breaking news
Nagarkurnool District Latest News
-
బాలికలకు జీవన నైపుణ్యాలు అవసరం
కందనూలు: బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరముందని రాష్ట్ర విద్యాశా ఖ ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేజీబీవీల ప్రత్యేకాధికారులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేజీబీవీల్లో చదువుతున్న బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. బాలికలకు మెరుగైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కేజీబీవీల్లో ఎస్ఓలు అమ్మలా వ్యవహరించాలని.. విద్యార్థినులు ప్రత్యే కాధికారులనే తమ రోల్మోడల్గా భావిస్తారని తెలిపారు. విద్యార్థినులకు మంచి విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా సత్ప్రవర్తనలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేజీబీవీల్లో అమలుచేసి విద్యార్థినుల అభ్యున్నతికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో జీసీడీఓలు శోభారాణి, శుభలక్ష్మి, పూలమ్మ, నర్మద, ఎంఈఓ భాస్కర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్ సూర్యచైతన్య పాల్గొన్నారు. -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
సద్వినియోగం చేసుకోవాలి..
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగాతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్కు ధీటుగా పోటీ పడుతూ.. అన్ని ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దటానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి గరుకులాల్లో చేరే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆటలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. – ఆవుల సైదులు, టీజీఎస్డబ్ల్యూఆర్టీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ● -
వసూళ్లలో తగ్గిన దూకుడు
● లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ ● జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ● సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు ● మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం 2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
అందుబాటులో 1,008 టన్నుల యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ నెలలో జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించారని.. నేటి నుంచి గద్వాల, జడ్చర్ల రేక్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తారన్నారు. మొత్తం 300 ఎరువుల దుకాణాల్లో రైతులకు యూరియా పంపిణీ చేస్తారని.. ప్రతి డీలరు ఏఓ, ఏఈఓ నిర్ధారించిన రైతులకు మాత్రమే ఎరువులు ఇవ్వాలని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు కల్వకుర్తి రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా.మల్లు రవి ఉన్నారు. ఆదివారం రాత్రి కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఆయన పల్లెనిద్ర చేశారు. ముందుగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలియజేయడంతో పాటు పలువురు తమకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. రఘుపతిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం సర్పంచ్ గణేశ్ ఇంట్లో ఆయన రాత్రి బస చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయకుమార్రెడ్డి, హరీశ్రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా కూడారై ఉత్సవంబిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధానార్చకుడు ప్రసాదాచార్యులు, అర్చకులు నవీన్ స్వామి, నరసింహాచార్యులు, తివారి ఆధ్వర్యంలో స్వామివారికి వైష్ణవ సంప్రదాయంలో కూడారై ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభోత్సవానికి ముస్తాబు ● 15న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల ఊరేగింపు ● 16న భోగమహేశ్వరంలో కల్యాణోత్సవం -
గురుకులం..పిలుస్తోంది
కందనూలు: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అదే విధంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు గురుకులాల్లో చేరవచ్చు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి.. అత్యుత్తమ బోధన, పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ, నాణ్యమైన భోజనం, అవసరమయ్యే నోట్పుస్తకాలు నుంచి క్రీడా పరికరాల వరకు ఉచితంగా అందిస్తున్న గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటివని చెప్పవచ్చు. అత్యుత్తమ బోధన.. జిల్లాలోని 10 ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో 4,800 మంది, నాలుగు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1,920 మంది, ఏడు బీసీ సంక్షేమ గురుకులాల్లో 3,360 మంది, నాలుగు మైనార్టీ గురుకులాల్లో 1,920 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. తొమ్మిదో తరగతి స్థాయిలో నీట్, ఐఐటీ, క్లాట్, ఎఫ్సెట్, ఎన్ఐటీ తదితర పోటీలకు ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర యూనివర్సిటీలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక్ స్కూల్లో చేరేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ త్రివిధ దళాల్లో చేరేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. క్రీడలు, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి.. గురుకుల విద్యార్థులకు క్రీడలతో పాటు ప్రత్యేకంగా ఆహార నియమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణనిస్తూ.. ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, ఫైన్ ఆర్ట్స్ తదితర అంశాల్లో తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. నోట్ పుస్తకాలు, యూనిఫాం, ట్రంకు బాక్స్, స్పోర్ట్స్ డ్రెస్లు, ప్లేట్, గ్లాస్, బెడ్షిట్లు, సాక్సులు ఉచితంగా అందజేస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ప్రతినెలా ఒక్కో విద్యార్థికి రూ. 220 చొప్పున చెల్లిస్తున్నారు. 21లోగా దరఖాస్తు చేసుకోవాలి.. గురుకులాల్లో చేరే విద్యార్థులు అడ్మిషన్ కోసం ఈ నెల 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష -
పెద్ద పులులు.. వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పెద్ద పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరచుగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల 20 రోజుల వ్యవధిలోనే సందర్శకులకు మూడుసార్లు పెద్ద పులులు కనిపించాయి. ఎలుగుబంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. -
కార్మికులకు న్యాయం చేసేదాక పోరాటం
వెల్దండ: కార్మికులకు న్యాయం చేసే వరకు వారి తరపున పోరాటం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శనివారం వెల్దండలో కార్మిక కర్షక పోరుయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అధికారంలో ఉండి అదాని, అంబానీ వంటి పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు ప్రజల సంపదను దోచిపెట్టిందని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలిగే విధంగా 29 చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ దాని స్థానంలో జీరాంజీ పథకం తీసుకొచ్చి వందరోజుల పనికి వ్యవసాయ కార్మికులను దూరం చేసేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. వీటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న నాగర్కర్నూల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ, భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, వెంకటేష్, శ్రీనివాసులు, లక్పతి, శివలీల, మెర్లీన్, స్వప్న, తిరుపతయ్య, యాదయ్య, ప్రభాకర్, రాజుగౌడు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం
తెలకపల్లి: జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటిన పెద్దపల్లి విద్యార్థిని రూపొందించిన ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 7 నుంచి 9 వరకు కామారెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో మండలంలోని పెద్దపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని గీతామాధురి ప్రదర్శించిన ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం జాతీయ స్థాయికి ఎంపికై ందని గైడ్ టీచర్ చందుపాషా తెలిపారు. గీతామాధురి ఎలాంటి శ్రమ లేకుండా యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను మొక్కజొన్న, మిరప పంటలకు వెదజల్లేలా ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం రూపొందించారు. ఈ మేరకు జాతీయ స్థాయికి ఎంపికవడంతో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బంగారు పతకం, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనలోనూ ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. అలాగే డీఈఓ రమేష్కుమార్, జిల్లా సైన్సు అధికారి రాజశేఖర్, గైడు టీచర్, ఉపాధ్యా యులు విద్యార్థిని గీతామాధురిని అభినందించారు. -
హైలెవల్.. ముందడుగు
●ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ● ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. ● కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం రెండేళ్లలో నిర్మాణం పూర్తి.. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ -
పరవశించే మది
ప్రకృతి ఒడి..సఫారీ టూర్ కోసం పర్యాటకులు (amrabadtigerreserve.com) వెబ్సైట్నుసందర్శించి ముందస్తుబుకింగ్ చేసుకోవచ్చు. ఒకవైపు చుట్టూ దట్టమైన నల్లమల.. మధ్యలో కృష్ణమ్మ సెలయేరు.. చీమ చిటుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దం.. మరోవైపు పెద్ద పులుల గాండ్రింపు.. చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పుల చప్పుళ్లు.. ఇక ఎటువైపు చూసినా వివిధ రకాల పక్షుల కిలకిలరావాల మధ్య.. ప్రకృతితో మమేకమై సాగే నల్లమల జంగిల్ సఫారీ టూర్ పర్యాటక ప్రియులకు మరచిపోలేని అనుభూతినిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తూ నల్లమల అందాలు, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తున్నారు. 24 గంటలపాటు రణగోనుల ప్రపంచానికి దూరంగా.. ప్రకృతితో మమేకమవుతూ.. రోజంతా ఆనందంగా గడుపుతూ మైమరిచిపోతున్నారు. – సాక్షి, నాగర్కర్నూల్ నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు విశేష స్పందన లభిస్తోంది. సాధారణం కన్నా శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 8 సార్లు పెద్ద పులి కనిపించడం విశేషం. జంగిల్ సఫారీలో నిత్యం పర్యాటకులకు పులులతోపాటు చిరుతలు, వన్యప్రాణులు తారసపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అమలుపరుస్తున్న టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం పెద్దసంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు రోజులపాటు.. పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ -
సీఎంకు రుణపడి ఉంటాం..
గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) సందడిగా మారింది.. మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) -
ప్రాణం తీసిన.. బైక్ సరదా
● అతివేగంగా వెళ్లి కిందపడటంతో బాలుడి దుర్మరణం వైభవంగా ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి వాల్పోస్టర్ను శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆయన సతీమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అనురాధ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అలాగే రంగాపూర్, దర్గాతండా వద్ద హజ్రత్ నిరంజన్షావలీ ఉర్సు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని, రెండుచోట్ల భక్తులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనిదోష నివారణ పూజలు బిజినేపల్లి: శనిదోష నివారణ కోసం భక్తుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శనేశ్వరస్వామి ఆలయ అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శనేశ్వరుడి ఆలయానికి చేరుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ‘నిర్వాసితులను విస్మరించడం తగదు’ చారకొండ: గోకారం జలాశయం ముంపు నుంచి తమ గ్రామాలను మినహాయించాలని 40 రోజులుగా నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించడం తగదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు అన్నారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న మండలంలోని గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే లగచర్ల లడాయి వంటిది తప్పదని హెచ్చరించారు. వివరాలు –IIలో u– కల్వకుర్తి టౌన్ -
రిజర్వేషన్.. ఏమొస్తదో
మున్సిపాలిటీ ఎన్నికలపై జోరుగా చర్చ ● వార్డుకు ఐదారుగురి పేర్లు పరిశీలిస్తున్న పార్టీలు ● జనరల్ స్థానాలపై సీనియర్ నేతల ప్రత్యేక దృష్టి ● రిజర్వేషన్, నామినేషన్ల మధ్య రెండు, మూడు రోజులే సమయం ● జిల్లాలోని మూడు పురపాలికల్లో రాజకీయ సందడి అచ్చంపేట: పుర పోరు ముంచుకొస్తున్న తరుణంలో జిల్లాలో అందరి నోటా రిజర్వేషన్ల మాటే వినిపిస్తోంది. వార్డులు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ఏం వస్తదో అనే ఆలోచనల్లో ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు రిజర్వేషన్లు మారి చైర్మన్ గిరి దక్కే అవకాశం ఉందంటూ జోస్యం చెబుతున్నారు. అన్ని పార్టీలు రిజర్వేషన్ ఏది వచ్చినా అందుకు తగ్గట్లుగానే ముందే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే 3 మున్సిపాలిటీల పరిధిలోని 65 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో పోటీలో నిలవాలని అనుకుంటున్న ఆశావహులు మున్సిపాలిటీకి కట్టే పన్నులను చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. పోటీకి ఆసక్తి.. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మున్సిపాలిటీకి మే 6 వరకు సమయం ఉండటంతో నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిలపైనే అందరి దృష్టి ఉంది. ఆశావహులు అందరూ రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. రిజర్వేషన్ తేలితేనే పోటీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ వెల్లడించిన తర్వాత నామినేషన్కు మధ్యలో సమయం పెద్దగా ఉండకపోవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 వరకు తుది జాబితా ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు ఆలోగా పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. చైర్మన్ సీటుపై గురి నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు రిజర్వు చేస్తారనే చర్చ సాగుతోంది. రాష్ట్రస్థాయిలో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని మన్సిపల్ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. వార్డులకు కలెక్టర్ అధ్యక్షత రిజర్వేషన్లు ఖరారవుతాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ జనరల్ మహిళకు కేటాయిస్తే బీసీ మహిళను చైర్పర్సన్గా ఎంపిక చేశారు. కొల్లాపూర్ బీసీ మహిళ, కల్వకుర్తి, అచ్చంపేట జనరల్కు కేటాయించారు. అచ్చంపేటలో బీసీ జనరల్ను చైర్మన్గా కూర్చోబెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ఇక్కడ తిరిగి జనరల్ వ్యక్తిని చైర్మన్గా కుర్చీ చేపట్టారు. ఈసారి కలిసొస్తే వార్డు కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్ సీటుపై కూర్చోవాలని పలువురు దృష్టి సారించారు. ఈ మేరకు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. వార్డుల రిజర్వేషన్లు కూడా ఇప్పటికే రెండు పర్యాయాలు ఒకే సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంపికవడంతో ఈసారి మార్పు తథ్యమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వార్డుల రిజర్వేషన్లపై కూడా ఉత్కంఠ నెలకొంది. జంపింగ్లకు చెక్ పెట్టేలా.. రిజర్వేషన్ల కేటాయింపు నామినేషన్లకు మధ్య తక్కువ సమయం ఉండటం అసంతృప్తి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలకు చెక్పెట్టే విధంగా కలిసి వచ్చింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే బీజేపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీలను ఆశ్రయించే అవకాశం ఉంది. మిగతా పార్టీలు కూడా ఇతర నాయకులను చేర్చుకుని బలపడే ఆలోచనలో ఉన్నాయి. -
సిబిల్ సప్లయ్..!
ఉమ్మడి పాలమూరు జి ల్లాలో 2020 నుంచి న వంబర్ వరకు 148 మంది మిల్లులను డీఫాల్ట్గా గుర్తించి.. 52 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వీటి పరిధిలో రూ.566 కోట్ల విలువైన ధాన్యం ఉంది. ఇందులో రూ.450 కోట్ల విలువైన ధాన్యాన్ని రాబట్టాల్సి ఉండగా..ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. పైగా ఆయా రైస్ మిల్లర్ల చేతిలోని మిల్లులు సహకరించే అధికారులు, నేతలకు అక్షయపాత్రగా మారాయి. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సైతం సందర్భాన్ని బట్టి దాడులు నిర్వహించి.. చేతులు తడుపుకొని పోతారనే విమర్శలూ ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఆ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోనే మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గ్రహించిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అవినీతికి కేరాఫ్గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఏ‘సీ’బీ.. చిక్కిన డీఎం వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. ముందుగావిజి‘లెన్స్’.. డీఎస్ఓ, అడిషనల్ కలెక్టర్పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని వాహనదారులు ప్రతిఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రోడు భద్రతపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలను సిగ్నల్ వద్ద సూచనలు పాటించాలని, జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని సూచించారు. రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఐదు నెలల పాటు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ నాగర్కర్నూల్ క్రైం: మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో షీటీం, సైబర్ క్రైంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించేందుకు సురక్షిత వాతావరణం కల్పించడమే షీటీం లక్ష్యం అన్నారు. మహిళలు వేధింపులకు గురైతే డయల్ 100, సెల్ నం.87126 57676కు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సీఐ శంకర్, ఎస్ఐలు వీణారెడ్డి, రమాదేవి, రజిత, ఏఎస్ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి కల్వకుర్తి రూరల్: ఉమ్మడి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. శుక్రవారం కల్వకుర్తిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, దీనిపై రైతుల పక్షాన పోరాడుతామన్నారు. అనంతరం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే పార్టీ వందేళ్ల ఉత్సవాల వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి పరశురాములు మాట్లాడుతూ ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభకు పెద్దఎత్తున కార్యకర్తలు, సానుభూతిపరులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో దాసు, ప్రేమ్కుమార్, శివ, శ్రీను, రాజు, రవీందర్, వీరేశం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,809 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,729 ధరలు పలికాయి. అలాగే హంస రూ.1,871, కందులు గరిష్టంగా రూ.6,876, కనిష్టంగా రూ.5,056, వేరుశనగ గరిష్టంగా రూ.8,733, కనిష్టంగా రూ.6,903, ఉలువలు రూ.3,610, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.5,720గా ఒకే ధర లభించింది. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల చివరి విడత భూ సేకరణ వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆర్డీఓలు, నీటి పారుదల, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, తహసీల్దార్లతో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. తాడూరు, బిజినేపల్లి, వెల్దండ, కల్వకుర్తి, తిమ్మాజిపేట, ఊర్కొండ, వంగూరు మండలాల్లో సేకరిస్తున్న భూసేకరణపై చర్చించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన చివరి దశ భూ సేకరణ పనులు వేగంగా జరగాలని, సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకం లేకుండా సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సేకరణ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇంకా కావాల్సిన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాలి కొల్లాపూర్ రూరల్: వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మండలంలోని సింగోటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి విద్యార్థుల పరీక్ష సన్నద్ధత, విద్యా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు అడిగి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రోజువారి పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల హాజరు పెంచేందుకు తలిదండ్రులతో సమన్వయం పెంచి పాఠశాల కార్యక్రమాలలో భాగస్వాములు చేయాలన్నారు. -
3 మున్సిపాలిటీలు.. 358 అభ్యంతరాలు
● మున్సిపాలిటీలలో ఓటరు డ్రాఫ్టుపై ముగిసిన గడువు ● నేడు తుది జాబితా విడుదల చేయనున్న అధికారులు కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు విడుదల చేసిన ఓటర్ డ్రాఫ్ట్పై అభ్యంతరాల గడువు ముగిసింది. ఓటరు జాబితాపై ఈ నెల 1 నుంచి శుక్రవారం వరకు మున్సిపల్ అధికారులు అభ్యంతరాలు ఆయా మున్సిపాలిటీలలో స్వీకరించారు. ఇందులో జిల్లాలోని కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 65 వార్డులకు కలిపి 358 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు తెలిపారు. స్వీకరించిన అభ్యంతరాలను ఒక్కొక్కటిగా ఆయా వార్డు ఆఫీసర్లు పరిష్కరించి, అధికారులకు నివేదికలు అందించారు. పరిష్కరించిన అభ్యంతరాలను మరోమారు తుది రూపు ఇచ్చి మున్సిపాలిటీల వారీగా శనివారం తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఎక్కువగా వార్డు మార్పులపైనే.. మున్సిపాలిటీలలో ఎక్కువగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చిన వాటిపైనే ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చాలా వరకు ఇవే అభ్యంతరాలు రాగా.. మరికొన్ని ఓటర్లు కానీ వారు ఓటరు జాబితాలో ఉన్నారన్న అభ్యంతరాలు వచ్చాయి. వాటికి సంబంధించి అభ్యంతరాలను ఇప్పుడు పరిష్కరించలేమని అధికారులు ఫిర్యాదు చేసిన వారికి తెలిపినట్లుగా సమాచారం. అయితే ఓటరు జాబితాలో వేరే ఓటర్లు చేరికతో ఏమైనా వార్డుల రిజర్వేషన్లలో తేడాలు ఉంటాయేమోనని ఆశావహులు ఆందోళనలో ఉన్నారు. -
పకడ్బందీగా ‘ఆపరేషన్ స్మైల్’ తనిఖీలు
నాగర్కర్నూల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో 12వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఇందుకోసం కార్మిక, పోలీస్, విద్య, మహిళాశిశు సంక్షేమ శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు. పరిశ్రమలు, హోటళ్లు, లాడ్జీలు, వ్యాపార సముదాయాలు, గోదాంలు, ఇటుక బట్టీలు, మెకానిక్, వర్క్షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. తనిఖీల సమయంలో గుర్తించిన బాల కార్మికులకు పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, వీధుల్లో తిరుగుతున్న పిల్లలు కనిపిస్తే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. గతేడాది 33 కేసులు నమోదు కాగా 28 ఎఫ్ఐఆర్ చేశామని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలం కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సఖి కేంద్రం కేసుల వివరాలపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, లేబర్ అధికారి రాజ్కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణ్రావు, సఖి కేంద్రం కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. -
హాల్టికెట్.. చెకిట్!
