Nagarkurnool District Latest News
-
ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
వెల్దండ: ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి చిన్న ఓబులేష్ అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 100మందికి పైగా కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం 7గంటలకే పనులకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్లో కూలీల మస్టర్ నమోదు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ ఈశ్వర్జీ ఉన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కందనూలు: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సోమవారం 60 కేంద్రాల్లో నిర్వహించిన సాంఘికశాస్త్రం పరీక్షకు 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరు కాగా.. 21మంది గైర్హాజరయ్యారు. 99.80 శాతం హాజరు నమోదైందని డీఈఓ రమేశ్కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన పోలీసు, వైద్యారోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులకు డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కల్వకుర్తి రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి మండలం తర్నికల్లో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించి.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి పవన్కుమార్రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అదే విధంగా ప్రధాన రహదారిపై బ్లాక్ స్పాట్లను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ చిన్నబాలు, డీఎస్పీ వెంకట్రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం పాల్గొన్నారు. కందనూలు: త్వరలో చేపట్టే జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరి వీసీ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 85 మున్సిపల్ వార్డుల్లో జనగణన నిర్వహించేందుకు 1,799 మంది ఎన్యూమరేటర్లు, 263 మంది సూపర్వైజర్లును ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి మే 5వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీసీలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కందనూలు: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దేవసహాయం, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులనుద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో 102 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. నిర్భయంగా పోలీసు సేవలు పొందాలి నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపించనున్నట్లు ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఆయన సూచించారు. -
ఇంకెన్నాళ్లు.. సాగదీత..?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
కాస్త మెరుగు..
ఒకేషనల్లో 68.37 శాతం.. జిల్లాలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 68.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం జిల్లాలో ఒకేషనల్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,372 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 938 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1,536 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 870 మంది (56.64 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గురుకులాలు.. కేజీబీవీల్లో జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచారు. కల్వకుర్తి గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీ విభాగంలో శ్రీనిధి 994/1000 మార్కులు, బైపీసీ విభాగంలో అఖిల 991 మార్కులు, సీఈసీ విభాగంలో శ్రీజ 979 మార్కులు, ఎంఈసి విభాగంలో 966 మార్కులు సాధించారు. అలాగే కొల్లాపూర్ కేజీబీవీ ఎంపీసీ విభాగంలో అనూష 983 మార్కులు, చారకొండ కేజీబీవీ బైపీసీ విభాగంలో లావణ్య 986 మార్కులు, బిజినేపల్లి కేజీబీవీ సీఈసీ విభాగంలో పుష్ప 952 మార్కులు సాధించారు. కందనూలు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా నాగర్కర్నూల్ జిల్లా స్థానం కాస్త మెరుగుపడంది. ఆదివారం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా 28వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థానంలో నిలవగా ఈసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో గతేడాది 34వ స్థానంలో నిలవగా.. ఈసారి 27వ స్థానానికి పెరిగింది. మొత్తంగా ఈ సంవత్సరం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 4,500 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,982 మంది (66.27 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 830 మంది, బాలికలు 2,152 మంది ఉన్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 5,353 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,987 మంది (55.80 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 784 మంది, బాలికలు 2,203 మంది ఉన్నారు. అయితే ఫస్టియర్, సెకండియర్లోనూ బాలుర కంటే బాలికలే అత్యధిక మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఇంటర్ ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరంలో 27.. ద్వితీయ సంవత్సరంలో 28వ స్థానం అత్యధిక ఉత్తీర్ణతతో సత్తాచాటిన బాలికలు -
కొల్లాపూర్కు రైల్వే టూరిజం తీసుకురావాలి
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్కు హెలీ టూరిజంతోపాటు రైల్వే టూరిజం కూడా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైల్వే లైన్ సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. నంద్యాల నుంచి జడ్చర్ల మీదుగా రైల్వే లైన్ వేయడానికి అవకాశం వచ్చిందో.. దానిని కొల్లాపూర్ మీదుగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే–167తోపాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందని, దీనిని మల్టీపర్పస్గా అభివృద్ధి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలో ప్రస్తావించేందుకు తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారన్నారు. సీపీఐ ఎప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలు ఏమీ వృథాగా పోలేదని, కొల్లాపూర్కు రైల్వే లైన్ రావడానికి కూడా పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు విజయుడు, శివుడు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నాగర్కర్నూల్ రూరల్: సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పీఎస్ రేట్ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయీస్ యూనియన్ ఐదు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి రామయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం యాజమాన్యంతో వెంటనే చర్చలు జరిపి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు, పర్వతాలు, పసియొద్దీన్, శివ, రాములు లింగం, తిరుపతయ్య, బాలస్వామి పాల్గొన్నారు. -
అడుగంటిన జూరాల
● కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకుపైనే సాగు ● ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించాలి ● వేసవిలో తాగునీటి అవసరాలకు అర టీఎంసీ అవసరం ● మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25 వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తు తం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తా గునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పా టు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. -
హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
పెద్దకొత్తపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోలులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కుటుంబం కోసం ఇల్లు ఉండాలని, ఇంటి కోసం అప్పు చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలతోనే కుటుంబానికి సరిపడా ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ను స్వాహా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు ప్రస్తుత తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టేది లేకుంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల భవిష్యత్ మారేదని, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందేవన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృథా ఖర్చులను తగ్గించడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సత్యం, సర్పంచ్ కుర్మయ్య, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి నాగర్కర్నూల్ క్రైం: ఆరోగ్య నాగర్కర్నూల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ సేవలు, యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో ప్రపంచ హోమియోపతి– ఆయుష్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డీఎంహెచ్ఓ రవికుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను మరింత ప్రోత్సహిస్తూ అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. హోమియోపతి వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, సహజ సిద్ధమైన, సురక్షితమైన చికిత్స విధానంగా గుర్తింపు పొందిందని, శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. రోగి శారీరక, మానసిక స్థితులను కూడా పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ వంటి అనేక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో హోమియోపతి ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని, దుష్ప్రభావాలు తక్కువగా ఉండటం, తక్కువ ఖర్చుతో చికిత్స, అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హోమియో సేవలను విస్తరించి ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లు, మాతాశిశు సంరక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లు, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ గోపాల్నాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పాల్గొన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేరుశనగ క్వింటాల్ రూ.7,249 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,249, కనిష్టంగా రూ.5,301, సరాసరిగా రూ.6,575 ధర లభించింది. 236 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్ యార్డుకు తీసుకురాగా.. రైతులకు మధ్యాహ్న భోజనం అందించామని మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
● క్రిటికల్ కేర్ సెంటర్లతో అత్యవసర వైద్యసేవలు ● ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం ● ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు ● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. వసతుల కల్పనకు కృషి.. వైద్య విద్యార్థులు భవిష్యత్లో సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక పరికరాలు, మెరుగైన బోధన విధానాలు, క్లినికల్ ట్రైనింగ్ వంటివి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అవసరమైన వసతుల కల్పనకు కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్ల నిధులు అందుబాటులో ఉంచామని, వీటితో అవసరమైన వైద్య పరికరాలు నేరుగా కలెక్టర్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, క్లినికల్ ట్రయల్స్ కోసం విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ● ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. జనరల్ ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారం ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఎంహెచ్ఓ రవినాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులకు భయపడేది లేదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎస్ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హూందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. -
ఆస్తి పన్నుపై ఊరట
5 శాతం రాయితీ ప్రకటించిన మున్సిపల్ శాఖ ●కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్నులే ఎంతగానో దోహదపడతాయి. అలాంటి పన్నులను సకాలంలో వసూలు చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆస్తిపన్ను బకాయిల చెల్లింపునకు ముందస్తు చెల్లింపులు చేసేవారికి ఎర్లీ బర్డ్ స్కీం ప్రకటించింది. నిర్ణీత సమయంలో ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపాలిటీల బలోపేతం ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు 5 శాతం రాయితీ శుభవార్తగా మారింది. ముందస్తు పన్ను వసూలులో రెవెన్యూ పరంగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ఏటా ఆస్తిపన్ను వసూలు 100 శాతం లక్ష్యం చేరుకునేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది. 5 శాతం రాయితీ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే యజమానులకు 5 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పన్నుల మేళాలను మున్సిపల్ అధికారులు నిర్వహించనున్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు నేరుగా కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే గత సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయలు ఉంటే, వాటిపై ఎలాంటి రాయితీ వర్తించదు. బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్ స్కీం కోసం ఆయా మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్లను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అసెస్మెంట్లు డిమాండ్ (రూ.కోట్లలో) కల్వకుర్తి 8,334 3.7 నాగర్కర్నూల్ 11,020 4.44 కొల్లాపూర్ 6,517 1.3 అచ్చంపేట 6,765 3.38 ఈ నెలలో చెల్లిస్తేనే వర్తించనున్న పథకం ఆదాయం పెంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ చెల్లింపులకు అవకాశం రిబేట్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగం మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. మీ– సేవ కేంద్రాల ద్వారా కూడా ఆస్తిపన్ను చెల్లించవచ్చు. -
హే..కృష్ణా.!
● ప్రస్తుతం మిగిలింది 42 టీఎంసీలే ● మరో వారం, పది రోజుల్లో కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ● జూరాలలోనూ అడుగంటిన జలాలు ● వేసవిలో ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు శూన్యం వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో కనిష్ట నీటిమట్టానికి ముందే కేఎల్ఐ కింద రిజర్వాయర్లను నింపుతున్నాం. అవసరం మేరకు నీటినిల్వ చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్శాఖ ఈఈ, నాగర్కర్నూల్ శ్రీశైలం డ్యాంలో శరవేగంగా తగ్గుతున్న నీటిమట్టం సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పెరగడంతో, ఈ సారి వేసవి ప్రారంభంలోనే నీటినిల్వ అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.408 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తితో పాటు సాగునీటి ప్రాజెక్ట్ల కోసం వినియోగిస్తుండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి చివరి నాటికి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం డ్యాంలో 20 రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు, మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి విడుదల కొనసాగడం.. గత నెల 22 వరకు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో నీటిమట్టం వేగంగా తగ్గింది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గతనెల 15వ తేదీ వరకు 75 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 42 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలం ముగిసేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటం.. జూలై వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.074 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో తాగునీటి అవసరాలకు సైతం కటకట ఏర్పడనుంది. గతేడాది సైతం జూరాలలో నీటినిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకోగా.. ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని సరఫరా చేశారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తేనే తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. గత మార్చి ప్రారంభానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్లో 92 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా.. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటి తరలింపు చేపట్టారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి నెలలో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఏపీలోని విద్యుదుత్పత్తి కేంద్రానికి నిత్యం సగటున 10వేల క్యూసెక్కులతో పాటు హంద్రీనీవా సుజలాస్రవంతి, కేసీసీ, పీఆర్పీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేశారు. అలాగే తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి సగటున 8 వేల క్యూసెక్కులతో పాటు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి సరఫరా కొనసాగింది. -
సర్వేను అడ్డుకున్న రైతులు
వెల్దండ: డిండి – నార్లాపూర్ ప్రాజెక్టులో భాగంగా వెల్దండ మండలం అజిలాపూర్ శివారులో నిర్మిస్తున్న ఇర్విన్ రిజర్వాయర్ ముంపు భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు చేపట్టిన సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో 92 మంది రైతులకు చెందిన 186.30 ఎకరాల భూములతో పాటు పలు రకాల చెట్లు ముంపునకు గురవుతున్నాయి. వాటి నష్టాన్ని అంచనా వేసేందుకు అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టగా.. భూ నిర్వాసితులు అక్కడికి చేరుకొని తమకు ఎంతమేర నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టం చేసిన తర్వాతే సర్వే చేపట్టాలని అధికారులను అడ్డుకున్నారు. భూ నిర్వాసితులకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుదిగారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ నిర్వాసితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దగోని రమేశ్గౌడ్ పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
● జిల్లాలోని ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ బుకింగ్ అనుమతించబడదని స్పష్టం చేశారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను పర్యావరణ అనుమతుల ఆధారంగా పరిశీలించి.. తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరిగేలా అనుమతులు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్ల వద్ద అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజలశాఖ అధికారిణి దివ్య జ్యోతి ఉన్నారు. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన జిల్లాలో గ్యాస్ వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
‘ఏదుల’ ఉండగా..‘గొల్లపల్లి’ అనవసరం
● 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం ● సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ● సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. ● మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ● రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడి చేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. -
హెచ్ఐవీ మహమ్మారిని నిర్మూలిద్దాం
నాగర్కర్నూల్ క్రైం: హెచ్ఐవీ మహమ్మారిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్న వైద్యారోగ్యశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ డా.రవికుమార్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎవరికై నా వ్యాధి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్యకేంద్రాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. కాగా, జిల్లా జనరల్ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్లో 10 మంది ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సబ్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలకు హెచ్ఐవీ, హెపటైటిస్ బి – సి, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఆర్ఎంఓ డా.రవిశంకర్, ప్రోగ్రామ్ అధికారులు డా.కృష్ణమోహన్, డా.ప్రదీప్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
కందనూలు: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తేల్చిచెప్పింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్శాఖ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి పలు దఫాలుగా ధర్నాలు, నిరసనలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే సమ్మెలోకి దిగడం జరిగిందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయడంతో పాటు విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేయాలని, పీస్రేట్ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పలు యూనియన్లు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ జేఏసీ సహాయ కార్యదర్శులు దశరథం, సైదులు, ఉమ్మడి జిల్లా కోచైర్మన్ రాజ్కుమార్, కోకన్వీనర్ లోకేశ్వర్, డివిజన్ జేఏసీ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు, కన్వీనర్లు జయకర్, మల్లయ్య పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాప్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. అవకాశాలు మెరుగు.. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ విద్యార్థులకు సువర్ణావకాశం... పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్.. విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు -
కాంగ్రెస్లో జోష్..
కొలువుదీరిన డీసీసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం మీ బాధ్యత పెరిగింది.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలే కీలకంగా పనిచేశారని మహేశ్కుమార్గౌడ్ అన్నారు. పార్టీని బలపర్చుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, పార్టీ నిర్మాణం శాశ్వతంగా ఉంటేనే మళ్లీ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రభుత్వం లేకున్నా పార్టీ ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. వందేళ్లకు పైగా ప్రజాసేవలో ఉన్న పార్టీని కాపాడుకోవాలని కోరారు. కాంగ్రెస్లో పదవులు రావడంతో బాధ్యత మరింత పెరిగిందని గుర్తుచేశారు. ఇలాంటి అవకాశం కోసం ఎందరో ఎదురుచూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్సావంత్, సీడబ్లూసీ సభ్యుడు చల్లా వంశీచంద్రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: ఒకప్పుడు వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరును మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికేంద్రీకరించారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మేటి జిల్లాగా మార్పు.. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరును ప్రస్తుతం హైదరాబాద్కు సమీపంలో మేటి జిల్లాగా తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేస్తామన్నారు. కృష్ణానీటిలో వచ్చే వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళిక కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాహుల్గాంధీ జోడో యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరులోనే సింహభాగం పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఇక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయం కోసం కుల సర్వే చేపట్టామన్నారు. దీనివల్ల వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. కుల సర్వే లెక్కల ఆధారంగా బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు అమలుచేసినప్పటికీ, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 52 శాతం చైర్మన్ స్థానాలను బీసీలకే కేటాయించామని వివరించారు. పీసీసీ, డీసీసీ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకే ఇచ్చామన్నారు. జాతీయ హోదా కోసం పోరాటం.. ఉమ్మడి జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీటితోపాటు హైదరాబాద్కు తాగునీరు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విభజన హామీల్లో జాతీయ హోదాతోపాటు చాలావరకు హామీలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఒకప్పుడు వెనుకబడిన పాలమూరు ఇప్పుడు దూసుకెళ్తోంది సీఎం రేవంత్రెడ్డి సొంత గడ్డఅభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ‘పాలమూరు’ ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం పోరాటం చేస్తామని హామీ -
మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయుల నిరసన
కందనూలు: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారి పారితోషికం పెంచాలని, గతేడాది బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాకేంద్రంలోని మూల్యాంకణ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విరామ సమయంలో నిరసన తెలిపి.. అనంతరం డీఈఓ రమేష్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐక్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఏడేళ్ల నుంచి పదో తరగతి మూల్యాంకనం పారితోషికం పెంచలేదని ఆరోపించారు. దీంతోపాటు సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్–1లో రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు తమ తమ విభాగాల్లో సాధించిన ఫలితాలకు గుర్తింపుగా ప్రిన్సిపాళ్లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డా. పి.మల్లికార్జున్, సూపరింటెండెంట్ డా.అరుణ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘చలో వరంగల్’కు తరలిరండి రాజోళి: రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ పిలుపుమేరకు బుధవారం చేపట్టిన చలో వరంగల్ కార్యక్రమానికి తరలిరావాలని జోగుళాంబ గద్వాల జిల్లా జేఏసీ చైర్మన్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టే నిరవదిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని, స్పాట్ బిల్డర్లకు జీఓ 11 ప్రకారం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుధాకర్, రాముడు, అనంతరెడ్డి, సతీష్, లోకేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలభవన్లో వేసవి శిక్షణ శిబిరం గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్లో ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకు సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, శాసీ్త్రయ నృత్యం, జానపద నృత్యం, గాత్ర సంగీతం, డ్రాయింగ్, వాయిద్య సంగీతం, కుట్లు, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 5 నుంచి 16 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. సాధారణ ఫీజు రూ.50 కాగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.20 మాత్రమే ఫీజు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. శిబిరంలో చేరే విద్యార్థులు ఆధార్, విద్యార్హత ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువపత్రాల జిరాక్స్తోపాటు పాస్పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 96668 53335, 94409 81190లను సంప్రదించాలని సూచించారు. -
హోంగార్డులు అంకితభావంతో పనిచేయాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్లందరూ తమ విధులు అంకితభావంతో నిర్వహిస్తూ.. ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్లందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం వెల్ఫేర్ అమౌంట్ను రూ.20 నుంచి రూ.200 వరకు పెంచుకోవాలని సూచించారు. హోంగార్డులందరికీ ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాఘవరావు, ఆర్ఎస్ఐ, గౌస్ పాష, హెడ్కానిస్టేబుల్ వెంకట్నారాయణ, జిల్లా హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జంబులు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగిరం చేయాలి
కందనూలు: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, డిండి, కేఎల్ఐ, అచ్చంపేట, మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులు జిల్లాలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎక్కడైనా ఆలస్యం జరుగుతున్నట్లయితే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టి, పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్లో ప్రస్తుత నీటి నిల్వల పరిస్థితిపై ఆరాతీయగా.. రాబోయే మూడు నెలలపాటు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగం, పంపింగ్ వ్యవస్థలు, సాగునీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోస్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్, అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లతో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రబీ సీజన్లో 1.43 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని, సుమారు 4.53 లక్షల మె.ట., దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందుకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం క్వింటాల్ గ్రేడ్– ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించిందని, సన్నాలు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తుందన్నారు. జిల్లాలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగుల అభ్యున్నతికి ప్రాధాన్యం దివ్యాంగుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ మల్లురవి అన్నారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలో కలిసి లబ్ధిదారులకు ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన నిధులు రూ.12.31 లక్షలతో 9 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. సమాజంలోని ప్రతివర్గం అభివృద్ధి చెందాలంటే దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగ క్వింటా రూ.7,968
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన ఏయూపీఎస్ పాఠశాల భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అచ్చంపేటకు చెందిన సాదే రాజు పాఠశాలను దత్తత తీసుకుని రూ.17 లక్షల సొంత డబ్బులతో భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేయడం గర్వంగా ఉందన్నారు. సినిమాలో రీల్ ఎవరైనా చేయవచ్చని, రియల్ శ్రీమంతులు ఇలాంటి వారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి పట్టణ, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, దాతలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ పాఠశాల నిర్మిస్తున్నారని, రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే 2,500 మందికి విద్య, భోజన వసతి అందుతుందన్నారు. ఇప్పటికే వంగూరు, పోల్కంపల్లిలో రూ.60 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పేద పిల్లలకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా ముందు వరుసలో ఉండాలన్నారు. అమ్రాబాద్ మండలం మొల్కమామిడిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి దాతల సహకారంతో రూ.29 లక్షలు వసూలు చేసి పాఠశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, ఆయా పాఠశాలల పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ వెంకటేష్, ఎంఈఓ జీవన్కుమార్, సీజేఏసీ గౌరవాధ్యక్షుడు సాదే రాజు, హెచ్ఎం బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
రాజాపూర్(బాలానగర్): విద్యార్థుల ఆసక్తిని గుర్తించి.. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మాక్ పార్లమెంట్ కాంపిటిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మొదటిసారిగా నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారం, జ్ఞానం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య స్కూల్స్ నిర్వహిస్తుందని తెలిపారు. చట్టసభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తి పరిష్కారానికి ఎలా కృషి చేయాలి.. సమాజానికి ఉపయోగపడే పాలసీలు తీసుకురావడం.. అసెంబ్లీ, పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ సాగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాష్ శుక్లా, నోడల్ అధికారి గంగాధర్, సర్పంచ్ గాయత్రి పాల్గొన్నారు. -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేగవంతంగా మరమ్మతు.. జూరాల ఎగువ భాగాన బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణంతోపాటు ప్రాజెక్టు గేట్లు, రోప్ల మరమ్మతుకు సంబంధించి విడుదల చేసిన నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు జూరాల ప్రాజెక్టుకు మరమ్మతు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేలా చర్యలకు ఉపక్రమించారు. 1–2 టీఎంసీలతో బరాజ్.. జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన సుమారు 1– 2 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ క్రమంలోనే పాలమూరు ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం కోసం స్థలం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. వేసవిలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనడం, తాగునీటి అవసరాల కోసం కర్ణాటకపై ఆధారపడడం, వాళ్లు ఇచ్చే 1, 2 టీఎంసీలు విడుదల చేయడం గత ఎనిమిదేళ్లుగా పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే బరాజ్ నిర్మాణం చేపట్టడం వలన వేసవిలో తలెత్తే తాగునీటి సమస్యను అధిగమించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి
కందనూలు: క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీని స్థాపించి సోమవారానికి 47 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. బీజేపీ జెండా పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటంతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. -
ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలి
వాతావరణం ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం కొంత ఆహ్లాదంగా ఉంటుందినాగర్కర్నూల్ క్రైం: ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంభించాలని, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజులపాటు ‘హెల్త్ వీక్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజలు తమ రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, ప్రొటీన్ పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అధిక నూనె, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలను తగ్గించాలని, ముఖ్యంగా యువత ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండి ఇంటి వద్ద చేసుకున్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, శారీరక వ్యాయామం వంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యాధికారులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని సత్కరించనున్నట్లు చెప్పారు. బుధవారం రక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా సురక్షిత ప్రసవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గురువారం ఎయిడ్స్ నియంత్రణపై ‘రెడ్ రన్’ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్జెండర్ వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. శుక్ర వారం హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరా లు చేపట్టాలని, శనివారం మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవికుమార్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పరేడ్ మైదానంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫూల్లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ను సోమవారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ అనుకూలిస్తే..
● రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ● మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ● ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులో శ్రీశైలం బ్యాక్వాటర్ ● బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతో అనుకూలంగా భావన వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు కేఎల్ఐలో మరమ్మతుకు గురైన మోటార్లు ఇవే.. కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. ఎల్లూరు సమీపంలోని కేఎల్ఐ పంపుహౌజ్ -
పశు సంపదను కాపాడుకోవాలి
వెల్దండ: పశువులకు సోకుతున్న సీజనల్ వ్యాధుల నుంచి రైతులు పశువులను కాపాడుకోవాలని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బండోనిపల్లి, గుండాల గ్రామాల్లో రాష్ట్ర నోడల్ అఫీసర్ అనిల్కుమార్ జిల్లా పశువైద్యాధికారి జ్ఞానశంకర్తో కలిసి గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిపశువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో పాడి ఆవులను నీడలో ఉండే విధండా చూసుకోవాలన్నారు. ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు నీడకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నివారణ టీకాలను ముందస్తుగా పశువులకు వేయించాలని రైతులకు సూచించారు. అలాగే వైద్య సిబ్బంది ముందురోజు గ్రామాల్లో దండోరా వేయించి.. రైతులకు సమాచారం అందించాలన్నారు. ఈ నెల 9 వరకు టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని పశువులకు టీకాలు వేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, సిబ్బంది నరేష్రెడ్డి, నర్సింహ, తిరుపతయ్య, శ్రీను, గోపాలమిత్రలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల ముంగిట
ఉమ్మడి జిల్లాలో అగ్గి రాజుకుంటే బుగ్గిపాలే దూరభారంతో నష్టం.. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఏర్పాటు చేయడంలో అటు అధికారుల్లో, ఇటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి కొరవడింది. మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కటి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అగ్నిమాపక కేంద్రం ఫోన్ నంబర్ మహబూబ్నగర్ 08542– 280099 గద్వాల 08546– 272299 వనపర్తి 08545– 232299 నాగర్కర్నూల్ 08540– 226299 నారాయణపేట 08546– 282401 అచ్చంపేట 08541– 272389 కొల్లాపూర్ 08501– 275164 ఆత్మకూర్ 08504– 222400 షాద్నగర్ 08548– 213744 అమ్రాబాద్ 08541– 276488 కల్వకుర్తి 08549– 200399 13 స్టేషన్ల పరిధిలో 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి -
నిస్వార్థ సేవకు ప్రతీక.. బాబు జగ్జీవన్రాం
కందనూలు: కులరహిత సమాజ నిర్మాత బాబు జగ్జీవన్రాం నిస్వార్థ సేవకు ప్రతీక అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పాత కలెక్టరేట్ వద్ద జగ్జీవన్రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరఫున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జగ్జీవన్రాం అని కొనియాడారు. ఆయన దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు మాత్రమే కాకుండా, సామాజిక శ్రేయస్సు కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, కులరహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, దళిత సంఘాల నాయకులు వార్డెన్ చెన్నయ్య, వంకేశ్వరం నిరంజన్, జెట్టి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయాలు కొనసాగిస్తాం
కొల్లాపూర్: సామాజిక న్యాయపోరాట యోధుడు బాబు జగ్జీవన్రాం అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్లో ఆయన జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు జగ్జీవన్రాం అని అన్నారు. ఆయన ఒక వర్గానికో, కులానికో నాయకుడు కాదని.. అంటరానితనం, కులవివక్షపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం అందించారని అన్నారు. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో రక్షణమంత్రిగా ఆయన ప్రదర్శించిన వ్యూహ చతురత ఎంతో గొప్పదని.. కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, బోనస్కు శ్రీకారం చుట్టిన నాయకుడు జగ్జీవన్రాం అని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
డిగ్రీలోనూ ఎఫ్ఆర్ఎస్!
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కీలక మార్పు ● విద్యార్థులతో పాటు ఆధ్యాపకులు, సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు ● ప్రత్యేక యాప్ రూపొందించిన ఉన్నత విద్యామండలి ● కళాశాల ప్రాంగణంలో ఉంటేనే నమోదు 75శాతం హాజరు ఉంటేనే స్కాలర్షిప్.. జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.. 112 మంది అధ్యాపకులు, 57 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2,316 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్నేళ్లుగా కళాశాల తరగతి గదిలోనే మ్యానువల్గా విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు కళాశాలకు డుమ్మా కొట్టినా.. వారికి 75శాతం హాజరు ఉండేలా చూసేవారు. ఇప్పుడు ఫెషియల్ రికగ్నిషన్ సిస్టమ్ రావడంతో విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్లో, రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగో సెమిస్టర్లో ఉండగా.. వీరికి యాప్ను ఉపయోగించి హాజరు నమోదు చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడటంతో పాటు 75శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేయనున్నారు. కందనూలు/అచ్చంపేట: ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాలలను గాడిలో పెట్టేందుకు.. అర్హులైన విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ అందించేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ స్థానంలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని తీసుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి నూతన విధానంలో హాజరు నమోదును తప్పనిసరి చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎఫ్ఆర్ఎస్ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు కళాశాలల మినహాయింపుపై విమర్శలు.. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో చదివే కొందరు విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా.. నేరుగా పరీక్షలు రాస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే కళాశాలల్లో అధ్యాపకులను నియమించకుండా, కేవలం ఉపకార వేతనాల కోసమే కళాశాలలు నడుపుతున్నారనే అరోపణలు లేకపోలేదు. కొత్త విధానంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గి, ప్రైవేటులో పెరిగే అవకాశం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఉపయోగం.. ఎఫ్ఆర్ఎస్ విధానంతో విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి సబ్జెక్టు నేర్చుకోవడంతో పాటు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా క్లాసులు వినడం ద్వారా బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటుంది. ఈ విధానం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. – మదన్మోహన్, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నాగర్కర్నూల్ -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమలు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచేస్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
సిర్సనగండ్లకు పోటెత్తిన భక్తులు
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. సీతారాముల దర్శనానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా శ్రీరామనామస్మరణ మార్మోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. కొండ దిగువన వంటలు చేసుకొని ఆరంగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం హుండీలను లెక్కించనున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. -
వృద్ధాశ్రమం, హాస్టల్స్ తనిఖీ
కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహాలు, వృద్ధాశ్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తులు దమ్ము ఉపనిషధ్వాణి, ఆర్.శరణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సెల్ఫోన్ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి వివరించారు. జ్ఞానం పెంచుకోవడానికి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని, వ్యసనాలకు అవి కారణం కాకూడదన్నారు. నిర్ణీత వయస్సు లేనివారు వాహనాలు నడపవద్దని సూచించారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేసి నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ పరిశుభ్రంగా లేదని, వంటశాల నిర్వహణ బాగాలేదని వార్డెన్పై అసహనం వెలిబుచ్చారు. వెంటనే పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరాతీశారు. -
సీసీ కెమెరాలతో శాంతిభద్రతల పరిరక్షణ
కల్వకుర్తి రూరల్: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం మండలంలోని తాండ్ర గ్రామంలో సర్పంచ్ ఆశాదీప్రెడ్డి తన సొంత నిధులు రూ.12.50 లక్షలతో ఏర్పాటు చేసిన 67 సీసీ కెమెరాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. నిఘా నీడలో గ్రామాల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉంటాయన్నారు. నేరాలు సైతం తగ్గే విషయంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది భద్రతా సిబ్బందితో సమానమని, గ్రామ అభివృద్ధికి యువ సర్పంచ్ ఆశాదీప్రెడ్డి అందిస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. గ్రామంలో రూ.70 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పరిశీలించి.. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ పాఠశాల భవన పనులను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చదువుకున్న పాఠశాల పనులను నాణ్యతగా, వేగంగా పూర్తిచేయాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, సాయిరెడ్డి తహసీల్దార్ ఇబ్రహీం పాల్గొన్నారు. -
బీమాతో భరోసా
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం చేయూత వీరే అర్హులు.. గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 18– 59 సంవత్సరాల వయస్సు కలిగి, స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్న వారికి ఈ బీమా పథకం వర్తించనుంది. మహిళా సంఘం సభ్యురాలు సహజ మరణం చెందితే, వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ద్వారా అందించే రూ.10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ అవుతోంది. దీంతోపాటు వారు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేస్తారు. 50 శాతానికి మించి అంగవైకల్యం ఏర్పడితే, సదరం ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి రూ.5 లక్షలు అందించనున్నారు. అచ్చంపేట: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నెముఖగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. వారి జీవితాలకు మరింత భద్రత కల్పిస్తూ.. ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తూ ఎవరైన సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల బీమా పరిహారం అందించడంతో పాటు అమె పేరిట ఉన్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనుంది. గతంలో కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే గ్రూపు సభ్యులే ఆ రుణభారం భరించాల్సి వచ్చేది. ఇదీ కాక ఏదేని కారణంతో సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడటం, వారు కూడా చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్ లిస్టులో చేర్చడం వంటివి చేసేవారు. దీంతో కొత్త రుణాలు మంజూరు కాక చాలా సంఘాలు ఇన్ యాక్టివ్గా మారేవి. ఈ అవస్థలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళలకు భరోసానిచ్చే ఈ తాజా నిర్ణయంతో మహిళా సంఘాల సభ్యుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు రక్షణ కవచంగా నిలుస్తున్న లోన్ బీమా పథకం పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు మండల సమాఖ్యలు 20 వికలాంగుల సంఘాలు 457 మొత్తం సభ్యులు 1,47,123 -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. 15 ఏళ్లుగా 108 వాహ నం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చా లా ప్రమాదాలు జరుగు తుంటాయి. నిరంత రం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలంది స్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట ఎందరో ప్రాణాలు కాపాడా.. 108 వాహనంలో టెక్నీషియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట సద్వినియోగం చేసుకోండి.. 108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహ నం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్● -
అపర సంజీవని..108
సకాలంలో ఆపద్బాంధులా ఆదుకుంటున్న అంబులెన్స్ ● ఉమ్మడి జిల్లాలో 71 సర్వీసులు ● బాధితులు, క్షతగాత్రులు ఆస్పత్రులకు తరలింపు ● ఏడాదిలో 81,546 మందికి అత్యవసర వైద్యసేవలు ఉమ్మడి జిల్లాలో వాహనాలు.. నాగర్కర్నూల్ 19 వనపర్తి 13 జో,గద్వాల 11 మహబూబ్నగర్ 17 నారాయణపేట: ఆపద సమయంలో ఆప్తులు వస్తారో రారోగానీ 108 వాహనాలు మాత్రం కుయ్ కుయ్మంటూ వచ్చేస్తున్నాయి. 108కి ఫోన్చేస్తే చాలు మేమున్నామంటూ భరోసానిస్తూ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులు, క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నాయి. 108 వాహనాన్ని చూడగానే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం, పురిటి, చాతి నొప్పి, ఫిట్స్, పాయిజన్, పాము కాటు తదితర అత్యవసర సమయాల్లో ఒక్క ఫోన్ చేస్తే వాహనం ముందుంటుందని చెప్పవచ్చు. ఈ వాహన సేవలతో ప్రాణాలు నిలిచినవారు ఎందరో ఉన్నారు. 81,546 మంది వినియోగం.. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు. అత్యవసర వైద్యసేవలు.. 108కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వాహనం ఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతున్నాయి. వాహనంలో ఉన్న నిష్ణాతులైన టెక్నీషియన్లు ప్రమాద పరిస్థితిని బట్టి అవసరమైన వైద్యం, ఆక్సిజన్ అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. పలువురు గర్భిణులకు వాహనంలోనే ప్రసవాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అత్యుత్తమ వైద్యసేవల కోసం మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర ఆస్పత్రులకు వాహనాల్లో తరలిస్తూ సేవలు అందిస్తున్నారు. కేసులు బాధితులు ప్రసవాలు 18,739 అత్యవసర వైద్యసేవలు 14,900 రోడ్డు ప్రమాదాలు 8,712 కడుపునొప్పి 8,445 శ్వాసకోస సమస్యలు 6,464 అంతర్గత కారణాలతో 4,740 గుండె సంబంధిత సమస్యలు 4,734 అపస్మారక స్థితి 4,103 పురుగుమందు తాగినవారు 3,515 మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638 ఆత్మహత్య 1,790 వన్యప్రాణుల ప్రమాదాలు 1,527 పక్షవాతం 1,003 అగ్నిప్రమాదాలు 230 ఉమ్మడి జిల్లాలో ఇలా.. -
మత్స్యరంగం అభివృద్ధికి ప్రోత్సాహం
రాజాపూర్: గ్రామీణ ప్రాంత యువతకు ఆదాయ వనరులు సమకూర్చి వారికి స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండలంలోని మొదంపల్లిలోనూతనంగా ఏర్పాటు చేసిన బయో ప్లోక్ ఫిష్ ట్యాంక్స్ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త సాంకేతికతలను తీసుకొచ్చి గ్రామీణ యువతకు ప్రాత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అ భివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లుపేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ పాఠశాలను బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు. -
వేగంగా.. సులభంగా
● ఇకపై నకిలీ ధ్రువపత్రాల జారీకి అడ్డుకట్ట ● మొబైల్ యాప్ ద్వారా పాదర్శకంగా జారీ ● ముందుగా ఆదాయ సర్టిఫికెట్లతో శ్రీకారం ● జాప్యం, లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా చర్యలు ●గతంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం జీపీఓల వద్దకు దరఖాస్తుదారులు వెళ్లేవారు. మీసేవకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేక యాప్ ద్వారా జీపీఓ లాగిన్లోకి వస్తుంది. ఆయన విచారణ చేసి వాటిని ఆర్ఐకి పంపిస్తారు. ఆర్ఐ పరిశీలన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ వస్తుంది. – సైదులు, తహసీల్దార్, అచ్చంపేట అచ్చంపేట: సర్టిఫికెట్ల జారీలో పాదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాన్యువల్గా జరిగే విచారణతో కలిగే జాప్యాన్ని నివారిస్తూ, డిజిటల్ యాప్ ద్వారా సేవలను వేగవంతం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఈవి ధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మారుతున్న విధానం.. గతంలో కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే అది నేరుగా నాయబ్ తహసీల్దార్ లాగిన్కు వెళ్లేది. ఇక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్ఐ) ఆపై క్షేత్రస్థాయి పరిశీలనకు పంపేవారు. కానీ, కొత్త విధానంలో అభ్యర్థి మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అది నేరుగా గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి (ఆర్ఐ)కి, ఆపై నాయబ్ తహసీల్దార్కు డిజిటల్ రూపంలో ఫార్వర్డ్ అవుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. డిజిటల్ యాప్లో వివిధ రకాల సర్టిఫికెట్లు ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లింది. సామాన్యులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పూర్తి డిజిటల్ పద్ధతి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఆదాయం సర్టిఫికెట్ పొందాలంటే దరఖాస్తుదారుడు తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు నింపి, దానిపై గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), మండల రెవెన్యూ అధికారి (ఆర్ఐ)తో సంతకాలు తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం మీసేవలో ఆన్లైన్ చేసి, మళ్లీ మాన్యువల్ కాపీలను సమర్పించిన తర్వాతే తహసీల్దార్ లాగిన్కు వెళ్లేది. -
అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు
అచ్చంపేట: అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలకపల్లి రోడ్డులో చౌకధరల దుకాణాలను ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలో చౌకధరల దుకాణాలు ఒకేచోట కాకుండా ప్రతి కాలనీలో లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం జరిగిందన్నారు. ఒక రూపాయికే పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు. ఐటీ కారణంగా కొంతమంది రేషన్ కార్డులు రద్దు అయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, తిరిగి అందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ నిరుత్సాహ పడవద్దని చెప్పారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సైదులు, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలు కలవరింత
కాలుష్యం కుమ్మరింత..● నిబంధనలు పట్టించుకోని ఫార్మా పరిశ్రమలు ● చెరువులు, చేలల్లోకి నేరుగా వ్యర్థ పంపింగ్ ● పంటలు పండకపోవడంతో ఆందోళనలో రైతులు ● వాయు కాలుష్యానికి కేరాఫ్గా మారిన పలు ఫ్యాక్టరీలు ● నిత్యం ఆకాశాన్ని కమ్ముకుంటున్న దట్టమైన పొగ ● దుర్గంధం భరించలేమంటూ స్థానికుల ఆవేదన పట్టపగలే ఓ ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని ఈ చిత్రంలో చూడవచ్చు. రసాయనాలతో రంగు మారిన నీరు నేరుగా సమీపంలోని ముదిరెడ్డిపల్లిలోని పల్లె చెరువు.. దీని గుండా పొలాల్లో చేరుతోంది. ఓ ఫార్మా పరిశ్రమ నుంచి బాయిలర్ ద్వారా చిమ్నీ నుంచి భారీ స్థాయిలో వెదజల్లుతున్న దట్టమైన పొగను ఈ ఫొటోలో చూడవచ్చు. నల్లటి దుమ్ము, ధూళి కణాలతో పరిసరాల్లోని పంట పొలాలు, చెట్లు మసిబారిపోతున్నాయి. చితికిపోతున్న 5 గ్రామాలు.. పోలేపల్లి సెజ్లో 13 వరకు ఫార్మా కంపెనీలు, మరో ఎనిమిది వరకు ఇతర పరిశ్రమలున్నాయి. ప్రధానంగా పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ జలా లు నేరుగా చెరువులు, కుంటల్లో కలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు సాగుకు అనువుగా లేక పంటలు పండకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు.. లెక్క ప్రకారం పరిశ్రమల నిర్వాహకులు ఫార్మా ఉత్పత్తుల తయారీలో వెలువడిన వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి వదిలేయాలి. అలాంటి పరికరాలు లేకుంటే ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా బయటకు వదులుతున్నారు. వర్షాకాలంలో అయితే వరద పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్సెల్తో పాటు నెలకోసారి అయినా హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వారి రోదన అరణ్యరోదనగా మారింది. -
న్యాయవాదుల పోరాటంతోనే రక్షణ చట్టం
● సీఎం చొరవతోనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదం పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ వల్లే న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు అమోదం పొందిందని, ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పోరాటం ఫలించిందని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును శాసనసభలో అన్ని పక్షాలు ఆమోదించేలా సీఎం చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంగా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ న్యాయవాదుల సంఘం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేపట్టారని, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పూర్తి సహకారంతో ముందుకు సాగిందన్నారు. భూత్పూర్ వరకు పాదయాత్రకు చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వంశీకృష్ణ అక్కడికి వచ్చి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లి రక్షణచట్టం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వల్ల సీఎంను కలవడానికి సాధ్యం కాలేదని.. రెండో విడత మహా పాదయాత్ర కొనసాగించి.. ఫిబ్రవరి 27న సచివాలయానికి చేరుకుని సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదించినట్లు తెలిపారు. ఇకపై న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా.. అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. న్యాయవాదులు ఎవరైనా రక్షణ కావాలని పోలీసులను కోరితే రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో రూపొందించినట్లు చెప్పారు. న్యాయవాదులపై దాడులు జరిగితే డీఎస్పీ స్థాయి అధికారి విచారించేలా చట్టం రూపకల్పన చేశారని గవర్నర్ ఆమోదముద్ర తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్రా వు, వెంకటయ్య, నాగోజీ, తగిలి కృష్ణ, రాఘవేందర్, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. -
