breaking news
Nagarkurnool District Latest News
-
అక్రమంగా పట్టా చేసుకున్నారు..
తిమ్మాజిపేట మండలంలోని ఇప్పలపల్లి గ్రామ శివారు సర్వేనం.235/5లో 11 గుంటల భూమి, 235/18/అ1/2లో 11 గుంటలు మొత్తం 22 గుంటల భూమిపై నాగర్కర్నూల్ సివిల్ కోర్టు ద్వారా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ మాకు అనుకూలంగా వచ్చింది. కానీ, గతంలో అక్రమంగా పట్టా చేసుకున్నవారు మాపై దౌర్జన్యం చేసి అదే పొలంలో మేము వేసిన జొన్న పంటను ధ్వంసం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి. – శ్రీనివాసులు, ఇప్పలపల్లి, తిమ్మాజిపేట మండలం -
నత్తకే నడక
కొల్లాపూర్ నుంచి కృష్ణానది వరకు సా..గుతున్న ఎన్హెచ్–167కే పనులు ● రెవెన్యూ శాఖ పరిధిలోని భూ సేకరణలోనే తీవ్రజాప్యం ● ఏడాది క్రితమే రైతులకు నోటీసుల అందజేత ● పరిహారం చెల్లించకపోవడంతో పూర్తికాని ప్రక్రియ ● మరోవైపు అటవీ భూములకు అనుమతి క్లియర్ కొల్లాపూర్: జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు.. తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, భూ సేకరణలో ఆలస్యం వంటి కారణాలతో పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్న ఈ రహదారిలో 1, 4, 5 ప్యాకేజీల పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. 2, 3 ప్యాకేజీల పనులకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్లే నిర్వహించలేదు. రెండేళ్ల వ్యవధిలో ఈ రహదారి నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. పనులను అధికారికంగా ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు. -
‘సర్’ను గడువులోగా పూర్తిచేయాలి
కందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరుకు ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతోపాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్ పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
అచ్చంపేట రూరల్: ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని, ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డిపో కార్యాలయంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సందేహాలు, సూచనలను సెల్ నం.99592 26291కు కాల్ చేయాలని కోరారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు అమ్రాబాద్: అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, ఇంగ్లిష్ 1, హిస్టరీ 1, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 1, తెలుగు 1, బాటనీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా సబ్జెక్ట్లలో పీజీలో 55 శాతం, (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) ఉన్నవారు అర్హులని, సెట్, నెట్, స్లేట్, పీహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం వరకు ధ్రువపత్రాలను కళాశాలలో అందజేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలలో.. బల్మూర్: మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, తెలుగు, ఇంగ్లిష్, బీఎఫ్ఎస్ఐ, కంప్యూటర్ సైన్స్– అప్లికేషన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు ఒక్కొక్క పోస్టు చొప్పున మొత్తం 9 పోస్టులు ఉన్నాయని, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారం కళాశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి గు రువారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగర్కర్నూల్లో ఉంటాయని, అభ్యర్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
పొలాలు కోతలకు గురవుతున్నాయి..
శాయిన్పేట చెరువు నీళ్లు, కేఎల్ఐ కాల్వ నీళ్లు పోవడానికి పురాతన కాలం నుంచి ఫిడెల్ కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫిడెల్ కాల్వను పూడ్చివేయడంతో చెరువు, కేఎల్ఐ కాల్వ నీరు మా పొలాల్లోకి వచ్చి పూర్తిగా కోతకు గురై వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఫిడెల్ కాల్వను పునరుద్ధరించి.. కాల్వను పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – తిరుపతయ్య, బాబు, మల్లయ్య, అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం -
అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే..
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు. ఏపీలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాలో ఆటంకాలు కలగకుండా మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. అర్ధరాత్రి పోలీసుల గస్తీ, వాహనాల రద్దీ నామమాత్రమే కావడంతో 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దాటిస్తోంది. వాహనాలు బయలుదేరే పది నిమిషాల ముందు ఓ ఎస్కార్ట్ కారు వెళ్లి ఆయా ప్రాంతాల్లో పోలీసుల పహారాపై ముందస్తు సమాచారమిచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్హెచ్ వెంట పోలీస్స్టేషన్లు ఉన్నా.. ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారు. మక్తల్ నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో కర్ణాటక బార్డర్లో కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి పలువురు ఇసుకదందా నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణా మండలంలో గతంలో ఇసుక అక్రమాల్లో చక్రం తిప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఓ వ్యక్తి, ఓ బంధువు, మరికొందరు అనుచరుల ద్వారా ఇసుక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కర్నూలుకు చెందిన ఓ నేత, తెలంగాణలోని అలంపూర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయిన ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
బలోపేతం దిశగా బడులు
● అప్పాయపల్లి ప్రాథమికోన్నతపాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య ● బడిబాటతో సత్ఫలితాలు దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, కెమిస్ట్రీ, జువాలజీ, డెయిరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై, కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) సాధించిన వారు అర్హులని తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలలోగా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి నాగర్కర్నూల్ రూరల్/అచ్చంపేట రూరల్: ఆర్టీసీ ఉద్యోగుల సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్కర్నూల్, అచ్చంపేట ఆర్టీసీ డిపోల వద్ద ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విలీనం కంటే ముందున్న సమస్యలను ఎలా పరిష్కరించబడాలనే విషయంలో విలీన కమిటీ అధ్యయనం చేయాలన్నారు. కార్మికుల సమష్టి పోరాటం మూలంగా 11శాతం వేతన సవరణ జరిగిందన్నారు. కార్మిక వర్గానికి లాభం జరగాలంటే సంపూర్ణ ఉద్యోగ భద్రత, పని భారం, వేధింపులు లేని ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలన్నారు. సమావేశాల్లో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజనల్ కార్యదర్శి వెంకటయ్య, నంది వెంకటేశ్, బాషా, అర్జున్, వర్దనమ్మ, చింతలయ్య, కృష్ణ, చెన్నకేశవులు, గోపాల్, విజయ్, ఆంజనేయులు, డానియిల్, శ్రీను, రాములు ఉన్నారు. – వివరాలు 9లో.. -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్ ● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్గౌడ్, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ సమకూర్చారు. అనంతరం వికారాబాద్కు చెందిన కృష్ణయ్యగౌడ్తో కలిసి జయప్రకాష్గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈగల్ పోలీస్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ను సీజ్ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్గౌడ్తోపాటు కృష్ణయ్యగౌడ్, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించింది. బీటెక్ చదివి.. తుంకినీపూర్కు చెందిన జయప్రకాష్గౌడ్ బీటెక్ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 13న ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్గౌడ్ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. -
సీజనల్పై అప్రమత్తం..
వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు కందనూలు: సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వానాకాలంలో ప్రబలే టైఫాయిడ్, అతిసారం, మలేరియా, డెంగీ, చికున్గున్యా తదితర వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా నమోదయ్యాయి.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. పరిశుభ్రత పాటించాలి.. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాం. ఈ నెల 6 నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల చుట్టూ మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. – డా.కృష్ణ, డీఎంహెచ్ఓ రోజూ 50 ఇళ్ల సర్వే.. జిల్లావ్యాప్తంగా 560 సర్వే బృందాలను ఏర్పాటుచేశారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల భాగస్వామ్యంతో ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే సర్వే బృందాలు 1,16,140 గృహాల్లో 3,22,999 మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వీరిలో దాదాపు 606 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి.. వివరాలను నమోదు చేసుకున్నారు. వారికి అవసరమైన మందులు అందజేస్తూ.. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే పీహెచ్సీలకు తరలిస్తున్నారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈ ప్రక్రియను హెల్త్ సూపర్వైజర్లు పర్యవేక్షిస్తుండగా.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్యాధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలా.. జిల్లాలోని 20 మండలాల్లో 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. 27 పీహెచ్సీలు, 1 అర్బన్ పీహెచ్సీ, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉన్నాయి. జిల్లా ఆస్పత్రికి రోజు దాదాపు 2వేల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు బారినపడిన వారు 30 నుంచి 50 మందికి పైగా ఓపీ వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరించి.. జిల్లా కేంద్రంలోని టీ హబ్కు పంపిస్తున్నారు. పరీక్ష ఫలితాల ఆధారంగా వ్యాధిని నిర్ధారించి, ప్రతి ఆరోగ్యకేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే డాక్టర్లు అప్రమత్తమై.. వారికి అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొనసాగుతున్న ఇంటింటా ఫీవర్ సర్వే జిల్లావ్యాప్తంగా 560 బృందాల ఏర్పాటు ఇప్పటివరకు 1,16,140 గృహాలసర్వే పూర్తి ఐదేళ్లలో నమోదైన కేసులు ఇలా.. -
డూప్లికేటుగాళ్ల ఆగడాలు!
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి.. పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు. – జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్, గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్ హైదరాబాద్ ఆటోనగర్ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్ 60 బస్తాలు, ప్రవీణ్కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్గౌడ్ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి సూచన మేరకు హైదరాబాద్లో లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్స్టేషన్కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది. మంత్రి ఇలాఖాలో నకిలీ డీఏపీ విక్రయాలు? కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే ధ్యేయంగా.. స్థానికులను మచ్చిక చేసుకొని ఇద్దరు డీలర్ల రహస్య దందా నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి.. విచారణతోనే మరిన్ని విషయాలు వెలుగులోకి.. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం ● విస్తృత స్థాయి రౌండ్టేబుల్సమావేశంలో వక్తల పిలుపు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్కుమార్, రమేష్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పుంజుకున్న ‘సర్’..
● జిల్లాలో 71.62శాతం డిజిటలైజేషన్ పూర్తి ● ఇప్పటివరకు 5,24,015 ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ● గ్రామాల్లోనే ఓటుకు మొగ్గు.. పట్టణాల్లో తగ్గనున్న ఓట్లు అచ్చంపేట: సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. ఆదివారం నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 71.62 శాతం పూర్తయింది. ఇప్పటికే బీఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయగా.. ఓటర్లు తమ వివరాలు నింపి తిరిగి అందజేస్తున్నారు. అయితే కొందరు ఓటర్లు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. జల్లాలో మొత్తం 7,31,632 మంది ఓటర్ల నుంచి అందిన ఎన్యూమరేషన్ ఫారాల్లో ఇప్పటి వరకు 5,24,015 ఫారాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియలో 2002 ఓటరు జాబితాను లింక్ చేశారు. అప్పటి ఓటరు జాబితాలో పేరులేని వారు 24ఏళ్ల క్రితం నాటి తల్లిదండ్రుల వివరాలను, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, బూత్ నంబరు, సీరియల్ నంబర్లను ఓటర్లే వెతుకోవాల్సి వస్తోంది. పెళ్లికి ముందే ఓటు హక్కు పొంది.. ఆ తర్వాత ఇంటిపేరు మార్చుకున్న మహిళల పరిస్థితి సైతం ఇబ్బందిగా మారింది. అక్షరం తేడా ఉన్నా.. బీఎల్ఓలతో పనిలేకుండా స్వయంగా ఓటర్లు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారు ఆన్లైన్లో నమోదుకు యత్నించినప్పటికీ.. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డుల్లో ఆక్షరం తేడా ఉన్నా పూర్తిచేసిన దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. బీఎల్ఓలను సంప్రదించాలని సూచిస్తోంది. నాయకుల తర్జన భర్జన.. రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఇటు మున్సిపాలిటీలు, అటు సొంతూళ్లలో ఓటు ఉంది. వారు ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు. అలాగే చాలా మంది అధికారులకు సొంతూరితో పాటు వారు పనిచేసిన చోట ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదో ఒక చోట ఉంచుకోవాల్సి ఉండటంతో వారు సొంతూరిలోనే నమోదు చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్రియ వేగవంతం.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్త యింది. డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఇంటికీ బూత్ లెవల్ ఆఫీసర్లు వెళ్లి వివరాలు సేకరించి.. 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు నమోదు చేయాలి. ఓటర్ల కు ఓటు ప్రాధాన్యతను తెలియజేయాలి. వే గంగా ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకు రా జకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి. – యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట -
బిందుసేద్యంపై దృష్టి సారించాలి
తాడూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందుసేద్యంపై దృష్టిసారించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎం.వెంకటేశం సూచించారు. శనివారం తాడూరు మండలం మేడిపూర్, బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామాల్లో రైతులు మల్చింగ్ విధానంతో సాగుచేసిన అయిల్పామ్, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బిందుసేద్యం పరికరాలను 80శాతం వరకు రాయితీలు ఇస్తోందన్నారు. మల్చింగ్ విధానంలో ఎకరాకు రూ. 20వేల వరకు సబ్సిడీ అందుతుందని తెలిపారు. రైతులు నీటి సంరక్షణ పద్ధతులు పాటించి.. కూరగాయలు, ఆయిల్పామ్ తోటలను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ డివిజన్ అధికారి జగన్, విస్తరణాధికారి దేవేందర్, యూనిక్ అధికారి శివ భార్గవ్, కుర్మయ్య ఉన్నారు. సమష్టి కృషితోనే అభివృద్ధి కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్ సూచించారు. శనివారం కొల్లాపూర్ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించారు. డిపో ఆదాయ, వ్యయాలు, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డిపో ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ కృష్ణమూర్తి, డీఎం మల్లేశం పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అచ్చంపేట: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ జి.వెంకటరమణ హెచ్చరించారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని న్యూమాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి.. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని అధికారికంగా సీజ్ చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాల విక్రయాలు జరపరాదని.. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి ఉల్లంఘన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్పవర్ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్ఆర్జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్గౌడ్, నాగర్కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణాలు, రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అనేక రంగాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక, పరిపాలనా లేదా ఇతర సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో గోపాల్నాయక్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం.. కందనూలు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని.. ఎంజీకేఎల్ఐ పరిధిలోని ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీకేఎల్ ద్వారా సుమారు 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం జలాశయానికి గణనీయమైన వరద ప్రవాహాలు రాకపోవడంతో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో స్థూల నీటినిల్వ 41.45 టీఎంసీలు ఉన్నప్పటికీ.. అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అని, వాస్తవంగా వినియోగించదగిన జీవ జల నిల్వ కేవలం 11.45 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఇదిలా ఉంటే, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని.. ఇప్పటికే జూన్ 1 నుంచి జూలై 18 వరకు 1.363 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని ఎల్లూరు, గుడిపల్లిగట్టు, జొన్నలబొగుడ, సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో కేవలం 2.23 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని.. ఈ పరిస్థితుల్లో సాగునీటిని విడుదలచేస్తే భవిష్యత్లో తాగునీటి అవసరాలు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. -
భవిష్యత్ అవసరాలు తీరేలా..
● కొత్తగా 39 నిర్మాణాలు ● ప్రారంభోత్సవానికి 3 సిద్ధం ● ప్రస్తుతం అందుబాటులో 107 సబ్స్టేషన్లు కల్వకుర్తి: జిల్లాలో గృహ, వ్యవసాయ, చిన్న, పెద్ద పరిశ్రమల నిర్వహణలో భాగంగా రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ట్రాన్స్కో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 107 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 39 సబ్స్టేషన్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవేగాక 132/33, 220/132 సబ్స్టేషన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోంది. రూ.130 కోట్లతో నిర్మాణాలు.. జిల్లాలో రూ.130 కోట్లతో కొత్తగా 39 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ. 3కోట్ల నుంచి రూ. 3.50కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో మూడు మాత్రం 10 ఏళ్ల కిందట మంజూరైనా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. వెల్దండ మండలంలోని పోతేపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట, పెంట్లవెల్లి గ్రామాల్లో మంజూరైన సబ్స్టేషన్లు నిర్మాణం ప్రారంభించగా.. వివిధ కారణాలతో నిర్లక్ష్యం చూపారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయిస్తున్నారు. నెల రోజుల్లో పనలు పూర్తి చేసి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవే కాక జిల్లాలోని వివిధ మండలాల్లో 36 సబ్స్టేషన్లు మంజూరు కాగా.. కొన్ని టెండర్ దశలో, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరికల్ వద్ద చేపట్టిన 220/132 విద్యుత్ సబ్స్టేషన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రారంభమైతే జిల్లాలోని లట్టుపల్లి, మంగనూరుతో పాటు వనపర్తి, జడ్చర్ల ప్రాంతాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం లట్టుపల్లి, మంగనూరు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. మరో 220/33 సబ్స్టేషన్ను అమ్రాబాద్కు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. వంగూరు మండలం పోల్కంపల్లి వద్ద 132/33 సబ్స్టేషన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. విద్యుత్ సబ్స్టేషన్తో వెల్దండ, చారకొండ మండలాలతో పాటు రెండు రెవెన్యూ డివిజన్లో విద్యుత్ సమస్య చాలా వరకు తీర్చవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోతేపల్లిలో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ -
నకిలీ.. మకిలీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెలుగులోకి ఇలా.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోనకిలీ డీఏపీ కలకలం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి.. మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం.. కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు -
‘సర్’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం
● ఓటర్ల గుర్తింపులో బాధ్యతగా వ్యవహరించాలి ● బీఎల్వోలు, బీఎల్ఏల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశితా గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిన బీఎల్వోలు, బీఏల్ఏలకు నగదు బహుమతులు అందజేస్తామని.. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పాన్గల్, వీపనగండ్ల రైతువేధికల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్షలో మంత్రితో పాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్ధేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల వారీగా సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు సజావుగా జరగాలని.. ఓటు చోరీ జరగొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ పశ్చిమబెంగాల్, బిహార్లో ఓట్ల చోరీ జరిగిందని.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ యావత్ దేశానికి తన తెలియపర్చారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిరక్షరాస్యులు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని, అందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలకు అవసరమయ్యే సహకారం అందివ్వాలని సూచించారు. మనిషికి ఓటు లేకపోతే మనగడకు అంతరాయం కలుగొచ్చని.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సర్ ప్రక్రియ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్దేశ్వర్ సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, వీపనగండ్ల తహసీల్దార్ ఎండీ ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఎల్నినోపై సమీక్ష
కందనూలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై ఈ నెల 20న జిల్లా ఇన్చార్జి మంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులతో వీసీ నిర్వహించి.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, 20న నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణను సమగ్రంగా వివరించారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, పశువులకు మేత, తాగునీటి ఏర్పాట్లు, నీటి సంరక్షణ చర్యలు, ఇతర శాఖల వారీగా చేపట్టిన చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించి.. అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన తాజా గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారం, చేపట్టిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణారెడ్డి పాల్గొన్నారు. -
వెట్రన్కు రెండో పంపు సిద్ధం
కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు దగ్గర రెండో పంపునకు సంబంధించిన సాంకేతిక సమస్యలు అధిగమించి వెట్రన్కు సిద్ధం చేశామని ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ అన్నారు. శుక్రవారం ఆయన రెండో పంపు వెట్రన్పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రెండో పంపు ట్రయల్ రన్తోపాటు టెస్టు రన్ కూడా చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో వెట్రన్ నిర్వహించి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తామన్నారు. రెండో పంపు వెట్రన్ తర్వాత వారంలో రోజుల అనంతరం మూడో పంపును సైతం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తద్వారా మొదటి లిఫ్టులో పూర్తయిన నాలుగు పంపుల నుంచి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. -
తక్కువ ధర ఆశ చూపి మోసం!