● పేరెంట్స్ వాట్సప్ నంబర్లకు ప్రివ్యూ ● ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు ● తప్పులు దొర్లితే ముందస్తుగా సరిచేసుకునే అవకాశంఅచ్చంపేట: పరీక్ష సమయాల్లో ఆందోళనలకు గురికాకుండా ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ముందుస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్టికెట్ల ప్రివ్యూను ఇంటర్ బోర్డు విద్యార్థులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు పంపించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్లో వాట్సప్ ఉన్న నంబర్లకు వారి పిల్లలకు సంబంధించిన హాల్టికెట్ల ప్రివ్యూను పంపించనున్నారు. ఈ ప్రివ్యూను ఇటీవలే అమలులోకి తీసుకురాగా.. తల్లిదండ్రులకు పంపిన హాల్ టికెట్స్ ప్రివ్యూలో విద్యార్థికి సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్ను సంప్రదించి సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల హాల్టికెట్స్ ప్రివ్యూ రావాలంటే ఆ విద్యార్థి ఎస్సెస్సీ రూల్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్ ప్రివ్యూను చూసుకోవచ్చు.అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి మొదటి సంవత్సరం హాల్టికెట్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం విద్యార్థి మొదటి సంవత్సరంలో పాసైన, ఫెయిలైన సబ్జెక్టులతోపాటు ఆయా పరీక్షల టైం టేబుల్ వివరాలు ఉండనున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండటంతో హాల్టికెట్లను సకాలంలో పొందడం, లోపాలను సరిచేసుకోవడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడం కోసం ఈ వాట్సప్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. వచ్చేనెల 2 నుంచి ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 16, ప్రభుత్వ సెక్టారులో 54, ప్రైవేట్ కళాశాలలు 19 ఉండగా.. వీటిలో మొత్తం 13,547 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో మొదటి సంవత్సరం 6,879 మంది, రెండో సంవత్సరం 6,668 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఫ్రిబవరిలో జరగనున్న పరీక్షలకు సంసిద్ధులవుతున్నారు. కాగా ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 22న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఉండనుంది. ఫ్రిబవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. -
ముంపు గ్రామాలను మినహాయించాలి
చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు నిర్వాసితులు ఎర్రవల్లి, ఎర్రవల్లితండా బాధితులు గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్ను కలిశారు. ముంపు గ్రామాలను మినహాయించాలని, ఆర్అండ్ఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముంపు గ్రామాల సమస్యను అంసెబ్లీలో ప్రస్తావించారని కలెక్టర్కు వివరించారు. ముంపు పునరావసం, ఆర్అండ్ఆర్ తదితపరి చర్యలను నిలిపివేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు నాగయ్యనాయక్, పెద్దయ్యగౌడ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 38వ రోజుకు రిలే దీక్షలు మండలంలోని గోకారం శివారులో చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి నిర్వాసితులకు న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 38వ రోజు కొనసాగాయి. ప్రభుత్వం స్పందించి ముంపు గ్రామాలను మినహాయించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జిల్లాలో 1,229 టన్నుల యూరియా నిల్వలు
నాగర్కర్నూల్: జిల్లాలో ప్రస్తుతం 1,229 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసింగిలో మొక్కజొన్న సాగు 1.2 లక్షల ఎకరాలు, వరి 1.8 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నందున రైతులకు సరిపడా యూరియా కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,514 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందకుండా సరిపడా యూరియాను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. అధికారులు, డీలర్లు యూరియా పంపిణీపై జారీ చేసిన ఆదేశాలు పాటించాలని సూచించారు. ‘108’ అంబులెన్స్ తనిఖీ మన్ననూర్: అమ్రాబాద్ మండల పరిధిలో రోగులకు అత్యవసర సేవలందిస్తున్న 108 అంబులెన్స్ వాహనాన్ని గురువారం జిల్లా మేనేజర్ షేక్ జాన్ వహీద్, శ్రీను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనం ద్వారా అత్యవసర రోగులకు అందుతున్న సేవల వివరాలను అంబులెన్స్ ఈఎంటీ మల్లేష్, పైలెట్ సైదులును అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ విషయంలో మందులు అందజేయడంతోపాటు సేవలందించడంలో ఎలాంటి ఫిర్యా దులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల ని సూచించారు. వాహనం కండీషన్ పరిశీలించిన వారు అత్యవసర సమయాల్లో క్షతగాత్రు లు, రోగులు వాహనం సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఉండాలన్నారు. క్యాన్సర్ నివారణకు టీకా తప్పనిసరి వెల్దండ: గర్భశాయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. గురువారం ఆయన వెల్దండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో గర్భశాయ ముఖ ద్వారంతో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందడంలో దేశం రెండోస్థానంలో ఉందన్నారు. 40 శాతం మహిళలు ఈ వ్యాధిబారినపడి మృతి చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా 14–15 ఏళ్లలోపు వారికి నివారణ టీకా ఇవ్వడానికి చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో నెలకొన్న సిబ్బంది కొరతను త్వరగా పరిష్కరిస్తామన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను వెంటనే సొంత భవనాల్లోకి వెళ్లాలన్నారు. వెల్దండలోని పీహెచ్సీలో అసంపూర్తి పనులు ఉంటే పూర్తిచేసి వైద్య సేవలు కొనసాగించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ భీమానాయక్, డాక్టర్ సింధు, సిబ్బంది మనోజ్కుమార్, పద్మలత, లక్ష్మణ్, మురళీమనోహర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గజిబిజి.. గందరగోళం
మున్సిపల్ ఓటరు జాబితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు ● పలుచోట్ల ఇష్టారీతిగా వార్డులు, ఓటర్ల విభజన ● కల్వకుర్తిలో ఒకే ఇంటి నంబర్లో 15 మందిని చేర్చిన వైనం ● క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే రూపొందించారని ఆక్షేపణ ● నేటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు వాళ్లు ఎవరో తెలియదు.. మా ఇంటి నంబర్పై మొత్తం 15 మంది ఓటర్లు ఉన్నారు. కానీ, మా ఇంట్లో నలుగురమే ఉన్నాం. మిగతా వాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు సంబంధం లేకుండా ఇతరుల ఓట్లను ఎలా నమోదు చేస్తారు. దీనిపై అధికారుల నుంచి సమాధానం లేదు. జాబితాను సవరించి ఎన్నికలు నిర్వహించాలి. – రాజుగౌడ్, కల్వకుర్తి నేటి వరకు అవకాశం.. మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాలకు శుక్రవారం వరకు గడువు ఉంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిలో అర్హమైన వాటిని తప్పకుండా సవరిస్తాం. ఇంటి నంబర్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత జాబితా రూపొందిస్తాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో చేర్పులు, వార్డుల విభజనలో గందరగోళం నెలకొంది. ఓటర్ల నమోదుతోపాటు వార్డుల కేటాయింపులో పెద్దఎత్తున తప్పులు దొర్లడంతో మున్సిపాలిటీ కార్యాలయాలకు అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. అయితే శుక్రవారం వరకు మున్సిపాలిటీ ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని సంబంధిత అధికారులు చెబుతుండగా.. జాబితా సవరణపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే.. మున్సిపాలిటీ ఓటరు జాబితా సిద్ధం చేయడంతోపాటు వార్డుల వారీగా ఓటర్ల విభజన విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు చేపట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నంబర్లో పదుల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయడం, వార్డులకు సంబంధం లేకుండా ఇతర గ్రామాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఓటర్లుగా నమోదుకావడం చర్చకు దారితీస్తోంది. బీఎల్ఓ ద్వారా వార్డులోని ప్రతి ఇంటిలో క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఓటరు నమోదు చేపట్టాల్సి ఉండగా.. పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో జాబితాలో పెద్దఎత్తున తప్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇంటి యజమానులు, బీఎల్ఓలకు సైతం తెలియకుండానే ఓటర్లుగా నమోదు కావడం గమనార్హం. -
సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
● రీజియన్ నుంచి అదనపు బస్సులు ● హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు ● నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు స్టేషన్ మహబూబ్నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు సద్వినియోగం చేసుకోండి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం -
రెండేళ్లలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గడిచిన రెండేళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తానని చెప్పారు. ఇందులో భాగంగానే ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో మంజూరు అవుతాయని, ఇప్పటికే తెలకపల్లికి డిగ్రీ కళాశాల మంజూరైందని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ నుంచి తరలిపోయిన బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా బూట్లు అందిస్తామన్నారు. వట్టెం పంపు హౌజ్కు కరెంటు మంజూరు చేయించామని, మార్కండేయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల ఇంటి పోరుతో కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. తనకంటే ముందు రేవంత్రెడ్డి సీఎం కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోపోతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ముందు ఇంటి పంచాయితీ తేల్చుకోవాలని, ఇంటి ఆడపడుచు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. బల్లగుద్ది చెబుతున్నా రాష్ట్రంలో, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ తరపున ఎన్నికై న సర్పంచ్లు, ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్టీఓ మెంబర్ గోపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీను, నిజాం తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో విద్యాప్రమాణాలు పెంపొందించాలి
కందనూలు: కేజీబీవీలో విద్యాప్రమాణాలు పెంపొందించాలని రాష్ట్ర బాలిక సమగ్ర అభివృద్ధి అధికారి డాక్టర్ శిరీష అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీపా ఆధ్వర్యంలో సాధికారతపై నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కేజీబీవీ ప్రత్యేకాధికారులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా డాక్టర్ శిరీష, డీఈఓ రమేష్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష పథకం కింద పనిచేస్తున్న కేజీబీవీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కేజీబీవీల నిర్వహణ, విద్యా ప్రమాణాల అమలు, విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, పరిశుభ్రత, వసతి గృహాల నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేకాధికారుల నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని డాక్టర్.శిరీష అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు చర్యలు కస్తూర్బాల్లో బాలికల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా, ఆధునిక పద్ధతులు అవలంబించేలా ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రమేష్ అన్నారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని కేజీబీవీల్లో అమలు చేసి వాటి అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ సతీష్కుమార్, జీసీడీఓ శోభారాణి, వనపర్తి జీసీడీఓ శుభలక్ష్మి, నాగర్కర్నూల్ ఎంఈఓ భాస్కర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు సూర్య చైతన్య, సూర్యాపేట జీసీడీఓ పుల్లమ్మ, సిద్దిపేట జీసీడీఓ నర్మద, పద్మ, సూర్యకళ, రెండు జిల్లాల కస్తూర్బా బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
మెరుగైన బోధన అందించాలి
తెలకపల్లి: విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా మానిటరింగ్ అధికారి రఘురామరావు అన్నారు. బుధవారం మండలంలోని కమ్మరెడ్డిపల్లి, గౌరెడ్డిపల్లి పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అయన వెంట జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంఈఓ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: నాగర్కర్నూల్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్ అచ్చంపేటలో ఖాళీగా ఉన్న పని మనిషి, నైట్ వాచ్మెన్ పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మౌఖిక పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి కనిష్ట వయస్సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు కలిగి ఉండాలని, దరఖాస్తుకు ఈ నెల 17వ తేదీలోపు జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో దర ఖాస్తు సమర్పించాలని కోరారు. నేడు డయల్ యువర్ డీఎం కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను డిపో పరిధిలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా డీఎం సుభాషిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గంట పాటు కార్యక్రమం ఉంటుందని, ఫోన్ చేసే వారు 99592 26292 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలి
నాగర్కర్నూల్: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, కలెక్టర్లు, అధికారులతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత తేదీల్లో ఎలక్ట్రోరల్ జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ముందుగానే గుర్తించి, అవసరమైన మౌలిక వసతులు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు సులభంగా చేరుకునేలా ఉండాలని, గుర్తింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నామినేషన్ ప్రక్రియ, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం ఖరారు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపాలిటీల వార్డుల వారీగా వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెలా నిర్వహిస్తున్న ఈవీఎం గోదాం తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలు, వాటి భద్రతకు చేసిన ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థ, లాక్స్, సీల్స్ తదితర సాంకేతిక అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని, సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గోదాములో ప్రవేశానికి సంబంధించి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, రిజిస్టర్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రవికుమార్, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రైతుల ఆందోళన
వెల్దండ: మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య, రవితో పాటు మరో 50 మందికి చెందిన భూమిని కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు ఆరోపిస్తూ బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 60 ఏళ్ల క్రితం తాము గ్రామంలోని సర్వే నంబర్ 351, 352లో గల భూమి కొనుగోలు చేశామని తెలిపారు. దానిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి వారసులమంటూ వచ్చిన కొందరు పోలీసుల సాయంతో తన పేరు మీద ఉన్న 12.23 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారని వాపోయారు. విషయం తెలియడంతో బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి కోర్టులో పెండింగ్లో ఉన్న భూమిని ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని అధికారులను ప్రశ్నించారు. భూమి రిజిస్ట్రేషన్ చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాలను లాగేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ను వాయిదా వేయడంతో రైతులు ఆందోళన విరమించారు. -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ‘కిడ్నీ’ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
సర్వే చేయిస్తాం..
సింగోటం ఆలయ భూములు చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ భూముల్లోని ముళ్ల పొదలు తొలగించే అంశం పరిశీలనలో ఉంది. అలాగే ఆలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూస్తాం. ముందుగా భూమి హద్దులు గుర్తించేందుకు సర్వే చేయించి.. కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. – రంగారావు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓ, సింగోటం పేద రైతులకు ఇవ్వాలి సింగోటం ఆలయ భూ ములను రాజుల కాలం నుంచే మా గ్రామస్తులు కౌలు ప్రాతిపదికన సాగు చేస్తున్నారు. కానీ, చాలా ఏళ్లుగా రైతులకు కౌలుకు ఇవ్వడం లేదు. దీంతో ఆ భూములన్నీ బీళ్లుగానే ఉన్నాయి. పేద రైతులకు కౌలుకు ఇస్తే రైతులు బతకడంతోపాటు ఆలయానికి కూడా ఆదాయం వస్తుంది. దీనిపై దేవాదాయశాఖ అధికారులు దృష్టిసారించాలి. గతంలో భూములు సాగు చేసిన రైతులు శాశ్వత కౌలుకు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. – ఇందిరమ్మ, మాజీ సర్పంచ్, సింగోటం గ్రామం ● -
పక్కనే శ్రీవారి సముద్రం..
సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూముల్లో కేఎల్ఐ కాల్వలు, సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని శ్రీవారిసముద్రం రిజర్వాయర్ కూడా ఉంది. సాగుకు సరిపడా నీరు ఉన్నా భూములు బీడుగానే ఉంటున్నాయి. సమీప పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతుంటే మాన్యం భూములు మాత్రం బీడువారి దర్శనమిస్తున్నాయి. మాన్యం భూమిలో కొంతమేర చెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆలయ భూమిలో లీజు ప్రాతిపదికన మామిడి మార్కెట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరగగా.. అగ్రిమెంట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో మార్కెట్ నిర్మాణం జరగలేదు. తర్వాత కాలంలో మళ్లీ ఈ భూమి గురించి అధికారులు కానీ, ఆలయ కమిటీ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ భూములు ఆక్రమించవద్దని ఒకచోట బోర్డు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసినహెచ్చరిక బోర్డు -
పాలమూరును ఎడారి చేసే కుట్ర
సాక్షి, నాగర్కర్నూల్/ కొల్లాపూర్/ అమరచింత/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. నాటి నుంచి నేటి వరకు పాలమూరుకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్దే పాపం అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 90 శాతం పూర్తయినప్రాజెక్టుపై నిందలా జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం -
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు
బిజినేపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచిత పుస్తకాల పంపిణీ వంటి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ శ్రీకృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని అడ్మిషన్ ప్రత్యేక కార్యక్రమం కింద 14 జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యతోపాటు విజ్ఞానం, భవిష్యత్లో ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కోచింగ్, జేఈఈ మెయిన్స్ వంటి వాటికి ఉచితంగా మెటీరియల్స్ పంపిణీ చేస్తుందని వివరించారు. ఆయా వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇకపై విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలలకు నేరుగా అడ్మిషన్లు అందుతాయన్నారు. కార్యక్రమంలో పాలెం కళాశాల అధ్యాపకులు మదన్మోహన్రెడ్డి, మహ్మద్గౌస్, గోపి, వినోద్, పద్మజ, ప్రవీణ్, విష్ణు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించాలంటే డ్రైవర్పైన ఆధారపడి ఉంటుందని, ఎప్పుడైతే డ్రైవర్ అన్ని రోడ్డు భద్రత నియమాలను పాటిస్తారో అప్పుడే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపటం, నిర్ణీత వేగం కంటే ఎక్కువగా వెళ్లడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందితో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ యాదయ్య, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అనూప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.36వ రోజు రిలే దీక్షలు చారకొండ: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగమైన మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణం సామర్థ్యం తగ్గించాలని ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 36వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆయా గ్రామాల మినహాయింపుపై జీఓ జారీ చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెగేసి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోసీపీఎం అభ్యర్థుల పోటీ కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను పోటీలో నిలుపుతామని పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందని వివరించారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే సీపీఎం నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి శివవర్మ, నాయకులు తారాసింగ్, సలీం, వెంకట్, సంజీవ్, సాయికుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. ముంపు బాధితులకు న్యాయం చేస్తాం అచ్చంపేట రూరల్: మండలంలోని నక్కలగండి పునరావాస బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని సిద్దాపూర్ పరిధి సర్వే నంబర్లు 192, 198లలో ఉన్న భూమిని పరిశీలించి.. ముంపు బాధితులతో అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. కొంత మంది బాధితులు అభ్యంతరాలను వెలిబుచ్చగా.. ఆయా అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ముంపు బాధితులకు అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, ఎంఆర్ఐ శివ, ఆర్ఐ బాల్రాం, ముంపు బాధితులు, సిద్దాపూర్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాపై అభ్యంతరాలు చెప్పండి
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటరు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3 మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా అభ్యంతరాలపై మున్సిపాలిటీల వా ర్డుల వారీగా ఇది వరకే విడుదల చేశారన్నారు. ము సాయిదా ఓటరు జాబితాను జనవరి 1న నోటీసు బోర్డులపై వార్డుల వారీగా ప్రచురించామని, ఏవై నా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సకాలంలో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుదిజాబితా 10న ప్రచురిస్తామ న్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావు గా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. జిల్లాలోని నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులు, 48 పోలింగ్ కేంద్రాలు, కల్వకుర్తిలో 22 వార్డులు, 44 పోలింగ్ కేంద్రాలు, కొల్లాపూర్లో 19 వార్డులు, 38 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు నాగర్కర్నూల్లో 28 అభ్యంతరాలు, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్లో 50 అభ్యంతరాలు వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఫాం–7 లేకుంటే ఏ ఒక్క ఓటరు తొలగించడం జరగదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గుర్తించిన డూప్లికేట్, డబుల్, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల వివరాలను తమకు అందిస్తే పరిశీలించి ఫాం–7 ద్వారా తొలగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు 9 బంగారు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణ పేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగా రు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజ తం, 10 కాంస్యంతో 13 పతకాలు సాధించారు. సీఎం కప్ కోసం సన్నాహాలు గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు 17 నుంచి వచ్చేనెల 26 వరకు క్రీడల నిర్వహణ -
బంగారం వంటి భూములు.. బీడుగా వదిలేశారు!
రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన, కొల్లాపూర్ సురభి రాజవంశస్తుల కులదైవమైన సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 264 ఎకరాల మాన్యం భూమి ఉంది. మాచినేనిపల్లి, సింగోటం గ్రామాల శివార్లలో ఉన్న ఈ భూమిని కౌలుకు ఇచ్చి.. దాంతో వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించేవారు. అయితే రెండున్నర దశాబ్దాల క్రితం కౌలు పునరుద్ధరణ విషయంలో ఆలయ కమిటీ, రైతులకు మధ్య వివాదం నెలకొనడంతో కౌలు వేలం నిలిపివేశారు. నాటి నుంచి మాన్యం భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఆలయ అర్చకుల ఆధీనంలో ఉన్న 18 ఎకరాల భూమి మినహాయిస్తే మిగతాదంతా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. మాన్యం భూమిని కౌలుకు ఇస్తే వాటిని సాగు చేసునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆనాటి ఘటనతో కినుక వహించిన అధికారులు నేటికీ భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేయ డం లేదు. అలాగే కొల్లాపూర్లోని రామాలయానికి ఎల్లూరు, గడ్డబస్వాపూర్ గ్రామంలో 12 ఎకరాలు, కొండూరులో 84 ఎకరాలు, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయానికి బెక్కెం గ్రామంలో 11 ఎకరాల మాన్యం భూములు ఉండగా.. వీటికి కూడా కౌలు పంచాయితీలు నెలకొన్నాయి. ఆక్రమణలో మరిన్ని ఆలయాల భూములు జిల్లాలోని పలు ఆలయాలకు చెందిన మాన్యం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. మాన్యం భూములపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని సిర్సనగండ్ల రామాలయానికి 1,400 ఎకరాలకు పైగా మాన్యం భూములు ఉండగా.. వీటిలో కొంతమేర స్థానికులు ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి 300 ఎకరాలు, ఆంజనేయస్వామి ఆలయానికి 250 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో కూడా కొంతమేర ఆక్రమణలకు గురైంది. కొల్లాపూర్లోని రామాలయానికి చెందిన కొండూరు గ్రామంలో మాన్యం భూమి చాలావరకు ఆక్రమణకు గురైంది. దేవాదాయ శాఖ అధికారుల అలసత్వం కారణంగానే రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే మాన్యం భూములు భవిష్యత్లో రికార్డుల్లో మాత్రమే కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. చెంతనే పారుతున్న సాగునీరు.. వందల ఎకరాల భూములు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. కళ్లకు అద్దుకొని బంగారం వంటి పంటలు పండిస్తారు.. ఎవరైనా నిరుపేద రైతులకు కౌలుకు ఇచ్చినా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ, ఇక్కడ మాత్రం 264 ఎకరాల దేవుడిభూములను వృథాగా వదిలేశారు. కేవలం గతంలో కౌలు వేలం విషయంలో అభ్యంతరాలు రావడంతో కినుక వహించిన అధికారులు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా వదిలేసిన దుస్థితి సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చెంత చోటుచేసుకుంది. – కొల్లాపూర్ నిరుపయోగంగా సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూమి రెండున్నర దశాబ్దాలుగా సాగుకు నోచుకోని 264 ఎకరాలు చెంతనే సాగునీటి కాల్వలున్నా బీడువారిన వైనం గతంలో కౌలు వేలంపై అభ్యంతరాలు రావడంతో కినుక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోని అధికారులు -
గ్రామానికో సమాఖ్య భవనం
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే గ్రామ మహిళా సంఘాలకు సమాఖ్య భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు శాశ్వత వేదికలు ఉండేలా భవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భవనాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రతి గ్రామంలో మహిళా పొదపు సంఘం (ఎస్హెచ్జీ)కి సమాఖ్య భవనాన్ని నిర్మించనుంది. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఏదో ఒకచోట శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జిల్లాలోని అన్ని గ్రామాల్లో భవనాల నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో పనులు సైతం ఆయా మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. గ్రామస్థాయి మహిళా సమాఖ్య భవనాల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 460 గ్రామ పంచాయతీలు ఉండగా..1,47,123 మంది సభ్యులతో 13,239 మహిళా సంఘాలు.. 617 గ్రామ సంఘాలు కొనసాగుతున్నాయి. స్వయం సమృద్ధి దిశగా.. ప్రభుత్వం మహిళా సంఘాలకు విద్యార్థుల దుస్తులు కుట్టే పనితోపాటు పలు పథకాల కింద మహిళకు స్వయం ఉపాధి కల్పిస్తోంది. మహిళా సంఘాలకు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను నిల్వ చేసి తమ సభ్యుల ద్వారా కుట్టిస్తున్నారు. ఈ విధానంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో మహిళా సమాఖ్యలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మహిళాలకు దుస్తులు కుట్టడంతోపాటు పలు మార్గాల్లో ఉపాధి అందించేలా ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ఆ సంస్థ ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం ఆమోదించింది. గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు (ఫైల్) ఒక్కో భవనానికి రూ.10 లక్షల వ్యయం సంక్రాంతి తర్వాత శంకుస్థాపనలు గ్రామస్థాయిలో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఒక్కో భవనానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనున్నారు. భవన నిర్మాణానికి 200 చదరపు గజాల స్థలం సేకరించి 569 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్లాబ్తో వర్క్షెడ్ నిర్మిస్తారు. ఇందులో 500 చదరపు అడుగులలో హాల్, రెండు ద్వారాలు, తలుపులు, ఆరు కిటికీలు, ఆరు సీలింగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్లైట్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు తోడు రూ.3 లక్షల వరకు ఉపాధి నిధుల ద్వారా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
టోకెన్లు ఇస్తున్నారు..
