breaking news
Nagarkurnool District News
-
గిరిజనులకు అండగా కాంగ్రెస్
● 50 ఏళ్ల క్రితమే రిజర్వేషన్ ఫలాలు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్/కందనూలు/అచ్చంపేట రూరల్: మొదటి నుంచి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర శుక్రవారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచందర్నాయక్, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ రవీందర్నాయక్లతో కలిసి మంత్రి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితమే ఆదివాసీ, గిరిజనులందరికీ రిజర్వేషన్ ఫలా లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా సమాజంలో ఆది వాసీ గిరిజనులు అసమానతలకు లోనుకాకుండా ఉన్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీతో పా టు రాష్ట్రంలోని బీఆర్ఎస్ గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి కృషిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దివంగత ప్రధాని ఇందిరమ్మ రాజ్యంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. ఆదివాసీ, గిరిజన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 సెప్టెంబర్ 18న లంబాడీ, ఎరుకల, ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం గిరిజనుల జీవితాలను సమూలంగా మార్చేశాయన్నారు. అదే విధంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్యంలో గిరిజనులకు, గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు ఇస్తూ.. తమ అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. రిజర్వేషన్లు ఇచ్చి 50ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 18న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహి ంచనున్నట్లు తెలిపారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో నలుగురు బంజార బిడ్డలను పొట్టనపెట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే జీఓ నంబరు 3ను రద్దు చేసి, గిరిజన కుటుంబాలకు ఉద్యోగాలు రాకుండా చేశారని ఆరోపించారు. అదే విధంగా బిజినేపల్లి, అచ్చంపేట ప్రాంతాల్లో బస్సుయాత్ర కొనసాగింది. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, శంకర్నాయక్, బాలునాయక్, మురళీనాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయ క్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, రాంచంద్రనాయక్, హన్మంతునాయక్, గోవిందునాయక్ పాల్గొన్నారు. -
నిబంధనలు నదిలో తొక్కుతున్నారు
● పరిమితికి మించి బోటులో ప్రయాణికులు ● లైఫ్జాకెట్టు లేని పరిస్థితి ● తప్పిన పెను ప్రమాదం కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని సోమశిల కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి బోటులో అవతలి ఒడ్డున ఉన్న సంగేమేశ్వరాలయానికి నిబంధనలకు మించి పర్యాటకులను తరలిస్తున్నారు. శుక్రవారం సిద్దేశ్వరం గ్రామానికి చెందిన బోటు యాజమానులు డబ్బులకు కక్కుర్తిపడి దాదాపుగా 80 మందిని ఒకే బోటులో ఎక్కించుకొని సోమశిలకు వస్తు న్న క్రమంలో మధ్యలో సాంకేతిక సమస్యతో నదిలో ఆగిపోయింది. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బోటు డ్రైవర్ సోమశిల బోటు వారికి సమాచారం ఇవ్వడంతో సోమశిల నుంచి మరబోటు వచ్చి ఆగిన బోటుకు తాడుకట్టి ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినట్లు వాపోయారు. బోటులో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, నిబంధనలు పాటించని బోటు యాజమానులపై చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
సోమశిలలో కలెక్టర్ దంపతులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిలను శుక్రవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సతీసమేతంగా సందర్శించారు. వారికి జిల్లా పర్యాటకశాఖ, రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్ దంపతులు సోమేశ్వరాలయం, లలితాంభిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నది అవతల ఒడ్డున్న ఉన్న సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు టూరిజం బోటులో వెళ్లారు. అక్కడి నుంచి బోటులో అక్కమాంబ గుహాలను సందర్శించారు. వారి వెంట ఆర్డీఓ బన్సీలాల్, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, రెవెన్యూ అధికారి గోవిందరెడ్డి, సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి ఉన్నారు. దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యార్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి, సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పీసీసీ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు. ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియామిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్కర్నూల్ జెట్టి వెంకటేష్ను నియమించారు. అలాగే మహబూబ్నగర్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్, నాగర్కర్నూల్ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం
గ్రామాల్లో హెచ్పీవీపై అవగాహన కల్పిస్తున్నాం. బాలికలు టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయోనని అంటున్నారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి ఎక్కువ మందికి వేయడానికి ప్రయత్నిస్తాం. – కృష్ణ, డీఎంహెచ్ఓ కందనూలు: మహిళల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రభావితం చేసే వ్యాధుల్లో ఒకటైన గర్బాశయ ముఖద్వారా కేన్సర్ ప్రధాన సమస్యగా మారుతోంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం 14–15 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమ వ్యాక్సిన్ (హెచ్పీవీ) అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీకా కార్యక్రమాన్ని గత మార్చి 8న ప్రారంభించగా.. జిల్లాలో మాత్రం నత్తనడకన సాగుతోంది. విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో టీకా వేయించుకోవడానికి బాలికలు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు.. సరైన పద్ధతిలో అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కేన్సర్ నివారణలో కీలక పాత్ర.. హెచ్పీవీ వైరస్తో గర్బాశయ ముఖద్వార కేన్సరే కాకుండా ఇతర ప్రమాదకర కేన్సర్లు వచ్చే అవకాశముంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్పీవీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతోపాటు పలు రకాలైన వ్యాధులు రాకుండా కాపాడుతోంది. సుమారు ఆరు రకాల కేన్సర్లను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 5,986మంది గుర్తింపు.. జిల్లా వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం 14–15 ఏళ్ల వయసు గల 5,986 మంది బాలికలకు హెచ్పీవీ ఇవ్వడానికి గుర్తించారు. ఇప్పటివరకు 918 మందికి మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది దాదాపు 15శాతం మాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపడుతున్నారు. అవగాహన కల్పించడంలో విఫలం.. హెచ్పీవీపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైందని కొందరు విమర్శిస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలలు, గ్రామస్థాయిలో వ్యాక్సిన్పై ప్రాధాన్యతను వివరించడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో పూర్తిస్థాయిలో ముందుకు రావడంలేదని అభిప్రాయపడుతున్నారు. బాలికల భవిష్యత్, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్పీవీ ఆవశ్యతకపై వైద్యాధికారులు, ఇతర సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. మొత్తం 5,986 మందికి గాను 918 మందికే టీకా 15శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ విఫలం -
రోజువారీగా ఎత్తిపోస్తున్నాం..
వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్హౌజ్లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గుతుంది. 2024–25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్నాయక్, డీఈఈ -
రిజర్వాయర్లను పరిశీలించిన కేంద్ర బృందం
నాగర్కర్నూల్ రూరల్/పెద్దకొత్తపల్లి: జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లను శుక్రవారం కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లతో పాటు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్బండ్ ఆనకట్టలను కేంద్ర జలవనరుల కమిషన్ చైర్మన్ అశోక్కుమార్, సభ్యులు భూషణ్రాజు, శ్రీకాంత్రావు, గుల్షన్ శర్మ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జలవనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. రిజర్వాయర్ల నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. రిజర్వాయర్ల భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వారి వెంట ఇరిగేషన్ సీఈ విజయభాస్కర్రెడ్డి, డీఈ లోకిలాల్, అమర్సింగ్, రవీందర్, లక్ష్మణ్, సర్పంచ్ ఆది ధర్మేందర్ ఉన్నారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కందనూలు: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్, పీడియాట్రిషన్లకు లింగ నిర్ధారణ నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, గర్భస్రావ చట్టం, సంకల్ప్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిల సంఖ్య తగ్గితే సమాజంలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయన్నారు. ఇందుకు ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులు అందరికీ సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసరమైతేనే సిజేరియన్ కాన్పులు చేయాలని సూచించారు. తెలంగాణ క్యాన్సర్ పోర్టల్లో ప్రతి ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్ చేసుకొని, వారు గుర్తించిన క్యాన్సర్ కేసుల వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. కష్టతరమైన కాన్పులు నిర్వహించినప్పుడు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉండేలా చూసుకోవాలని, ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో తాము అందించే సేవలు రుసుంల పట్టికను తప్పకుండా ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రవికుమార్, చెన్నయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కృష్ణాబేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు. రివర్స్ పంపింగ్ విధానం.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.6 వేల కోట్లతో.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి. ఉమ్మడి జిల్లాలో.. కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లా పరిధిలోని షెడ్యూల్డ్ కులాల న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరంలో న్యాయ పరిపాలనలో శిక్షణ పొందడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు మూడు సంవత్సరాలపాటు నెలకు రూ.3 వేల ఉపకార వేతనంతోపాటు అదనంగా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 31లోపు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎకై ్సజ్ డీసీగా విజయ్భాస్కర్రెడ్డి ● ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా శ్రీనివాస్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కారీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్భాస్కర్రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్గా డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్గా ఉన్న పి.కరమ్చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్గా వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏఈఎస్గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్గా వెళ్లారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా వేణుగోపాల్రెడ్డి కందనూలు: జిల్లా నూతన ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్గా వేణుగోపాల్రెడ్డి గురువారం నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన గాయత్రి పదోన్నతిపై మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. నూతనంగా వచ్చిన వేణుగోపాల్రెడ్డి ఖమ్మం జిల్లాలో పనిచేస్తుండగా బదిలీల్లో భాగంగా ఇక్కడికి వస్తున్నారు. -
ప్రారంభమైంది.. సర్
● మ్యాపింగ్ లేని వారికి రుజువులు అవసరం ● ఓట్లు కాపాడుకునే పనిలో ఆయా పార్టీలు అచ్చంపేట: జిల్లాలో స్సెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) గురువారం ప్రారంభమైంది. నెలరోజుల పాటు ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ)ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. రెండు ఫారాల్లో వివరాలు తీసుకున్న తర్వాత ఒకటి ఓటరుకు ఇచ్చి మరొకటి బీఎల్ఓలు తీసుకెళ్లారు. ఇలా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు జూలై 24 వరకు అందజేస్తారు. నెల రోజులపాటు బీఎల్ఓలు వివరాలను ఫారాల్లో నమోదు చేసి సమర్పిస్తేనే ఓటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2002 నాటి ఓటరు సవరణ ప్రకారం ఇప్పుడున్న ఓటర్ల జాబితాను బీఎల్ఓలు ఓటరు మ్యాపింగ్ చేశారు. దీని ప్రకారం జిల్లాలోని ఓటర్లకు మరోసారి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తూ ఓటరు జాబితా సవరించనున్నారు. చాలా మందికి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి. ఇంకొందరు హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వా రంతా కూడా తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారా ల్లో వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఓటరును తప్పనిసరిగా కలిసేలా బీఎల్ఓలు కనీసం మూడుసార్లు ఇంటికి తిరగాల్సి ఉంటుంది. కొత్త ఓటరు నమోదుకు అవకాశం.. బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు 2026 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండే వారి వివరాలు చెబితే ఫారం–6 ఇస్తారు. డిక్లరేషన్ ఫారంతోపాటు ఫారం–6 తీసుకుని వాటిని పూరించి ఇవ్వాలి. సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారం అందకపోతే బీఎల్ఓలను సంప్రదించవచ్చు. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాల్లో పాత, కొత్త ఫొటోలు, ఆధార్కార్డు (తప్పనిసరి కాదు) ఫోన్ నంబరు, తల్లిదండ్రులు, భార్య/ భర్త వివరాలు నమోదు చేయాలి. 2002లో ఓటరు జాబితాలో పేరు ఉంటే ఒకవైపు.. అప్పుడు ఓటు లేకపోతే మరోవైపు వివరాలు నమోదు చేయాలి. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఓటరు వివరాలు తప్పులు లేకుండా అందజేయాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వివరాలు అందించాలి. వలస వెళ్లిన వారి వివరాలు చెప్పాలి. అలాగే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వలస వెళ్లిన చోట ఓటు కలిగి ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు ఇవ్వాలి. దీంతో డబుల్ ఓటర్లలో ఒక ఓటు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. కాగా.. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే పాత ఓటరు జాబితాలో కొత్త జాబితాను మ్యాపింగ్(పోల్చడం) చేశారు. ఇంకా 19.85 శాతం ఓటర్లు మ్యాపింగ్ పరిధిలో లేరు. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాలు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన గుర్తింపు కార్డులు చూపించాలి. ఇంకా ఏమైనా అనుమానాస్పదంగా ఉండే ఓటర్లకు అధికారులు నోటీసులు అందిస్తారు. తగిన వివరణతో బీఎల్ఓలకు అందజేయాలి. అక్టోబరు 1 నాటికి కొత్త జాబితా రూపొందనుంది. -
మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
కందనూలు: వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ అనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు అడ్వకేట్ రవితేజ పోలీస్ అధికారులకు పలు అంశాల గురించి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఇటుక బట్టీలు, రైస్ మిల్లు, బొగ్గు బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయించేందుకు మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా వెట్టిచాకిరీ, అక్రమ కార్మిక రవాణాను అరికట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అమాయక, పేద ప్రజల శ్రమను దోపిడీ చేస్తూ, వారిని బానిసలుగా మార్చే ముఠాలు, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా కార్మికులను బంధించి పనిచేయించడం గానీ, చిన్న పిల్లలతో ప్రమాదకర పనులు చేయించడంపై ఎవరి దృష్టికై నా వస్తే వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ శంకర్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి
కందనూలు: ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్కుమార్రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న పీపీ యూనిట్ను ఆయన తనిఖీ నిర్వహించారు. డాక్టర్ సృజన, సిబ్బంది మరియమ్మతో పల్స్ పోలియో కార్యక్రమం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా ఆదివారం పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు మెరుగైన సేవలు అందించేందుకు సహాయకారిగా హెల్ప్ డెస్క్ ఉండాలని సూచించారు. అధిక ఫీజులను అరికట్టాలి నాగర్కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని అఽరికట్టాలని బీఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘం నాయకులు బుధవారం జిల్లా ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బండ సాయిబాబు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్, కళాశాల ఫీజుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు నామమాత్రం తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఒకేషనల్ కళాశాల యాజమన్యం ధ్రువపత్రాలతో పాటు ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్, సాయి, సిద్ధు పాల్గొన్నారు. పీజీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఎంబీఏ మొదటి సెమిస్టర్లో 42.1, ఎంసీఏ మొదటి సెమిస్టర్లో 34.8 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం పీయూ వెబ్సైట్ను చూడాలని కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పీజీలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు వివిధ లాంగ్వేజెస్లో చేరే అవకాశం ఉందని, విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్ తరాలపై నిర్లక్ష్య ధోరణి వనపర్తి: భవిష్యత్ తరాలపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్ కంటే మూడురెట్లు ఎక్కువగా ఉన్నత విద్య పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నా.. ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం విగ్రహాలు, ఆలయాలు, గోపురాలు కట్టడం తప్పా.. గడిచిన దశాబ్ద కాలంలో విద్యాభివృద్ధికి చేసిన ఒక్క ఉన్నత నిర్ణయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం, విద్యావ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలపై విద్యార్థులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డి, తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, నాయకులు బి.కృష్ణ, ధనలక్ష్మి, సుఖేందర్రెడ్డి, వాల్యానాయక్, శరవంద, పాండుసాగర్, నందిమళ్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
నాగర్కర్నూల్ రూరల్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నామ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తూడుకుర్తిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాలల్లో ఎమ్యేల్యే రాజేశ్రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సొంతింటి కల నేరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల భవనాన్ని సందర్శించి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి కర్ణాకర్, ఉప సర్పంచ్ వెంకటయ్య మాజీ ఎంపీపీ కోటయ్య, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అపరిశుభ్ర వాతావరణమే..
నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్● -
సర్.. వస్తున్నారు!
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ●ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6తోపాటు డిక్లరేషన్ ఫారం కూడా స్వీకరిస్తారు. ఓటర్లు స్వయంగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించే అవకాశం ఉంది. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ఇలా.. జిల్లా 2025లో ఓటరు మ్యాపింగ్ మ్యాప్ చేయని తప్పులు/ మొత్తం ఓటర్లు ఓటర్లు ఉన్న ఓటర్లు అక్రమాలు మహబూబ్నగర్ 7,32,488 5,65,466 1,67,022 2,36,691 నాగర్కర్నూల్ 7,31,632 5,79,632 1,52,000 2,38,506 వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926 జో. గద్వాల 5,03,859 4,00,793 1,03,066 1,55,659 నారాయణపేట 4,95,574 4,23,725 71,849 1,87,277 ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్ల ను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు. -
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోందని, సాగునీటి వనరుల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని చంద్రసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రసాగర్ నుంచి చివరిసారిగా 2009 సంవత్సరంలో నీటిని విడుదల చేయగా.. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2026లో కురిసిన భారీ వర్షాలతో చెరువు పూర్తి స్థాయిలో నిండటంతో మళ్లీ నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నీటి విడుదల ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నియోజకవరంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అచ్చంపేట లిఫ్టు ద్వారా అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, అవసరమైన భూమి సేకరించి, త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. అమ్రాబాద్కు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని, సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ రామనాథం, గోపాల్రెడ్డి, కృష్టారెడ్డి, మహిపాల్రెడ్డి, బుచ్చిరాములు పాల్గొన్నారు -
‘చెత్త’స్టాండ్..!
● ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం ● కంపుకొడుతున్న బహిరంగ మూత్రశాలలు ● ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పెద్దనాలా ● పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్కుమార్, డీఎం, మహబూబ్నగర్ కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టుపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్హెచ్–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముందుకు కదలని మురుగు.. వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్బిన్లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘మొత్తం 18 ప్లాట్ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్నగర్ కొత్త బస్టాండ్ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోచవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్నగర్ మున్సిపాలిటీ -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
కందనూలు: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ.. వాటిని అరికట్టేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ అమరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబం, సామాజిక జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి దమయంతి, తదితరులు పాల్గొన్నారు. జూన్ 30 లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పీజీ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీపం పథకం, మహాలక్ష్మి పథకం తదితర సబ్సిడీ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వినియోగదారులందరూ ఈ నెల 30 లోపు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (బీఏఏ), ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థల సేల్స్ అధికారులు, జిల్లాలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న వినియోగదారులందరితో ప్రక్రియను పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దకొత్తపల్లి: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గంట్రావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ గృహా ప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజవర్గానికి 2 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మణ్రావు, వెంకటమ్మ చిన్నయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు. -
‘మిగులు’తో సర్దుబాటు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్కర్నూల్ 0 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు.. ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
పీఎం.. మాకేది కిసాన్
కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అచ్చంపేట: కఠిన నిబంధనల అమలుతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గతూ వస్తోంది. ఏడేళ్లలో జిల్లాలో 82,951 పైచిలుకు రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. మరోవైపు పథకం ప్రారంభం నుంచి కటాఫ్ తేదీ మార్చకపోవడంతో కొత్త రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారింది. నిబంధనల పేరిట అనర్హులను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్తవారికి అవకాశం కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో వారు ఈ పథకానికి దూమవుతున్నారు. పథకం ప్రారంభమైప్పటికీ నుంచి ఇప్పటి వరకు గడిచిన ఏడేళ్ల వ్యవధిలో జిల్లాలో 30 వేల మందికిపైగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందారు. విడతకు రూ.2 వేల చొప్పున చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎకరాలతో సంబంధం లేకుండా విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో కలిపి ఏడాదికి రూ.6 వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 22 సార్లు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసింది. కాగా జిల్లాలో 3,18,960 మంది రైతులు ఉండగా.. 6,87,215 ఎకరాలలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో అత్యధికంగా 3,08,845 ఎకరాల్లో పత్తి, 1,92,796 ఎకరాల్లో వరి సాగువుతోందని వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా పాసు పుస్తకాలు పొందినవారు (సుమారు) 30,000 రైతుల ఎదురుచూపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధిపొందే రైతుల సంఖ్యను నిబంధనల పేరిట తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త వారికి మాత్రం అవకాశం కల్పించడం లేదు. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించినప్పుడు జిల్లాలో 1,94,140 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత నిబంధనలను కఠినతరం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. పథకం ప్రారంభంలో సెల్ప్ డిక్లరేషన్ ఆధారంగా నమోదు జరిగినా.. కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హుల విషయంలో పలు నిబంధనలు తీసుకువచ్చి ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. మరోవైపు ఈ పథకం ప్రారంభమైన 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఏడేళ్లు దాటినా ప్రభుత్వం కటాఫ్ తేదీని మార్చకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో చాలామంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. తాజాగా జిల్లాలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1,11,189కి తగ్గింది. అంటే పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 82,951 మంది ఈ పథకానికి అర్హత కోల్పోయారన్న మాట. జిల్లాలో మొత్తం 30 వేల మందికిపైగా కొత్తగా పట్టాదారుల పుస్తకాలు పొందిన రైతులు పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. దీనికోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఏఓలు, ఏఈఓలను కలిసినా వారు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య కటాఫ్ తేదీ మార్చాలంటున్న అన్నదాతలు కఠిన నిబంధనలతో జిల్లాలో 82,951 మంది రైతులు దూరం ఏడేళ్లుగా కొత్తవారికి తప్పని ఎదురుచూపులు -
ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
కందనూలు: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ జిల్లాకేంద్రంలో విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణ, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును కచ్చితంగా అమలు చేయాలని కోరారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
కందనూలు: జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడుతూ దేశంలో డ్రగ్స్ అనే మహమ్మారి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్కు బానిసలు కాకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉండి చక్కని భవిష్యత్ని తీర్చిదిద్దుకోవాలని, అలాగే కుటుంబంలో, ఊరిలో, ఏ ప్రదేశంలోనైనా, ఎక్కడైనా, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు, రవాణా చేస్తున్నట్టు తెలిసిన 1908కి కాల్ చేసి తెలపాలని, తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడి, ఎస్ఐ గోవర్ధన్, జిల్లా ఈగల్ టీం ఎస్ఐ రాంలాల్నాయక్, మెడికల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాతాశిశు మరణాల నివారణకు చర్యలు కందనూలు: మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా చర్యలు తీసుకోవాలని, మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణ కార్డులో గర్భిణుల పరీక్షల వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వైద్యాధికారులు, క్షేత్ర సహాయ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రవికుమార్, సురేష్బాబు, కృష్ణమోహన్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ధాన్యం @ రూ.2,626 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి. -
ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు
పెద్దకొత్తపల్లి/ వెల్దండ: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటు వేగవంతంగా ముందుకు సాగుతుందని విద్యాధికారులు అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఈడబ్ల్యూడీసీ క్వాలిటీ కంట్రోల్ అధికారి విజయభాస్కర్రెడ్డి, డీఈఓ రమేష్కుమార్, జిల్లాస్థాయి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఎంపికై న ఈ ప్రాంగణంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కళాశాలలో ఉన్న వసతులు, ప్రస్తుతం ఉన్న తరగతి గదుల పరిస్థితి, విద్యార్థుల సంఖ్య భవిష్యత్ అవసరాలు, నిర్మాణ అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రూ.15 కోట్లతో నిర్మిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే వంగూరు, పోల్కంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా ప్రభుత్వం ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న మోడల్ స్కూల్స్ను కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు నిరంతర విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ సహాయంతో పాఠశాల ప్రాంగణాన్ని చిత్రీకరించి భవిష్యత్ అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ ఈడబ్ల్యూడీసీ రామచందర్రావు, సెక్టోరియల్ అధికారి వెంకటయ్య, ఎంఈఓ ఉమాదేవి, హెచ్ఎం భారతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్కు ఎంపికై న వెల్దండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను క్వాలిటీ కంట్రోల్ అధికారి విజయభాస్కర్రెడ్డి, జిల్లాస్థాయి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. పాఠశాలలో వసతులు, తరగతి గదుల పరిస్థితి, విద్యార్థుల సంఖ్య, భవిష్యత్ అవసరాలు, నిర్మాణ విస్తరణ అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కేజీబీవీ, మోడల్ స్కూల్లో అందుబాటులో ఉన్న సుమారు 14 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించి, భవిష్యత్లో నిర్మించాల్సిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, పరిపాలనా భవనాలు, వసతి గృహాలు, భోజనశాలలు, క్రీడా మైదానాల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేశారు. వారి వెంట ఈఈ రామచంద్రరావు, సెకోర్టియల్ అధికారి వెంకటయ్య, ఎంఈఓ చంద్రుడునాయక్, హెచ్ఎం రవీందర్ తదితరులున్నారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
కందనూలు/తాడూరు: మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, మహిళా భవనాలు, ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళ భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మహిళలకు రూ.2,500 చెల్లిచేందుకు ప్రభుత్వం చొరువ తీసుకుంటుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేక పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారానే వరి కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.171 కోట్ల కమీషన్ మహిళా సంఘాలకు చెల్లించగా.. జిల్లాలో రూ.1.30 కోట్లు అందుతాయన్నారు. బాధితులకు కొండంత అండగా భరోసా కేంద్రం ఉంటుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 కోట్లతో బ్రిడ్డి నిర్మాణం తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందభీ వాగుపై రూ.20 కోట్లు వ్యయంతో నిర్మించునున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం రాకపోకలకే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఆర్ నిధులు రూ.30 కోట్లు, ఎమ్మార్ నిధుల నుంచి రూ.13 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, వివిధ రహదారుల అభివృద్ధి పనులకు రూ.84 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అమరేందర్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ, సత్యారెడ్డి, ఇందిర, డీఆర్డీఏ చిన్న ఓబులేసు, సర్పంచ్ శ్రీదేవి, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి కావడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్రెడ్డి సొంతం అని మంత్రి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విలేకరులతో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పది లక్షల ఇళ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం వాళ్ల దృష్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నారని ఆరోపించారు. అబద్ధానికి ఆరడుగుల అర్థం హరీశ్రావు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్, బీజేపీలకు కనబడడం లేదని, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. నెలకు రూ.4వేల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది, కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే అప్పులే పెరిగాయన్నారు. కేటీఆర్, హరీశ్రావులు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకుంటున్నారని.. రెండేళ్లలో రికార్డు స్థాయిలో పంటలు దిగుబడి వచ్చాయన్నారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్లో రేవంత్రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని విమర్శించారు. ఎస్బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు కొడంగల్లో గతంలోనూ ఓడించిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పిన రేవంత్రెడ్డి మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బోనస్ను బోగస్ చేశారు.. రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని హరీశ్రావు అన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తానని, బోనస్ను బోగస్ చేశాడన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. కేంద్రం కోటా కిందనే ధాన్యం కొంటాననడం సరికాదన్నారు. గతంలో కేంద్రం వరిధాన్యం కొనకపోవడంతో ఢిల్లీలో మాజీ సీఎం కేసీఆర్ ధర్నా చేసి వరిధాన్యం కొనేలా చేశారన్నారు. రాష్ట్రంలో 7,600 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ఆగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా ఆ వర్గాలకు లబ్ధి చేకూరలేదని ఆరోపించారు. 700 మంది గౌడ కులస్తుకు ఎక్స్గ్రేషియా అందలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి మేలు జరగలేదని, సీఎం రేవంత్రెడ్డి మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నా.. మనసు లేక పేద వర్గాలకు ఖర్చు పెట్టడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెడితే కేసీఆర్ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో కళాశాలలు మూత పడ్డాయన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. పాలమూరు ప్రాంతమని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి సర్ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కోరారు. రాజకీయ పార్టీలకు అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు దిక్సూచిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మనోహర్, నర్సింహగౌడ్, మనోహర్ప్రసాద్, తులసీరాం, శ్రీకాంత్భీమా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 10 ఫిర్యాదులు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఏఎస్పీ 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూమికి సంబంధించినవి 7, న్యాయం చేయాలని 2, భార్యభర్తల పంచాయితీకి 1 ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం వాటిని సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు ఆగం బల్మూర్: మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగించడం ద్వారా జీవితాలు ఆగం అవడంతో పాటు కుటుంబాలు విచ్ఛినం అవుతాయని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలోని కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం డ్రగ్స్ నియంత్రణ, వాటి వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ., విద్యార్థులు చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు గంజాయి, సారా వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించే వెంటనే అందరూ తమ వంతు బాధ్యతగా 1908 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్ఐ రాజేందర్, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ నర్సింహ, హెచ్ఎం పరమేశ్వర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్జీలు వేగంగాపరిష్కరించాలి కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని డీఆర్ఓ పాండునాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఏఓ చంద్రశేఖర్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రజావాణిలో 66 దరఖాస్తులు వచ్చాయని, వీటిని వెంటనే పరిశీలించి బాధితులకు సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
‘కో–ఆప్షన్’.. కలేనా..!
నారాయణపేట/మరికల్: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షనన్ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షనన్ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. గ్రామాభివృద్ధికి సలహాదారులుగా ఉండాల్సిన వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● గ్రామపాలనలో ప్రజల అనుభవాన్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కో–ఆప్షనన్ సభ్యుల వ్యవస్థ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి ఆరునెలలు గడిచినా కో–ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులను పాలనలో భాగం చేయడంతో అభివృద్ధి ప్రణాళికలకు నాణ్యత పెరగాలనేది దీని ఉద్దేశం. -
బోనస్ 7 రకాలకే..!
వానాకాలం సాగు వరి వంగడాల రకాలు ప్రకటించిన అధికారులు పెరిగిన డిమాండ్ ● వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ● అయోమయంలో అన్నదాతలు ● రైతులకే ప్రయోజనం అంటున్న అధికారులు ● జిల్లాలో 1.92 లక్షల ఎకరాల సాగు అంచనా అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో కేవలం 7 రకాల సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది 33 రకాల సన్నాలకు బోనస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుంది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నా.. గతంతో పోల్చితే వాటి సంఖ్య కుదించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. 1,92,796 ఎకరాల్లో సాగు జిల్లాలోని 20 మండలాల్లో ఈ ఖరీఫ్లో 1,92,796 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 1,80,753 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల సన్నాలను మాత్రమే సాగు చేయాలని సూచించడంతో.. వాటిలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కవ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు తర్జనభర్జన పడుతున్నారు. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉంటుండడంతో వారికి నచ్చిన సీడ్ ఎంచుకునేవారు. ఈ ఏడాది అన్నదాతలకు ఆ అవకాశం లేదు. వ్యవసాయ శాస్త్రవేతలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో ఆ విత్తనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఖరీఫ్కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 3,600 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 3,900 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ.. ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. తక్కువ గైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, మంచి ఆరోగ్యం కోరుకునే వారు తెలంగాణ సోనాను ఎంచుకుంటున్నారు. సాంబా మసూరి ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యధిక అదరణ పొందుతున్న సన్న బియ్యం. వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా.. ఎక్కవ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రొత్సహించాలని నిర్ణయించారు. డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145 ●వరి సన్నరకం పంట -
హామీలు నేరవేర్చకపోతే పోరాటాలే..
పెద్దకొత్తపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఇకపై ప్రజలతో కలిసి పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ అన్నారు. సోమవారం సీపీఐ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని దేదినేనిపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోనైనా పక్షపాత ధోరణి లేకుండా అర్హులకే ఇళ్లు కేటాయించాలని కోరారు. వందేళ్లుగా దేశంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతర పోరాటాలు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాల అమలు, చట్టాలను రూపొందించడంలోనూ సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో నర్సింహ, లక్ష్మీనారాయణ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, కందికొండ స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
● జిల్లాలోని 13 కేంద్రాల్లో 3,862 మంది హాజరు ● పరీక్ష సరళిని పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులందరికీ మహబూబ్నగర్లోనే కేంద్రాలు ఏర్పాటు చేయగా.. చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే చేరుకున్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఇందులో 3,862 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,291 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 429 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు ధరించిన ఆభరణాలను తొలగించిన తర్వాత అనుమతించారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను కేంద్రాల వద్దకు తమ వాహనాలపై విద్యార్థులను చేర్చారు. నగరంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ జానకి పాలమూరు యూనివర్సిటీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల,ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. -
పార్కింగ్.. పరేషాన్!
సెల్లార్లలో వ్యాపారాలు.. రోడ్లపై వాహనాలు ● సెట్బ్యాక్ లేకుండానే అపార్ట్మెంట్లు, దుకాణ సముదాయ నిర్మాణాలు ● ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు కష్టాలు ● పొంచి ఉన్న ప్రమాదం ● చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ సెట్బ్యాక్లు పట్టించుకోరు? ప్రధాన రహదారుల్లో వాణిజ్య నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ కూడా సెట్ బ్యాక్ నిబంధనలు అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. పురపాలికల అనుమతులు ఒకలాగా.. ప్లానింగ్ తీసుకొని, నిర్మానాలు మాత్రం మరొకలా చేపడుతున్నా రు. వాణిజ్య భవనాల కోసం జీప్లస్ వన్ అనుమతి ధ్రువీకరణ పత్రాలు పొందుతూ తదుపరి ఇష్టానురీతిగా అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. జీప్లస్ వన్ వరకు సెల్లార్ నిర్మించకపోయినా 2 మీటర్ల వరకు సెట్బ్యాక్ ఉండాలి. అడుగు స్థలం వద లకుండా రోడ్డుపైకి నిర్మాణాలు చేపడుతున్నారు. రెండంతస్తుల నుంచి నాలుగైదు అంతస్తుల భవనాలు అనధికారికంగా వెలుస్తున్నాయి. అచ్చంపేట: పట్టణాలు రోజుకోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలను, వాహనదారులను పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గత్యంతరం లేక రోడ్లపైనే వాహనాలు నిలపాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పడు సెల్లార్లలో పార్కింగ్కు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ యజమానుల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సెల్లార్లు సైతం వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను అద్దెకిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుటున్నారు. వాటిలో మొబైల్ రిపేరు సెంటర్లు, హోటళ్లు, ఇంటర్నెట్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణాల్లో జనాభాతో పాటు వాహనాల రద్దీ పెరగడం, ఆయా ప్రాంతాల్లో కావాల్సిన పార్కింగ్ స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. పాదాచారులు నడవడానికి సైతం వీలులేని పరిస్థితి ఉంది. ప్రజల భద్రత దృష్ట్యా సెల్లార్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. నిబంధనలకు పాతర.. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భవనాలకు ఒక సెల్లార్, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు రెండో అంతస్తులో సెల్లార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్లార్లు పూర్తిగా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలి. అయితే పట్టణాల్లో పలు వాణిజ్య భవనాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత పురపాలక అధికారులు భవనాల విస్తీర్ణం, అనుమతులు, సెల్లార్ల వినియోగంపై క్షేత్రస్థాయిలో కొలతలు వేసి తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాఽశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
యోగాతో ఆరోగ్యం, మానసికోల్లాసం
కందనూలు: ప్రతి నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. ఆంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగా గురువు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక ప్రాచీన భారతీయ కళ అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని సూచించారు. అలాగే రోగనిరోధక శక్తి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలు రాకుండా యోగా ఎంతగానో సహాయపడుతుంది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి శృతిరూత దూత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ రావు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం ఇబ్బందులు వాస్తవమే.. జిల్లాలో చేపల విక్రయానికి ఇబ్బందులున్నది వాస్తవమే. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వాటి నిర్మాణం పూర్తయ్యాక చేపల మార్కెట్కు కొంత భాగం కేటాయిస్తారు. భూత్పూర్ మున్సిపాలిటీలో చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. సరైన స్థలం లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచాయి. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి -
న్యాయం జరిగే వరకు పోరాడుతాం
చారకొండ: మండలంలో చేపట్టే గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రద్దు చేయాలని నిర్వాసితులు ప్రకాష్, శ్రీరాములు, పెద్దయ్య డిమాండ్ చేశారు. ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని కోరుతూ ఎర్రవల్లిలో చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 202 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. తమ సమస్య పరిష్కరించాలని పంచాయతీ ఎన్నికలు రద్దు చేసినా, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేడు డయల్ యువర్ డీఎం కొల్లాపూర్: కొల్లాపూర్ డిపో పరిధిలో ఆర్టీసీ రవాణాకు సంబంధించిన సమస్యలు, సలహాలు తెలిపేందుకు సోమవారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం మల్లేశయ్య వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నంబర్ 94937 33602 కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు. వాటాదారులకు మెరుగైన సేవలు స్టేషన్ మహబూబ్నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పారు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమావేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు. బీఎస్పీకి పూర్వవైభవం తేవాలి వనపర్తిటౌన్: జిల్లాలో బీఎస్పీకి పూర్వ వైభవం తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇన్చార్జి గూడెం ఎల్లస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తిలో జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్పై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కోశాధికారిగా దేవని శ్రీనివాసులు, జిల్లా ఈసీ మెంబర్గా కార్తీక్, మేకల ఆంజనేయులు యాద వ్ను అసెంబ్లీ ఇన్చార్జ్గా నియమించారు. జూరాలకు నిలిచిన వరద ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
భూములను అమ్మి మమ్మల్ని చదివించారు
‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. తన తండ్రి గంగన్నతో నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
అన్నీ తానై.. నడిపించాడు
వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఐఏఎస్ ఎంపికై ప్రస్తుతం చత్తీస్ఘడ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్నాయక్, ఐఏఎస్ నాపై నాన్న ఎంతో నమ్మకంతో ఉన్నత చదువులు చదివించారు. నా ఆయ సాధనకు ఎంతో కృషి చేశారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం. -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి
● సెప్టెంబర్ 15లోగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష కందనూలు: రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ ఎత్తిపోతలు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు, నియోజకవర్గాల వారీగా భూ సేకరణ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు, ఎంత భూమి ప్రాథమిక నోటిఫికేషన్ దశలో ఉంది, ఎంత భూమి పీఎం స్థాయిలో ఉంది, ఎన్ని అవార్డులు ప్రకటించారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకెన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల జిల్లాలో నిర్వహించిన సమీక్షాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి పెండింగ్లో ఉన్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాల మట్టం పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం.. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించడమే కాకుండా వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూ వివాదాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే ప్రాజెక్టులు పూర్తవుతాయని, అందుకే రైతుల విశ్వాసాన్ని పొందేలా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తితోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, నీటి లభ్యత, పంటల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో వలసలు తగ్గి గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్ తమ తమ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియపై నివేదికలను అందజేశారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్లో ఉన్న కేసులు, కోర్టు వివాదాలు, రైతుల అభ్యంతరాలు తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, సీఈ విజయభాస్కర్రెడ్డి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు కరువు, వలసలు, నీటి కొరతకు ప్రతీకగా నిలిచిందని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి పాలమూరును పచ్చని పంటలతో కళకళలాడే జిల్లాగా తీర్చిదిద్దాలన్నదే రేవంత్రెడ్డి సంకల్పం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి, ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా, చట్టబద్ధంగా, పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
లోక్ అదాలత్లో 9,571 కేసుల పరిష్కారం
కందనూలు: రాజీమార్గమే.. రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి రమాకాంత్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భూ తగాదా, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కుటుంబ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు తదితర పెండింగ్ ఉన్న 9,571 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు సుఖ సంతోషాలతో జీవించవచ్చన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు నస్రీమా సుల్తానా మాట్లాడుతూ కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరువర్గాలు రాజీ చేసుకోవడం వల్ల మానవ సంబంధాలు బలపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్
పాలమూరు: ఆడపిల్లలను పదో తరగతి వరకు చదివించడమే గగణమైన ఆ రోజుల్లో మా నాన్న.. భవిష్యత్లో పిల్లలకు చదువు ఎంత అవసరమో ముందే గ్రహించాడు. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే మా ముగ్గురిని కష్టపడి చదివించారని చెబుతోంది మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాది నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం. దిగువ మధ్య తరగతి కుటుంబం కాగా.. నాన్న పాండు, అమ్మ ఉషకు మేం ముగ్గురం సంతానం (ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి). మా చిన్నతనం నుంచి నాన్న ఒక్కరే కష్టపడేవారు. మాకు ఊళ్లో కనీసం సెంటు భూమి కూడా లేకపోవడంతో నాన్న వ్యవసాయం కాకుండా కోదాడలో చికెన్ సెంటర్ నడిపేవారు. దీని ద్వారా వచ్చిన అరకొర ఆదాయంతో కొంత అద్దె చెల్లించడంతోపాటు మిగిలిన దాంట్లో సర్దుబాటు చేస్తూ ప్రణాళిక ప్రకారం కుటుంబాన్ని పోషిస్తూ మమల్ని చదివించారు. చిన్ననాటి నుంచి నాన్నకు ఒక విజన్ ఉండేది.. ఉన్నత చదువు వల్ల పిల్లల జీవితాలు బాగుంటాయని పదే పదే మాకు చెబుతూ బాగా చదవాలని ప్రోత్సహించారు. ఆయన మార్గదర్శకంలోనే నేను ఈ ఉద్యోగం సాధించగలిగాను. మా చెల్లి వైద్యురాలిగా స్థిరపడింది. మా అన్నయ్య ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా కుటుంబంలో ఉన్న ముగ్గురం ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక మా తండ్రి కష్టం ఎంతో దాగి ఉంది. ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026 -
రైతులను మోసగిస్తే సహించేది లేదు
తిమ్మాజిపేట: ఆరుగాలం కష్టించి పండించిన పంట కొనుగోలు చేసిన దళారులు డబ్బులు ఇవ్వకుండా దర్జాగా తిరుగుతూ రైతులను గోసపెడుతున్నారని, రైతులను మోసం చేసే వ్యక్తులను సహించేది లేదని ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాజిపల్లి, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు తాము పండించిన మొక్కజొన్న పంట డబ్బులు అత్యవసరం ఉందని ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ క్వింటాకు రూ.1,700 చొప్పున 250 క్వింటాళ్లు ఇప్పలపల్లికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. అయితే రైతులు మొక్కజొన్న అమ్మి రెండు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మండల నాయకుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యక్తి, మధ్య దళారులను స్టేషన్కు పిలిపించాలని ఎమ్మెల్యే ఎస్ఐ శ్రీనివాసరావుకు సూచించారు. దీంతో ధాన్యం కొన్న వ్యక్తి మినహా దళారులు స్టేషన్కు రాగా.. పోలీస్స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే సదరు వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతావారు వచ్చే వరకు వీరిని వదలవద్దని, మూడు రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే ఎస్ఐకి సూచించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వివేక్రెడ్డి తదితరులున్నారు. -
శనేశ్వరుడికి అభిషేకాలు
కందనూలు: మండలంలోని నందివడ్డేమాన్లో వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణ కోసం స్వామివారికి తిలతైలాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధికులు సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని పొందుతారని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల కోసం అధికారులను బలిచేయొద్దు కొల్లాపూర్: అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను బలి చేయొద్దని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్లో విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలు అనూహ్య రీతిలో జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు కొల్లాపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోతున్నారని, కొల్లాపూర్కు వచ్చేందుకు అధికారులు భయపడే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. ఈ అంశాలను పాలకులు, ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చొద్దన్నారు. ఇవే పద్ధతులు కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఇందిర, శివుడు, యూసుఫ్, కిరణ్కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు కందనూలు: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, పర్యవేక్షణ లోపాలు కొనసాగుతున్నాయని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్, ఎంఈఓ, సంబంధిత పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం నిర్వహించే రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, నగర సంయుక్త కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈనెల 21న నీట్ రీ–ఎగ్జామ్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్ఎం సంతోష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు ఎక్కేముందు కండక్టర్ లేదా డ్రైవర్కు తమ హాల్టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ సదుపాయం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఏసీ సహా అన్ని బస్సు సర్వీసులకు వర్తిస్తుందని తెలిపారు. ఆయా మార్గాలలో అదనపు బస్సులు నడుపుతామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని డిపోల మేనేజర్లను ఆదేశించామని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–2345 0033, 6815 3333, 99592 26295, 99592 26296లకు సంప్రదించవచ్చని సూచించారు. -
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం
● అందరి భాగస్వామ్యంతో ప్రగతి ప్రణాళికలు రూపొందించాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ 2026–27 రూపకల్పనపై శుక్రవారం నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి వద్దనున్న ఓ ఫంక్షన్హాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అవసరాల ఆధారంగా రూపొందించే ప్రణాళికల ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి జీపీలో గ్రామ సభలను విస్తృతంగా నిర్వహించి.. ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలను సేకరించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు తమ విధులను ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వర్తించాలని.. ఎంపీడీఓలు నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ, వీధి దీపాలు, విద్యా సదుపాయాలు, ఆరోగ్య సేవలు, అంగన్వాడీ కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ, వనమహోత్సవం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సాధికారత వంటి అంశాలకు జీపీడీపీలో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జీపీడీపీతో అనుసంధానం చేసి.. నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జీపీడీపీ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తిచేసి.. రూపొందించిన ప్రణాళికలను నాణ్యతతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, భరోసా కేంద్రం నిర్మాణం కోసం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ భూమిని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రతిపాదిత స్థలంలోని భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, భూమి విస్తీర్ణం వంటి అంశాలపై ఆరా తీశారు. భూమి సర్వే నంబర్లు, ప్రభుత్వ యాజమాన్య హక్కులు, మొత్తం భూమి విస్తీర్ణం, హద్దులు, సరిహద్దుల వివరాలను త్వరగా అందించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, భరోసా కేంద్రం ఏర్పాటుతో పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వారి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సురేశ్బాబు, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర ఉన్నారు. -
వేదిక మార్చేశారు!