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నంబావి: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. దగడపల్లి – తూంకుంట, దగడపల్లి – పెద్దదగడ మధ్య బీటీ రహదారి, దగడపల్లి – వీపనగండ్ల మధ్య ఉన్న బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.కోటి మంజూరు, ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని సర్పంచ్ గంగాధర్ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అత్యధికంగా సీసీ రహదారులకు నిధులు మంజూరు చేశామని, గ్రామస్థాయిలో రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలపై ఆగ్రహం.. మండలంలోని దగడపల్లిలో జరిగిన ముఖాముఖి లో సర్పంచ్ గంగధార్ పాల్గొన్నారు. పార్టీకి మద్దతు ఇవ్వని వ్యక్తికి ఎలా మాట్లాడే అవకాశం ఇస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అంతిమ లక్ష్యం గ్రామాభివృద్ధి అని మంత్రి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిన చింతల వెంకటేష్ను హెచ్చ రిస్తూ ఇది మంచి పద్ధతి కాదని.. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు.. మహిళలమని చూడకుండా వార్డుసభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమ్మాయిపల్లి సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ మాధవి మంత్రికి వివరించారు. మహిళలను గౌరవించాలని, మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయాలు మానుకోవాలని.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, సర్పంచ్లు కవిత ప్రభంజన్గౌడ్, గంగాధర్, ఉపసర్పంచ్ మాధవి మాధవరెడ్డి, కిరణ్కుమార్గౌడ్, చింతల శ్రీనివాసులు, శంకర్, బాలకృష్ణ, రాజకుమార్, ఉమేష్ నాయుడు, సుధాకర్ నాయు డు, జ్యోతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్
● ఎట్టకేలకు ఫైనల్లొకేషన్ సర్వే పూర్తి ● వనపర్తి, నాగర్కర్నూల్,కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మార్గం ● ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,330 కోట్లు ● రైలు మార్గం పొడవు 296 కిలోమీటర్లు ● కీలక అభివృద్ధికి మరో ముందడుగు గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి తెలకపల్లి: చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని చిన్నముద్దనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆయన పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయన వెంట హౌసింగ్ పీడీ సంగప్ప, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఈ హుస్సేన్, సర్పంచ్ రుక్సానాబేగం, పంచాయతీ కార్యదర్శి శిరీష ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం తెలకపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. బుధవారం తెలకపల్లిలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా నేటికీ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అంటరానితనం, అవమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఖనిజ సంపదను కొల్లగొట్టి బడా వ్యాపారులకు కట్టబెట్టిందని ఆరోపించారు. మరోవైపు విచ్చలవిడిగా నిత్యావసరాల ధరలు పెంచుతూ.. పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిని సీపీఐ సందర్శించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవులుగౌడ్, మండల కార్యదర్శి రవీందర్, శంకర్గౌడ్, బుగ్గస్వామి, ఆంజనేయులు, శివకృష్ణ, నరేందర్రెడ్డి, బాలపీరు, బాలస్వామి పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు సరికాదు కందనూలు: కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఓట్లను తొలగించడం సరైంది కాదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్రాం భవన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఓట్లు తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అదే విధంగా దేశ ప్రజలను కులం, మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహుజనుల రాజ్యాధికార ఆత్మగౌరవ సభకు జిల్లా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇన్చార్జి అంతటి నాగన్న, పృథ్వీరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న, సాయిబాబా, రామకృష్ణ పాల్గొన్నారు. నేడు విద్యుత్ ఆర్టిజన్లవంటావార్పు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, జడ్చర్ల డివిజన్ చైర్మన్ జహంగీర్, మహబూబ్నగర్ డివిజన్ చైర్మన్ పెంటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికుడు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైలు కనెక్టివిటీబలోపేతం కనెక్టివిటీల ప్రకారం అలైన్మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 200 కిలోమీటర్ల దూరంఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది. జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు రాకపోకలకు దగ్గర అవుతుంది. 1981లో బీజం.. మార్పులతో ఆమోదం గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమలు, ఉపాధి మెరుగు.. దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ కొత్త లైన్ ద్వారా రాష్ట్రంలోని ఆయా జిల్లాకేంద్రాలతోపాటు హైదరాబాద్, దేశ రాజధానికి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఊతం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ ●పీయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ శ్రీనివాస్ పీయూలో బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మిషన్ లర్నింగ్లో మొత్తం 62మంది ఉండగా ఇందులో 34 మంది ఉత్తీర్ణులై, 28మంది ప్రమోట్ అయ్యారు. డేటాసైన్స్లో 32 మంది ఉత్తీర్ణులై, 29 మంది ప్రమోట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్లో 24 మంది ఉత్తీర్ణులై, 40 మంది ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడీషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బావాజీ ఉత్సవాలు ప్రారంభం తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్య దైవం గురు లోకమాసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. –8లో u -
కమనీయం.. సీతారాముల కల్యాణం
అమ్రాబాద్: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి మాల విరమణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం పండితుడు వీరయ్యశాస్త్రి బృందం వేద మంత్రోచ్ఛరణల మధ్య గవ్యాంతర పూజలు, వాస్తు హోమం, మన్యుసూక్త హోమాలు, రుద్రహోమం నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంలో ఊరేగించారు. రాత్రి శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను చూడముచ్చటగా అలంకరించి.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కల్యాణ వేడుక జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములునాయక్, ఈఓ నర్సింహులు, సిబ్బంది పరందామారెడ్డి, నాగరాజు, విశ్వేశ్వర్రెడ్డి, అజయ్ పాల్గొన్నారు. -
ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు
బిజినేపల్లి: ఆరోగ్య మిషన్–99లో భాగంగా ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా.రవికుమార్ నాయక్ అన్నారు. బుధవారం బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, డెంటల్, కంటి వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ప్రత్యేక వైద్యశిబిరాల్లో పాల్గొని ప్రజలకు సమగ్ర సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, వైద్యశిబిరంలో అందిస్తున్న వైద్యసేవల నాణ్యతను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రోగుల నమోదు విధానం, చికిత్స విధానం, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ తదితర వివరాలను తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా.సృజన, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదు ప్రధానమైన మైల్ స్టోన్స్
రాంపూర్ చెంచుపెంట నుంచి సలేశ్వరం వరకు ఐదు ప్రధాన మైల్స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం విడిది ఏర్పాట్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. రాంపూర్పెంట దాటిని తర్వాత అర కిలోమీటరు దూరంలో వాహనాల పార్కింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి మోకాల కుర్వు, కిలోమీటరు దాటిన తర్వాత గాడిద దొన్న కాల్వ వస్తుంది. ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. అర కిలోమీటరు దాటితే ఇప్పచెట్టుబండ, కిలోమీటరు తర్వాత అప్పాయిపల్లి దారి వస్తుంది. లోయలోకి దిగుతుంటే మైసమ్మకట్ట వద్ద పూజలు చేస్తారు. పాపనాశనం నీళ్లు చుక్కలుగా పడుతాయి. లోయలోకి కిలోమీటర్లు పోతే భైరవుని గుడి వస్తుంది. మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే ఉండిపోవాలి. చెప్పులు కూడా ఇక్కడే వదలాలి. కిందికిపోతే నీళ్ల కాల్వ బారికేడ్లు వస్తాయి. ఇక్కడ క్యూలో వెళ్లాలి. అనంతరం శనేశ్వర ఆలయం వస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా శంఖుతీర్థం వస్తుంది. ఇక్కడ స్నానం చేయాలి. శనేశ్వర ఆలయం సందర్శించిన తర్వాత లోయలోకి ముందుకు వెళ్తే సలేశ్వరం తీర్థం వస్తుంది. ఇక్కడ రెండు గుండాలు (శంఖుతీర్థం, సలేశ్వర తీర్థం) ఉంటాయి. సలేశ్వరం తీర్థం వద్ద 300ల అడుగుల పైనుంచి జలపాతం పడుతుంది. ఇక్కడి గుహలోనే సలేశ్వరం లింగమయ్య కొలువుదీరారు. ఇక్కడ పోయే దారి, వచ్చే దారి వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేక జనరేటర్ల ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. -
పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● కొల్లాపూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో మంత్రి జూపల్లి కొల్లాపూర్: మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పుర చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే పనులకు బడ్జెట్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పాలకవర్గానికి సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీకి మంజూరయ్యే నిధులతో పాటు అదనపు నిధుల మంజూరుకు కృషిచేస్తానని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ నీటి సరఫరాపై మంత్రి అధికారులతో సుదీర్ఘకంగా చర్చించారు. రూ.31.42 కోట్లతో అంచనా బడ్జెట్.. 2026–27 సంవత్సరానికి సంబంధించి రూ.31.42 కోట్ల అంచనా బడ్జెట్ను మున్సిపల్ పాలకవర్గం రూపొందించింది. వీటిలో ఇంటి ట్యాక్సుల ద్వారా రూ. 13.65లక్షలు, వాణిజ్య ట్యాక్స్లతో రూ. 23.65లక్షలు, డిపాజి ట్లు, రుణాల ద్వారా రూ. 37.08లక్షలు, ప్లానింగ్, నాన్ప్లానింగ్, ఇతర గ్రాంట్ల ద్వారా రూ. 26.50 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితో ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, రుణాల చెల్లింపు, గ్రీన్ బడ్జెట్ ఖర్చులన్నీ కలిపి రూ. 2.84 కోట్లు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు రూ. 71.25 లక్షలు.. వార్డుల వారీగా నిర్వహణ ఖర్చులకు రూ. 44.03 లక్షలు, ప్లానింగ్ గ్రాంట్స్ ద్వారా అభివృద్ధి పనులకు రూ. 26.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ఖర్చు రూ. 30.53 కోట్ల మేరకు ఉంటుందని అంచనా బడ్జెట్లో పేర్కొన్నారు. దీనికి పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు ఉన్నారు. -
‘పది’ మూల్యాంకనానికి సిద్ధం
కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులను కేటాయించి.. ఉత్తర్వులు జారీ చేశారు. మూల్యాంకనం మూడు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత బుధవారం నుంచి 9వ తేదీ వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, రెండవ విడత 10 నుంచి 17వ తేదీ వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, మూడవ విడత 18 నుంచి 23వ తేదీ వరకు సాంఘీకశాస్త్రం పరీక్షల మూల్యాంకనం నిర్వహించనున్నారు. 806 మందికి విధులు.. జిల్లాకు 1.72,190 జవాబుపత్రాలను మూల్యాంకనానికి కేటాయించారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితంతో కలిపి ప్రస్తుతం 88వేల పేపర్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. మిగతా పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తి జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందని పరీక్షల విభాగం అధికారి రాజశేఖర్రావు వెల్లడించారు. కాగా, జవాబుపత్రాల మూల్యాంకనానికి మొత్తం 806 మందికి విధులు కేటాయించారు. వీరిలో ఏఈలు 552 మంది, సీఈలు 92 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 162 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకు రిపోర్టు.. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన వాల్యుయేషన్ కేంద్రంలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాల్యుయేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలను అధికారులు వారికి తెలియజేస్తారు. వాల్యుయేషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు 40 పేపర్లు వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. కేంద్రంలో సౌకర్యాల కల్పన.. మూల్యాంకన కేంద్రంలోని స్ట్రాంగ్రూం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మూల్యాంకనం నిర్వహించే గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి, లైట్లు, ఫ్యాన్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్ఎం, ఇతర సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచనున్నారు. నేటి నుంచి 23 వరకు స్పాట్ వాల్యుయేషన్ జిల్లాకు 1.72లక్షల జవాబు పత్రాలు కేటాయింపు జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఏర్పాట్లు -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా రాంపూర్పెంట పుల్లాయిపల్లికురియాల జంక్షన్ మోకాల కుర్వ మహబూబ్నగర్ – అచ్చంపేట – శ్రీశైలం -
పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
కందనూలు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ, వార్డుసభల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 461 జీపీల్లో గ్రామసభలు, 4 మున్సిపాలిటీల్లో వార్డుసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల తో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యు లు, యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ పథకాల లబ్ధిదారులు సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. గ్రా మ, వార్డు సభల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లతో పాటు ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవసహాయం ఉన్నారు. సలేశ్వరం జాతరకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అచ్చంపేట రూరల్: సలేశ్వరం జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. మంగళవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సలేశ్వరం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా 326 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే సలేశ్వరం సందర్శన సమయం కేటాయించిన విషయాన్ని భక్తులు గమనించాలన్నారు. వేసవి దృష్ట్యా భక్తులందరూ తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు ఉన్నారు. పంటమార్పిడితో అధిక దిగుబడులు బిజినేపల్లి: పంటమార్పిడి విధానంతో తెగుళ్లకు కళ్లెం వేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. మంగళవారం పాలెం కేవీకేలో రైతులకు పంటల మార్పిడి, వైవిధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. రైతులు వానా కాలంలో ఒక పంటను సాగుచేస్తే.. యాసంగి లో మరో పంటను పండించాలన్నారు. తద్వా రా పంటలోని చీడపీడల అవశేషాలు మరో పంటపై ప్రభావం చూపవని వివరించారు. దీంతో సహజంగానే తెగుళ్ల బెడద తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పంట మార్పిడి సమయంలో అందుకు అనుగుణంగా దుక్కి దున్ని విత్తుకోవాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు పాత పంట అవశేషాలు ప్రభావం చూపని మరో పంటను సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, శాస్త్రవేత్తలు శశిభూషణ్, శ్రీధర్, సహజ వ్యవసాయ రైతు లావణ్య రమణారెడ్డి పాల్గొన్నారు. -
చలో.. సలేశ్వరం
లింగమయ్య దర్శనానికి వేళాయె సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ – అచ్చంపేట – శ్రీశైలం -
జనగణనను పకడ్బందీగా నిర్వర్తించాలి
కందనూలు: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాల ప్రణాళిక గణాంక అధికారులు చార్జ్ క్లర్క్, అసిస్టెంట్ చార్జ్ క్లర్క్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక సహాయకులుగా తమకు నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ తరగతులు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి కాలనీ, అపార్టుమెంట్లు, చిన్నచిన్న వీధి ప్రాంతాల్లో నివసించే ప్రతి ఇంటిని, ఇంట్లోని ప్రతిఒక్కరి గణన విధిగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. వందశాతం కచ్చితత్వంతో పూర్తి చేయడమే తమ లక్ష్యంతో జనగణన చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, ఆవాస ప్రాంతాలు హ్యాబిటేషన్లు, గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లా స్థాయి వరకు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేలా కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, మాస్టర్ ట్రైనర్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్
అక్రమాలకు చెక్! ● ఎన్ఎంఎంఎస్ యాప్తో ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ● జిల్లాలో 1,67,197 జాబ్కార్డులు.. 1,67,290 మంది కూలీలు –8లో uసోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట రూరల్: స్వగ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పని ప్రదేశంలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎన్ఎంఎంఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా అక్ర మ మస్టర్లకు అడ్డుకట్ట పడింది. ఇదివరకే కూలీలందరికీ ఈకేవైసీ పూర్తిచేశారు. జాబ్కార్డుల్లో ఉండే వారి ఐరిస్తో పాటు వివరాలను నమోదు చేసుకున్నారు. సంబంధిత యాప్లో ముందుగా సంబంధిత పనిప్రదేశాన్ని ఫొటో తీయాల్సి ఉంటుంది. పని ముగిసిన అనంతరం హాజరైన వారందరితో మరో ఫొటో తీసుకుంటారు. ప్రతిఒక్కరి ఈకేవైసీ పూర్తయినందున జాబ్కార్డులో ఉన్నవారి ఫొటో మాత్రమే యాప్ ఆమోదిస్తుంది. తప్పని అడ్డంకులు.. ఉపాధిహామీ పథకంలో అక్రమా లను అరికట్టేందుకు ఎన్ఎంఎంఎస్ యాప్లో ముఖగుర్తింపు హాజరు విధానానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కూలీల ముఖగుర్తింపు హాజరు నమోదు సాధ్యం కావడం లేదు. గతంలో కూలీల మస్టర్ విధానం అమలులో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి ముఖగుర్తింపు హాజరు ప్రవేశపెట్టింది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంపై ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో కూలీ ముఖ హాజరు నమోదు చేసేందుకు సుమారు 5 నిమిషాల వరకు పడుతుండటంతో హాజరుకే సమయం సరిపోతుందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్క రోజులో సుమారు 70నుంచి 80మంది కూలీల ముఖ హాజరును రెండు పర్యాయాలు ఎలా నమోదు చేయాలో తెలియడంలేదని వాపోతున్నారు. రేపటి నుంచే శనేశ్వరుడి బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు, అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. మొదటి రోజు శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, శివపార్వతుల కల్యాణం, రెండో రోజు జైష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి కల్యాణం, చివరి రోజు ఉమామహేశ్వరస్వామి వ్రతం, రుద్రహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు కందనూలు: నల్లమల అటవీ ప్రాంతంలో మూడు రోజులపాటు జరిగే సలేశ్వరం జాతరకు జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్న ట్లు నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఆదివారం ఆర్టీసీ డిపోలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు నాగర్కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది సుమారు 12వేల మంది భక్తులు ప్ర యాణించారని.. ఈసారి 15వేల మంది ప్రయాణిస్తారని అంచనా వే స్తున్నామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సలేశ్వరం జాతరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. వారికి రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ జోగమ్మ, ట్రాఫిక్ మేనేజర్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
నాగర్కర్నూల్