యూరియా కోసం టోకెన్లు తీసుకున్న వారికే యూరియా ఇస్తున్నారు. నేను 10 ఎకరాలు సాగుచేసినా మూడు బస్తాలే ఇచ్చారు. దీనికోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద తీసుకునేందుకు అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం యూరియా బస్తాలు కావాలంటే నానో యూరియా సైతం కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. – రాజప్ప, రైతు, గొరిట, తిమ్మాజిపేట మండలం అమ్రాబాద్ పీఏసీఎస్లో యూరియా లేదు. రైతు ఉత్పత్తిదారుల సహకార కేంద్రంలో యూరియా పంపిణీ చేస్తున్నారు. నేను రెండెకరాల్లో వరి సాగుచేస్తుండగా నాకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. ఇంకా కావాలని అడిగితే తర్వాత ఇస్తామని చెబుతున్నారు. – సత్తయ్య, రైతు, తిర్మలాపూర్(బీకే), అమ్రాబాద్ మండలం జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. సాగు విస్తీర్ణం ఆధారంగా మండలాలకు అవసరమైన యూరియా కేటాయించాం. ప్రతి వారం అవసరమైన యూరియా జిల్లాకు అందుతుంది. ఎవరైనా డీలర్లు యూరియా స్టాక్ చేసుకున్నా.. నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటాం. – యశ్వంత్రావు, డీఏఓ ● -
సదరం శిబిరాల నిర్వహణకు స్థల పరిశీలన
కందనూలు: దివ్యాంగులకు ప్రతినెలా నిర్వహించే సదరం శిబిరాల నిర్వహణ కోసం జిల్లాకేంద్రంలో కార్యాలయ భవన స్థలాలను సోమవారం అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఓబులేష్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న భవన గదులు, ఇతర ఖాళీ స్థలం, ఫర్నిచర్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీ స్థలం గదులను పరిశీలించి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, ఉన్నతాధికారుల సూచన మేరకు ఒక భవనాన్ని ఎంపిక చేస్తామని వారు పేర్కొన్నారు. సదరం శిబిరాల నిర్వహణలో ఇబ్బందులను తొలగించేందుకు వీటిని పరిశీలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి కార్యాలయ ఉపసంచాలకులు వసంత్కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ మీర్ గాలిబ్ అలీ, డీఆర్డీఓ కార్యాలయ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆమ్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మన్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలు నాగర్కర్నూల్ క్రైం: జిల్లా పరిధిలో సైబర్ క్రైంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన కానిస్టేబుళ్లు లక్ష్మీపతి, హన్మంతులకు డీజీపీ శివధర్రెడ్డి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డు అందజేశారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. అచ్చంపేట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న గంటల లక్ష్మీపతి, నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న హన్మంతు సైబర్ క్రైం కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారని చెప్పారు. -
‘ప్రజావాణి’కి 31 అర్జీలు
నాగర్కర్నూల్: వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో 31 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 10.. నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారుల సమస్యలను చర్యల నిమిత్తం ఆయా పోలీస్స్టేషన్లకు పంపిస్తామని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం శివారులోని ఎండబెట్ల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామానికి వెళ్లే దారిలో కేసరి సముద్రం చెరువు అలుగు పారుతున్న సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో జిల్లాకేంద్రంతోపాటు ఎండబెట్ల గ్రామానికి చెందిన ప్రజలు చాలా సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హోంగార్డులందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డులందరూ ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ తీసుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పలువురికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న హోంగార్డులందరూ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండి వాళ్లు ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీని వినియోగించుకోవాలన్నారు. ఏడాది కి ఒకసారి రూ.11 వేలు చెల్లిస్తే కుటుంబ సభ్యులతోపాటు ఇద్దరు పిల్లలకు పాలసీ వర్తిస్తుందని, అనుకోని సంఘటన ఎదురైతే రూ.33 లక్షల కవరేజీ వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్, హోంగార్డు ఇన్చార్జి ఆర్ఐ రాఘవరావు, ఆర్ఎస్ఐ గౌస్పాషా, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహరచన..!
● ప్రధాన పార్టీల సన్నాహకాలు షురూ ● అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ● ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ ● బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ● ఎత్తులకు పైఎత్తులతోముందుకు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. ‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదామని మాజీ మంత్రి, ఎంపీ పోతుగంటి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. బీహార్ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన తీర్పు తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, పేర్లు లేకపోవడం, వేరే వార్డుల్లో రావడంపై వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు నాగయ్య, వెంకట్శెట్టి, ఖలీల్, యువ మోర్చా నాయకులు చందు లాల్, శివ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలు మెరుగుపడేనా?
సమీపిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలు ● ఇతర బాధ్యతల నిర్వహణలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ● విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం ● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు.. జిల్లాలో 131 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. దాదాపు 5,500 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మెరుగైన ఫలితాల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఇతర ప్రభుత్వ పనుల్లో నిమగ్నమై ఉండటంతో విద్యార్థుల చదువుపై అనుకున్నంత స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నామని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. త్వరలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు సైతం ఉపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుమ్మెర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు వింటున్న పదో తరగతి విద్యార్థులు కందనూలు: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నా.. గత నెలలో పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉండటం, ప్రస్తుతం పాఠశాలల తనిఖీలకు వెళ్తుండటంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగైనా ఈ సారి జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇతర బాధ్యతలు అప్పగిస్తుండటంతో విద్యార్థులు చదువులో వెనకబడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నా ఏ మేరకు ఫలితాలు ఉంటాయనే సందిగ్ధం నెలకొంది. ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ.. జిల్లాలోని కల్వకుర్తి మండలంలో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ కొనసాగుతున్నారు. మిగతా మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలతోనే నెట్టుకొస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి హెచ్ఎంలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఇన్చార్జి ఎంఈఓలు పాఠశాలల్లో బోధన కంటే.. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధులు, సర్వేలు, పాఠశాలల తనిఖీలు వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో వివిధ సబ్జెక్టుల టీచర్లను సర్దుబాటు చేసినా ఆశించిన ఫలితం కనిపించ లేదు. ఉపాధ్యాయులకు వివిధ రకాల పనులతో బోధనపై సరైన దృష్టి పెట్టలేకపోతున్నారు. గతేడాది సైతం చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఏ మేరకు రాణించగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 14 నుంచి పరీక్షలు.. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. సంవత్సరం ఉత్తీర్ణత శాతం ర్యాంకు 2021–22 90.55 16 2022–23 89.68 12 2023–24 90.20 23 2024–25 95.83 13 ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణతో పాటు ఒక సంఖ్యకు చేరుకుంటాం. – రమేష్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి -
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేటలో ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీపబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయంగా భక్తులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ భారం!
● 44 నెలలుగా రైతువేదికలకు అందని నిధులు ● ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు ● తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏఈఓల పాట్లు అచ్చంపేట: వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు అధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ రైతువేదికల నిర్వహణపై పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో రైతువేదికల లక్ష్యం ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. మూడేళ్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం ఏఈఓలకు భారంగా మారింది. ఏళ్ల తరబడి.. జిల్లాలో కస్టర్ల వారీగా 142 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గత ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మే 2022 నుంచి ఇప్పటి వరకు 44 నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు నెలనెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతువేదికకు ప్రతినెలా రూ. 9వేల చొప్పున 44 నెలలకు గాను సుమారు రూ.3.96 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అన్నింటి భారం ఏఈఓలపైనే.. రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, స్వీపర్లకు జీతాల చెల్లింపు, రైతునేస్తం, రైతులతో సమావేశాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో అటెండర్తో మొదలుకొని అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు రైతువేదికల్లో ఏర్పాటుచేసిన మినీ భూసార పరీక్షల నిర్వహణ కూడా అటకెక్కింది. బల్మూర్ రైతువేదిక పంట సాగు: 7.38 లక్షల ఎకరాలు నిధులు రావడం లేదు.. జిల్లాలో రైతువేదికల నిర్వహణ కోసం గతంలో ప్రభుత్వం ఐదు నెలల పాటు నిధులు అందజేసింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నాం. – యశ్వంత్రావు జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
అంతటా అంతేగా..!
తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ మున్సిపాలిటీ వారు్ుడ్ల ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. మొత్తం 291 ఫిర్యాదులు ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో.. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ నమోదులో.. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు. మక్తల్లో పూర్వవైభవం సంతరించుకున్న కోనేరు -
ముసాయిదా ఓటరు జాబితాపై 51 ఫిర్యాదులు
నాగర్కర్నూల్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో సవరణలకు సంబంధించి శనివారం వరకు మొత్తం 51 దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఇందులో 28 దరఖాస్తులను పరిష్కరించగా.. 23 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలో ఇంకా ఏమైనా సవరణలు ఉంటే ఓటర్లు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందన్నారు. ఆదివారం కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించిన తర్వాత జనవరి 10న తుది ఎన్నికల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. 16న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు కోడేరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఈ నెల 16న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు పొండేళ్ల సురేష్, పుట్టరాము, సొప్పరి పెద్దబాలపీరు, రమేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వృషభాలకు మొదటి బహుమతి రూ.80 వేలు, ద్వితీయ బహుమతి రూ.60 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, నాల్గో బహుమతి రూ.40 వేలు, 5వ బహుమతి రూ.30 వేలు, 6వ బహుమతి రూ.20 వేలు, 7వ బహుమతి రూ.15 వేలు, 8వ బహుమతి రూ.10 వేలు అందిస్తామన్నారు. పోటీలో పాల్గొన్న మిగిలిన ఎద్దుల జతకు రూ.5 వేలు అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 95506 55324, 97012 28596, 81065 62850 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కబడ్డీ పోటీలు కోడేరు మండల కేంద్రంలో ఈ నెల 13 నుంచి 16 వరకు అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ వంశీధర్రావు, ఆది కిరణ్, బండారి విష్ణు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, పాల్గొనే వారు 96407 88688, 85505 20859, 93473 86300కు సంప్రదించాలన్నారు. ‘అసైన్డ్ భూములను కాపాడాలి’ కందనూలు: అసైన్డ్ భూములను కాపాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఊర్కొండ పేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 180లో 4 ఎకరాల 10 గుంటల భూమిని 2006 సంవత్సరం గిరిజనులకు కేటాయించారు. అట్టి అసైన్డ్ భూముని ప్రస్తుత ఊర్కొండపేట తహసీల్దార్ ఇతర వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీలింగ్ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అదే మండలంలోని ఊర్కొండ గ్రామంలో మరో సర్వేనంబర్ 168లో ఉన్న అసైన్డ్ భూమిని ఇతరుల పేర పట్టా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమీషన్కు గతంలో ఫిర్యాదు చేశామన్నారు. శనివారం కలెక్టర్ బదావత్ సంతోష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఇతరులకు పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, ప్రధానకార్యదర్శి నాగేందర్గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల విద్యాభివృద్ధికి కృషి
నాగర్కర్నూల్: మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని, ఆమె స్ఫూర్తిని నేటితరం మహిళా ఉపాధ్యాయిణులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ బదావత్ సంతోష్, డీఈఓ రమేష్కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారని కొనియాడారు. అస్పశ్యత, అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అనంతరం జిల్లాలోని 15 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని సత్కరించారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
పెద్దకొత్తపల్లి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ సూచించారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి పీహెచ్సీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో ప్రబలే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ వెంట పీహెచ్సీ డాక్టర్ నారాయణస్వామి, నరేంద్రనాథ్, శ్రీనివాస్, సంపత్కుమార్, సిబ్బంది భాగ్యమ్మ, నాగమణి, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
నాగర్కర్నూల్: వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా తెలుసుకున్నారు. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించి ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పూర్తయ్యే గడువు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టిసారించి, ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలన్నారు. టెండర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయకుండా జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని పనులపై సమగ్ర నివేదికలు సమర్పించాలన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, అన్నిశాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అభివద్ధి పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఓ శ్రీరాములు, డీఈఓ రమేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ ఉన్నారు. -
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
బిజినేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ వెంట ఎంఈఓ రఘునందన్రావు, హెచ్ఎం ప్రభాకర్ ఉన్నారు. అభ్యంతరాలు తెలపండి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఖాళీగా ఉన్న 12 ఎంఎల్హెచ్పీఎస్ పోస్టులకు సంబంధించి ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల జాబితాను www.nagarkurnool.tela ngana.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని.. ఈ నెల 5వ తేదీలోగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. 5 నుంచి సదరం క్యాంపులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ చిన్న ఓబులేషు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 13, 20, 23, 27, 30 తేదీల్లో శారీరక దివ్యాంగులకు, 7, 21 తేదీల్లో వినికిడి లోపం ఉన్నవారికి, 5, 19 తేదీల్లో కంటిచూపు లోపం ఉన్నవారికి, 7, 21 తేదీల్లో మానసిక దివ్యాంగులకు సదరం క్యాంపులు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి వికలత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సదరం క్యాంపులకు వచ్చే వారు స్లాట్ బుకింగ్ చేసుకొని నిర్ణీత తేదీ ప్రకారం మెడికల్ రిపోర్టులతో రావాలని ఆయన సూచించారు. అందుబాటులో 3,654 టన్నుల యూరియా కందనూలు: జిల్లాలో ఎరువుల డీలర్లు యూరియా పంపిణీలో నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పట్టాదారు పాస్పుస్తకంలో భూమి విస్తీర్ణం, సాగుచేసిన పంట ఆధారంగా ఏఈఓ ధ్రువీకరణతో రైతులకు అవసరమైన మేర యూరియా అమ్మకాలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. జిల్లాలో పంట సాగుచేస్తున్న ప్రతి రైతుకు సరిపడా యూరియా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు 14,363 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ప్రస్తుతం 3,654 టన్నుల యూరి యా అందుబాటులో ఉందన్నారు. రైతులు ప్రస్తుత అవసరాల మేరకే యూరియా కొనుగోలు చేయాలని.. వచ్చే మూడు నెలల్లో మరో 38 వేల టన్నుల యూరియా రానుందని తెలిపారు. -
విద్య, వైద్య రంగాల్లో మెరుగు
సాక్షి, నాగర్కర్నూల్: కొత్త ఏడాది జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషిచేస్తానని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రాధాన్యతను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతామని.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపర్చడంతో పాటు వసతుల కల్పన, వైద్యుల సమయపాలన పాటించేలా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు 157 రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు, భోజన సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించామని కలెక్టర్ చెప్పారు. అన్ని స్కూళ్లలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషిచేశామన్నారు. తరచుగా పాఠశాలల తనిఖీలతో పాటు కాంప్లెక్స్ స్కూళ్ల హెచ్ఎంలతో పర్యవేక్షణ పెంచామన్నారు. గతంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 23వ స్థానం దక్కగా.. గతేడాది 13వ స్థానానికి మెరుగయ్యామని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం, వసతులు, పారిశుద్ధ్యం విషయంలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. జిల్లాలో రైతులకు ఆదాయం పెంచేందుకు లాభదాయక పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఆయిల్పాం సాగుతో పాటు పండ్ల తోటలు పెంచేందుకు కృషిచేస్తామని అన్నారు. జిల్లాలో అధికంగా ఉన్న వేరుశనగ, మామిడి పంటల ఉత్పత్తుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే ఐసీఏఆర్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. ఇందిరా సౌరగిరి పథకం ద్వారా పోడు భూములను సాగుచేస్తున్న చెంచులను అవకాడో, దానిమ్మ, నిమ్మ తదితర వాణిజ్య పంటల సాగులో ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో చెంచులకు ప్రత్యేకంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను ని ర్మించి ఇవ్వనున్నట్లు వివరించారు. సొంతంగా ఇళ్లు క ట్టుకోలేని వారికి ప్రభుత్వం తరఫున కమిటీ ఏర్పాటు చేసి నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త ఏడాదిలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మరింత పెంచుతాం వ్యవసాయంలో రైతుల ఆదాయంపెంచేలా ప్రోత్సాహం మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం రోజూవారీగా భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కలెక్టర్ బదావత్ సంతోష్ -
జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం
● నూతన సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్: జిల్లా అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సమర్థవంతులైన, బాధ్యత గల అధికారులు, సిబ్బంది ఉండటంతోనే గతేడాది పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలులో జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. కొత్త సంవత్సరంలోనూ ఇదే ఒరవడిని కొనసాగించి.. జిల్లా మరింత ప్రగతి సాధించేందుకు నూతనోత్సాహంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేసుకొని ప్రణాళికా బద్ధంగా మందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని.. జిల్లా యంత్రాంగం తరఫున ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం టీజీఓ, తహసీల్దార్ల సంఘం డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్ కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ● జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. తద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. జిల్లాలో ఫిట్నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆర్టీఓ బాలును కలెక్టర్ ఆదేశించారు. -
రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
కందనూలు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి బాలు అన్నారు. గురువారం నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బస్సు డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకాగ్రత డ్రైవింగ్తో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ యాదయ్య, భూపాల్రెడ్డి, బాల్రెడ్డి, రాజేశ్, తిరుపతయ్య పాల్గొన్నారు. సీఎం స్పందించే వరకు పోరాటం చారకొండ: గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి.. ముంపు ముప్పు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమకు న్యాయం చేయాలని నెల రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తూ.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్రెడ్డి స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో నిర్వాసితులు ప్రకాశ్, పెద్దయ్యగౌడ్, నాగయ్యనాయక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. -
నూతనోత్సాహంతో స్వాగతం
● ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ● ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు కందనూలు: కొత్త ఆశలు.. ఆశయాలతో జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి దాటాక నూతనోత్సాహంతో కేక్లు కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. యువత ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. గురువారం ఉదయం మహిళలు, యువతులు ఇళ్ల ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. నూతన సంవత్సరంలో తమకు మంచి జరగాలని కాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం, సోమశిల సోమేశ్వరాలయం, మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి, శిరసనవాడ సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని రామస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గోవింద క్షేత్రం భక్తులతో కిక్కిరిశాయి. ఆలయాల్లో విశేష పూజలు, ఆరాధనలు, అభిషేకాలు చేశారు. -
పోలింగ్ కేంద్రాలు
ఓటర్లు ఒక కార్పొరేషన్, 18 పురపాలికల్లో ముసాయిదా.. ● మొత్తం 60 డివిజన్లు.. 316 వార్డుల వారీగా వెల్లడి ● 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లే ప్రామాణికంగా రూపకల్పన ● బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన ● 10న ఫైనల్ లిస్ట్.. ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల షెడ్యూల్ 798 6,19,423సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి తొలి కసరత్తు పూర్తయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ సెంటర్లు ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ముసాయిదా ఓటరు లిస్ట్ను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో జాబితా ప్రతులను అతికించారు. ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా పురపాలికల్లో స్థానిక, ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల పదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పురుషులు 3,04,294.. మహిళలు 3,15,094 మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 6,19,423 మంది ఓటర్లు ఉన్నట్లు పురపాలికల అధికారులు ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఇందులో పురుషులు 3,04,294, మహిళలు 3,15,094 కాగా.. ఇతరులు 35 మంది ఉన్నారు. అన్ని పురపాలికల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, మిగతా 18 మున్సిపాలిటీల్లో 316 వార్డులు ఉండగా.. మొత్తంగా 798 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. 60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు -
అధిక మొత్తంలో వసూలు
లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు రూ.5–6 వేలు, భ్రూణ హత్యలకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రూ.30–50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు గుట్టుగా అబార్షన్లు చేసే క్రమంలో వికటించి మృతిచెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని వెలుగులోకి రాగా.. మరికొన్నింటిని బయటకు రాకుండా సెటిల్మెంట్ చేసుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వైద్యాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా.. ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదని తెలుస్తోంది. జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లో రికార్డులు తనిఖీ చేస్తున్న ఇన్చార్జి డీఎంహెచ్ఓ (ఫైల్) -
సమాజ రక్షణే ప్రధాన లక్ష్యం
నాగర్కర్నూల్ క్రైం: సమాజ రక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ.. ఒకరికొకరు గౌరవించుకోవడం, సహకరించుకోవడం వల్ల ఆనందపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. కొత్త సంవత్సరంలో శాంతియుత సమాజ ఏర్పాటు కోసం జిల్లా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. పోలీసు సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేయాలని సూచించారు. ● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో రోడు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభకనబర్చిన హోంగార్డులు ఆశీర్వాదం, లక్ష్మయ్య, పషియొద్దీన్, నరేందర్ కుమార్, దేవుడు, చంద్రశేఖర్ను ఎస్పీ అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. సిబ్బందికి అండగా ఉంటాం.. పోలీసు సిబ్బందికి అండగా ఉంటామని.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని ఎస్పీ సూచించారు. గత అక్టోబర్లో హోంగార్డు వెంకటస్వామి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అతడి కుటుంబ సభ్యులకు ఎస్పీ రూ. 20వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐ రాఘవరావు, జగన్, ఆర్ఎస్ఐ గౌస్పాషా, హోంగార్డుల ఇన్చార్జి ఏఆర్ హెడ్కానిస్టేబుల్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భ్రూణహత్యల కలకలం
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో రోజురోజుకూ ఆడపిల్లల నిష్పత్తి మగపిల్లలతో పోలిస్తే తక్కువగా మారుతుండటం భయాందోళన కలిగిస్తుంది. ప్రతిఒక్కరు ఆడపిల్లలు వద్దనుకుంటుండటమే ఆడపిల్లల నిష్పత్తి తగ్గేందుకు కారణమని తెలుస్తుంది. అయితే ఆడపిల్లల నిష్పత్తి పెంచేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో గర్భం దాల్చిన వారిలో చాలామంది మగపిల్లలు కావాలనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదిస్తుండటంతో కాసులకు కక్కుర్తి పడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జిల్లాకేంద్రంలోని హౌజింగ్బోర్డు కాలనీలో ఓ ఆర్ఎంపీ క్లినిక్ నిర్వహిస్తూ ఆబార్షన్లు చేస్తుండగా ఓ మహిళకు అధిక రక్తస్రావమై వికటించడంతో వెలుగులోకి రావడమే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనేది నిదర్శమని చెప్పవచ్చు. భ్రూణ హత్యలు జరగకుండా చూడాలని జిల్లా వైద్యాధికారులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెచ్చరికలు సైతం జారీ చేశారు. ప్రత్యేక బృందం తనిఖీలు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలను అరికట్టడం కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ రికార్డులు పరిశీలిస్తున్నారు. ప్రైవేటు వైద్యులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకు లు, ఆర్ఎంపీలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినా.. భ్రూణ హత్యలకు పాల్పడినా సెల్ నం.85008 79 884కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. జిల్లాలో గడిచిన మూడేళ్లలో శిశువుల జననాలు ఇలా.. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు జిల్లాలో భారీగా తగ్గుతున్న ఆడపిల్లల నిష్పత్తి తూతూమంత్రంగా వైద్యాధికారుల తనిఖీలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడని వైనం కఠిన చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా.. భ్రూణ హత్యలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. పలు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణలు రుజువైతే సీజ్ చేస్తాం. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. అందరూ నిబంధనలు పాటించాలి. – రవికుమార్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ -
‘పోలీసుల పనితీరు భేష్’
నాగర్కర్నూల్ క్రైం: 2025 సంవత్సరంలో జిల్లా పోలీసులు అన్ని విభాగాల్లో అద్భుతమైన పనితీరును కనబర్చి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, దైనందిన జీవితంలో ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు ముందంజలో ఉన్నారని కొనియాడారు. 2024 సంవత్సరం కంటే 2025లో జిల్లాలో నేరాల సంఖ్య స్పల్వంగా పెరిగిందన్నారు. ఎస్పీ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2025లో 4,138 కేసులు నమోదు కాగా.. అందులో 28 హత్యలు, రాత్రి దొంగతనాలు 74 జరిగాయని, సాధారణ దొంగతనాలు 125 జరిగాయన్నారు. రూ.1.94 కోట్లు చోరీ జరగగా.. రూ.73.19 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. 379 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 184 మంది మృతి చెందడంతో పాటు 392 మంది గాయపడ్డారని తెలిపారు. మహిళలపై నేరాలు 2024 తో పోలిస్తే 20శాతం తగ్గి 337 నమోదయ్యాయని వెల్లడించారు. 57 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 39 కిడ్నాప్, 54 రేప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 331 మిస్సింగ్ కేసుల్లో 275 ట్రేస్ చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 240 మంది నిందితులను అరెస్టు చేసి 126 కేసులు నమోదు చేయడంతో పాటు 148 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 1.9 కేజీల గంజాయి, 22గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకుని 32 మంది నిందితులను అరెస్టు చేసి 9 ఎన్డీపీసీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. 2025లో 1,878 కేసులను కోర్టులు వివిధ పద్ధతుల ద్వారా పరిష్కరించాయని, అందులో 703 కేసుల్లో నేరాలు నిరూపితమయ్యాయని, 561 కేసుల్లో విచారణ జరుగుతుందని, 614 కేసులు రాజీ అయ్యాయని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 60 మంది బాలురు, ముగ్గురు బాలికలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించామని, బాలకార్మికుల చట్టం కింద 27 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. షీటీంకు సంబంధించి 138 పిటిషన్లు రాగా.. 30 కేసుల్లో ఎఫ్ఐఆర్ల నమోదు చేయడంతో పాటు 101 కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించామని, 174 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్, వెంకట్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. బాంబ్ స్వ్కాడ్ విస్తృత తనిఖీలు నూతన సంవత్సర వేడకల్లో జిల్లాలో ఎక్కడా అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బాంబ్ డిస్పోసల్ టీంతో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ట్యాంక్బండ్, కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. -
సాగుదాం.. కొత్త ఆశలతో..
నూతన సంవత్సరంలో మార్పు కోసం నిర్ణయాలు ● జీవన శైలిలో మార్పులు, ఆరోగ్యంపై దృష్టి ● సెల్ఫోన్, స్క్రీన్ టైం తగ్గిస్తాం.. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్షో సాక్షి, నాగర్కర్నూల్: ‘కొత్త ఏడాదిలో తమను తాము నూతనంగా పరిచయం చేసుకుంటాం. అనుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. సంపూర్ణ ఆరోగ్యం సాధించేందుకు అవసరమైన మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంచుకుంటాం. ఇకపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సేపు గడిపేస్తాం. సెల్ఫోన్, సోషల్మీడియాను కాలక్షేపం కోసం కాకుండా భవిష్యత్ను నిర్మించుకునేందుకు వినియోగిస్తాం’ అని జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తెలిపారు. 2026 కొత్త ఏడాదిలో తీసుకోనున్న నిర్ణయాలు, కోరుకుంటున్న మార్పులపై నెల్లికొండ చౌరస్తాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ సైన్స్ కళాశాల విద్యార్థులతో బుధవారం ‘సాక్షి’ టాక్షోను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పునరావృతం కానివ్వను గతంలో ఏమైనా తప్పులు చేసుంటే వాటిని కొత్త ఏడాదిలో పునరావృతం కాకుండా చూసుకుంటా. ఎప్పటికప్పుడు మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాను. చదువుపై దృష్టిపెట్టి రోజువారీగా చదువుకు సమయం కేటాయిస్తాను. – తోజాక్షి, ఎల్లూరు, డిగ్రీ మొదటి సంవత్సరం పనులు వాయిదా వేయను.. కొత్త సంవత్సరంలో పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేసేలా చూసుకుంటా. చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు నిర్ధేశించుకుంటా. – కావ్య, చందుబట్ల, డిగ్రీ మొదటిసంవత్సరం) చదువుపైనే దృష్టి.. ఈ ఏడాదిలో పూర్తిగా చదువుపైనే దృష్టి పెడతా. క్లిష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించి పట్టు సాధిస్తా. ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తాను. – గ్రీష్మచంద్రిక, శానాయిపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరం నైపుణ్యం పెంచుకుంటా.. చదువుపై నిరంతరం దృష్టి సారిస్తూనే భవిష్యత్లో ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాన్ని నేర్చుకుంటాను. చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటాను. – మౌనిక, గన్యాగుల, డిగ్రీ మొదటి సంవత్సరంఉద్యోగం కోసం.. డిగ్రీలోని సబ్జెక్టులపై దృష్టి పెడుతూనే.. కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధించేందుకు కావాల్సిన విషయాలపై దృష్టి సారిస్తా. పోటీ పరీక్షలో రాణించేందుకు శిక్షణ తీసుకుంటాను. – చైతన్య, నాగాపూర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్క్రీన్ టైం తగ్గిస్తా.. కొత్త సంవత్సరంలో మొబైల్, సోషల్మీడియా వినియోగాన్ని తగ్గించుకుంటా. ఆ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తా. రీల్స్ చూస్తు సమయం వృథా చేసుకోకుండా నైపుణ్యం పెంచుకునేందుకు ఇంటర్నెట్ను వినియోగిస్తా. – అనిత, కుమ్మెర, డిగ్రీ రెండో సంవత్సరం ఫిట్నెస్పై దృష్టి కొత్త ఏడాదిలో పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి సారిస్తా. ఫిట్నెస్ సాధించేందుకు రోజూవారీగా సమయం కేటాయిస్తాను. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తా. – అబ్దుల్ టర్బ్, బిజినేపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరంజీవనశైలిలో మార్పు కావాలి కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటాను. పోషకాహారం తీసుకోవడంతో పాటు సరైన నిద్ర, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. గతంలో కన్నా మెరుగ్గా ఉండేందుకు పనిచేస్తాను. – శ్రీశైలం యాదవ్, తెలకపల్లి, డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తా.. ఈ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, కాలేజీకి పేరు తీసుకొస్తా. ఇందుకోసం రోజూవారీగా సమయం కేటాయించి సిలబస్ పూర్తిచేస్తాను. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతాను. – సుస్మిత, నాగర్కర్నూల్, డిగ్రీ ఫైనల్ ఇయర్ లక్ష్యం వైపు అడుగులు.. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కల. ఇందుకోసం కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే కసరత్తు ప్రారంభిస్తాను. రోజూవారీగా షెడ్యూల్ కేటాయించి లక్ష్యం వైపు ప్రయాణిస్తా. – రాఘవేంద్ర, దేవల్తిరుమలాపూర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒత్తిడిని తగ్గించుకుంటా.. ఈ ఏడాదిలో సమయపాలన పాటించేలా చూసుకుంటా. సమయానికి భోజనం, త్వరగా పడుకోవడం, నిద్ర కోసం తగినంత సమయం కేటాయించేలా చూసుకుంటాను. అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తూ పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకుంటాను. – చందన, తాడూరు, డిగ్రీ మొదటి సంవత్సరంతల్లిదండ్రులతో ఎక్కువగా గడుపుతా కొత్త ఏడాదిలో తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తాను. ఇంటి పనుల్లో అమ్మకు సాయంగా ఉంటాను. వారికి నచ్చేలా నడుచుకుంటాను. చదువుపై దృష్టిపెట్టి మెరుగైన ఫలితాలు సాధిస్తాను. – భవాని, పెద్దాపూర్, డిగ్రీ మొదటి సంవత్సరం -
పుర పోరు.. కసరత్తు జోరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన రోజే మహబూబ్నగర్ జిల్లా లోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలి టీ గా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమ యంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామా లను కలుపుకొని 16 వార్డులుగా విభజించారు. దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకొని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ -
అవసరం మేరకే యూరియా వాడాలి
తాడూరు/బిజినేపల్లి: రైతులు అవసరం మేరకే పంటల సాగుకు యూరియా వ్యవసా య శాఖ జాయింట్ డైరెక్టర్, యూరియా మానిటరింగ్ అధి కారి బాలునాయక్ అన్నారు. బుధవారం ఆయన తాడూరు, బిజినేపల్లి మండల కేంద్రాల్లో సింగిల్విండో, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా నిల్వ, పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి పంటకు యూరియా వేస్తున్నారని, దీనివల్ల నష్టమే అధికంగా ఉంటుందన్నారు. రైతుల అవసరం మేరకు రాష్ట్రంలో యూరియా అందుబాటులో ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు, ఏఓలు సందీప్కుమార్రెడ్డి, కమల్కుమార్, ఏఈఓలు ఫరీద్, భార్గవ్, డీలర్లు మహేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు బిజినేపల్లిలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారి డా.బాలునాయక్ -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణతో పాటు పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, భూసేకరణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వెల్దండ, చారకొండ మండలాల పరిధిలో రిజర్వాయర్ల కోసం భూసేకరణ, పరిహారం చెల్లింపు, అవార్డు ప్రక్రియలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు పనుల ప్రగతిని సమీక్షించారు. ప్యాకేజీ–1 లో వంగూరు మండలంలోని 995.39 ఎకరాలు, ప్యాకేజీ–2లో చారకొండ, వెల్దండ మండలాల్లోని 2,144.16 భూ సేకరణ పనులు ఇదివరకే పూర్తి చేశామని, మిగిలిన 51 ఎకరాల భూమిని వెంటనే సేకరించాలని కల్వకుర్తి ఆర్డీఓను ఆదేశించారు. భూ సేకరణ పూర్తయిన వద్ద నీటిపారుదల అధికారులు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ముంపుకు గురవుతున్న గ్రామాల పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ముంపునకు గురవుతున్న ఎరవ్రల్లి గ్రామ పునరావాసానికి కల్వకుర్తి మండలంలోని పంజుగుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి, డివిజన్లోని తహసీల్దార్లు కార్తీక్ కుమార్, ఉమ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, భూసేకరణ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వరం వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వంగూరు మండల కేంద్రంలో రూ.12.50 కోట్లతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అభివృద్ధి కమిటీ, అధికారులతో సమావేశమై టీపీఎస్ పాఠశాల నిర్మాణం పూర్తయితే పేద విద్యార్థులకు మేలు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్కుమార్, తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీఓ బ్రహ్మచారి, ఎంఈఓ మురళీమనోహరాచారి, నోడల్ అధికారి నర్సిరెడ్డి, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి నాగర్కర్నూల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి ప్రతి విభాగంలో జిల్లా ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని తెలిపారు. -
సైన్స్తోనే సమాజాభివృద్ధి : డీఈఓ
కందనూలు: సైన్స్తోనే సమాజాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్స్ఫేర్ మంగళవారం ముగిశాయి. ఈ ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డుకు సంబంధించి 93 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. 17 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అలాగే జిల్లాస్థాయిలో ప్రతిభచాటిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర, సాంకేతిక అంశాలపై గ్రామీణ విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినప్పుడే సైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన అంశాలపై శ్రద్ధ చూపాలని, చివరగా అన్ని సబ్జెక్టుల్లో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 13,547 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వీరికోసం 34 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు కొనసాగుతాయన్నారు. ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని సూచించారు. విద్యా, వైద్య, రవాణ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటి.. దండాలు
రంగనాథస్వామి దేవాలయంలో పూజలో పాల్గొన్న భక్తులు అలంకరణలో రంగనాథస్వామి నమో శ్రీనివాసాయ.. నమో తిరుమలేశాయ.. వైకుంఠవాస గోవిందా.. అంటూ భక్తుల వేంకటేశ్వరస్వామి నామస్మరణతో వైష్ణవాలయాలు మార్మోగాయి. మంగళవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ప్రధానంగా శ్రీపురంలోని శ్రీరంగనాథస్వామి, జిల్లాకేంద్రంలోని రామాలయం, హౌసింగ్బోర్డు కాలనీలోని గోవిందక్షేత్ర నిలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లోనూ స్వామివారు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లోని పలు ఆలయాల్లో భక్తులు స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. – కందనూలు శ్రీపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు -
స్థానికం.. సంస్థాగతం!