●యూనివర్సిటీకే రావాలి.. యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు మార్పు సరికాదు.. సీఎం సొంత జిల్లాలో ఉన్న పీయూకు జాతీయ సెమినార్ నిర్వహించే అవకాశం వస్తే దాన్ని హైదరాబాద్కు మార్చడం శోచనీయం. యూనివర్సిటీలోనే సెమినార్ నిర్వహించాలి. సీఎం వస్తే యూనివర్సిటీలో సమస్యలను చూసి నిధులు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్వీ ఆందోళనలు, జాబ్ క్యాలెండర్ నిరసనలకు భయపడే జాతీయ సెమినార్ను కన్హా శాంతివనంకు మార్చారు. యూనివర్సిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – భరత్బాబు, బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గోస చూస్తారనుకుంటే.. పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మొదట్లో యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు 15 కమిటీల ఏర్పాటు.. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. సీఎం సారూ.. ఇటు చూడండి -
ఏజెన్సీల ఇష్టారాజ్యం!
● ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయనే ఆశజూపి రూ.లక్షల్లో వసూళ్లు ● నెలవారీ జీతభత్యాల్లో సైతం చేతివాటం ● ఫిర్యాదులు అందుతున్నాస్పందించనియంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ఔట్సోర్సింగ్ నియామకాలు తాత్కాలికమే అయినప్పటికీ.. ప్రభుత్వ శాఖల్లో పనులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం రెగ్యులర్ నియామకాల కన్నా తాత్కాలిక నియామకాలకే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకాన్ని ఏజెన్సీలకు అప్పగించడంతో పాటు సదరు సిబ్బంది జీతభత్యాలను సైతం ఏజెన్సీల ద్వారా చెల్లింపులు చేస్తోంది. స్వీపర్ స్థాయి ఉద్యోగాలకు రూ. 15,600, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలకు రూ. 19,500, కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు రూ. 23వేల వరకు ప్రతినెలా చెల్లిస్తున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నెలవారీ జీతభత్యాల్లో 4 శాతాన్ని సంబంధిత ఏజెన్సీలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో చెల్లిస్తుంది. అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు తాత్కాలికమే అయినప్పటికీ.. భవిష్యత్లో క్రమబద్ధీకరిస్తారనే ఆశచూపుతూ.. నియామకాల సందర్భంగా రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 36 ఏజెన్సీలున్నా పెత్తనం కొందరిదే.. జిల్లావ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 36 వరకు ఏజెన్సీ కంపెనీలు ఎంప్యానల్మెంట్లో నమోదై ఉన్నాయి. అయితే వీటిలో మూడు, నాలుగు ఏజెన్సీలే అన్ని శాఖల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ నేతల అండదండలు, పైరవీలు నెరిపే ఏజెన్సీల పెత్తనమే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నా ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం లేదు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల కోసం నియమించుకుంటున్న తాత్కాలిక ఉద్యోగుల నుంచి సంబంధిత ఏజెన్సీలు ఇష్టారీతిగా వసూళ్లు చేస్తూ, సొమ్ము చేసుకుంటున్నాయి. స్వీపర్ స్థాయి ఉద్యోగానికి సైతం రూ. 65వేల నుంచి రూ. 80వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔట్సోర్సింగ్ నియామక ప్రక్రియపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. ఏజెన్సీలదే ఇష్టారాజ్యంగా మారడంతో వసూళ్ల పర్వం క్రమంగా పెరుగుతోంది. ●లంచం ఇస్తేనే జీతభత్యాలు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు రావడం లేదు. కనీసం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుతుండగా.. మరికొన్నిసార్లు ఉద్యోగులకు జీతం ఇవ్వకుండా ఏజెన్సీలు నిలిపేస్తున్నాయి. జిల్లాలోని మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలంటే సంబంధిత ఏజెన్సీకి అందులో కొంత మొత్తాన్ని ముట్టజెప్పాల్సి వస్తోందని ఔట్సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. లేనిచో మూడు నుంచి ఆరు నెలల వరకు జీతభత్యాలను పెండింగ్లోనే ఉంచుతున్నారని.. అందులోనూ కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడీ పీఎఫ్ డబ్బులను సైతం ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలే సొమ్ముచేసుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత శాఖ నుంచి నోటిఫికేషన్ ద్వారానే ఔట్సోర్సింగ్ విధానంలో ఎంపిక కొనసాగుతుంది. ఇందులో ఉద్యోగం కోసం ఏజెన్సీలకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ లేదా సంబంధిత అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. – రాఘవేందర్ సింగ్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, -
పచ్చదనం పరిచేలా..
● జిల్లాలో వనమహోత్సవానికి శ్రీకారం ● ఈసారి 35లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కందనూలు: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించి.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 35లక్షల మొక్కలు నాటి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. శాఖల వారీగా కేటాయింపు.. జిల్లాలో ప్రభుత్వ శాఖలవారీగా వనమహోత్సవ లక్ష్యాలను కేటాయించారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 21.60 లక్షలు, అగ్రికల్చర్ 2.10 లక్షలు, పంచాయతీరాజ్ 1 లక్ష, ఎకై ్సజ్ 1.90 లక్షలు, ఫారెస్టు 1.40 లక్షలు, హార్టికల్చర్ 1 లక్ష, ఇండస్ట్రీస్ 5వేలు, ఇరిగేషన్ 7వేలు, మున్సిపల్శాఖ 6.70 లక్షలు, పోలీసు 4వేలు, ఆర్అండ్బీ 5వేలు, ట్రైబల్ వెల్ఫేర్ 5వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 460 జీపీల్లో నర్సరీలు.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతి జీపీలో నర్సరీ ఏర్పాటుచేసి, నేరెడు, మునగ, వేప, కానుగ, చింత, మందార, గులాబీ మొక్కలతో పాటు డ్రాగన్ ప్రూట్స్, కర్జూర మొక్కలు తదితర మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 5వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రయోజనం చేకూరేనా? గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా చోట్ల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఏడాదైనా అధికారులు సమన్వయంతో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మండలం జీపీలు మొక్కలు అచ్చంపేట 38 1,90,000 అమ్రాబాద్ 20 1,00,000 బల్మూర్ 23 1,15,000 బిజినేపల్లి 35 1,75,000 చారకొండ 17 85,000 కల్వకుర్తి 24 1,20,000 కోడేరు 16 80,000 కొల్లాపూర్ 18 90,000 లింగాల 23 1,15,000 నాగర్కర్నూల్ 18 90,000 పదర 10 50,000 పెద్దకొత్తపల్లి 28 1,40,000 పెంట్లవెల్లి 10 50,000 తాడూరు 24 1,20,000 తెలకపల్లి 28 1,40,000 తిమ్మాజిపేట 26 1,30,000 ఉప్పునుంతల 27 1,35,000 ఊర్కొండ 16 80,000 వంగూర్ 27 1,35,000 వెల్దండ 32 1,60,000 మండలాల వారీగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలు.. -
?
నాగర్కర్నూల్సర్..ఉన్నారా.. లేరా 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026–8లో uఅర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను జూలై 31న విడుదల చేస్తాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని సెక్షన్ 21 ప్రకారం 2026 అక్టోబర్ 1 నాటికి అర్హత తేదీగా నిర్ణయించి.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరణించి వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు ఉంటుంది. 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రస్తుత ఓటరు పేరు పాత జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాల పేర్లు, ఈపిక్ నంబరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి.. కొత్త ఓటర్ల నుంచి నమోదు ఫారాలు స్వీకరిస్తారు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి కందనూలు: జిల్లాలోని న్యాయస్థానాల్లో ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (ఈఈ) కేసులు, ఈ పెట్టీ, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ తదితర రాజీ అయ్యే కేసులను లోక్అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పోలీస్ కుటుంబాలకు చెక్కులు జిల్లాలోని ఈగలపెంట పీఎస్ కానిస్టేబుల్ ఎస్.బాలయ్య, లింగాల ఏఎస్ఐ ఎల్. శ్రీనివాసులు, పెద్దకొత్తపల్లి పీఎస్ మహేందర్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి రూ.99,800 చొప్పున మంజూరైన చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, జిల్లా పోలీస్ కోఆర్డినేటర్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ తిమ్మాజిపేట: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు జాబితా మ్యాపింగ్ను పకడ్బందీగా పూర్తిచేయాలని ఆర్డీఓ సురేశ్ అన్నారు. తిమ్మాజిపేట రైతువేదికలో గురువారం బీఎల్ఓలు, రాజకీయ పార్టీల బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా మ్యాపింగ్లో బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎలాంటి తప్పులకు తవివ్వకుండా ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల 26 వరకు నిర్వహించే ఇంటింటి సర్వేలో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అనంతరం బీఎల్ఓల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. కాగా, తమ్మాజిపేట మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 80శాతం పూర్తి చేసినట్లు తహసీల్దారు జయంతి తెలిపారు. సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఉన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో శనివారం వివిధ ప్రైవేట్ సంస్థల్లో 250 ఉద్యోగాల భర్తీ కోసం తమ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ ఫర్టిటైజర్స్ కంపెనీ, అపోలో ఫార్మసీ, ట్రాక్స్ అండ్ ఆర్డరైజ్డ్ సర్వీస్ డీలర్ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 18–30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.89193 80410ను సంప్రదించాలని సూచించారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. పకడ్బందీగా ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హులను జాబితాలోంచి తొలగిస్తారు. రెండు, మూడు చోట్ల ఓటు హక్కున్న వాటిని తొలగించి.. ఒక్క చోట మాత్రమే ఉండేలా జాబితా రూపొందిస్తారు. జిల్లాలో చాలామందికి తమ సొంతూరుతోపాటు ప్రస్తుతం నివశిస్తున్న పట్టణంలోనూ ఓటు హక్కు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటికి చెక్ పడనుంది. అలాగే మరణించిన వారిని, ఊరు వదిలి వెళ్లిపోయిన వారి పేర్లను కూడా తొలగిస్తారు. మొత్తంగా తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఓటరు పేరు, చిరునామా, తండ్రి/ భర్త పేరులో తప్పుగా నమోదైతే సరిదిద్దడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికే మండల స్థాయిలో ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాలను రూపొందించారు. ఇందుకోసం బూత్స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటరు మ్యాపింగ్ ఇలా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎ క్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇ లాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మ ంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గం 2025లో ఓటరు మ్యాప్ చేయని తప్పులు/అక్రమాలు మొత్తం ఓటర్లు మ్యాపింగ్ ఓటర్లు ఉన్న ఓటర్లు నాగర్కర్నూల్ 2,40,571 1,83,129 57,442 72,073 అచ్చంపేట 2,48,362 2,04,770 43,592 86,532 కొల్లాపూర్ 2,42,699 1,91,733 50,966 79,901 కల్వకుర్తి 2,45,355 1,89,868 55,487 66,347 వనపర్తి 2,75,570 2,25,653 49,917 97,926 గద్వాల 2,61,810 1,98,304 63,506 79,677 అలంపూర్ 2,42,049 2,02,489 39,560 75,982 మహబూబ్నగర్ 2,64,235 1,80,078 84,157 84,090 జడ్చర్ల 2,25,911 1,83,253 42,658 72,068 దేవరకద్ర 2,42,342 2,02,135 40,207 80,533 నారాయణపేట 2,42,773 2,04,230 38,543 87,396 మక్తల్ 2,52,801 2,19,495 33,306 99,881 కొడంగల్ 2,51,255 2,00,361 50,894 79,299 అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. మరో అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు -
కొత్తకొత్తగా..
