అయ్యే జాబితా ప్రకటిస్తామని, నామినేషన్ల తిరస్కరణకు గురైన వారు డిసెంబర్ 1న అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎన్నికల అధికారులు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు
నాగర్కర్నూల్: నానో యూరియా, నానో డీఏపీ వాడటం వల్ల రైతులు నష్టాలను నివారించవచ్చని, ప్రతి రైతు ఈ యాసంగిలో కనీసం ఎకరాలో వీటిని వాడాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్రావు అన్నారు. కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ యూరియా, డీఏపీ వాడడం వల్ల పంటల దిగుబడి నాణ్యత పెరుగుతుందన్నారు. అంతకు ముందు కొరమాండల్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో 2019– 20లో 29,586 టన్నుల యూరియా అమ్మకాలు ఉండగా 2024–25లో 57,224 టన్నులకు పెరిగాయన్నారు. సంప్రదాయ యూరియా అధికంగా వాడడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థాలు తగ్గిపోతాయన్నారు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర పోషకాలు కూడా అందవన్నారు. ప్రతి రైతు నానో యూరియా, నానో డీఏపీని వాడి పంటలను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొరమాండల్ ప్రాంతీయ వ్యాపార నిర్వా హకుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 121 నామినేషన్లు
● వార్డు స్థానాలకు 26 దాఖలు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఆరు మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించగా.. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 121, వార్డు స్థానాలకు 26 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు కల్వకుర్తి మండలంలో 19, ఊర్కొండ మండలంలో 11, వెల్దండ మండలంలో 19, వంగూరులో 24, తాడూరులో 23, తెలకపల్లిలో 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుస్థానాలకు కల్వకుర్తి మండలంలో 11, వెల్దండ మండలంలో 6, వంగూరు మండలంలో 2, తాడూరు మండలంలో 5, తెలకపల్లి మండలంలో 2 నామినేషన్లు రాగా.. ఊర్కొండ మండలంలో వార్డుస్థానాలకు నామినేషన్లు రాలేదు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
కందనూలు: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేజీబీవీల పర్యవేక్షణ అధికారి శోభారాణి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఊర్కొండ కేజీబీవీ విద్యార్థులు సాంకేతిక రంగాల్లో మరింత ప్రతిభను పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్యా సమాచారంతోపాటు సబ్జెక్టులలో ప్రమాణాలను పెంచుకునేలా జిల్లాలోని కేజీబీవీల విద్యార్థులకు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. టీ–స్టెమ్ (తెలంగాణ– సైన్స్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్) కార్యక్రమంతో మరింత పరిజ్ఞానాన్ని అందించే విధంగా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 20 కేజీబీవీల విద్యార్థులకు వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రభుత్వ కళాశాలల్లో, ఇతర విద్యా సంస్థలలోని వృత్తి సంబంధిత ప్రయోగశాలల వసతులను మ్యాపింగ్ చేయడం, విద్యార్థులు వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5ఏ వంటి సాంకేతిక అంశాలపై విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి పాల్గొన్నారు. -
కసరత్తు జోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుండడం అధికార కాంగ్రెస్కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహ రిస్తున్నారు. మరోవైపు జీపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పలు ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచా రం మొదలుపెట్టారు. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు వ్యూహాలు.. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు గెలుపు గుర్రాల కోసం వడబోత సర్పంచ్ ఆశావహుల చరిష్మా, సేవలపై ఆరా పలు గ్రామాల్లో ముందస్తుగానే ఇంటింటి ప్రచారం గ్రామాల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం -
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు..
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కలెక్టర్ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఉదయం 10 గంటలలోగా ఫార్మా–1 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసి.. ఆర్ఓ కార్యాలయంతో పాటు సంబంధిత గ్రామపంచాయతీల్లో ప్రకటించాలని ఆదేశించారు. 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీల్, 3న అభ్యర్థిత్వం ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్లను క్లస్టర్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 780 పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓలు ముందుగానే పరిశీలించి.. వాటిలో కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్ల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత నోడల్ అధికారులదేనని అన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు ఎవరిని అనుమతించబడదని.. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నోడల్ అధికారులు డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్, సీపీఓ సంధ్యారాణి, డీఈఓ రమేశ్ కుమార్, లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్, డీటీఓ చిన్న బాలునాయక్, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, డీవైఎస్ఓ సీతారాం నాయక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాజేందర్సింగ్, జిల్లా సర్వేయర్ నాగేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదగిరి, ఎస్బీ సీఐ కనకయ్య తదితరులు ఉన్నారు. -
మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పో యిన నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నే ళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పా టు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమ స్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ముంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకాలు, చెక్డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధు లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా తదితరులు పాల్గొన్నారు. రూ.42.70 కోట్లతో అనుగొండ పునరావాస కేంద్రం సంగంబండ వద్ద బండను తొలగించి రైతాంగానికి నీరందించినఘనత మాదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి -
సర్వం సిద్ధం..
సాక్షి, నాగర్కర్నూల్: గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. తొలి విడత నామినేషన్లు గురువారం నుంచే ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని మొత్తం 151 సర్పంచ్, 1326 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నాలు గు, ఐదు గ్రామపంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 46 క్లస్టర్లు ఏర్పాటుచేశారు. ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చెక్పోస్టుల ఏర్పాటు.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం, పోలీసులు కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా నలుమూలల చెక్పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, అమ్రాబాద్, బిజినేపల్లి మండలాల్లో మూడు చెక్పోస్టులను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. -
సమస్యలపై నేరుగా సంప్రదించండి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పలు విభాగాలను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శాంతిభద్రల సమస్యలు తలెత్తకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు, ఎస్బీ ఎస్ఐ పర్వతాలు తదితరులున్నారు. దరఖాస్తుల స్వీకరణ కందనూలు: జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్టిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ పోస్టు ఒకటి ఖాళీగా ఉందని, సోషల్ సైన్స్, లైఫ్సైన్స్, న్యూట్రిషన్, మెడిసిస్ హెల్త్, సోషల్ వర్కర్, రూరల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 35 ఏళ్లలోపు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు) ఉండి మూడేళ్లు ఎన్జీఓ, గవర్నమెంట్లో అనుభవం కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హత, చిరునామాతో వచ్చేనెల 2లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట నాగర్కర్నూల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎస్ఈ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హౌసింగ్ బోర్డులో విద్యుత్ సిబ్బంది చేస్తున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సరఫరా విషయంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాని కోరారు. వారంలో మూడు రోజులపాటు మంగళవారం, గురువారం, శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యల విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే సిబ్బంది వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్శెట్టి, ఎస్ఏఓ పార్థసారధి, ఏఈ మాన్యనాయక్, లైన్మెన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం నాగర్కర్నూల్ రూరల్: జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంపూర్ణంగా బీసీ వర్గాలను అణగదొక్కేలా ఉందని ఆరోపించారు. జిల్లాలోని 460 సర్పంచ్ స్థానాల్లో బీసీల వాటాగా 61 స్థానాలు కేటాయించడం దుర్మార్గమన్నారు. బీసీలు జనాభాలో 50 శాతం పైగా ఉన్నా సర్పంచ్ స్థానాల్లో 13 శాతం కేటాయించడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సర్పంచ్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 442, సమాంతరం కాల్వ నుంచి 75 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875, వివిధ ఎత్తిపోతలకు 218 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడాలి
కల్వకుర్తి/ వెల్దండ: మహిళలను కోటిశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తక్షణమే వారి పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో కల్వకుర్తి, వెల్దండ మండలాల మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూ చించారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ మండలాల పరిధిలోని 1,186 సంఘాలకు రూ.1.27 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళలకు దైర్యం వచ్చిందన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందించడంలో ఐకేపీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం వెల్దండ మండలంలోని చెర్కూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. గ్రామంలోని కళాకారులకు డప్పులు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ ఇబ్రహిం, ఎంపీడీఓ వెంకట్రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్లు ఆనంద్, భూపతిరెడ్డి, రేవతి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్రెడ్డి, నాయకులు మోతీలాల్, పర్వత్రెడ్డి, కృష్ణ, లక్ష్మయ్య, రషీద్, పుల్లయ్య పాల్గొన్నారు. -
క్షయ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రతిగ్రామాన్ని క్షయ రహిత పల్లెలుగా తీర్చిదిద్దాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి టీబీ భారత్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిఒక్కరు తమ ప్రాంతాన్ని క్షయ రహితంగా తయారు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. క్షయవ్యాధి అనుమానితులందరినీ గుర్తించి ఎక్సురే పరీక్షల వ్యాధిని అంతం చేయగలమన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన బాధితులు త్వరగా కోలుకోవడానికి పోషక ఆహార కిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 150 మందికి ఎక్సురే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ ఈఓ బ్రహ్మేందర్, అంజనమ్మ, వసంత, పరిమళ, బాలమణెమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కొల్లాపూర్: వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు రూ.9.57 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని మహిళలు స్వశక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభు త్వం పంపిణీ చేస్తున్న చీరల పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ భరత్కుమార్ పాల్గొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యం.. అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోందని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 3,504 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్లను అందజేసి మాట్లాడారు. మహిళలకు ప్రతి ఏడాది రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, విజయ డెయిరీ చైర్మన్ నర్సయ్యయాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, బల్మూరు మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
పల్లెపోరుకు సై..