నాగర్కర్నూల్పాలమూరులో కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్నగర్లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట -
యూరియా పంపిణీలో అలసత్వం వహించొద్దు
పెద్దకొత్తపల్లి: యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక పీఏసీఎస్లో యూరియా పంపిణీ, ఆన్లైన్ నమోదును పరిశీలించారు. రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సరఫరాలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఒకే సింగిల్ విండో వద్ద కాకుండా పంపిణీ కేంద్రాలను ఇతర గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగిల్ విండో కార్యాలయంలోనే యూరియా నిల్వ చేయడం వలన ఇతర గ్రామాల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెద్ద గ్రామాల్లో యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయాధికారులు ప్రైవేటు, ప్రభుత్వ డీలర్లు అమ్ముతున్న యూరియా స్టాక్ను పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని. ప్రతి రైతుకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని చెప్పారు. అనంతరం సాతాపూర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ నాణ్యత, తేమ గురించి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయాధికారి శిరీష, డీపీఎం కృష్ణయ్య, ఏపీఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు
నాగర్కర్నూల్: జిల్లాలో యూరియా సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతో కలిసి సోమవారం యూరియా, ఎరువుల లభ్యతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. కలెక్టరేట్ నుంచి వీసీలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఏఓ యశ్వంతరావుతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా యూరియా కొరత రాకుండా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి పక్కా సమాచారంతో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యూరియా విక్రయాలు ప్రారంభిస్తున్నామన్నారు. అవసరమైన చోట అదనపు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. వీసీ అనంతరం స్థానిక అధికారులతో మాట్లాడుతూ విక్రయ కేంద్రాలకు యూరియా సరఫరా తగినంతగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా అంతరాయం లేకుండా స్టాక్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతామన్నారు. -
సాగులో నూతన ఒరవడి
ఉమ్మడి జిల్లాలో 2024, 2025లో వానాకాలం పంటల సాగు ఇలా... పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు ● పలుచోట్ల ఆయిల్పాం, వాణిజ్య తోటల పెంపకం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి ● తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం సీజన్ ● యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో కురిసిన వర్షాల వల్ల ఎర్ర తెగులు సోకిన పత్తి పంట (ఫైల్) సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంతటా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. -
పిల్లలు.. వృద్ధులు.. జాగ్రత్త
ప్రశ్న: చలికాలంలో వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. – రవీందర్, అచ్చంపేట, రాము, వంగూరు డీఎంహెచ్ఓ : చలికాలంలో చంటిపిల్లలతోపాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చలిలో బయటకు వెళ్లొద్దు. గది కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. బీపీ ఉన్నవారు అధిక చలికి హైపోథర్మియా పరిస్థితికి లోనుకావచ్చు. ఈ పరిస్థితిలో ఆకస్మిక గుండెపోటు, పక్షవాతానికి దారితీయవచ్చు. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, చలిగాలుల నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవికుమార్ అన్నారు. చలికాలంలో వైరస్, బ్యాక్టీరియా అధికంగా వృద్ధిచెందే అవకాశం ఉండటంతో వీరు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశం ఉందన్నారు. వృద్ధుల్లో ప్రధానంగా బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. చలి తీవ్రత పెరిగితే వృద్ధులు హైపో థర్మియా పరిస్థితికిలోనై పక్షవాతం, గుండెపోటు బారినపడవచ్చన్నారు. చలితీవ్రత నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. – సాక్షి, నాగర్కర్నూల్ ప్రశ్న : మా పాపకు తరచుగా దగ్గు, జలుబు, జ్వరంతోపాటు వాంతులు అవుతున్నాయి. తగ్గడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – బాలరాజు, పెంట్లవెల్లి డీఎంహెచ్ఓ : చలికాలంలో గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియా అధికంగా వృద్ధిచెందుతాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. పిల్లల శరీరాన్ని అంతటా ఉన్నిదుస్తులు ధరించేలా చూసుకోవాలి. చేతులు, కాళ్లు సైతం గ్లౌవ్స్, సాక్స్లతో కవర్ చేయాలి. చలిలో ఆరుబయటకు వెళ్లకూడదు. చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగించాలి. చేతి వేళ్లు నోట్లో పెట్టుకోకుండా చూడాలి. చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆయాసం ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. ప్రశ్న: తరుచుగా గొంతునొప్పి వస్తోంది. వారం రోజులైనా జలుబు తగ్గడం లేదు. – లక్ష్మణ్, కార్వంగ, తెలకపల్లి డీఎంహెచ్ఓ : జలుబు, గొంతు నొప్పి సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు సిరప్, మందులు వాడాలి. చికిత్స కోర్సు పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగుతూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పెంచుకునేందుకు ప్రయత్నించాలి. విటమిన్ సీ, ఈ అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. ప్రశ్న : ప్రైవేటు ఆస్పత్రుల్లో నెబ్యులైజర్ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఈ అవసరం ఉంటుందా.? – శివ, తాడూరు డీఎంహెచ్ఓ : చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇందుకోసం జలుబు చేసి నప్పుడు ఆవిరి పట్టుకోవడంఉత్తమం. నెబ్యులైజర్తో తాత్కాలికమే కానీ శాశ్వత ప్రయోజనం ఉండదు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే ఇన్హేలర్స్ వాడుకోవచ్చు. రపశ్న : చిన్నపిల్లలకు ఆక్సిజన్ ఏయే సమయాల్లో అవసరం పడుతుంది. ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉందా.? – బాలాజీ, అచ్చంపేట డీఎంహెచ్ఓ : ఆక్సిజన్ అన్నింటికీ అవసరం ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆక్సిజన్ అవసరం. న్యూమోని యా, ఆస్తమా, పిల్లలు డొక్కలు ఎగరేయడం వంటి సందర్భాల్లో ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ సాచ్యూరేషన్ 95 వరకు ఉంటే పర్వాలేదు. అంతకన్నా తగ్గితే ఆక్సిజన్ అవసరం పడుతుంది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ప్రశ్న : పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలకు జలుబు, దగ్గు ఉంటోంది. విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? – చంద్రశేఖర్, గౌరారం, తెలకపల్లి డీఎంహెచ్ఓ : చలికాలంలో విద్యార్థులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు, తరగతి గదుల్లో మాస్క్ ధరించాలి. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ లేదా మోచేయి అడ్డుగా పెట్టుకోవాలి. చల్లని నీరు, కూల్ డ్రింక్స్, ఐస్క్రీం లాంటివి తీసుకోవద్దు. చల్లగా లేకుండా గోరువెచ్చగా ఉండే నీరు తాగాలి. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తప్పనిసరి ఉదయం, రాత్రివేళల్లో ఆరుబయటకు వెళ్లొద్దు వృద్ధుల్లో హైపోథర్మియా ప్రభావంతో గుండెపోటు, పక్షపాతానికి అవకాశం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో అందుబాటులో మందులు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రవికుమార్ ప్రశ్న : జనరల్ ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. ఎమ్మారై సదుపాయం కల్పించాలి. – రాజశేఖర్శర్మ, నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓ : జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికే అభివృద్ధి కమిటీ ఉంది. కలెక్టర్, ఎమ్మెల్యేల సహకారంతో కమిటీని క్రియాశీలకం చేస్తాం. అలాగే సదుపాయాలు కల్పిస్తాం. ప్రశ్న: చలికాలంలో స్కిన్ ఎలర్జీ ఎక్కువగా ఉంటోంది. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.? – శ్రీధర్, అచ్చంపేట డీఎంహెచ్ఓ : చలికాలంలో శరీరానికి ప్రత్యేకంగా మాశ్చరైజర్ క్రీం, ఎలొవేరా జెల్ వంటివి రాసుకోవాలి. ఇవేమీ లేకున్నా కొబ్బరి నూనె రాసుకున్నా సరిపోతుంది. చాలామంది ఎండాకాలంలోనే నీటిని ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారు. చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోరు. దీంతో చర్మం పొడిబారి చర్మ సమస్యలకు దారితీస్తుంది. చలికాలంలోనూ ఎక్కువగా నీటిని తాగాలి. సమస్య వచ్చినప్పుడు చికిత్స కన్నా అప్రమత్తతో ఉండటమే ముఖ్యం. -
సృజనాత్మకతకు వేదిక వైజ్ఞానిక ప్రదర్శన
● అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ఫేర్ ● ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కందనూలు: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై డీఈఓ రమేష్కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టిసారించి సాంకేతిక రంగంలో ఎదగాలని సూచించారు. రోజురోజుకు సాంకేతిక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. సైన్స్ అంటేనే నిజమని, ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సైన్స్ను అలవర్చుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలమని పేర్కొన్నారు. నేటి సమాజంలోని సమస్యలకు పరిష్కారం సైన్స్ ఒక్కటే మార్గమని, అది సృజనాత్మక ఆలోచనలతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. మూడురోజులపాటు కొనసాగే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ రమేష్కుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. అనంతరం కేజీబీవీ తాడూరు, కేజీబీవీ పెద్దకొత్తపల్లి, కేకేరెడ్డి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఏసీ రాజశేఖర్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
నాగర్కర్నూల్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల రద్దీ మేరకు ఏర్పా ట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రజావాణికి 50 ఫిర్యాదులు నాగర్కర్నూల్: వివిధ శాఖలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులపై తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 7.. నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో 5 భూ తగాదా, 2 తగు న్యాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ఆయా పోలీస్స్టేషన్లకు పంపిస్తామని చెప్పారు. టీబీ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి నాగర్కర్నూల్ క్రైం: ప్రాణాంతకమైన టీబీ మహమ్మారిని అంతం చేయడానికి మనందరం పనిచేయాలని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి రఫిక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సీబి నెట్ ల్యాబ్ వద్ద భవిష్య భారత్ ఆధ్వర్యంలో సోమవారం టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి పట్ల విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎస్బీఐ ఆర్థిక సహాయంతో భవిష్య భారత్ అనే స్వచ్ఛంద సంస్థ టీబీ రోగులకు బలవర్ధకమైన ఆహారం ప్రతినెలా అందించడం గొప్ప సహాయంగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో భవిష్య భారత్ మేనేజర్ గోపి, టీబీ సూపర్వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్ఖాన్, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్, టీబీ హెచ్వీ తౌకిర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఉప్పునుంతల: క్రిమినల్ కేసులో రిమాండ్ నిందితులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారని సోమవారం ఎంఈఓ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గట్టుకాడిపల్లిలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేనావత్ పద్మ, మండలంలోని తాడూరు యూపీఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాత్లావత్ గోపి సస్పెన్షన్కు గురైనట్లు ఎంఈఓ చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఈ నెల 24 నుంచి రిమాండ్లో ఉండటంతో డీఈఓ కలెక్టర్కు రిపోర్టు చేస్తూ ఇద్దరిని సస్పెండ్ చేశారని ఎంఈఓ పేర్కొన్నారు. వివరాలు 8లో.. కొండనాగుల సొసైటీకి ఉత్తమ అవార్డు క్యూలో నిల్చొని.. రూ.2 లక్షలు చోరీ బొటానికల్ గార్డెన్లో సిగ్నేచర్ స్పైడర్ కనువిందు ఇసుక తరలింపు అడ్డగింత -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె..
కందనూలు: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, వైజ్ఞానిక, సృజనాత్మకతను వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ వేదిక కానుంది. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా శాస్త్ర సాంకేతిక, గణితం, ఇంజినీరింగ్ వంటి అంశాల ఇతివృత్తంగా ప్రదర్శనలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే వారితో పాటు డీఎడ్, బీఎడ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలను ప్రదర్శించవచ్చు. వీరిలో 6, 7, 8 తరగతుల వారిని జూనియర్స్గా, 9, 10, 11, 12 తరగతుల వారిని సీనియర్స్గా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. ఆయా విభాగాల్లో జూనియర్స్ నుంచి 7, సీనియర్ప్ నుంచి 7 ప్రాజెక్టులను ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. గతేడాది 93 మంది ఎంపిక.. గతేడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 93 మంది ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. వారు మరింత మెరుగైన ఎగ్జిబిట్లు రూపొందించేందుకు ప్రభు త్వం ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున వారి ఖా తాలో జమ చేసింది. వాటితో మరింత మెరుగైన ఎగ్జిబిట్లు ప్రదర్శించేందుకు కసరత్తు చేస్తున్నారు. నేటి నుంచి జిల్లాస్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శనలు రెండు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లోఏర్పాట్లు పూర్తి -
ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు
మహబూబ్నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకువచ్చి అలంకరించి విశేష పూజలు జరుపుతారు. ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. దిగువకొండ వద్దనున్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. -
రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చే
కేసీఆర్కు రైతులపై ప్రేమ ఉంటే.. రేవంత్రెడ్డికి భూములపై ప్రేమ ● బీఆర్ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి ● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ● సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియా కోసం గోస పడాల్సిందేనా.. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డులు 30 శాతం వరకు తెలంగాణకే వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పడకేసిందన్నారు. రేవంత్ పాలనలో పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేదని, వీధిలైట్లు లేవని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు. కాగా, జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నాగర్కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. -
కల్వకుర్తిని సుందరంగా తీర్చిదిద్దుతాం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకొచ్చి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సుమారు రూ. 6కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కల్వకుర్తి అభివృద్ధి కోసం రూ.కోట్ల నిధులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్నారని తెలిపారు. పట్టణంలోని కూడళ్లను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారని.. త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపనలు చేస్తామన్నారు. కొన్నేళ్లుగా నిరాధరణకు గురైన ఈదుల చెరువును తీర్చిదిద్దేందుకు గాను రూ. 2.20 కోట్ల నిధులు అమృత్ 2.0 కింద మంజూరు చేయించినట్లు వివరించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరానగర్ కాలనీ ముఖద్వారం వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరగా.. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ రంగన్న, కాంగ్రెస్ నాయకులు ఆనంద్కుమార్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మంచి గుర్తింపు
నాగర్కర్నూల్: యువతకు క్రీడల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆలిండియా స్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఫైనల్లో డాలీ సీసీ జట్టు, ఎంఆర్సీసీ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన డాలీ సీసీ జట్టు.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఎంఆర్సీసీ జట్టు.. 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. 27 పరుగుల తేడాతో డాలీ సీసీ జట్టు విన్నర్గా నిలవగా.. ఎంఆర్సీసీ జట్టు రన్నరప్గా నిలిచింది. టోర్నీ విజేతలకు శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే యువతకు అపారమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఎంచుకున్న క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు. -
కూల్పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్’గా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. మహబూబ్నగర్ నగర పరిధిలో 13 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో కూల్ పాయింట్ల ద్వారా తమ ముఖ్య అనుచరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నారు. అయితే మాట వినని నిర్వాహకులను పలువురు ఇబ్బందులకు గురిచేయడం వివాదానికి దారితీసింది . దీనిపై కొందరు యజమానులు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్యులు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు, కోట్లు పెట్టాం.. లక్ష్యం మేరకు అమ్ముతున్నాం.. నిర్ణీత కోటా దాటిన తర్వాత ఒరిగేదేమీ లేదని.. ఇప్పుడు ఇలా వేధిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టడంతోపాటు ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో వారు ఆయా వైన్స్ యజమానుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. దుకాణాల కేటాయింపులపై.. నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ‘ఇంటెలిజెన్స్’ అధికారుల ఆరా.. కూల్ పాయింట్లకు సంబంధించి మద్యం షాపుల యజమానులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు.. ఎలా ఇబ్బందులు పెట్టారు.. ఏమని బెదిరించారు.. ఎవరా నాయకులు..? షటర్ల వ్యవహారంలో వసూళ్లకు పాల్పడింది ఎవరు.. ఇందులో నాయకులు, మున్సిపల్, మెప్మా శాఖల సిబ్బంది పాత్ర ఏమిటి? అని పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నేత ఆదేశాలతోనే వారు కూపీ లాగుతున్నారా.. లేకపోతే పై నుంచి ఆదేశాలు వచ్చాయా అనేది తెలియడం లేదు. ఇప్పటికే కూపీ లాగిన ఇంటెలిజెన్స్ అధికారులు కూల్ పాయింట్ల తతంగంలో ఓ నాయకుడి దురుసు ప్రవర్తనే ఇందుకు ప్రధాన కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయనతోపాటు పలువురు నాయకుల చిట్టాను వెలికితీసే పనిలో వారు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు. మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్ నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు వెన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ ‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా? -
జలదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
కల్వకుర్తి రూరల్: పేదరికంతో అల్లాడుతున్న పాలమూరు రైతాంగాన్ని పట్టించుకోకుండా నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న జలదోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదామని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు. కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో శనివారం ఎరవ్రెల్లి గ్రామ ముంపుపై అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, నాయకులు బాలాజీ సింగ్, ఎడ్మ సత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ.. కరువు, పేదరికంతో అల్లాడుతున్న పాలమూరు రైతాంగానికి అండగా నిలిచేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాలమూరు హక్కులు, సాగునీటిపై ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిండి – నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే గోకారంలో ముంపునకు గురవుతున్న ఎరవ్రెల్లి గ్రామం, తండాను కాపాడాలన్నారు. నిర్వాసితులంతా ఏకమై పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించారని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా రైతుల ప్రయోజనాలు పూర్తిచేశాకే మిగ తా విషయాలు ఆలోచించాలని.. అంతవరకు జల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు తీర్మానించారు. నాయకులు సదానందంగౌడ్, పరశురాములు, దుర్గాప్రసాద్, రాఘవేంద్రగౌడ్, జంగయ్య, సాంబయ్యగౌడ్, విజయ్గౌడ్, మల్లయ్య, బాలయ్య, ఎరవ్రెల్లి ప్రకాశ్, శ్రీనివాస్, నాగయ్య నాయక్ ఉన్నారు. -
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని పోలీస్స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసు దర్యాప్తును వేగంగా పూర్తిచేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లో నమోదైన కేసులను విచారణ సమయానికి పూర్తిచేసి, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా కేసుల నమోదు నుంచి దర్యాప్తు వరకు ప్రతి దశలో పారదర్శకత పాటిస్తూ.. ప్రజల నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పారదర్శక దర్యాప్తుతో నేరస్తులను శిక్షించడమే కాకుండా, నేరస్తులు కాని వారి హక్కులను కాపాడటం పోలీసుల బాధ్యత అని అన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు మహేశ్, అశోక్రెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 83419 43433, 99857 58456
తేది: 29–12–2025, సమయం: ఉదయం 10 నుంచి 11గంటల వరకు నాగర్కర్నూల్ క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న డీఎంహెచ్ఓ డా.రవికుమార్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 83419 43433, 99857 58456 నంబర్లకు ఫోన్చేసి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు డీఎంహెచ్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
కందనూలు: జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో శనివారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ వేడుకను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి – సరిత దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చక స్వాములు శోభాయమానంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక జరిపించారు. వందలాది భక్తులు తిలకిస్తుండగా.. జీలకర్ర బెల్లం, మంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కమనీయంగా సాగింది. లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుకను భక్తజనం కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. తెలంగాణలోనే మొదటి సారిగా యాదాద్రి తరహాలో అంత్యంత వైభవంగా జిల్లా కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్
● గురువు చంద్రబాబు కోసమే ‘పాలమూరు’ను పక్కనపెట్టిన రేవంత్ ● కాళేశ్వరంలా పరుగులు పెట్టించి ఉంటే ఫలితం మరోలా ఉండేది ● జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం/బిజినేపల్లి/కొల్లాపూర్ రూరల్: తనవి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలిటిక్స్ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రలో చంద్రబాబు, లోకేశ్ వరద నీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారని.. వరద పేరుతో కొత్తగా కట్టిన వాటికి కూడా నీటిని కేటాయిస్తున్నారని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఉంటే 90 టీఎంసీలపై హక్కు వచ్చేదన్నారు. నల్లమల బిడ్డగా చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. గురువు చంద్రబాబు కోసం పాలమూరును పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు నిర్వాకంతోనే ఇప్పటికీ కేఎల్ఐ ప్రాజెక్టులో మూడు మోటార్లే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం పరుగులు పెట్టినట్టుగా పాలమూరు ఎత్తిపోతల పథకం పరుగులు పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 400 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని.. మరి తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్ట్కు నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే దానిపై రూ. 10కోట్లు ఖర్చుచేసి 10 సార్లు సర్వే చేశారని తెలిపారు. 18 ప్యాకేజీల్లో కూడా నారాయణపేట– కొడంగల్ అంటూ సీఎం కొత్త స్కీం పెట్టుకున్నారని.. అందుకోసం ఇన్టెక్ పాయింట్ను బీమాలో పెట్టారన్నారు. ఇన్టెక్ పాయింట్ జూరాల వద్ద తీసుకుంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశం ఉండగా.. అలా చేయడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నీటి సోర్స్ను శ్రీశైలం నుంచి ఎందుకు పెట్టుకున్నారో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్పాలన్నారు. ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడం ద్వారా పర్మినెంట్గా జలవివాదానికి తెరతీసినట్టేనని అన్నారు. జిల్లాలోని వట్టెం రిజర్వాయర్ కింద నల్లమట్టిని తీసుకునేందుకు రైతులతో 900 ఎకరాలు తీసుకున్నారని.. తీరా చెరువుల్లో నల్లమట్టిని తీసుకొచ్చి రిజర్వాయర్కు వినియోగిస్తున్నారని తెలిపారు. రైతులతో తీసుకున్న భూములు కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయన్నారు. అవి రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంలో అసైన్డ్ భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. ఇక గద్వాల–మాచర్ల రైల్వేలైన్ పూర్తి చేయించే బాధ్యతను స్థానిక ఎంపీ తీసుకోవాలని కోరారు. జాగృతి పోరాటమంతా సామాజిక తెలంగాణ సాధన కోసమేనని అన్నారు. తాము 80 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇస్తామన్నారు. అంతకుముందు జిల్లా జనరల్ ఆస్పత్రి, వట్టెం రిజర్వాయర్, కుమ్మెర పంప్హౌజ్తో పాటు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో ఉన్న కేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాల పంపుహౌజ్లను ఆమె పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్లో ఎరుకల కాలనీని సందర్శించారు. అక్కడ ఏకలవ్య చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మల్లేష్, వెంకటేశ్, వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. -
చిగురిస్తున్న ఆశలు!