పక్కాగా ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026కందనూలు: జిల్లాలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డుసభలు విధిగా నిర్వహించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామసభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటలకు గ్రామసభలు ప్రారంభం కావాలని, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు, డీఆర్డీఓ చిన్న ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. -
జగమంతా రామమయం
చారకొండ: భక్తుల రామనామస్మరణ.. సన్నాయి వాయిద్యాలు.. పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య.. పచ్చని పందిళ్లలో ముత్యాల తలంబ్రాలతో జగధబిరాముడు, సీతాదేవిల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంతో శుక్రవారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని జరిపించిన జానకి రాముల కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు సామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పండితులు మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నిలువు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. అలాగే ముగ్గురు ట్రాన్స్జెండర్ల జంటలు కల్యాణ వేడుక మండపంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు కల్యాణం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి మరో రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి సిర్సనగండ్ల క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, టాస్క్ సీఓఓ సుకింరెడ్డి రాఘవేందర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, తహసీల్దార్ ఉమ తదితరులు పాల్గొన్నారు. ● కల్వకుర్తి డీఎప్పీ వెంకట్రెడ్డి, సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ వీరబాబు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రాంపూర్కు చెందిన చిలుకాని బాల్రెడ్డి– వెంకటమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణ మహోత్సవానికి సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యారని దేవస్థాన చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. కనులపండువగా సీతారాముల కల్యాణం సిర్సనగండ్లలో ఉప్పొంగిన భక్తిపారవశ్యం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవికాంతరావు
సాక్షి, నెట్వర్క్: నాగర్కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవికాంతరావు ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్రావు తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్కు సంబంధించిన ఎన్నికలను జిల్లా కోర్టు ఆవరణలో గురువారం నిర్వహించారు. ● కల్వకుర్తి సీనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్.మల్లేష్, అచ్చంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకటరమణ, కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భూజల భాస్కర్రెడ్డి ఎన్నికయ్యారు. ఎఫ్ఎల్ఎస్ బోధనపై ప్రత్యేక శ్రద్ధ లింగాల: ఆయా పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎఫ్ఎల్ఎస్ బోధనపై శ్రద్ధ తీసుకుంటున్నామని మండల విద్యాధికారి బషీర్ అహ్మద్ అన్నారు. మండలంలోని అవుసలికుంట పాఠశాలను గురువారం ఎంఈఓ తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎఫ్ఆర్ఎస్ హాజరును పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారామచంద్రస్వామి మాస కల్యాణం
చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపై నున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములు మాస కల్యాణ ఘట్టం కనులపండువగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలి వచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు, తహసీల్దార్ ఉమదంప తులు, ఎస్ఐ వీరబాబు దంపతులు, ఎంపీడీఓ శంకర్నాయక్, ఆలయ మాజీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సర్పంచ్ రామస్వా మి దంపతులు, ఉప సర్పంచ్ కల్లు సురేందర్రెడ్డి దంపతులు కల్యా ణంలో కూర్చున్నారు. అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి అన్నదానం చేశారు.కార్యక్రమంలో మే నేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, వేణుశర్మ, కోదండ రామశర్మ, మురళీధర్శర్మ, గోపిశర్మ, ప్రవీణ్ శర్మ, అనంత రామశర్మ, , నాయకులు వెంకట్గౌడ్, బాల్రాంగౌడ్, సందీప్రెడ్డి, నర్సింహారెడ్డి,ప్రశాంత్ నాయక్, సాంబయ్యగౌడ్ ఉన్నారు. పటిష్ట నిఘా.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు, సీసీ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ప్రత్యేక బస్సులు బ్రహ్మోత్సవాలకు మహబుబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు -
అనుమతులు లేకుండా ఇసుక తరలించొద్దు
ఉప్పునుంతల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి హెచ్చరించారు. గురువారం మొల్గర సమీపంలో దుందుబీ వాగులో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇసుక రీచ్ను ఆయన సందర్శించారు. ఆన్లైన్ బుకింగ్ చేసకున్న వినియోగదారులకు ఏవిధంగా ఇసుక చేరుతుందని మైనింగ్ శాఖ రీచ్ ఇన్చార్జ్ అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక తరలింపుపై స్థానిక తహసీల్దార్, ఎస్ఐ తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఆర్డీఓతోపాటు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ తిమ్మాజిపేట: మండలంలోని అప్పాజిపల్లిలో గురువారం సీతారామచంద్రాస్వామి పల్లకీ సేవలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణ్, హనుమంతుడి ప్రతిమలను అందంగా అలంకరించిన పల్లకీలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని శ్రీవేద విశ్వనాథ మందిరం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వాల్మీకి దేవాలయం వరకు భజన, భక్తి పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. మాజీ సర్పంచ్ జల్లి తిరుపతమ్మ, వాల్మీకి నాయకులు జల్లి వెంకటయ్య, జల్లి రమేష్, సుందరయ్య, కుర్మయ్య, చెన్నయ్య, శివ,పలువురు మహిళలు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
లింగాల: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న యూరియాను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన గురువారం రాత్రి మండలంంలోని అప్పాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర ప్రాంతానికి చెందిన రైతులు ఒక్కో బస్తా రూ.1,000 వరకు చెల్లించి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిని గమనించిన స్థానికులు కొంత మంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూరియాను తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. దాదాపుగా 20 బస్తాల వరకు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ వారికి అప్పజెప్తామని హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం కోడేరు: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ బలరాంనాయక్ తెలిపారు. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు గడువు ఉందన్నారు. అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తైబజార్ వేలం వెల్దండ: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్ మట్ట యాదమ్మ అధ్యక్షతనగా గురువారం కూరగాయల తైబజార్ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన దాదాపుగా 20 మంది వేలం పాటలో పాల్గొనడంతో గుద్దటి జానార్దన్ రూ.2.30 లక్షలకు తైబజార్ దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీఓ లక్ష్మణ్, కార్యదర్శులు గిరిగౌడు, ఫయాజ్, హజిబాబా, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం కల్వకుర్తి టౌన్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డీసీహెచ్గా మార్చేందుకు శాసనసభలో బిల్లు పెట్టడంతో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పట్టణంలోని సీహెచ్సీ వైద్యులు, సిబ్బంది గురువారం ఆస్పత్రి ఆవరణలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. సీహెచ్సీ సూపరింటెండెంట్ శివరాం తెలిపారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం
ఉప్పునుంతల: అచ్చంపేట పట్టణంలో కొసాగుతున్న మండలంలోని వెల్టూరు బాలికల గురుకుల పాఠశాలలో గురువారం పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన విద్యార్థినులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి స్వప్న ఆరోగ్య విషయాలను వివరించారు. వేసవిలో ఎండలకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని సూచించారు. భవిషత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ప్రభుత్వం ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. డాక్టర్ అభిలాష్, సూపర్వైజర్ ప్రభావతి, నవ్య, హెల్త్ అసిస్టెంట్ జగదీష్, ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం తెలకపల్లి/అమ్రాబాద్/వెల్దండ: తెలకపల్లి మండలంలోని గౌరారంలో గురువారం 8, 9, 10వ వార్డులలో సర్పంచ్ మల్లేశ్వరి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అదేవిధంగా అమ్రాబాద్ మండలంలోని మొల్కమామిడిలో రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ శాంతమ్మ, డిప్యూటీ సర్పంచ్ జీవన్రెడ్డి, వెల్దండ మండల కేంద్రంలోని 4వ వార్డులో సర్పంచ్ మట్టయాదమ్మ వెంకటయ్యగౌడ్ సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంతోష్నాయక్, లింగంయాదవ్, వెల్దండ ఉపసర్పంచ్ శ్రీనివాసులు, వార్డు సభ్యులు జంగిలి సునీత, మల్లీశ్వరి, కవిత, ఉన్నారు. -
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
కొల్లాపూర్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దకొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, వెన్నచెర్ల సర్పంచ్ సూర్య నారాయణమ్మ సూచించారు. గురువారం వెన్నచెర్లలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బై రాముడు, రవికుమార్, వి.సత్యం, పగడాల చిన్నయ్య, ప్రశాంత్, బాలింగచారి, సుదర్శన్, స్వామి, చెన్నమ్మ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీ పరిశీలన తాడూరు: మండలంలోని చర్ల తిర్మలాపూర్, లచ్చిరాంతండాలలో మండల స్థాయి అధికారుల బృందం గురువారం ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలను పరిశీలించింది. ఈ సందర్భగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. లచ్చిరాంతండాలో నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీఓ ప్రశాంత్, ఏపీఓ చంద్రసిద్దార్థ, విరాచారి, సర్పంచ్లు గాజుల కృష్ణ, కుర్మనాయక్, పాల్గొన్నారు. కూలీలకు కనీస వసతులు కల్పించాలి ఉప్పునుంతల: మండలంలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు ఎంపీడీఓ రేవతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
తిమ్మాజిపేట: మండలంలోని బావాజిపల్లి, మరికల్, నేరళ్లపల్లి గ్రామాల్లో గురువారం ప్రత్యేక పశు వైద్య శిబిరాలను నిర్వహించారు. 244 తెల్ల పశువులకు, 174 గేదె జాతి పశువులకు టీకాలు వేసినట్లు డాక్టర్ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మయ్య, జేవీఓ విజయ, పశువైద్య సిబ్బంది తిరుపతయ్య, అమీర్, యాదగిరి, శాంతయ్య, గోపాలమిత్రలు, పలువురు రైతులు పాల్గొన్నారు. బల్మూర్: మండలంలోని రాంనగర్, గోపాలరావు నగర్, సీతారాంపురం గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. 418 పశువులకు టీకాలు వేశారు. రాంనగర్ సర్పంచ్ లక్ష్మీగోపాల్, బల్మూరు మండల పశువైద్యాధికారి డాక్టర్ అనిల్, డాక్టర్ మహేశ్వరి, పారా వెటర్నరీ సిబ్బంది కిషోర్, శ్రీమంజు, వెంకటయ్య, కరీం, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు. . -
నేడు సీతారాముల కల్యాణోత్సవం
శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వం తరుఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేడుకలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకకు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరం అయిన చోట టెంట్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. కల్యాణం మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది కూర్చునేలా, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్కు గట్టపై చదును చేశారు. వృద్ధులకు, మెట్ల నుంచి ఎక్కలేని వారి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ డేరం రామశర్మ చెప్పారు. -
సలేశ్వరం జాతరకు పటిష్ట ఏర్పాట్లు
● భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి.. జాతర ఏర్పాట్లు, ట్రెక్కింగ్ మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తారని, ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అడవిలో క్లిష్టమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, వైద్యశిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థవంతంగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా అటవీ మార్గాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని.. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఉండాలన్నారు. అదే విధంగా స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. జాతర సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా.. వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్లు అందుబాటులో ఉండాలన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ముఖ్య ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటుచేసి.. సమాచారం అందించేలా చూడాలన్నారు. పోలీస్శాఖ ద్వారా ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భంలో వెంటనే గుర్తించి.. కుటుంబ సభ్యులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సలేశ్వరం జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో తాగునీటి సరఫరాను విస్తరించడంతో పాటు చల్లని నీడ కల్పించే శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నల్లమల అడవిలో కఠినమైన ట్రెక్కింగ్ మార్గాలు, ఎత్తైన ప్రదేశాలు, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఉన్నందున గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భక్తులు జాతరకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. లేబర్ కోడ్లతో కార్మిక వ్యవస్థ విచ్ఛినం నాగర్కర్నూల్ రూరల్: కార్మిక వ్యవస్థను విచ్ఛినంచేసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ.. కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తుందన్నారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పర్వతాలు, రామయ్య, శంకర్నాయక్, శివవర్మ, దశరథం ఉన్నారు. 30న క్రీడా పాఠశాలలకు ఎంపిక పోటీలు కందనూలు: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థుల వయసు 8 నుంచి 9 ఏళ్లు ఉండాలని.. అర్హులైన వారు సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు. కంటిచూపుపై నిర్లక్ష్యం వద్దు నాగర్కర్నూల్ క్రైం: ప్రతి ఒక్కరూ కంటిచూపుపై నిర్లక్ష్యం వహించకుండా.. ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అంధత్వ ప్రోగ్రాం అధికారి డా.ప్రదీప్ సూచించారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత కలెక్టరేట్లో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. క్యాటరాక్ట్ పొర ఉన్న 41 మందిని శస్త్రచికిత్స నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్లో లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆప్తాలమిక్ అధికారి బాలాజీ, వైద్యసిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్రెడ్డి, నర్సింహ, చెన్నకేశవులు పాల్గొన్నారు. ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలి కందనూలు: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని హెచ్–82 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేయాలన్నారు. పీస్ రేట్ కార్మికులకు జీఓ నంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు, 327 యూనియన్ జిల్లా కార్యదర్శి లాలయ్య, 1104 యూనియన్ జిల్లా కార్యదర్శి నిరంజన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి
● తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి బిజినేపల్లి: ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని.. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యనభ్యసించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘బయో రిమిడియేషన్’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. మానవ కార్యకలాపాలతో భూ మండలంలో కాలుష్యం పెరిగి.. జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రస్తుత తరం బాధ్యత అని గుర్తుచేశారు. బయో రిమిడియేషన్ వంటి సాంకేతిక పద్ధతులు భవిష్యత్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ తరహా సెమినార్లు విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయన్నారు. కళాశాల ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాసీ్త్రయ చైతన్యం పెరగడం శుభసూచికమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.రాములు, గీతాంజలి, సుష్మ, శ్రీనివాసులు, మనోజ్కుమార్, రాధాకుమారి, స్వప్న, నాగలింగం, వెంకటేశ్, రమేశ్, ప్రవళిత, యాదగిరి, ప్రకాశ్, రాములు, నర్సింహ పాల్గొన్నారు. -
పారదర్శకంగా కేసుల విచారణ
నాగర్కర్నూల్ క్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశంలో పారదర్శకత ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లుతో కలిసి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. న్యాయస్థానంలో నేరస్తులకు శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టి.. బాధితులకు భరోసానివ్వాలని సూచించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు నగదు త్వరగా అందేలా చూడాలన్నారు. చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పెట్రోలింగ్ పెంచాలన్నారు. సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు సాయి వెంకట్రెడ్డి, బుర్రి శ్రీనివాస్ ఉన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ -
హజ్ యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డా.రవికుమార్ తెలిపారు. బుధవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో హజ్ యాత్రికులకు పలు పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధినిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. హజ్ యాత్రికులకు షుగర్, బీపీ, రక్త పరీక్షలు, ఎక్స్రే నిర్వహించడంతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్లచే పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారికి అవసరమైన వ్యాక్సిన్లు అందించి.. సురక్షితంగా యాత్ర సాగించేందుకు వైద్య చర్యలు తీసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షుడు ఫరీద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.సురేశ్బాబు, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డా.సూర్యనారాయణ, పీపీ యూనిట్ వైద్యాధికారి డా.సృజన పాల్గొన్నారు. -
రాజీ మార్గంతో సమయం ఆదా
● జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా జడ్జి రమాకాంత్ నాగర్కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని.. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్కు సంబంధించిన పోస్టర్ను న్యాయమూర్తి ఆవిష్కరించి మాట్లాడారు. 28న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్, కుటుంబ కేసులు, మోటారు వాహనాల కేసులు, బ్యాంకు కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో పాటు అప్పీల్ లేని తీర్పు పొందవచ్చన్నారు. తద్వారా ఇరువర్గాలకు న్యాయం చేకూరడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ.. కక్షిదారులు పగలు ప్రతీకారాలతో కాకుండా, రాజీ మార్గంతో మానవ సంబంధాలను బలపర్చుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కేసులను పరిష్కరించుకునేందుకు లోక్అదాలత్ గొప్ప అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
కందనూలు: జిల్లాకేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పుర చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి.. పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీలో మొత్తం 11వేల నివాసగృహాలు ఉండగా.. ఇప్పటివరకు 57శాతం పన్నులు వసూలైనట్లు తెలిపారు. మొత్తం రూ. 7 కోట్లకు గాను రూ. 4 కోట్ల ఇంటిపన్ను బకాయిలు వసూలు చేశామని.. ఈ నెల 31వ తేదీలోగా ఇంటి పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ బాదం రమేశ్, కమిషనర్ నాగిరెడ్డి ఉన్నారు. -
అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
● మహిళా సర్పంచులు నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కొల్లాపూర్ డివిజన్లోని 72 గ్రామాల సర్పంచులకు మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన నాలుగో విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచులు ముందుండి నాయకత్వం వహించాలని.. గ్రామ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంపొందించుకోవచ్చని అన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా పేదల అభ్యున్నతికి పాటుపడేలా పరిపాలన ఉండాలన్నారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యం కల్పించకుండా.. మహిళా సర్పంచులు తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. సర్పంచులు ప్రజలతో మమేకమై పారదర్శకంగా పాలన సాగించాలన్నారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తద్వారా ప్రజోపయోగ పనులు చేపట్టి.. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీపీఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కక్కుర్తి!
జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు బాలికలకూ అబార్షన్లు.. జిల్లాలోని ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులతో పాటు ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం ఆబర్షన్లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తమను ఆశ్రయిస్తున్న మైనర్ బాలికలకు గుట్టుచప్పుడు కాకుండా ఆబర్షన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కార్యకలాపాలపై నిఘా ఉంచడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే తప్ప స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ కరువు.. జిల్లావ్యాప్తంగా 38 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. గర్భంలో ఉన్న శిశువు కదలికలు, ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్కానింగ్ నిర్వహిస్తుంటారు. టీఫా స్కాన్ తదితర స్కానింగ్లకు రూ. 2 వేల నుంచి రూ. 3వేల వరకు తీసుకుంటున్నారు. అయితే కొన్ని సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ చట్టం – 2010 కింద ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, నర్సింగ్హోంల నిర్వహణ, కార్యకలాపాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఈ విషయంలో సంబంధిత అధికారులు ఉదాసీనంగా ఉన్నట్టుగా విమర్శలున్నాయి. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలతో పాటు గర్భస్త్రావ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గుట్టుగా నిర్ధారణ పరీక్ష చేసి.. ఆడ, మగ చెప్పేందుకు రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. శిశువు వద్దనుకుంటే నిబంధనలేవీ పట్టించుకోకుండా అబార్షన్లు సైతం నిర్వహిస్తున్నారు. ఇందుకు కనీసం రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు గాలికి.. లింగనిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ జిల్లాలోని పలుచోట్ల ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడుతూ బరితెగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై నిఘా ఉంచి, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొల్లాపూర్ పట్టణంలోని సాయికృప ఆస్పత్రిలో ఈ నెల 11న వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్త్రావం చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్, నర్సుతో పాటు మరో ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ.. అందిన కాడికి దండుకుంటున్నాయనడానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో గర్భస్త్రావ ఆపరేషన్లు కఠిన నిబంధనలు ఉన్నా జంకని వైనం ఇటీవల కొల్లాపూర్లో ఓ ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు -
క్షయ నిర్మూలనే లక్ష్యం
వెల్దండ: క్షయవ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.రవికుమార్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మంగళవారం వెల్దండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 86 హైరిస్క్ గ్రామాలను గుర్తించి.. జూలై 2వ తేదీ వరకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసే ప్రత్యేక శిబిరాల్లో 14 ఏళ్లు పైబడిన వారికి ఎక్స్రే, ఇతర పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి.. సంపూర్ణ చికిత్స అందించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అనంతరం పలువురికి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భీమానాయక్, మండల వైద్యాధికారి సింధు, డీపీఎంఓ ఆజాద్, సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడు, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ రాధ, సూపర్వైజర్లు మురళి, మనోజ్కుమార్, ప్రమోద్, లక్ష్మణ్, గోవర్ధన్ పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి కందనూలు: విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని డీఈ ఓ రమేష్కుమార్ అన్నా రు. మంగళవారం నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని దేశిటిక్యాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పాఠ్యాంశ సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. -
ఇసుక అక్రమ రవాణాను సహించం
కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరంలో ఇసుక అక్రమ తవ్వకం, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్లు అమరేందర్, జీవీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ ద్వారానే జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ బుకింగ్ అనుమతించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 15 రీచ్ల నుంచి ఇసుక తరలింపు పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే తరలించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇటీవల నంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను గుర్తించిన నేపథ్యంలో అలాంటి వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా నంబర్ ప్లేట్ లేకుండా ఇసుక వాహనాలు కనిపిస్తే.. వెంటనే వాటిని సీజ్ చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలను మరింత కఠినతరం చేయాలని.. రాత్రి వేళల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామని.. అవసరమైతే డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని.. గృహ అవసరాల కోసం ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా వివిధ శాఖల అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించడానికి మైనింగ్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ.. సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలు ప్రాంతాల నుంచి ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 9 ఫిర్యాదులు అందగా.. వాటిలో 5 తగు న్యాయం కోసం, 2 భూతగాదా, 2 కుటుంబ తగాదాపై ఉన్నాయని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా.. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకుసాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. -
అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి
కందనూలు: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యా దులను క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలన్నారు. కాగా, ప్రజావాణిలో 34 అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి
చారకొండ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పరిరక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ డిమాండ్ చేశారు. చారకొండ మండలం జూపల్లిలో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కొత్త చట్టం కూలీల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. కూలీలకు పనిదినాలను పెంచి.. రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న జూపల్లిలో నిర్వహించే మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ జగపతి అనూష, నాయకులు ఆంజనేయులు, నర్సింహ, బాలస్వామి, ఎస్.మల్లేష్, నాగరాజు, సైదులు, శివుడు, వెంకటయ్య, సత్యనారాయణ, మధు ఉన్నారు. ‘గణపసముద్రం’ పనులు అడ్డుకున్న రైతులు ఖిల్లాఘనపురం: గణసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన అన్నదాతలకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలంటూ ఆదివారం మండల రైతులు పనులు అడ్డుకున్నారు. పనులు చేపడుతున్నట్లు తెలుసుకున్న రైతులు ముంపు రైతుల కమిటీ అధ్యక్షుడు నల్లమద్ది రవీందర్రెడ్డికి తెలియజేశారు. ఆయన కొందరు రైతులతో కలిసి రిజర్వాయర్ దగ్గరకు చేరుకొని పనులు నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ పరిహారం వెంటనే చెల్లిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్పట్లో చెప్పారని.. రైతులు భూముల వివరాలు ఇవ్వడంతో పాటు సంతకాలు చేసి 8 నెలలు గడుస్తున్నా నేటికీ చెల్లించడం లేదని వివరించారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని, అప్పటి వరకు నిలిపివేయాలని కోరడంతో నిలిపివేశారు. -
‘గోకారం’ సామర్థ్యం తగ్గించండి
చారకొండ: డిండి – నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం వద్ద నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాను ముంపు ముప్పు నుంచి కాపాడాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి.. ఎర్రవల్లి, తండాను కాపాడాలని కోరుతూ రిలే నిరహార దీక్షలు చేపట్టి వంద రోజులు దాటినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ.. పార్లమెంట్ సమావేశాల అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సీఎంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో మాజీ వైస్ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు ప్రకాశ్, శ్రీరాములు, వెంకటేశ్, శేఖర్, పర్వతాలు, పెద్దయ్య ఉన్నారు. -
వేగంగా.. తగ్గుముఖం
కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్ వాటర్ లెవల్స్ ● శ్రీశైలం డ్యాంలో 837 అడుగుల ఎత్తులో నీటిమట్టం ● గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం ● వచ్చేనెలలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశం ● ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్ నీటి ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో కేఎల్ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. రోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 837 అడుగుల దిగువకు.. గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్లో బ్యాక్ వాటర్ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది. తేలిన పురాతన కట్టడాలు.. శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో పురాతనమైన సంగమేశ్వరాలయం బయటపడింది. ఈ నెలాఖరు నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా సోమశిల సమీపంలోని మసీదు, జటప్రోల్ సమీపంలో సురభి రాజుల కోట, పురాతన దర్గాలు కూడా తేలాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో వస్తుంటారు. సోమశిల సమీపంలో కృష్ణానదిలో బ్యాక్ వాటర్ మరో ఐదు టీఎంసీలు మాత్రమే.. శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. కేఎల్ఐ ద్వారా ఇప్పటివరకు 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మరో ఐదు టీఎంసీలు ఎత్తిపోసే వీలుంది. రోజూ ఎత్తిపోతలు చేపడుతుండటం వల్ల మోటార్లపై ప్రభావం పడుతోంది. రోజువారీగా చిన్నచిన్న మరమ్మతులు చేపడుతూ.. ఎత్తిపోతలు కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది త్వరగా ఎత్తిపోతలు నిలిచిపోతే.. వెంటనే పాడైన మోటార్లకు మరమ్మతు చేయాలని భావిస్తున్నాం. – లోకిలాల్ నాయక్, డీఈ, నీటిపారుదలశాఖ మోటార్లకు మరమ్మతు.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూ ర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని మిషన్ భగీరథకు మళ్లించి.. కేఎల్ఐ మోటార్లకు మరమ్మ తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మొక్కజొన్నను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, వైస్ చైర్మన్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద మత గురువు హఫీజ్అన్వరుల్హక్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అందరూ పయనించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్రకుమార్, వైస్ చైర్మన్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు భరోసా..
నేటినుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ ● మూడు విడతల్లో అందనున్న పెట్టుబడి సాయం ● ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్న ప్రభుత్వం ● జిల్లాలో 3.41 లక్షల మందికి ప్రయోజనం ● ఫ్రిబవరి 28 వరకు పాస్బుక్ పొందినవారు అర్హులు ●ఆనందంగా ఉంది.. రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు తమ ఖాతాల్లో ఆదివారం నుంచి జమ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొంత ఆలస్యమైనా డబ్బులు వేయడం సంతోషం. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులను తీర్చడానికి అవకాశం ఉంటుంది. – శివకుమార్, రైతు, పెద్దూరు, తెలకపల్లి మండలం అర్హులందరికీ జమవుతాయి.. అర్హులైన రైతులందరికీ ఆదివారం నుంచి రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా ఎకరం డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. కొత్త పాసు పుస్తకాలు పొందిన రైతులు ఏఈఓలకు వివరాలు అందజేయాలి. రైతులు ఖాతా నంబర్ మార్చుకోవాలన్నా, ఇతర సమస్యలున్నా వ్యవసాయాధికారులను సంప్రదించాలి. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయాధికారి కందనూలు/ అచ్చంపేట: యాసంగి రైతు భరోసాకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. గడిచిన వానాకాలంలో భూ విస్తీర్ణం ఆధారంగా తొమ్మిది విడతలుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించగా.. ఈసారి మూడు విడతల్లోనే జమ చేయనున్నారు. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున తొలి విడతలో ఎకరా వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రెండో విడత మరో 20 రోజులకు, మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన ఈ నిధులను చాలా ఆలస్యంగా పంటలు చేతికి వచ్చే దశలో ప్రభుత్వం అందిస్తోంది. వరుస ఎన్నికలు, నిధుల లేమితో ఆలస్యం కాగా.. ఇప్పటికై నా నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాగు భూములు కాకున్నా చాలామంది పెట్టుబడి సాయం పొందారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాగు భూముల లెక్క తేల్చారు. జిల్లాలో 142 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టగా జిల్లాలో 7,752 ఎకరాల భూమి అసలు సాగుకే పనికిరాదని, కొన్ని స్థలాల్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్, క్వారీలు, ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, మిల్లులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారాలు, రహదారులు, గోదాంలు, ఇళ్లు తదితరాలున్నట్లు గుర్తించారు. అలాగే పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యూటేషన్ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్లో వారి పేరే నమోదైంది. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యం కాని భూములకు చెందిన సర్వే నంబర్లతో విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్లో ఫ్రీజింగ్ చేశారు. కొత్త మార్గదర్శకాలు ఇలా.. ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు ఎకరాలోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమ అయ్యేవి. కానీ, ఈసారి ఎకరా కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా మొదటి విడతలో ముందుగా రూ.6 వేలు జమ చేయనుంది. అలాగే కొత్తగా పట్టా పాసుపుస్తకం వచ్చిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 28 వరకు పట్టా పాస్ బుక్లు పొందిన రైతులు ఏఈఓలకు పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను ఈ నెల 25 వరకు అందజేయాల్సి ఉంటుంది. ఆ భూములకు రాదు.. 8.30 లక్షల ఎకరాలు.. జిల్లాలో సాగుకు అనుకూలమైన భూములు 8.30 లక్షల ఎకరాలు ఉన్నాయి. అందులో జిల్లావ్యాప్తంగా గత సీజన్లో 3,00,698 మంది రైతులు రూ.415.23 కోట్ల రైతు భరోసా అందుకున్నారు. కాగా ఈ సీజన్లో 3,41,072 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వారికి ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.440,24,27,602 ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఎకరం నుంచి ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులు 3,14,946 మందికి గాను రూ.324.63 కోట్లు, 6 నుంచి 10 ఎకరాలలోపు ఉన్న 21,760 మందికి రూ.78.28 కోట్లు, 11 నుంచి 20 ఎకరాలు ఉన్న 2,865 మందికి రూ.26.28 కోట్లు, 21 ఎకరాల పైన ఉన్న రైతులు 1,501 మందికి రూ.11.32 కోట్లు వారి ఖాతాల్లో జమకానున్నాయి. -
రంజాన్కు ముస్తాబు
కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా రంజాన్ పర్వదినానికి ముస్తాబైంది. శనివారం ఈద్గా వద్దకు ముస్లింలు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, నీడ వసతి కల్పించారు. ఈద్గా పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గా -
ప్రత్యేక నిధుల్లేవ్..!
నాగర్కర్నూల్● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు ● మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతలకు పెద్దపీట ● ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే.. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
వెల్దండ: ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని చొక్కన్నపల్లి, బొల్లంపల్లి, గుండాల, కొట్ర తదితర గ్రామాల్లో వివిధ పనులను పరిశీలించారు. జాతీయ ఉపాధి హమీ పథకంలో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన గ్రీన్నెట్లను పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. తోటల నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం తదితర అంశాలను వివరించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. బొల్లంపల్లిలో జాతీయ ఉపాధి హామీ ఉపాధి పనులతో నిర్మించిన క్యాటిషెడ్ సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే నెలల్లో ప్రారంభించాలని అదేశించారు. పనులను నాణ్యతగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. గుండాల గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించారు. గ్రామస్తులకు ప్రభుత్వం అందిస్తున్న పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు ప్రసాద్గౌడు, శిరీష, శారద, డీఆర్డీఓ చిన్న ఓబులేష్, ఏపీడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ ఈశ్వర్జీ, ఈసీ దేవేందర్, టీఏ సత్యనారాయణ, కార్యదర్శులు గిరిగౌడు, అన్నపూర్ణ, భాస్కర్, వాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం
కందనూలు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అమరేందర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి పట్టించుకోకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అలాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని, వీధిదీపాల ఏర్పాటు, మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. సర్వారెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేసి పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్కు భూమి యాక్టివేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల నిర్వహణలో అలసత్వం వద్దు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పదో తరగతి పరీక్షలపై సీఎస్, డీఓ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులపై కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, సిబ్బంది ఎవరూ కూడా మొబైల్ వినియోగించరాదని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ను వాహనాల్లోనే జమ చేయాలని సూచించారు. క్లెరికల్ సిబ్బంది, రిలీవర్లు పరీక్ష పూర్తయ్యే వరకు సీఎస్ గదిని విడిచిపెట్టకూడదన్నారు. ప్రశ్నపత్రాలను పోలీస్స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకురావడం, అలాగే పరీక్ష అనంతరం కేంద్రం నుంచి పోస్టాఫీసుకు పంపే సమయంలో తప్పనిసరిగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు పాల్గొన్నారు. -
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి రాష్ట్ర బడ్జెట్లో సామాన్య ప్రజల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నారు. అయితే ఖర్చులో మాత్రం తేడా ఉంటోంది. ఎంత కేటాయించారన్నది కాకుండా ఎంత ఖర్చు చేశారో ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల కోసం సిద్ధం చేసిన డీపీఆర్లకు అనుగుణంగా సాగునీరు అందించాలి. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు అందించారు.. నీరు అందించకుండా పెండింగ్ ఉన్న భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. అంకెల గారడీ కాదు.. నీళ్లు కావాలి. – రాఘవాచారి, కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును విస్మరిస్తోంది. అన్ని మాయమాటలు, బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల సమీకరణ ఎలా చేపడుతారో అర్థం కావడం లేదు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతారు. హామీలేమో అంచనాలకు అందకుండా ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమవుతుందో వారే చెప్పాలి. – హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో పేదలకు ఒరిగేది ఏమీ లేదు. బడ్జెట్లో రైతు భరోసా, రైతు బీమా వంటి అంశాలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత కొరవడింది. వైద్య రంగానికి నిధులు తగ్గించడం బాధాకరం. విద్య, ఉపాధి అంశాలను పట్టించుకోలేదు. – ఫయాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ ● -
వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి
నాగర్కర్నూల్ రూరల్: అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను భారత్ రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద దేశంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల మూలంగా దేశ రైతాంగం బజార్లో పడే పరిస్థితి వచ్చిందన్నారు. దేశ రైతులు పండించే పంటలకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో ముప్పు ఉందని, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఫలితంగా అమెరికా దిగుమతులు దేశంలో పెరిగిపోయని, మన దేశంలో సోయాబిన్, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలన్నీ పండించే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. మన దేశం ఎగుమతి చేసే వస్తువులపై 18 శాతం పన్నులు వేస్తున్న అమెరికా ప్రభుత్వం తన దేశం దిగుమతి చేస్తున్న వస్తువులపై పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడం ద్వారా మన రైతాంగం పండించిన పంటలకు రేటు రాక అప్పుల పాలు కావడమే తప్ప మరో మార్గం లేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు శ్రీనివాస్, చింత ఆంజనేయులు, బి.ఆంజనేయులు, సభ్యులు రామయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఉగాది పండుగ
అచ్చంపేట/ కందనూలు: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను జిల్లావాసులు గురువారం వైభవంగా జరుపుకొన్నారు. శ్రీపరాభవసు నామ సంవత్సరం తీపి, చేదు అనుభవనాలను మరిచి ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామాల్లో వేకువజామునే చేలకు చేరిన అన్నదాతలు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త దుస్తులు ధరించి నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించారు. పండితులు పంచాగ శ్రవణాలు చదువుతూ జిల్లా భవిష్యత్ను వివరించడంతోపాటు ప్రజలు తమతమ రాశి ఫలాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఆలయాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. గ్రామాల్లో రైతులు వేకువజామునే పొలాలకు వెళ్లి అరక పూజలు చేసి.. నాగలి తోలి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గోవులను అలకరించి పూజలు చేసి పొలాల్లో ఐదుసార్లు నాగలిసాళ్లు పట్టించారు. ఇలా చేయడం వల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. చిరుధాన్యాలను పొలాల్లో చల్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టారు. వివిధ కులవృత్తుల వారు వస్తువులకు, పరికరాలకు పూజలు చేశారు. -
సమస్యల వాణి.. చెప్పుకొనే వేదికేది?