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ● షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ● రేపటి నుంచే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ● డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడి ● ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు గ్రామాల్లో రాజకీయ సందడి.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో నిరాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ఇలా.. అమలులోకి కోడ్.. పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
సర్కారు బడులపై దృష్టి
● క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో కార్యక్రమం ● పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు ● పరిశుభ్రత, విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యం ● వచ్చేనెల 5 వరకు కొనసాగింపు నాగర్కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు రక్షణ చర్యలు, మౌళిక వసతులు మెరుగుపరిచేందుకు క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. పాఠశాల ఆవరణ, మూత్రశాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా చేపట్టే ఈ పనులను వచ్చేనెల 5లోగా పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఈ పనులను ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రేవతిరెడ్డి పలు పాఠశాలల్లో పరిశీలించి సూచనలు చేశారు. ఈ మేరకు వచ్చేనెల 5 వరకు పనులు పూర్తయ్యేలా ఆయా పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలు కృషిచేస్తున్నాయి. భద్రతకు పెద్దపీట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ఈ కార్యక్రమంలో భాగంగా అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 842 ఉండగా.. వీటిలో సుమారు 56 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి పాఠశాలను శుభ్రంగా ఆకర్షణీయంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 5.0 ప్రణాళిక రూపొందించారు. దీనికోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి పనులను కొనసాగిస్తున్నారు. ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, ఒక అసిస్టెంట్ ఇంజినీర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సభ్యులుగా ఉన్నారు. మొదట శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించాలని ఎంఈఓలను ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మూత్రశాలలు, వాటర్ ట్యాంకులు తదితర వాటిని శుభ్రపరుస్తారు. పాత వస్తువులైన బేంచీలు, టేబుళ్లు, పాత కంప్యూటర్లు ఇతరత్ర వస్తువులు మొత్తం ఒకచోట వేస్తారు. సదరు వస్తువులను కమిటీ పరిశీలన చేసి వారు నిర్ధారించిన తర్వాత అమ్మకానికి సిద్ధం చేస్తారు. విద్యుత్ వైర్లు, స్విచ్లు తనిఖీ చేసి దెబ్బతిన్న వాటిని మార్చేస్తారు. అయితే ఈ పనులను మొదట ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే మరోమారు ఎక్కడైనా పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయో అన్న విషయాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో కార్యక్రమాన్ని వచ్చే నెల 5 వరకు ముగించాల్సి ఉంటుంది. ఎక్కడైతే చెత్తాచెదారం లేకుండా పాఠశాల ఆవరణ శుభ్రపరుస్తారో అక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేపడుతారు. ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సైతం రూపొందించి ఇప్పటికే అధికారులకు అందజేయగా ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకే ప్రభుత్వం క్లీన్ అండ్ సేఫ్ 5.0 కార్యక్ర మం చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరిస్తాం. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు కొన సాగుతున్నాయి. వచ్చే నెల 5 వరకు ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. – వెంకటయ్య, సెక్టోరియల్ అధికారి -
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
కందనూలు: దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవసహాయం మాట్లాడుతూ దివ్యాంగులు క్రీడలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పాలన్నారు. క్రీడా పోటీల్లో చెస్బోర్డు, క్యారమ్స్, జావెలింగ్ త్రో, రన్నింగ్, షాట్పుట్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, దివ్యాంగుల సంఘాల సభ్యులు శ్రీశైలం, రాజశేఖర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం. – అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా పూర్వవైభవం తీసుకువస్తా.. ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించగా.. సానుకూలంగాస్పందించారు. ఆత్మకూర్కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ● -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు కోసం జిల్లాలోని కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ అధికారి రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. గురింపు కార్డు పొందిన కార్మికులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని.. భవన నిర్మాణ కార్మికులందరూ తప్ప నిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు కందనూలు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో 10–17 ఏళ్లు, సీనియర్ విభాగంలో 18–54 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 9 గంటలకు పాఠశాల మైదానానికి రావాలని ఆయన సూచించారు. రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్గా నందిని కందనూలు: అమ్రాబా ద్ మండలం పదరకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి నందిని రాష్ట్ర జట్టు కెప్టెన్గా ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్రెడ్డి, యాదయ్యగౌడ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని సోనీపాట్లో జరిగే 35వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో నందిని తెలంగాణ తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా ఎంపికై న నందినికి డీవైఎస్ఓ సీతారాం నాయక్ అభినందనలు తెలిపారు. ‘కురుమూర్తి’ హుండీ ఆదాయం రూ.84 లక్షలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని హుండీల ద్వారా మొత్తం రూ.84,12,564 ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు వివిధ రకాల కానుకలు స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ కానుకల హుండీని ఆలయ అధికారులు నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు లెక్కించారు. మొదటిసారి హుండీ ద్వారా రూ.28,70,536, రెండోసారి రూ.24,83,628 రాగా.. తాజాగా సోమవారం మూడోసారి లెక్కింగా రూ.30,58,400 వచ్చింది. దీంతో ఈ సంవత్సరం జాతర హుండీ ఆదాయం మూడు దఫాలు కలుపుకొని మొత్తం రూ.84,12,564 సమకూరినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి తెలిపారు. గతేడాది జాతర ద్వారా హుండీ ఆదాయం రూ.79,68,810 రాగా.. ఈసారి రూ.4,43,754 అదనంగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి భక్తులు రావడంతో యూఎస్ఏ వన్ డాలర్లు 3, 5 డాలర్ 1, టెన్ డాలర్ 2 వచ్చాయి. అలాగే సింగపూర్ టెన్ డాలర్ 1, బ్యాంకాక్ వంద యూరోస్ 1, మలేషియా టెన్ యూరోస్ 1 వచ్చాయి. ఉత్సాహంగా బాస్కెట్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా సీనియర్ పురుష, మహిళా బాస్కెట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్తోపాటు మీర్ అర్షద్అలీ, సయ్యద్ షరీఫ్అలీ, సుభాన్జీ, ఎండీ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి పూత దశలో సస్యరక్షణ కీలకం
కొల్లాపూర్ రూరల్: మామిడి పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.ఆదిశంకర్ అన్నారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల రైతువేదికలో సోమవారం ఉద్యానశాఖ, పాలెం కేవీకే ఆధ్వర్యంలో మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మామిడి పూత, పిందె దశల్లో చేపట్టే యాజమాన్య, సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడిని సాధించవచ్చన్నారు. సకాలంలో మామిడి పూత రాని పక్షంలో 13.0.45 రకం రసాయనిక మందు 10 గ్రాములు, బొరాన్ 1.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అదే విధంగా మామిడి తోటల్లో చీడపీడల నివారణ, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు మామిడి పండ్ల కవర్లను పంపిణీ చేశారు. ప్రసాద్ సీడ్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యానశాఖ డివిజన్ అధికారి లక్ష్మణ్, విజయభాస్కర్రెడ్డి, భూపేశ్, సింగిల్విండో డైరెక్టర్ రఘుపతిరావు పాల్గొన్నారు. -
ముహూర్తం ఖరారు
ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్ వద్ద, హెలిప్యాడ్కు సంబంధించి ఆత్మకూర్ జాతర మైదానం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. రవాణా సౌకర్యం మెరుగు.. ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టెండర్ల ప్రక్రియ పూర్తి.. కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం గద్వాల– ఆత్మకూర్ మధ్య తగ్గనున్న22 కిలోమీటర్ల దూరం ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి రెవెన్యూ డివిజన్ దిశగా ఆత్మకూర్ అడుగులు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి పర్యటన -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలకు తావు లేకుండా తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ● జిల్లా జడ్జి రమాకాంత్ను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ జిల్లా కోర్టులో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నాగర్కర్నూల్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 31 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. సమర్థవంతంగా అమలు.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ వివరించారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల మంజూరు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మహిళా ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్థితి ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా రూ. 9.57కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. -
ఇక సమరమే..