సీఎం హామీతో కొత్త సర్పంచుల్లో నూతనోత్సాహం ● ప్రస్తుతం పంచాయతీల ఖజానాలో కాసులు లేక కటకట ● కేంద్ర, రాష్ట ప్రభుత్వాల గ్రాంట్స్ కోసం ఎదురుచూపులు ● పంచాయతీలకు ప్రత్యేక నిధులతో సమస్యల పరిష్కారానికి వెసులుబాటు ●సొంత డబ్బులతో పనులు ప్రస్తుతం పంచాయతీల్లో ఎలాంటి నిధులు లేవు. సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ విడుదలైతేనే జీపీలో నిధులు సమకూరుతాయి. తాము గెలిచిన తర్వాత సొంత డబ్బులతో చిన్నచిన్న పనులు చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు. – చింతగాళ్ల శ్రీనివాసులు, సర్పంచ్, ఉప్పునుంతల పైసలు లేవు.. గ్రామపంచాయతీలో చిన్న పని చేసేందుకు కూడా పైసలు లేవు. గత సర్పంచులు, కార్యదర్శలు చేపట్టిన పనులకు సంబంధించి బకాయిలు రూ. లక్షల్లో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా పాత బకాయిలకు సరిపోవు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చింది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతాం. – సభావత్ రాఘవులు, సర్పంచ్, సిద్ధాపూర్, అచ్చంపేట మండలం అచ్చంపేట: ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నిధులు లేకపోవడంతో నూతన పాలకవర్గాలు సతమతమవుతున్నాయి. కొత్తగా ఎన్నికై న తాము ఏదైనా చేయాలనే తలంపుతో కొందరు సర్పంచులు సొంత డబ్బులతో చిన్నచిన్న పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇస్తామని.. తద్వారా గ్రామాల్లో నెలకొన్న కొన్ని సమస్యలు తీరడంతో పాటు మౌలిక వసతులు సమకూరుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కోస్గిలో నిర్వహించిన సర్పంచుల అత్మీయ సమ్మేళనంలో ప్రకటించడం కొత్త పాలకవర్గాల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజలకిచ్చిన కొన్ని హామీలైనా నెరవేర్చే అవకాశం లభిస్తోందని ఆశిస్తున్నారు. నిధుల లేమితో సతమతమవుతున్న జీపీలకు వెసులుబాటు కలగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ గ్రామాలకు తప్పని ప్రత్యేకాధికారుల పాలన.. ఏజెన్సీ ప్రాంతంలోని ఐదు గ్రామ పంచాయతీలతో పాటు చారకొండ మండలం ఎర్రవల్లి జీపీలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుమ్మరోనిపల్లి, వంగరోనిపల్లి, కల్మలోనిపల్లి, లక్ష్మాపూర్, ప్రశాంత్నగర్ గ్రామ పంచాయతీలు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. ఆయా గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో ఎన్నికలు జరగలేదు. చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. -
ఉత్సాహంగా హ్యాండ్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్ల ధర్నా
నాగర్కర్నూల్ రూరల్: పల్స్పోలియో, కుష్టు సర్వే, ఎన్నికల విధుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ.. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశావర్కర్లు విధులు నిర్వర్తిస్తే ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాదన్నారు. పల్స్పోలియో, కుష్టు సర్వేకు సంబంధించిన డబ్బులు సైతం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పీహెచ్సీల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఆశావర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఆశావర్కర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్దన్ పర్వతాలు, సహాయ కార్యదర్శి పొదిల రామయ్య, మధు, శివరాములు, జయమ్మ, కళావతి, రజిత, శివలిల, యాదమ్మ, స్వప్న, రత్నమాల, శ్రీదేవి, యాదమ్మ, బాలమణి పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు కేటీఆర్
నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జిల్లాకు రానున్నారు. ఇటీవల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందిన బీఆర్ఎస్ మద్దతుదారులను జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనేశ్వరుడికితైలాభిషేకాలు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి చారకొండ: చదువులో వెనకబడిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రమేశ్బాబు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాల, చారకొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని సూచించారు. డీఈఓ వెంట పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహులు, కేజీబీవీ ఎస్ఓ మంజుల ఉన్నారు. రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ కందనూలు: జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ నిర్వహించనున్నట్లు డీఈఓ రమేశ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. సైన్స్ఫెయిర్లో పాల్గొనే వారు ఆదివారం మధ్యాహ్నంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. -
పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు
నాగర్కర్నూల్ రూరల్: సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సీపీఐ పార్టీ పేదల పక్షాన నిలిచి వందేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల్నర్సింహ్మ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సంతబజారు నుంచి 100 మీటర్ల ఎర్ర జెండాతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో బాల్నర్సింహ మాట్లాడారు. కష్టజీవుల వెన్నంటి ఉంటూ.. పేద ప్రజల పక్షాన పోరాడుతున్న ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది పార్టీ నేతలు జైలు జీవితం గడిపారని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు రక్తర్పణ చేశారన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వచ్చే నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆనంద్, కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
‘అలివి’లవిల
–8లో u కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట కొల్లాపూర్: అలివి వలలతో చేపల వేట నిషేధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కృష్ణానదిలో అలివి వలలతో వేట సాగిస్తూ.. చిన్న చేప పిల్లలను యథేచ్ఛగా పట్టేస్తున్నారు. ఫలితంగా సంప్రదాయ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలివి వలలను పూర్తిస్థాయిలో నిషేధిస్తామని.. అవసరమైతే ఏపీ అధికారుల సమన్వయంతో అలివి వలలతో చేపల వేటను కట్టడి చేస్తామని ఇటీవల కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చాలాకాలంగా అలివి వలల వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగంలో మాత్రం స్పందన కనిపించడం లేదు. కృష్ణానదిలో విచ్చలవిడిగా అలివి వలల వినియోగం జరుగుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, అధికారులు చేతలకు పొంతన లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కృష్ణానదిలో వదులుతున్న చేప పిల్లలను కొన్ని రోజుల్లోనే అలివి వలలతో పట్టేస్తుండటంతో క్రమేణా మత్స్య సంపద తగ్గుతూ వస్తోంది. కృష్ణాతీరంలోనే గుడారాలు.. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్న కృష్ణానది తీరం వెంట పదుల సంఖ్యలో అలివి వలలతో చేపల వేట సాగించే వారి గుడారాలు ఉన్నాయి. చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లోని నది తీర ప్రాంతాల్లో విస్తృతంగా అలివి వలలతో చేపల వేట సాగుతోంది. వైజాగ్, కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నదీ తీరంలోని పట్లు (చేపలు అధికంగా లభించే ప్రాంతాలు) కొనుగోలు చేసి దందా సాగిస్తున్నారు. కార్మికుల నిర్బంధం.. అలివి వలలు లాగేందుకు చాలామంది కార్మికులు అవసరం పడతారు. దీంతో వ్యాపారులు బలవంతంగా కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల జోక్యంతో 100 మందికిపైగా బాండెడ్ లేబర్కు విముక్తి కల్పించారు. అయినప్పటికీ కార్మికశాఖ అధికారులు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. చేపపిల్లల విడుదల ఇలా.. జిల్లాలోని నీటి వనరుల్లో ఈ ఏడాది 2.50 కోట్ల చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గ కేంద్రాల్లో చేపపిల్లల విడుదలను లాంచనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 23 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. సోమశిల వద్ద కృష్ణానదిలో మంత్రి జూపల్లి కృష్ణారావు 58 వేల చేపపిల్లలను వదిలారు. నదిలో 30 లక్షల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల చెంతనే.. పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం.. కృష్ణానదిలో బోట్ల ద్వారా విహరించడం కనిపిస్తుంది. అయితే సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి కనుచూపు మేరలోనే అలివి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలు ఉన్నాయి. నదీ తీరానికి రెండు వైపులా గుడారాలు, ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ, ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలివి వలల గుడారాలే కనిపిస్తాయి. అలివి వ్యాపారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందుకే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేస్తాం.. కృష్ణానది తీరం వెంట తనిఖీలను ముమ్మరం చేస్తాం. కృష్ణానదిలో అలివి వలలతో చేపల వేటను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రధానంగా స్థానిక మత్స్యకారులు అధికారులకు సహకరించాలి. – నర్సింహారావు, ఏడీ, మత్స్యశాఖ ఇలా వదిలితే.. అలా పట్టేస్తున్న అక్రమార్కులు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు స్వయంగా మంత్రులు హెచ్చరించినాకనిపించని స్పందన క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద -
వాజ్పేయి సేవలు చిరస్మరణీయం
కందనూలు: ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అటల్ బిహారి వాజ్పేయి ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు శాంతికుమార్ అన్నారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజ్పేయి హయాంలోనే ప్రోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించి, ప్రపంచానికి భారతదేశం గొప్పతనాన్ని చాటిచెప్పారన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన్ ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించారని గుర్తుచేశారు. స్వర్ణ చతుర్బుజి ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవేలను విస్తరించిన ఘనత వాజ్పేయికే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా పనిచేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, అధికార ప్రతినిధి దిలీపాచారి తదితరులు పాల్గొన్నారు. -
బకాయిల చెల్లింపులో జాప్యం తగదు
కల్వకుర్తి రూరల్: ఉపాధ్యాయులకు అందించాల్సిన బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని.. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. విడతల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నప్పటికీ.. అనేక మంది ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, సరెండర్ బిల్లులు ఏడాదికాలంగా అందడం లేదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలుచేయాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మెరుగైన వేతన సవరణ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. సమావేశంలో ఏపీ మల్లయ్య, శ్రీధర్ శర్మ, చిన్నయ్య, తిరుపతయ్య, బాల్రాజ్, చంద్రశేఖర్, మహేశ్బాబు, శంకర్, లక్ష్మణ్, నెహ్రూ ప్రసాద్, శశికళ, కురుమయ్య, లింగమయ్య ఉన్నారు. -
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు
మన్ననూర్: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సమక్షంలో నిర్వహించిన పోటీల్లో గద్వాల, పెబ్బేరు, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూపాదేవి, అలీం, చంద్రశేఖర్, డా.నరేందర్రెడ్డి, శ్యామ్, బాబునాయక్, పీఈటీలు అస్మత్, అనిత, స్నేహ పాల్గొన్నారు. జట్ల వివరాలు.. బాలుర జట్టు: ప్రణీత్ (గద్వాల), రంజిత్ (పెబ్బేరు), ఎం.చరణ్ (గద్వాల), భాస్కర్ (పెబ్బేరు), మణికంఠ (అచ్చంపేట), సుదర్శన్ (గద్వాల), జి.చరణ్ (గద్వాల), మోహన్ (వనపర్తి). బాలికల జట్టు: అక్షిత (మన్ననూర్), అను (పెబ్బేరు), కావేరి (మన్ననూర్), మేరీ (మన్ననూర్), రాధిక (మన్ననూర్), రేణుక (కల్వకుర్తి), మహాలక్ష్మి (కల్వకుర్తి), శ్రావణి (మన్ననూర్), సమారిన్ బేగం (గద్వాల), యశస్విని (తెలకపల్లి) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. -
నేడు కవిత పర్యటన
నాగర్కర్నూల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం జిల్లాలోని కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎల్లూరులోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్హౌజ్లను ఆమె సందర్శించనున్నారు. అనంతరం పెంట్లవెల్లికి చేరుకొని పంట రుణమాఫీ బాధితులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి పెద్దకొత్తపల్లికి చేరుకొని ఎరుకల సంఘం, ముదిరాజ్ సంఘం సభ్యులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. 12:30 గంటలకు కొల్లాపూర్ మామిడి మార్కెట్ను సందర్శిస్తారు. అక్కడి నుంచి నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చేరుకొని సిర్సవాడ బ్రిడ్జిని పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు వట్టెం రిజర్వాయర్, పంప్హౌజ్ను పరిశీలిస్తారని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు. నేడు డయల్ యువర్ డీఎం అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పి.మురళీ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 94408 18849 నంబర్ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు కల్వకుర్తి రూరల్: వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు ఆరోపించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రాంజీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. అసంఘటితరంగా కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులకు నష్టం చేకూరుస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని కనుమరుగు చేసే విధంగా తెచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సి.ఆంజనేయులు, పరశురాములు, ఏపీ మల్లయ్య, శ్రీనివాసులు, బాలయ్య, ఆంజనేయులు, యాదయ్య, పర్వతాలు, కిరణ్, వెంకటయ్య పాల్గొన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 83419 43433, 99857 58456
తేది: 29–12–2025, సమయం: ఉదయం 10 నుంచి 11గంటల వరకు నాగర్కర్నూల్ క్రైం: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈ నెల 29న డీఎంహెచ్ఓ డా.రవికుమార్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 83419 43433, 99857 58456 నంబర్లకు ఫోన్చేసి డీఎంహెచ్ఓను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 29న డీఎంహెచ్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
పెద్దపులి జాడ కోసం విస్తృతంగా అన్వేషణ
కొల్లాపూర్ రూరల్: కృష్ణానది పరిసర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం గురువారం తెలంగాణ అటవీశాఖ కొల్లాపూర్ రేంజ్, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆత్మకూర్ రేంజ్ అధికారులు సంయుక్తంగా సరిహద్దు పెట్రోలింగ్ నిర్వహించారు. పెద్ద పులి అడుగు జాడల కోసం విస్తృతంగా అన్వేషణ చేపట్టారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద పులితో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. రాత్రివేళలో ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని.. ఏమైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ రేంజ్ అధికారి మగ్దూంహుస్సేన్, సెక్షన్ అధికారులు ముజీబ్ ఘోరి, బయన్న, నీలేష్, ఆత్మకూర్ డివిజన్ అధికారులు మద్దిలేటి, కావేరి, నవీన్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి పనికి జియో ట్యాగింగ్..
సాక్షి, నాగర్కర్నూల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వీటిపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం వీబీజీ రాంజీ (వికసిత భారత్– గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్)గా మార్చడంతో పాటు ఇటీవల చట్టంగా అమలులోకి తెచ్చింది. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించనున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టే పనులను ప్రజలకు వివరించనున్నారు. వారం రోజుల వ్యవధిలోనే గ్రామసభలను పూర్తిచేసి.. ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకోనున్నారు. పనిదినాల పెంపు.. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 100 రోజుల వరకు పని కల్పించేందుకు గ్యారంటీ ఉండగా.. ఇప్పుడు కేంద్రం ఈ పరిమితిని 125 రోజులకు పెంచింది. గతంలో ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించగా.. ఇకనుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి 15 రోజుల్లోగా పని లభించకపోతే.. రోజూవారీ నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు వీలు కల్పించారు. జిల్లాలోని 360 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలుచేస్తుండగా.. మొత్తం 3,74,896 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో వేసవి కాలంలో అత్యధికంగా 55,499 మంది వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. మట్టి పనులకు మంగళం.. ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం.. మట్టి పనులను పూర్తిగా తొలగించింది. ఈ పనులను ఎంపిక చేయొద్దని గతేడాది నుంచే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో ఎక్కువగా చెరువుల్లో పూడిక తీత, కందకాలు తవ్వడం వంటి పనులను చేపట్టేవారు. అయితే వీటిలో ఆశించినంత పని జరగలేదన్న అభిప్రాయం నెలకొంది. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జలసంరక్షణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్ షెడ్లు, కాల్వల నిర్మాణం, నీటిబావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను చేపడుతుండగా.. ఇకపై కొనసాగించనున్నారు. అదే విధంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో సుమారు 2నెలల పాటు ఈ పథకం పనులను నిలిపివేయనున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు. కార్యాచరణ సిద్ధం.. గతంలో ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు ఉండగా.. ఇకపై 125 రోజుల పాటు పని కల్పించనున్నాం. జలసంరక్షణ, నీటి వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – చిన్నబాలు, డీఆర్డీఓ జలసంరక్షణకు ప్రాధాన్యం.. ఇకపై చేపట్టే పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించనున్నారు. గ్రామాల్లో తాగు, సాగునీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు ఈ పథకం ద్వారా పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, నీటి వసతి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంచినీటి పైప్లైన్లు, సాగునీటి కాల్వలు, పొలాల్లో పిల్లకాల్వల తవ్వకాలను చేపట్టేందుకు వీలుకలుగనుంది. గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి ఉపాధి హామీ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని 360 గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వీబీజీ రాంజీ పేరుతో పథకం అమలు 100 నుంచి 125 రోజులకు పనిదినాల పెంపు రైతులకు కూలీల కొరత తలెత్తకుండా వెసులుబాటు -
భక్తిభావంతో మెలగాలి
కల్వకుర్తి రూరల్: మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా పడిపూజలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జిల్లెల రాములు, సర్పంచ్ రమేశ్నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, సంతు యాదవ్, గోరటి శీను పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు చారకొండ: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకట్రెడ్డి స్థానిక పోలీసులకు సూచించారు. గురువారం చారకొండ పోలీస్స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి భరోసా ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, పోలిసు విధుల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన కానిస్టేబుల్ సురేశ్గౌడ్, ఎ.ప్రశాంత్లకు డీఎస్పీ రివార్డులు అందజేసి ప్రశంసించారు. డీఎస్పీ వెంట సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ వీరబాబు తదితరులు ఉన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి నాగర్కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు 2025–26 సంవత్సరానికి గాను ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు కొత్త పథకం, 9 నుంచి 10వ తరగతి గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యాదీవెన పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 5 నుంచి 8వ తరగతి బాలికలకు రూ. 1,500, బాలురకు రూ. 1,000, 9 నుంచి 10వ తరగతి డే స్కాలర్లకు రూ. 2,250 ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ–పాస్ వెబ్సైట్ అందుబాటులో ఉందన్నారు. దరఖాస్తుకు ఫొటో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువపత్రం (జిరాక్స్), ఆదాయ ధ్రువపత్రం (ఒరిజినల్) అవసరమని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలను తమతమ పాఠశాలల హెచ్ఎంలకు సకాలంలో అందించాలని సూచించారు. ఈ–పాస్ ద్వారా పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ‘రూ.1.50 లక్షల కోట్ల వడ్డీ చెల్లించాం’ వనపర్తి: గడిచిన 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రూ.63 వేల కోట్ల అప్పు చేస్తే.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఆయన చేసిన అప్పుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1.50 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్కు కేంద్రం అనుమతి లభించలేదనే విషయం పక్కన పెడితే.. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు వెచ్చించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అధికారం కోల్పోయాక చేస్తున్న అబద్ధపు ఆరోపణలపై నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో నిజాలు సవివరింగా చర్చించాలని సూచించారు. -
ప్రకృతి వ్యవసాయానికి పురస్కారం
తిమ్మాజిపేట: శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తిమ్మాజిపేట మండల రైతు బైరపాగ రాజు ప్రతిష్టాత్మక రైతు అవార్డు అందుకున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రైతుల సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయం విభాగంలో తెలంగాణ నుంచి రైతు బైరపాగ రాజుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సదస్సులో పాల్గొన్న రాజుకు ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ ఆర్ఎస్ బరోడా ప్రతిష్టాత్మక రైతు అవార్డు అందజేశారు. -
ఆక్రమిస్తూ.. అద్దెకిస్తూ!