●పాఠశాల విద్యాశాఖ నుంచి దుస్తుల రంగులు, డిజైన్లకు సంబంధించి ఉత్తర్వులు అందాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నూతన యూనిఫాంలను వచ్చే నెలలో పంపిణీ చేస్తాం. వారం రోజుల్లోగా ఎస్హెచ్జీ గ్రూపులకు కొత్త యూనిఫాంలకు సంబంధించిన క్లాత్ను అందించనున్నాం. ఇప్పటికే ఆయా పాఠశాలలకు పుస్తకాలు చేరడంతో పంపిణీ చేస్తున్నారు. – రమేశ్కుమార్, డీఈఓ అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించనున్న యూనిఫామ్ డిజైన్లో మార్పు చేశారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నీలిరంగు దుస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్లాత్ను జిల్లాకు సరఫరా చేసింది. జిల్లాలో ప్రభుత్వ, యూపీఎస్, పీఎస్, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్, యూఆర్ఎస్, టీఎస్ఆర్ఈఐఎస్, మోడల్ స్కూళ్లు మొత్తం 839 ఉండగా.. 58,455 మంది బాలబాలికలు చదువుతున్నారు. వారందరికీ కొత్త దుస్తులు అందితే.. పాఠశాలలు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. సమగ్ర శిక్ష, సెర్ప్, మెప్మా సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు సంబంధిత అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు తీసుకునే అవకాశం ఉంది. రెండేసి జతల చొప్పున.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండేసి జతల యూనిఫాం అందిస్తారు. ఇప్పటికే జిల్లాకు ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం చేరింది. స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించి.. పంపిణీ చేయనున్నారు. మరోనెల లేదా రెండు నెలల వరకు పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. గతేడాది సుమారు 56,733 మంది విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. ఈసారి బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరగనున్నందున సుమారు 60వేలకు పైగా మంది విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్కారు బడుల విద్యార్థుల యూనిఫాం డిజైన్ మార్పు జిల్లాకు చేరిన క్లాత్ మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత 60వేల మంది బాలబాలికలకు అందనున్న కొత్త దుస్తులు -
వైద్య ఉద్యోగుల సమస్యలపై సమష్టి పోరాటం
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ, సామాజిక భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మైకేల్ మనోహర్ అన్నారు. గురువారం యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు ప్రాణం పోస్తున్నారని.. కరోనా సమయంలో చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రభుత్వమే వేతనాలు అందించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శివరాం, విష్ణు, యశోదబాయి, భారతి, రహీం, శ్రీకాంత్, రమేశ్, శిరోమణి, పరుశరాములు పాల్గొన్నారు. -
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
మన్ననూర్: నల్లమల అభయారణ్యంలోని వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీశాఖతో పాటు ప్రజలందరిపై ఉందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మన్ననూర్, అమ్రాబాద్ అటవీశాఖ రేంజ్ల పరిధిలోని దుర్వాసుల చెరువు వద్ద గురువారం నిర్వహించిన వనమహోత్సవంలో డీఎఫ్ఓ రేవంత్ చంద్రతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే అతి విశాలమైన అటవీ ప్రాంతాల్లో నల్లమల పరివాహక ప్రాంతం ఒకటి కావడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ ప్రాంతంలోని టేకుకు ఎంతో విలువ ఉండేదని.. పెద్దపులుల సంఖ్య కూడా 125–135 వరకు ఉండేవన్నారు. ప్రస్తుతం పెద్దపులల సంఖ్య 42కు పెరగడం ప్రశంసనీయమన్నారు. జంగిల్ సఫారీ కూడా ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవిధంగా ఉందన్నారు. అడవి అభివృద్ధి కోసం హెలీకాప్టర్ ద్వారా సీడ్ బాల్స్ చల్లాలని సంబంధిత మంత్రితో మాట్లాడటం జరిగిందని ఆయన తెలిపారు. అదే విధంగా అటవీ సమీప గ్రామాల్లో కోతుల బెడదను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఫారెస్టు బీట్ ఆఫీసర్స్ నియామకాలు చేపట్టనుందని.. 20ఏళ్లుగా కాంట్రాక్టు బేసిక్లో వాచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యేతో పాటు డీఎఫ్ఓకు 140మంది వాచర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం వాచర్ విష్ణు ఓ ఇంట్లో సురక్షితంగా పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీరాములు, ఎఫ్డీఓలు రామ్మూర్తి, రామ్మోహన్ చంద్రశేఖర్, ఎంపీడీఓ లింగయ్య, భగీరథ డీఈలు విజయశ్రీ, హేమలత, ఎఫ్ఆర్ఓలు వీరేష్, సవిత, ఈశ్వర్, సర్పంచ్ మంజుల, రాజారాం, ఎంఏ రహీం, వెంకటరమణ, సత్యనారాయణ, శ్రీనివాసులు, తిరుపతి, నిరంజన్ పాల్గొన్నారు. -
గుడారాల తొలగింపు
కందనూలు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సంచార జాతుల వారు ఏర్పాటుచేసుకున్న గుడారాలను గురువారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా సంచార జాతుల వారికి, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఇక్కడే తమకు వచ్చిన పనులు చేసుకొని జీవిస్తున్నామని.. అకస్మాత్తుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ను ’సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. తాము వారం రోజుల నుంచి వారికి వేరే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నామని తెలిపారు. -
అందుబాటులో 32వేల మె.ట. యూరియా
● పారదర్శకంగా రైతులకు పంపిణీ ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 32వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి చేతులమీదుగా యూరియా బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం హాకా, ఆగ్రోస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, క్రిమిసంహారక మందుల విక్రయ కేంద్రాల డీలర్లతో యూరియా పంపిణీ, యాప్ ఆధారిత బుకింగ్ విధానం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ.. వారికి ఎరువులు సులభంగా అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యాప్ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు, డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఏఓ యశ్వంత్రావు, జిల్లా సహకార అధికారి రఘునాథ్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్ ఉన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిని అన్నివిధాలుగా అభివృద్ధిచేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్షలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితి, రోగుల రద్దీ, అందుబాటులో ఉన్న వైద్యసేవలు, వివిధ విభాగాల్లో అవసరమైన ఆధునిక పరికరాల ఏర్పాట్లపై కమిటీ కన్వీనర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి పూర్తిస్థాయి వివరాలను కమిటీకి వివరించారు. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక వైద్యసేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 2.68కోట్లు మంజూరు చేసిందని.. ఈ నిధులతో ఆస్పత్రికి అత్యవసర పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు ప్రతి విభాగం నుంచి అవసరాల జాబితాను సేకరించి, సాంకేతిక నివేదికలతో కూడిన సమగ్ర ప్రతిపాదనలను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ దావూద్ సులేమాన్ ఉన్నారు. -
ఓటరు జాబితా సవరణపై అవగాహన ఉండాలి
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త, నాయకుడికి అవగాహన ఉండాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా మ్యాపింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓటర్లను తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్కు చెందిన బీఎల్ఏలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదే విధంగా ఈ నెల 22న అచ్చంపేటలో నిర్వహించే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరవుతారని చెప్పారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై పార్టీ కార్యకర్తలకు త్వరలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పోకల మనోహర్, మాకం తిరపతయ్య, కె.తులసీరాం, నర్సింహాగౌడ్, అమీనుద్దీన్, కేటీ తిరుపతయ్య, పర్వతాలు, కరుణాకర్రావు ఉన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల: రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గోపల్దిన్నెలో 33/11 కేవీ సబ్స్టేషన్, మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఎక్స్రే ల్యాబ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో పాటు కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపల్దిన్నెలోని సర్వేనంబర్ 357 ప్రభుత్వ భూమిలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు సన్నరకం వరికి బోనస్, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్భాటాలకు పోయి ప్రజలు అప్పులపాలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఓ అరుణ, సర్పంచ్లు శివకుమార్, కవిత, మీసాల పార్వతమ్మ, సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, పలువురు కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
విత్తనాల ఎంపికలో జాగ్రత్త
● ఎల్నినో ప్రభావం అంతంతమాత్రమే ● పూర్తిస్థాయిలో వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలి ● ముందే విత్తితే నష్టం తప్పదు ● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు కందనూలు: ‘‘రైతులు ఎల్నినోపై బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు.. దాన్ని ప్రభావం తాత్కాలికమే. ముఖ్యంగా విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలోని లైసెన్స్డ్ విత్తన షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి’’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు సూచించారు. విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని.. అందులో సంబంధిత విత్తన లాట్ నంబర్ను నమోదు చేయించుకోవాలన్నారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతుల ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి‘ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. విత్తనాల ఎంపిక, పంటల సాగులో మెళకువలు, నాసిరకం విత్తనాల కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలను రైతులకు వివరించారు. ప్రశ్న: నకిలీ విత్తనాలను అరికట్టడం ఎలా? – లక్ష్మణ్, కార్వంగ.. శివాజీ గణేశ్, గౌరారం డీఏఓ: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన బిల్లు తప్పనిసరిగా పొంది.. పంట దిగుబడి వచ్చేవరకు దాచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ విత్తనాలను కొనుగోలు చేయొద్దు. తొమ్మిది ఇంచుల లోతు భూమి తడిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి. ప్రశ్న: యూరియా యాప్ను రద్దు చేయండి. – సైదులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డీఏఓ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను రద్దు చేయడానికి అవకాశం లేదు. రైతులకు నష్టం జరగకూడదని ప్రవేశపెట్టారు. అందుకోసం ప్రతి ఏఓ వద్ద వలంటీర్ను ఏర్పాటుచేశాం. రైతుల వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏఈఓలను సంప్రదిస్తే వాళ్లు యూరియాను బుక్ చేస్తారు. కాబట్టి దీన్ని ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ప్రశ్న: యూరియా యాప్ చాలా కష్టంగా ఉంది. ప్రత్యామ్నాయం ఆలోచించండి. – ప్రవీణ్, వెల్దండ డీఏఓ: యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా యాప్ తీసుకురావడం జరిగింది. యాప్ ద్వారా యూరియా బుకింగ్తో నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రోజు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల సమయంలో బుక్ చేసుకోవచ్చు. యాప్ను ఉపయోగించే విధానంపై ఏఈఓలను సంప్రదించండి. ప్రశ్న: వరిలో ఏరకం సాగుచేయాలి.. ఏది లాభదాయకం? – రామకృష్ణ, కంసానిపల్లి, ఉప్పునుంతల డీఏఓ: ప్రభుత్వం సన్నరకాలను ప్రోత్సహిస్తోంది. నీటి సదుపాయం ఉండి, భూమిలో చౌడు లేకుంటే సన్నాలను సాగుచేయాలి. సన్నరకంలో బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–1508, ఎన్ఎం–1638 వడ్లను సాగుచేసుకోవాలి. తద్వారా మంచిరేటు, దిగుబడి ఉంటుంది. ప్రశ్న: ప్రభుత్వం అందించే బోనస్ కోసం ఏరకమైన సన్నాలను సాగుచేయాలి? – చందు, కంసానిపల్లి, ఉప్పునుంతల డీఏఓ: ప్రభుత్వం పంపిణీచేసే సన్నబియ్యం కోసం 33 రకాలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. వడ్లతో పాటు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రశ్న: పచ్చిమిరప ఏ సమయంలో వేసుకోవాలి? – రేణయ్య, గువ్వలోనిపల్లి, ఉప్పునుంతల డీఏఓ: పచ్చిమిరిచి వేసే సమయంలో పొలంలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జూన్ మొదటి వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించినట్లైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశ్న: గత యాసంగిలో మొక్కజొన్న ఎక్కువ వేయడంతో ఇబ్బందులు తలెత్తాయి.. సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. – రవీందర్రావు, పెద్దాపూర్, ఉప్పునుంతల డీఏఓ: మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటుచేశాం. మొక్కజొన్న దిగుబడి ఎక్కువ రావడంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాం. అందరు ఒకటే పంట వేయకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ప్రశ్న: పత్తిలో ముడత నివారణకు మార్గాలు తెలియజేయండి? – శ్రీనివాసులు, గౌరారం, తెలకపల్లి డీఏఓ: పత్తిలో ముడత నివారణ పోవాలంటే మొలక శాతం సరిగ్గా ఉండాలి. తేమ తగినంత ఉండాలి. కోళ్ల ఎరువు వేసుకోవడం ద్వారా పొలంలో వేడి ఎక్కువగా ఉండి ముడత తెగులు వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో తేమ సరిగ్గా ఉండదు. రైతులు ఎరువులను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రశ్న: వర్షాకాలంలో వరి తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? – లవకుమార్, పాపగల్, తాడూర్ డీఏఓ: వరి తెగులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం అనుమంతించిన రకాలు వేసుకోవాలి. ఆర్ఎన్ఆర్–1508, కేఎన్ఎం 1638, రకాల వడ్లను వేసుకోవాలి. తద్వారా తెగుళ్లను నివారించవచ్చు. వాటికి తోడు వరి మాత్రమే కాకుండా కందులు, మినుములు, ఇతర రకాల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
ఖిల్లాఘనపురం: గణప సముద్రం రిజర్వాయర్ పనులు వేగంగా జరగాలంటే భూ సేకరణకు రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆర్అండ్ఆర్ భూ సేకరణ రాష్ట్ర కమిషనర్ కె.శివకుమార్నాయుడు కోరారు. బుధవారం మండల కేంద్రం శివారులోని గణపసముద్రం రిజర్వాయర్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రిజర్వాయర్ అలుగు మూడు ఫీట్లు పెంచడంతో గ్రామంలోకి నీళ్లు వస్తాయని.. అరికట్టేందుకు గ్రామం దగ్గర కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పెంచిన భూముల ధరలకు అనుగుణంగా ఇక నుంచి రైతులకు ఇచ్చే పరిహారం రూ.20 లక్షలకు పెంచాలన్నారు. పూర్తిస్థాయిలో భూములు కోల్పోతున్న రైతులకు ఏడు కోట్ల భూమిలో ఒక్కొక్కరికి కనీసం 3 గుంటలు పట్టా చేయాలని కోరారు. భూమి ఉండటంతో ప్రభుత్వం ఇచ్చే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గురువారం కలెక్టరేట్లో రైతులతో సమావేశం ఉంటుందని.. ప్రతి సమస్యను అక్కడ తెలియజేయాలని సూచించారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. రైతులందరు త్వరగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తే రెండు నెలల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి 164 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. -
నేడు లక్కీ డ్రా
కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు గాను గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఉదయం 10 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని ఆయన సూచించారు. బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు కల్వకుర్తి రూరల్: బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అల్తాఫ్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కల్వకుర్తి పట్టణంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ పాల కేంద్రంలో పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడికి విముక్తి కల్పించి.. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. బడీడు పిల్లలు పాఠశాలకు వెళ్లాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు మధుబాబు, శంకర్, పద్మ, వెంకటస్వామి, యాదగిరి పాల్గొన్నారు. వైద్యసేవల్లో ఆర్ఎంపీల పాత్ర కీలకం అచ్చంపేట: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఆర్ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేటలోని రెడ్డి భవన్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఆర్ఎంపీల అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా, సేవాభావంగా భావించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యసేవల విస్తరణకు కృషి చేస్తున్నామని.. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యరంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు గోవర్ధన్రెడ్డి, విష్ణుమూర్తి పాల్గొన్నారు. పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది. ‘వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వానిదే’ ఖిల్లాఘనపురం: వైద్య ఉద్యోగుల సామాజిక భద్రత ప్రభుత్వాలదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డా. మాధవి జెండా ఆవిష్కరించగా.. ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని.. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యసిబ్బంది డా. సందేశ్, వెంకటలక్ష్మి, ప్రభావతి, వెంక టేష్, భీమయ్య, మునీందర్, నజ్మా, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్లోనే.. మహబూబ్నగర్లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్గా మారింది. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్నగర్కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్ -
జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్ మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. -
ఎరువులు పారదర్శకంగా అందించాలి
కందనూలు: రైతులకు యూరియా, ఎరువులు పారదర్శకంగా అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని గ్రోమోర్ పురుగు మందుల విక్రయ కేంద్రం, పీఏసీఎస్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలు, ఆన్లైన్ పంపిణీ విధానాన్ని, అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ పరిమాణం, రైతుల అవసరాలు, రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కు అనుగుణంగా నిల్వల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుకాణంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, మున్సిపల్ అనుమతులు, నానో యూరియా, నానో డీఏపీ వంటి ఉత్పత్తుల లభ్యతపై వివరాలు సేకరించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు నిరంతరాయంగా ఎరువులు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్ సందర్శించిన కలెక్టర్ అక్కడ రైతులకు ఆన్లైన్ విధానంలో జరుగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. రైతుల ఆధార్ ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా జరుగుతున్న విక్రయాల విధానాన్ని పరిశీలించి, ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ కేంద్రంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల నమోదు, రోజువారీ లావాదేవీల వివరాలను కూడా తనిఖీ చేసి.. ఎరువుల సరఫరా విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథ్రావు, ఆర్డీఓ సురేష్బాబు, వ్యవసాయ అధికారి పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీలపై నిరంతర పర్యవేక్షణ అంగన్వాడీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీసీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతోపాటు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఆరోగ్య స్థితిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. జాతీయ బాల ఆరోగ్య రక్ష బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నల్లమల ఏజెన్సీ ప్రాంత అంగన్వాడీ కేంద్రాలపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. -
జిల్లా పరిధిలో ఇలా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఈసారి వేసవికాలంలో వీబీ జీ రామ్జీ (ఉపాధి హామీ) పనులు ఊపందుకున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలోనే జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు 10,59,663 పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు 40 వేలకుపైగా కూలీలు పనులకు హాజరవుతుండటం గమనార్హం. మరోవైపు ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తుండగా.. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ గతేడాదికి మించి ఈసారి ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య పెరిగింది. 68 శాతం లక్ష్యం పూర్తి.. జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి పనిదినాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 16 లక్షల పనిదినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 10.60 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. మొత్తంగా 68 శాతం వరకు లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇంకా మిగతా రోజుల్లోనూ పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సకాలంలో అందని కూలి.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల హాజరు నమోదు పెరుగుతుండగా.. కూలీలకు డబ్బుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం కొనసాగుతోంది. వారాలు గడిచినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రం గత నెల నుంచి ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 1,91,768 జాబ్కా ర్డులు ఉండగా, వీరిలో 97,565 మంది కూలీలు పనులకు హాజరవుతున్నాయి. ఇందులో సుమారు 40 నుంచి 43 వేల మంది వరకు నిత్యం పనులకు వస్తున్నారు. వీరికి రోజువారీ కూలి కనీసం రూ.250– 307 వరకు చెల్లించాల్సి ఉండగా.. జిల్లాలో సగటున రూ.274 వరకు అందుతోంది. అయితే పనులు పూర్తిచేసి నాలుగు, ఐదు వారాలు గడిచినా డబ్బులు రాకపోవడంతో కూలీలు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం కనీసం రెండు వారాలకు ఒకసారి డబ్బులు జమచేయాలని కూలీలు కోరుతున్నారు. పనులకు హాజరవుతున్నవారు 97,565 సగటున నిత్యం వస్తున్నవారు 40,45 వేలు ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 16 లక్షలు జిల్లాలో సగటు దినసరి వేతనం రూ.279 10.60 లక్షలు మే నెలలో అత్యధికంగాపనిదినాలు కల్పించిన అధికారులు ఈసారి వేసవిలో పెరిగిన కూలీల హాజరు ఎన్ఎంఎంఎస్ యాప్ హాజరు అమలుతో ఇబ్బందులు ఐదు వారాలు దాటినా డబ్బులు రాక నిరాశ మొత్తం జాబ్కార్డులు 1,91,768 ఉపాధి కూలీలు 1,55,554 -
డబ్బులు రాలేదు..
ఈ ఏడాదిలో పనులు ప్రారంభించినప్పటి నుంచి ఉపాధి పనికి వెళ్తున్నాం. కానీ, ఇప్పటి వరకు రూ.2,500 మాత్రమే వచ్చాయి. ఇంకా ఐదు వారాలకు సంబంధించిన డబ్బులు రాలేదు. కనీసం 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రోజు ఎంత కూలి పడుతుందో కూడా తెలియడం లేదు. – లక్ష్మమ్మ, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం పకడ్బందీగా చేపడుతాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హా మీ కింద పనులు నిర్వహిస్తున్నాం. పను లు సక్రమంగా చేపట్టేలా, వేతనాలు వచ్చేందుకు వీలుగా నిబంధనలు పాటించేలా చూస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. పేమెంట్స్ వచ్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ● -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
●పట్టించుకోవడం లేదు.. ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు.. స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,షూ పేరుతో నిలువుదోపిడి పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు -
దివ్యాంగులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు
కొల్లాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్చైర్మన్ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరీష్కుమార్, రాజేందర్, ఆశన్న, రాజశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల్లారా.. స్వాగతం
జిల్లాలో ఘనంగా పునఃప్రారంభమైన విద్యాసంస్థలు కందనూలు/ అచ్చంపేట రూరల్/ వెల్దండ: జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను ఆకట్టుకునేలా ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడితోరణాలు, బెలూన్లతో ముస్తాబు చేసి.. విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పుస్తకాలు, నోట్బుక్స్ విద్యార్థులకు అందజేశారు. 42 వేల మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా. ఇందులో సుమారు 42 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మొదటిరోజు జిల్లాలో 9,450 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకునే సమయంలో టీచర్లు, ప్రజాప్రతినిధులు గేటు నుంచి విద్యార్థులకు పూలు చల్లుతూ.. వారి వెంబడి నడుస్తూ తరగతి గదిలోకి తీసుకెళ్లి వారిని కూర్చోబెట్టారు. తొలిరోజు ఆటపాటలతో ఆనందపరుస్తూ.. విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. అచ్చంపేట మండలం చౌటపల్లి పాఠశాలలో కూలిన తరగతి గది మామిడితోరణాలు, బెలూన్స్తో పాఠశాలల ముస్తాబు విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేసిన ప్రజాప్రతినిధులు మొదటిరోజు అంతంతమాత్రంగానే విద్యార్థుల హాజరు -
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం ఆయన వెల్దండలోని ఎమ్మార్సీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆవరణలో ఉన్న సరస్వతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్బుక్స్ అందజేశారు. డీఈఓ వెంట ఎంఈఓ చంద్రుడు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయండి
కొల్లాపూర్: అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సోమవారం ఆయన కొల్లాపూర్లోని 4, 9 వార్డుల్లో పర్యటించి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న పనుల గురించి మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్చైర్మన్ షేక్ రహీంపాషతో చర్చించారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అవసరమైన స్థలాల కోసం సోమశిలకు వెళ్లే దారిలోని భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను భూ సేకరణ ద్వారా సేకరించాలని ఆర్డీఓ భన్సీలాల్ను ఆదేశించారు. భూసేకరణలో జాప్యం చేయవద్దన్నారు. ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు ద్వారా కొల్లాపూర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ యాదగిరి, రెవెన్యూ అధికారులు తదితరులున్నారు. -
భూసేకరణలో చలనం
ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం ● నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ● ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ● ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి సదుపాయాల కల్పనకు చర్యలు క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. ● నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ● 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. ● 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంవేగవంతం చేస్తున్నాం.. జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రిజ్వాన్బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. -
అసౌకర్యాల మధ్యనే..
ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం సైతం అరకొర సౌకర్యాల మధ్యే ప్రారంభమైంది. పలుచోట్ల తొలిరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆదరాబాదరగా వచ్చి పాఠశాలలను తెరిచారు. పాఠశాలలకు అక్కడక్కడ పదుల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్నిచోట్ల విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్యనే అధికంగా కనిపించింది. ఈ క్రమంలో అచ్చంపేట మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల మూడు గదులు కూలిపోయాయి. దీంతో మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిల గదుల్లోనే కొనసాగుతుండగా.. మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం మరమ్మతులకు నోచుకోక అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మరికొన్నిచోట్ల అసంపూర్తి గదులు, అరకొర నిర్మాణాలే విద్యార్థులకు దర్శనమిచ్చాయి. -
పెట్టుబడి కాలం.. తప్పని ఆర్థిక భారం
అచ్చంపేట: జూన్ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు సంబంధించిన ఖర్చులు మీదపడుతుండగా.. మరోవైపు వానాకాలం నేపథ్యంలో రైతులు పంటల సాగుకు సంబంధించి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ రెండూ రూ.వేలకు వేలు ఖర్చుతో కూడుకున్నవే కావడంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయని ఇటు సామాన్య ప్రజలు, అటు అన్నదాతలు వాపోతున్నారు. విద్యార్థుల ఖర్చులే అధికం.. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, షూస్, బ్యాగులు ఇలా అన్నీ మళ్లీ కొనాల్సిందే. వీటి కోసం తరగతులను బట్టి రూ.వేల నుంచి రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫాంలకే కనీసం ఒక్కొక్కరికి కనీసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా మొదటి టర్మ్ ఫీజులూ అదనం. ఒకవేళ బడిని మార్చి.. కొత్త స్కూల్కు పంపిస్తే మళ్లీ అక్కడ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి పరిస్థితి దాపురిస్తోంది. రైతులకు రెండింతలు.. వర్షాకాలం ప్రారంభం కావడంతోనే పొల్లాల్లో సాగు పనులు మొదలవుతాయి. ఇందుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న మిగిలే ఉన్నాయి. వీటి డబ్బులు చేతికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఇటు సాగు పనులు, అటు పిల్లల చదువులకు అంటే.. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. విద్యార్థుల ఫీజులువ్యవసాయ పెట్టుబడిఅదనపు భారం.. జూన్లో ప్రారంభయ్యే వర్షాకాలం సీజన్లో పిల్లల చదువులు, సాగు పనులే కాదు.. ఇళ్ల మరమ్మతు, పైకప్పుల లీకేజీల నివారణ, రెయిన్ కోట్లు, గొడుగులు, వర్షాకాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోళ్లు ఉంటాయి. మరోవైపు కూరగాయలు, పా లు, గ్యాస్, విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజి ల్, రవాణా ఖర్చులు వంటి నిత్యావసర వ్య యాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కుటుంబ బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఒకవైపు పాఠశాలలు ప్రారంభం.. మరోవైపు వానాకాలం పనులు విద్యార్థుల కోసం పేదల ‘బడ్జెట్’ తిప్పలు ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల పాట్లు సామాన్యుల ఆర్థిక స్థితిని తలకిందులు చేస్తున్న జూన్ మాసం -
ప్రజావాణి ఫిర్యాదులుపరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ప్రజల నుంచి 68 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9.. కందనూలు: ప్రజలు నిర్భంయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 9 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 5 భూమికి సంబంధించినవి, 4 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దివ్యాంగులకు అండగా ఉంటాం కందనూలు: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతోపాటు వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, మోటార్ వెహికిల్ తదితర వాటిని అందించడానికి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీసులు కందనూలు: జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో నాగర్కర్నూల్ బస్ డిపో మేనేజర్ యాదయ్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను సోమవారం ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదని సూచించారు. భారీ ఈదురుగాలులకు రైస్ మిల్లు ధ్వంసం ● మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం నీటిపాలు ● దాదాపు రూ.8కోట్ల మేర నష్టం నాగర్కర్నూల్ రూరల్: నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లిలో భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ధ్వంసమైంది. యజమానులు బిల్లకంటి రాజ్యలక్ష్మి, రవికుమార్ కథనం ప్రకారం.. సోమవారం 5 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా సుడిగాలి చుట్టుకోవడంతో రైస్ మిల్లుపై భాగంలోని కప్పు, ఇతర యంత్రాలకు సంబంధించిన భారీ పైపులతోపాటు మిషనరీ, రైస్ మిల్లు షెడ్డు కుప్పకూలిపోయింది. దీంతో పాటు రైస్ మిల్లులో ప్రాసెసింగ్లో ఉన్న వడ్లు, బియ్యం వర్షానికి తడిసి ముద్దయింది. దాదాపు రూ.8 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని మిల్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సుడిగాలితో కూడిన వర్షం రైస్ మిల్లును చుట్టుముట్టిన సమయంలో నిర్వాహకులు వెంటనే కార్మికులను అప్రమత్తం చేసి ఒక చోటికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. -
రైతుల కష్టాలుపట్టని ప్రభుత్వం
నాగర్కర్నూల్ రూరల్: కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అనేక కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగు ప్రారంభమైనా ప్రభుత్వం రైతుభరోసా ఊసెత్తకపోవడం దారుణమన్నారు. మరోవైపు నెలరోజుల క్రితం రైతుల నుంచి కొనుగోలుచేసిన మొక్కజొన్నల డబ్బులను కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో పాటు ధాన్యం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, దేశ్యానాయక్, పొదిల రామయ్య, నర్సింహ, ఎం.శ్రీనివాసులు, శంకర్ నాయక్, శివవర్మ, బాలస్వామి, అశోక్, అంతటి కాశన్న, నాగరాజు, సైదులు, హనుమంతు ఉన్నారు. పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. -
బడికి వేళాయె..
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం ● పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం ● యూనిఫాం వస్త్రం సరఫరాలో జాప్యం ● మొదటి రోజు విద్యార్థులకు కొత్త దుస్తులు లేనట్టే.. కందనూలు: వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు నెలన్నర రోజులపాటు ఇళ్ల వద్ద కాలక్షేపం చేసిన విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్లి చదువుకునే విధంగా తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులను ఉన్నత లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లాలనే ఉత్సాహం నెలకొంది. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలా.. సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు 2021–22 81,129 40,179 2022–23 72,237 41,015 2023–24 63,291 47,406 2024–25 58,133 50,505 2025–26 54,666 47,504 -
శ్రీశైలం దారిలో
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ●డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
కల్వకుర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాషమోని ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ అధ్యక్షతన నిర్వహించిన తాలూకాస్థాయి సీఐటీయూ అనుబంధ రంగాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దుచేసి.. తీరని అన్యాయం చేసిందన్నారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన తదితర రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 20న నిర్వహించే బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శివరాములు, ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, పద్మ, రాజు, యాదయ్య, దేవయ్య, అలివేల, రఫీకా సుల్తానా, రాఘవేందర్, రామార్జున్ తదితరులు ఉన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
ఉప్పునుంతల: వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని.. ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చేయొద్దని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, హమాలీలు, రవాణా, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లోని ధాన్యం పరిస్థితిని స్వయంగా చూసిన కలెక్టర్.. తడిసిన బస్తాలను వెంటనే సమీపంలో ఉన్న బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తరలించడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్, ఐకేపీ, మెప్మా అధికారులను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం చేయడంతోనే వర్షానికి ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ నెల 17 వరకు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకుండా, పంట పొలాల్లోనే జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా, గతేడాది యూరియా కోసం పడిన ఇబ్బందులను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఈ ఏడాది ప్రణాళిక ప్రకారం జిల్లాకు అవసరమున్న యూరియా సకాలంలో రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో యూరియా పంపిణీ పక్కాగా జరిగేలా వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందేలా చూస్తామన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారావు, తహసీల్దార్ సునీత, డీటీ రమేశ్, ఏఓ కొర్ర రమేశ్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడు, నాయకులు అనంతరెడ్డి, రవీందర్రావు ఉన్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు ● 188 మంది విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్పేటలో స్కాలర్షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు. -
అన్ని వసతులు కల్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలి. ముఖ్యంగా తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి. ఈసారి యూనిఫాం అందించడంలో ఆలస్యం కావడం బాధాకరం. – బాలపీరు, నాగర్కర్నూల్ ఏర్పాట్లు పూర్తి.. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రభుత్వ బడుల్లో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతాం. ఇందుకు ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. 15 రోజుల్లో కుట్టించి, విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ ● -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలతో కేటీఆర్ -
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. -
అరక సాగింది
వాన కురిసింది.. శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు ● నల్లమలలో అత్యధికంగా 81.8 మి.మీ., వర్షపాతం నమోదు ● పొంగిపొర్లిన చంద్రవాగు, చెంచుపల్గుతండా మార్గం ● అచ్చంపేట తుమ్మలకుంటలో నీట మునిగిన 33/11 కేవీ సబ్స్టేషన్ ● జిల్లాలో ఊపందుకోనున్న వ్యవసాయ పనులు బల్మూర్ మండలం మైలారంలో పత్తి విత్తనాలు విత్తుతున్న మహిళలు అచ్చంపేటలోని తుమ్మలకుంటలో నీట మునిగిన సబ్స్టేషన్ పొంగిపొర్లుతున్న చంద్రవాగు ఉప్పునుంతల మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల మహాసముద్రం చెరువు, వెల్టూరు చెరువు, కాంసానిపల్లి మర్యాద సముద్రం చెరువు, చీకటివాగు తదితర చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల– అచ్చంపేట రహదారిలో మల్లప్పవాగు ప్రాంతంలో వరదనీరు రోడ్డుపై పారుతుంది. దీంతో ప్రజలు అలుగులు పారిన నీటిలో చేపలు పడుతూ కనిపించారు. అచ్చంపేట/ ఉప్పునుంతల/ తాడూరు: జిల్లాలో తొలకరి వర్షాలు పలకరించడంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నల్లమలలో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అరకలు, ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు పత్తి గింజలు వేస్తున్నారు. సాగుకు అనుకూలనమైన వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అదును కోసం ఎదురుచూసిన రైతన్నలు వర్షం రాకతో వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది రైతులు కురిసిన కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటుకోగా.. వర్షం అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బందిలేకుండా మొలుస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఉప్పొంగిన చంద్రవాగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి నల్లమలలో కురిసిన భారీ వర్షానికి చంద్రవాగు పొంగిపొర్లుతుంది. దీంతో చంద్రసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నల్లమలలో సగటున 81.8 మి.మీ., వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా ఉప్పునుంతల మండలం వెల్టూరులో 105.8 మి.మీ., వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో ఇప్పటికే రైతులు విత్తిన విత్తనాలు నీట మునిగి కొట్టుకుపోయాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న చంద్రవాగు వెంట ఉన్న లో లెవల్ వంతెనలను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ వాగు వల్ల చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు, చెంచుగూడెంలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైలెవల్ వంతెన మంజూరు చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే ఫోన్లో కోరారు. అలాగే అచ్చంపేట పట్టణంలోని తుమ్మలకుంటకు భారీగా నీరు వచ్చి చేరడంతో అచ్చంపేట– చౌటపల్లి రోడ్డులో తుమ్మలకుంట శిఖం భూమిలో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ నీట మునిగింది. తాడూరు మండలం గుంతకోడూరు శివారులో అరక దున్నుతున్న రైతు వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతోపాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనుల సందడి మొదలైంది. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. వ్యాపారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయాధికారి -
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక దృష్టి ● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
కొల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్పై అవగాహన కోసం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నిరంజన్రెడ్డితోపాటు నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వాటన్నింటికీ ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పదేపదే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నష్టం జరి గిందని మంత్రి జూపల్లి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందులో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటున్నారని, గత ప్రభు త్వాల పాలనలో ఆయన పాత్ర కూడా ఉందనేది గుర్తించుకోవాలన్నారు. నేను ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా చే శా.. మెడికల్, ఫిషరీస్ కాలేజీలు తీసుకువచ్చా. జిల్లా రూపురేఖలు మార్చా. ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మీరు కొల్లాపూర్ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనను గతంలో జూపల్లి ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోలను ఆయన సమావేశంలో ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రజలు సీఎంలను ఎన్నికల్లో ఓడ గొడుతున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో అదే జరిగింది. రేపు కొడంగల్ కూడా అదే జరగొ చ్చు. రేవంత్రెడ్డి ఓడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలో అధికార పార్టీ వేధింపులు పరాకాష్టకు చేరాయని, ఇక సహించేది లేదన్నారు. అక్రమ కేసులు, వేధింపులు, భూకబ్జాలపై పోరా టాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి అల్లీపూర్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు రఘువర్ధన్రెడ్డి, నరే ందర్రెడ్డి, న్యాయవాది రవికుమార్, జంబులయ్య, బండల వెంకటస్వామి, రాంచందర్యాదవ్, సురేందర్రావు, గోపాల్యాదవ్, శంకర్నాయక్, సాయిరాంయాదవ్, జగదీష్రెడ్డి, భాస్కర్రావు, నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడొద్దు : మాజీమంత్రి నిరంజన్రెడ్డి -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి
లింగాల: సమాజంలో బాలకార్మిక వ్యవస్థ అనేది పేరుకుపోయిందని, దీని నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలంగౌడు అన్నారు. మండలంలోని రాంపూర్లో శుక్రవారం యాక్సెస్ టు జస్టిస్, కోనేరు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా హోటళ్లు, మోటారు మెకానిక్ పాయింట్లు, కిరాణం దుకాణాలు ఇతరత్రా వ్యాపార కేంద్రాలలో బాలకార్మికులు అధికంగా ఉంటారని, అలాంటి ప్రదేశాల్లో బాల, బాలికలు పనులు చేస్తుంటే నిర్మూలించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచు కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి పాండునాయక్, మాజీ సర్పంచు సుధీర్గౌడు, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ సునీత, కోనేరు సంస్థ ఏరియా కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
కందనూలు: జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, ఉపకేంద్రాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మాతాశిశు ఆరోగ్యంపై అధికారులు దృష్టిసారించాలని, గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ప్రసవానికి ముందు, తర్వాత అవసరమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ముందుగానే అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యా ల సాధనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కృష్ణ, ఇ మ్యూనైజేషన్ అధికారి రవికుమార్ పాల్గొన్నారు. -
నిధులున్నా.. నత్తనడకే!
●రైల్వే పనులతోనే ఆలస్యం.. రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడ్ జలాశయం అగ్రిమెంట్ పూర్తి కాలేదు.. అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ, ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్ ప్రధాన పైప్లైన్, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్ పైప్లైన్ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైప్ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత ఎత్తిపోతల.. అమరచింత ఎత్తిపోతల పథకాన్ని 1999–2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎత్తిపోతల ఆయకట్టు 2,200 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో రైతులు వరి, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. 24 ఏళ్లుగా సాగునీటిని పంపింగ్ చేస్తున్న సెక్షన్ పైపులు తుప్పు పడుతుండటంతో వీటిని మార్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. ఐదు సెక్షన్ పైపులను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్కు ముందుకు రాకపోవడంతో ఆలస్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎత్తిపోతల ఆయకట్టు కింద మూలమళ్ల, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. 1,099 మంది రైతుల భాగస్వామ్యంతో ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. చిన్న చిన్న మరమ్మతులు తప్ప చెప్పుకోదగిన పనులు ఏవీ లేవని.. సెక్షన్ పైపులు మాత్రమే త్వరగా మార్చేస్తే సాగునీరు సకాలంలో రైతులకు అందించవచ్చని ఆయకట్టుదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెబుతున్నారు. ముందుకుసాగని ఎత్తిపోతల మరమ్మతు సరళాసాగర్ ప్రధాన పైప్లైన్.. ‘అమరచింత’ సెక్షన్ పైపులఏర్పాటులో ఆలస్యం మొదలైన వానాకాలం పంటల సాగు పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల సరళాసాగర్లో ఇలా.. సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్లైన్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్మికుల సమస్యలుపరిష్కరించాలి
నాగర్కర్నూల్ రూరల్: మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, జీఓ 51 సవరించి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓ శ్రీరామ్కు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ యూనియన్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేసినా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తే జీవితకాలం పెన్షన్ తీసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకుంటే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రామయ్య, శంకర్నాయక్, కాశన్న, నాగరాజు, వెంకటేశ్వర్లు, లింగస్వామి, పరశురాములు, రామకృష్ణ, హుస్సేన్, బాలస్వామి, భిక్షపతి, యాదయ్య, వెంకటమ్మ, లింగమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యరంగాలపరిరక్షణకు ఉద్యమాలు పాన్గల్: పేదలకు ప్రభుత్వ విద్య, వైద్యరంగాలు ప్రాథమిక హక్కులని.. వాటి పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం భగత్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్య అనేది సామాజిక అభివృద్ధికి మూలస్తంభమని.. గ్రామీణ పేదలు, దళితులు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ఆశా కిరణాలన్నారు. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి మండల కేంద్రాల్లో 4 వేల పాఠశాలలు నెలకొల్పాలని సీఎం స్వయంగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందకపోతే సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది, మందులు, పరికరాల కొరత నెలకొందని.. పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
‘సర్’ పై అప్రమత్తంగాఉండండి
కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ బూత్స్థాయిలో ఓటరు జాబితా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బస్సు యాత్ర ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించేందుకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం కొల్లాపూర్లో ప్రారంభమైంది. యాత్రను డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గతంలో చేసిన పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్చైర్మన్ రహీంపాష, నాయకులు హన్మంతునాయక్, నర్సింహ, ఎక్బాల్, ధర్మతేజ, సూర్యప్రతాప్గౌడ్, దండు నర్సింహ, రామన్గౌడ్, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన -
ఎన్నటికో..?!
త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వ్యూ పాయింట్ ఇదే.. సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలు తిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
ధాన్యం పంచాయితీ
రాజధానికి చేరిన రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపా లు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం.కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి లో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపు లు, కొన్ని మిల్లుల్లో ని ల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
అనుమానాస్పదంగా యువతి బలవన్మరణం
చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యు లు నిద్రిస్తుండగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొ ని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎడమ కాల్వ వెలవెల.. సమాంతర కాల్వ కళకళ
నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వతో పాటు సమాంతర కాల్వలకు సాగునీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కాల్వల షట్టర్లను మూసివేశారు. అయితే సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ లీకేజీ కారణంగా నీరు పారుతూ కళకళలాడుతోంది. మరోవైపు ప్రధాన ఎడమ కాల్వ మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. అతి సమీపంలో ఉన్న రెండు కాల్వలను చూస్తున్న రైతులు ఎంత తేడా.. ఇది ఎంత తేడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – అమరచింత -
ఐకేపీనుంచి పాతవడ్లు తరలింపు!