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● తుది ఓటర్ల జాబితా ప్రకటించిన అధికార యంత్రాంగం ● రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం ● ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితా నుంచి బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది నియామకం వరకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతోపాటు తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావడమే మిగిలి ఉంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన విడుదల అవుతుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముగిసిన కసరత్తు.. పంచాయతీ ఎన్నికలను డిసెంబర్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్ల కసరత్తు పూర్తిచేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. అలాగే ఆదివారం నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇప్పటికే పలు విడతల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. పావులు కదుపుతున్న పార్టీలు.. పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. గ్రామాల వారీగా తేలిన రిజర్వేషన్ల లెక్కలకు అనుగుణంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించగా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనలో వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండ్రోజుల్లో నోటిఫికేషన్.. పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు పెండింగ్లో ఉండటంతో వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. మంగళవారం వెలువడే తీర్పు తర్వాత రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఆశావహుల సందడి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఓటర్ల వివరాలు.. -
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
నాగర్కర్నూల్: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమని.. భవిష్యత్లో ఉన్నత విద్య, వృత్తిపరమైన జీవితానికి పునాది వంటిదని ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిలతో కలిసి పదో తరగతి విద్యార్థులకు క్యూఆర్ కోడ్తో కూడిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఢిల్లీకి చెందిన ఐఐఎఫ్ఎస్ఎల్ కంపెనీ వితరణ చేసిన స్టడీ మెటీరియల్ను నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లోని కీలక భావనలు సులభంగా అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ను రూపొందించినట్లు వివరించారు. ● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకొని రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డిజిటల్ స్టడీ మెటీరియల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీసీసీబీ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, కంపెనీ సీఎండీ జయశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
చెంచుల అభ్యున్నతికి బీజేపీ కృషి
మన్ననూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసే విధంగా సరి కొత్త పథకాలను అమలు చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సోమవారం నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలోని ఆదివాసీల ఆవాసాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు చెంచులు ఆరాధ్య ధైవంగా కొలిచే హక్కుల వీరుడు బిర్సాముండా జయంతి ఉత్సవాలను ఆదివాసీల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం బీజేపీ తరపున చెంచులకు నిర్మించిన ఇళ్లను పరిశీలించి.. చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు మన్ననూర్ గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు మంగ్యానాయక్, భరత్కుమార్, మండలాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు -
ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు..
మా పూర్వీకుల స్వగ్రామం అసద్పూర్. శ్రీశైలం బ్యాక్వాటర్ కారణంగా మా ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయాం. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 98, 68 అమలు కోసం ఎదురుచూస్తున్నాం. నిర్వాసితుల్లో చాలా మంది పేదరికంతో చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. – మేనుగొండ రాముయాదవ్, శ్రీశైలం నిర్వాసితుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. జటప్రోల్ సభలో నిర్వాసితుల అంశంపై నివేదిక తయారు చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు సూచించారు. నిర్వాసితుల వివరాలు, ఉద్యోగాల ఖాళీలు వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. – డాగోజీరావు, శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కొంతకాలంగా నిర్వాసితులు మమ్మల్ని కలుస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతరులతో కూడా వారు చర్చించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. 98, 68 జీఓలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ శ్రీశైలం ప్రాజెక్టు పేరు చెప్పి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశచూపి.. ఇళ్లు, భూములు లాక్కున్నారు.. ఊళ్లకుఊళ్లు ఖాళీ చేయించి.. ఏటి ఒడ్డున పడేశారు.. ఏళ్లకు ఏళ్ల తరబడి ఏ ఒక్కరూ మా గోస పట్టించుకోలేదు. అధికారులకు ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి.. ప్రజాప్రతినిధులు గుప్పించిన హామీలు నీటిమూటలయ్యాయి.. కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులరిగాయి.. వయస్సు మీదబడి అలసిపోయాం.. అయ్యా, సీఎం గారూ.. మీరైనా సొంత జిల్లావాసులపై కనికరం చూపి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ శ్రీశైలం నిర్వాసితులు వేడుకుంటున్నారు. కొల్లాపూర్: దశాబ్దాల కాలంగా శ్రీశైలం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 98ను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో దాదాపు 70 శాతం మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వగా.. తెలంగాణలో జీఓ 98 అమలుకు నోచుకోలేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేస్తామని నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటమూటలుగానే మారుతున్నాయి. జీఓ అమలు కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేసిన శ్రీశైలం నిర్వాసితులు.. న్యాయపోరాటం సైతం చేస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు. కృష్ణానది తీరంలో పునరావాస గ్రామం మంచాలకట్ట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు కృష్ణా బ్యాక్వాటర్లో మునిగిపోయాయి. 1970– 82 మధ్యకాలంలో అధికారులు నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో వారు నది తీరంలోనే కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 98 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని.. చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ జీఓ ప్రకారం కర్నూలు జిల్లాలో వేలాది మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వాలు.. పాలమూరు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,318 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఐదుగురికి 1993లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మరో 30 మందికి, 2015లో కిరణ్కుమార్రెడ్డి హయాంలో 128 మంది నాన్ లోకల్ కోటా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన లష్కర్ ఉద్యోగాలు కల్పించారు. వీరిలో ఐదుగురి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఈ ఏడాది కోర్టు ఆదేశాల ప్రకారం నాగర్కర్నూల్ కలెక్టర్ 12 మంది నిర్వాసితులకు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 175 మంది నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన వారిలో 633 మంది మరణించగా.. 410 మంది వయసు పైబడి ఉద్యోగార్హత కోల్పోయారు. ఇక మిగిలింది 1,206 మంది మాత్రమే. అయితే వీరే కాకుండా.. పలువురు నిర్వాసితులు ఉద్యోగాల అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్థానిక నేతలు నిర్వాసితుల సమస్యను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్హులైన వారికి ఉద్యోగాలకు బదులుగా నగదు ప్యాకేజీ అందించాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఈ ఏడాది జటప్రోల్ సభలోనూ నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ప్రజాప్రతినిధులు మారినా తీరని గోస బుట్టదాఖలైన వినతులు.. నీటిమూటలైన హామీలు ఎన్ని పోరాటాలు చేసినా అమలుకాని 98, 68 జీఓలు సొంత జిల్లావాసులపై ముఖ్యమంత్రి కనికరం చూపాలని వేడుకోలు జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రమే నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2014లో జీఓ 68 జారీ చేసింది. దీన్ని ప్రకారం ఏ ప్రాజెక్టులోనైనా సరే నిర్వాసితులకు కనీసం గ్రూప్–4 స్థాయి ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు ఈ జీఓను అమలుపర్చలేదు. 2015లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు పాలమూరులో 173 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఆదివారం పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాల పోరాటంతో 8 గంటల పనిదినాలను సాధించామన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కార్మికుల హక్కులకు భంగం కలిగేలా ఉందన్నారు. పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందని ఐదేళ్ల క్రితం 29 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోదీ ప్రభుత్వం.. బిహార్ ఎన్నికల అనంతరం లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, శ్రీనివాసులు, బాల్రెడ్డి, ఆంజనేయులు, యాదయ్య, చంద్రయ్య, పెద్ద యాదవ్, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు. -
చదువుతోనే మహిళా సాధికారిత సాధ్యం
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలతో పాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. మహిళలు దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు సూత్రాలు పాటిస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులను మంజూరు చేస్తూ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారని చెప్పారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళలు దైవ దర్శనాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించే అవకాశం లభించిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, పాఠశాలలను ఆశ్రయించడంతో గ్రామీణ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులుకు గురవుతున్నాయని.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు, గురుకులాలను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అధిక అప్పులతో కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అందించలేకపోతున్నామని.. రాబోయే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో అర్హులైన వారిని ఉచిత విద్యుత్, రాయితీ గ్యాస్ సిలిండర్ పథకాలు అందడం లేదని.. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మూడు మండలాల మహిళా సమాఖ్య మండల అధ్యక్షులు చిట్టెమ్మ, ఇందిర, సురేఖ, ఆయా మండలాల తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
కందనూలు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మూడు కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ఈ పరీక్షకు 747 మంది విద్యార్థులకు గాను 706 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఈఓ రమేశ్కుమార్, సూపరింటెండెంట్ నాగేంద్రం పరిశీలించారు. సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకం కందనూలు: మానవ సేవే.. మాధవ సేవని నమ్మి సత్యసాయిబాబా అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీసత్యసాయి మందిరంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయి సేవాసమితి, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు దుస్తులు, దుప్పట్లు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, చారిటబుల్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు హకీం మురళి, ప్రధాన కార్యదర్శి ఏలిమె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు నల్లమలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక అచ్చంపేట: నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో సోమవారం నిర్వహించే భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. ఆదివారం అచ్చంపేటలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిర్సా ముండా వీరోచిత పోరాటం, విలక్షణ నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘జనజాతి గౌరవ దివస్’గా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ.. గిరిజనుల గౌరవాన్ని పెంచిందన్నారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా నల్లమలలోని ఆదివాసీలకు పర్యావరణ గృహాలు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాలో తొలిసారిగా పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదివాసీల నూతన గృహాలను సందర్శిస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మంగానాయక్, ఆంజనేయులు, రాములు, నాగయ్యగౌడ్, శ్రీనివాస్గౌడ్, చందూలాల్, శివచంద్ర, రాకేశ్, శివ పాల్గొన్నారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాత రకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. పచ్చిపులుసు అన్నంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 12వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు ఎండోమెంట్ అధికారి రామేశ్వర్ శర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి
కల్వకుర్తి రూరల్: గ్రామీణ క్రీడాకారులు అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి డా.స్వాములు అన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించగా.. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2, 4, 6, 8, 10 కి.మీ. క్రాస్ కంట్రీ రన్నింగ్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు స్వాములు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు జనవరి 4న హైదరాబాద్లోని బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే 11వ తెలంగాణ రాష్ట్ర క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఏకాగ్రతతో ఆడి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భిక్షపతి యాదవ్, ప్రసాద్, మల్లేష్, అరుణ, జాఫర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎంపికలకు 90మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలు నిలవాలని ఆకాంక్షించారు. టోర్నీలో క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. రాజన్న సిరిసిల్లలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ హనీఫ్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, నర్సింహరాజు, వజీర్, దస్తగీర్ఖాన్, కోచ్ పర్వేజ్పాష తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఖరారు..
సాక్షి, నాగర్కర్నూల్: ఊగిసలాడుతూ.. వాయిదాలు పడుతూ వస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరోసారి కీలక ఘట్టానికి చేరుకుంది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా అధికారులు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేశారు. కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వాతావరణం ఊపందుకుంది. రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో నేడో, రేపో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 50శాతం కోటా మేరకు మార్పులు.. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చేసిన ప్రక్రియతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలరోజుల్లోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను సవరించింది. మొత్తం కోటా 50 శాతానికే పరిమితం చేస్తూ.. గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు 2019 సాధారణ ఎన్నికల సమయంలో చేసిన రిజర్వేషన్లనే అనుసరిస్తూ.. రొటేషన్ ప్రాతిపదికన మార్పులు చేసింది. ఎట్టకేలకు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం కావడంతో గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. ఎస్టీ వర్గానికి అత్యధికంగా 133 స్థానాలు.. జిల్లాలో 460 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో అత్యధికంగా 133 స్థానాలను ఎస్టీ వర్గానికి కేటాయించారు. ఎస్సీలకు 85, బీసీలకు 61, జనరల్కు 181 స్థానాలను కేటాయించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించడంతో పాటు మిగిలిన స్థానాల్లోనూ కోటా మేరకు రిజర్వేషన్ కల్పించడంతో ఎస్టీలకు అత్యధికంగా 133 స్థానాలు రిజర్వు అయ్యాయి. ప్రత్యేక వ్యూహాలతో పార్టీలు.. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో రాజకీయ వేడిని పెంచాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటామని భావిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే విస్త్రృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనతో వ్యూహాన్ని పన్నుతోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహంచగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఎస్సీ 85 బీసీ 61 పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ సామగ్రిని అందుబాటులో ఉంచింది. ఇప్పటికే విడతల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసింది. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. అధికార యంత్రాంగం సిద్ధం.. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం పల్లెల్లో మళ్లీ మొదలైన సందడి -
డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ
● వరుసగా మూడోసారి నియామకమైన అచ్చంపేట ఎమ్మెల్యే అచ్చంపేట: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వంశీకృష్ణ డీసీసీ అధ్యక్షుడిగా 2019 నుంచి వరుసగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఇప్పటికే తమిళనాడు ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ నియామకంపై రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పెద్దకొత్తపల్లి/ పెంట్లవెల్లి: మహిళల ఆర్థిక అభివృద్ది కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లిలో ఇందిరమ్మ మహిళాశక్తి చీరలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. మహిళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, మహిళలను యజమానులను చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగించి అనేక కార్యక్రమాల ద్వారా వారిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మీసేవా కేంద్రాలు, బస్సుల కొనుగోలు కోసం రుణాలు, వరి ధాన్యం సేకరణ అప్పగించి మహిళలను ఆర్థికంగా నిలబెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ద్వారా రూ.8 వేల కోట్లు మిగిల్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూతతో మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, ప్రధానంగా మహిళలు వ్యాపారాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే చీరలను మహిళలు గౌరవంగా భావించి ధరించాలన్నారు. వ్యాపార రంగాల్లో మహిళలు రాణించే విధంగా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ చిన్న ఓబులేష్, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నాగేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్రెడ్డి, సత్యం, విష్ణు, శ్రీనివాసులు, గోపాల్రావు, శివకుమార్రావు, చంద్రయ్య, ఎల్లయ్య, కుర్మయ్య, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అచ్చంపేటకు ఆటుపోట్లు
ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం ●పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా ఏదుల రిజర్వాయర్తోపాటు మొలచింతలపల్లి సమీపంలోని కృష్ణానది బ్యాక్వాటర్ నుంచి నీటిని తరలించేలా రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం భూ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం జీఓ 42 విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించి భూ సేకరణ చేపడుతాం. – అమర్సింగ్, ఈఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట -
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్
నాగర్కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని నూతన ఎస్పీ సంగ్రామ్సింగ్జి పాటిల్ అన్నారు. శనివారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు నూతన ఎస్పీకి పూలబొ కే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. అంతకు ముందు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నూతన ఎస్పీకి బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బదిలీపై వెళ్లారు. ‘పంచాయతీ’ రిజర్వేషన్లపై కసరత్తు నాగర్కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం కలెక్టరేట్లో పూర్తిచేయనున్నారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగనుండగా ఆదివారం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు, జిల్లా పరిధిలోని నలుగురు ఆర్డీఓల సమక్షంలో రిజర్వేషన్లు ఎంపిక చేశారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రకారం లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తికాగా.. మహిళల రిజర్వేషన్ స్థానాలు ఎంపిక చేయనున్నారు. ఈ రిజర్వేషన్ల జాబితాను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా, బీసీలకు 2024 కుల గణన సర్వే నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు. 2019 నాటి రిజర్వేషన్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున్న రొటేషన్ పద్ధతిన ఈ జాబితాను పరిశీలిస్తూ తాజాగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. వీటిని సెప్టెంబర్లో ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాలతో పోల్చనున్నారు. ఇందులో బీసీ కేటగిరి స్థానాలను 42 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గించి మిగిలిన 19.7 శాతం సీట్లను జనరల్ కేటగిరికి కేటాయించనున్నారు. డిజిటల్ లెర్నింగ్లో రాష్ట్రంలో 3వ స్థానం తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్లో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచారు. దీంతో విద్యాలయం ప్రత్యేకాధికారి సుజాతకు మరింత శిక్షణ ఇచ్చేందుకు ఖాన్ అకాడమీ ఢిల్లీలో జరిగే సెమినార్కు ఆహ్వానించింది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరికులంలో భాగంగా ఖాన్ అకాడమీ స్టెమ్ (డిజిటల్ లెర్నింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గత ఆరు నెలల నుంచి పాఠశాల వారిగా ప్రోగ్రెస్ రిపోర్ట్ను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. డిజిటల్ లెర్నింగ్లో తిమ్మాజిపేట కేజీబీవీ రాష్ట్రస్థాయిలో టాప్–3లో ఉండడంతో ఖాన్ అకాడమీ ఎడ్యుకేషన్ సమ్మిట్ వారు ప్రత్యేకాధికారి సుజాతను శనివారం ఢిల్లీలో జరిగే సెమినార్కు రావాలని ఆహ్వానం పంపడంతో ఆమె వెళ్లారు. పర్యావరణంపై అవగాహన అవసరం కందనూలు: విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన అవసరమని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఏకో బజార్ పర్యావరణం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో పర్యావరణ అంశాల మీద అవగాహన కల్పించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్టాండ్ కై ్లమెట్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర జాతీయ హరితదళం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిరుపయోగ వస్తువుల నుంచి.. ఉపయోగపడే పర్యావరణహితమైన వస్తువులపై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి శారద ఉన్నత పాఠశాలకు లభించింది. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్రెడ్డి, సూపరింటెండెంట్ నాగేందర్, రాజశేఖర్రావు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
అచ్చంపేట: నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలం మర్లపాడుతండాను అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్కలగండితండా, మర్లపాడుతండా, కేశ్యతండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ ప్రాంతానికి వచ్చి ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి, తమ పరిధిలో చేయాల్సిన పనులను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిగా అమలుచేస్తానని హామీ ఇచ్చారు. పునరావాసానికి సంబంధించిన ప్రతి పని పారదర్శకంగా, వేగంగా జరిగేలా స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తోందని చెప్పారు. పునరావాస కాలనీల్లో కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించేలా చూస్తామన్నారు. పునరావాసం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నక్కలగండి ప్రాజెక్టు నుంచి ప్రవాహిస్తుతన్న నీరు, ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పత్తి, వరి వంటి ముఖ్య పంటలు పెద్దఎత్తున తడిసి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాల స్థాయిని సమగ్రంగా అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదికలు పంపామన్నారు. వ్యక్తిగత, చిన్న వ్యాపారాల వల్ల నష్టపోయిన వారు కూడా స్వయంగా వచ్చి తమ సమస్యలను వివరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఊగిసలాడుతోంది..!
మల్లేశ్వరం– సిద్దేశరం వంతెనకు లభించని మోక్షం కొల్లాపూర్– సోమశిల రహదారి వరిదేల శివారు నుంచి రహదారి పనులు మొదలు కావాల్సి ఉంది. మూడో ప్యాకేజీలో ఐకానిక్ వంతెన ఇవతల 8 కి.మీ., ఏపీ పరిధిలో సిద్దేశ్వరం గుట్టల మధ్య 5.4 కి.మీ., అప్రోచ్ రహదారి నిర్మించాలి. వంతెన నిర్మించే ప్రాంతం వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో అటవీ శాఖకు చెందిన భూమితోపాటు రెవెన్యూ, రైతుల పట్టా భూమలు ఉన్నాయి. ఇప్పటి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే టెండర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. – రాజేందర్, ఈఈ జాతీయ రహదారుల శాఖ -
పంచాయతీకి సన్నద్ధం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ స్థానంలో మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే కొత్త రిజర్వేషన్ల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. మొత్తం 50 శాతం మేరకు రిజర్వేషన్లను వర్తింపజేయనుండగా.. ఎస్టీ, ఎస్సీలకు కేటాయించగా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. మిగతా 50 శాతం స్థానాల్లో జనరల్ ఉంటాయి. గ్రామ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీఓ, వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్ల పరిధి మేరకే ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం పూర్తిచేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందగా అధికారులు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రానికే గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. నివేదిక ఆధారంగా.. గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డుసభ్యుల రిజర్వేషన్ స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజరేషన్లను కేటాయించి, బీసీ వర్గాలకు ప్రభుత్వం 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (ఎస్ఈఈఈపీసీ) ప్రకారం బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ పద్ధతిలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూస్తారు. ముందుగా ఎస్టీ స్థానాలకు, తర్వాత ఎస్సీ స్థానాలకు, చివరగా బీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 2019 మొదటి సాధారణ ఎన్నికల్లో గ్రామాలు, వార్డు స్థానాలకు ఉన్న రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో మార్పులు చేస్తుండటంతో గ్రామాల రిజర్వేషన్లు మారనున్నాయి. ఈ పద్ధతిలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల జాబితా నుంచి గతంలో కేటాయించిన గ్రామాల తర్వాత వరుస క్రమంలో ఉన్న వాటిని రిజర్వేషన్ల కోసం ఎంపిక చేస్తారు. ఇదేవిధంగా ఎస్సీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల స్థానాలను గుర్తిస్తారు. ఏజెన్సీ ఏరియాల్లోని ఎస్టీ స్థానాలను మినహాయించి మిగతా స్థానాల్లోనూ ఎస్టీ కోటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ప్రమాదారిలో.. జిల్లాలో మారుమూల ప్రాంతమైన చారకొండ మండలంలోని గోకారం గ్రామానికి వెళ్లే రహదారి ఇది. జడ్చర్ల – కోదాడ ప్రధాన రహదారికి 3 కి.మీ., దూరంలో ఈ రోడ్డు ఇప్పటి వరకు బీటీకి నోచుకోకపోవడంతో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి దారి ఇలా అడుగు మేర కోతలకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. గతంలో ఎన్నోసార్లు బీటీ మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులు, పాలకులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతోమాకిదేమి గ్రహచారంఅంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. – చారకొండ 50 శాతం పరిధి మేరకు రిజర్వేషన్లపై కసరత్తు నేటి సాయంత్రంలోగా పూర్తికానున్న ప్రక్రియ రొటేషన్ పద్ధతిలో మారనున్న పలు గ్రామాలు వారం రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల? జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగూరోనిపల్లి, ప్రశాంత్నగర్కాలనీ, లక్ష్మాపురం గ్రామాలు గత ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఎవరూ ఎస్టీలే లేకపోవడంతో సర్పంచ్లుగా ఎవరూ పోటీ చేయలేకపోయారు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచ్లు లేకుండానే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. ఎస్టీ జనాభా లేని గ్రామాల్లో ఇతరులకు రిజర్వేషన్లు కేటాయిస్తారా.. లేదా.. ఈసారి కూడా సర్పంచ్లు లేకుండా ఉండిపోతాయా అన్నది సందిగ్ధంగా మారింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రొటేషన్ పద్ధతిలో పంచాయతీల సర్పంచ్లు, వార్డు స్థానాల రిజర్వేషన్లు మారుతాయి. అమ్రాబాద్ మండలంలోని గ్రామాలు ఏజెన్సీ ఏరియా కావడంతో మా పరిధిలో లేదు. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి -
నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్సింగ్ గణపతిరావ్
నాగర్కర్నూల్ క్రైం: నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్సింగ్ గణపతిరావ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటిల్ సంగ్రామ్సింగ్ గణపతిరావ్ 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ సీఐడీ నుంచి బదిలీపై నాగర్కర్నూల్ ఎస్పీగా వస్తున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బదిలీపై వెళ్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషిచేయాలి కొల్లాపూర్ రూరల్: రానున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కోర్టు వీధిలోని ప్రాథమిక పాఠశాల, గాంధీ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ, ఎల్లూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అమరగిరి పాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గాంధీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించి.. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షలు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి విద్యార్థులలో ఏకాగ్రతను పెంచాలని కోరారు. అమరగిరిలో పాఠశాలకు కాంపౌండు నిర్మాణం చేయాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా టెస్టు బుక్ మేనేజర్ నర్సింహులు, ఎంఈఓ ఇమ్మానుయల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మద్దిమడుగు హుండీ ఆదాయం రూ.26 లక్షలు అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. మూడు నెలలకు సంబంధించి మొత్తం హుండీ ఆదాయం రూ.26,18,711తోపాటు మిశ్రమ వెండి 2.812 కిలోలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కించిన మొత్తాన్ని పదర గ్రామీణ వికాస్ బ్యాంకులో భద్రపరిచారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మదన్కుమార్, ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాములునాయక్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అలవి వలలను బ్యాన్ చేయిస్తాం