అచ్చంపేట: పట్టణాల్లో పుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరువ్యాపారాల పేరిట కొందరు పుట్పాత్లను యథేచ్ఛగా ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వాటిని ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ అడ్డాలను అమ్మేస్తున్నారు. ఇలాంటి దందాలపై మున్సిపల్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రహదారులే అడ్డాగా ఆక్రమణలు పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా రోజురోజుకు ఈ తతంగం విస్తరిస్తోంది. నడిచేందుకు స్థలం లేక పాదచారులు నడిరోడ్డుపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మొదట తాత్కాలికంగా ప్రారంభించి.. రహదారుల ఆక్రమణలు ఒకేసారి విస్తరించడం లేదు. మొదట తాత్కాలిక ఏర్పాట్లతో చిరువ్యాపారులను ప్రారంభించి.. ఆ తర్వాత వాటిని విస్తరిస్తున్నారు. ఒకరు దుకాణం ప్రారంభించగానే మరొకరు.. ఆపై ఇంకొకరు ఇలా ఆ ప్రాంతమంతా ఇలాంటి వ్యాపారులతో నిండిపోతుంది. ఇందులో కొన్ని సక్రమైతే.. చాలా వరకు అక్రమంగా వెలుస్తున్నావే. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా రూ.వేలల్లో సంపాదించే దందా జోరుగా సాగుతోంది. ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలముంటే చాలు.. మెల్లగా కొన్ని రోజులు అక్కడ చిన్నపాటి దందా నడిపి.. ఆ స్థలాన్ని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇక ఎవరూ తమ జోలికి రావడం లేదని నిశ్చయించుకున్న తర్వాత ఏకంగా అడ్డాలను అద్దెకు ఇస్తున్నారు. చిరువ్యాపారులే కదా అని అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తొండ ముందిరి ఊసరివెల్లిగా మారిన పరిస్థితి ఏర్పడుతోంది. అచ్చంపేటలో ఇదీ పరిస్థితి.. అచ్చంపేట పట్టణంలోని నాగర్కర్నూల్ – శ్రీశైలం ప్రధాన రహదారితో పాటు బస్టాండ్, రాజీవ్ చౌరస్తా, లింగాల రోడ్డు, పోస్టాఫీస్, ప్రభుత్వ ఆస్పత్రి, నెహ్రూ చౌరస్తా, ఉప్పునుంతల రోడ్డు తదితర ఏరియాల్లో దుకాణదారులు ఎక్కువగా తమ షాపు ఎదుట ఉన్న స్థలంలో చిరువ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను చిరువ్యాపారుల నుంచి అద్దె వసూలు చేస్తున్నారు. చిరువ్యాపారుల నుంచి రోజువారీగా అద్దె వసూలు చేస్తూ.. నెలకు రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. తమ దుకాణమే ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఉందంటే.. రహదారిని ఆక్రమించి మరో దుకాణాన్ని పెట్టేస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. పోస్టాఫీస్కు వెళ్లడం కష్టమే.. లింగాల చౌరస్తాలో పోస్టాఫీస్ ఉంది. నిత్యం వందలాది మంది వినియోగదారులు, అధికారులు, ఉద్యోగులు వస్తుంటారు. పోస్టాఫీస్ ఎదుట, పక్కనున్న ప్రధాన రహదారిని యథేచ్ఛగా ఆక్రమించి చిరువ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. కనీసం కార్యాలయంలోకి వెళ్లేందుకు దారి కూడా లేకుండా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ ఉన్న డబ్బాలను తొలగించి వాహన పార్కింగ్ ఏర్పాటు చేయగా.. కొద్ది రోజులకే చిరువ్యాపారాలు వెలియడంతో పరిస్థితి యథావిధిగా మారింది. ఆక్రమణదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి లింగాలకు వెళ్లే రోడ్డుపై కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉప్పునుంతల రోడ్డు మలుపు వద్ద ఇరువైపులా చిరు వ్యాపారులు అడ్డాలను ఏర్పాటు చేసుకోవడంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. వెండింగ్ జోన్లు లేకపోవడంతో జిల్లాలో నాగర్కర్నూల్ మినహా ప్రత్యేకంగా వెండింగ్ జోన్లు లేకపోవడంతో చిరువ్యాపారులకు పుట్పాత్లే దిక్కువుతున్నాయి. అచ్చంపేటలో సమీకృత మార్కెట్ సమూదాయం నిర్మించి పుట్పాత్ వ్యాపారులకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. రోడ్లపైనే చిరువ్యాపారాలు నిర్వహిస్తూ బతుకు వెల్లదీస్తున్న వారికి ప్రత్యేకంగా వెండింగ్ జోన్లు ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు. పట్టణాల్లో యథేచ్ఛగాపుట్పాత్ల ఆక్రమణ చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నదుకాణదారులు? చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు -
గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నాగర్కర్నూల్: ప్రభుత్వ సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరం 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలతో ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో సహజసిద్ధమైన ప్రతిభ ను వెలికితీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి సుమారు రూ. 1.70 లక్షలు ఖర్చుచేసి, గురుకులాలను నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తిగల, అర్హులైన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు www.tgcet.cgg.gov.in, https://tgs wreis.telangana.gov.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గురుకులాల్లో చేరదల్చిన బాలబాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం
వనపర్తి రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, సర్పంచ్ తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీలను వారితో పాటు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పరిశీలకుడు పాండురంగారెడ్డి, మద్దిలేటి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 200 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారని, శుక్రవారం చివరి పోటీలు ఉంటాయని వివరించారు. రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొదటిరోజు విజేతలు వీరే.. మొదటి మ్యాచ్ మెదక్, ఖమ్మం జట్లు, రెండో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరగగా డ్రాగా ముగిశాయి. 3వ మ్యాచ్లో వ రంగల్ జట్టుపై నల్లగొండ జట్టు 2–0 గోల్స్ తో.. 4వ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై మహబూబ్నగర్ జట్టు 4–0 గోల్స్తో.. 5వ మ్యాచ్ లో రంగారెడ్డి జట్టుపై నిజమాబాద్ జట్టు 5–0 గోల్స్తో.. 6వ మ్యాచ్లో కరీంనగర్ జట్టుపై మెదక్ జట్టు 1–0 గోల్స్తో.. 7వ మ్యాచ్లో వరంగల్పై హైదరాబాద్ జట్టు 2–0 గోల్స్తో 8వ మ్యాచ్ ఖమ్మంపై మహబూబ్నగర్ జట్టు 2–0 గోల్స్తో విజయం సాధించాయి. 9వ మ్యాచ్లో హైదరాబాద్, నల్లగొండ జట్టుతో తలపడగా డ్రాగా ముగిసింది. 10వ మ్యాచ్లో ఖమ్మం జట్టుపై కరీంనగర్ జట్టు 1–0 గోల్స్తో.. 11వ మ్యాచ్లో వరంగల్ జట్టుపై నిజామాబాద్ జట్టు 4–0 గోల్స్తో.. 12వ మ్యాచ్లో మెదక్ జట్టుపై మహబూబ్నగర్ జట్టు 2–0 గోల్స్తో.. 13వ మ్యాచ్ వరంగల్ జట్టుపై రంగారెడ్డి జట్టు 2–0గోల్స్తో.. 14 మ్యాచ్ నల్గొండ జట్టుపై నిజమాబాద్ జట్టు 4–0 గోల్స్తో విజయం సాధించిందని టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నిరంజన్గౌడ్ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను గురువారం క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. సుందరంగా ముస్తాబుచేసిన చర్చిల్లో యేసయ్య రాకను స్వాగతిస్తూ.. సుమధుర సుస్వరాల గీతాలాపనలతో ఆరాధించారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్రైస్తవులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఏసు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య ప్రసంగీకుడిగా రెవరెండ్ మోజస్ హాజరై.. విశ్వమానవాళి శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న చర్చిలో తాను వాక్యోపదేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభువైన ఏసుక్రీస్తు పుట్టుక చరిత్రను సృష్టించిందని.. ఈ విశ్వాన్ని కదిలించిందన్నారు. ప్రభువైన ఏసుక్రీస్తు దేవాది దేవుడికి, మానవాళికి మధ్యవర్తి అని అన్నారు. కాగా, క్రైస్తవులు ఉదయాన్నే చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎంబీ చర్చి చైర్మన్ సంపత్కుమార్, కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందరి భాగస్వామ్యంతో క్షయ నిర్మూలన
నాగర్కర్నూల్ క్రైం: అందరి భాగస్వామ్యంతోనే క్షయవ్యాధిని నిర్మూలించవచ్చని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి, రామాలయం వద్ద క్షయ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటుచేసి, 194 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మద్యపానం, ధూమపానం చేసేవారితో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులు, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు తదితరులకు టీబీ సోకే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వారి జాబితాను ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సిద్ధంచేసి.. నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. తద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించి, వెంటనే చికిత్స అందించవచ్చన్నారు. అనంతరం వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూట్రిషన్ కిట్ వినియోగంపై ఆరా తీశారు. కార్యక్రమంలో క్షయ నియంత్రణ అధికారి డా.రఫీక్, వైద్యాధికారి డా.వాణి, ఎంఎల్హెచ్పీ కీర్తన, సీహెచ్ఓ మినహాజ్, ఎస్టీఎస్ శ్రీను, ఆరిఫ్, ఏఎన్ఎంలు సరస్వతి, కవిత పాల్గొన్నారు. -
27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉత్తమ పోలీసులకురివార్డులు నాగర్కర్నూల్ క్రైం: పోలీసు కేసులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన జిల్లా పోలీసు సిబ్బందికి డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ శ్రీనివాసరావు రివార్డులను అందజేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ బుధవారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ సమన్వయకర్తగా పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ నర్సింహ, ఐటీ కోర్ సభ్యుడు హెడ్కానిస్టేబుల్ నాగార్జున, కల్వకుర్తి పోలీస్స్టేషన్ టెక్నికల్ టీం రైటర్ హరిలాల్, నాగర్కర్నూల్ స్టేషన్ టెక్నికల్ టీం రైటర్ హనుమంతు నాయక్ రివార్డులకు ఎంపికై ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అకింతభావంతో పనిచేస్తూ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళన చారకొండ: మండలంలోని గోకారంలో నిర్మించే డిండి –నార్లాపూర్ ఎత్తిపోతల పథకం జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు తేల్చిచెప్పారు. ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కందనూలు: కరీంనగర్లో గురువారం నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే 72వ సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు బుధవారం జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచి ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కాగా, క్రీడాకారులకు రాచూర్ సర్పంచ్ శ్రీనివాసులు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యామిని, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంజుల శ్రీనివాసులు, సభ్యులు రమేశ్, మోహన్లాల్ పాల్గొన్నారు. రేపు సీపీఐ శతాబ్ది ఉత్సవాలు నాగర్కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 26న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం బస్టాండ్ కూడలిలో పార్టీ జెండావిష్కరణ, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. సమాజంలో అందరూ గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న కొత్త సంవత్సరంలో ప్రతినెలలో ఒకరోజు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అన్ని సంక్షేమ గురుకులాల్లో దివ్యాంగుల పిల్లలకు ప్రవేశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అలిమ్కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం సహాయక పరికరాల పంపిణీ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇతర సహాయక పరికరాలను అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలో ఏర్పాటుచేసిన భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, కార్యదర్శి పరశురాములు నాయకులు శ్యామ్, నవీన్కుమార్ రెడ్డి, రాజశేఖర్, కురుమయ్య, కొడావాత్ రవి, శంకర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ నాగర్కర్నూల్/కందనూలు: క్రిస్మస్ పర్వదినానికి జిల్లాలోని చర్చిలు ముస్తాబు అయ్యాయి. గురువారం పండగ సందర్భంగా కరుణామయుడి కోవెలలను వివిధ రంగుల స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ముఖద్వారాలను అందంగా తీర్చిదిద్దారు. క్రైస్తవులు తమ ఇళ్లపై ఏర్పాటుచేసిన నక్షత్రాకార చిహ్నాలతో పండుగ శోభ సంతరించుకుంది. చర్చిల్లో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిల్లో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందస్తు వేడుకలతో చర్చిలన్నీ కోలాహలంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు స్వగ్రామాలకు వచ్చారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. క్రిస్మస్ ట్రీస్తో పాటు స్టార్స్, గ్రీటింగ్, ఫేస్మాస్క్లు ఇతర అలంకార వస్తువులకు భలే గిరాకీ ఉంది. ఆయా దుకాణాల్లో సందడి నెలకొంది. పండగను ఆనందంగా జరుపుకోవాలి.. క్రిస్మస్ పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని జిల్లాలోని క్రైస్తవులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ను ఎంతో పవిత్రమైన పండగగా భావిస్తారని.. యేసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన కాంక్షించారు. -
వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి
● డీఈఓ రమేష్కుమార్ కందనూలు: జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 29, 30 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఎంఈఓలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన ముందస్తు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ఫేర్ విజయవంతం చేసేందుకు 23 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనలతో విధిగా హాజరయ్యేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నాగర్కర్నూల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగమే ప్రధాన కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లు నెల్లికొండి స్టేజీ, మంగనూరు, పాలెం, బిజినేపల్లి, లింగసానిపల్లి, గుమ్మకొండ, తాడూరు, పెద్దకొత్తపల్లి చౌరస్తా, వెల్దండ చెరుకూరు గేట్, కొట్ర, బీపీనగర్, వంగూరు, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద రహదారి వెడల్పు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మార్కింగ్, రిఫ్లెక్టర్ బోర్డులు, హెచ్చరిక సూచికలు, క్యాట్ ఐస్, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, పీఆర్ అధికారులను ఆదేశించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజలను చైతన్యం చేయాలని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జాతీయ రహదారులకు సమీప గ్రామాల్లో సీపీఆర్ శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ గేట్ వద్ద తాత్కాలిక బస్టాప్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచించారు. కలెక్టరేట్కు ద్విచక్రవాహనాలపై వచ్చేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించే రోడ్డు భద్రత మాస, వారోత్సవాల్లో హెల్మెట్ ర్యాలీలు, వాక్థాన్, ముగ్గుల పోటీలు, ప్రతిజ్ఞ, ఆరోగ్య శిబిరాలు, పాఠశాలల్లో వ్యాస, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపడతామన్నారు. సమావేశంలో ఆర్టీఏ మెంబర్ గోపాల్రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి విదేశి విద్యా పథకం ద్వారా స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేయాలనుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని జనవరి 19న సాయంత్రం కలెక్టరేట్లోని మైనారిటీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ‘మీ డబ్బు– మీ హక్కు’నుసద్వినియోగం చేసుకోవాలి నాగర్కర్నూల్: వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన మీ డబ్బు– మీ హక్కు శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ 1 నుంచి ఈ నెల 31 వరకు మీ డబ్బు– మీ హక్కు నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు తమకు చెందాల్సిన అన్ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు తదితర ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. అన్ క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు ధ్రువపత్రాలతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఎస్బీఐ ఆర్ఎం సునీత, టీజీబీఆర్ఎం సంగీత, డీసీసీబీ ఏజీఎం అబ్దుల్ నబీ, ఆర్ఎస్ ఈటీఐ డైరెక్టర్ జావిద్ అహ్మద్ పాల్గొన్నారు. ● కట్ట నిర్మాణానికి మట్టి నమూనాల సేకరణ ● ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి ● రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి
నాగర్కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందడంతోపాటు మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. ఇటీవల లట్టుపల్లి, పెంట్లవెల్లి, అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతాశిశు మరణాలపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వైద్య సిబ్బంది సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలు జరగకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆశాలు ఎల్ఎంపీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, గర్భం దాల్చిన 12 వారాలలోపు నమోదు చేసుకుని రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కు పంపాలన్నారు. గర్భిణులను పరీక్షించిన ప్రతిసారి రక్తపోటు, హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ స్థాయి, బరువును పరీక్షించడం తదితర ప్రాథమిక పరీక్షలు తప్పకుండా చేయాలన్నారు. పర్యవేక్షణ సిబ్బంది గుర్తించిన హైరిస్క్ గర్భిణులు ప్రత్యేక దృష్టిపెట్టి సురక్షిత మాతృత్వం పొందే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిశువులలో పుట్టుకతో వచ్చే అవయవ లోపాలను నివారించడానికి ప్రతి గర్భిణికి ప్రత్యేక టిఫా స్కానింగ్ పరీక్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పకుండా చేయించాలని తెలిపారు. ఆశాలు గర్భిణులలో రక్తహీనతను అరికట్టడానికి ప్రతిరోజు ఐరన్, ఫోలిక్, క్యాల్షియం మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రామకృష్ణ, ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, గైనకాలజిస్టులు కవిత, రాజేష్గౌడ్ పాల్గొన్నారు. -
జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. 1.50 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరితే కూలుతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూలేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని.. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశామన్నారు. జూరాల సమీపంలో 108 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో పేదలకు ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, మహంకాళి, మార్కెట్ డైరెక్టర్ విష్ణు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ● అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఎం మండల నాయకులు జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రమేష్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. -
గవర్నర్ దృష్టికి ప్రముఖుల సేవలు
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్తో పరిచయం చేసుకున్నారు. దక్షిణకాశీలో ప్రత్యేక పూజలు దక్షిణకాశీ క్షేత్రానికి చేరుకున్న గవర్నర్కు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హరీష్, ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంబ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి, అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిపించారు. అలాగే జోగుళాంబదేవిని దర్శించుకొని కుంకుమార్చన, విశేష పూజలు జరిపించారు. అంతకు ముందు అలంపూర్ చేరుకున్న గవర్నర్కు ఎంపీ మల్లురవి, కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విజయుడు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్, ఏడీసీ మేజర్ అమన్ కుందూ, ఏడీసీ కాంతిలాల్ పటేల్, సీఎస్ఓ శ్రీనివాసరావు, వ్యక్తిగత కార్యదర్శి పవన్సింగ్, గద్వాల అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఎస్పీ మొగలయ్య, పురావస్తు శాఖ ఇంజినీర్ కిశోర్కుమార్రెడ్డి, తహసీల్దార్ మంజుల తదితరులు పాల్గొన్నారు. చేనేత మగ్గం నేసి.. గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్భవన్ను లోక్భవన్గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్ను జ్ఞాపికగా అందజేశారు. -
సమస్యలు ఎవరికి చెప్పాలి..
మా గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ రావడం, ఎస్టీలు ఎవరూ లేక గత ఐదేళ్లు సర్పంచ్ లేకుండానే గడిచిపోయింది. ఈసారి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. స్పెషల్ అధికారులను నియమిస్తే వారు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదు. మా బాధలు, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – ఆంజనేయులు, కుమ్మరోనిపల్లి గ్రామం, అమ్రాబాద్ మండలం మా ఎర్రవల్లి గ్రామం గోకారం రిజర్వాయర్లో మునిగిపోతోంది. ఇప్పటికే రిజర్వాయర్ కింద మా భూములను కోల్పోయాం. ఇళ్లు కూడా మునిగితే మా పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వద్దు. గ్రామం ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలి. ఊరే లేనప్పుడు సర్పంచ్ ఉండి ఏం లాభం. అందుకే ఎన్నికలను బహిష్కరించుకున్నాం. – శ్రీరామ్, ఎర్రవల్లి గ్రామం, చారకొండ మండలం ● -
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి
వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వెల్దండలో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తేనే వారు నాయకులుగా గుర్తించుకుంటారన్నారు. గ్రామాల పరిపాలన పూర్తి బాధ్యత సర్పంచులకే ఉంటుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేస్తారు తప్ప.. పూర్తి అధికారాలు సర్పంచులకు ఉంటాయన్నారు. సర్పంచులకు మాత్రమే చెక్కు పవర్ ఉంటుందని బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి, కార్యదర్శి గిరి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం మాజీ సీఎం కేసీఆర్ను గద్దె దించారని ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిపించకుండా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హేళన చేసి మాట్లాడడం సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మార్పు చూపించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే సమర్థవంతమైన నాయకుడు రేవంత్రెడ్డి అనే అధిష్టానం గుర్తించిందన్నారు. అందుకు నిరంతరం కష్టపడి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. -
విద్యార్థుల్లో దృష్టిలోపాలు గుర్తించాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపాలను గుర్తించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రవికుమార్ అన్నారు. సోమవారం ఉయ్యాలవాడలోని మహాత్మ జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని 332 ఉన్నత, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 53,504 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్–ఏ ఎక్కువగా ఉండే పాలకూర, మునగాకు, కరివేపాకు, ఆకుకూరలు, క్యారెట్ తదితర కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి మార్చిలో ఉచితంగా కంటి అద్దాలను సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవనీత, ఆర్బీఎస్కే వైద్యులు అభిషేక్, మహతి, నేత్రాధికారులు వెంకటస్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా మ్యాపింగ్
నాగర్కర్నూల్: ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 880 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులను నియమించామన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల స్థాయిలో ఎంత వరకు పూర్తయ్యిందో వివరాలు తెలుసుకున్నారు. 2002 నుంచి ఉన్న ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితా ప్రమాణాలకు అనుగుణంగా సవరించడం అత్యంత కీలకమని, ఈ మ్యాపింగ్ను పూర్తిగా జాగ్రత్తగా, కచ్చితంగా చేపట్టాలన్నారు. ఏఈఆర్ఓలు తమ పరిధిలో పూర్తి బాధ్యత తీసుకుని, బీఎల్ఓలకు రోజువారి లక్ష్యం నిర్దేశించి మ్యాపింగ్ వేగం పెంచాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం స్థాయిలో మ్యాపింగ్ పురోగతిని ఈఆర్ఓలతో నేరుగా సమీక్షించి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల సంబంధిత ఏవైనా సహాయం, సూచనల కోసం కలెక్టరేట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వచ్చేవారం సమగ్ర సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ ఏఈఆర్ఓలను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం భూ భారతి రెవెన్యూ సదస్సుల స్వీకరించిన అర్జీలను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల ప్రకారం రెవెన్యూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల దరఖాస్తులు, రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలను వెంటనే జారీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపై అధికారులు ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సోనియా, రాహుల్గాంధీలపై బీజేపీ కుట్ర
● కాంగ్రెస్ లేకుండా చేయాలనేదే మోదీ, అమిత్షా ప్రయత్నం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సోనియా, రాహుల్గాంధీలపై కేసును నమోదు చేస్తూ కుట్రలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియా, రాహుల్గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందని ఆరోపిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ఉద్యమాన్ని వ్యాప్తి చేసేందుకు నేషన్ హెరాల్డ్ పెట్టారని, దీనిని నెహ్రూ తన సొంత డబ్బులతో నడిపారని, ఇందులో ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్గాంధీలకు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నా మన్మోహన్సింగ్ను ప్రధాని చేశారన్నారు. పార్టీలకతీతంగా బీజేపీ చేసే కుట్రలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరు లేకుండా చేసే కుట్ర పన్నుతుందని ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి పేరు తొలగించాలరని ఆరోపించారు. తద్వారా పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే కుట్ర కేంద్రం చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వకపోగా అదనపు భారాన్ని మోపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేంద్రం చేస్తున్న కుట్రలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి విజయం అందించాలని, రాహుల్గాంధీ ప్రధాని అయ్యే వరకు కార్యకర్తలు శ్రమించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికై నా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో అదే జరిగిందన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసులపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ శశ్రేణులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
నాగర్కర్నూల్ క్రైం: రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్లో శాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ జిల్లాలోని కోర్టులలో నిర్వహించిన లోక్అదాలత్లో 32,449 కేసులు రాజీ అయ్యాయని చెప్పారు. లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ, మోటారు వాహన యాక్సిడెంట్, భూ వివాదం, బ్యాంకు కేసులు పరిష్కరించుకున్నారని చెప్పారు. స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, కార్యదర్శి మధుసూదన్రావు, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రౌండ్టేబుల్ సమావేశానికి తరలిన నిర్వాసితులు
