త్వరగా అందించాలి..
యాసంగి సీజన్ ప్రారంభమై చాలా రోజులు అయితుంది. ఇప్పటికీ మూడు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. అప్పు చేసి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో చిల్ల గవ్వ కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెట్టుబడి సాయం అందిస్తే.. వడ్డీ వ్యాపారులతో అప్పు తీసుకునే ముప్పు తప్పుతుంది. – సుధాకర్, రైతు,
గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం
రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతులు, వారి ఖాతాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్దే ఉంటాయి. దానిని బట్టి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది.
– యశ్వంత్రావు,
జిల్లా వ్యవసాయాధికారి