● ఎవరికి విన్నవించాలో తెలియని స్థితిలో సర్పంచ్లు ● గతంలో మూడు నెలలకోసారి మండల సభలు ● ప్రస్తుతం పాలకవర్గాలు లేకపోవడంతో అయోమయం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేవారు. ఫలితంగా ఆయా సమస్యలు కొద్దో గొప్పో పరిష్కారానికి నోచుకునేవి. కానీ, ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో మండల పాలకవర్గాలు లేవు. దీంతో గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి.. గతంలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతి మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనేవారు. అలాగే మండలంలో ప్రతి శాఖ అధికారి తమ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, ఉపాధి హామీ, పశుసంవర్ధక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో ఆయా గ్రామాల సర్పంచులు తమ సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలుగా మారేవి. ఎలా చెప్పాలి.. గడువు ముగిసిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే ఓ వేదిక అనేది లేదు. గతంలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించేవారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు లేకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. ఎన్నికై న సర్పంచులు కనీసం మండల స్థాయి అధికారులకు పరిచయం కూడా లేదు. మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. – రాఘవులు, సర్పంచ్, సిద్దాపూర్, అచ్చంపేట మండలం మండల పరిషత్ పాలకవర్గం ఎన్నికలు జరగకపోవడంతో గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మండల పరిషత్ ఉన్నట్టయితే ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం సమావేశం నిర్వహించేవారు. అలాంటి సమావేశంలో గ్రామ సమస్యలు ప్రస్తావించి పరిష్కరించుకునే అవకాశం ఉండేది. సర్పంచ్గా గెలిచినా గ్రామానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి గురించి ఎవరినీ అడగలేని పరిస్థితి నెలకొంది. – సాంబశివుడు, సర్పంచ్, మస్తీపురం, అమరచింత మండలం -
కుల వ్యవస్థ నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
తెలకపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రో యాక్టివ్ సీఎం అని, కుల వ్యవస్థ నిర్మూలనకే 200 ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని మల్లురవి అన్నారు. గురువారం ఆయన మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో పంచాంగ శ్రవణంలో పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు కొనసాగుతున్నాయన్నారు. దక్షిణ తెలంగాణలో కల్వకుర్తి నుంచి గద్వాల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు పాదయాత్ర చేస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ చేతకాని పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వే లైన్ కోసం బీజేపీ ఎంపీ డీకే అరుణ సహకరించాలని కోరారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని, వాయిదా వేస్తూ సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తెలుగు సంవత్సరం సందర్భంగా రాంరెడ్డిపల్లి గ్రామంలో పొలంలో నాగలి దున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు చిన్నజంగయ్య, చంద్రశేఖర్, వల్లభ్రెడ్డి, మనోహర్రెడ్డి, ధర్మరాజు, నిరంజన్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు
కందనూలు: జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా బాధ్యతలను అప్పగించింది. జిల్లా ఉపాధ్యక్షులుగా అనంతరెడ్డి, హరినారాయణగౌడ్, వెంకటస్వామి, మాధవరెడ్డి, రాముయాదవ్, జగదీశ్వరుడు, ప్రధాన కార్యదర్శులుగా బాల్రాంగౌడ్, పుల్జాల కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్రెడ్డి, నాగేశ్వర్రావు, రామలింగయ్యయాదవ్, వెంకట్రామరెడ్డి, వెంకటయ్యగౌడ్, రాంచంద్రారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటస్వామి, వేణుగోపాల్యాదవ్లను నియమించారు. అలాగే ట్రెజరర్గా రఘురాం, జిల్లా ప్రతినిధులుగా కపిలవాయి శేఖర్, శ్రీకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు, కార్యదర్శులుగా ఎడ్ల ఆనంద్, వెంకటేష్, మల్లయ్య, కట్టి ఈశ్వర్, కావలి శ్రీను, లింగారెడ్డి, మోతీలాల్, మహేశ్వర్రెడ్డి, వెంకటస్వామిలను నియమించారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ ఉండగా.. తాజా గా నియమించిన ఈ కమిటీతో జిల్లాలో పూర్తిస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లయ్యింది. ప్రభుత్వ విప్గా యెన్నం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికీ.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. -
హోటళ్లలో అధికారుల తనిఖీలు
తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్ఐ నరేష్, ఆర్ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు. -
తైబజార్ వేలం రూ.32 లక్షలు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, మున్సిపాలిటీ సూచించిన వాటికి అణుగుణంగా వేలం పాటలో దక్కించుకున్న వాటిని వసూళ్లు చేయాలని మున్సిపల్ చైర్మన్ రత్నమాల ఆనంద్కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రతి ఏటా నిర్వహించే పశువుల సంత, తైబజార్, వధశాల, మాంసపు వ్యర్థాల కొరకు నిర్వహించే వేలం పాటను వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్తో కలిసి నిర్వహించారు. ఈ ఏడాది వేలంలో తైబజార్ను సతీష్ కుమార్ రూ.32.01 లక్షలకు దక్కించుకోగా, గతేడాది రూ.25 లక్షలకు పోగా, రూ.7.01 లక్షలకు ఎక్కువ ఆదాయం మున్సిపాలిటీకి చేరింది. పలు మాంసపు వ్యర్థ్యాలకు గాను రూ.20.50 లక్షలు వేలం పాటలో మల్లేష్ దక్కించుకోగా, గతేడాది రూ.5లక్షలు మాత్రమే పోగా, మున్సిపాలిటీకి రూ.15 లక్షలు ఆదాయం ఎక్కువగా వచ్చింది. వధశాలకు గతేడాది ఎవ్వరికి వేలంలో పాల్గొగనకపోగా, ఈ ఏడాది శివాజీ రూ.1.5లక్షలకు దక్కించుకున్నారు. పశుశుల సంతకు గాను గతేడాది ఎవ్వరూ వేలానికి రాకపోగా మున్సిపాలిటీ సిబ్బంది నిర్వహించగా, ఈ ఏడాది సైతం ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వేలాన్ని వాయిదా వేసిన అధికారులు, తిరిగి పశువుల సంతకు వేలం పాటను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. వేలం పాటలో మున్సిపల్ రెగ్యులర్ సిబ్బంది నిలబడి, ఔట్సోర్సింగ్ సిబ్బంది కుర్చీలలో కూర్చొని ఉండటంపై మున్సిపల్ సిబ్బందే పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ప్రధాన అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యాలయంలో జోరుగా సాగుతున్న చర్చ బహిరంగ చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహామూద్ షేక్, మేనేజర్ రాజకుమారి, ఏఈ షబ్బీర్, మున్సిపల్ సిబ్బంది, వేలం పాట దారులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం
● కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి ● ఆర్జేడీ సోమిరెడ్డి తిమ్మాజిపేట: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధి కేంద్రాలుగా నిలిచాయని.. ఈ సంస్థలో పనిచేస్తున్న ఆధ్యాపకులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని ఆర్జేడీ ఎం.సోమిరెడ్డి అన్నారు. తిమ్మాజిపేట కేజీబీవీలో ఇటీవల ప్రత్యేకాధికారి, వర్కర్ల మధ్య తలెత్తిన విభేదాలు, తదుపరి పరిణామాలపై బుధవారం ఆయన సమగ్ర విచారణ చేపట్టారు. ముందుగా తరగతి గదుల్లో విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలతో పాటు బోధనా విధానం, ఉపాధ్యాయుల పనితీరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ వృత్తిపై నిబద్ధతతో వ్యహరిస్తూ.. విద్యార్థినులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యతతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడంలో అలసత్వం వహించొద్దన్నారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఓ సుజాతను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, విద్యాభివృద్ధిపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆర్జేడీ వెంట జీసీడీ శోభారాణి ఉన్నారు. -
ఉడిమిళ్లలో గుప్తనిధుల తవ్వకాలు
అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ వీరేష్గౌడ్ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేయనట్లు సమాచారం. ల్యాప్టాప్ అందజేత తాడూరు: మండలంలోని పర్వాతాయిపల్లికి చెందిన విద్యార్థిని సాంబ కవితకు బుధవారం ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ల్యాప్ట్యాప్ అందజేశారు. ప్రస్తుతం కవిత ఇబ్రహీపట్నంలో శ్రీగురుదత్త కళాశాలలో బీటెక్ చదువుతోంది. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
ఉగాది ఉషస్సు
నేడు తెలుగువారి పండుగ ● శ్రీపరాభ వ నామ సంవత్సరానికి స్వాగతం● ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు ● సాగు పనులకు శ్రీకారం చుట్టనున్న అన్నదాతలు అచ్చంపేట/కందనూలు: తెలుగువారి తొలి పండుగ ఉగాదిని గురువారం ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఆలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీవితంలో అన్ని అనుభూతులను షడ్రుచుల్లా ఆస్వాదించాలనే అంతరార్థంతో పచ్చడిని స్వీకరిస్తారు. సాయంత్రం వేళ వేద పడింతులు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాలను ప్రస్తావిస్తూ.. పంచాంగ పఠనం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కులవృత్తుల వారు తమ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా, ఉగాది పచ్చడికి అవసరమైన మట్టికుండలు, మామిడికాయలు, బెల్లం, వేపపూత, కొత్త చింతపండు, మామిడి తోరణాల విక్రయాలతో మార్కెట్లు రద్దీగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ కూడలి, కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, నల్లవెల్లి రోడ్డు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. -
వంటగ్యాస్ కొరత నివారించాలి
నాగర్కర్నూల్ రూరల్: దేశంలో నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు జిల్లా కార్యాలయం నుంచి ఖాళీ సిలిండర్ కుండతో ప్రదర్శనగా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ గ్యాస్ కొరతను నిరసిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా– ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారి దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడితే తాను విశ్వనాయకుడిని అని చెప్పుకొంటారు కానీ, మన పక్క దేశాల్లో యుద్ధం ద్వారా ఇక్కడ గ్యాస్ డీజిల్, పెట్రోల్ లాంటి వస్తువుల కొరత ఏర్పడుతుందని కనీసం ముందుచూపు లేకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. వీలైనంత త్వరగా వంట గ్యాస్ అందుబాటులోకి తీసుకురాకపోతే సీపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్జీ, చంద్రమౌలి, కృష్ణాజీ, లక్ష్మీపతి, ఖాజ, వెంకటయ్య, రవీందర్, రామస్వామి, బాలపీరు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన కొడంగల్
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక రెండో విడతలో కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి, చెరువుల సామర్థ్యం పెంపు వంటి పనులు చేపట్టనున్నారు. చివరి విడతలో విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, తదితర నిర్మాణ పనులు చేయనున్నారు. మొత్తంగా కొడంగల్ ఎత్తిపోతల కింద 10 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఆర్థిక భారం పెరగకుండా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న చెరువుల సామర్థ్యం పెంచి రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు ఊట్కూరు (మక్తల్), జాజాపూర్, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్, కొడంగల్, హస్నాబాద్, బొంరాస్పేట, లక్ష్మీపూర్, ఈర్లపల్లి (కొడంగల్). ● -
అక్షరాస్యత వందశాతానికి పెంపే లక్ష్యం
కందనూలు: జిల్లాలో అక్షరాస్యత వందశాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన మహిళలు, వయోజనులకు జిల్లాలో ఇది వరకు చదువు నేర్పిన మహిళలకు ఈ నెల 29న నిర్వహించే ప్రీఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్కు విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారిక విద్యకు దూరమైన 15 ఏళ్లు పైబడిన వయోజనులకు చదవడం, రాయడం, లెక్కలు, ప్రాథమిక జీవన నైపుణ్యాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. జిల్లాలో చదవడం, రాయడం నేర్చుకున్న నిరక్షరాస్య మహిళలు, వయోజనులు 25,313 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారని.. పరీక్షను జిల్లావ్యాప్తంగా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిరక్షరాస్యుల పరీక్షలకు అవసరమైన ప్రశ్నపత్రాలను ఈ నెల 27న జిల్లాలోని పాఠశాలలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీ ఓ చిన్న ఓబులేసు, జిల్లా వయోజన విద్యాఽ దికారి శ్రీనివాస్రెడ్డి, డీఈఓ రమేష్కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రాజేశ్వరి, సీఎంఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పైసల పంచాయితీ!
● మూడో విడతలోనూ రూ.35 కోట్లు విడుదల? ● గతంలో తాము ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలంటున్న కార్యదర్శలు ● నిర్వహణకే సరిపోవని మొండికేస్తున్న కొందరు సర్పంచ్లు అచ్చంపేట: పల్లెలకు పాలకవర్గాలు లేని సమయంలో పంచాయతీ కార్యదర్శలే అంతా తామై వ్యవహరించారు. చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ మొదలుకొని.. వీధిలైట్లు నిర్వహణ ఖర్చులు భరించారు. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన అనంతరం ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా జమయ్యాయి. గతంలో ఖర్చు చేసిన డబ్బులు కొందరు సర్పంచ్లు కొంత మేర కార్యదర్శులకు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో వారి నడుమ అంతర్గతంగా పంచాయితీ మొదలైంది. 22 నెలల పాటు.. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగియగా.. 2025 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించారు. సుమారు 22 నెలల పాటు గ్రామాలకు పాలకవర్గాలు కరువయ్యారు. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి చేతులు దులుపుకోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా సమావేశాలు, నిర్వహణ ఖర్చులు కార్యదర్శలే భరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతోపాటు 29 అంశాలకు సంబంధించిన పనులకు చిన్న గ్రామాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా పరిశ్రమలున్న గ్రామాల్లో ప్రతినెలా పన్నులు రాగా.. మిగతా చోట్ల కార్యదర్శలు అప్పులు చేసి రెండేళ్లపాటు నెట్టుకొట్చారు. రెండేళ్లు.. రూ.10 కోట్లు రెండేళ్లలో జిలావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శలు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కేంద్రం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రాష్ట్రానికి రూ.640 కోట్లు విడుదల చేయగా జిల్లాకు రూ.రూ.36.58 కోట్లకుపైగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా కేంద్రం మూడు రోజుల క్రితం 2024– 25 ఆర్థిక సంవత్సకానికి సంబంధించిన మొత్తం బకాయిల్లో రాష్ట్రానికి మరో రూ.640 కోట్లు విడుదల చేయగా.. పంచాయతీలకు సుమారు రూ.30– 35 కోట్ల నిధులు జమ కానున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సుమారు రూ.1,255 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. అయితే గతంలో తాము పెట్టిన డబ్బులు ఇవ్వాలని కార్యదర్శలు సర్పంచ్లను అడుగుతున్నారు. దీంతో కొందరు సర్పంచ్లు కొంత మేర ఇస్తుండగా, మరికొందరు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల మాటలు నమ్మి బయట అప్పు చేసి జీపీల నిర్వహణ నెట్టుకొస్తే.. ఇప్పుడు కొందరు సర్పంచ్లు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కార్యదర్శలు వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని తాము ఖర్చు చేసిన డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అలాగే కొందరు పాత సర్పంచ్లు సైతం తాము ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు విడతలుగా ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. అవసరాలను బట్టి వినియోగించుకుంటున్నారు. మూ డో విడత నిధులు కూడా వచ్చాయి. జీపీల్లో జమ కావాల్సి ఉంది. పాత బకాయిలు చెల్లించడంతోపాటు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి -
పకడ్బందీగా జనగణన : కలెక్టర్
కందనూలు: జిల్లాలో జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జనగణన–2027 ప్రక్రియలో భాగస్వాములయ్యే అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి విడత జిల్లాస్థాయి శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రెండు దశల్లో చేపట్టే జనగణన నమోదుకు తొలిసారిగా సాంకేతికత వినియోగిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో నివాసగృహాలతో పాటు అన్ని రకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని.. రెండో విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జనగణన జరపాల్సి ఉంటుందన్నారు. జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని కలెక్టర్ సూచించారు. ఏ ఒక్కరి వివరాలు ఎక్కడ కూడా బయటికి వెల్లడి కావన్నారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని.. అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. చార్జ్ ఆఫీసర్లు రోజూ జనగణన ప్రక్రియపై సమీక్షించాలని.. తాము కూడా క్షేత్రస్థాయి రోజువారీగా పర్యవేక్షణ చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువులోగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పూర్తిచేసేలా సన్నద్ధం చేయాలన్నారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. కాగా, ఈ నెల 17వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే శిక్షణ తరగతుల్లో జనగణనపై అధికారులకు మాస్టర్ ట్రైనర్లు బి.లాజర్, శివరామకృష్ణ, రాజేశ్వర్ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవ సహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు. -
అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలి
కొల్లాపూర్: పవిత్ర రంజాన్ మాసం ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని.. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని ఖాదర్పాషా దర్గా వద్ద ముస్లింలకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్కు మంత్రి జూపల్లి, కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు గంగా జమున తహజీబ్ స్ఫూర్తితో, పరస్పర గౌరవంతో కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు శరీర నియంత్రణ, సేవాభావం, సహనం వంటి అంశాలను నేర్పుతాయని అన్నారు. అంతకుముందు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భరత్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ షేక్ రహీంపాషా, జామె మసీదు కమిటీ అధ్యక్షుడు ఖాజా చావుష్తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. -
హైరానా..!