● 111 నకిలీ డీఏపీ బస్తాల పట్టివేత ● రైతులకు దళారుల టోకరా.. పొలంలో చల్లిన తర్వాత తెలిసిన నకిలీ బాగోతం ● వ్యవసాయాధికారులకు సమాచారం.. ఆకస్మిక తనిఖీ, బస్తాల స్వాధీనం ● పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ – కల్వకుర్తి ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్ మన్ననూర్: స్థానిక పీవీటీజీ పాఠశాల/కళాశాలలోని వసతి గృహంలో వారం రోజుల క్రితం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన సంగతి విధితమే. ఈ సందర్భంగా అధికారుల తాత్కాలిక విచారణలో భాగంగా అందుకు బాధ్యులుగా భావించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈ క్రమంలో సస్పెన్షన్కు గురైన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికగా నియామకాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి విచారణ వరకు ఈ ఉత్తర్వులు ఆచరణలో ఉంటాయని, అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలి
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సమయంలో పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. విధులకు హాజరైన ఉపాధ్యాయులు సరస్వతి, రజితలను కలెక్టర్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. అనంతరం ఫోన్లో డీఈ ఓ రమేష్కుమార్తో మాట్లాడుతూ.. విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానసను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎంఈఓ శంకర్నాయక్కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు. డ్రై డేను బాధ్యతగా నిర్వర్తించాలి డ్రై డేను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో కళాశాల విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు 102 సేవలను వినియోగించాలి గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో 102 సేవలను వినియోగించాలని ఆశా కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న గర్భిణులతో కలెక్టర్ మాట్లాడగా.. వారు వైద్య పరీక్షల కోసం బస్సులో ఆస్పత్రికి వచ్చినట్లు తెలపడంతో ఆశా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 102 అంబులెన్స్ సేవలను ఎందుకు వినియోగించలేదని ఆరా తీశారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణంలోని మిషన్ భగీరథ 60 ఎంఎల్డీ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. -
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు.. -
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం, అట్రాసిటీ నివారణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించాలని చెప్పారు. విజిలెన్స్, మానిటరింగ్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 ప్రకారం నమోదయ్యే ప్రతి కేసును జిల్లాస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం, పునరావాసం, ఇతర సంక్షేమ సదుపాయాలు సకాలంలో అందేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కమిటీకి సమగ్ర నివేదిక సమర్పించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలు, వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కేసును సున్నితంగా, పారదర్శకంగా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేసులు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వర గా పూర్తి చేయాలని సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భద్రత విషయంలో రాజీ పడకూదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణారెడ్డి పాల్గొన్నారు. -
జగన్నాథుడి రథ వైభవం
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు నగరంలో గురువారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు హారతి, పూజలు చేశారు. భక్తుల జై జగన్నాథ, హరే రామ్... హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు పట్టణంలో భక్తిభావం ఉట్టిపడింది. శ్రీజగన్నాథ రథయాత్ర దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు రెండు వైపుల నిలుచొని రథాన్ని లాగారు. మెట్టుగడ్డ పిల్లలమర్రి చౌరస్తా నుంచి ప్రారంభమైన రథయాత్ర న్యూటౌన్, ఆర్టీసీ బస్టాండ్, అశోక్టాకీస్ చౌరస్తా, వన్టౌన్ పోలీస్ స్టేషన్, రాంమందిర్ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, క్లాక్టవర్ నుంచి తిరిగి బస్టాండ్ మీదుగా మల్లికార్జున్ చౌరస్తా నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు చేరింది. రథయాత్రలో ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని దేవతామూర్తులకు హారతి, ప్రత్యేకపూజలు చేసి రథాన్ని లాగారు. -
రూ.4.60 లక్షలు ఖర్చు పెట్టా
20 ఎకరాల్లో 45 రోజుల కిందట పత్తి విత్తనాలు విత్తాను. 150 పత్తి పాకెట్ల కోసం రూ.1.50 లక్షలు, దుక్కి దున్నడానికి ట్రాక్టరుకు రూ.లక్ష, కోళ్ల ఎరువుకు రూ.90 వేలు, ఎరువులకు రూ.65 వేలు, కూలీలకు రూ.50 వేలు మొత్తం కలిపి రూ.4.60 లక్షలు ఖర్చుపెట్టాను. ఇప్పుడేమో వర్షాలు లేక పత్తి మొలకలు వాడుపడుతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోతా. – సల్వాది కురుమూర్తి, రైతు, నడిగడ్డ నాలుగు ఎకరాల్లో పత్తిపంట వేశాను. మొలకెత్తినా వర్షాలు లేక ఎదుగుదల లేకపోగా వాడుపడుతున్నాయి. స్ప్రింక్లర్లతో నీటి తడులు అందిస్తున్నా అంతగా పంట లేదు. వర్షాలు కురిస్తేనే దిగుబడి వస్తుంది. లేకపోతే చాలా నష్టపోతాం. పంట వల్ల లాభం వచ్చి అప్పు తీర్చుతాయని ఆశపడుతాం. పంట పండకపోతే అప్పు పెరిగి మరో ఏడాదిపాటు రైతు కోలుకోలేడు. – శ్రీనివాసులు, రైతు, తిమ్మాయిపల్లి ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీల వద్ద కరపత్రాలు సైతం అతికిస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేనందున నీరు తక్కువ తీసుకునే పంటలు సాగు చేసుకోవాలి. మినుములు, కంది, ఉలువలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటివి ఉత్తమం. కాల్వ నీటిపై ఆధారపడే రైతులకు ఆగస్టు 15 వరకు రాాకపోవచ్చు. కాబట్టి వరి సాగు చేయడం మానుకోవాలి. కంది, మొక్క జొన్న, మినుములు, నువ్వులు సాగు చేయడంతోపాటు నీరు అందుబాటులో ఉంటే కూరగాయలు వేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
విద్య.. నీరు.. పారిశ్రామికం
ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్రెడ్డి –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. త్వరలో శుభవార్త చెబుతాం.. ‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్ఎల్ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం -
ఘాటెక్కిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధర వినియోగదారునికి చుక్కలు చూపిస్తుండగా.. రైతులకు కాసుల పంట పండుతోంది. ఈసారి సీజన్లో నమోదైన ధరలతో పోల్చితే దాదాపు వందశాతం పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సీజన్లో జనవరి నుంచి మే వరకు 5 నెలలపాటు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలికింది. జూన్లో రూ.2,000 నుంచి రూ.2,400 వరకు, జూలై రెండో బుధవారం ఏకంగా రూ.2,500 నుంచి రూ.3,300 వరకు ఉల్లి ధరలు నమోదయ్యాయి. సీజన్లో అమ్ముకున్న రైతుల కన్నా ప్రస్తుతం అమ్ముకుంటున్న రైతులు వందశాతం లాభాలు పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి దిగుబడులు లేకపోవడంతో యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసిన రైతులు ఇప్పుడు మార్కెట్కు తీసుకువస్తుండగా అధిక ధరలు పలుకుతున్నాయి. ఉల్లి అమ్మకాలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోనే ఉల్లి క్రయ విక్రయాలకు దేవరకద్ర మార్కెట్ ప్రసిద్ధిగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడి మార్కెట్లో కేవలం ఉల్లిపాయలు మాత్రమే బహిరంగ వేలం వేసి ధరలు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు దేవరకద్ర మార్కెట్కు ఉల్లిని అమ్మకానికి తెస్తారు. ప్రధానంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి దేవరకద్ర మార్కెట్కు ఉల్లి అమ్మకానికి వస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పండించిన ఉల్లి అంతా దేవరకద్ర మార్కెట్కే అమ్మకానికి తెస్తారు. ఏడాదిలో వచ్చే 56 బుధవారాలు ఉల్లి వ్యాపారంతోనే మార్కెట్ సందడిగా ఉంటుంది. అన్నదాతల ఆనందం.. ఉల్లి ధరలు పెరగడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. నిల్వ చేసుకున్నందుకు ఫలితం దక్కిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో అమ్మిన ఉల్లికి వచ్చిన ధరలతో పోల్చితే ప్రస్తుతం రెండు, మూడింతల ధరలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బుధవారం దేవరకద్ర మార్కెట్లో జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.3,300, కనిష్టంగా రూ.2,500 వరకు ధరలు నమోదయ్యాయి. సన్నటి ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,600 వరకు పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ.1,300 చొప్పున, సన్నటి ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.800 వరకు విక్రయించారు. చిల్లర వ్యాపారులు కిలో ఉల్లి ఏకంగా రూ.30–40 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ చేసుకున్న రైతుకు లాభాల పంట క్వింటా గరిష్టంగా రూ.3,300,కనిష్టంగా రూ.2,500 క్రమంగా పెరుగుతున్న ధరలతో వినియోగదారుల ఆందోళన -
అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన
కందనూలు: ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు చెంచుపెంటల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. హెచ్ఐవీ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వలస కార్మికులు, లారీ డ్రైవర్లు, ఇతర కార్మికులకు హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేసి.. వ్యాధిగ్రస్తులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా.రఫీక్, డా.రవికుమార్, జిల్లా దిశ మేనేజర్ రమేశ్కుమార్, డీడీఎం సాయికుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ డివిజన్ కన్వీనర్ సీతారాల శివచంద్ర, చందులాల్ చౌహాన్, శివాజీ, నరేశ్, చందర్, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం తెలకపల్లి/మన్ననూర్: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిన ఆంగ్ల మాధ్యమం బోధనకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారిణి విద్యులత, జిల్లా సమన్వయ అధికారిణి ఏఆర్ లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, బాలుర పాఠశాల/కళాశాలల్లో పలు ఖాళీలు ఉన్నాయని.. విద్యార్హతలతో పాటు టెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఈ నెల 17న తెలకపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 80191 89182 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. కరువు ప్రాంతంగా ప్రకటించాలి నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణను కరువుపీడిత ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు ఆనంద్జీ, కేశవులుగౌడ్, కృష్ణాజీ, బాలపీర్, రామస్వామి, గాలెన్న ఉన్నారు. -
వర్షాల కోసం తీరొక్క మొక్కులు
విద్యార్థినులతో సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తదితరులు కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు. -
సర్కారు మూత‘బడి’!
అచ్చంపేట: తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందనేది నానుడి. గుడిలేని ఊరు ఉన్నా పర్వాలేదు కానీ.. బడి లేని గ్రామం ఉండకూడదని అంటారు పెద్దలు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. విద్యార్థులు లేరనే సాకుతో చాలా గ్రామాల్లో మూసేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 67 బడులు మూతపడగా.. అదే బాటలో మరో 122 పాఠశాలలు సైతం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా 495 ప్రాథమిక, 124 ప్రాథమికోన్నత, 130 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 25,102 మంది బాలురు, 22,285 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా బడిబాట కార్యక్రమంతో పదిశాతం విద్యార్థులను అదనంగా సర్కారు బడుల్లో చేర్పించాల్సి ఉంది. అయితే అదనంగా విద్యార్థులను చేర్పించడం పక్కన పెడితే.. ఉన్న విద్యార్థులు తగ్గిపోయి పాఠశాలలు మూతపడుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం 816 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2025–26 విద్యా సంవత్సరానికి వచ్చే సరికి 749 మిగిలాయి. జిల్లావ్యాప్తంగా 67 ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదని మూసేశారు. మరో 122 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. అంటే వాటిని కూడా మూసేసే పరిస్థితి దాపురించింది. మరో 119 బడుల్లో సైతం 20 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. వాటిలో కూడా విద్యార్థులు లేరనే నెపంతో మూసివేయరాదని.. ఒక్కో పాఠశాలలో 10శాతం విద్యార్థుల సంఖ్య(ఎన్రోల్మెంట్) చేయాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 534 ఉండగా.. మొత్తం 3,202 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నల్లమలలోనే అత్యధికంగా.. జిల్లాలో అత్యధికంగా నల్లమలలోనే పాఠశాలలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 67 స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ ఉండగా.. ఒక అచ్చంపేట మండలంలోనే 18 ఉన్నాయి. మండలంలో మొత్తం 52 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 18 బడుల్లో జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. దుబ్బుతండా, లింగనోనిపల్లి, దర్శన్గడ్డ, దేశ్యాతండా, ఒంకమూతితండా, ధన్యాలతండా, మర్లపాడుతండా, డొక్కుతండా పాఠశాలల్లో విద్యార్థులు లేని కారణంగా మూసివేసి.. 8మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు పంపించారు. చీన్యాతండా, కేశ్యాతండా, నక్కర్లపెంట, పద్మారం తండా, కొర్రతండా, లింగోటం తండా, చౌటపల్లి తండా, శంకరయ్యగుట్ట తండా, మైలకుంట తండా, బాల్యతండా పాఠశాలలు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు లేక మూతపడ్డాయి. ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26లో 75,347 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు 69,370 మంది విద్యార్థులు మాత్రమే నమోదయ్యారు. అంటే గతేడాది కంటే 5,977 మంది విద్యార్థులు తగ్గారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బడీడు పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో విద్యార్థులను చేర్పించడంలో ఉపాధ్యాయులు వెనకబడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే బాటలో మరో 122 బడులు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంలో విఫలం నానాటికీ సన్నగిల్లుతున్న సర్కారు విద్య ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటుచేశారు. జిల్లాలో గతేడాది 21 ప్రీ ప్రైమరీ బడులను ఏర్పాటుచేయగా.. ఈ ఏడాది ఏకంగా 77 పాఠశాలలను ఏర్పాటుచేశారు. దీంతో వాటి సంఖ్య 98కి చేరింది. ప్రీ ప్రైమరీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని అధికారులు భావిస్తున్నారు. -
త్వరలోనే నాలుగు పంపుల ద్వారా నీటి విడుదల
● ‘పాలమూరు’ ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి మొదటి లిస్టు ద్వారా నెల వ్యవధిలో పూర్తయిన నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మంగళవారం పంపుల విధివిధాలపై ఉన్నతాధికారులతో కంట్రోల్ బోర్డులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి పంపులో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందన్నారు. అన్నిరకాల సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం దాదాపు గంటపాటు నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రెండో పంపు డ్రైరన్ ప్రారంభిస్తామని, వారం రోజుల్లో రెండో పంపు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మోటార్లలో తలెత్తుతున్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ.. నాలుగు పంపుల నుంచి నెల వ్యవధిలో రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. కృష్ణానదికి నీళ్లు వచ్చే వరకు నాలుగు పంపులు సిద్ధం చేస్తామన్నారు. అలాగే ప్యాకేజీ–3లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఏదుల, వట్టెం, కర్వెనలో ఉన్న పంపులను సైతం సిద్ధం చేసి.. అన్ని రిజర్వాయర్లకు త్వరలో నీటిని తరలించాలని సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఈఈ లోకిలాల్, డీఈ ప్రవీణ్ తదితరులున్నారు. -
ప్రజా రంజక పాలనే ధ్యేయం
● రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం ● ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజోళి/ మల్దకల్: రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి మండలం జూలకల్లో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పచ్చర్ల, మేడికొండ గ్రామాల్లో నెలకొల్పిన 33/ 11కేవీ సబ్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతోపాటు, గట్టు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకు ముందు శాంతిగనర్లో ఏర్పాటు చేసన హెలీప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం డీడీలు చెల్లించిన రైతులందరికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసి అందజేస్తున్నామన్నారు. అలాగే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, 1.6 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయ డమే లక్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి కేకు కట్ చేశారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రశాఖ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 6 డీఏలు మంజూరు చేసి బకాయిలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పదో తరగతి ఇన్విజిలేషన్ పారితోషికాన్ని 40 శాతం పెంచాలని, ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో 40 శాతం కటాఫ్ మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్, నాయకులు నాగరాజు, రాజశేఖర్రావు, సురేష్, మల్లేష్, సురేఖరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే గ్రామీణాభివృద్ధికి పునాది
కందనూలు/ తాడూరు: సమాజంలో మహిళల ఆర్థి సాధికారతే గ్రామీణాభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర మైనార్టీ సంక్షమే శాఖ కార్యదర్శి, జిల్లా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక ప్రత్యేకాధికారి షఫియుల్లా అన్నారు. మంగళవారం ఆయన తాడూరు మండలంలోని ఐతోలు గ్రామంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామ నర్సరీ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కేంద్రం, మహిళా సంఘాల స్నేహ గ్రూపుల కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా షఫియుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి లబ్ధిదారు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. అలాగే అర్హులైన పత్రి కుటుంబానికి ఈ పథకం అందేలా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పిన, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలోని అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులతో సమీక్షించారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్, వైద్య బృందాల ఏర్పాటు, అగ్నిమాపక సిబ్బంది మొహరింపుపై పోలీస్, రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, అతిథుల స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, చిన్న లోటు కూడా ఉండకూడదు అని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి.జానకి, ఆర్డీఓ నవీన్, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. కొత్తకోటలో సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునితారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీధర్ తదితరులు పరిశీలించి.. అన్నిఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు. 1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
కందనూలు: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్సింగ్ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి.. అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావులేకుండా గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గ్రేవ్, నాన్– గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మ్యానువల్ రికార్డులు, సీసీటీఏఎస్ నమోదు మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు సాయి వెంకట్రెడ్డి, శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. యూనిఫాంలు సకాలంలో అందించాలి కందనూలు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు నాణ్యతతో కుట్టి.. సమయానికి అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి యూనిఫాంల కుట్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, కుట్టు విధానం, ఫినిషింగ్, బటన్లు, కాలర్లు, సైజులు తదితర అంశాల్లో ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కుట్టు పనులు పూర్తిచేసి.. వచ్చేనెల 15లోగా విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో వివిద కళాశాలల్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ, ఇంట్రిగేటెడ్ బీఈడీ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. బ్యాక్లాగ్ బీ ఫార్మసీ సెమిస్టర్–1లో 44.59, సెమిస్టర్–3లో 61.62, సెమిస్టర్–5లో 51.67, సెమిస్టర్–7లో 68.50, రెగ్యులర్ సెమిస్టర్–8లో 90.66 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఎం ఫార్మసీలో బ్యాక్లాగ్ సెమిస్టర్–1లో 66.67, సెమిస్టర్–3లో 75.00, రెగ్యులర్ 4వ సెమిస్టర్లో 94 శాతం ఉత్తీర్ణను నమోదు చేశారు. ఫార్మ్డీలో సెమిస్టర్–3లో 68, సెమిస్టర్–4లో 89 శాతం, 5వ సెమిస్టర్లో 86.67, 6వ సెమిస్టర్లో 95 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఇంటిగ్రేటెడ్ బీఏడ్లో 7వ సెమిస్టర్లో 84శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు. -
గడువులోగా కష్టమే.. సర్
ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటు లేనట్టే మా ఓటు ఊళ్లోనే ఉంచుకుంటాం.. ఇక్కడ అక్కర్లేదు.. అంటూ పట్టణాల్లో స్థిరపడిన వారు బీఎల్ఓలకు స్పష్టం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏదో ఒకచోట మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండాల్సి ఉండటంతో చాలామంది సొంతూళ్లనే ఎంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం సర్ ఫారాలు నింపేందుకు గ్రామాల బాట పట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయమని కూడా అడిగే వారే ఉండరని, ఊళ్లో అయితే మమల్ని వెతుక్కుంటూ వస్తారని అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు పల్లెలోనే ఉండాలంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధులు, నాయకులే ఇప్పిస్తారని, పట్టణాల్లో అయితే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. పట్టణంలో అన్నీ ఉన్నా ఓటు మాత్రం ఊళ్లోనే ఉండాలని పేర్కొంటున్నారు. అచ్చంపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు నింపి బీఎల్ఓలకు అందజేస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. లేదంటే ఓటరు లిస్టులో మీ పేరు కనిపించదు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫాం–6 ద్వారా ఆగస్టు, సెప్టెంబర్లో మళ్లీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. సర్లో భాగంగా ఇంటింటికి వెళ్లి వందశాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసినట్లు ఎన్నికల అధికారులకు పంపించిన నివేదిక పేర్కొంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. బీఎల్ఓలు ఇప్పటి వరకు 60 శాతం కూడా ఎన్యూమరేషన్ పత్రాలు సంబంధిత ఓటర్లకు అందజేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఎక్కువగా పట్టణాల్లో వినిపిస్తోంది. ఇల్లు మారిన ఓటర్లు చాలామంది పాత ఇళ్లకు చెందిన బీఎల్ఓల వద్దకు వెళ్లి పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే పత్రాలు అందాయి. ప్రతి ఇంటికి మూడు సార్లు తిరిగి పత్రాలు ఇస్తారనే నిబంధనలు బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఒక్కో బూత్కు సుమారు 800 నుంచి 1,200 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటికి ఇవ్వడంతోపాటు తిరిగి తీసుకుంటున్న పత్రాలు డిజిటలైజేషన్ చేయడంలో చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికితోడు సర్వర్ పనిచేయకపోవడం వంటి సమస్యలతో బీఎల్ఓలు సతమతమవుతున్నారు. ఎక్కువ సమయం ఇక్కడే వృథా అవుతున్నట్లు వారు వాపోతున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా గతనెల 25న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రారంభం కాగా.. ఈ నెల 24 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పల్లెల్లోనే ఓటు పదిలం.. ఈ నెల 24 వరకు ఫారాలు ఇవ్వాలని ఆదేశం ఎస్ఐఆర్కు 10 రోజుల సమయం జిల్లాలో చాలామందికి చేరని పత్రాలు సర్వర్ డౌన్తో సతమతమవుతున్న బీఎల్ఓలు -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన పేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్లో మెరుగుదల అవసరం -
రేపు ఉద్యోగమేళా
కందనూలు: జిల్లాలోని యువతీ, యువకులకు ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ బయో ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో 50 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తి గల 30 ఏళ్లలోపు నిరుద్యోగులు బుధవారం ఉదయం 10.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 76669 74704, 98854 62005లను సంప్రదించాలని కోరారు. నేడు స్పాట్ అడ్మిషన్లు కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మిగిలిన సీట్లకు 6వ తరగతి నుంచి 12 వరకు మంగళవారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేంద్రశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ సీట్లు ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఐటీడీఏ పీఓగా ఆర్డీఓ యాదగిరి మన్ననూర్: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా (పీఓ) డిప్యూటీ కలెక్టర్, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా ఈ స్థానంలో కలెక్టర్ బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ నిబంధనల ప్రకారం నిర్వహణ కొనసాగించడంతోపాటు ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఏఓ జాఫర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్ కందనూలు: ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సంలో ఆమె పాల్గొని చిన్నారులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో పిల్లలలో నులిపురుగులను నిర్మూలించి, పిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చన్నారు. పిల్లల్లో నులి పురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక, శారీరక ఎదుగుదల లోపం, కడుపు నొప్పి, తరచుగా అనారోగ్యానికి గురవడం వంటివి జరుగుతాయన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చదువులో మెరుగ్గా రాణిస్తారన్నారు. కాబట్టి జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. డీఎంహెచ్ఓ కృష్ణ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్ప్రబావాలు ఉండవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు నిస్సందేహంగా మాత్రలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సురేష్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, పాఠశాల జీహెచ్ఎం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ●అడ్డాకుల/రాజాపూర్: ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూలు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారుల అవస్థలు -
డీఈఓను సస్పెండ్ చేయాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రైవేట్కు కొమ్ముకాస్తున్న డీఈఓ రమేష్కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతోపాటు కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2024లో జిల్లాకేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ, డీఈఓలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అచ్చంపేటలోని ఓ పాఠశాలపై బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా, కమిషన్ విచారణ చేయాలని డీఈఓను ఆదేశించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పలు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై సమాచారం అందించినా ‘అమ్ముకోవచ్చు’ అనే సమాధానం ఇవ్వడం విచారకరమన్నారు. తమ సమస్యలను వివరించేందుకు డీఈఓను కలవడానికి వెళ్లిన సిబ్బందితో మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తూ, ‘ఏమైనా ఉంటే ఇన్వార్డులో ఇచ్చి వెళ్లండి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై వచ్చిన అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు
● సత్వర పరిష్కారానికి కృషిచేయాలి ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచన ● ప్రజావాణి కార్యక్రమానికి 71 వినతులు కందనూలు: ప్రజావాణిలో అందించే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 71 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో శాఖలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల సంఖ్యను పరిశీలించి.. ఆలస్యానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహాలపై సమీక్ష ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో శాఖ అధికారి తప్పనిసరిగా ఒక వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. భవనాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, సిబ్బంది కొరత, భద్రత వంటి అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారు. సమీక్ష సందర్భంగా ఇటీవల వివిధ వసతి గృహాలను పరిశీలించిన అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు అందజేశారు. అమ్రాబాద్ ఎస్సీ బాలుర వసతి గృహంలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదని, విద్యార్థుల కమిటీ ఇంకా ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. ఊర్కొండ వసతి గృహంలో గతంలో 33 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం కేవలం 8 మంది మాత్రమే చేరారని, దీనికి ప్రహరీ లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, పాముల బెడద వంటి సమస్యలు ప్రధాన కారణాలు అని అధికారులు వివరించారు. ఈ నివేదికలను పరిశీలించిన కలెక్టర్ క్షేత్రస్థా యి తనిఖీల ద్వారా సమస్యలను గుర్తించడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను కూ డా రూపొందించవచ్చన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అధికారులు నిరంత రం పర్యవేక్షణ కొనసాగించి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
జిల్లా పరిధిలో ఇలా..
●యూనిఫాంలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. వస్త్రం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వస్త్రం వచ్చిన వెంటనే కొలతలు తీసుకొని కుట్టడానికి ఇస్తాం. ఆ తర్వాత విద్యార్థులకు అందజేస్తాం. – రమేష్కుమార్, డీఈఓ మా పాఠశాలలో యూనిఫాంలు ఇవ్వకపోవడంతో సివిల్ డ్రెస్తోనే వస్తున్నా. పై నుంచి ఇంకా డ్రెస్సులు రాలేదని చె బుతున్నారు. కొంతమంది విద్యార్థులు పాత యూనిఫాంలతో, మరికొంత మంది సివిల్ డ్రెస్లో వస్తున్నారు. – యుగేంధర్, 10వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్కర్నూల్ గతేడాది ఇచ్చిన యూనిఫాం చిరిగిపోయింది. ఈ ఏడాదికి సంబంధించిన డ్రెస్సులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని సారోళ్లను అడిగితే మాకు తెలియదు అని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూనిఫాంలు త్వరగా ఇస్తే బాగుంటుంది. – రమేష్, 7వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్కర్నూల్ కందనూలు: పాఠశాలల పునఃప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఫలించలేకపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా దుస్తులు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు సంఘాలకు వస్త్రమే చేరలేదు. దీంతో జిల్లాలోని చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాత యూనిఫాంలు, సివిల్ దుస్తులతోనే హాజరవుతున్నారు. డిజైన్లో మార్పులు.. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల రంగు, డిజైన్లో ప్రభుత్వం మార్పులు చేసింది. బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్, బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలం రంగు నిక్కర్ లేదా ప్యాంటు తరగతుల వారిగా అందించనుంది. కొత్త డిజైన్ ఖరారైన క్లాత్ సరఫరా లేకపోవడంతో అవి విద్యార్థులకు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే వస్తుంటారు. అలాంటి సమయంలో విద్యార్థులకు సరైన సివిల్ డ్రెస్సులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలు తెరిచిన రోజునే రావాల్సిన యూనిఫాం ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫాంల విషయంలో అధికారులు సైతం అలసత్వం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా త్వరగా యూనిఫాంలు సరఫరా చేయా లని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికీ జిల్లాకు చేరని వస్త్రం.. డ్రెస్సులు కుట్టేదెప్పుడో? కొత్త దుస్తుల పంపిణీపై చలనం లేని యంత్రాంగం పాత దుస్తులతోనే సరిపెట్టుకుంటున్న విద్యార్థులు మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి -
ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాం..
బాలానగర్లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్రెడ్డి, వాహనదారు బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్ -
కొడుకులు అన్నం పెడ్తలేరు..
నాకు మగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. నా భర్త పేరు మీద 22 ఎకరాల పొలం ఉంది. 21 ఎకరాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. నా భర్త చనిపోయాడు. కొన్నేళ్ల నుంచి కూలీ పని చేసుకొని వచ్చిన డబ్బులతో బతికిన. ఇప్పుడు చేతకావడం లేదు. నా ముగ్గురు కొడుకులు అన్నం పెడ్తలేరు. ప్రస్తుతం నేను మా గ్రామంలోని వేరే వాళ్ల పాత ఇంట్లో ఉంటున్నా. కలెక్టర్ సారు నాకు న్యాయం చేయాలి. – మందుల సాయమ్మ, పల్కపల్లి గ్రామం, అచ్చంపేట మండలం ● -
వెట్రన్కు అడుగులు
‘పాలమూరు’లోని మొదటి పంపును పరీక్షించిన అధికారులు ● నేడు ఎల్లూరు పంపుహౌజ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ● నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు ● సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు ● మరోవైపు.. ఇంకా అసంపూర్తిగానే కాల్వలు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్హౌజ్ను పరిశీలించి సోమవారం వెట్రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్ 3న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్ చేపట్టగా.. పంపు మోటార్ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ను ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్కు చర్యలు మొదలయ్యాయి. ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 4 పాలమూరు పంప్హౌజ్లో ఏర్పాటు చేయాల్సిన మోటార్లు 8నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఒక మోటార్ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు రాజకీయ దుమారం.. గత మే, జూన్ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్ఎస్కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు. తాజాగా సీఎం ఆదేశాలతో.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్ రిజర్వాయర్ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అసంపూర్తి పనులతో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్హౌజ్ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
నాలుగు మోటార్లు బిగింపు
ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
రాజకీయాల్లో హుందాతనం కరువైంది
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వనపర్తి రూరల్: నేటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన హుందాతనం కనబడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మూడురోజులుగా జరిగిన ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ ముఖఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకున్న హోదాను మరిచి ఇష్టానుసారంగా తిట్టుకోవడం, అసభ్యంగా విమర్శించుకోవడంతో రాజకీయ విలువలు పూర్తిగా దిగజారే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని జల విధానంపై రాజకీయ విధానాలు కాదని.. జల నిపుణుల విధానం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం కేటాయించాలని కొన్నిరోజులుగా సీపీఐ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ తదితర పట్టణాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూలుస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా అవసరాలు, వారి సమస్యలపై దృష్టి సారించకుండా మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు ఆ దేవుడి సొమ్మును చోరీ చేసిన దొంగలను పట్టుకునే విషయంలో ప్రధాని నోరు విప్పడం లేదని విమర్శించారు. ఒక్కరోజు కూడా అధికారంలో లేకున్నా వందేళ్లు ఒక రాజకీయ పార్టీ సజీవంగా ఉండటం అద్భుతమని.. ఏనాటికై నా దేశంలో అంతిమ విజయం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించే ప్రయాణంలో కూడా చివరి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలని అన్ని జిల్లాల సమితి సభ్యులు, మండల కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు ఎన్ఎండీ ఫయాజ్, ఆంజనేయులు, విజయరాములు, బాలకిషన్, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ, పట్టణ కార్యదర్శి రమేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు ,మహేష్, మోషా, ఎండీ కుతుబ్, సీఎస్ శెట్టి, లక్ష్మీనారాయణ, గోపాల్, ఈర్ల చంద్రమౌళి పాల్గొన్నారు. -
రైతుభరోసా @ రూ.375.99కోట్లు
మండలం మొత్తం అందాల్సిన సాయం భరోసా జమ అయిన నిధులు రైతులు (రూ.కోట్లలో) అందిన రైతులు (రూ.కోట్లలో) అచ్చంపేట 20,097 26.45 18,300 23.21 అమ్రాబాద్ 9,381 12.54 8,851 11.66 బల్మూర్ 18,022 23.19 16,196 20.62 లింగాల 13,670 19.64 12,198 18.96 పదర 6,622 10.27 6,278 9.63 ఉప్పునుంతల 18,986 27.62 17,427 23.43 వంగూరు 18,882 29.11 16,467 23,27 చారకొండ 9,910 13.51 8,767 11.27 కల్వకుర్తి 23,410 33.61 19,475 26.27 ఊర్కొండ 12,593 18.51 10,943 14.83 వెల్దండ 20,545 26.02 17,000 20.70 కోడేరు 14,836 16.49 12,992 14.61 కొల్లాపూర్ 17,273 17.99 15,279 16.05 పెద్దకొత్తపల్లి 25,180 27.07 22,184 24.09 పెంట్లవెల్లి 5,742 6.81 5,219 5.90 బిజినేపల్లి 27,082 27.56 23,938 24.15 నాగర్కరూ్న్ల్ 23,005 26.30 19,878 22.82 తాడూరు 18,366 25.61 15,848 21.42 తెలకపల్లి 21,298 29.07 18,703 25.49 తిమ్మాజిపేట 8,704 23.51 16,114 19.52 అచ్చంపేట: వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకంతో జిల్లావ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నాటికి 3,02,057 మంది రైతులకు రూ. 375.99కోట్ల మేర పెట్టుబడి సాయం అందింది. పదెకరాల భూమి కలిగి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. రైతులకు ఆర్థికఊరట.. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో జిల్లా రైతులకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించింది. వానాకాలం సాగు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు ఈ సాయాన్ని వినియోగించుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల రైతులకు వానాకాలం సాగు పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3,43,604 మంది రైతులు.. జిల్లాలో మొత్తం 3,43,604 మంది రైతులు ఉండగా.. రూ. 440.87కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. అయితే జిల్లాలో 3,22,486 మంది రైతులకు సంబంఽధించి బ్యాంకు ఖాతాల వివరాలు ఆప్డేట్ చేసి ఉన్నాయి. వీరి ఖాతాలో రూ. 427.78కోట్ల జమ కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3,02,057 మంది రైతుల ఖాతాల్లో రూ. 375.99కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. మండలాల వారీగా విడుదలైన రైతుభరోసా నిధులు ఇలా.. పదెకరాల వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో 3,02,057మంది రైతులకు లబ్ధి వానాకాలం సాగులో అన్నదాతల నిమగ్నం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి.. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 10 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమయ్యాయి. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలి. ఏమైనా సాంకేతిక సమస్యలు, ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. కొత్త పట్టదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు సైతం ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని పొందవచ్చు. – చంద్రశేఖర్, డీఏఓ -
రేపు అప్రెంటిస్షిప్ మేళా
కందనూలు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ నెల 14న వృత్తివిద్య కోర్సుల అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94929 92047 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాకు మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు కందనూలు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 3కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర సమావేశాలకు సరైన వేదిక లేక ప్రజలు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి.. మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మల్టీపర్పస్ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలు, అధికారులు, సాంస్కృతిక కళాకారులకు చక్కటి వేదిక లభిస్తుందన్నారు. తమ అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరుచేసిన మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రేపు కళాశాలల బంద్ కందనూలు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 14వ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ చేపడుతున్నట్లు జిల్లా కన్వీనర్ శాంతన్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో లక్షలాది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరుతో ఒత్తిడి తీసుకొస్తున్నాయని.. పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని.. విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి శివ, జీవన్, విష్ణు, శివ ఉన్నారు. నేడు మంత్రుల పర్యటన జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో సోమవారం ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ఫేజ్–1 కింద చేపట్టనున్న నాలుగు ప్యాకేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్లో రూ.573 కోట్లతో మహబూబ్నగర్–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని గద్వాల– రాయచూర్ రహదారిపై రూ.339.39 కోట్లతో మహబూబ్నగర్–2 ప్యాకేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం వనపర్తిలోని జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి–2 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లూరు వద్ద కొల్లాపూర్– మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. – వివరాలు 9లో.. బీటీరోడ్లు పూర్తయ్యేనా? ఏడాదిగా నత్తనడకన సాగుతున్న పనులు నిర్మాణాల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు -
ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలి
వెల్దండ: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం మొదలైనప్పటికీ పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చేపట్టాలని అన్నారు. యూరియా బుకింగ్ యాప్తో రైతులు అవస్థలు పడుతున్నారని.. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, శేఖర్ ముదిరాజ్, హన్మంత్, సాజ్యనాయక్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం
వంగూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించి.. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఏర్పడిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వెంకటేశ్ అన్నారు. వంగూరులో ఆదివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ.. కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. నేడు యువత జీవితాల్లో మట్టికొడుతున్నారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ప్రకృతి సంపద పరిరక్షణే లక్ష్యం
కొల్లాపూర్ రూరల్: ప్రకృతి సంపదకు ఎలాంటి హాని కలగకుండా పర్యాటకాభివృద్ధి చేపట్టాలని.. అటవీ సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వు నూతన ఫీల్డ్ డైరెక్టర్ ఎస్వీ ప్రసాద్ అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సోమశిల ఎకో పార్కును పరిశీలించారు. కృష్ణానది అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొల్లాపూర్లో అటవీశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అడవులను కొట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేంజర్ వాణికుమారిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూ టీ రేంజ్ అధికారులు కాశన్న, ముజీబ్ ఘోరీ, బయన్న, నీలేష్ మతీన్, దినేష్ ఉన్నారు. -
మొలకలు వస్తలేవు..
నేను ఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినాను. ఏదో ప్రభావంతో వర్షాలు రావడం లేదని అందరూ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా. ఎంతైనా వర్షాలు కురిస్తేనే అంతా బాగుంటుంది. – చంద్రయ్య, తిమ్మాయిపల్లి, చారకొండ ఎల్నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రైతులు తక్కువ వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంది, మినుము, ఉలవలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలు సాగు చేసుకోవాలి. కాల్వ నీటిపై ఆధారపడే రైతులు వరినాట్లు, నర్సరీలు వేయడం మానుకోవాలి. ఆగస్టు 15 వరకు కాల్వ నీరు అందుబాటులో ఉండదు. ఎల్నినోపై రైతులను చైతన్యపరచడంతోపాటు సాగు చేసే పంటలపై గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
అగ్నివీరులు..!
దేశ రక్షణకు యువత ముందడుగు ● 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక ● యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ ● 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ● ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తున్నారు. అప్పటి కలెక్టర్ స్ఫూర్తితో.. 2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి సంస్థను ఏర్పాటు చేసి.. -
జీవిత లక్ష్య సాధనకు విధ్యే మార్గం
కల్వకుర్తి టౌన్: విద్యార్థులు డిగ్రీతోనే తమ ప్రయాణం ముగిసిందని భావించకుండా.. నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహబూబ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమన్నారు. కళాశాలలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలని, ఉన్నత స్థానాలకు చేరుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేసే యువతకు భవిష్యత్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని డీఎస్పీ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పట్టుదలతో చేరాను..
మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు గ్రామం, మదనాపురం శిక్షణ ఉపయోగపడింది.. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసు కుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం ● -
ఉమామహేశ్వరంలో హైకోర్టు జడ్జి పూజలు
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం హైకోర్టు జడ్జి శరత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయం వద్ద ఆయన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో గణపతి పూజ, కుంకుమార్చన, స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో జడ్జి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శనేశ్వరుడికి అభిషేకాలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేకాలు జరిపించినట్లు అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. పూజారి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. సింహవాహనంపై వెంకన్న ఊరేగింపు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం శివాలయంలో సుప్రభాతసేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చనలు, వేదపారాయణం, సుబ్రహ్మణ్య నవగ్రహ మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతికి చెందిన కళాకారులచే భరతనృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింహవాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు.వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్ (అగ్నిపథ్)లోకి పంపించేందుకు ఫిజికల్, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్, గబ్బర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకులను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ చైతన్యం చేస్తున్నారు. -
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ మీట్కుగాను సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 పోటీలకు 18.07.2012–17.07.2014 మధ్య జన్మించిన బాలబాలికలు, అండర్–16 పోటీలకు 18.07.2010–17.07.2012 మధ్య జన్మించిన వారు, అండర్–18 పోటీలకు 18.07.2008–17.07.2010 మధ్య జన్మించిన వారు, అండర్–20 పోటీలకు 18.07.2006 – 17.07.2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అండర్–14లో 600 మీటర్లు, ట్రయోత్లోన్–ఏ,బీ,సీ, అండర్–16లో వెయ్యి, 2 వేల మీటర్లు, అండర్–18లో 800, 1,500, 3 వేల మీటర్లు, అండర్–20లో 800, 1,500, 5 వేలు, 10 వేల మీటర్లు, ఉమెన్ ఆండ్ మెన్ కేటగిరీలో 800, 1,500, 3 వేలు (ఉమెన్), 5 వేల మీటర్లు (మెన్ ), 10 వేల మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియం గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు. -
ప్రగతి పోర్టల్లో విద్యాశాఖ వివరాలు
కందనూలు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి పోర్టల్లో జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం వివరాలను నిర్దేశిత విధానంలో నమోదు చేసి ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో విద్యాశాఖపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద జిల్లాలో కొనసాగుతున్న పాఠశాల భవనాల నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ వసతులు, ప్రహరీలు, మరమ్మతు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. చేపట్టిన ప్రతి పనిని నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం పూర్తి చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రగతి పోర్టల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపే సమాచారం కచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఆహార నిల్వ విధానం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని డీఈఓ రమేష్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో విద్యా శాఖ అధికారులు వెంకటయ్య, నూరుద్దీన్, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ కోసం కుటుంబ నియంత్రణ పాటిద్దాం
కందనూలు: సుస్థిరమైన భవిష్యత్ కోసం కుటుంబ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పునరుత్పత్తి, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, యువత సాధికారతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల వలన సహజ వనరులపై ఒత్తిడి పెరిగి.. ఆహారం, నీరు, నివాస స్థలాలు, విద్య, వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, నిరుద్యోగం, పేదరికం పెరగడంతోపాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అధునాతన శాశ్వత, తాత్కాలిక కుటుంబం నియంత్రణ పద్ధతులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దంపతులు ప్రతి బిడ్డకు కనీసం మూడేళ్ల గ్యాప్ తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్పీవీ తప్పనిసరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా తప్పనిసరి వాడాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలికల గురుకులంలో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14–15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో రక్షణ ఇస్తుందని, వీటితో పలు రకాల ఆరోగ్య రుగ్మతలు దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో డీఐఓ సురేష్బాబు, రాజగోపాలాచారి పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
● ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. స్వంత ఆర్థిక వనరులను పెంపొందించుకొని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ–2026) రూపకల్పనపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి లక్ష్యాలను గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావడం అత్యంత అవసరమన్నారు. ప్రతి జీపీలో శాశ్వత ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు ఈ నెల 24వ తేదీలోగా పూర్తయ్యేలా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ పాలనకు సర్పంచులే కేంద్ర బిందువని అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, యువత అభ్యున్నతి, వ్యవసాయాభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఏఓ చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, మిషన్ భగీరథ ఈఈ శ్రీదేవి ఉన్నారు. ● సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్తో కలిసి వీసీ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేసిన డేటా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను సరిచూసుకొని ఈ నెల 24వ తేదీలోగా డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా.. అనర్హులు జాబితాలోకి చేరకుండా క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ అరుణరెడ్డి, ఆర్డీఓలు అర్చన, బన్సీలాల్, యాదగిరి ఉన్నారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
కందనూలు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన 241 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో రమణారావు, తీగల సునేంద్ర పాల్గొన్నారు. మహిళల భద్రతషీటీం బాధ్యత కల్వకుర్తి టౌన్: మహిళల భద్రత షీ టీం బాధ్యత అని జిల్లా షీ టీం ఇన్చార్జి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మహిళా చట్టాలు, మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం తమ ఆటపాటలతో వివిధ సామాజిక అంశాలను వివరించారు. సీసీఎస్ సీఐ శంకర్, కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్, ఎస్ఐ కురుమూర్తి పాల్గొన్నారు. పీజీ సెంటర్లోసమస్యలు పరిష్కరిస్తాం కొల్లాపూర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొల్లాపూర్ పీజీ సెంటర్లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రిజిస్ట్రార్ రమేష్బాబుతో కలిసి ఆయన కొల్లాపూర్ పీజీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సెంటర్లో నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం బాలికల, బాలుర వసతి గృహలను, వసతులు, భోజనం పరిశీలించారు. ప్రొఫెసర్లతో కొంతసేపు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని, హాజరు శాతం తక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల సెంటర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైభవంగా వార్షికబ్రహ్మోత్సవాలు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం వేద పారాయణాలు, మూలమంత్ర అనుష్టానాలు, స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన కళాకారులు వాద్య సంగీత కచేరీ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. గోవిందనామంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని చాటింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించాల్సిందే
2022–23 యాసంగి సీఎంఆర్పై ప్రభుత్వం అల్టిమేటం! 1,61,009 మె.ట. ధాన్యం కేటాయింపు.. జిల్లావ్యాప్తంగా 72 రైస్మిల్లులు, 11 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. 2022–23 యాసంగి సీజన్లో పండిన వరిధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. దాదాపు 1,61,009 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించింది. వీటిని సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. వీటిలో కొందరు రైస్మిల్లర్లు 18,960 మెట్రిక్ టన్నులను మరాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించారు. 22,047 మెట్రిక్ టన్నుల ధాన్యానికి వేలం వేశారు. ఇంకా దాదాపు 1,11,395 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. ఆ ధాన్యం విలువను ప్రభుత్వం రూ. 250కోట్లుగా లెక్కించింది. వచ్చేనెల 8తో గడువు ముగింపు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం విధించిన 90రోజుల గడువు వచ్చేనెల ఆగస్టు 8తో ముగుస్తుంది. ఇటీవల జిల్లాకేంద్రంలో విజిలెన్స్ డీఎస్పీ నేతృత్వంలో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో గడవులోగా బకాయి ఉన్న 79 రైస్మిల్లర్లు రూ. 250కోట్లు చెల్లించాలని.. లేనిచో మిల్లులపై ఉన్న బకాయికి 25శాతం అదనంగా చెల్లించడంతో పాటు 12శాతం వడ్డీ సైతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించారు. కల్వకుర్తి: 2022– 23 యాసంగి సీజన్లో ప్రభుత్వం నుంచి రైస్మిల్లర్లు తీసుకున్న వరిధాన్యం పంచాయితీ తెగడం లేదు. మిల్లర్లు బకాయిపడిన సీఎంఆర్ మొత్తం అందించాలని.. లేదా తీసుకున్న ధాన్యం తిరిగివ్వాలని.. అదీ కుదరకపోతే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు గత మే 8న 90 రోజుల నిర్దిష్ట గడువు విధించింది. అప్పటిలోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మిల్లర్లు బకాయి సీఎంఆర్కు బదులు డబ్బులను చెల్లించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు అప్పట్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని అందించారని.. బియ్యం సక్రమంగా రావని.. క్వింటా రేటు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం తీసుకున్న రైస్మిల్లులు 83 ఉండగా.. మూడు మిల్లుల యాజమాన్యం కొంత ధాన్యం చెల్లించడంతో పాటు డబ్బులు చెల్లించి, క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. మిగతా 79 మిల్లులపై రూ. 250కోట్ల బకాయి ఉంది. కొన్ని మిల్లులకు రూ. 10లక్షలలోపు ఉండగా.. మరికొన్నింటికి రూ.కోటి నుంచి రూ. 7కోట్ల వరకు బకాయి ఉన్నాయి. ఇక కొన్ని పారాబాయిల్డ్ మిల్లులు రూ. 13కోట్ల నుంచి రూ. 23.54 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఎనిమిది మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాజయ్య తెలిపారు. మరో నాలుగు మిల్లులపై సైతం కేసులు చేయాల్సి ఉందన్నారు. 36 మిల్లులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైస్మిల్లర్లకు నోటీసులు మొత్తం రూ. 250కోట్లు చెల్లించాలని ఆదేశం వచ్చేనెల 8వరకు గడువు 8 మిల్లులపై కేసులు.. -
అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ రామ మందిరంతో పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి రూ.కోట్లు కొల్లగొడుతున్నా.. ప్రధాని మోదీ నేటికీ పెదవి ఇప్పకపోవడం సరైందికాదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులెవరికీ ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవని ఆరోపించారు. కార్యక్రమంలో విజయరాములు, బాలకిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యం : ఎస్పీ
కోడేరు: శాంతిభద్రల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. శుక్రవారం కోడేరు పోలీస్స్టేషన్లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేసులో పారదర్శక విచారణ జరిపి.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా స్థానిక రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్ఐ వేణుగోపాల్కు సూచించారు. గ్రామస్థాయిలో విధులు నిర్వహించే విలేజ్ పోలీసు ఆఫీసర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారంలో తమవంతు పాత్ర పోషించాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ శంకర్నాయక్ ఉన్నారు. -
మత్స్యకారుల అభ్యున్నతికి కృషి
కొల్లాపూర్ రూరల్: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో పర్యటించిన ఆయన మత్స్యకారులు ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం చెరువు పరిసరాల్లో గుడి నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. త్వరలో గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని, సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమిడిశెట్టి వెంకటస్వామి, నాయకులు రామచంద్రారెడ్డి, రామస్వామి తదితర నాయకులు పాల్గోన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మన్ననూర్: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రాజబాబుతో కలిసి మన్ననూర్ పీవీటీజీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదులు, వాటర్ట్యాంకు, డార్మెంటరీ, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. పాఠశాల నిర్వహణలో మార్పు రావాలని.. లేనిచో కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. వారి వెంట ప్రిన్సిపల్ పద్మావతి, సర్పంచ్ మంజుల, రాజారాం, ఉపసర్పంచ్ రమణగౌడ్ ఉన్నారు. -
జూరాల.. వెలవెల
●ఏం తోచడం లేదు.. నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షా లు లేక డ్యాంకు నీరు రాలే దని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు. – సాయన్న, రైతు, ధరూరు ఆరుతడి పంటలు వేసుకోవాలి.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి. వరిపంట వేసుకుని ఇబ్బందులు పడొద్దు. కాల నుగుణంగా పంటలు సాగుచేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. – వీరప్ప డీఏఓ, సంజీవ్ప్రసాద్ ఇరిగేషన్శాఖ డీఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. 10లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఆందోళనలో ఆయకట్టుదారులు.. జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి. ప్రియర్శిని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం జలకళ తప్పిన జలాశయం వర్షాకాలం మొదలైనా కనిపించని వరద గతేడాది మే చివరినాటికే జూరాలలో జలకళ గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు గడ్డు పరిస్థితి.. జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది. జలాశయంలో 5.52 టీఎంసీలు.. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు. -
బాలలపై లైంగిక వేధింపులు అరికట్టాలి : ఎస్పీ
కందనూలు: బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విద్యాశాఖ, షీటీం, భరోసా, చైల్డ్ అండ్ వెల్ఫేర్, లేబర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని సురక్షిత బాల్యాన్ని సమాజానికి అందించాలని పేర్కొన్నారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకం వాల్పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీసీఎస్ఐ శంకర్, డీసీఆర్బీ ఎస్ఐ రమేష్, భరోసా ఎస్ఐ రజిత తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పూర్ణిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు htt ps://navodaya.gov.in వెబ్సైట్లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి కందనూలు: ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించే వామపక్షాల బంద్ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తారాసింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బందు వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందని, స్వయంగా సీఎం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్లడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శివప్రసాద్, హేమంత్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు. 14న అప్రెంటిస్షిప్ మేళా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు (2024, 2025, 2026 విద్యా సంవత్సరం)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14న అప్రెంటిస్షిప్ మేళా ఉంటుందని మేళా కో–కన్వీనర్ ఎం.జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మేళాలో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఆస్పత్రులు, సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు జిరాక్స్లతో పాటు పాస్పోర్టు సైజ్ ఫొటోలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలమూరు వెంకన్నబ్రహ్మోత్సవాలు ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్సాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు. -
రోడ్ల పరుగులు
పాలమూరులో వనపర్తి– జడ్చర్ల ప్రధాన రహదారిలో బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు. మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరించేందుకు టెండర్లు ఆహ్వానించారు. బల్మూర్– నాగర్కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు. అచ్చంపేట– రాకొండ రహదారిలో ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ మేర రెండు వరుసలుగా నిర్మిస్తారు. అమ్రాబాద్– మద్దిమడుగు రహదారిలో పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు. పెంట్లవెల్లి ఎక్స్రోడ్డు నుంచి వనపర్తి మార్గంలో కొండూరు, తూంకుంట మీదుగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరించనున్నారు. కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్గా విస్తరించనున్నారు. వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 8 కి.మీ., దేవరకద్ర నియోజకవర్గంలో 8 నుంచి 27 కి.మీ., రోడ్డును బీటీగా మారుస్తారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలో వనపర్తి– ఆత్మకూర్ రోడ్డులోని 27.కి.మీ నుంచి 31 కి.మీ., వరకు, ఆత్మకూర్– మర్రికల్ రోడ్డు 13.40 కి.మీ., విస్తరిస్తారు. అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారులను హ్యామ్ పద్ధతిలో విస్తరించనున్నారు. మహబూబ్నగర్– నవాబ్పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరిచి.. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని ఆశిస్తున్నారు. అచ్చంపేట: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా.. మౌలిక సదుపాయాలు కావాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా.. మెరుగైన రోడ్డు, రవాణా సదుపాయాలు ఉండాలి. ఈ మేరకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.912.67 కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు ఆహ్వానించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.697.77 కోట్లు కేటాయించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు. బిల్లులకు ఇబ్బందులు లేకుండా ఆర్బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. హ్యామ్ రోడ్లలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం -
నేడు చేనేత సహకార సంఘాల ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు. -
సరికొత్తగా పత్తి సాగు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ● రైతులకు ప్రోత్సాహకం కోసం ఉచితంగా విత్తనాల పంపిణీ ● జిల్లాలో 6,130 హెక్టార్లలో సాగుకు 72 వేల పాకెట్లు అందజేత ● పథకం అమలు కోసం రూ.9.46 కోట్లు కేటాయింపు కల్వకుర్తి: పత్తి పంట దిగుబడిని పెంచి రైతుకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకవచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకం అమలు చేస్తున్నారు. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లపాటు పథకాన్ని అమలు చేసి రైతుల్లో సాగు విధానంలో సరికొత్త పద్ధతులపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలున్నా యి. ప్రస్తుత సాగు విధానంతో ఎకరాకు 6– 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుంది. కొత్త సాగు విధానాలతో మొక్కల పెంపకం అధికంగా చేస్తే దిగుబడి అధికమవడంతోపాటు రెండో పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వ్యవసాయాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో నాలుగేళ్లపాటు.. జిల్లాలో ఈ ఏడాది పథకం అమలు కోసం రూ.9.46 కోట్లు కేటాయించారు. ఈ విధంగా మరో నాలుగేళ్లపాటు (2031 వరకు) పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొల్లాపూర్ డివిజన్ మినహాయించి మిగతా 16 మండలాల్లో 6,130 హెక్టార్లలో ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా పత్తి పాకెట్లు అందించి కొత్త పద్ధతుల్లో సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం 72 వేల పత్తి పాకెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఏఈఓలు రైతు వేదికల్లో రైతులకు పత్తి పాకెట్లు దాదాపుగా అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైతులు పత్తి సాగు విధానం వల్ల కేవలం ఎకరానికి 6–7 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనా. విత్తు విత్తే విధానం వల్ల కేవలం హెక్టారుకు 15– 20 వేల మొక్కలు మాత్రమే వస్తాయి. దీంతో దిగుబడి తక్కువ రావడంతోపాటు మూడు, నాలుగు పర్యాయాలు పంటను తీస్తారు. ఫలితంగా దిగుబడి తక్కువతోపాటు రెండో పాటు వేరుశనగ, మొక్క జొన్న ఇతరత్రా పంటలు వేసుకోవడానికి ఆలస్యమవుతుంది. అధిక సాంధ్రత పద్ధతి (హెచ్డీపీఎస్)లో 90:15 సెం.మి., విధానంలో విత్తనాలు విత్తాలి. ఇందుకు ఎకరానికి ఆరుపాకెట్లు అవసరమవుతాయి. హెక్టారుకు దాదాపు 74 వేల మొక్కలు పెరుగుతాయి. క్లోజర్ స్పేసింగ్ (సిఎస్) పద్ధతిలో 90:30 సెం.మి., నాలుగు పాకెట్ల విత్తనాలు సరిపోతాయి. హెక్టారుకు 37 వేల మొక్కలు వస్తాయి. మొక్కలు అధికంగా ఉండటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఎకరానికి 12–14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా. ఈ కొత్త విధానం వల్ల ఒకేసారి పత్తి దిగుబడి వస్తుంది. పంట తీయడానికి సులువుగా ఉండటంతోపాటు పంటకాలం ఒకేసారి ముగిసిపోతుంది. దీంతో రైతులు సకాలంలో రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
కొల్లాపూర్ రూరల్: రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని సోమశిలలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి గ్రామాలకు చెందిన రైతుల భూ సమస్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతుల సమక్షంలోనే ఒక్కో సమస్యను పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి చెందిన రైతులను విడివిడిగా పిలిపించి వారి సమస్యలను మంత్రి స్వయంగా ఆలకించారు. ప్రతి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అటవీ శాఖ నిబంధనలతో, మరికొన్ని రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో, ఇంకొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్ల వివాదాల వల్ల రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతు భూమి రైతుకు జీవనాధారం అని, అలాంటి భూములకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కాబట్టి వారిని కార్యాలయాల చుట్టూ తిరిగించుకోకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్లు, పాత పట్టాలు, సర్వే నంబర్లు, హద్దులు, సరిహద్దుల వివరాలు అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రేవంత్చంద్ర, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాల నిర్వహణ, కల్పిస్తున్న సౌకర్యాలు, హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలుచేయాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలిపారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఉప్పునుంతల మండలం తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన టై, బెల్టులను పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. డీఈఓ వెంట ఎంఈఓలు శంకర్ నాయ క్, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ అలివేలమ్మ, కేజీబీవీ ఎస్ఓ రమాదేవి, హెచ్ఎం రామస్వామి ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
అమ్రాబాద్: మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ గోపాల్నాయక్ సూచించారు. మంగళవారం అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మాధవానిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో పీడీ మాట్లాడారు. దశల వారీగా ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు అందుతున్నాయని.. లబ్ధిదారులు గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. అదే విధంగా రెండో విడత ఇళ్ల మంజూరుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీఈ హరినాయక్, ఎంపీడీఓ రామన్న, ఏఈ కృష్ణ ఉన్నారు. నూనె గింజల సాగుతో అధిక లాభాలు మన్ననూర్: నూనె గింజల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డా.సురేశ్ అన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మన్ననూర్ రైతువేదికలో నూనె గింజల పంటలపై ఆదివాసీ గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ మండలంలో రైతులు సాగుచేస్తున్న పంటలు, ఆశిస్తున్న లాభాలు తదితర వివరాలను తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, నూగు లు, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతు లకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వాణిజ్య పంటలకు ఏమాత్రం తీసిపోకుండా నూనె గింజల సాగుతో లాభాలు వస్తాయని తెలిపారు. నూనె గింజల సాగుకు అవసరమైన విత్తనాలను సంస్థ తరఫున అందిస్తామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ మహేశ్రెడ్డి, సర్పంచ్ మంజుల, రాజారాం, ఎంఏ రహీం, రమణ గౌడ్, హన్మంత్రెడ్డి, ఏఈఓ దేవి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మన్ననూర్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మన్ననూర్లోని ఐటీఐ, ఏటీసీల్లో శిక్షణ కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోపా, డ్రాప్ట్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటర్ మెకానిక్ ట్రేడ్లతో పాటు ఏటీసీలోని పలు కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 61013 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం తగదు
కొల్లాపూర్: ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో విలేకర్లతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి రెవెన్యూ శివారు పరిధిలోని పోడుభూముల సమస్యను మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. సురభి రాజవంశస్థులకు చెందిన భూములపై సీలింగ్ యాక్టును అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడుభూములు సాగుచేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించిందని.. ఇప్పుడు వాటిని భర్తీచేయకుండా కేవలం 5వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ప్రకటించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎంతో పాటు మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి యూసూఫ్, జంగం శివుడు, రామకృష్ణ, రాజు తదితరులు ఉన్నారు. -
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
కల్వకుర్తి/కందనూలు: జిల్లాలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎకై ్సజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. మొదట తిమ్మాజిపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయ నూతన భవనం, కొత్తబస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్కర్నూల్–వనపర్తి మధ్య నూతన బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. సాయంత్రం కొల్లాపూర్కు చేరుకుని బస్టాండ్లో క్రూ రెస్ట్రూమ్ల నిర్మాణం, పెంట్లవెల్లి బస్టాండ్ ప్రాంగణంలో సీసీ, నూతన మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
‘పవర్’ పాలి‘ట్రిక్స్’..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బదిలీల లొల్లి తారస్థాయికి చేరింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక్క రోజు ముందు జిల్లా స్థాయిలో చేసిన బదిలీలు వివాదాస్పదంగా మారాయి. విద్యుత్ సంస్థలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు ఎస్ఈ సీటు ఆరు రోజులుగా ఖాళీగా ఉండడం.. కనీసం ఇన్చార్జిగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గద్వాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి జూన్ 30వ తేదీన హైదరాబాద్కు బదిలీ కాగా.. ఈ నెల ఒకటో తేదీన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఎస్ఈ బదిలీ ఉత్తర్వుల కంటే కంటే ఒక రోజు ముందే డిస్పాచ్లతో ఇద్దరు జేఏఓలు, ఒక లైన్మన్, ఒక ఆర్టీజన్కు బదిలీ చేసినట్లు.. ఈ నెల 2వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆర్టీజన్ ఫీల్డ్లో పని చేయాల్సి ఉంటుంది. కానీ సిస్టం వర్క్ వస్తదనే కారణంతో ఎస్ఈ కార్యాలయంలో చేస్తున్నారు. తాజాగా మళ్లీ స్టోర్ రూమ్కు బదిలీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 3 రోజులుగా ఆందోళనలు.. ఎస్ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్కు వెళ్లారు. అయితే సీఎం మీటింగ్ ఉందంటూ దాటేస్తూ సీఈ కలవలేదని సమాచారం. 6 రోజులుగా కుర్చీ ఖాళీ.. గత నెల 30న గద్వాల ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి బదిలీపై వెళ్లారు. అయన స్థానంలో వేణుగోపాల్ పదోన్నతిపై ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన జాయిన్ కాలేదు. ఈ క్రమంలో సీఈ ఇన్చార్జిగా వ్యవహరించడం ఆనవాయితీ. లేదంటే కనీసం అక్కడున్న డీఈకి తాత్కాలికంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకపోవడం.. ఆరు రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీగా ఉండడం.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పలు సమస్యలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. గద్వాల విద్యుత్ శాఖలో హైటెన్షన్ ఇటీవల సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి బదిలీ ఒక్కరోజు ముందు తేదీతో జిల్లాస్థాయిలో నలుగురికి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా వివక్షతో వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ఆగ్రహం ఆ సీనియర్ అధికారే కారణమా? గద్వాల సర్కిల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న బదిలీలకు సర్కిల్లోని అకౌంట్ సెక్షన్లో ఉన్న ఓ సీనియర్ అధికారి కారణమనే చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. గతంలో గద్వాల డివిజన్ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిణి సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ఆ డివిజన్ డీఈ ఫిర్యాదు చేస్తే.. సదరు సీనియర్ అధికారి తన పలుకుబడితో ఎస్ఈ ద్వారా తన సెక్షన్కు బదిలీ చేయించారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన బదిలీల్లో ఆ సీనియర్ అధికారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ 1,860 మంది ఎవరు?