● ఈ అంశంపై ఏపీ అధికారులతో మాట్లాడతా ● రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొల్లాపూర్: కృష్ణానదిలో అలవి వలలతో వేటను పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తామని, దీనిపై ఏపీకి చెందిన పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుతామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేత నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.122 కోట్లు కేటాయించిందని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మంత్రి జూపల్లి లేఖ పంపిస్తే కొల్లాపూర్లో చేపపిల్లల ఉత్పత్తి యూనిట్, మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కొల్లాపూర్ చేపలను ప్రపంచ స్థాయి మార్కెట్కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మత్స్యకారుల కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్తోనే బీసీల సంక్షేమం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మామిడి, చేపల విక్రయాల కోసం 116 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పాటుపడుతోందని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అడుక్కుంటే పదవులు రావని, గుంజుకోవాలని ముదిరాజ్లకు సూచించారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులకు పోటీపడాలని, ఇందుకు ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా కేంద్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన కృషిచేస్తానన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముదిరాజ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ బీసీ ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాలని మంత్రులను కోరారు. నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, ఎల్లేని సుధాకర్రావు, కేతూరి వెంకటేష్, పెబ్బేటి కృష్ణయ్య, మల్లికార్జున్, వెంకటస్వామి, గాలెన్న, హుస్సేనయ్య, హరికృష్ణ, శివవర్మ, చెన్నరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్య పరిశోధనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పరిశీలకురాలు రేవతిరెడ్డి అన్నారు. పాఠశాలల పరిశుభ్రత కోసం చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఎంఈఓలు, కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు భద్రత కల్పించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను తొలగించాలన్నారు. వంటగదుల శుభ్రత విషయంలోఅలసత్వం వహించొద్దన్నారు. రెండు రోజుల్లోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను నివేదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీఈఓ రమేశ్కుమార్తో కలిసి తాడూరు, నాగర్కర్నూల్, బిజినేపల్లి ఉన్నత పాఠశాలలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలుచేస్తున్న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అధికారులు వెంకటయ్య, మురళీధర్రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. -
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
పాలమూరు: ఇటీవల కాలంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. అంతకంటే ఎక్కువగా ఫ్యాన్సీ, లక్కీ నంబర్ తీసుకోవడానికి ఎంతైన ఖర్చు చేసే సంప్రదాయం బాగా పెరిగింది. చాలా వరకు కార్లకు, బైక్లకు ఫ్యాన్సీ నంబర్ పెట్టుకోవడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రత్యేక నంబర్లకు అధిక ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఏడాది జనవరి నుంచి నవంబర్ 19వరకు జిల్లాలో 5,516 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ లక్కీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇందులో అధికంగా 9999తో పాటు 9, 7777, 7 సిరీస్, 01తో పాటు 7, 6, 5 వంటి సిరీస్ నంబర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రవాణా శాఖలో నూతన వాహనాల నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ముందే రిజర్వేషన్ చేసుకునే ముఖ్యమైన నంబర్ల ఫీజు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నంబర్ రిజర్వేషన్ చేసుకోవాలంటే సదరు వాహనదారుడు ముందుకు రూ.1.50 లక్షలు డీడీ చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాహనదారుడు పోటీ వచ్చి వేలం పాట నిర్వహిస్తే మళ్లీ ఫీజు ధర పెరుగుతుంది. అదేవిధంగా 1, 9, 6666 నంబర్లకు ఫీజు రూ.లక్ష ఫీజు కేటాయించగా 99, 999, 3333, 4444, 5555, 7777 నంబర్లకు ఫీజు రూ.50వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111 నంబర్లకు రూ.40వేలుగా ఫీజు కేటాయించారు. ఇకపై జాబితాలో లేని నంబర్లకు కారు నంబర్కు అయితే రూ.6వేలు, ద్విచక్ర వాహనం అయితే రూ.3వేల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఆరోజు అందుబాటులో ఉండి రిజర్వ్ కాని నంబర్లకు రూ.2వేల ఫీజు చెల్లించి నంబర్ తీసుకోవచ్చు. పెరిగిన నంబర్ల ఫీజు వల్ల ఆర్టీఏ శాఖకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల వివరాలిలా.. (రూ.లక్షల్లో) జిల్లా వాహనాలు వచ్చిన ఆదాయం మహబూబ్నగర్ 2,032 1.15 కోట్లు నాగర్కర్నూల్ 1,176 66.22 వనపర్తి 836 55.62 జో.గద్వాల 833 54.15 నారాయణపేట 639 31.76 ఆసక్తి చూపుతున్న వాహనదారులు ఏడాదిలోనే ఉమ్మడి జిల్లాలో 5,516 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం ఫ్యాన్సీ, లక్కీ నంబర్లతో పాటు తాత్కాలిక రిజర్వేషన్ పద్ధతిలో జరిగే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ఫీజుల ధరల వల్ల రెవెన్యూ ఎలా ఉంటుంది అనే విషయం ప్రస్తుత సిరీస్ పూర్తి అయితే తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్ తప్పక ఏర్పాటు చేసుకోవాలనే వారు కొంత మేర పెరుగుతున్నారు. – కిషన్, డీటీసీ పాలమూరు ఆర్టీఏ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ రిజిస్ట్రేషన్లో వాహనదారుడు టీజీ 06బీ 0009 నంబర్ కోసం వేలం పాటలో రూ.7.75 లక్షలు పలికి నంబర్ సొంతం చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే ఫ్యాన్సీ నంబర్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. మరో వాహనదారుడు టీజీ06బీ0999 నంబర్ కోసం వేలం పాట ద్వారా రూ.1,05,500 ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు. టీజీ 06బీ5555 నంబర్ను రూ.1.34 లక్షలకు దక్కించుకున్నాడు. -
తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కొల్లాపూర్ రూరల్: వరిధాన్యంలో తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి.. మిల్లులకు తరలించాలన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎం అరుణ, సింగిల్విండో డైరెక్టర్ రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికిల్ దందా..