చారకొండ: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మండలంలోని గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 20వ రోజు కొనసాగాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ముంపు నిర్వాసితుల డిమాండ్పై జలాశయం సామర్థ్యం తగ్గింపు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, సమాలోచనలు అనే అంశంపై చేపట్టిన రౌండ్టేబుల్ సమావేశానికి నిర్వాసితులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. -
నాగర్కర్నూల్
పాలమూరులో క్రికెట్ టోర్నీ మహబూబ్నగర్లోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో సోమవారం తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ టోర్నీ ప్రారంభం కానుంది. సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uఅచ్చంపేట: పల్లె ఓటర్లు పంచాయతీలకు నూతన పాలకులను ఎన్నుకున్నారు. కొత్త పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యం లేని వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. ప్రస్తుతం పల్లెల్లో సమస్యలు తిష్టవేశాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు.. ఏ విధంగా పాలన సాగిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను మా గ్రామస్తులు ఆశీర్వదించి గెలిపించారు. నాపై వారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా. గ్రామంలోని సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో వీలైనన్ని అధిక నిధులు తెప్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. – సంతోష్రెడ్డి, సర్పంచ్, పలకపల్లి గ్రామం, అచ్చంపేట మండలం అందుబాటులో ఉంటా.. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించేలా ప్రత్యేకంగా కృషి చేస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో మరిన్ని నిధులు తెప్పించి గ్రామ అభివృద్ధికి పాటుపడుతాను. నన్ను గెలిపించిన ప్రజలకు రుణపడి సేవచేస్తా. – శ్రీలత, సర్పంచ్, పెనిమిళ్ల గ్రామం, ఉప్పునుంతల మండలం నేడు ప్రజావాణి కార్యక్రమం నాగర్కర్నూల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కొనసాగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రేపు కలెక్టరేట్లో ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమం నాగర్కర్నూల్: వివిధ కారణాలతో క్లెయిం చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన మూడు నెలల ప్రత్యేక కార్యక్రమం ‘మీ డబ్బు– మీ హక్కుశ్రీలో భా గంగా మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి శిబిరం నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఆస్తులు తనిఖీ చేసుకుని, తగిన పత్రాలతో కలెక్టరేట్లో నిర్వహించే శిబిరంలో పాల్గొనాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో వచ్చేనెల 25 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై పోరాటాలు చేపడుతామన్నారు. గడిచిన పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందన్నారు. మహిళలపై హింస, అభద్రత, నిరుద్యోగం పెరిగిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. జాతీయ మహాసభల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు. పేరుకుపోయిన సమస్యలు జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ సమస్యలు పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ సైతం చేపట్టలేని దుస్థితి నెలకొంది. ట్రాక్టర్ కిస్తీలు, కరెంటు బిల్లులు సైతం పెనుభారంగా మారాయి. డీజిల్కు సైతం డబ్బులు లేక పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలనపడి ఉన్నాయి. ఇలా పలు సమస్యలతో పంచాయతీలు సతమతవుతుండగా వీటిని పరిష్కరించడం కొత్త సర్పంచ్లకు సవాల్గా మారనుంది. అలాగే ఎన్నికల సందర్భంగా ఆలయాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని హామీలిచ్చారు. నిధుల కొరతతో చిన్నపాటి సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి ఉండగా హామీల అమలు వారికి కత్తిమీద సాముగానే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిలిచిన నిధుల విడుదల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం (ఎఫ్ఎఫ్సీ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధులను గ్రామాల్లోని జనాభా దామాషా ప్రచారం కేటాయిస్తుంది. అయితే పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఈ నిధులు విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల ఖజానాలు నిండుకున్నాయి. నయాపైసా లేపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి దాపురించింది. అత్యవసర పనులకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. తాజాగా కొత్త పాలకవర్గాలు రావడంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతాయని భావిస్తున్నారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లు పెండింగ్ బిల్లులను తమకు చెల్లిస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీచర్లకు టెట్ గుబులు
● కొలువు నిలవాలంటే ఉత్తీర్ణత తప్పనిసరి ● అటు ఎలక్షన్ డ్యూటీలు, ఇటు పాఠశాల విధులు ● సమయం దొరక్క పాఠశాలలకు సెలవు పెడుతున్న ఉపాధ్యాయులు ప్రిపేర్ అవుతున్నా.. ఒకవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికినప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్న. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2008 డీఎస్సీ ద్వారా బీఎడ్, ఎంఏ అర్హతతో ఎస్ఏ ఆంగ్లం ఉపాధ్యాయుడిగా నియామకమయ్యాను. తర్వాత వృత్తి పరమైన ప్రమోషన్ కోసం డిపార్టుమెంటల్ పరీక్ష ఉత్తీర్ణత సాధించా. – కృష్ణయ్య, ఎస్ఏ ఆంగ్లం, జెడ్పీహెచ్ఎస్, కోడేరు పరీక్ష సులువే.. రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు పరీక్ష రాయడం సులువే. కానీ, తెలంగాణ ప్రభుత్వం నియమించిన అన్ని పరీక్షలు రాసి వచ్చి 16 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని టెట్ పేరుతో ఆందోళనకు గురుచేయడం సరికాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత సమయం వృథా అయింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన పెట్టడం సరికాదు. – వేణుగోపాల్, ఎస్జీటీ, బావాజీతండా, ఊర్కొండ మండలం కందనూలు: ప్రభుత్వ ఉపాధ్యాయుల మెడపై ఇప్పుడు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కత్తి వేలాడుతోంది. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టీచర్లకు నిద్రను దూరం చేసింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలని నిబంధన పెట్టడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కోసం ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010లో ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత మూడుసార్లు (2012, 2017, 2024)లో నిర్వహించిన నియామకాలలో టెట్ పాసైన వారు మాత్రమే టీచర్లుగా భర్తీ అయ్యారు. జిల్లాలో 2,266 మంది.. 2010 కంటే ముందు టీచర్లుగా నియామకమైన వారికి టెట్ తప్పనిసరి కావడంతో అలాంటివారు జిల్లాలో 2,266 మంది ఉన్నారు. ఇందులో కొందరు ఉపాధ్యాయులు ఇప్పటికే టెట్ ఉత్తీర్ణత సాధించగా.. మిగుతా వారు టెట్ అర్హత సాధించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం టీచర్లకు విధులు కేటాయించడంతో కొంత సమయం వృథా అయిపోయింది. ఖాళీ సమయాల్లో సాధన పోరాటం.. తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్లైన్ తరగతులు వింటున్నారు. కొందరు సాయంత్రం వేళలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో టెట్కు సిద్ధమవుతున్నారు. సిలబస్లో కనిపించని సమతుల్యత టెట్ పరీక్ష సిలబస్, ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే ఇది ప్రస్తుత తరం అభ్యర్థులకు సైతం సవాల్గా మారింది. జనరల్ కేటగిరీ విద్యార్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం (60) సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం) ఉపాధ్యాయలు తమ సబ్జెక్టు కాని గణితంలో 30 మార్కులకు పరీక్ష రా యాల్సి వస్తోంది. సైన్స్ కంటెంట్ విభాగంలో కేవ లం కేవలం 24 మార్కులే ఉండగా, అందులోనూ జీవశాస్త్రంతోపాటు భౌతిక, రసాయన శాస్త్రాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం పేపరు రాసేవారు భాష శాస్త్రం 30 మార్కులు, ఆంగ్లం 30 మార్కులకు పరీక్ష రాయాలి. ఈ సిలబస్ విధానంతో అత్యధిక మంది అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత సాధించలేకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. -
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కందనూలు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈటీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడి ఆలయానికి పుష్యమాసం శనివారానికి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథశాస్త్రి భక్తులతో ఏలినాటి శనిదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు చేయించారు. భక్తులు సంప్రదాయ పద్ధతిలో శనేశ్వరుడికి, శివుడికి పూజలు, దర్శనాలు చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించేదాక పోరాటం చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు గ్రామాలు ముంపు నుంచి మినహాయించాలని చేస్తున్న రిలే దీక్షలు న్యాయమైనవని, దీనిపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగించాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ సభ్యుడు ముడావత్ రాంబాల్నాయక్ అన్నారు. నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు శనివారం 19వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులు ఉన్న ఫలంగా గ్రామాల నుంచి వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. జలాశయం సామర్థ్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కొడంగల్ పరిధిలోని లగచర్లలో ఫార్మ కంపెనీల ఏర్పాటును ఏ విధంగా వెనక్కి తీసుకుని జీఓ విడుదల చేసిందో అలాగే గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని పంజుగుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా విధానం కొనసాగుతున్న తీరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన ప్రాముఖ్యత పనితీరు తదితర విషయాలను పరిశీలించారు. పాఠశాల స్థాయిలో వృత్తి విద్యా కోర్సుల ఏర్పాటుపై ఉపాధ్యాయులతో చర్చించారు. జాతీయ విద్యా విధానం, రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రాముఖ్యత 2020 జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలను ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది అనే విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. -
కోలలు వస్తున్నాయి
మామిడి తోటలకు నవంబర్ నెలలో మొదటి దశ పూతలు వస్తాయి. కానీ, ఈసారి మొదటి దశ పూతలు పెద్దగా రాలేదు. వాతావరణంలో మార్పులు, వర్షాల వల్ల పూతలకు బదులుగా మామిడి చెట్లకు పెద్దమొత్తంలో కోలలు (చిగుర్లు) వస్తున్నాయి. కోలలు ముదిరితేనే పూతలు వస్తాయి. దీంతో రెండో దశ పూతలపైనే ఆశలు పెట్టుకున్నాం. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్ ఈసారి మామిడి పూతలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. నవంబర్లో వచ్చిన పూతలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. చల్లని గాలలు, అకాల వర్షాల ప్రభావం మామిడి పూతలపై పడింది. ఈ నెలలో మామిడి చెట్లకు నీళ్లు పెట్టొద్దు. భూమి బెట్టగా ఉంటేనే పూతలు వచ్చేందుకు వీలుంటుంది. మామిడికి అధికంగా తేనె మంచు, బంక, బూడిద తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటికి సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. తెగుళ్ల నివారణకు మందులు ఎలా వాడాలనే అంశాలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ -
23న గవర్నర్, 24న సీఎం పర్యటన
వనపర్తి/ కోస్గి రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని, ఇందుకోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్తో పాటు వివిధ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్లు కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. శనివారం కోస్గిలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ఇరు జిల్లాల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టాలని, 24న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కోస్గికి చేరుకుంటారన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని, వారికి వసతులు కల్పించాలన్నారు. సన్మానం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతోపాటు నూతన సర్పంచ్లు మధ్యా హ్న భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చి.. వెళ్లే వరకు అన్ని బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతిఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపికై న వారికి 209 మంది, రెండో విడతలో 109 మంది, మూడో విడతలో భాగంగా 66 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశామన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు తన నిధులు రూ.50 లక్షలు కేటాయించి వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, నాయకులు ఆనంద్కుమార్, శ్రీకాంత్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, రమాకాంత్రెడ్డి, శ్రీనివాసులు, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
నాగర్కర్నూల్: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్య, పీఆర్ తదితర శాఖల అధికారులతో రహదారి భద్రత కమిటీ సమావేశానికి కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు వాటిని నివారించే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని, రహదారులు నిర్మాణాలు, మరమ్మతు చేపట్టే సందర్భంలో స్టాండర్డ్ ఆపరేషన్స్, ప్రొసీజర్కు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలతోపాటు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. ప్రతి 4వ సోమవారం రోడ్ సేఫ్టీపై సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శ్రీశైలం రహదారి పరిధి అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశంగా గుర్తించామన్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఈఓ రమేష్కుమార్, డీఎంహెచ్ఓ రవినాయక్, డీటీడబ్ల్యూఓ ఫిరంగి, పీఆర్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, ఆర్అండ్బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ ఎం భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో కలిసి రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొన్ని హోటళ్లు నాన్ వెజ్, వెజిటేరియన్ ఆహార పదార్థాలు కలిపి తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. అలాగే జిలాల్లోని 157 ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. వచ్చే సమావేశం నాటికి జిల్లాలో ఎన్ని హోటళ్లకు లైసెన్సులు ఉన్నాయి.. ఏయే స్థాయిలో ఉన్నాయో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు. -
నేడు డయల్ యువర్ డీఎం
కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రజా రవాణా సమస్యలపై సలహాలు, సూచనల కోసం శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నం.94937 33602కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలియజేయాలని ఆయన కోరారు. రేపు లైసెన్సు,రిజిస్ట్రేషన్ మేళా నాగర్కర్నూల్ క్రైం: జిల్లా ఆహార పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు కిరాణ వర్తక సంఘం కార్యాలయంలో నిర్వహించే లైసెన్సు, రిజిస్ట్రేషన్ మేళాను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రిజిస్ట్రేషన్, లైసెన్సు పొందేందుకు ఆధార్, ఫొటో, పాన్ కార్డు, కరెంట్ బిల్, ట్రేడ్ లైసెన్సు తీసుకురావాలని సూచించారు. 23న ఉచిత కంటి వైద్య శిబిరం నాగర్కర్నూల్ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలోని గది నం.102లో కంటి వైద్య శిబిరం ఉంటుందన్నారు. రోగులకు ప్రత్యేక, సాధారణ కంటి పరీక్షలు నిర్వహించి క్యాటరాక్టు పొర గల వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఏనుగొండ రాంరెడ్డి కంటి ఆస్పత్రిలో చేపిస్తామన్నారు. రోగులు బీపీ, షుగర్ పరీక్షలు చేసుకుని రిపోర్టుతోపాటు ఆధార్ తీసుకురావాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కందనూలు: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహాత్మగాంధీ పేరు లేకుండా చేయాలని జాతీయ ఉపాధి హామీ పథకంను తొలగించి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తప్పుడు కేసులు బనాయిస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలను దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ● భూగర్భ విద్యుత్ కేంద్రం సొరంగం కొండపై మంటలు ● ఎల్లూరు శివారులో పెద్దపులి సంచారం ● కొండనాగులలో వ్యక్తి బలవన్మరణం – వివరాలు 8లో.. -
సమష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం
నాగర్కర్నూల్: జిల్లాలో అన్ని శాఖల అధికారుల సమష్టి కృషితోనే మూడు విడతల్లో కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షణకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులకు, కలెక్టర్, ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లోని 453 పంచాయతీల్లో ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిశాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అధికారుల కృషి అభినందనీయమన్నారు. వార్డు నుంచి జిల్లాస్థాయి వరకు ఎన్నికల అధికారుల పాత్రపై కలెక్టర్ ప్రశంసించారు. భవిష్యత్లో నిర్వహించే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇచ్చిన మార్గదర్శక సూచనలు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. భద్రతాపరంగా ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించామని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు సిబ్బందికి కలెక్టర్ ఆధ్వర్యంలో సమర్థవంతమైన శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల ఎన్నికలు విజయవంతం అయ్యాయని వివరించారు. కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఎల్పీఓలు, ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దు పోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
యూరియా బుకింగ్ యాప్పై అవగాహన
నాగర్కర్నూల్: యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద వేచి చూడకుండా, రైతు సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన యాప్పై రైతులు, డీలర్లకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబోతున్న ‘యూరియా బుకింగ్ యాప్శ్రీపై రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు గోపి గురువారం వీసీ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాప్ శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాకేంద్రంలోని రైతువేదికలో డీఏఓ యశ్వంత్రావు ఏడీఏలు, వీఓలతో కలిసి పాల్గొన్నారు. వీసీ అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి సీజన్కు గాను 56,607 టన్నుల యూరియా అవసరమని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయానికి నివేదిక పంపించామన్నారు. ఈ యాప్ ద్వారా రైతు ఎక్కడి నుంచైనా తనకు వీలుగా ఉన్న డీలర్ వద్ద యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ముందుగా రైతు ఈ యాప్లో తాను సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తే అవసరమైన యూరియా కోటా చూపిస్తుందని, దీనిని రైతు ఒక్కో దఫాలో 5 బస్తాల చొప్పున బుక్ చేసుకోవచ్చన్నారు. ఒకసారి రైతు యూరియా కొనుగోలు చేశాక మళ్లీ 15 రోజుల తర్వాతనే రెండో దఫాలో యూరియా కొనుగోలు చేయడానికి వీలవుతుందన్నారు. రైతు యూరియా బుకింగ్ చేసుకున్నాక ఒక బుకింగ్ ఐడీ నంబర్ వస్తుందని, ఈ ఐడీ నంబరు, పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు తీసుకెళ్లి బుక్ చేసుకున్న మరుసటి రోజులోపు డీలరు వద్ద యూరియా తీసుకోవచ్చన్నారు. ఈ మేరకు ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు యాప్పై రైతులకు అవగాహన కల్పించి బుకింగ్ చేసుకోవడంలో సహకరించాలని సూచించారు. -
గర్భాశయ క్యాన్సర్ను పారదోలుదాం
నాగర్కర్నూల్ క్రైం: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పనితీరు పూర్తిగా కోల్డ్ చైన్ నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఫార్మసీ ఆఫీసర్లు, కోల్డ్ చైన్ హ్యాండ్లర్లకు హెచ్పీవీ ెవ్యాక్సిన్ నిల్వ– రవాణ– శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సున్నితమైనదని, తప్పనిసరిగా 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యే భద్రపరచాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజుకు రెండుసార్లు ఉష్ణోగ్రత రీడింగులను లాగ్ బుక్లో నమోదు చేయాలని ఫార్మసీ ఆఫీసర్లను ఆదేశించారు. వ్యాక్సిన్ను వ్యాక్సినేషన్ సెషన్లకు తరలించే సమయంలో వ్యాక్సిన్ క్యారియర్లలో తగినన్ని ఐస్ ప్యాక్లు ఉండేలా చూసుకోవాలని, నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కందనూలును గర్భాశయ క్యాన్సర్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలందరికీ వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, శ్రీనివాసులు, ఫార్మసీ ఆఫీసర్ సురేష్, వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, వీసీసీఎం దివ్య తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలి చారకొండ: గోకారం జలాశయంలో భూములు కోల్పోయిన ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని నిర్వాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైదని, వారి నిరసన పట్ల ప్రభుత్వం స్పందించాలని గోకారం సర్పంచ్ పంజుగుల పరశురాములు అన్నారు. మండలంలోని గోకారం జలాశయంలో ఆయా గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 17వ రోజు చేసుకున్నాయి. ఈ మేరకు గోకారం గ్రామ సర్పంచ్ పరశురాములు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిర్వాసితులు గత 17 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదని వివర్శించారు. వారి న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్ధ్యం తగ్గించి, వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రద్దు చేస్తూ జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
1,197 ఓట్లతో సర్పంచ్ గెలుపు
ఉప్పునుంతల గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి చింతగాళ్ల శ్రీనివాసులు 1,197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామ పంచాయతీలో మొత్తం 4,575 ఓట్లు ఉండగా.. 3,652 పోలయ్యాయి. ఇందులో చింతగాళ్ల శ్రీనివాసులుకు 2,195 ఓట్లు, ఆలూరి పర్వతాలుకు 998 ఓట్లు, పాత్కుల శేఖర్కు 303 ఓట్లు, చింతగాళ్ల మల్లయ్యకు 43 ఓట్లు రాగా.. చెల్లనివి 113 వచ్చాయి. దీంతో 1,197 భారీ మెజార్టీతో గెలుపొందిన శ్రీనివాసులును గ్రామస్తులు అభినందించారు. – ఉప్పునుంతల -
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. -
21న జాతీయ లోక్ అదాలత్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని అన్ని కోర్టులలో ఆదివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను శాంతియుత వాతావరణంలో రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. రాజీ చేసుకోదగిన సివిల్, క్రిమినల్ కేసులను రాజీ చేసేందుకు పోలీసులు, న్యాయవాదులు సమష్టిగా పనిచేయాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు నసీం సుల్తానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, సెకండ్ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. నూతన వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఊర్కొండ: రైతులు వ్యవసాయంలో నూతన వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏడీఆర్ ఆర్ఏఆర్ఎస్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని ముచ్చర్లపల్లిలో రైతు కుడుముల తిరుపతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఐసీపీవీ– 21333 అనే రెడ్గ్రాం కందులు నూతన వంగడానికి సంబంధించిన పంట దిగుబడి, సస్యరక్షణ చర్యల గురించి రైతులకు స్వల్పకాలిక సమయంలో వచ్చే విధంగా చూసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల పంటకాలం నాలుగు నెలలు ఉంటుందని, అధిక వర్షపాతానికి సైతం తట్టుకొని దిగుబడి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తుందన్నారు. స్వల్పకాలిక పంట కావడంతో ఇతర పంటలు వేసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ఆర్ఏఆర్ఎస్ పాలెం సైంటిస్టులు పాల్గొన్నారు. ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సాదత్ఖాన్, బాల్రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్అలీ, ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలకు హెచ్పీవీ టీకా తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుందని, 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా చేయడం వల్ల భవిష్యత్లో సర్వైకల్ క్యాన్సర్ వల్ల కలిగే అస్వస్థత, మరణాలను తగ్గించవచ్చని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్య సిబ్బందికి హెచ్పీవీ టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 ఏళ్లలోపు అమ్మాయిలు సుమారు 9,500 మంది ఉన్నారని, ఈ నెల 14 ఏళ్లు పూర్తయిన అమ్మాయిల జాబితాను తయారుచేసి జనవరిలో హెచ్పీవీ టీకాకరణ అమలు చేస్తామన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ముందస్తుగా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు హెచ్పీవీ టీకాపై అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీల వారిగా ఆడపిల్లల జననాలు తగ్గిన ప్రాంతాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వివరించాలని చెప్పారు. ఈ నెల 18 నుంచి 31 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి కొత్తగా కుష్టు వ్యాధిగ్రస్తులను గు ర్తించడానికి ముమ్మర సర్వే చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఉప్పునుంతల/ చారకొండ: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పునుంతల, చారకొండ పోలీస్స్టేషన్లను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ముందుగా ఉప్పునుంతల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ భద్రత, సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న భద్రత చర్యలు తదితర అంశాలపై ఎస్ఐ వెంకట్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో నిఘాతోపాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడి బ్యాలెట్ బాక్స్లు తీసుకెళ్లే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత కూడా గ్రామాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐలు వీరబాబు, రాజశేఖర్, మహేష్గౌడ్, కురుమూర్తి తదితరులున్నారు. ● ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లిలో నిర్వహించిన పోలీస్ కవాతులో ఏఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కవాతులో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ వెంకట్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.