అందుబాటులో లేని చేయూత పింఛన్ లబ్ధిదారులు పింఛన్ లబ్ధిదారులు కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ ఆథెంటికేషన్) ప్రక్రియ రెండు రోజుల క్రితం పూర్తయింది. బోగస్ పింఛన్ల ఏరివేత, మరణించిన వారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ప్రక్రియలో బయటపడిన వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్ధిదారుల ఆచూకీ లభించకపోవడం.. మరికొందరు మరణించినా పింఛన్ సొమ్ము పొందుతున్నట్లు తేలింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,02,976 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 58,700 మంది పోస్టాఫీస్, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ సొమ్ము పొందుతుండగా.. 44,276 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతోంది. వేల సంఖ్యలో బోగస్..? జిల్లాలో చేయూత పింఛన్ లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ లెక్కల ప్రకారం 2,373 మంది మరణించినట్లు గుర్తించారు. మరో 1,860 మంది లబ్ధిదారుల ఆచూకీ అధికారులకు లభించలేదు. వారి ఇళ్లకు సిబ్బంది వెళ్లినప్పటికీ అందుబాటులో లేరని తెలిసింది. ఇంతకాలం పింఛన్లు పొందుతున్న వారి ఆచూకీ అధికారులకు సైతం లభించకపోవడం గమనార్హం. మరో 45 మంది లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ పూర్తి కాలేదు. వివిధ కారణాలతో నమోదు కాకపోవడంతో మరోసారి వారిని సంప్రదించి.. ప్రక్రియ పూర్తి చేయనున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు.మండలాల్లో మరణించిన వారు 1,690 ఇంకా లభించని వారు 667కొత్త అర్హులకు మార్గం.. ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తికావడంతో అనర్హుల పేర్ల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఖాళీ అయ్యే పింఛన్ల స్థానంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అర్హులైన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు చేయూత పింఛన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో పూర్తయిన లైవ్ అథెంటికేషన్ 2,373 మంది మృతిచెందినట్లు గుర్తింపు మరో 45మంది ప్రత్యక్ష ధ్రువీకరణ కాని వైనం ఏళ్లుగా డేటా నవీకరణలో జాప్యం గుర్తింపునకు వస్తే కొనసాగిస్తాం.. జిల్లాలో ఇంకా 1,860 మంది లైవ్ అథెంటికేషన్కు సంబంధించి ఆచూకీ లభించడం లేదు. లబ్ధిదారులు సంబంధిత గ్రామం, మున్సిపాలిటీలో అధికారులను సంప్రదిస్తే ప్రత్యక్ష ధ్రువీకరణ పూర్తిచేసి.. చేయూతలో కొనసాగిస్తారు. లేదంటే పింఛన్ నిలిచిపోతుంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించి.. వారి తదు పరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – రాజేశ్వరి, అడిషనల్ డీఆర్డీఓ -
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు!
ఆత్మకూర్: వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్పాడు రిజర్వాయర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడకపోతే తాగునీటి ముప్పు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు ఫర్ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్పైనే తాగునీటి పథకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసుకుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి పథకాలకు సరఫరా ఇలా.. 2 టీఎంసీలకు పడిపోయినజూరాల నిల్వలు రామన్పాడులోనూ అదే పరిస్థితి చెరువులు, కుంటల్లో తగ్గిన నీటిమట్టం నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా -
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి/కొల్లాపూర్: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో భూ సమస్యలపై సమీక్షించారు. జిల్లాలో భూ భారతి దరఖాస్తులు, అటవీ సమస్యల పరిష్కారం, వనమహోత్సవంపై చర్చించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని.. కొల్లాపూర్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పెండింగ్లో ఉండొద్దని సూచించారు. అంతకుముందు కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్లతో చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫైళ్లను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పంపుతున్నారు తప్ప.. ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వెలిబుచ్చారు. రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరైంది కాదన్నారు. అనంతరం పలు రికార్డులను ఆయన అధికారుల సమక్షంలోనే పరిశీలించారు. పోడు భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, లావునీ పట్టాలు, హార్టికల్చర్ కళాశాల, పర్యాటక భవనాల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ, మొదలైన 16 అంశాలపై సమీక్షలో చర్చించారు. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు అటవీ భూములకు పట్టాలు ఇప్పిస్తున్నారని ప్రచారం జరగడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తమకు పట్టాలు ఇప్పించాలని వారు మంత్రికి విన్నవించారు. దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్లో ఆయన విగ్రహానికి మంత్రి జూపల్లి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గానికి చెందిన జగ్జీవన్రామ్ దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కల్తీపై కంట్రోల్ ఏదీ?
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో కలుషిత ఆహారంతో అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, పెళ్లి వేడుకల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్తో అధికంగా చిన్నారులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కలుషితమైన ఆహారం తీసుకున్న రెండు గంటల్లో అస్వస్థతకు గురవుతారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చల్లబడిన వాతావరణం బ్యాక్టీరియా ఎదుగుదలకు అనుకూలంగా ఉండి.. వ్యాధులు విస్తరిస్తాయి. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్లు, పాఠశాలలు, వసతి గృహాల్లో వంటగదులు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు సరిపడా లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నిల్వ చేసిన పదార్థాలకు మసాలాలు దట్టించి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పర్యవేక్షిస్తారు. అయితే మహబూబ్నగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలతకు నాగర్కర్నూల్ జిల్లా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ రెండు కూడా పెద్ద జిల్లాలు కావడంతో నమూనాల సేకరణ, తనిఖీలు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీనికితోడు సీఎం పర్యటనలు, ఉన్నతాధికారులు, కలెక్టర్ సమావేశాలు అంటూ కొన్నిరోజులు గడిచిపోతున్నాయి. గద్వాల జిల్లాకు రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఉండగా ఆయనకు అదనంగా వనపర్తి జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే నారాయణపేట రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా మౌనిక వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత అధికారులు సరిపడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇటీవల జరిగిన కలుషిత ఆహార ఘటనలో శాంపిల్స్ సేకరించాం. ఇందులో సోరకాయతో తయారు చేసిన స్వీట్ 5– 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత స్వీట్లో లోపల ఫంగస్, బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల తిన్నవారికి వాంతులు, విరేచనాలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం వండిన తర్వాత 6–8 గంటల వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే టాక్సిల్స్ ఏర్పడుతాయి. కలుషిత ఆహారంపై గత నెల 18న అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చాం. ఇటీవల తనిఖీలు పెంచడంతోపాటు శాంపిల్స్ సేకరిస్తున్నాం. కలుషిత ఆహారంపై కూడా అవగాహన కార్యక్రమాలు పెంచుతాం. – శ్రీలత, ఫుడ్ ఇన్స్పెక్టర్, మహబూబ్నగర్ పాలమూరులో కలవరపెడుతున్న కలుషిత ఆహార ఘటనలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు అత్యధికంగా నిల్వ చేసిన పదార్థాలతోనే వినియోగదారులకు వడ్డింపు ఉమ్మడి జిల్లాకు ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కనిపించని తనిఖీలు మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగాలదీ అదే తీరు -
నివృత్తి చేస్తున్నాం..
సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తికావొచ్చింది. వాటిని పూరించడంపై బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లకు కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. డబుల్ ఓట్లు కలిగిన వారు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. బీఎల్ఓలు ఫారాలు తీసుకునేందుకు ఇంటికి వెళ్లి సేకరించి, ఫారాలను నింపుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పార్టీల బూత్స్థాయి ఏజెంట్లు సహకరించినట్లయితే ఓటరు జాబితా ఆన్లైన్ చేయడం సులభతరం అవుతుంది. ప్రతి దరఖాస్తును క్షేత్రస్తాయిలో జాగ్రత్తగా పరిశీలించి.. పొరపాట్లకు తావులేకుండా చూస్తున్నాం. – యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను జాతీయస్థాయిలో గుర్తించి, సత్కరించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోగా http://nationalaward sotŠreacherr. education.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90101 92288 నంబర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. అక్రమాలపై విచారణ జరపాలి కందనూలు: మొక్కజొన్న కొనుగోళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై అంబేడ్కర్ సాక్షిగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతును రాజును చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అక్కడి నుంచి కలెక్టరేట్కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి శ్రీశైలం, ప్రదీప్, మాధవరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పెంపుడు జంతువులతో అప్రమత్తంగా ఉండాలి కందనూలు: పెంపుడు జంతువులతో ప్రబలే వ్యాధుల బారినపడకుండా పెంపకందారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డా.కృష్ణ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సబ్బు నీటితో శుభ్రంగా కడిగి, సమీపంలోని ఆరోగ్యకేంద్రంలో యాంటీ రాబిస్ టీకా వేయించుకోవాలని సూచించారు. జంతువుల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కోవిడ్ 19, ఆంత్రాక్స్, లెప్టో స్ప్రేరోసిస్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్త పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.జ్ఞానేశ్వర్, ప్రోగ్రాం అధికారి డా.కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని వసతులు తిమ్మాజిపేట: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేట బస్టాండ్ను ఆయన పరిశీలించారు. నాగర్కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, స్థానిక దాతల సహకారంతో ఇటీవల బస్టాండ్ను పునరుద్ధరించగా.. బస్టాండ్ ప్రాంగణం, పరిసరాల్లో సీసీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి రూ. 39లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 8న జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా సీసీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించగా.. ఆర్ఎం బస్టాండ్ను సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్ బహదూర్, లక్ష్మీనారాయణ, కంట్రోలర్ తిరుపతయ్యగౌడ్, రాములు ఉన్నారు. -
సంక్షేమ వసతిగృహాలపై పటిష్ట పర్యవేక్షణ
కందనూలు: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు నాణ్యతగా అమలవుతున్నాయా.. లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 28 బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో వివిధ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన వసతిగృహాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహాల్లోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను ఆన్లైన్ ద్వారా కలెక్టర్కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వంటివని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని.. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, రాత్రి భోజనం, పాలు, గుడ్లు, పండ్లు తదితర పోషకాహార పదార్థాలు నిర్ణీత ప్రమాణాల ప్రకారం అందుతున్నాయా లేదా అనేది ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. అదే విధంగా వసతిగృహాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల పరిశుభ్రత, స్నానాల గదులు, పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు, వంటశాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్యసేవలు, విద్యార్థుల హాజరు, వార్డెన్లు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తనిఖీల్లో అధికారులు సమర్పించిన నివేదికల్లో గుర్తించిన లోటుపాట్లపై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు, బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారిణి ఇందిరను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణారెడ్డి, డీఆర్వో పాండు తదితరులు ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిమ్మాజిపేట/తాడూరు: సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండలం మరికల్, తాడూరు మండలం ఎత్మతాపూర్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. పేదలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించాలనే లక్ష్యంతో అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనేక కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను పండుగ వాతావరణలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాంచ్రందారెడ్డి, సర్పంచులు మల్లయ్య, మాధవి, నాయకులు వెంకట్రామారెడ్డి, కొత్త శ్రీను, రవూఫ్, నాగసాయిలు, మాజీ సర్పంచ్ నర్సింహ, లింగం, ముబారక్ ,శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ఉపసర్పంచ్ ఎర్రయ్య, వినోద్ పాల్గొన్నారు. -
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం..
జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణా తీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు కొల్లాపూర్: జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానదీ తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజవంశస్థులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. తర్వాతి కాలంలో ఆలయాన్ని జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యధాతథంగా సాగాయి. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో తగిన గుర్తింపు లభించడం లేదు. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి -
కాలినడకే శరణ్యం!
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు దారులన్నీ పలుచోట్ల కోతకు గురవడంతో రాకపోకలకు చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా మారింది. రహదారి సౌకర్యం సరిగ్గా లేదంటూ గతంలో ఓ చెంచు మహిళ మృతదేహాన్ని ఫర్హాబాద్ చౌరస్తా వద్ద వదిలివెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెంచు పెంటలకు ఏళ్ల తరబడి రోడ్లతో పాటు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అటవీ, గిరిజన సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం చెంచులకు శాపంగా మారుతోంది. ప్రతిపాదనలు బుట్టదాఖలు.. గిరిజన సంక్షేమశాఖ ఏడాదిన్నర క్రితం అమ్రాబాద్, లింగాల మండలాల్లోని చెంచుపెంటలకు మట్టిరోడ్ల నిర్మాణానికి రూ. 2కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అమ్రాబాద్ మండలం మల్లాపూర్పెంట, లింగాల మండలంలోని మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగిడిగుండాలకు, వ్యూ ఫాయింట్, ఫర్హాబాద్ చౌరస్తా నుంచి రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. నేటికీ అనుమతులు రాకపోవడంతో చెంచులు అద్వానపు రహదారులపై అవస్థల ప్రయాణం కొనసాగిస్తున్నారు. నిత్యం కష్టాలే.. మన్ననూర్ నుంచి ఈర్లపెంటకు వెళ్లాలంటే 30 కి.మీ. కాలినడక తప్ప మరో మార్గం లేదు. అప్పాపూర్ వరకు మాత్రమే వాహనాలు ఇబ్బందులు పడుతూ వెళ్తాయి. అక్కడి నుంచి ఇతర చెంచు పెంటలకు వెళ్లడానికి ఎలాంటి సౌకర్యం లేదు. అటవీ ప్రాంతంలో కాలినడకే శరణ్యంగా మారడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంచుపెంటలకు అద్వానపు దారులు రోడ్ల నిర్మాణాలకు అటవీశాఖ మోకాలడ్డు ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం రాళ్లు, రప్పలపైనే రాకపోకలు సాగిస్తున్న గిరిపుత్రులు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2004లో పలు రహదారులు నిర్మించేందుకు రూ.కోట్లు మంజూరైనా అటవీశాఖ నిబంధనలతో ముందడుగు పడలేదు. అచ్చంపేట మండలం ఘనపూర్ నుంచి పదర మండలం చిట్లంకుంట వరకు 9 కి.మీ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 90లక్షలు మంజూరు కాగా.. గుత్తేదారు 4 కి.మీ. రహదారి నిర్మించి, అటవీ ప్రాంతంలో ఉన్న 5 కి.మీ. అనుమతులు లేవని వదిలేశారు. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్కు 25 కి.మీ. భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2007లో రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయింది. కొల్లాపూర్ మండలం అమరగిరి వరకు బీటీ రహదారి పనులకు గతేడాది నిధులు మంజూరయ్యాయి. సగం మాత్రమే పనులుచేసి వదిలేశారు. -
ప్రైవేటుకు గడ్డుకాలమే
●ఆశించిన స్థాయిలో లేదు.. ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే.. పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటా రూ.10 కోట్లు.. యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి 38 ప్రైవేటు కళాశాలల్లో.. పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్లపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదుల్లో నీరు ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్డీఎస్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వార నిర్ణయించిన మేరకు సాగునీరు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద జలాల పేరుతో 2005లో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికరజలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జూరాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వినోద్కుమార్, సుభాన్, వాల్మీకి, డా.ప్రేమ్కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు. -
మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు భక్తుల తాకిడి తగ్గింది. మృగశిర కార్తె ముగియడంతో ఆదివారం తక్కువ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం తయారుచేశారు. మైసమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణల అనంతరం నైవేద్యం సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 6వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆటోకార్మికులసమస్యలు తీర్చండి కల్వకుర్తి రూరల్: ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆటోడ్రైవర్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మున్నూరు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యంతో నష్టపోతున్న ఆటోకార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేసి.. ప్రతి ఆటోడ్రైవర్కు రూ. 12వేలు చెల్లించడంతో పాటు పోలీసులు, రవాణాశాఖ అధికారుల వేధింపులు ఆ పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతి పట్టణంలో ఆటోస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో శివశంకర్, పరుశరాములు, సైదులు, రాజేశ్, శివరాములు, అమీర్ పాల్గొన్నారు. ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్ కందనూలు: ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడిగా నిరంజన్ యాదవ్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్నికల పరిశీలకుడు సాయికుమార్ ఆధ్వర్యంలో ఖోఖో అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటయ్య, లక్ష్మి, కిరణ్కుమార్, కృష్ణయ్య, ఆర్థిక కార్యదర్శిగా పురంచంద్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, కార్యదర్శులుగా రాజు, తులసీరెడ్డి, ఆంజనేయులు, రాధ, యాదయ్య, నీలాబాయి రవికుమార్, రాఘవులుగౌడ్, మోహన్లాల్ ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. -
బస్సు వచ్చే సమయానికి..