పాన్గల్: మండలంలోని మాందాపూర్లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా.. మిల్లు యజమాని పరిశీలించి పాత వడ్లు ఉన్నట్లు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచార ణకు ఆదేశించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్తీక్రావు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ఆంజనేయులు, టెక్నికల్ అధికారులు మాందాపూర్లోని ఇషాన్ రైస్ మిల్లుకు చేరుకొని లారీలో లోడ్ చేసిన ధాన్యం, రైస్మిల్లులో నిల్వ ఉ న్న ధాన్యం ఒక్కటేనా అనే విషయాలను పరిశీలించి ధాన్యం శాంపిల్ తీసుకొని విచారణ చేస్తున్నామ ని పూర్తి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తామ ని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మాందాపూ ర్ నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలో ని కేతేపల్లి రైస్మిల్లు, లేకుంటే గద్వాల రైస్మిల్లు కు పంపాల్సి ఉండగా శ్రీరంగాపూర్ రైస్ మిల్లుకు పంపడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ట్రక్ షీట్లో ధాన్యం కొనుగోలు చేసే కమి టీ సభ్యుల సంతకాలు లేకుండా పంపించడం కూ డా అనుమానాలకు తెరలేపింది.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యంపై ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన మిల్లు యజమాని, జిల్లా అధికారులకు సమాచారం విచారణ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశం మిల్లును సందర్శించిన రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు -
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
కోడేరు: మండలకేంద్రంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గురువారం ఎత్తం శివారులోని మాలవాగు సమీపంలో శవమై కనిపించాడు. ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. కోడేరుకు వట్టెల రాములు (35) ఈ నెల 7న ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై సింగోటం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మాలవాగు సమీపంలో మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో రాములు మతిస్థిమితం లేకుండా పడిపోయాడు. అదే రోజు రాత్రి 8గంటల ప్రాంతంలో ఆయన సెల్ఫోన్ నుంచి తెలిసిన వారికి ఫోన్చేసి దాహం వేస్తుంది.. నీరు తేవాలని కోరాడు. అంతలోనే ఫోన్ స్విచాఫ్ కావడంతో కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై అతడి సోదరుడు రాంచంద్రయ్య కోడేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం అటుగా వెళ్తున్న వారు మాలవాగు వద్ద దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని చూడగా.. మిస్సింగ్ అయిన వ్యక్తి రాములు అని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ప్రస్తుతం అతడు కూడా చనిపోవడంతో తన ఐదేళ్ల కూతురు అనాథగా మారింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బుద్దారం గండిలో మృతదేహం లభ్యం గోపాల్పేట: అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించిన ఘటనలో మండలంలో గు రువారం చోటుచేసుకుంది.పోలీసులు, బాధిత కు టుంబ సభ్యుల వివరా ల మేరకు.. మండలంలోని ఏదుట్లకు చెందిన దొబ్బల శాంతయ్య (58) రెండు నెలల క్రితం కూలి పనులు చేసుకునేందుకు ఏపీలోని శ్రీకాకుళం వెళ్లాడు. మే 19న గ్రామానికి వచ్చినా.. ఇంటికి వెళ్లలేదు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెతికి నా ఆచూకీ లభించకపోవడంతో జూన్ 4న గో పాల్పేట పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం బుద్దారం గండి స మీపంలోని చెట్లల్లో కుళ్లిన స్థితి ఒక మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శశిధర్ సిబ్బంది తో కలిసి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. ఏదుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా అను మానించి కుటుంబ సభ్యులను పిలిపించి చూి పంచగా దొబ్బల శాంతయ్య అని నిర్దారించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి,కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డబ్బు ఇవ్వలేదని బలవన్మరణం పాన్గల్: ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పా ల్పడిన ఘటన గురువా రం మండలంలో చోటు చేసుకుంది.కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కదిరెపాడుకు చెందిన కాసాని వెంకటేష్ (32) కు మూడేళ్ల క్రితం భార్య పద్మతో విడాకులయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరగా.. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై గ్రామ శివారులోని కేఎల్ఐ కాల్వ పక్కన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ కుర్మయ్య పేర్కొన్నాడు. ఉత్తీర్ణత సాధించలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మహబూబ్నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మక్సూద్కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు. -
విత్తన శుద్ధితోనే అధిక దిగుబడి
అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో విత్తన శుద్ధితో పంటసాగులో ఎదురయ్యే సమస్యలను కొంత వరకు అధికమించడానికి అవకాశం ఉందని ఏఓ నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. విత్తన శుద్ధి చేయకపోతే పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి మొక్కల సాంద్రతను, దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది. ఖరీఫ్లో పంటసాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. లాభాలు: విత్తన శుద్ధితో మొలక శాతం పెరిగి సాంద్రత సిఫా ర్సు మేరకు ఉంటుంది. తొలి దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుతుంది. దీంతో మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చీడపీడల ఉధృతిని తగ్గించి, తర్వాత దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాక వాతవరణ కాలుష్యం తగ్గి మిత్ర పురుగులు రక్షించబతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధిలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి సరైన మందులు ఎంపిక చే సుకోవాలి. విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సరైన మోతాదు మందులు వాడాలి. విత్తనం పై పొర ఊడిపోకుండా చూసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువుల దాణాగా వాడకూడదు. వివిధ పంటల విత్తన శుద్ధి : విత్తన శుద్ధికి ఒక్కొక్క పంటకు ఒక విధానం ఉంటుంది. వాటిని గమనించి రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. వరి: ఒక కిలో వరి విత్తనంలో ఒక గ్రామ్ కార్టింజమ్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు మండె కట్టి నారు మడిలో చల్లడం వలన అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగుళ్లను అదుపు చేయవచ్చు. మొక్కజొన్న: ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్ కలిపి శుద్ధి చేస్తే ఎండు తెగులు, కాటక తెగులు, మచ్చ తెగుళ్లను అదుపు చేయవచ్చును. వేరుశనగ: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజేబ్తో శుద్ధి చేస్తే తిక్కాకు, ఆకుమచ్చ, తుప్పు, కాంత కాళ్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పత్తి: బ్యాక్టీరియా వల్ల నల్లమచ్చ ఆశించే ప్రాంతాల్లో లీటర్ నీటిలో 100 మిల్లీ గ్రాముల వైంసన్ లేదా ప్లాంటామైసిన్ గాని, ఒక గ్రామ్ బ్లైటాన్స్ కలిపిన ద్రావణంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టుకొని విత్తుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిరప : మిరపలోని వైరస్ తెగుళ్ల నివారణకు ఒక లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రై సోడియం, ఆర్థ ఫాస్సేట్లో ఒక కిలో మిరప విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి తర్వాత చల్లటి నీటిలో కడిగి విత్తుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు మంచిది చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా.. వాటిని ముందుగానే విత్తన శుద్ధితో అదుపు చేసుకోవాలి. దీని వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందవచ్చు పాడి–పంట -
డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన
● శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి శాలివాహనుల ధర్నా ● ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ ఉప్పునుంతల: మండలంలోని లత్తీపూర్ శివారు పరిధి డిండి ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ ఆలయం వద్ద గురువారం లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొంతసేపు ఆలయం ముందున్న శ్రీశైలం–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 1947లో డిండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైసమ్మ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము పూజారులుగా వ్యవహరిస్తుండగా ఇటీవల ఆలయ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయ కమిటీలో కూడా తమకు సరైన స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తూ మమ్ములను ఆలయం వద్దకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా కుమ్మర కులస్తులను నియమించాలని, ఆలయం వద్ద పూజారులతోపాటు అన్ని హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, గౌరవ సలహాదార్లు రామచంద్రయ్య, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, వీరయ్య, సహాయ కార్యదర్శి శంకరయ్య, జిల్లా సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సుల్తాన్, జంగయ్య, మండల సీనియర్ నాయకులు బాలయ్య, మల్లయ్య, రమేష్, అంజి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి కులస్తులపై కేసు నమోదు కట్ట మైసమ్మ ఆలయం వద్ద అన్ని హక్కులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కల్గించినందున లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు దేవర్ల మల్లయ్య, రమేష్, రవి, వెంకటేష్, అంజనమ్మ తదితర మొత్తం 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ● ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఊరుగొండ వద్ద ఘటన దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు.. చిత్తనూర్కు చెందిన బండ రాంరెడ్డి (50) తన బైక్లో పెట్రోల్ పోయించుకునేందు కు రాంపూర్ గేట్ సమీపంలో ఉన్న బంక్కు వెళ్తుండగా.. పత్తి మిల్లు వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 అంబులెన్స్లో మరికల్కు, అటు నుంచి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెట్రోల్ బంక్ యజమానిపై దాడి
● నగదు, బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడు ● పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఘటన అమరచింత: పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో కొంతమంది నిందితులు పెట్రోల్ బంక్ యాజమానిపై దాడిచేసి రూ.2.50లక్షలు, రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కళకళం రేపింది. అమరచింత పట్టణానికి చెందిన బిలకంటి రామ్మోహన్శెట్టి తన పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి వర్కర్స్ నుంచి కలెక్షన్కు సంబంధించి రూ.2.50లక్షల నగదును తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. రామ్మోహన్ శెట్టి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో అదే గ్రామానికి చెందిన డీసీ.రాజశేఖర్ తన తమ్ముళ్లను వెంటపెట్టుకుని కాపు కాశా డు. కారు ఇంటి వద్దకు రాగానే డీసీ రాజశేఖర్ రాడ్డు, కత్తితో అకస్మాత్తుగా రామ్మోహన్శెట్టిపై దాడి చేసి గాయపర్చాడు. బ్యాగ్లో ఉన్న రూ.2.5లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు గొ లుసు ను లాకెళ్లాడని బాధితుడు రాత్రికిరాత్రే పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రామ్మోహన్శెట్టి ఇంటికి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరమే ఉన్నా.. నిందితులు ఇ లా మారణాయుధాలతో దాడి చేయడం పట్టణంలో కళకళం రేపింది. ఈ ఘటనపై బాధితుడు రామ్మోహన్శెట్టి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కొనుగోలు చే యనని రాజశేఖర్కు తెలుపగా.. రేషన్ బియ్యం మీ రైస్మిల్లులో ఉంచి నీపై కేసు అయ్యేటట్లు చేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. ఇదే తరహాలో రాయచూరు, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, దేవరకద్ర, కొత్తకోటలోని రైస్మిల్ల యాజమానులపై బ్లాక్ మెయిల్ చేస్తూ తనను కూడా బ్లాక్ మె యిల్ చేశాడని ఆరోపించారు. తన రైస్మిల్లో రేషన్ బియ్యం దందా చేయనని పలుమార్లు చెప్పినా.. నిందితుడు రాజశేఖర్ దందా చేయకుంటే తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వ ని పక్షంలో పలుమార్లు తన ఇంటిపై రాత్రిపూ ట రా ళ్లు రువ్వి భయపెట్టినా పట్టించుకోకపోవడంతో ఇలా కత్తితో దాడిచేసినట్లు ఆరోపించారు. డీసీ రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు విలేకరులకు తెలిపారు.ఈ వ్యవహారంలో డీసీ రాజశేఖర్ పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపా రి కాడ్గి గణేష్ ద్వారా తాము కొనుగో లు చేసిన ప్లాట్ల వ్యవహారంలో నష్టపోయామని తమకు రూ.36లక్షలు ఇవ్వాలని పలుమార్లు డీసీ రాజశేఖర్ తనను బెదిరించినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పోలీసులను అడుగగా.. ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామని ఎస్ఐ స్వాతి తెలిపారు. -
అక్రమంగానే.. యథేచ్ఛగా
‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరా విచ్చలవిడిగా దందా.. జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కేసీతండా, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, వంగూరు మండలం ఉల్పర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ సరఫరా కన్నా రెట్టింపు స్థాయిలో అక్రమ రవాణా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇందిరమ్మ ఇళ్లకూ కొరతే.. జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరా సక్రమంగా అమలుకాక ఇళ్ల నిర్మాణదారులకు తీవ్రమైన ఇసుక కొరత నెలకొంది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా ఎక్కడా అమలుకావడం లేదు. సంబంధిత తహసీల్దార్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సమయానికి ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక సరఫరా సక్రమంగా సాగడం లేదు. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక సరఫరాను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఇసుక సరఫరా కోసం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తే ఎన్ని రోజులైనా బుకింగ్ దొరకడం లేదు. మరోవైపు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను సంప్రదిస్తే మాత్రం క్షణాల్లో ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అందుబాటులో ఆరు రీచులు.. జిల్లాలోని దుందుభీ వాగు పొడవునా ఇసుక సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 17 వరకు రీచుల నుంచి ఇసుక సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలులో మాత్రం ఆరు రీచుల్లోనే ఇసుక సేకరణకు ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. ఇందు లో కల్వకుర్తి మండలం లింగసానిపల్లి, వంగూరు మ ండలం పోతిరెడ్డిపల్లి, ఉల్పర, తాడూరు మండలం ఏటిదారిపల్లి, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామాల్లో ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇసుక సేకరణతోపాటు సరఫరాలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ప్రభుత్వ ఇసుక కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు మరోవైపు అక్రమార్కుల ద్వారా పెద్దఎత్తున తరలుతున్న వైనం అక్రమ రవాణాను అరికడితేనే ప్రభుత్వానికి ఆదాయం -
క్రీడలతోనే మానసికోల్లాసం
కందనూలు: క్రీడలతోనే మానసికోల్లాసం ఉంటుందని డీవైఎఫ్ఓ సీతారాం అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 రోజులుగా కొనసాగుతున్న ఖోఖో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిస కాకుండా క్రీడా పోటీలకు హాజరై క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం శుభాపరిణామమన్నారు. వేసవి శిబిరాల ద్వారా విద్యార్థులు తన క్రీడాంశాలను పెంపొందించుకొని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నీతివంతమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అంజయ్య, కృష్ణమోహన్, ప్రసాద్, వెంకట్, శిబిరం కోచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫస్టియర్లో 58.0, సెకండియర్లో 43.0 ● ఇంటర్ సప్లిమెంటరీఫలితాలు విడుదల కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గురువారం వెలువడిన అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.0 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43.0 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,684 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 734 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 938 మందికి గాను 374 మంది, బాలికలు 746 మందికి గాను 360 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 3,337 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,960 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 1,390 మందికి గాను 610 మంది, బాలికలు 1,947 మందికి గాను 1,350 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్లో 459 మందికి గాను 287 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 643 మందికి గాను 449 మంది ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్ను చేస్తున్నారు. రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. -
బస్సు యాత్రతో పథకాలపై అవగాహన
తిమ్మాజిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను బస్సు యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన, ప్రగతి నివేదిక బస్సు యాత్ర గురువారం తిమ్మాజిపేటకు చేరుకోవడంతో మండల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్, నాయకులు ఉస్మాన్, లక్ష్మీనారాయణ, దేవస్వామి, మాధవులు, సురేందర్, వెంకటయ్య, రాము, రాజు, బాలకృష్ణ, రాఘవేందర్, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడూరు: పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మల్లురవి చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల అమలుపై చేపట్టిన బస్సుయాత్ర మండల కేంద్రానికి చేరుకుంది. ఆయా గ్రామాల కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణరావు, సర్పంచ్మల్లయ్య, అధ్యక్షుడు రమేష్, రాంచంద్రారెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు వినోద్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్రెడ్డి -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
కల్వకుర్తి టౌన్: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సంక్షేమ సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాణిజ్య సముదాయం ద్వారా స్థానిక యువత, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు విస్తరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దుకాణాలను కార్పొరేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించి ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. క్యాటిల్ మార్కెట్ను సందర్శించిన కలెక్టర్ అక్కడి సదుపాయాలను పరిశీలించి, పశువుల కొనుగోలు, విక్రయాల కోసం వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, నిర్మాణానికి అవసరమైన సామగ్రి, సాంకేతిక సహకారం లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక స్వావలంబన సాధించాలి
అచ్చంపేట రూరల్: చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల అన్నారు. గురువారం పట్టణంలోని శాలివాహన భవనంలో జిల్లాలోని వెదురు ద్వారా వస్తువులు తయారు చేస్తున్న హస్త కళాకారులకు మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సువర్చల, ఏపీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్రెడ్డి మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, హస్తకళల డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సమాజంలో ప్రకృతి సిద్ధంగా లభించే చెట్లు, మట్టి, రాళ్లు, లోహాలు, ధారాలతో హస్తకళల ద్వారా వస్తువులు తయారు చేసేవారిని ప్రోత్సహించి, తయారు చేసిన వస్తువులు మార్కెట్లో అమ్ముకుని వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిని ఆర్థిక స్వావలంబన వైపు వెళ్లే విధంగా హస్తకళలో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 50 మంది వెదురు హస్త కళాకారులకు సుమారు రూ.5 లక్షల విలువైన 13 రకాల పరికరాలను అందజేశామన్నారు. వీటిని హస్త కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హస్త కళాకారులు చేసినటువంటి వస్తువులను ప్రభుత్వమే ఎగ్జిబిషన్ల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వారికి ప్రయాణ ఖర్చులతోపాటు, ప్రతిరోజు భోజన ఖర్చులు, వసతి సదుపాయం కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హస్తకళల కళాకారులకు శిక్షణ శిబిరాలు, స్టడీ టూర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో హస్త కళాకారుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకునే విధంగా సహకరిస్తామన్నారు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
నాగర్కర్నూల్కు పీజీ కళాశాల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు పాాలమూరు యూనివర్సిటీ తన పరిధిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసిన యూనివర్సిటీ తాజాగా నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోనూ పీజీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు అక్కడి పీజీ కళాశాల ఏర్పాటుపై యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో మొదటి దశలో కీలకమైన కళాశాల ఏర్పాటుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదం తెలపగా.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే ప్రభుత్వం త్వరలో జీఓ విడుదల చేసే అవకాశం ఉంది. వనపర్తి పీజీ కళాశాలకు.. వనపర్తిలో పీజీ కళాశాల ప్రారంభించాక భవనం మాత్రమే నిర్మించిన అధికారులు.. బాల, బాలికలకు హాస్టళ్లు ఇప్పటికీ నిర్మించలేదు. దీంతో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీంతో అధికారులు హాస్టల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న కొంత భూమిలో బాలికల హాస్టల్ నిర్మించనుండగా.. బాలుర హాస్టల్ కోసం స్థలం లేకపోవడంతో కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విన్నవించగా 35 గుంటల భూమిని కేటాయిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మొదట 5 కోర్సులతో.. నాగర్కర్నూల్ జిల్లాలో కళాశాల ఏర్పాటు ప్రతిపాదనల్లో భాగంగా మొదట భూమికి సంబంధించి 2 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ రెండు ఎకరాల భూమిని యూనివర్సిటీ పీజీ కళాశాలకు అధికారులు కేటాయించనున్నారు. ఇందులో పీజీ కళాశాల భవనం, బాల, బాలికల హాస్టళ్లు నిర్మించనున్నారు. దీంతోపాటు మొత్తం 5 కోర్సులతో కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ సైకాలజీ వంటి కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా సుమారు 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వానికి పాలమూరు యూనివర్సిటీ ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యామండలి 5 కోర్సులతో ఏర్పాటుకు త్వరలో చర్యలు 2 ఎకరాల భూమి కేటాయించే అవకాశం వనపర్తి పీజీ కళాశాలలో హాస్టల్స్ నిర్మాణానికి భూమి కేటాయింపు -
నులి పురుగుల నిర్మూలనపై అవగాహన
కందనూలు: నీళ్ల విరేచనాల నియంత్రణ, నులిపురుగుల నిర్మూలన, పల్స్ పోలియో కార్యక్రమాలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పీహెచ్సీల పరిధిలోని ఆశా వర్కర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 17 శాతం డయేరియా వల్లే సంభవిస్తాయని, వాటిని అరికట్టడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఈ నెల 16 నుంచి 31 వరకు డయారియా క్యాంప్ నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ నెల 28, 29 ,30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1–19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోలు మాత్రలు వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రవికుమార్, సురేష్బాబు, డీపీఓ రేనయ్య, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. -
మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన
పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీలు రాక తూకం చేసిన వరి ధాన్యం బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి బస్తాల్లోని ధాన్యం మొలకెత్తడంతో గురువారం రైతులు నిరసన తెలిపారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ మాట్లాడారు. కేంద్రంలో 60 మంది రైతులకు చెందిన 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు లారీలు రాక 50 రోజులుగా నిల్వ ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 100కు పైగా బస్తాల్లోని ధాన్యం మొలకెత్తినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్తో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం చేస్తామని, ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా.. చాలా కేంద్రాల్లో నేటికీ ధాన్యం, బస్తాల నిల్వలు పేరుకుపోయాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం బస్తాలను తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్/కోడేరు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం, పెంట్లవెల్లి, కోడేరు మండల కేంద్రాల్లోని రైతువేదికలు, పెద్దకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు వివరాలపై ఆరా తీశారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, వాటిలో నిర్మాణాలు పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభంకాని ఇళ్ల వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. పెంట్లవెల్లి మండలానికి దాదాపు 180 ఇళ్లు మంజూరుచేస్తే.. అందులో 50శాతం ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభంకాని వాటిని గుర్తించాలని.. లబ్ధిదారులతో స్థానిక నాయకులు, అధికారులు మాట్లాడి, వారు వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యంగా ఇళ్లు మంజూరు చేశామని.. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గవ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం కూడా పక్కా గృహాల నిర్మాణానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ గోపాల్నాయక్, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్లు మాఽ దవి, శ్రీనివాసులు, ఎంపీడీఓలు వెంకట్రావ్, వెంకటేశ్వర్లు, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ రహీంపాషా, నాయ ్డకులు హన్మంతునాయక్, ప్రతాప్గౌడ్, దండు నర్సింహ, రామన్గౌడ్, పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, నక్క వేణుగోపాల్రావు ఉన్నారు. కొల్లాపూర్లో టూరిజం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ కిషన్రావు, ఎన్ఐటీహెచ్ఎంఏ చైర్మన్ వెంకటరమణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ బుధవారం కొల్లాపూర్లో మంత్రి జూపల్లిని కలిశారు. అనంతరం కొల్లాపూర్, సోమశిల, జటప్రోల్లోని పర్యాటక ప్రాంతాలను వారు తిలకించారు. పెంట్లవెల్లిలో హార్టికల్చర్ కళాశాల నిర్మాణానికి మంత్రి స్థల పరిశీలన చేశారు. కళాశాలకు 25 – 35 ఎకరాల భూమి అవసరమని.. అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు గోపినాయక్, రామన్గౌడ్, గోవింద్గౌడ్, కబ్బీర్, నల్లపోతుల గోపాల్, నాగిరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నరేష్, నాగరాజు ఉన్నారు. -
మహేంద్రనాథ్ ఆశయ సాధనకు కృషి
కందనూలు: çÜ…çœ$ çÜ…çÜPÆý‡¢, Ð]l*i Ð]l$…{† ç³#rt-´ëVýS Ð]l$õßæ…-{§ýl¯é£Šl BÔèæÄ¶æ$ Ýë«§ýl¯]lMýS$ MýS–íÙ ^ólĶæ*ÌS° GÐðl$Ã-ÌôæÅË$ MýS*^èl$-MýS$âýæÏ Æ>gôæ-ÔŒæ-Æð‡yìlz, Ð]l…Ö-MýS–çÙ~ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° »êº$ fXjÐ]l-¯ŒS-Æ>ÐŒl$ ¿ýæÐ]l-¯ŒSÌZ Ð]l$õßæ…{§ýl-¯é£Šl Ôèæ™èl fĶæ$…† Ðólyýl$-MýSÌS¯]l$ çœ$¯]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ñ{VýS-à-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ÐéÆý‡$ Ð]l*sêÏyýl$-™èl*.. ÝëÐ]l*hMýS ¯éÅĶæ$…, Ððl¯]lMýSºyìl¯]l Ð]lÆ>YÌS A¿¶æ$ů]l²-†MìS ÑÔóæçÙ MýS–íÙ ^ólíܯ]l Vöç³µ Ð]l$çßæ-±-Ķæ¬yýl$ Ð]l$õßæ…-{§ýl-¯é£Šl A° Mö°-Ķæ*-yéÆý‡$. ️B-Ķæ$¯]l BÔèæ-Ķæ*Ë$ ¯ólsìæ ™èlÆ>-°MìS B§ýlÆý‡Ø-{´ë-Ķæ$-Ð]l$-°.. çÜÐ]l*f AÀ-Ð]l–-¨®MìS ^ólíܯ]l õÜÐ]lË$ _Æý‡çÜÃ-Æý‡-×îæÄ¶æ$Ð]l$° A¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ M>…{VðS‹Ü ´ëÈt ¯éĶæ$-MýS$Ë$, {ç³gê-{ç³-†-°-«§ýl$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, డూప్లికేట్ ఎంట్రీల తొలగించడం వంటి అంశాలపై బీఎల్ఏలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్తో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని వారు సూచించారు. మహేంద్రనాథ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ -
ప్రాణాల రక్షణ కోసమే ‘అరైవ్ అలైవ్’
● జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్ ధరింపజేశారు. పదవ పటాలం కమాండెంట్ జయరాజు, డీటీఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
అంతా శూన్యం!