జూరాల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం స్థల మార్పిడి కారణంగా.. వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూ రాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొదలు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది. గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. భద్రతే.. ప్రధానం 2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు. అదనంగా మరొకటి.. ‘ఆర్అండ్బీ ఆధ్వర్యంలో గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తాము అభ్యంతరం చెప్పడం లేదు. కానీ, జూరాల డ్యాం సేఫ్టీకి అవసరమైన అదనంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడితే భవిష్యత్లో డ్యాంకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అదేవిధంగా ప్రస్తుతం గత 40 ఏళ్లుగా డ్యాంపై అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డ్యాం భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జూరాల డ్యాంకు సమీపంలో అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం అంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.’ డ్యాం స్టేఫీ ప్రధానమంటున్న ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి పైపెచ్చు ఆర్అండ్బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ ప్రభుత్వ నిర్ణయమే.. జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించి బ్రిడ్జి నిర్మాణం ఇతర అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేరకు డ్యాం సేఫ్టీకి సంబంధించి పూర్తి వివరాలతో ఇది వరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. – రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల మంత్రి సమీక్షలో చర్చ.. ఇటీవల ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. అయితే ఎంపీ డీకే అరుణ జూరాల ప్రాజెక్టు సేఫ్టీకి చర్యలు తీసుకోవాలని సమీక్షలో గట్టిగా కోరారు. ఇదే క్రమంలో ఇరిగేషన్ అధికారులు డ్యాం సేఫ్టీని మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని ఆదేశించగా.. ఆయన మూడు, నాలుగు రోజుల్లో జూరాలను సందర్శించనున్నట్లు తెలిసింది. -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్సీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే వివిధ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల వార్షిక ఆదాయం మినహాయింపు ఉంటుందని.. అర్హత కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్లతో tgobmms.cgg.gov. in వెబ్సైట్లో ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి ఒంటిపూట బడులు కందనూలు: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడు లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలను మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగనుంది. తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు సూచించారు. పెట్రోల్ కొరత కొల్లాపూర్: పట్టణంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. స్థానికంగా మూడు పెట్రోల్ బంకులు ఉండగా.. రెండు బంకుల్లో శనివారం రాత్రి నుంచే నో స్టాక్ బోర్డులు పెట్టారు. భార త్ పెట్రోల్ బంకులో మాత్రమే పెట్రోల్ పోస్తుండటంతో ఆ బంకు వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా పెట్రో ల్ ట్యాంకర్లు రావడం లేదని.. అందుకే నో స్టాక్ బోర్డు ఏర్పాటుచేసినట్లు బంకుల నిర్వాహకులు తెలిపారు. హామీలన్నీ నెరవేరుస్తాం వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్య క్రమంలో సర్పంచ్ బండారి రాములు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ పాల్గొన్నారు. మొబైల్ వాహనాలతో న్యాయ సేవలు పాలమూరు: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించడానికి రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు రొటేషన్ పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లీగల్ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు, జైలు సందర్శన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టాలపై అవగహన కల్పించడం, బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. టోల్ఫ్రీ నం.15100 ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. ఈ మొబైల్ వాహనాల్లో మొదటి క్యాబిన్లో కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, వెబ్ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, సీసీటీవీ, యూపీఎస్, రెండో క్యాబిన్లో జ్యుడీషియల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పీఎల్ఓలు, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు. -
రాయితీపై డ్రోన్లు
రైతులకు తీరనున్న పురుగు మందుల పిచికారీ వెతలు ● జిల్లాకు పది కేటాయింపు ● సహకార, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ● ఒక్కో యూనిట్కు రూ. 4లక్షల వరకు సబ్సిడీ కందనూలు: వ్యవసాయ పొలాల దుక్కితో మొదలుకొని.. పంట చేతికొచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం పెరిగింది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకచకా సాగడంతో పాటు కూలీల కొరత తీరుతోంది. ప్రధానంగా పంటల్లో చీడపీడల నివారణ కోసం పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగుకు అనుకూలమైన పంట పొలాలు 8.30 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అందులో పత్తి 2.95 లక్షలు, వరి 2.10లక్షలు, వేరుశనగ 1.05 లక్షల ఎకరాల్లో సాగుచేస్తుండగా.. మిగతా పొలాల్లో వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. నాగనూల్లో డ్రోన్ ద్వారా వరిపంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు (ఫైల్ ) తక్కువ ఖర్చు.. సమయం ఆదా వ్యవసాయ రంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లడం తేలిక. ఖర్చు తగ్గడంతో పాటు రైతులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. కూలీలతో పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా రైతు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమయం చాలా తీసుకుంటుంది. పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగించుకునేలా తయారు చేయడానికి అవకాశం కల్పించింది. జిల్లాకు పది కేటాయింపు.. పంటలకు పురుగు మందుల పిచికారీలో నూతన విధానానికి అనుగుణంగా డ్రోన్లు వినియోగించేలా అవసరమైన శిక్షణతో పాటు పరికరాలను రాయితీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో జిల్లాకు పది డ్రోన్లు కేటాయించింది. తర్వాత డిమాండ్కు అనుగుణంగా వాటి సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఒక్కో డ్రోన్ యూనిట్ వ్యయం రూ. 9.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి యూనిట్కు రూ.4 లక్ష లు రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తి దారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్వవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొనుగోలులో 40 శాతం రాయితీతో గరిష్టంగా రూ. 4లక్షల వరకు సబ్సిడీ అందజేయనున్నారు. కొనుగోలు చేసిన సంఘాల నుంచి రైతులు అద్దెకు తీసుకొని తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. -
విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
అచ్చంపేట రూరల్/లింగాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం లింగాల మండలం మాడాపూర్లో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాఠశాలల స్థానాల్లో కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. మాడాపూర్లో రూ. 30లక్షలతో పాఠశాల భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ సాబేరాబేగం, పంచాయతీ కార్యదర్శి లలిత, ఐకేపీ సీసీ రూప్సింగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు. ● అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో గ్యాస్ సరఫరాపై అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సేవాభావంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా రోజువారి పంపిణీ ప్రక్రియ, నిల్వ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై ప్రతిరోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఆస్పత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య దుకాణాల నుంచి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్డీఓ నర్సింహారావు, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, పెట్రోలియం సంస్థల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు విపత్కర పరిస్థితుల్లో సేవాభావంతో పనిచేయండి కలెక్టర్ బదావత్ సంతోష్ -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గరి నుంచి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542- 245633 నంబర్కు ఫోన్ చేయాలి● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి 1967 : పౌర సరఫరాల శాఖ సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు. జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
కమర్షియల్గా వినియోగిస్తే చర్యలు
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరా శాఖాధికారి నర్సింహారావు అన్నారు. శనివారం జిల్లాలోని వంగూరు మండలం తుమ్మలపల్లి శివారు యోగి రెస్టారెంట్లో ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లానాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను హోటల్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని అత్యవసర వస్తువుల చట్టం–1955 ప్రకారం హోటల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు నర్సింహారావు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో అవసరమైన డొమెస్టిక్ గ్యాస్ స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
‘ఎక్స్లెన్స్’ కేజీబీవీలు
జిల్లాలో మూడు కస్తూర్బా విద్యాలయాల ఎంపిక ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు షురూ ● ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల చేరికకు అవకాశం ● ఐఐటీ, నీట్, క్యాట్ తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ● రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ●అచ్చంపేట: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్లకు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్కు సంబంధించి విద్యార్థులకు ఐఐటీ, క్యాట్, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్తోపాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 20 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉండగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 6,222 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద నాగర్కర్నూల్, బిజినేపల్లి, వెల్దండ సీఓఈలను ఎంపిక చేశారు. కాగా.. నాగర్కర్నూల్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. బిజినేపల్లి కేజీబీవీలో క్యాట్కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. వెల్దండ కేజీబీవీలో నీట్ కోర్సుకు సంబంధించి శిక్షణ ఉంటుంది. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతోపాటు ఎన్సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అవసరమైన విషయ పరిజ్ఞాన నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఎక్స్లెన్స్కు ఎంపికై న వెల్దండ కస్తూర్బా విద్యాలయం జిల్లాలోని ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సోమవారం నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడువు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ పూర్తిచేసిన వారు అర్హులు. అయితే ఎంపికై న విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్ సెట్, లా సెట్ తదితర ఎంట్రైన్స్ కోచింగ్లతోపాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు. -
తరచుగా తనిఖీలు చేపట్టాలి..
వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట రైతుల నుంచి ప్రైవేటుగా పత్తి కొనుగోలు చేసే వ్యాపారులు కాంటాలను సక్రమంగా నిర్వహించడం లేదు. ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం ట్యాంపర్ చేసి తూకాల్లో తేడాతో రైతులను మోసగిస్తున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువగా కొనుగోలు చేయడంతోపాటు పంట బరువు తూకంలో మోసాలతో ఎక్కువగా నష్టపోతున్నాం. సంబంధిత అధికారులు స్పందించి కాంటాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలి. – అబ్దుల్ కలీం, కోమటికుంట, లింగాల మండలం తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – మోహన్ రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా ● -
‘పది’ పరీక్షలు ప్రారంభం
కందనూలు: జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,651 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారికోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు తెలుగు పరీక్ష జరగగా 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది (98.80 శాతం) హాజరవగా 21 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్కుమార్ తెలిపారు. అలాగే ఇది వరకు పరీక్షల్లో తప్పిన ప్రైవేట్ విద్యార్థులు 5 మందికి గాను నలుగురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు చెప్పారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సీఎన్ఆర్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద డీఈఓ రమేష్కుమార్ విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 34 పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. డీఈఓ పాలెం, నాగర్కర్నూల్లో రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి.. తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, ఇతర సదుపాయాలు, పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ పేర్కొన్నారు. మొదటిరోజు 98.80 శాతం హాజరు -
ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి
కందనూలు/అచ్చంపేట రూరల్/కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అందించే ఆహారంలో లోపాలను సరిచేసి.. నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలుపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజన అందడం లేదని గుర్తించడం జరిగిందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి హాస్టల్, పాఠశాలల్లో తప్పనిసరిగా సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగినేని శారద, అదనపు కలెక్టర్ అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవసహాయం, డీఆర్డీఓ చిన్నఓబులేషు ఉన్నారు. ● అంతకు ముందు అచ్చంపేట పట్టణంలోని రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, సివిల్సప్లయ్ గోదాంలను ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలించారు. నిబంధనలు పాటించని రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. కొందరు విద్యార్థినులు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ● కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ గురుకుల పాఠశాలలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్డు అందించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించగా.. శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఆహార సరుకులు, తదితర వస్తువులు ఉన్న గదులతో పాటు విద్యార్థులు ఉండే వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఉప్పునుంతల కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంతో పాటు బియ్యం, ఇతర సరకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించా రు. నిల్వ ఉన్న పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టులో పురుగులు ఉండటాన్ని గుర్తించిన వారు.. కేజీబీవీ ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులు భోజనం చేసే హాలులో ఇతర వస్తువులు ఉండటం.. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య లు తెలుసుకున్నారు. అ నంతరం స్థానిక సీహెచ్సీని తనిఖీ చేశారు. కా ర్యక్రమాల్లో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజశేఖర్, ఆర్డీఓ యాదగిరి, డీఈఓ రమేశ్కుమార్, తహసీల్దార్లు సునీత, సైదులు, ఏటీడీఓ ఫిరంగి, ఆర్ఐలు శివకుమా ర్, బాల్రాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, ఎంపీడీఓ రేవతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ● జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని సీఎన్ఆర్ పాఠశాల పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది అచ్చంపేట/కందనూలు/కల్వకుర్తి టౌన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ఇప్పటికే విద్యార్థులను అన్నివిధాలా సంసిద్ధం చేశారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 60 కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 10,683 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు గాను హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మీసేవ కేంద్రం లేదా 80969 58096 వాట్సప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ డిపార్డ్మెంట్ ఆఫీసర్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్స్, 517 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. అన్ని వసతుల ఏర్పాటు.. నిపుణుల సూచనలు.. పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశాంతంగా చదవడం ద్వారా అన్ని విషయాలు గుర్తుకు ఉంటాయి. గతంలో చదివిన వాటిని రివిజన్ చేయాలి కానీ.. కొత్తగా మరిన్ని విషయాలను చదివి కంగారు పడొద్దు. గతంలో తమ పాఠశాలలోనే పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఇతర పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తారు. ఈ క్రమంలో కొంత ఇబ్బందులు పడతారు. అనుకున్న మార్కులు వస్తాయో రావోనన్న భ యం కలుగుతుంది. ముందుగా విద్యార్థులు ఆ భయాన్ని వీడి పరీక్షలకు హాజరుకావాలి. ఏ అంశం నుంచి ప్రశ్నలు వచ్చినా రాస్తామనే ధీమా.. నమ్మకంతో ఉంటూ ఆందోళనను దూరం చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు. కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలే తప్ప.. చివరి నిమిషంలో హడావుడిగా కేంద్రానికి వెళ్లడం వల్ల ఒత్తిడి పెరిగి పరీక్ష సరిగ్గా రాయలేకపోతారు. ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకుండా.. సుమారు 10 నిమిషాలు చదివితేనే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నపత్రం చదివాక ముందుగా తెలిసిన వాటికి సమాధానాలు రాస్తే పరీక్షపై నమ్మకం వచ్చి.. మిగిలిన వాటికి సైతం మంచి జవాబులను రాసేందుకు ఆస్కారం ఉంటుంది. పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారుతుంది. ఈ సమయంలో పోషకాహారం, పండ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటే శరీరం పూర్తిగా రీచార్జ్ అవుతుంది. రాత్రిపూట కనీసం 6 గంటలకు పైగా నిద్ర తప్పనిసరి. పరీక్ష అనేది మీ మేధస్సుకు ఒక పరీక్ష మాత్రమే కానీ మీ జీవితానికి కాదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించవచ్చు. -
జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు
● కమర్షియల్కు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా చర్యలు ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో గృహ అవసరాలకు వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ వినియోగదారులకు అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ, సాగు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 2,50,277 ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల సమస్య లేదన్నారు. రానున్న రోజుల్లోనూ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమర్షియల్ వినియోగానికి డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా 4,11,002 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు సాగుచేశారని.. పంటలకు అవసరమైన సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్లో 72.4928 టీఎంసీల నీటినిల్వ ఉందన్నారు. రానున్న వేసవిలో తాగు, సాగునీటికి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి త్వరలో కోతలు ప్రారంభమవుతాయని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. -
పారదర్శకంగా భూముల రీసర్వే
● అతి పురాతనమైన జటప్రోల్ మదనగోపాలస్వామి ఆలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో రూ. 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో చేపట్టిన పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను త్వరగా పూర్తిచేసి.. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఈఓ జైపాల్, ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ రాజుకుమార్, గోవింద్గౌడ్, సర్పంచ్ చంద్రకళ, రామన్గౌడ్, భీంరెడ్డి, గోపినాయక్, గోపాల్, నాగిరెడ్డి ఉన్నారు. కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి: భూము ల రీసర్వే పారదర్శంగా నిర్వహించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో భూముల రీసర్వేపై పట్టాదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే, గత పాలకులు గ్రామంలో అశాంతి నెలకొల్పి.. దాడులను ప్రోత్సహించారని మంత్రి వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కొంతసేపు మంత్రి, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు మంత్రి జూపల్లి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నూతన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కాగా, మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు జీవనాధారంగా ఉన్న జీల్దార్ తిప్ప చెరువుకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించాలని గ్రామ సర్పంచ్ వరలక్ష్మి మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. శుద్ధమైన తాగునీటి సరఫరా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 9, 10 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులను పరిశీలించి, శుభ్రం చేయించారు. అనంతరం నల్లాలకు నీటిని వదిలారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేయాలని.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ షేక్ రహీంపాషా, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్ లహరి వేణుగోపాల్గౌడ్ ఉన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 5,721 మంది విద్యార్థులకు గాను 5,521 మంది హాజరయ్యారు. జనరల్లో 4,505 మందికి గాను 4,377 మంది, ఒకేషనల్ విభాగంలో 1,216 మందికి గాను 1,144 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్లో 128 మంది, ఒకేషనల్ విభాగంలో 72 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని, పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగిని సంఘంలో భాగస్వామిని చేస్తూ హక్కుల పోరాటంలో ఏకం చేయాలని పిలుపునిచ్చారు. డీఏ బకాయిలు ఏకకాలంలో అన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం తగదని, పెండింగ్ బకాయిల కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెన్షనర్ ఐడీలను కల్పిస్తూ, కంట్రిబ్యూషన్ లేని హెచ్ఎస్ను అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, రాఘవేంద్ర, వెంకటేష్ మల్లేశ్,రాజేష్, నరేష్, రాఘవేందర్ రావు, కర్నయ్య పాల్గొన్నారు. -
తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్
మన్ననూర్: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శుక్రవారం మన్ననూర్ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. స్వాగతం పలికిన నాగర్కర్నూల్ కలెక్టర్, ఎస్పీ -
నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బండ్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళల పాత్ర కీలకం నాగర్కర్నూల్ క్రైం: మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పోలీసుశాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. ప్రజల భద్రతకు విశేషంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.రవికుమార్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి కొల్లాపూర్: పట్టణంలోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆశావర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, ఆశావర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, రిటరైమెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని, పీఆర్సీ, ఎన్నికల డ్యూటీ డబ్బులు చెల్లించాలని, మెడికల్, క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి క్యాంపు కార్యాలయ అధికారి నాగరాజుకు అందజేశారు. కార్యక్రమంలో శివలీల, చెన్నమ్మ, గౌరమ్మ, నిర్మల, మమత, మంజులత, వకులాదేవి, సుజాత, ఉమాలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు. కుమ్మెర బాధితులకు రక్షణ కల్పించాలి నాగర్కర్నూల్ క్రైం: కుమ్మెర మల్లన్న జాతరలో దాడికి గురైన బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు స్వగ్రామంలో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. శుక్రవారం బాధితులతో కలిసి స్థానిక డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జా తరలో జరిగిన దాడిలో 8 మంది ఉండగా, ఇప్పటివరకు ఐదుగురిని మాత్రమే రిమాండ్ చేశారన్నారు. మిగతా వారిని పట్టుకోవడంలో పోలీసు ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించా రు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపే వరకు, బాధితులకు న్యా యం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నా రు. వారి వెంట సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్ కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీశ్రావణి ఉన్నారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 7,297 మందికి గాను 6,957 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,802 మందికి గాను 5,579 మంది, ఒకేషనల్లో 1,495 మందికి గాను 1,378 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 223 మంది, ఒకేషనల్లో 117 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ బుకింగ్ అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలోని వంగూరు మండలం జాజాల, ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లి గ్రామాల్లో పట్టా భూమిలో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను అధికారులు సమర్పించిన పర్యావరణ అనుమతుల ద్వారా ఇసుక రీచ్లను తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఇసుక తరలించేలా కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజల శాఖ అధికారి దివ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కంటిచూపును సంరక్షించుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: మానవ జీవిత కాలంపాటు ప్రతిఒక్కరూ కంటి చూపును వందశాతం సంరక్షించుకోవాలని నాగర్కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ అన్నారు. గ్లూకోమా నీటి కాసుల వ్యాధి వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్తాలమిక్ అధికారి మాట్లాడుతూ ప్రతిరోజు భోజనంలో విటమిన్ ఏ సంబంధిత ఆహారాన్ని ప్రతిఒక్కరు అధిక మొత్తంలో తీసుకోవాలని సూచించారు. ప్రతివ్యక్తి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని ఏవైనా సమస్యలు ఉంటే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ తూడుకుర్తి ఆస్పత్రి పాలనాధికారి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంపునకే టీకాలు పాన్గల్: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్, చింతకుంట సర్పంచ్ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
జోగుళాంబ హుండీ ఆదాయం రూ.99 లక్షలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని శ్రీజోగుళాంబదేవి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలను లెక్కించగా రూ.99,55,566 ఆదాయం సమకూరినట్లు ఈఓ దీప్తి తెలిపారు. అలాగే 28 గ్రాముల మిశ్రమ బంగారం, 298 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ కరెన్సీలైన యూఎస్డీ 39, ఫౌండ్స్ 10, ఓమన్ 100 బైసా హుండీల ద్వారా వచ్చినట్లు చెప్పారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీలను ఉగాది పండగ తర్వాత లెక్కించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన నగదును డీసీసీ బ్యాంక్లో జమ చేశామన్నారు. -
మద్దిమడుగు అంజన్న పాలకమండలి నియామకం
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి శ్రీఆంజనేయస్వామి దేవస్థానం పాలక మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు గురువారం పాలక మండలి చైర్మన్గా దేశావత్ రాములునాయక్, డైరెక్టర్లుగా బసిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నాగిరెడ్డి, పెద్ద కోటమ్మ, సుబ్బదాస్, శ్రీనివాసులు, శ్రీశైలం, హలరాజు, లింగయ్య, వెంకటయ్య, ప్రణీత, రాములు, లక్ష్మణ్బావోజీని నియమించగా.. మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ మదన్, ఈఓ నర్సింహులు పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములునాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టి కృషితో చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ, సిబ్బంది పరందామరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆషామాషీగా తీసుకోవద్దు
‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ నామమాత్రం కావొద్దు ● అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి ● పెండింగ్ పనులపై అధికారులే బాధ్యత వహించాలి ● కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ● 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, నాగర్కర్నూల్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులు, సర్పంచులు, మున్సిపాలిటీల పాలకవర్గాల సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఆషామాషీగా తీసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు. కార్యక్రమం అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. 99 రోజులపాటు ప్రధాన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలతో మమేకం కావాలి.. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ కార్యక్రమం మంచి అవకాశం అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకోవాలని, ప్రధానంగా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచిపేరు ఉంటుందని, భవిష్యత్లో ఎదుగుదలకు ఉపకరిస్తుందని చెప్పారు. ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం ప్రజలతో మమేకం కావాల్సిందేనన్నారు. తహసీల్దార్ స్థాయి అధికారులు సైతం ఉదయం పూట గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించాలి.. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యల పరిష్కారంపైనే అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రజల నుంచి ప్రతి దరఖాస్తును స్వీకరించి.. రసీదు ఇవ్వాలని, పెండింగ్ పనులు ఉంటే అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేకంగా శ్రద్ధవహించాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, కాలయాపన ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన సమస్యలకు నిధులు.. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కనీస అవసరాలకు తప్పనిసరిగా నిధులు కేటాయించాలని మంత్రి చెప్పారు. ముందుగా పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీరు, డ్రెయినేజీ పనులు చేపట్టిన తర్వాత మిగతా వాటికి నిధుల కేటాయించాలన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మరణాల్లో సగభాగం ప్రమాదాలు, తాగినడపడం, ఓవర్స్పీడ్ ద్వారానే జరుగుతున్నాయని, దీనిపై గ్రామస్థాయిలో ఇంటింటా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రైవేట్లో చదువు పేరిట భారీగా అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. వివాహం జరిగిన వారం రోజుల్లో కల్యాణలక్ష్మి కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసేలా చూడాలని, ఆతర్వాత 20 రోజుల్లో మంజూరయ్యేలా అధికారులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, మున్సిపల్ చైర్మన్లు సునేంద్ర, రత్నమాల, రెడ్డి జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద కీలకమైన 10 అంశాలను ఎంపిక చేసుకుని 99 రోజులపాటు అమలు చేసేలా పూర్తిస్థాయిలో ప్రజలను మమేకం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోవడం, సంక్షేమం, పిల్లల భద్రత– రక్షణ, రైతులు, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణం అంశాలు ఉన్నాయన్నారు. వీటిపై ఏప్రిల్ 2న గ్రామసభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా, జూన్ 2న రాష్ట్రస్థాయిలో ప్రగతి ప్రణాళిక సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల ప్రాంతానికే చెందిన సీఎం రేవంత్రెడ్డికి ఇక్కడి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఇటీవల సీఎం రేవంత్రెడ్డి రూ.15 కోట్లు కేటాయించారన్నారు. ప్రధానంగా సీసీరోడ్లు, మౌళిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ కాలంలో ప్రతీఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నాగర్కర్నూల్ పట్టణ అభివృద్ధికి రూ.55 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. -
బాలికలకు టీకా రక్షణ
●నాగర్కర్నూల్ క్రైం: ప్రస్తుతం మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సాధారణంగా మారింది. భారతదేశంలో మహిళలకు 40 ఏళ్ల తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతుండటంతో నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు క్యాన్సర్ను కట్టడి చేసేందుకు హెచ్పీవీ (హ్యుమన్ పాపిలోమా వైరస్) టీకాను అందించేందుకు నిర్ణయించింది. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్పీవీ వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించారు. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండోస్థానం ఆక్రమిస్తుండటంతో 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మహిళలకు భవిష్యత్లో కలిగే అస్వస్థలు, మరణాలను తగ్గించేందుకు వీలవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 4,297 మంది బాలికలు.. జిల్లాలోని 14 సంవత్సరాల బాలికల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. ఈ మేరకు జిల్లాలోని 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 14 సంవత్సరాల బాలికలు 4,297 మంది ఉన్నట్లు గుర్తించడంతోపాటు ఒక డోసు హెచ్పీవీ వ్యాక్సిన్ను వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రితోపాటు కల్వకుర్తి, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల సివిల్ ఆస్పత్రులు, కొల్లాపూర్, అచ్చంపేట ఏరియా ఆస్పత్రుల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 148 మంది బాలికలకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అయితే టీకా కోసం వచ్చే బాలికలు తప్పనిసరిగా ఆధార్కార్డుతోపాటు జనన ధ్రువప్రతం తీసుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ జిల్లాలోని 14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించారు. జిల్లాలోని 28 పీహెచ్సీల పరిధిలో ఉన్న ఐస్లైన్ రిఫ్రిజరేటర్లను అధికారులు తరుచూ తనిఖీ చేస్తూ వ్యాక్సిన్ ఎంతెంత ఉష్ణోగ్రత్తల మద్య భద్రపర్చాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా స్టోర్ నుంచి తరలించేందుకు అవసరమైన వ్యాక్సిన్ క్యారియర్లను, ఐస్ ప్యాక్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 148 మంది బాలికలకు పంపిణీ జనరల్, ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో అందుబాటులో.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల వచ్చే దుష్ప్రభావాలపై జిల్లాలోని 14 ఏళ్ల బాలికలు, తల్లిదండ్రులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పారంభమైతే 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. నాగర్కర్నూల్ను గర్భాశయ క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరికీ హెచ్పీవీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు. -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్వెస్లీ -
యువతకు కిడ్నీ గండం
పరీక్షలు చేసుకోవాలి.. కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నవారిలో మొదట లక్షణాలు నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో మారుతున్న జీవనశైలి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వేసవిలో అధికంగా డీహైడ్రేషన్ సమస్య ఉండటం వల్ల మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్ఓఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ రాజేష్, కిడ్నీ వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి
● లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, జెడ్పీ సీఈఓ దేవసహాయంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరైన ఇళ్లలో ప్రారంభమైన నిర్మాణాలు, అవి ఏ దశలో ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 తేదీ వరకు సంక్షేమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చివరి దశ నిర్మాణంలో ఉన్న 2,711 ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా 10,383 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 7,735 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని.. 2,648 ఇళ్ల నిర్మాణాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి.. లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను నేరుగా కలిసి.. వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. బేస్మెంట్ లెవల్ వరకు సకాలంలో పూర్తిచేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్ ఉన్నారు. -
టాప్ 10లో నిలుస్తాం
● చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ● మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ రమేశ్కుమార్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ అన్నారు. అందులో భాగంగానే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం డీఈఓతో ‘సాక్షి‘ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి విద్యార్థి రాణించేలా.. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తూ.. గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సమక్షంలోనే పేపర్లు దిద్ది.. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలియజేస్తున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నాం. గతేడాది మ్యాథ్స్, ఫిజిక్స్లో విద్యార్థులు రాణించలేకపోయారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్లో మంచి మార్కులు సాధించడం కోసం గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాం. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. ఈ ఏడాది ప్రతి పరీక్షకు రెండు నుంచి నాలుగు రోజుల సమయం ఉంది. పరీక్ష లేని రోజుల్లో ఏ సబ్జెక్టు టీచర్ ఆ రోజు విద్యార్థులను పాఠశాలలను రప్పించుకొని ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలని ఆదేశించాం. తద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో 13వ స్థానంలో నిలిచాం. ఈసారి కచ్చితంగా టాప్ 10లో సింగిల్ డిజిట్ సాధించడం కోసం కృషి చేస్తున్నాం. హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు.. జిల్లాలో ఈ ఏడాది 10,683 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 5,264 మంది, బాలికలు 5,394 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటుచేశాం. 517 మంది ఇన్విజిలేటర్లు, 60 మంది చొప్పున సీఎస్, డీఓలను నియమించాం. అదే విధంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటుచేశాం. మరో 36 మంది కస్టోడియన్ అధికారులను నియమించాం. సీసీ నిఘాలో పరీక్ష పేపర్ల సీల్ తీయాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. మాస్ కాపీయింగ్కు పాల్పడే విద్యార్థులు, ప్రోత్సహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. విద్యార్థులు పాఠశాలలతో సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఈ సారి ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించడం జరిగింది. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు తమవంతుగా సహకరించాలి. పరీక్షల సమయంలో పౌష్టికాహారం అందిస్తూ.. సరిపడా నిద్రపోయేలా చూడాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్తో పాటు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. -
రేపు ఉద్యోగమేళా
కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారికి అడ్డుకట్ట వేద్దాం కందనూలు: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీఐ శంకర్నాయక్ అన్నారు. నాగర్కరూ్న్ల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ, ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలతో భవిష్యత్ నాశనమవుతుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, రిసోర్స్పర్సన్లు తిరుపతయ్య, లక్ష్మీప్రసన్న, వెంకటయ్య, నార్కోటిక్ కానిస్టేబుల్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలి చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వేనం 182లో చేపట్టిన బ్లాక్ గ్రానైట్ తవ్వకాలను నిలిపివేసి.. వన్యప్రాణులను రక్షించాలని సిర్సనగండ్ల, శాంతిగూడెం గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం ఫారెస్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలతో పర్యావరణ దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు హాని చేకూరుతుందన్నారు. పశు సంపద, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు ● విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ● ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ స్టేషన్ మహబూబ్నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్తో సహా స్పీడ్వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు. -
ర్యాలంపాడుకు మోక్షం
ఎట్టకేలకు నిధులు.. ర్యాలంపాడు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు కేటాయింపు రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూముల మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు పలుమార్లు సర్వే.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ -
‘ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి’
పాన్గల్: ఉపాధి పనుల్లో ఆన్లైన్ మస్టర్ విధానాన్ని తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ కోరారు. స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా మంగళవారం సీపీఎం బృందం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులు ఖర్చుచేసే వారని.. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించేలా నిబంధనలు విధించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారీ కూలి రూ.600 చెల్లిస్తూ.. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. మరో బృందం పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో తెల్లరాళ్లపల్లి, కేతేపల్లిలో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆరా తీసింది. ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకునేందుకు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూర్యవంశం రాము, దేవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
నానో ఎరువులతో రైతులకు మేలు
తెలకపల్లి: నానో డీఏపీ, యూరియా వినియోగంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, డీఏఓ యశ్వంత్రావు అన్నారు. తెలకపల్లి సింగిల్విండో కార్యాలయంలో మంగళవారం నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నానో యూరియా, డీఏపీ వినియోగంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం, పెట్టుబడి తగ్గుతుందన్నారు. రైతులు నానో ఎరువుల వినియోగంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం సుస్థిర వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలను డీసీఓ రఘునాథరావు, డీహెచ్ఓ వెంకటేశ్వర్లు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ భాస్కర్రెడ్డి, సీఈఓ ధర్మవీర్, ఫీల్డ్ ఆఫీసర్ శివరాజు, హరినాథరావు పాల్గొన్నారు. -
చెంచుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
బల్మూర్/మన్ననూర్: చెంచుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి డా.రవికుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన్ననూర్, వటువర్లపల్లి పీహెచ్సీలతో పాటు బల్మూర్ మండలం చెంచుగూడెంలో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెంటల్, ఐ, గైనకాలజీ, చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యులు చెంచులకు సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. చెంచులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే సమయంలో 102 వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, చెంచుగూడెంలో 105 మందికి వైద్యపరీక్షలు, మరో 46 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్, ఫార్మసీ అధికారి శ్రీనివాసులు, డీపీఎంఓ మధుమోహన్, డిప్యూటీ మలేరియా అధికారి బిక్కులాల్, వైద్యులు సురేశ్బాబు, సుధాకర్, అభిలాష్, సూపర్వైజర్ వెంకటమ్మ, ఫార్మసిస్టు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే ఇసుక అనుమతులు
● జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం ఆన్లైన్లోనే అనుమతులు పొందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ, మైనింగ్శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ కలిగి మైనింగ్శాఖ వద్ద రిజిస్టర్ అయిన వాహనాల ద్వారానే ఇసుక రవాణాకు అనుమతించాలని ఆదేశించారు. జిల్లాలోని 18 ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లోడింగ్ చేయాలని సూచించారు. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలకు రూ. 20వేల వరకు జరిమానా విధించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ తహసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు. రేపు ప్రజాప్రతినిధులకు శిక్షణ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం విధి విధానాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు వీసీ ద్వారా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్హాల్లో 12న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, అమరేందర్, జెడ్పీ సిఈఓ దేవసహాయం పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 196 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించగా.. 6,059 మందికి గాను 5,863 మంది హాజరయ్యారు. జనరల్లో 4,659 మందికి గాను 4,525 మంది, ఒకేషనల్ విభాగంలో 1,400 మందికి గాను 1,338 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్లో 134 మంది, ఒకేషనల్ విభాగంలో 62 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ఉద్యోగుల భద్రతే లక్ష్యం అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల భద్రతే జెన్కో లక్ష్యమని సీఈ కేవీవీ సత్యనారాయణ అన్నారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఇతర ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఈ మాట్లాడారు. కేంద్రంలోని సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఇంజినీర్లు, ఉద్యోగులు సేఫ్టీ దుస్తులు ధరించడంతో పాటు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో ప్రమాదాలకు గురికాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సమావేశంలో ఎస్ఈలు ఆదినారాయణ, రవీంద్రకుమార్, డీఈ శ్రీకుమార్గౌడ్, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు అమ్రాబాద్: పంటల్లో తెగుళ్ల నివారణతో అధిక దిగుబడులు సాధించవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సత్తయ్య అన్నారు. మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం పాలెం ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం పర్యటించి ఆముదం, వేరుశనగ, కంది తదితర పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సదయ్య, సిద్దప్ప, ఈశ్వర్రెడ్డి, మాధురి పాల్గొన్నారు. -
భూ రికార్డులు పక్కా!
జిల్లాలో భూముల రీసర్వేకు శ్రీకారం ● పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు గ్రామాలు ఎంపిక ● అత్యాధునిక సాంకేతికత జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో భూముల సర్వే ● గ్రామసభల నిర్వహణలో రెవెన్యూశాఖ నిమగ్నం చిరిగిపోతున్న రికార్డులు.. రెవెన్యూ రికార్డులు చాలా వరకు శిథిలావస్థకు చేరి చిరిగిపోతున్నాయి. వందేళ్ల క్రితం నాటి రికార్డులు కావడంతో వాటిని పట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా తయారయ్యాయి. కొన్ని గ్రామాలకు అసలు గ్రామ నక్షలు లేవు. దీంతో భూ వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాల వారీగా భూముల రీసర్వే చేయడం ద్వారా ఆయా సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే ద్వారా డిజిటలైజ్ విలేజ్ మ్యాప్లు, కొత్త టీపన్లు, శేత్వార్లను రూపొందిస్తారు. సబ్ డివిజన్లు సైతం.. ఏదైనా ఒక సర్వే నంబర్లో భూమికి ఇప్పటి వరకు ఒకే రికార్డు అందుబాటులో ఉంది. ఆయా సర్వే నంబర్లో కొంత భాగం ఇతరులకు క్రయవిక్రమాలు జరుగుతుంటాయి. కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ మొత్తం ఒకే మ్యాప్గా ఉంటుంది. చాలా వరకు పెద్ద సర్వే నంబర్లలో సబ్ డివిజన్లు జరగలేదు. అలాగే పట్టాదారుకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వారసులు ఉండి.. పంచుకున్న భూమికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాప్లను తయారు చేస్తారు. అచ్చంపేట: భూముల రీసర్వేకు రెవెన్యూశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి, తిమ్మాజిపేట మండలం మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్, లింగాల మండలం అంబటిపల్లి గ్రామాల్లో భూముల రీసర్వే చేపడుతున్నారు. ఇందుకోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్శాఖ ఉద్యోగులతో పాటు, కొందరు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించారు. ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి.. రీసర్వేతో ఉపయోగాలను పట్టాదారులకు వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. -
14న ఉగాది కవి సమ్మేళనం
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం, బోల యాదయ్య రచించిన హార్ట్బీట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పాలమూరు నగరంలోని తెలంగాణ చౌర స్తా వద్ద ఉన్న రెడ్క్రాస్ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వి.మనోహర్రెడ్డి, బెక్కెం జనార్దన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