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం త్వరగా అమలు చేయాలి. నేను యాపట్ల నుంచి కళాశాలకు వస్తాను. ఉదయమే టిఫిన్ తీసుకొని రావాలంటే బస్సు వచ్చే సమయానికి ఇంట్లో వంట కావడం లేదు. అందువలన ఒక్కోసారి మధ్యాహ్నం టిఫిన్ తీసుకోకుండానే వస్తున్నాను. – దీపిక, బాలికల జూనియర్ కళాశాల, నాగర్కర్నూల్ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రవేశపెట్టాలి. నేను కుమ్మెర గ్రామం నుంచి ఉదయమే కళాశాలకు చేరుకునే సమయంలో ఇంటి దగ్గర వంట కాకపోవడంతో టిఫిన్ తీసుకోకుండానే వస్తున్నాను. ఒక్కొక్క సమయంలో మా ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తాను. లేదంటే సాయ ుంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తింటాను. – నందిని, బాలికల జూనియర్ కళాశాల, నాగర్కర్నూల్ -
మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత..
20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఉమ్మడి పాలమూరులో ఆనాడు మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారని గుర్తు చేశారు. అత్యంత వెనకబడిన ప్రజలు చీకట్లో నుంచి వెలుగు రావాలని 2006లో మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయంతో ఈనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశం వచ్చింది. నాకు ఇంకా అవకాశం ఇచ్చేందుకు ప్రజల వద్ద ఇంకా ఏమీ లేదు. ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చారు. అందుకే మిడ్జిల్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది. మిడ్జిల్ డార్క్ మండలం కాదు.. ఈ ప్రాంతానికి వెలుగు రేఖలు వచ్చినాయనేది ప్రభుత్వ లెక్కల్లో తేలాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనేదే నా కోరిక. అందుకే ఈ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దత్తత తీసుకోవాలని కోరుతున్నా. -
సమయానికి.. పూర్తయ్యేనా.. సర్!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు పంపిణీ చేసిన శాతం ఇ.డి.. ఫారాలు శాతం ఫారాలు మహబూబ్నగర్ 7,32,488 7,20,825 98.41 23,009 3.14 నాగర్కర్నూల్ 7,31,632 7,20,402 98.47 1,0257 1.40 జో.గద్వాల 5,03,859 4,90,142 97.28 25,645 5.09 నారాయణపేట 4,95,574 4,69,844 94.81 29,036 5.86 వనపర్తి 2,75,570 2,74,367 99.56 8,752 3.18 ఇ.డి.. ఫారాలు : ఇప్పటి వరకు డిజిటలైజేషన్ చేసిన ఫారాలు 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
ప్రాణమిచ్చినా తక్కువే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘2006 జూలై 4.. నేను గెలిచిన గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. ఆ రోజు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహా వృక్షమైంది. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నిలిపింది. ఈ స్థాయికి ఎదిగానంటే మీరే కారణం. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. మీకు ప్రాణమిచ్చినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయత కృతజ్ఞత వందనసభలో ఆయన మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం ముందుగా అప్పటి ఉమ్మడి మిడ్జిల్ పరిధి, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆనాటి మిడ్జిల్ మండల పెద్దలు, నాయకులు, ఆత్మీయులు సుమారు 150 మందిని ఆత్మీయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిడ్జిల్ సమీపంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పెద్దఎత్తున సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.. ఈ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి దత్తత తీసుకోవాలి అభివృద్ధి చెందినప్రాంతంగా ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టాలి.. ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి సహకారం అందించాలి.. కృతజ్ఞతసభలో సీఎం రేవంత్రెడ్డి రూ.47.08 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
ఆకలి తీరేదెన్నడో..?
● అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు ● గ్రామీణ ప్రాంతాల వారికి మరిన్ని అవస్థలు ● రవాణాపరమైన ఇబ్బందులతో హడావుడిగా రాకపోకలు ● త్వరగా ప్రవేశపెట్టాలని తల్లిదండ్రుల వేడుకోలు కందనూలు: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే.. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, నేటికీ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. అందులో 3,842 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు రవాణా పరమైన ఇబ్బందులతో ఉదయమే కళాశాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆ సమయానికి ఇంట్లో వంట కాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం అన్నం లేకుండానే కళాశాలకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉండి పాఠ్యాంశాలు విని తిరిగి ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం అవుతుంది. విద్యాసంస్థలు ప్రారంభమై ఇప్పటికే నెల గడుస్తున్నా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు తమ ఇబ్బందులను అర్థం చేసుకొని మధ్యాహ్న భోజనాన్ని కళాశాలలో ప్రారంభించాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కళాశాల అధ్యాపకులు ఇంటింటికి తిరుగుతూ కళాశాలలో సాధించిన మార్కులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కళాశాలకు పూర్వవైభవం రావాలంటే మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండి తిరిగి వెళ్లే వరకు విద్యార్థులు ఆకలితో పస్తులుండాల్సి వస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి వరకు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు బస్సు వచ్చే సమయాన్ని బట్టి అంతకు ముందుగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. మధ్యాహ్నం భోజనం అమలు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు వచ్చి బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. కొంత మందిమి ఆకలి కావడంతో మధ్యాహ్నం సమయంలోనే ఇంటికి వెళ్తున్నాం. ఆ సమయంలో క్లాసులు మిస్సవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి త్వరగా అమలు చేయాలని కోరుతున్నాం. – అరుణ్కుమార్, బాలుర జూనియర్ కళాశాల, నాగర్కర్నూల్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే అమలు చేస్తాం. – వెంకటరమణ, డీఐఈఓ -
ఎన్యూమరేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
తిమ్మాజిపేట: ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ఎలక్ట్రోరల్ ఆఫీసర్ చెన్నయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని మరికల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నుంచి వివరాలు సేకరించాకే ఎన్యూమరేషన్ ఫాంలో నమోదు చేయాలని లేదా ఓటర్లు పూర్తి వివరాలు నమోదు చేసి వారి సంతకం తీసుకున్న తర్వాతనే ఫాం సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. 2002 సంవత్సరంలో ఓటరుగా నమోదై ఉన్నవారు ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో సరి చూసుకోవాలని, ఏదైనా వివరాలు తప్పుగా ఉంటే ఓటరు సూచన మేరకు నమోదు చేసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. 40 ఏళ్ల వయసు గలవారికి గతంలో ఓటు హక్కు ఉండకపోవచ్చని, అయితే కుటుంబ సభ్యుల వివరాలు మ్యాపింగ్ చేసి పూర్తి వివరాలు వచ్చాక ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏలతో మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని, అధికారులు అన్ని వివరాలు పూర్తి చేశాక చివరలో మీకు చూయించి మీ సంతకాలు తీసుకుంటారని పేర్కొన్నారు. బీఎల్ఓల పనితీరు బాగుందని, అధికారులు సైతం వారికి మంచి శిక్షణ ఇచ్చారని అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ జయంతి, సీసీలు కిరణ్, రవిచంద్ర, రమేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, సర్పంచ్ ఉమాదేవి, ఉపసర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
వందనాలు ‘మిడ్జిల్’..
నేడు సీఎం రేవంత్రెడ్డి కృతజ్ఞత సభ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. శనివారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లాకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఊర్కొండపేట హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో సమావేశమై వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. 2.30 గంటలకు ఊర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్కు బయలుదేరుతారు. 2.45 గంటలకు వెల్జాల క్రాస్ రోడ్కు చేరుకుని దివంగత స్థానిక సీనియర్ నేత గోపాల్రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 3.15 గంటలకు మిడ్జిల్లో జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన ఊర్కొండలోని హనుమాన్ ఆలయంలో పూజలు ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ వరాల జల్లు కురిపిస్తారనిప్రజల్లో ఆశలు -
వేతనాల సంబురం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. ● పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. 1వ తేదీనే చెల్లింపులు.. పీయూలో గతం నుంచే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, గార్డెనింగ్ తదితర సిబ్బందికి ఏజెన్సీల నుంచి వేతనాలు అందిస్తున్నారు. ప్రభుత్వం గతనెల రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారికి తప్పకుండా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సూచించడంతో పీయూ అధికారులు సైతం అలాగే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు చెప్పారు. కాగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్లు, లైబ్రేరియన్, అసిస్టెంట్ ఇంజినీర్, టైపిస్ట్ కం క్లర్క్, వీసీ పీఏ, రిజిస్ట్రార్ పీఏ, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్స్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్, గేమ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సూపర్వైజర్, ప్లంబర్లకు రూ.19,500 ఉండాలి. హౌస్కీపింగ్ శానిటేషన్, హెల్పర్స్, గార్డెనింగ్, స్కావెంజర్, కేర్ టేకర్, కుక్, సెక్యూరిటీ గార్డు, బుక్ కీపర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేటర్, ల్యాబ్ అటెండర్లకు రూ.15,600 ఇవ్వాల్సి ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్కు రూ.22,500 వేతనం ఇస్తున్నారు. ఎట్టకేలకు పీయూ నాన్టీచింగ్ సిబ్బందికి జీతాల పెంపు ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు వేతనాలు పెంచాం.. గత కొన్నేళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన సిబ్బందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. జీఓ ఆధారంగా క్యాడర్ల వారిగా వేతనాలు పెరిగాయి. దీంతో యూనివర్సిటీలో పనిచేస్తున్న చాలామంది మెజార్టీ సిబ్బందికి న్యాయం జరుగుతుంది. సిబ్బంది ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ -
జూపల్లి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం
కందనూలు/ లింగాల: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉన్నామని ఎంపీ మల్లురవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, లింగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసిందని, వీటికి తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6.800 కోట్ల వడ్డీ కడుతుందని పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమ సవాల్ను స్వీకరించే దమ్ము లేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అది చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం మానుకోవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మిషన్ భగీరథ, పెండింగ్ ప్రాజెక్ట్ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చేయలేని అభివృద్ధిని తెలంగాణలో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కల్వకుర్తి టౌన్: ఊర్కొండ మండలంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శుక్రవారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద పలు శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే హెలీప్యాడ్, ఆలయ ప్రాంగణం, ముఖ్యమంత్రి సభావేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ ప్రయాణ మార్గం, భద్రతా పాయింట్లను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. సీఎం భద్రతా విభాగం తరపున ఏఎస్పీ వాసుదేవరెడ్డి, డీఎస్పీలు శ్రీధర్రెడ్డి, కృష్ణ ఏఎస్ఎల్లో పాల్గొని స్థానిక యంత్రాంగంతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణారెడ్డి, దేవసహాయం, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలి
కల్వకుర్తి రూరల్: గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో సత్తాచాటిన క్రీడాకారులను ఈ నెల 18న మెదక్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే నాలుగో తెలంగాణ రాష్ట్ర మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్ 2026 పోటీల్లో పాల్గొననున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యతోపాటు క్రీడల్లో సత్తా చాటితే స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. యువత, విద్యార్థులు క్రీడలను తమ జీవనంలో భాగంగా చేసుకొని క్రమశిక్షణతో సాధన చేయాలని సూచించారు. అథ్లెటిక్స్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు, హెచ్ఎం బాలునాయక్, భిక్షపతి, అంజయ్య, శంషీర్ అనిల్, ప్రసాద్, బాలయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఈడీఎక్స్ సదస్సుకు ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నోయిడాలో ఈనెల 4న టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. -
కేజీబీవీలకు యూనిఫాంలు
బల్మూర్ కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థులు (ఫైల్) అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యలో చదువు మానేసిన పేద, మధ్య తరగతి బాలికలను మళ్లీ చదువుబాట పట్టించి.. ఇంటిని మరిచిపోయేలా ఆకర్షనీయమైన భోజనం, వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించి ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కస్తూర్బా గాంధీ విద్యాలయ (కేజీబీవీ)లను ప్రారంభించింది. ఆలస్యంగా వచ్చిన వస్త్రం.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. అయితే సకాలంలో వస్త్రం అందకపోవడంతో విద్యార్థినులు పాత దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా 6వ తరగతిలో చేరిన బాలికలు సైతం యూనిఫాం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ బాలికలకు ఏకరూప దుస్తులు అందించేందుకు వస్త్రం జిల్లాకేంద్రానికి చేరింది. అధికారులు ఈ వస్త్రాన్ని జిల్లాలోని ఎస్హెచ్జీలకు అందజేసి త్వరగా కుట్టాలని సూచించారు. జిల్లాలో మొత్తం 20 కేజీబీవీలు ఉండగా.. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4 వేల మంది విద్యార్థి నులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంటర్ రెండో సంవత్సరాల్లో 3,120 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కేజీబీవీలకు చెందిన బాలికల యూనిఫాం కోసం పంజాబీ టాప్లకు (ఒక జత) 15,100 మీటర్లు, పంజాబీ బాటమ్ (రెండు జతలు) 24,160 మీటర్లు, సూట్లకు (రెండు జతలు) 15,300 మీటర్ల వస్త్రం ప్రభుత్వం నుంచి అందింది. ఇప్పటికే ఎస్హెచ్జీలకు అందజేసి కుట్టడం ప్రారంభమైంది. త్వరలో కుట్టడం పూర్తి చేసి బాలికలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు చేరిన మొత్తం వస్త్రం 54,560 మీటర్లు జిల్లాలోని 20 పాఠశాలలు, కళాశాలలకు చేరిన వస్త్రం ఎస్హెచ్జీలకు కుట్టు బాధ్యత అప్పగింత త్వరలో అందజేస్తామంటున్న అధికారులు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 3,120 ఎస్హెచ్జీలకు అందించాం.. కేజీబీవీలలోని బాలికలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తుల వస్త్రం ఎస్హెచ్జీలకు అందించాం. వారు ఇప్పటికే డ్రెస్సులు కుట్టడం ప్రారంభించారు. వేగవంతంగా స్టిచ్చింగ్ చేయించి బాలికలకు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటాం. – లలిత, ఎస్ఓ, కేజీబీవీ బల్మూర్ -
అంటువ్యాధుల నివారణకు చర్యలు
కందనూలు: జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సూపర్వైజర్లు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో దోమకాటు వ్యాధులైన డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, కలుషిత నీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, వాంతులు విరేచనాలు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నివారణ చర్యల గురించి ప్రజలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షణ సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ.. సురక్షిత మాతృత్వం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఐహెచ్ఐపీ పోర్టల్లో అంటువ్యాధుల నివేదిక పంపాలని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల స్క్రీనింగ్ పరీక్షలు 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి నిర్వహించాలని, కాంబినేషన్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, ప్రదీప్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, పీహెచ్సీల పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధిత రైతులకు న్యాయం చేస్తాం
కందనూలు: దళారుల చేతిలో మోసపోయిన రైతులకు న్యాయం చేస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలంలో వ్యాపారుల చేతిలో మోసపోయిన మొక్కజొన్న రైతులు గురువారం పోలీస్స్టేషన్ ఆశ్రయించారు. సమాచా రం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన వారి నుంచి రూ. 90లక్షల విలువైన మొక్కజొన్న కొనుగోలుచేసి.. డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని రైతులు గోడు వెల్లబోసుకున్నారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరా రు. అనంతరం ఎస్ఐతో ఎమ్మెల్యే సమావేశమై.. ఏఏ గ్రామాల రైతులు దళారుల చేతిలో మోసపోయారో విచారణ జరిపి.. బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం ఉప్పునుంతల: రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవడానికి సరిపడా సాగునీరు, ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. గురువారం ఉప్పునుంతల మండలం లత్తీపూర్ శివారులోని డిండి ప్రాజెక్టు కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి రిజర్వాయర్ నింపి, ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిండి కుడి కాల్వ ద్వారా లత్తీపూర్, వడ్డేర గుడిసెలు, గువ్వలోనిపల్లి వరకు 325 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ఇటీవల రూ. 35లక్షలతో మరమ్మతు పనులు చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు పి శ్రీదేవి, మేడిసాని శ్రీలత, నాయకులు లక్ష్మీనారాయణ, తిప్పర్తి నర్సింహారెడ్డి, విజేందర్రెడ్డి, నర్సింహులు, నరేశ్, లింగమయ్య పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలి కొల్లాపూర్ రూరల్: జిల్లావ్యాప్తంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ మండలం గేమ్యానాయక్ తండాలో పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ సమీపంలోని గిరిజనులు, ఆదివాసీలు జీవనోపాధి నిమిత్తం 20 ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటున్నారని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. -
బాల్యానికి బాసట..!
సత్ఫాలితాన్నిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ఐదేళ్ల కాలంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గుర్తించిన బాలకార్మికుల వివరాలిలా.. 2025 33 జిల్లాలో 12వ సారి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్కు పోలీసు, మహిళా శిశుసంక్షేమశాఖ, కార్మికశాఖ అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వీరు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే.. ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించి, వారి బాగోగులు చూసుకుంటున్నారు. బాలకార్మికుల వయసు ఆధారంగా వారి భవిష్యత్కు దిశానిర్దేశం చేస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలం తెలిపారు. 2022 21 2023 18 2024 24 2021 27 -
‘ర్యాలంపాడు’కు మోక్షం!