జిల్లాలో ఇష్టానుసారంగా మెడికల్ షాపుల నిర్వహణ ●సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మెడికల్ దందా జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణశాఖ నిబంధనల మేరకు మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టుల ద్వారా మందులను విక్రయించాల్సి ఉండగా.. అర్హత లేని వ్యక్తులతో దుకాణాలను నిర్వహిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలోని మెడికల్ షాపులపై సంబంధిత అధికారుల నియంత్రణ కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు అంతంతే.. జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు ఉండగా.. మరో మూడు ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 90 శాతం షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. అనర్హులతో మెడికల్ షాపులు నిర్వహిస్తుండటంతో డాక్టర్ ఒక రకం రాస్తే.. రోగులకు మరోరకం మందులను అంటగడుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో అనధికార మెడికల్ షాపులే ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు మందుల దుకాణాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నా సంబంధిత అధికారుల నుంచి చర్యలు కరువయ్యాయి. బినామీల పేరుతో దందా.. జిల్లాలోని కొన్నిచోట్ల అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. చాలావరకు మెడికల్ షాపుల నిర్వహణకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చదివిన వారి నుంచి సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని అనుమతులు పొందుతున్నారు. నిబంధనల మేర కు ఫార్మసిస్టులతో మందులు ఇవ్వాల్సి ఉండగా.. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఫార్మసిస్టులు కనిపించడం లేదు. మందుల కాంబినేషన్ కూడా సరిగ్గా తెలియని వ్యక్తులు రిటైల్గా మందులు విక్రయిస్తుండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలోని మెడికల్ షాపుల్లో ఆకస్మిక తని ఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. డాక్ట ర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లాలో ఏ మెడికల్, కిరాణా దుకాణానికి వెళ్లినా పారాసెటమాల్ నుంచి మత్తు టాబ్లెట్ల వరకు సులువుగా లభ్యమవుతున్నాయి. పిల్లలు అడిగినా షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదన్న నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. బ్రాండెడ్ మందుల పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనల ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు ధ్రువపత్రంతో పాటు లైసెన్స్డ్ ఫార్మసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరపాలి. మెడికల్ షాపు కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించాలి. గడువు ముగిసిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్ అమ్మడానికి వీలులేదు. కనిష్ట ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సిన మందులను రిఫ్రిజిరేటర్లలోనే ఉంచి విక్రయించాలి. మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాల్సి ఉండగా.. చాలావరకు షాపుల్లో అడిగినా బిల్లు ఇవ్వడం లేదు. కనిపించని ఫార్మసిస్టులు.. అర్హత లేని వారే మందుల విక్రయం ప్రజల ప్రాణాలతో చెలగాటం జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు -
రేషన్ బియ్యం పక్కదారి!
అచ్చంపేట: రేషన్ డీలర్ల తీరు మారడం లేదు. సన్నబియ్యం పంపిణీలోనూ అదే చేతివాటం.. అదే పక్కదారి కనిపిస్తోంది. అనేక చౌకధర దుకాణాల్లో ఎక్కువ శాతం బియ్యం పంపిణీ కాకుండా.. నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. కొందరు రేషన్ కార్డుదారులు ఈపాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి.. నగదు పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. డీలర్లు కూడా కిలోకు రూ. 20 నుంచి రూ.22 చొప్పున లెక్కగట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. నల్లబజారులో రూ.25 నుంచి రూ. 30 వరకు అమ్ముకుంటున్నారు. లబ్ధిదారులు రేషన్ బియ్యంపై అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. జిల్లాలో 60 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తింటున్నారు. మిగతా 40శాతం నల్లబజారుకు తరలుతోంది. ఈ దందాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు రేషన్ బియ్యం వండుకొని తినడానికి ఆసక్తి చూపడం లేదు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కిపోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దోశలు, ఇతర పిండి వంటలకు వినియోగించేవారు. అయితే ప్రతినెలా ఉచితంగా అందుతుండటం.. అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగించి వచ్చేవారు. తాజాగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అంత మంచిగా ఉండటం లేదని లబ్ధిదారులను కొందరు డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ మాత్రమే.. కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా బియ్యాన్ని డీలర్లకు అప్పగించి నగదు పొందుతున్నారు. వాస్తవంగా చౌకధర దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు దుకాణాల్లో మిగిలే బియ్యం, ఇతర సరుకులను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ–పాస్ అమలుతో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరీష్, ఓటి పీ తప్పనిసరి అయింది. దీంతో డీలర్లు లబ్ధిదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం రేషన్కార్డులు 2,72,487 అంత్యోదయ 18,701 ప్రతినెలా అందిస్తున్న బియ్యం 45,575.893 మెట్రిక్ టన్నులు లబ్ధిదారులు 8,76,394 లబ్ధిదారుల అనాసక్తిని సొమ్ము చేసుకుంటున్న రేషన్ డీలర్లు కిలోకు రూ.20 నుంచి రూ.22 చొప్పున కొనుగోలు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలింపు పట్టని పౌరసరఫరాలశాఖ -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు ● ఎంపీ డా.మల్లు రవి నాగర్కర్నూల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా.మల్లు రవి అన్నారు. పీసీఆర్–1955, పీఓఏ యాక్ట్–1989 అమలుపై గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ బదావత్ సంతోష్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతంగా చేపట్టి.. బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా చూడాలన్నారు. అదే విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పరిహారంగా బాధితులకు రూ. 25వేలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత ఆధికారులను ఆయన ఆదేశించారు. చార్జీషీట్ దాఖలయ్యాక 50 శాతం, కేసు పూర్తయ్యాక మిగతా మొత్తం చెల్లించేలా చూడాలన్నారు. ● ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలు, భూతగాదాలు, బాధితులకు అందించిన నష్టపరిహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. కమిటీకి పలు సూచనలు చేశారు. ● ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ డివిజన్ పరిధిలో భూ తగాదాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 234 ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులు అందగా, 219 కేసులను అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. వాటిలో 170 కేసులకు చార్జీషీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 219 కేసులకు పరిహారం అందించామని.. 19 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మిగతా అన్ని కేసులకు త్వరగా చార్జీషీటు వేసే విధంగా చూడాలని పోలీసుశాఖకు సూచించారు. అదే విధంగా గ్రామాల్లో పౌర హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా ఎస్సీ సంక్షేమశాఖకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగల్ల పరశురాం, గుమ్మకొండ రాములు, వెల్టూరి రేణయ్య, కె.చందర్, రెడ్యా తదితరులు ఉన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణానికి భూములివ్వం