ఒక్క క్షణం.. క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.. ● బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం ● అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు ● కుటుంబంలో వచ్చే విభేదాలే కారణం అంటున్న నిపుణులు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన మహబూబ్నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ఏడాది 2025 2026 మహబూబ్నగర్ 183 149 నారాయణపేట 101 43 వనపర్తి 130 41 నాగర్కర్నూల్ 181 67 జో.గద్వాల 43 24 నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కందనూలు: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు డ్రగ్స్ బారినపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని.. సమాజంపై గౌరవంతో మెలిగే విధంగా పిల్లలను పెంచాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 1908కు సమాచారం అందించాలని ఆయన కోరారు. డీఎస్పీలు బుచ్చయ్య, శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ పాల్గొన్నారు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 32 మందికి నయాబ్ తహశీల్దార్లుగా(డీటీ) పదోన్నతి పొందారు. ఈ మేరకు బుధవారం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీటీలుగా పదోన్నతి పొందిన వారిని ఆయా జిల్లాలను కూడా కేటాయించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సి.క్రాంతికుమార్గౌడ్, అబ్దుల్ఖాదర్, అహ్మద్మోయియోద్దీన్, జశ్వంత్కుమార్, కర్ణయ్య ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకు నసీరోద్దీన్, కృష్ణవేణి, అంజద్అలీ, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, రామస్వామి, మాలతీ, శ్రీను, జ్యోత్స్న, నారాయణపేట జిల్లాకు కవితాబాయి, జ్యోత్స్న, రాఘవేందర్, విజయ్కుమార్, రాధాకృష్ణ, మానస, వనపర్తి జిల్లాకు గౌస్, అరుణ, బాలరామ్, రవికుమార్, మధుసూదన్గౌడ్, రహమాన్, గద్వాల్ జిల్లాకు షఫీక్, రాములు, రాజేష్, వెంకటేశ్వర్లు, నాగరాజు, సికిందర్ను కేటాయించారు. పేదలపై పెనుభారం మోపుతున్న కేంద్రం నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతూ.. పేదలపై పెనుభారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ధరల పెంపును నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో సామాన్యం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని రోజులుగా అడ్డగోలుగా పెంచుతున్న ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారి మహమ్మద్ అలీకి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్.ఆనంద్జీ, కేశవులుగౌడ్, తన్నీరు నర్సింహ, పెబ్బేటి విజయడు, ఈర్ల చంద్రమోళి, ఇందిరా, శంకర్గౌడ్, కృష్ణాజీ, శివుడు, ఖాజా, మల్లయ్య, సాయిలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యేలా అన్ని స్కూళ్లను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల ప్రారంభం నుంచి 15 రోజులపాటు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేశ్కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటయ్య, నూరుద్దీన్ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ యంత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీల్ల పరిస్థితి తదితర అంశాలను సంబంధిత అధికారులతో తెలుసుకున్నారు. గోడౌన్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆయన సూచించారు. -
బాధ్యత తీసుకోవాలి..
చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు ● -
రుణ ప్రణాళిక ఖరారు
2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్లు –8లో uజిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని.. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మహిళా సంఘాలు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు విస్తృత స్థాయిలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ రంగం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని.. రైతులు వ్యవసాయ అవసరాలకు సకాలంలో రుణాలు పొందేలా బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ తదితర రంగాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ రంగంలో మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించడమే కాకుండా వాటిని అధిగమించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. కందనూలు: జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధికి దిశానిర్దేశం చేసే 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను రూపొందించారు. మొత్తం 2,77,772 ఖాతాదారులకు వివిధ రంగాల్లో రూ.9,768 కోట్లతో రుణాలు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మొత్తంలో ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయించగా.. ప్రాధాన్యేతర రంగాలకు 11.58 శాతం కేటాయింపులు చేశారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర క్రెడిట్ ప్లాన్ ద్వారా వ్యవసాయం, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక ఇంధనం, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన రుణాలు విస్తృతంగా అందనున్నాయి. వ్యవసాయ రంగానికి రూ.8,637 కోట్లు.. జిల్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తోంది. రుణ ప్రణాళికలో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం వ్యవసాయరంగ రుణలక్ష్యాన్ని రూ.8,637 కోట్లుగా నిర్ణయించారు. పంటల సాగు, ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సాగునీటి వసతులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణాలు అందించనున్నారు. అదే విధంగా వ్యవసాయ టర్మ్ లోన్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.6,870 కోట్లు కేటాయించారు. ఫార్మ్ క్రెడిట్ కింద రూ. 2,310.07కోట్లు అందించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, పాల ఉత్పత్తి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.129.81 కోట్లు కేటాయించారు. అదనంగా ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.174.24 కోట్లు మంజూరు చేయనున్నారు. పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ.1,014 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి యూనిట్లు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన మూలధనాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న పరిశ్రమలకు రూ.249.86 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.260 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపన, స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి అవకాశాల సృష్టి, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 37.90 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా 236 మంది విద్యార్థులకు రుణ సదుపాయం లభించనుంది. ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులు, సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది. సొంతింటి కలను సాకారం చేసుకునే కుటుంబాలకు గృహ రుణాల రూపంలో రూ.316.25 కోట్లు కేటాయించారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు గృహనిర్మాణం, గృహ విస్తరణ, గృహ కొనుగోలు అవసరాలకు ఈ రుణాలు తోడ్పడనున్నాయి. సామాజిక మౌలిక వసతులు – పునరుత్పాదక ఇంధనానికి మద్దతు, జిల్లాలో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.5.11 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యేతర రంగానికి మొత్తం రూ.1,131 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. 2,77,772 ఖాతాదారులకు రుణ సదుపాయం ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయింపు డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో రుణ లక్ష్యం నిర్దేశం -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా ● -
నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
వెల్దండ: వనమహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని.. అన్నిరకాల మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి కృష్ణారావు అన్నారు. మంగళవారం వెల్దండ మండలం భర్కత్పల్లి, చెర్కూర్, పెద్దాపూర్, నారాయణపూర్, రాఘవయపల్లి, చౌదర్పల్లి, కేస్లీతండా, రాచూర్, తిమ్మినోనిపల్లి గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు.. ఏ రకమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు వచ్చే నాటికి మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, గుంతలను తీసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణారావు, అరవింద్రెడ్డి, జీవన్ ప్రకాశ్, క్రాంతికుమార్, టీఏలు లింగస్వామి, సత్యనారాయణ, శివలీల తదితరులు పాల్గొన్నారు. -
దుందుభీ.. లూటీ!
వాగును తోడేస్తున్న ఇసుకాసురులు రూ.వెయ్యి ఖర్చు పెట్టు.. రూ.18వేలు కొట్టు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సాండ్ ట్యాక్సీ విధానాన్ని నీరుగారుస్తూ.. అక్రమ దందాకు తెరలేపడం విమర్శలకు దారితీస్తోంది. ప్రైవేటు సాండ్ విధానం అనుమతి పొందిన వ్యక్తులు టిప్పర్కు రూ.వెయ్యి చొప్పున ఖర్చుచేసి.. రూ. 18వేలు సంపాదిస్తున్నారు. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా.. ప్రైవేటు సాండ్ అనుమతి పొందిన వ్యక్తులు వారి క్వారీ నుంచి పగలు కాకుండా రాత్రివేళ ఇసుక నింపి పంపిస్తు్ాన్నరు. నిత్యం 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక నింపడానికి ఇటాచ్కు రూ.వెయ్యి ఖర్చు అవుతుండగా.. టిప్పర్ యజమానుల నుంచి ఇసుక మాఫియా రూ. 18వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీన్ని ప్రకారం ఇసుక రీచ్లను పొందిన వ్యక్తులు నిత్యం రూ. 1.80లక్షల నుంచి రూ. 2.70లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదు. వీరు బహిరంగ మార్కెట్లో దూరం మేరకు రూ. 35వేల నుంచి రూ. 60వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అచ్చంపేట: జిల్లాలోని దుందుభీ వాగు తీరంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోకవర్గాలను అనుసరించి ఉన్న దుందుభీ వాగులోని ఇసుక నాణ్యతకు పెట్టింది పేరు. ఇక్కడి ఇసుకకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇదే అదునుగా వ్యాపారులు నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో వాగులో ఇసుకను తోడేస్తున్నారు. వాగు సమీపంలో భూగర్భజలాలు అడుగుంటున్నాయని ఇటీవల ఉప్పునుంతల మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేయగా.. ఆరు రోజుల క్రితం ఇదే మండలంలోని దాసర్లపల్లికి చెందిన రైతులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి దాసర్లపల్లికి చెందిన ఇసుక మాఫియా మధ్య గొడవ సైతం చోటుచేసుకుంది. ఈ ఒక్క గ్రామంలోనే రోజుకు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల ఇసుక వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఖాకీలకు కాసుల పంట.. దుందుభీ వాగు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తోంది. కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇసుక అక్రమ రవాణాలో పాలుపంచుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇసుక రవాణా రెవెన్యూ, మైనింగ్శాఖలకు సంబంధించిన అంశం.. తమకేం సంబంధం లేదని చెబుతూనే పోలీసులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఇసుక వాహనం నుంచి నెలకు రూ. 15వేల నుంచి రూ. 25వేల వరకు దండుకుంటూ.. ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రతి పోలీస్స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరూ కిమ్మనడం లేదు. కొందరు ప్రజాప్రతినిధుల మద్దతు సైతం ఉండటంతో ఆ ఖాకీలు ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది. దాసర్లపల్లి సమీపంలోని దుందుభీ వాగులో ఇసుక తోడుతున్న దృశ్యం అనుమతుల మాటున అక్రమ దందా నిత్యం వందలాది వాహనాల్లో రవాణా పలు ప్రాంతాల్లో వట్టిపోతున్న వాగు మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఏడాదిలో 300 రోజులపాటు జిల్లాలోని తాడూరు, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట, కల్వకుర్తి మండలాల మీదుగా దుందుభీ వాగు ప్రవహిస్తోంది. వాగు పరిసర గ్రామాల సరిహద్దుల్లోనే ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. భారీ వర్షాలు పడి వాగు పొంగిపొర్లితే తప్ప.. ఇక్కడ ఇసుక రవాణా ఆగదు. ఏడాదిలో దాదాపు 300 రోజులపాటు ఇసుక తవ్వుతారు. వాగు పరిధిలో అధికార, అనధికారికంగా 20 రీచ్ల వరకు ఉన్నాయి. అయితే ఆయా మండలాల్లోని ఠాణాల్లో పోస్టింగ్ కోసం కొందరు పోలీసులు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి ఒక్కసారి వచ్చాక వదలడానికి ససేమిరా అంటున్నారనే వాదన వినిపిస్తోంది. అప్పడప్పుడు మాత్రమే కొన్ని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. లింగాల: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. మంగళవారం లింగాల మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ నిర్వహించి.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ను వినియోగంలోకి తీసుకొచ్చి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అదే విధంగా బుద్ధవనం, ఓపెన్ జీమ్ వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచ్కు తెలియజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ● ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా లింగాలకు మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేశారు. మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా.. వ్యాపార వేత్తలుగా, బస్సుల యజమానులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణగౌడు, సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ, బుడ్డయ్య, ఇందిరమ్మ పాల్గొన్నారు. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
మైనింగ్ అనుమతులను రద్దు చేయాల్సిందే..
బల్మూర్: మండలంలోని మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలని బల్మూర్, మైలారం గ్రామాల రైతులు ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం పర్యావరణశాఖ ఆధ్వర్యంలో మైనింగ్ ప్రదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అదనపు కలెక్టర్ అమరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు ప్రజాభిప్రాయ సేకరణ సభలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్వే నంబర్ 2220లోని 7.737 హెక్టార్లలో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. గతంలో మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తే కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. మళ్లీ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మైనింగ్ అనుమతులను రద్దుచేసే వరకు తమ పోరాటం ఆగదని సర్పంచులు శిరీష, సరితతో పాటు ఆయా గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, రైతుల అభిప్రాయాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో మైనింగ్శాఖ అధికారి సురేశ్బాబు ఉన్నారు. ముక్తకంఠంతో నినదించిన బల్మూర్, మైలారం గ్రామాల రైతులు అదనపు కలెక్టర్ సమక్షంలోప్రజాభిప్రాయ సేకరణ -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయ, ప్రయాసలతో తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజావాణిలో 42 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు గ్రీవెన్స్కు 22 ఫిర్యాదులు కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూ తగాదాలకు సంబంధించినవి కాగా.. 11 తగు న్యాయం చేయాలని, 4 భార్యాభర్తల గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ తెలిపారు. డీఎంహెచ్ఓగా కృష్ణ కందనూలు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డా.కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తానన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ డైరెక్టర్, బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు అన్నారు. సోమవారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ను 2 నుంచి 5 ఏళ్లు పెంచాలని మాజీ సైనికులు అడుగుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సైనిక శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్, ఎమ్మార్కే రెడ్డి, వెంకటయ్యగౌడ్, రాములు పాల్గొన్నారు. -
రోడ్డెక్కితే ముప్పే!
ఫిట్‘లెస్’ బస్సులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్ (ఎఫ్) తర్వాత క్లాజ్ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్, సెల్ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది. ● 60ఏళ్లు దాటిన డ్రైవర్ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ● బస్సు డ్రైవర్ను నియమించే సమయంలో అతడి లైసెన్స్ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. ● బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి. మహబూబ్నగర్ క్రైం: పాఠశాలల పునఃప్రారంభ సమయం ఆసన్నమవుతోంది. పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కాలం చెల్లినవి, సామర్థ్యంలేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఈ నెల 15న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నిబంధనలకు విరుద్ధంగా.. చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నాయి. ముఖ్యంగా అటెండెంట్ లేకుండానే డ్రైవర్లతో బస్సులను తిప్పడం.. ఒక రూట్లో వెళ్లే బస్సును మరో రూట్లో నడపడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ధ్రువపత్రాల జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 1,574 విద్యాసంస్థల బస్సులు ఉండగా జూన్ 8వ తేదీ వరకు 885 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షకు వచ్చాయి. మరో 689 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేయించలేదు. ఈ బస్సులకు ఫిట్నెస్ లేకుండా రోడ్లు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 469 స్కూల్ బస్సులు ఉండగా.. 50 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సులన్నింటికీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా ఆర్టీఓ వద్ద ఫిట్నెస్ పరీక్షలు జరిపి.. అనుమతి పత్రాలు పొందాల్సి ఉంది. అదే విధంగా బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణాశాాఖకు హామీపత్రం సమర్పించాలి. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. మరమ్మతు, ఇతర కారణాలతో పూర్తిస్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లా బస్సులు ఫిట్నెస్ ఫిట్నెస్ ఉన్నవి లేనివి మహబూబ్నగర్ 482 317 165 నాగర్కర్నూల్ 305 194 111 వనపర్తి 253 144 109 జోగుళాంబ గద్వాల 277 166 111 నారాయణపేట 257 64 193 నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు స్కూల్ బస్సులకు గడవులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్, బస్సు బ్రేక్, కండీషన్ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్ పంపిస్తున్నాం. కనీసం లైట్ లేకపోయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇలా.. బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి.. ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్ ఉండాలి. బస్సులో తప్పకుండా ఒక అటెండర్ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కు వారు కనిపించే విధంగా మిర్రర్ ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి. బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఉండాలి. బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు ప్రతి బస్సుకు హ్యాండ్బ్రేక్, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేయాలి. నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలపై యాజమాన్యాల నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 1,574 బస్సులకు గాను 885కు మాత్రమే పరీక్షలు కాలం చెల్లిన, సామర్థ్యంలేని వాహనాలతో పొంచి ఉన్న ముప్పు విద్యార్థుల భద్రత పట్టని అధికారులు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కందనూలు: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి విత్తన దుకాణాల పర్యవేక్షణ బృందాలు, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలను కొనుగోలుచేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు అవి ఆధారాలుగా ఉపయోగపడతాయని.. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ అధికారులతో, మండల స్థాయిలో సీఐ, ఎస్ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. -
ఫిట్నెస్ లేని బస్సులపై చర్య తీసుకోవాలి
కందనూలు: జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శాంతన్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అనేక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్, పర్మిషన్ లేని బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్నారు. అలాంటి బస్సులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగనమోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్కుమార్, నగర సంయుక్త కార్యదర్శి శివ పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా..!
●సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, నారాయణపేట నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సత్ఫలితాలతో ముందుకు.. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది. ప్రవేశాలు ఇలా.. వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. నారాయణపేట 44 జోగుళాంబ గద్వాల 41 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 292 పాఠశాలలు ఎంపిక తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు పక్కాగా పాఠ్య ప్రణాళిక.. పూర్తిగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే అల్పాహారం సైతం అదనంగా ఇస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్ రైడ్ ప్రొడక్షన్ పాలసీని పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ప్రతిరోజు పర్యవేక్షించాలి. పిల్లల పురోగతిని సమీక్షించడానికి క్రమం తప్పకుండా పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, ఆరోగ్యశాఖ విభాగ అధికారుల ఉమ్మడి తనిఖీలతో కలిసి ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: చదరంగంతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెంపొందుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అండర్–9, 11, 13 విభాగాల్లో రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలను డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు వ్యాయామమని, సమస్యల పరిష్కారం, సామర్థ్యాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని చెప్పారు. పోటీల్లో 80 మంది బాలబాలికలు పోటీ పడ్డారని చెప్పారు. మొదటి, రెండో బహుమతి సాధించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అండర్–9 బాలికల విభాగంలో టి.మనస్విరెడ్డి మొదటి, అద్విత ద్వితీయ, మధుమిత మూడో బహుమతి సాధించారు. అలాగే బాలుర విభాగంలో సాజిత్ (వనపర్తి) మొదటి, అద్విక్ (నాగర్కర్నూల్) రెండు, అండర్–11 బాలికల విభాగంలో కార్తీక (వనపర్తి) మొదటి, ఆరాధ్య శ్రీ (నాగర్కర్నూల్) రెండు, పరశస్విరెడ్డి (వనపర్తి) మూడో బహుమతి సాధించినట్లు వివరించారు. బాలుర విభాగంలో రంగం యోజిత్ (మహబూబ్నగర్) మొదటి, అఖిలేష్ (నాగర్కర్నూల్) రెండు, జి.శ్రీతిక్ (వనపర్తి) మూడో బహుమతి, అండర్–13 బాలికల్లో వేముల మేధశ్రీ (నాగర్కర్నూల్) మొదటి, ఎన్.అక్షిత (వనపర్తి) రెండు, వైష్ణవి (నాగర్కర్నూల్) మూడో బహుమతి, బాలుర విభాగంలో నమ్రత్ గౌడ్ (నాగర్కర్నూల్) మొదటి, శ్రీహాన్ (వనపర్తి) రెండు, మణిదీప్ (నాగర్కర్నూల్) మూడో బహుమతి సొంత చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్నాయుడు, జిల్లా కోశాధికారి టీపీ కృష్ణయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు రవీందర్గౌడ్, అయోధ్య రాములు, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు భూషణ్, మోహన్, డీసీఏ సభ్యులు రాములు, హర్ష తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల కత్తి!
కందనూలు: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. ఈ విద్యా సంవత్సరం భారీగా అడ్మిషన్లు తేవాలంటూ యాజమాన్యాలు టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టి సదరు సిబ్బందికి ఇంక్రిమెంట్ ఇవ్వాలా.. లేదా అనే అంశాన్ని ముడిపెడుతున్నారు. అడ్మిషన్ల సమయంలో యాజమాన్యాల ఒత్తిడి భరించలేక ప్రైవేటు టీచర్లు సతమతమవుతున్నారు. ఉద్యోగ భద్రత కరువు.. భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేటు టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాటే ఉండదు. రెండవ శనివారమైనా, ఆదివారమైనా పాఠశాల పనిలోనే నిమగ్నమై ఉండాలి. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. యాజమాన్యం చెప్పినన్ని అడ్మిషన్లు చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలని.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను బతిమిలాడుతున్నారు. 5 నుంచి 25 టార్గెట్.. జిల్లాలో గతేడాది లెక్కల ప్రకారం 167 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో 47,739 మంది విద్యార్థులకు 2,436 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు 5 నుంచి 25 అడ్మిషన్లు చేయాల్సిందేనని యాజామాన్యాలు టార్గెట్ పెట్టడంతో జిల్లాకేంద్రంతో పాటు మండల పరిసర గ్రామాల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతున్నారు. విద్యార్థులకు మంచి బోధనతో పాటు ఐఐటీ, నీట్, మెడికాన్ కోచింగ్ ఇస్తామంటూ బ్రోచర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లావ్యాప్తంగా 70శాతం ప్రైవేటు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది పాఠశాలల అనుమతులను రెన్యూవల్ చేసుకోవడంతో పాటు పాఠశాల భవనం ఫైర్ సేఫ్టీ, క్వాలీఫైడ్ ఫ్యాకల్టీ తదితర అంశాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బ్రోచర్లతో ఇంటింటికీ.. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన బ్రోచర్లతో బోధన, బోధనేతర సిబ్బంది ఇంటింటి బాట పట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు పల్లె, పట్టణం తేడా లేకుండా తిరుగుతున్నారు. తక్కువ ఫీజుతో మెరుగైన, సమర్థవంతమైన టీచర్లతో బోధన అందిస్తున్నామంటూ విసృత ప్రచారం చేస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తే.. ఉన్నత చదువుతో పాటు ఐఐటీ, నీట్ కోచింగ్లు ఇస్తామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల టార్గెట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తేనే జీతాల పెంపు ఇబ్బందులు పడుతున్న బోధన, బోధనేతర సిబ్బంది బ్రోచర్లతో ఇంటింటికీ తిరుగుతున్న వైనం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన ఎండలో ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో కాలనీలు, గ్రామాల్లో తిప్పడం మానుకోవాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చర్యలు తీసుకుంటాం.. ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి వేధించడం సరైంది కాదు. ఆ విధంగా ఏ పాఠశాలైనా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. – రమేశ్కుమార్, డీఈఓ -
అసమగ్ర ఐటీడీఏ
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. ఒక్కే ఒక్కడు.. చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజెక్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతోపాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్ను నియమించారు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్ఓ, మేనేజర్, సీఎస్ఓ, హెచ్ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన ఇన్చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు -
బుధార్పేట హనుమాన్ సన్నిధిలో జిల్లా జడ్జి
వెల్దండ: మండల కేంద్రంలోని బుధార్పేట ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి.. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్గౌడ్, సతీష్, పూజారి నాగులు పాల్గొన్నారు. మైసమ్మ జాతరలో పెరిగిన భక్తుల రద్దీ పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సోమవారం మృగశిర కార్తె వస్తుండటం.. వానాకాలం సాగు పనులు, విద్యాసంస్థలు ప్రారంభించే సమయం ఆసన్నం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసింది. నాయినోనిపల్లి జాతర మైదానం నుంచి పెద్దకొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 8 కి.మీ. దూరం ప్రయాణించేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. స్థానిక పోలీసులు పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. కాగా, జాతరలో తాగునీటి కొరతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తాడూరు: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. ఆదివారం తాడూరు మండలం ఇంద్రకల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించొద్దని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. -
మన్ననూర్ ఐటీడీఏ స్వరూపం..
పోస్టులు భర్తీ చేయలేదు.. మన్ననూర్ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. – శ్రీనివాసులు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల లోతట్టు చెంచుపెంటలో చెంచుల ఆవాసాలు గిరిజన జనాభా 14,436 గ్రామాలు 173 చెంచు కుటుంబాలు 4,041 మండలాలు 25 మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20 ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19 -
అర్హత ఇలా...
బాలలకు సంబంధించి పునరావాసం, దత్తత, పునరేకీకరణ, పోషణ వంటి తదితర అంశాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్టు 2015 ప్రకారం జరిగి తీరాలి. దత్తత నియమావళి 2017ను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. దత్తత కావాలనుకునే భార్యాభర్తలిద్దరి అంగీకారం ఎంతో ముఖ్యం. నియమాల ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చిన తరువాత ఒంటరి లేదా విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివవించే మగ వ్యక్తి బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు. శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
అనాథలుగా మారుతున్న అభాగ్యులు
నవ మాసాలు మోసి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను ఆ తల్లులకు మనసేలా ఒప్పుతుందో తెలియదు కానీ తమ పిల్లలను పెంట కుప్పలు, రోడ్లపై పాడేసి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో శిశుగృహకు చేర్చుతున్నారు. వీరితో పాటు కొందరు తల్లిదండ్రులు తాము సంతనాన్ని పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. ఆడపిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. దత్తత సలహా, సహాయ కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అనాథలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారితో వెళ్లే చిన్నారుల యోగక్షేమాలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. ఎక్కడైనా లోపం తలెత్తితే తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటుంది. -
జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. -
నిత్యం రోడ్లపైనే నీరు..
వానాకాలంలో జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రధాన రహదారిపై నిత్యం నీరు నిలిచి ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఉన్నా నీరంతా చెరువులోకి పోతుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా మార్గం సరిచేయాలి. – అబ్దుల్ కలీమ్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని నాలాలు, డ్రెయినేజీల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలగిస్తున్నాం. నాలాలపై కల్వర్టుల వద్ద అడ్డుగా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు చేపడుతాం. మురుగునీటిని తరలించేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణం వేగవంతం చేస్తాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ -
ఆదివాసీల హక్కులకు భంగం కలిగించొద్దు
మన్ననూర్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీల హక్కులపై అవగాహన కల్పించారు. శనివారం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్, అప్పాపూర్, భౌరాపూర్, రాంపూర్, చెంచు పెంటలలో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాదులు, ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాల గురించి చెంచులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. బడిఈడు పిల్లలను తప్పకుండా చదివించాలని సూచించారు. జీవితంలో గొప్పవారు కావాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గం అని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. జీవించే క్రమంలో ఆదివాసీల హక్కులకు ఎవరూ భంగం కలిగించొద్దని, ఈ క్రమంలో న్యాయం పొందేందుకు న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో లీగల్ సెల్ తరపున న్యాయవాదిని నియమించి ఉచితంగా న్యాయం పొందేలా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయా పెంటలలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ లీగల్ సెల్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరాం ఆర్యా, పవన శేషసాయి, ఎఫ్ఆర్ఓ సవిత తదితరులు పాల్గొన్నారు. -
నీట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: రాష్ట్రంలో వరి కొనుగోలు, సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీట్ నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సీఎం సభ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న నీట్–2026కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు బిగించాలని చెప్పారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష రోజు ప్రశ్నపత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితరవి పకడ్బందీగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 4,488 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశామని సీఎస్ చెప్పారు. ఇప్పటి వరకు 10.58 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.13,577 కోట్లు జమ చేశామని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒకటి చొప్పున 553 బస్సులను మంజూరు చేశామని, ఈ బస్సులను మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభానికి విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫామ్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పందిస్తూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, రవాణా సంబంధిత ఏర్పాట్లు చేశామని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. సీఎం సభకు మహిళల తరలింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతామన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి పకడ్బందీ ఏర్పాటు చేస్తామని పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఆర్ఓ నర్సింహారావు పాల్గొన్నారు. -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. జడ్చర్ల బహిరంగ సభ వద్ద అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిజడ్చర్లలో బహిరంగసభకు హాజరైన మహిళలు పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. -
గాలిమోటార్లో తిరుగుతూ గాలి మాటలు
పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్కుమార్రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాదేపల్లిలో ధాన్యం ధర క్వింటాకు రూ. 3,012జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డులో శుక్రవా రం ధాన్యానికి రికార్డు ధర దక్కింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాకు గరిష్టంగా రూ.3,012, కనిష్టంగా రూ.1,620 ధర లభించింది. ఈ సీజన్లో ఇంత ధర లభించడం ఇదే మొదటిసారిగా మార్కెట్ అధికారులు తెలిపారు. వరికి ఏ గ్రేడ్ మద్దతు ధర క్వింటాకు రూ.2,461 ఉంది. అయితే ఇక్కడ మద్దతు ధరను మించి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,611, వేరుశనగకు గరిష్టంగా రూ.4,699, కనిష్టంగా రూ.4,489, పొద్దుతిరుగుడుకు గరిష్టంగా రూ.6,826, కనిష్టంగా రూ.6,756 ధరలు పలికాయి. ● రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు ● ఎంపీ డీకే అరుణ -
పెంపు సరే.. నోటిఫికేషన్లేవి..?
● జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ ● ఉద్యోగ ప్రకటనల కోసం వేలాది మంది ఎదురుచూపు కర్వెన రిజర్వాయర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, రాజేష్రెడ్డి కందనూలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో కొంత ఆశలు రేకెత్తించినా.. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే అంశంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ‘నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి‘..? అనే ప్రశ్న నిరుద్యోగులను వెంటాడుతోంది. వయోపరిమితి పెంచిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ప్రకటిస్తే ఇన్నాళ్లు వేచి చూసిన నిరుద్యోగుల్లో కొంత ఉత్సాహం కలుగుతుంది. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపన కలిగినవారు ఆ దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వయో పరిమితిని ఈ విద్యా సంవత్సరానికి మాత్రం పరిమితం చేయడంతో ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలకు మాత్రమే ఈ వయో పరిమితి ఉంటుంది. దీంతోపాటు యూని ఫాం సర్వీస్లకు వర్తించదనే నిబంధనతో అనేక మంది నిరుద్యోగులు నిరాశలో పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలో అత్యధికంగా పోలీస్ జాబ్లే ఉండే అవకాశం ఉంది. పట్టణాల్లో కోచింగ్ తీసుకొని.. వయో పరిమితి పెంపు కొంత ప్రభుత్వానికి సానుకులంగా ఉన్నా.. గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ అలుముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని యువత కొంత అసహనంతో ఉంది. సడలింపులు ఇస్తున్నారు కానీ.. ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు. చదువు పూర్తి చేసుకొని ఏళ్ల తరబడి పట్టణాల్లో కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువత కుటుంబాలకు భారం ఒకవైపు, నిరుద్యోగం మరోవైపు వెంటాడుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ, దాదాపు మూడేళ్లు కావొస్తున్న ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో నియామకాలు చేపడుతామని సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వయోపరిమితి సడలింపు సానుకూలం కానీ, వాస్తవ ఉద్యోగ అవకాశాలే యువతకు ప్రధానం అని విద్యాభిమానులు పేర్కొంటున్నారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో సతమతం హైదరాబాద్లో, జిల్లాకేంద్రాల్లో హాస్టళ్లు, గదులు అద్దెకు తీసుకొని ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే తపన కలిగి కోచింగ్ తీసుకుంటున్న గ్రామీణ యువత పరిస్థితి దయనీయంగా ఉంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుండగా.. ఇటు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగ భరోసా కనిపించక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డీఎస్సీ ప్రిపరేషన్ చేసేవారు కొందరైతే.. గ్రూప్స్ ప్రిపరేషన్ చేసేవారు మరికొందరు ఇలా ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగుల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలి. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నాళ్లు ఇలా వేచి చూడాలి. ప్రభుత్వానికి నిరుద్యోగుల గురించి పట్టింపులేదు. – నర్మద, నిరుద్యోగి, తెలకపల్లి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం శోచనీయం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలి. – సృజన, నిరుద్యోగి, తెలకపల్లి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పదేళ్లు వయోపరిమితి పెంపు మంచిదే అయినా.. యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు 2, 3 ఏళ్లపాటు వయోపరిమితి సడలించాలి. ఒక్కసారి మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. – తిరుపతి, నిరుద్యోగి, నాగర్కర్నూల్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉద్యోగ ప్రకటనలు వేస్తే.. ఇప్పుడు వయోపరిమితి పెంచాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికై నా ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రకటనలు ఎప్పుడు ఇస్తారు.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. – సురేష్, నిరుద్యోగి, నాగర్కర్నూల్ -
ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన : ఎస్పీ
కందనూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతం చేసినట్లు ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయగా.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 950 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. హెలీప్యాడ్, పంప్హౌస్ ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజా సమావేశ ప్రదేశాలు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యటనను విజయవంతం చేశామన్నారు. సీఎం పర్యటన విజయవంతం కావడంలో పోలీసు శాఖతోపాటు జిల్లా యంత్రాంగం, ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. బందోబస్తు విధుల్లో అత్యంత అంకితభావంతో పనిచేసిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో మోస్తారు వర్షాలు కందనూలు: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల మోస్తారుతోపాటు తేలికపాటి వర్షం కురిసింది. ఊర్కొండ మండలంలో అత్యధికంగా 19 మి.మీ., వెల్దండలో 11 మి.మీ., ఉప్పునుంతల మండలం వెల్టూరులో 9.5 మి.మీ., పదరలో 6.5 మి.మీ., తెలకపల్లి మండలం పెద్దూరులో 5.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు. పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి కందనూలు: పర్యావరణంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భూతాపం, ప్లాస్టిక్ వ్యర్థాలు, జీవవైవిధ్య క్షీణత వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు, న్యాయవ్యాదులు తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా..
● కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన ● కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ● ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ ● గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష ● నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ ● పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూరు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనాల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్తల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధిలోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. -
బీఆర్ఎస్లో దుమారం..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాల కు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. గతంలో కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్పై విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్లోనే ఉంటారా.. కాంగ్రెస్లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎంను కలవడంపై కొందరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందులో ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన అనుచరులు కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు -
జిల్లా అభివృద్ధి పట్టదా..?
కల్వకుర్తి రూరల్: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు అదనపు నిధులు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీ, కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు గ్రానైట్, కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, బాలస్వామి, భీమరాజు ఉన్నారు. -
ఆశల పల్లకీలో..
జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనపై గంపెడాశలు ● శ్రీశైలం నిర్వాసితులకు దక్కని న్యాయం ● నాలుగు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు ● ఇంజినీరింగ్ కళాశాల, పరిశ్రమల ఏర్పాటుపై హామీ దక్కేనా?సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధిపై ఇవ్వనున్న వరాలపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులతో పాటు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగంతో పాటు పరిహారానికి సైతం నోచుకోలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులు సీఎం రేవంత్రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు. నాలుగు దశాబ్దాలైనా.. శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన నీటిమూటగానే మారింది. అందుకోసం 1984లో జారీ చేసిన జీఓ 98 సైతం నేటీకీ అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయిన వారిలో ఇంకా 2,156 మంది ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంత మంది మరణించగా.. మరికొందరు వృద్ధాప్యానికి చేరువయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో శ్రీశైలం భూనిర్వాసితుల అంశం ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఈ క్రమంలో సీఎం అపాయింట్మెంట్ కోసం నిర్వాసితుల తరఫున ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించారు. అయితే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమకు పరిహారం విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశలు పెట్టుకున్నారు. -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
● ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కందనూలు/కొల్లాపూర్ రూరల్: జిల్లాలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులతో కలిసి నార్లాపూర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకు ముందు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–3 కాల్వల నిర్మాణం, ప్యాకేజీ–2 పరిధిలోని డెలివరీ సిస్టమ్, ప్యాకేజీ–1లోని పంపుహౌజ్ నిర్మాణాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించే ప్రదేశాలు, ఆయనకు పథకం పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షిస్తారని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం స్వయంగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్హౌజ్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను నాగర్కర్నూల్, వనపర్తి ఎస్పీలు డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్, సునీతారెడ్డితలతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. అనంతరం కుమ్మెర గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్షించారు. అక్కడ భద్రతా ప్రమాణాలు, వాహనాల పార్కింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలపై సీఎం భద్రతా అధికారులు పలు సూచనలు చేశారు.