ఎట్టకేలకు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు ● సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు ● ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ మట్టి నమూనా సేకరణ.. గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మరమ్మతు కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. లోపభూయిష్ట నిర్మాణంతో.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతులు చేపట్టాలని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. కొనసాగుతున్న పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు సంబఽంధించి ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం మట్టి నమూనా సేకరణ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ -
కార్పొరేట్ స్థాయిలో మోడల్ స్కూల్
వెల్దండ: కార్పొరేట్ స్థాయిలో వెల్దండ మోడల్ స్కూల్ను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. గురువారం యూత్ ఫర్ సేవాసంస్థ ప్రతినిధులతో కలిసి వెల్దండ మోడల్ స్కూల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రూ. 30లక్షలతో పాఠశాలకు పెయింటింగ్ వేయించడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తదితర అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో రూ. 10లక్షలతో పాఠశాలను సుందరీకరణ చేస్తామన్నారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూత్ ఫర్ సేవాసంస్థ వారు పాఠశాలను దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఆశిక, అరవింద్ పాల్గొన్నారు. -
బాలలతో పనులు చేయిస్తే చర్యలు : ఎస్పీ
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. గురువారం ఊర్కొండ మండలంలోని పలు ఇటుక బట్టీల్లో ఆయన స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీల్లో ఎవరైనా బాలలను పనుల్లో పెట్టుకున్నారా అని ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల వివరాలు, వారి పిల్లల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నెల రోజులపాటు కొనసాగుతుందని.. చిన్నారులను బడికి పంపించి వారి భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే పోలీసు అధికారులు లేదా చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. -
ఉత్సాహంగా వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గులాం దస్తగీర్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, వాలీబాల్ అకాడమీ కోచ్లు పర్వేజ్పాష, అబ్దుల్ రహెమాన్ఖాన్, ఇతర కోచ్లు సునీల్కుమార్, సయ్యద్ అంజద్, రాజగోపాల్, వి.శంకర్, తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి 95 మందిబాలబాలికలు హాజరు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఎస్ డా.కృష్ణ అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్తో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 4న ఊర్కొండకు వస్తున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీవీఐపీ ట్రీట్మెంట్ రూం సిద్ధం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రిటికల్ కేర్ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు, పరికరాలు, అంబులెన్స్, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా.కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
కందనూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 4న ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న హెలిప్యాడ్ నుంచి ఆలయానికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆలయ ఈఓ, అర్చకులతో సమావేశమైన కలెక్టర్.. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమా లు సంప్రదాయబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేయా లని సూచించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఊర్కొండ రైతువేదికలో జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
● కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అప్పులపాలుజేసింది.. ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయ మని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రా న్ని అప్పులపాలుజేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. ఎమ్మె ల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహాయ సహకారాలతో కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. తలకొండపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కల్వకుర్తిలో వంద పడకల ఆస్పత్రి, ఆమనగలులో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొట్ర నుంచి కల్వకుర్తి వరకు రూ. 45కోట్లతో నాలుగు వరుసల రహదారి పనులు సాగుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్డీజీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల, ఆనందకుమార్, పద్యానాయక్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలి
బల్మూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా హౌజింగ్ పీడీ గోపాల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండనాగులలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపులు, అధికారుల పర్యవేక్షణ తీరు తదితర అంశాలు అడిగి తెలుసుకున్నా రు. బల్మూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో హౌజింగ్ అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై గ్రామాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి పురోగతి నివేదికలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓ రేవత్రెడ్డి, హౌజింగ్ డీఈ హరినాయక్, ఏఈ నర్సింహ పాల్గొన్నారు. -
జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: విదేశాల్లో మాస్టర్ డిగ్రీ విద్యను అభ్యసించేందుకు ఉపకార వేతనాల కోసం అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం ద్వారా 2026 విద్యా సంవత్సరానికి ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి 35 ఏళ్లలోపు ఎస్సీ అభ్యర్థులు http://telanganaepass.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్షిప్–2026 కోసం క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్యాదవ్, కార్యదర్శి స్వాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16, 20 విభాగంలో పురుషులు, మహిళల ఎంపికలు ఉంటాయని, జూలై 17 నాటికి 20 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. పోటీల్లో సత్తాచాటిన వారికి ఈ నెల 18న మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.98664 69054ను సంప్రదించాలని సూచించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి కందనూలు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని శ్రీపురం చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాలలో స్కాలర్షిప్లు అందక పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్, నగర సంయుక్త కార్యదర్శి శివ, విష్ణు, జీవన్, భాను, మహేష్, చందు, సందీప్, మహేష్, రాకేష్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.వీణ జోషి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ rktfhu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. మరిన్ని వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పకడ్బందీగా ఆపరేషన్ ముస్కాన్ అమలు
కందనూలు: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు ప్రతి చిన్నారికి విద్యాహక్కు కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన 12వ ఆపరేషన్ ముస్కాన్–2026 సమన్వయ సమావేశానికి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బుధవారం నుంచి జూలై 31 వరకు నిర్వహించే 12వ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, పాఠశాల వయస్సు గల ప్రతి బాల, బాలికలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. ఆర్థిక, కుటుంబ లేదా ఇతర కారణాలతో పిల్లలు చదువుకు దూరమై పనుల్లో చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని హోటళ్లు, టీ దుకాణాలు, గ్యారేజీలు, పరిశ్రమలు, నిర్మాణ పనులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు తదితర ప్రాంతాల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వారిని వెంటనే రక్షించాలని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి చిన్నారి సురక్షిత బాల్యం, నాణ్యమైన విద్యను పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో విద్య, కార్మిక, మహిళాశిశు, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారి బాలల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి, సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి దమయంతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
మహాయాగ మహోత్సవానికి భూమిపూజ
కల్వకుర్తి టౌన్: ప్రజా, దేశ అభివృద్ధి కోసం నిర్వహించే విశ్వశాంతి మహాయాగం విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో నిర్వహించనున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి బుధవారం స్వరూపానంద స్వామీజీ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి యాగవేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధించడంతోపాటు, ఇలాంటి మహాయాగాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. కల్వకుర్తిలో ఇంతటి మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మహాయాగ మహోత్సవానికి నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ పాల్గొని యాగాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్వశాంతి, లోకకల్యాణం, ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాయాగం విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ రత్నమాల వెల్లడించారు. యాగ కార్యక్రమం ఈ నెల 19 నుంచి వచ్చేనెల 3 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. -
నోటీసులు ఇస్తాం..
మున్సిపాలిటీలో రోడ్లపై అక్రమంగా నిర్మించిన ర్యాంపులు, ఆక్రమణలు చేపట్టిన వారికి ముందుగా నోటీసులు జారీచేస్తాం. వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కొత్తగా ఇళ్లు నిర్మించే వారు నిబంధనలు పాటించకపోతే వారికి నూతన మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి కొందరు ఇళ్ల యజమానులు వారికి ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై రాంపులు ఏర్పాటు చేయడంతో చాలా ఇబ్బందులు ఎదురవు తున్నాయి. కొన్నిచోట్ల వాహనదారులు అ టూ.. ఇటూ వెళ్లలేక చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – వెంకటేష్, విద్యానగర్, కల్వకుర్తి -
రాజోళి బండ..!
●ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. 45 వేల ఎకరాలకే అందుతోంది. యాసంగిలో నీళ్లు రాక క్రాప్ హాలిడే ప్రకటించడం ఏటా పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టింది. 2018లో నీటి పంపింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండగా.. 5.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క మోటారు ద్వారానే వరద వచ్చినప్పుడు తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూటరీ 23, 24 నుంచి డిస్టిబ్యూటరీ 35 వరకు తడులు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఆ తర్వాత నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ 40 వరకు నీరందడం లేదు. దీనికింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతీగతి లేదు. ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా జరిగే పనులను సాకుగా చూపి రైతులను మభ్యపెట్టొద్దు. కర్ణాటకలో జరుగుతున్న కొన్ని ప్యాకేజీ పనులు ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేవు. దాని కోసం ఎదురుచూడటం వృథా. ప్రస్తుతం వర్షాలు లేకపోయినప్పటికీ, తు మ్మిళ్ల లిఫ్టు ద్వారా విడుదల అవుతున్న నీటి తో ఆయకట్టుకు జీవం ఉంది. రిజ ర్వాయర్ నిర్మించి ఉంటే నీటి నిల్వ ఉంచుకుని మరో నెలరోజులు పాటు అందించుకునేవాళ్లం. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ.. ఈ మూడు రాష్ట్రాలతో ముడిపడిన రాజోళి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తుంగభద్రపై నిర్మించిన ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోగా.. ప్రస్తుతం దీని భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. నిజాం కాలం నాటి ఈ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఆనకట్ట, కాల్వలు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఈ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలోని నడిగడ్డ రైతులకు శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రాజెక్ట్ నేపథ్యం.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి తాలుకాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ 1958లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 143 కిలోమీటర్ల పొడవున (కర్ణాటకలో 43 కి.మీ.లు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 100 కి.మీ.లు) కాల్వ నిర్మించారు. ఆర్డీఎస్కు మొత్తం 17.1 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో కర్ణాటకకు 1.2 టీఎంసీలు.. తెలంగాణకు 15.9 టీఎంసీలు. తుంగభద్ర నది నుంచి 10 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 7.1 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంది. ఒకటి నుంచి 12 డిస్ట్రిబ్యూటరీలు కర్ణాటకలో.. 13 నుంచి 42 వరకు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట పొడవు 850 మీటర్లు. తెలంగాణకు వచ్చే కాల్వ ఎడమవైపు ఉండగా.. కుడి వైపున ఏపీ సరిహద్దు ఉంటుంది. 2006లో ఆధునికీకరణ ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఏళ్ల తరబడి ఏపీ, తెలంగాణ రైతుల మధ్య వివాదం కొనసాగింది. 2001లో ఇరు ప్రాంతాల రైతులు దాడులకు దిగడంతో ఆర్టీఎస్ శాశ్వత పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆనకట్ట వద్ద వివాదాలకు కారణంగా ఉన్న స్లూయిస్ను మూసివేయించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆర్టీఎస్ ఆధునికీకరణకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటకకు అందజేశారు. అయితే నాలుగు ప్యాకేజీల్లోనూ అరకొర పనులు చేసి అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకోగా.. ఆ తర్వాత ఆధునికీకరణ అటకెక్కింది. ఏడు దశాబ్దాల క్రితం గచ్చుతో నిర్మించిన ఆర్టీఎస్ ఆనకట్ట బలహీనపడింది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో ఇసుక, బురద పేరుకుపోయింది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ తెలంగాణలోని సింధనూరు నుంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడి నుంచి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఎగువన కొత్త పథకాలు.. తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణకు వచ్చే కాల్వల లైనింగ్ దెబ్బతిన్న దృశ్యం అటకెక్కిన ఆధునికీకరణ.. అధ్వానంగా ఆనకట్ట, కాల్వలు కర్ణాటకలో మోటార్లతో యథేచ్ఛగా నీటి చౌర్యం జల విద్యుత్ ప్రాజెక్ట్లకు విచ్చలవిడిగా నీటి వినియోగం అక్రమంగా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నడిగడ్డకు పొంచి ఉన్న ముప్పు.. రైతుల్లో ఆందోళన -
ఎస్ఐఆర్ పారదర్శకంగా జరగాలి
కందనూలు: ఎస్ఐఆర్ పారదర్శకంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలెక్టర్, ఎస్పీతో సమావేశమయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై కలెక్టర్, ఎస్పీ కమిషనర్కు వివరించారు. ఓటరు జాబితా నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు లు, మరణించిన ఓటర్ల తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించే దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. -
గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి : సీపీఎం
వనపర్తి రూరల్: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. పెబ్బేరులో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించి సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్పాషా, గోపాల్దిన్నె, తెల్లరాళ్లపల్లి సర్పంచులు దొడ్ల కవిత, జంబులయ్య, అమరచింత మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు అజయ్, సీపీఎం మండల నాయకులు జి.బాలయ్య, ఆర్.భాస్కర్, దేవన్న, జయరాం, ఊషన్న, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మొదట నష్టపోయేది పాలమూరే
జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. వనపర్తి 3 నారాయణపేట 11 గద్వాల 9 జడ్చర్ల 8 మహబూబ్నగర్ 8 నాగర్కర్నూల్ 17 కల్వకుర్తి 18 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
పోస్టులు 74.. దరఖాస్తులు 1,252
ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ ● జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన దరఖాస్తులు ● ఆయా పోస్టులకు సైతం 294 అర్జీలు ● వడబోతలో త్రిసభ్య కమిటీ నిమగ్నం కందనూలు: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆటపాటలు, తెలుగు, ఇంగ్లిష్ పదాలను నేర్పించడానికి నిష్ణాతులైన ఇన్స్ట్రక్టర్లతో పాటు వారి బాగోగులు చూడటానికి ఆయాల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఖాళీలు తక్కువగా ఉన్నా.. దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉపాధి అవకాశాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. మండలాల వారీగా దరఖాస్తులు ఇలా.. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
వెల్దండ: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కల్వకుర్తి కోర్టు సివిల్జడ్జి ముదికొండ రాజు అన్నారు. మంగళవారం వెల్దండ రైతువేదికలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అందరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. అనంతరం పలు చట్టాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ, సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ యుగంధర్రెడ్డి, బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్, న్యాయవాది చిందం కృష్ణయ్య, వెంకటయ్యగౌడ్, మల్లేష్ పాల్గొన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు అమ్రాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ డా.కృష్ణ అన్నారు. మంగళవారం పదర ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో జరిగిన ప్రసవాలు, ఓపీ సేవలు, మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ పరిధిలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారికి ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా పల్స్పోలియో కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజగోపాలాచారి, కుమార్, పదర వైద్యాధికారిణి పావని ఉన్నారు. విద్యార్థులకు వసతులు కల్పించాలి నాగర్కర్నూల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల జూనియర్ కళాశాలలో రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అదే విధంగా స్కావెంజర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని.. నూతన గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్.శ్రీనివాసులు కందికొండ గీత, పొదిల రామయ్య మధు పాల్గొన్నారు. -
రూ.1,400 కోట్లతో కల్వకుర్తి అభివృద్ధి
కల్వకుర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలనలో కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ. 1400 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి నల్లగొండలో ప్రారంభించిన హ్యామ్ పథకంలో భాగంగా కల్వకుర్తికి పలు రోడ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 160 కి.మీ. మేర 28 రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 100 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జూలై 4న సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారని.. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఎంపీ డా.మల్లు రవి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర 2న కల్వకుర్తికి చేరుకుంటుందని.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే సభకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మధు, ఆనంద్ కుమార్, జిల్లెల్ల రాములు, కౌన్సిలర్లు రామరాజు, ఎజాస్, మక్బూల్, రాహుల్, భూపతిరెడ్డి ఉన్నారు. -
కేజీబీవీలో ముక్కిన బియ్యంతో భోజనం
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ముక్కిన బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. కూరగాయలు సైతం నాణ్యతగా ఉండటం లేదు. కేజీబీవీకి వచ్చిన నాణ్యతలేని కూరగాయలను మంగళవారం ఇన్చార్జి ప్రత్యేకాధికారి తిప్పి పంపించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 230 మంది బాలికలు చదువుకుంటున్నారు. కేజీబీవీలో సరిపడా సీఆర్టీలు, వర్కర్లు ఉండటంతో పాటు బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నాయి. విద్యార్థినులకు నాణ్యత కలిగిన బియ్యం, కూరగాయలతో భోజనం అందించాల్సి ఉండగా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో వండిందే తినాల్సిన దుస్థితి నెలకొంది. కేజీబీవీలో తనిఖీల పేరిట అధికారులు చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప, విద్యార్థినులకు ఎలాంటి భోజనం అందుతుంది.. నాణ్యత ఎలా ఉందని తెలుసుకున్న పాపాన పోవడం లేదని పలువురు వాపోతున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహా రం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అన్ని శాఖలు సమన్వయంతోపనిచేయాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఊర్కొండ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని సీఎం దర్శించనున్న నేపథ్యంలో మంగళవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి.. వేద ఆశీర్వాదాలు పలికారు. అనంతరం అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆలయ దర్శనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆలయ ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, పచ్చదనం రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉర్కొండపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఊర్కొండ మండలంలో ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ మండలస్థాయి అధికారుల కార్యాలయ సముదాయం, నూతన పోలీస్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేపట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, జిల్లా ఏడీ సర్వేయర్ గిరిధర్, తహసీల్దార్ యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సహకారం అవసరం..
అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మన్ననూర్, లింగాల, కొల్లాపూర్లో సర్వేలెన్స్ టవర్స్ ఏర్పాటుచేశాం. సిస్టమ్ ద్వారా లైవ్లో పరిశీలించి మానిటరింగ్ చేపడుతాం. కెమెరా ట్రాప్ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి ● -
నల్లమలలో వేట!
ఏటీఆర్లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్లు, ప్రత్యేక నిఘా బృందాలున్నా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. అభయారణ్యంలో నిత్యం ఏదో ఒకచోట వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసంతో పచ్చళ్లు తయారుచేసి.. రహస్య మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా 15 నుంచి 20 వరకు వన్యప్రాణుల వేటపైనే అటవీశాఖ కేసులు నమోదు చేస్తోంది. నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కి అటవీ ప్రాంతంలో ట్యాంకర్లు వెళ్లే ప్రాంతంలోనే నీటి వసతిని ఏర్పాటుచేశారు. కోర్ ఏరియాలో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అడవి నుంచి బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో దారితప్పి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాలైన సిద్ధాపూర్, మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు ఉడిమిళ్ల, మద్దిమడుగు, తిర్మలాపూర్ (బీకే) తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉండే బోరుబావుల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో కొద్దిపాటి నీరు ఉంది. వన్యప్రాణులు అక్కడికి అధికంగా వస్తుంటాయి. అచ్చంపేట: నల్లమలలో వేటగాళ్ల దాడులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. అడవిలో నీరు దొరక్క బయటకొస్తున్న వాటిని కొందరు వేటాడి చంపేస్తున్నారు. మరికొందరు ఉచ్చులు బిగించి మరీ ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా అటవీ సంపదకు నిలయంగా ఉన్న అనేక అరుదైన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల అమ్రాబాద్ అభయారణ్యంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వేటగాళ్లను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నలుగురిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. 2024–25 సంవత్సరంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన 1,076 ఉచ్చులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తొలగించారు. దీన్ని బట్టి నల్లమలలో వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఏదో ఒకచోట వేటాడుతున్న వైనం కెమెరా ట్రాప్ల్లో చిక్కుతున్న వేటగాళ్లు నీటి కోసం బయటికొచ్చి బలవుతున్న వన్యప్రాణులు -
ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా?