● భూసేకరణ నిలిపివేయాలనినిర్వాసిత రైతుల ఆందోళన ● నిరసన ర్యాలీతో తహసీల్దార్కు వినతి బల్మూర్: ప్రాణత్యాగలకై నా వెనకాడం.. తమ భూములను రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చేదిలేదని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి సమీపంలో నిర్మంచతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు బుధవారం భూసేకరణ కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న బల్మూర్, అనంతవరం, అంబగిరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు అందజేయకుండానే కేవలం ఫోన్ల ద్వారా కొంతమంది రైతులకు సమాచారం ఇచ్చి భూసేకరణకు పూనుకోవడం సరైందికాదని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైనది కాకున్నా.. కేవలం కాట్రాక్టర్లు, పాలకుల కమీషన్ల కకక్కురర్తి కోసమే నిర్మించ తలపెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ రిజర్వాయర్ నిరర్మించాలంటే పీసా చట్టం ప్రకారం అధికారులు నడుచుకోవాల్సి ఉనన్నా.. నిబంధనలు ఉల్లంగించి రైతుల భూములను లాక్కొనే ప్రయతత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భూనిర్వాసిత పోరాట కమిటీ సభ్యులు అనంత సీతారాంరెడ్డి, తిరుపతయ్య, నాగయ్య, కృష్ణయ్య, ఇంద్రసేనారెడ్డి, గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
మాకు న్యాయం జరిగేలా చూడాలి..
తన బిడ్డ పేరుతో కంపెనీ మొదలు పెట్టానని.. ఎలాంటి మోసానికి అవకాశం లేదని ఆయుర్వేద నిలయం యజమాని తెలిపాడు. ఆయుర్వేద ఉత్పత్తులకు కావాల్సి మెటీరియల్ను చెంచులు తక్కువ ధరతో ఇస్తారని.. పెట్టుబడి రూ.3 వేలు అయితే తమకు రూ.30 వేలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో ఇంట్లో ఆడవాళ్ల మీద ఉన్న బంగారు పుస్తెల తాడు, నెక్లెస్ అన్నీ బ్యాంక్లో కుదవ పెట్టి, ప్లాటు అమ్మి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయా. నాతో పాటు పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు అన్యాయం జరగకుండా చూడాలి. – జానంపేట ఆంజనేయులు, చిన్నగుమ్మడం, పెబ్బేరు, వనపర్తి -
చరిత్ర తిరగరాసే కుట్రలు చేస్తున్న మోదీ
అచ్చంపేట: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ.. చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని.. వారిలో దివంగత ఇందిరాగాంధీ ఒకరు అని అన్నారు. ఆనాడు దేశ ప్రజల కోసం గరీబీ హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. భూస్వాముల చెరలోని వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగిందన్నారు. పాకిస్థాన్పై యుద్ధంచేసి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని కొనియాడారు. బీజేపీ శాఽశ్వత అధికారం కోసం ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు కుల, మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. ఓటు చోరీకి పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తోందన్నారు. బిహార్లో ప్రజలు ఆకాంక్షించిన ప్రభుత్వం రాలేదన్నారు. నెహ్రూ కుటుంబం తమ ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనలు, సూచనల మేరకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 50వేల ఉద్యోగాలు ఇస్తే.. అనతి కాలంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. రానున్న మూడేళ్లలో మరో 1.30 లక్షల ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనేసామాజిక న్యాయం సాధ్యమన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తూ, బడుగు బలహీన వర్గాలకు పదవులు, అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. అచ్చంపేట అభివృద్ధిపై డిసెంబర్ 7న నివేదిక అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.గోపాల్రెడ్డి, అనంతరెడ్డి, మల్రెడ్డి వెంకట్రెడ్డి, రామనాథం, రఫీ, నర్సయ్యయాదవ్ ఉన్నారు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు ఎవరూ చేయలే.. కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ -
పత్తి రైతు చిత్తు..
సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తప్పని కొర్రీలు ● తేమశాతం, కపాస్ నిబంధనలతో కొనుగోలుకు తిరస్కరిస్తున్న అధికారులు ● మిల్లుల వద్ద పత్తి లోడ్తో వాహనాల బారులు ● కఠిన నియమాలతో ప్రైవేటు దారిపడుతున్న వైనం ●సాక్షి, నాగర్కర్నూల్: పత్తి కొనుగోళ్ల కోసం తెచ్చిన కపాస్ యాప్.. తేమశాతం పేరుతో అధికారుల కొర్రీలతో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు ఆందోళనకు దిగడంతో రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. బుధవారం నుంచి సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైనా.. అధిక శాతం పత్తిని అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. పత్తిలో 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తి లోడ్ ఉన్న వాహనాలను వెనక్కి పంపుతున్నారు. దూర ప్రాంతం నుంచి రవాణా ఖర్చులు వెచ్చించి వస్తున్న రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తేమ పేరుతో కొర్రీలు.. పత్తి లోడ్తో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు సంబంధిత అధికారుల నుంచి కొర్రీలు ఎదురవుతున్నాయి. తేమశాతం 12 కన్నా ఎక్కువగా ఉందని.. పత్తి నల్లగా ఉందని తిరస్కరిస్తున్నారు. మిల్లులకు వస్తున్న పత్తిలో అధికభాగం ఇలా కొనుగోళ్లకు తిరస్కరణకు గురవుతోంది. 12 శాతం కన్నా తక్కువ తేమశాతం ఉన్నా ఎవరికీ కనీస మద్ధతు ధర రూ. 8,100 దక్కడం లేదు. తేమశాతం 8 ఉంటేనే మద్ధతు ధర వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా మందికి క్వింటాకు రూ. 7వేల నుంచి రూ. 7,600 వరకే ధర పలుకుతోంది. మిగిలిన వారికి తేమశాతం లేదంటూ తిరస్కరిస్తుంటడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు పత్తిని ఆరబెట్టి నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలి. 12 శాతం కన్నా తక్కువగా ఉంటేనే కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లకు వీలవుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – స్వరణ్సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి సీసీఐ పత్తి కొనుగోళ్లను కఠినతరం చేయడం, కపాస్ యాప్ ఇబ్బందుల నేపథ్యంలో రైతులు సీసీఐ కేంద్రాల్లో మద్ధతు ధరకు పత్తి విక్రయించడం కష్టసాధ్యంగా మారింది. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సీసీఐ తిరస్కరిస్తున్న పత్తిని క్వింటాకు రూ. 5,500 నుంచి రూ. 6వేలకే కొనుగోలు చేస్తున్నారు. పత్తి రేటు నుంచి తూకం దాకా తమదైన శైలిలో దోపిడీకి తెరలేపుతున్నారు.