వనపర్తి: దివ్యాంగుల ఆర్థిక బలోపేతానికిగాను ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఆర్ఎస్ (ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం) ఏడాది కాలంగా డోలాయమానంలో పడినట్లయింది. క్షేత్రస్థాయిలో ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నా.. వందశాతం రాయితీతో వచ్చే ఆర్థిక చేయూతకు రాష్ట్ర ఖజానా గేట్లు మూసివేసింది. గతేడాది ఆగష్టులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2026, ఫిబ్రవరిలో నిధుల మంజూరుకు ట్రెజరీకి టోకెన్లు పంపించారు. 2026 ఏడాదికిగాను దరఖాస్తు చేసుకునే సమయం వచ్చినా.. లబ్ధిదారుల చేతికి మాత్రం నేటికీ డబ్బులు అందలేదు. అసలు ఏమైంది.. లోపం ఎక్కడుందనే విషయం తెలియక అమాయకులైన దివ్యాంగులు ప్రతి సోమవారం ప్రజావాణికి, ఇతర రోజుల్లో డీడబ్ల్యూఓ కార్యాలయాలకు ప్రదక్షిణలు చేయడం తప్పా నెలలు గడుస్తున్నా చేకూరిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధితశాఖ అధికారులు, జిల్లాస్థాయి అధికారులు అర్జీలు స్వీకరించడం మినహా ఉన్నతాఽధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు నామమాత్రమేనని చెప్పాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 120కి పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పథకం ముఖ్య ఉద్దేశ్యం.. 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం.. 21 ఏళ్ల నుంచి 55 మధ్య వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్ఎస్ అమలు చేస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరికి, మున్సిపాలిటీకి ఒక ఒకరికి వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా మండల, జిల్లా కమిటీల నిర్ణయం మేరకు వందశాతం రాయితీపై గరిష్టంగా రూ.50 వేల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో ఆ కుటుంబం టైలరింగ్, మొబైల్ రిపేరు, డెయిరీ, కంప్యూటర్ సెంటర్, ఇతర చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి. గతేడాది వరకు సాఫీగానే సాగిన ఈ పథకానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా బ్రేక్ పడినట్లయింది. ప్రభుత్వానికి నివేదించాం.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి డబ్బులు ఖాతాలో జమ చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాం. వారు రాష్ట్ర ఖజానాకి జిల్లా లబ్ధిదారుల జాబితా, విడుదల చేయాల్సిన నిధుల వివరాలతో రాష్ట్రస్థాయి అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. నిధులు విడుదల కాగానే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహ వ్యాపారాల ఫొటోలు తీసి ప్రభుత్వానికి పంపిస్తాం. – అరుంధతి, సూపరింటెండెంట్, డీడబ్ల్యూఓ కార్యాలయం ఈఆర్ఎస్కు దివ్యాంగుల ఎదురుచూపులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు నెలలు గడిచినా ఫలితం శూన్యం ఉమ్మడి జిల్లాలో 120 మంది లబ్ధిదారులు -
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నిరంతర ప్రక్రియ
● అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ప్రత్యేకాధికారి షఫీయుల్లా కందనూలు/వెల్దండ: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నిరంతర ప్రక్రియ అని జిల్లా ప్రత్యేకాధికారి షఫీయుల్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ వినూత్నమైనదని అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలులో రాష్ట్రంలోనే జిల్లా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వేగంగా అందిస్తోందన్నారు. కలెక్టర్ నాయకత్వంలో అధికారులు గ్రామస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్న తీరు అభినందనీయమన్నారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామాన్ని స్వయంగా సందర్శించి.. అక్కడ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు షఫీయుల్లా తెలిపారు. గృహ నిర్మాణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. సొంతింటి కల సాకారమవుతున్న తరుణంలో లబ్ధిదారులు వ్యక్తంచేసిన సంతోషం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకమే నిదర్శనమని అన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పౌరసరఫరాలశాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలు, సాధించిన ఫలితాలను కలెక్టర్ వివరించారు. -
ప్రజావాణికి బారులు
● స్వయంగా కలెక్టర్తో గోడు వెల్లబోసుకున్న జనం ● ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ కిటకిట కందనూలు: సమీకృత కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం బారులు తీరారు. స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్కు వినతిపత్రాలు సమర్పించి.. తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రధానంగా భూ సంబంధిత సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, చేయూత పింఛన్లు, రెవెన్యూ తదితర సమస్యలపై 62 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ఇంటిని ఖాళీ చేయంటున్నారు.. వికలాంగురాలినైన నేను దోమలపెంటలో 30 ఏళ్ల నుంచి పాడుబడిన ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో ఉండమని గత కలెక్టరే చెప్పారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త కూలీ పనిచేయగా వచ్చిన డబ్బులతో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేయమని ఇరిగేషన్శాఖ వారు నోటీసులు ఇచ్చారు. మాకు ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కొండేటి సంతోషమ్మ, దోమలపెంట, అమ్రాబాద్ మండలం బాట నుంచి రానిస్తలేరు.. నేను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి వద్ద 5 ఎకరాల పొలం కొన్నా. అప్పటి నుంచి నేను మా పొలానికి ఉన్నటువంటి బాట నుంచి వెళ్తున్నా. కొన్ని రోజులుగా మా పక్క పొలం అతను మీకు బాట లేదు.. ఎక్కడి నుంచైనా వెళ్లాలని.. ఈ బాట నుంచి పోనివ్వనని ఇబ్బంది పెడుతు న్నారు. అధికారులు స్పందించి నా సమస్య పరిష్కరించాలి. – కాళ్ల పెద్దరాములు, జూపల్లి, చారకొండ మండలం దివ్యాంగుల భవనం ఏర్పాటుచేయాలి.. జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహించుకోవాలంటే సొంత భవనం లేదు. మాకు జిల్లాలో కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. దివ్యాంగులైన మేము పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలు పరిష్కరించాలి. – జిల్లా దివ్యాంగుల పరిరక్షణ కమిటీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి.. నాకు మా ఊరిలో ఇల్లు లేదు. నేను వికలాంగురాలిని. 30 ఏళ్ల నుంచి కిరాణషాపు నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నా. అధికారులు స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి. – అనిత, యాపట్ల, పెద్దకొత్తపల్లి మండలం న్యాయం చేయండి సారూ.. జిల్లాలోని మంగనూరు, గంగారం, లట్టుపల్లి, వడ్డేమాన్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, అవంచ తదితర గ్రామాల్లో 100 మందికి పైగా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని బిజినేపల్లికి చెందిన అరవింద్, శివాజీ, మంగనూర్కు చెందిన ఎండీ హాసన్ కొనుగోలు చేశారు. తేమ, తరుగు పేరుతో తక్కువ ధర నిర్ణయించినా.. వెంటనే డబ్బులిస్తామని చెప్పడంతో నమ్మి సుమారు రూ. 2కోట్ల విలువైన ధాన్యాన్ని కట్టబెట్టాం. తీరా డబ్బులివ్వమంటే అప్పుడు, ఇప్పుడు అంటూ రశీదులు మాత్రం ఇచ్చారు. ఈ నెల 22న బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటూ కొందరు రైతులకు చెక్కులు ఇచ్చారు. బ్యాంక్కు వెళ్తే వారి ఖాతాలో డబ్బులు లేవని చెబుతున్నారు. ఆ తర్వాత వారు ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. తీరా తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసిన దళారుల్లో హాసన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని.. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది. మాకు న్యాయం చేయాలి. -
గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి
కందనూలు: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాలు కృషి చేస్తున్నట్లు జిల్లా సహకార అధికారి రఘునాథరావు అన్నారు. జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో ‘సహకార్ సే సమృద్ధి‘ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి సభ్యుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ నిరంజన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాఖ మానిటరింగ్ అధికారి జి.గణేశ్, సహకారశాఖ అధికారులు నరేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ట్రామా ‘కేర్’ కలేనా?
● గోల్డెన్ అవర్లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు 600కి.మీ. మేర జాతీయ రహదారుల విస్తరణ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సకు అవస్థ ● వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ముందుకు కదలని వైనం మహబూబ్నగర్ క్రైం: జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరుగుతోంది.. కానీ అదే వేగంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడాల్సిన శ్రీగోల్డెన్ అవర్’ (తొలి గంట)లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందకపోవడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రెండున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4,231 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,109 మంది మృత్యవాతపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. 13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లా మీదుగా 44, 167, 167ఏ, 765 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. దాదాపు 600 కి.మీ.మేర విస్తరించి ఉంది. కనీసం 12 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు హడావుడి చేయడం మినహా దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అత్యవసర చికిత్స అందకపోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం, గోల్డెన్ అవర్లో చికిత్స అందకపోవడం, జనరల్ ఆస్పత్రిలో సరైన వసతులు లేక ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎన్హెచ్–44పై 2013లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా బాలానగర్–రాజాపూర్ మధ్యలో, జానంపేట, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి, అలంపూర్ ఎక్స్రోడ్ దగ్గర ట్రామా కేర్ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే పరికరాలు, సౌకర్యాలు, వైద్యులు కూడా అందుబాటులో లేరు. అత్యవసరంలో స్కానింగ్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక అత్యవసర వైద్య సేవల కోసం నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్లలో మూడేళ్ల క్రితం 50 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతావి పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కోస్గి, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, మక్తల్, కొత్తకోట, తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మహబూబ్నగర్, హైదరాబాద్ లేదా కర్నూలుకు తరలించాల్సి వస్తుంది. ప్రయాణానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
దోపిడీని అరికట్టాలి..
జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అడ్డూ అదుపులేకుండా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాల విక్రయాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయి. పాఠశాల లోపల, బయట వర్స్బుక్స్, టై, బెల్ట్, షూ, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి, పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – అనిల్కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లాభార్జనే ధ్యేయంగా.. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అక్కరలేని పుస్త కాలు, అధిక ఫీజుల కు పాల్పడుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి. పుస్తకాల పేరిట రెట్టింపు దోపిడీ చేస్తున్నారు. పుస్తక రచయిత, శీర్షిక, ప్రచురణ సంవత్సరం, ఎడిషన్ వివరాలు లేకుండానే అమ్ముతున్నారు. లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. – శంతన్ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను పాటించాలి. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, ఇతర బుక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – రమేశ్కుమార్, డీఈఓ ● -
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
కందనూలు: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కల మందు వేయించి.. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా ఆస్పత్రిలో జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా పల్స్పోలియో నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పోలియో కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలియో శాశ్వత వైకల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకర వ్యాధి అయినప్పటికీ.. కేవలం రెండు చుక్కల వ్యాక్సిన్తో దాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. మొదటి రోజు పోలియో కేంద్రాలకు రాని చిన్నారులను గుర్తించి.. తదుపరి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన తండాలు, మారుమూల పల్లెలు, వలస కూలీల పిల్లలు, నిర్మాణ కార్మికుల పిల్లలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కల మందు అందేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. డీఎంహెచ్ఓ డా.కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు వయసు కలిగిన 1,00,624 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు 1,17,500 డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఉప్పునుంతల: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గూడు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దాపూర్లో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారంతో లబ్ధిదారులు పక్కా ఇళ్లు నిర్మించుకొని సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం ఉన్నప్పుడు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయే తప్పా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క పేదవాడికి ఇళ్లు మంజూరైన దాఖలాలు లేవని మండిపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, ఉప్పునుంతల సర్పంచు సీహెచ్ శ్రీనివాసులు, నా యకులు నర్సింహరావు, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరా? కల్వకుర్తి రూరల్: క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు ప్రశ్నించారు. ఆదివారం కల్వకుర్తిలో పార్టీ ఏరియా కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 120 నుంచి 72 డాలర్లకు పడిపోయినప్పటికీ ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించడం లేదన్నారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేయడం దారుణమన్నారు. ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని.. వెంటనే ధరల నియంత్రణ చర్యలు చేపట్టకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.ఆంజనేయులు, కృష్ణారెడ్డి, చింత ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, చెన్నయ్య, బక్కయ్య, సిద్ధయ్య ఉన్నారు. నేడు డయల్ యువర్ డీఎం కందనూలు: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్న ట్లు నాగర్కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వర కు 99592 26288 నంబర్ను సంప్రదించి.. రవాణాపరమైన సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచన లు అందించాలని ఆయన కోరారు. -
‘పీవీ’ సేవలు చిరస్మరణీయం
కందనూలు: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పీవీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం సాధించిన అభివృద్ధికి పీవీ నాడు చేసిన సంస్కరణలే ప్రధాన కారణం అని కొనియాడారు. ● కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని 11వ వార్డులో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జక్క రాజు, కౌన్సిలర్లు అవంచ మాధవిరాజు, మొహ్మద్ నిజాముద్దీన్, పడిగె శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జూలై 4న మిడ్జిల్కు సీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
చే‘నేత’ ఎన్నిక
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. రెండురకాల బ్యాలెట్ పత్రాలు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా సంఘాలు ఓటర్లు జోగుళాబ గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 జూలై 10న నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు -
పుస్తకాల దందా!
వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేటు స్కూళ్లు ● నర్సరీ నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల అమ్మకాలు ● మరికొన్ని బుక్స్టాళ్లతో రహస్య ఒప్పందాలు ● తల్లిదండ్రులపై మోయలేని భారం అచ్చంపేటలోని ఓ ఇంగ్లిష్ మీడియం పాఠశాల స్థానికంగా ఒక బుక్స్టాల్తో ఒప్పందం కుదర్చుకుంది. పాఠశాలలోని విద్యార్థులను అదే బుక్స్టాల్లో పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో పాఠశాలలో మూడో తరగతి పుస్తకాలకు రూ. 3వేలు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి వాపోయారు. ఇంకో స్కూల్లో పదో తరగతి డీజీ మ్యాగ్నమ్ వర్క్బుక్స్కు రూ. 2,700 తీసుకుంటున్నారు. నర్సరీ పుస్తకాలకు సైతం రూ. 2వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇలా జిల్లాలోని పలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల వ్యాపారం చేస్తూ.. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.అచ్చంపేట: ిపల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు.. అనేక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, గైడ్స్, టై, బెల్టులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చివరకు యూనిఫామ్లను కూడా నిర్దేశిత దుకాణంలోనే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఆదేశిస్తున్నారు. ఇలా నర్సరీ నుంచే తల్లిదండులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు బహిరంగ రహస్యమే అయినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. పాఠశాల ఎదుటే దుకాణాలు.. ప్రైవేటు స్కూళ్ల ఎదుటే యాజమాన్యాలు షట్టర్లు తీసుకుని టెస్ట్, వర్క్బుక్స్, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. అన్నీ అక్కడే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మార్పీ ధరల ప్రకారం పాఠ్యపుస్తకాల విక్రయానికి డీఈఓ అనుమతి అవసరం. కానీ చాలా చోట్ల పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు. మార్కెట్లో కంటే 30నుంచి 40శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. కొందరు ధైర్యంచేసి ప్రశ్నిస్తే.. అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తరగతుల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల ధరలు ఇలా (రూ.లలో).. -
పర్యాటక ప్రాంతంపై నిర్లక్ష్యం తగదు
కొల్లాపూర్: పర్యాటక ప్రాంతమైన అమరగిరి అభివృద్ధిపై పాలకులు సవతి తల్లి ప్రేమ చూపడం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఫయాజ్ ఆరోపించారు. అమరగిరికి వెళ్లే రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల టూరిజం సర్క్యూట్లో అమరగిరి గ్రామం కూడా ఉందన్నారు. కానీ ఆ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో పర్యాటకులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకులకు ఎన్నిసార్లు సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అమరగిరికి వెళ్లే రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ భన్సీలాల్కు వినతిపత్రం అందజేశారు. ఇందిర, తుమ్మల శివుడు, యూసూఫ్, మల్లేష్, నారాయణ, శివకృష్ణ, చందు, చాపల శేఖర్, కృష్ణయ్య, మద్దిలేటి, కృష్ణయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఏఎండీగా అజిత్రెడ్డి కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన బి.అజిత్రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఒ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్రెడ్డి 2012 సివిల్ సర్వీస్కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. శనేశ్వరుడికి తైలాభిషేకాలు కందనూలు: బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం శనిత్రయోదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి.. వేదమంత్రోచ్ఛారణ నడుమ శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాసీ్త్ర, చైర్మన్ వెల్దండ గోపాల్రావు, సర్పంచ్ టి.సుగుణమ్మ పాల్గొన్నారు. -
ముగిసిన మొహర్రం
కోడేరులో పీర్ల సవారీలో పాల్గొన్న భక్తులు కోడేరు/తెలకపల్లి: జిల్లాలో మొహర్రం ఉత్సవాలు ముగిశాయి. శనివారం కోడేరు, తెలకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి రోజు పీర్ల సవారీ ఉత్సాహంగా సాగింది. తెల్లవారుజామునే పీర్లను లేపి ఊరేగింపు చేపట్టారు. మొహర్రం ఉత్సవాలతో కోడేరు మండలకేంద్రం జనసంద్రంగా మారింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద పీర్లకు ఎబిజ్ కొట్టేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు భక్తులు పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు మటికిలతో నైవేద్యం సమర్పించారు. నిలకడగా ఫుడ్ పాయిజన్ బాధితుల ఆరోగ్యం -
బతుకు.. భారం!
●● తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ● గ్రూప్–3, 4 ఉద్యోగుల చేరికలు, జీపీఓల నియామకంతోనే.. ● నడి వయస్సులో ఉద్యోగ వెతలు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లు కొందరి వార్షిక రెన్యూవల్స్ను నిలిపివేశాం. ఇప్పటికే.. ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో రెగ్యూలర్ టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లను నియమించినందుకు వీరి అవసరం లేదని ప్రభుత్వం తొలగించినట్లుంది. – భానుప్రకాష్, ఏఓ, వనపర్తి కలెక్టరేట్ వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా టీసీసీఓ(టైపీస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)ల తొలగింపుతో వందలాది కుటుంబాల్లో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని సైతం తొలగించడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 73 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ.. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా వీరు సేవలందిస్తుండేవారు. ధరణి ప్రవేశపెట్టి భూ రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయాల్లో చేయడం ప్రారంభించాగా కొత్తగా రిజిస్ట్రేషన్ విభాగంలో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నారు. ఇటీవల గ్రూప్– 3 ,4 ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి నలుగురుకంటే ఎక్కువ మంది టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు వచ్చారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖలకు పంపించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జీపీఓలుగా తిరిగి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, స్థానిక, ఇతర ధ్రువపత్రాలు, రిపోర్టులు తయారు చేసేందుకు సరిపడా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారి ఆవశ్యత అవసరం లేదని భావించిన ప్రభుత్వం వారిని మార్చి 31 తర్వాత పునరుద్ధరించవద్దని ఆదేశాలిచ్చింది. మూడు నెలలు శ్రమ దోపిడీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 73 మందిని తొలగించే ఆలోచనతో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఏ ఉద్దేశంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఇటీవల తాత్కాలికంగా సేవలు అవసరం లేదన్నట్లుగా టర్మినేట్ ఉత్తర్వులు జారీ చేసి ఆయా తహసీల్దార్లతో అందజేయించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు చేసిన పనికి ఎవరు డబ్బులు ఇస్తారనే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. పెండింగ్లో ఏడు నెలల వేతనాలు.. ఉమ్మడి జిల్లాలో టీసీసీఓల విధుల పునరుద్ధరణను నిలిపివేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఏడునెలల వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కోసమో తమను బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సీసీఎల్ఏ ఉత్తర్వుల మేరకు టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 73 మంది టీసీసీఓలను మార్చి 31 తర్వాత రెన్యువర్ నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2026, మార్చి 31న జారీ చేసినట్లు వెలువరించడం శోచనీయం. -
కెమెరాలతో నిఘా..
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌక ర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
● జిల్లాలో 1,00,624 మంది చిన్నారుల గుర్తింపు ● ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా వైద్యారోగ్యశాఖ కందనూలు: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందు వేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. చిన్నారుల నిండు జీవితానికి తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని.. తద్వారా పోలియో మహమ్మారిని నిర్మూలించవచ్చని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 613 కేంద్రాల ఏర్పాటు.. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసు గల 1,00,624 మంది చిన్నారులను గుర్తించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్సెంటర్లు, జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 613 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం 2,884 మంది సిబ్బందిని నియమించారు. ఆర్టీసీ బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 7 గంటల నుంచి చుక్కల మందు పంపిణీని ప్రారంభించనున్నారు. మొదటి రోజు మిగిలిపోయిన చిన్నారులకు 29, 30 తేదీల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. వలస కూలీ ల పిల్లలతో పాటు, వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు నివాసాలకు సైతం ప్రత్యేక బృందాలను పంపనున్నారు. చిన్నారులకు చుక్కల మందు వేయించడం ద్వారా పోలియో రాదు. జీవితాంతం రక్షణతోపాటు అంగవైకల్యాన్ని నివారించవచ్చు. ఉచితమైన, సురక్షితమైన ఈ మందును చిన్నారులకు తప్ప నిసరిగా వేయించాలని వైద్యాధికారులు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారు. పోలియో చుక్కలు వేయించుకోకుండా జిల్లాలో ఏ ఒక్క చిన్నారి ఉండకూడదు. జిల్లాలోని ప్రధాన సెంటర్లతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైద్య బృందం పర్యటిస్తుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు విధిగా చుక్కల మందు వేయించాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ ● -
నిబంధనలు నదిలో తొక్కుతున్నారు
● పరిమితికి మించి బోటులో ప్రయాణికులు ● లైఫ్జాకెట్టు లేని పరిస్థితి ● తప్పిన పెను ప్రమాదం కొల్లాపూర్ రూరల్: మండల పరిధిలోని సోమశిల కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి బోటులో అవతలి ఒడ్డున ఉన్న సంగేమేశ్వరాలయానికి నిబంధనలకు మించి పర్యాటకులను తరలిస్తున్నారు. శుక్రవారం సిద్దేశ్వరం గ్రామానికి చెందిన బోటు యాజమానులు డబ్బులకు కక్కుర్తిపడి దాదాపుగా 80 మందిని ఒకే బోటులో ఎక్కించుకొని సోమశిలకు వస్తు న్న క్రమంలో మధ్యలో సాంకేతిక సమస్యతో నదిలో ఆగిపోయింది. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బోటు డ్రైవర్ సోమశిల బోటు వారికి సమాచారం ఇవ్వడంతో సోమశిల నుంచి మరబోటు వచ్చి ఆగిన బోటుకు తాడుకట్టి ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినట్లు వాపోయారు. బోటులో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, నిబంధనలు పాటించని బోటు యాజమానులపై చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
సోమశిలలో కలెక్టర్ దంపతులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిలను శుక్రవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సతీసమేతంగా సందర్శించారు. వారికి జిల్లా పర్యాటకశాఖ, రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్ దంపతులు సోమేశ్వరాలయం, లలితాంభిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నది అవతల ఒడ్డున్న ఉన్న సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు టూరిజం బోటులో వెళ్లారు. అక్కడి నుంచి బోటులో అక్కమాంబ గుహాలను సందర్శించారు. వారి వెంట ఆర్డీఓ బన్సీలాల్, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, రెవెన్యూ అధికారి గోవిందరెడ్డి, సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి ఉన్నారు. దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యార్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి, సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పీసీసీ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు. ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియామిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్కర్నూల్ జెట్టి వెంకటేష్ను నియమించారు. అలాగే మహబూబ్నగర్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్, నాగర్కర్నూల్ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు.


