breaking news
Nagarkurnool District Latest News
-
కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ..
మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2007, 2009లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్ (స్వతంత్ర అభ్యర్థి), 2015లో రాంచందర్రావు (బీజేపీ), 2021లో సురభి వాణీదేవి (బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్) గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈ స్థానంలో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పక్కా ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుస్తు కార్యాచరణతో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
రింగ్లో పంచ్.. మెడలో మెడల్స్!
● పంచ్ పవర్తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు ● బాక్సింగ్లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాక్సింగ్ రింగ్లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్లో శని, ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్షిప్కు ఎంపిక కాగా.. మహబూబ్నగర్కు చెందిన ఎం.రాజు, నాగర్కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్షిప్కు ఎంపికై ంది. భవిష్యత్లో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్నగర్ క్రీడలు -
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి
బల్మూర్/అమ్రాబాద్/మన్ననూరు/లింగాల: ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్మూర్ మండల కేంద్రంతో పాటులోని అనంతవరం, అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మన్ననూర్, లింగాల మండల కేంద్రంలో పర్యటించిన అదనపు కలెక్టర్ ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, బీఎల్ఓలతో ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫామ్–6 లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిశీలన తీరుపై ఆరా తీశారు. ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ శాతాన్ని పరిశీలించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నోటీసుల జారీ, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, వెంకటేశ్వర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు రాములు, కృష్ణాజీ, ఎస్ఐఆర్ సూపర్వైజర్ అఖిల్, ఏఆర్ఐ అనిల్, జీపీఓ భాస్కర్, బీఎల్ఓలు యశోద, రాణి, మాసమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
పాతాళానికి జలమట్టాలు
కేఎల్ఐ నీటితో.. స్థానికంగా ఆశించిన వర్షాలు లేకపోయినా ఇటీవల కేఎల్ఐ సాగునీరు విడుదల చేయడంతో రైతులు వరి సాగు చేశారు. కాల్వనీరు ఆగిపోతే వరి సాగు చేతికొచ్చేది కష్టమే. మరోపక్క రైతులు వేరుశనగ సాగు చేసేందుకు దుక్కులు సిద్ధం చేశారు. నైరుతి రుతుపవనాలకు మిగిలింది సెప్టెంబర్ నెలే. ఈ నెల సైతం వర్షాలు కష్టమేనని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో రైతులు పంట సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వర్షపాతంలో భారీ వ్యత్యాసం వర్షపాతంలో మండలాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పెద్దకొత్తపల్లి మండలంలో సాధారణ వర్షపాతం 348.1 మి.మీ. కాగా కేవలం 139.7 మి.మీ. నమోదై 60 శాతం లోటు ఏర్పడింది. కొల్లాపూర్లో 52, పదరలో 51, పెంట్లవెల్లిలో 51, అమ్రాబాద్లో 39 శాతం లోటు ఉంది. కల్వకుర్తి, తిమ్మాజిపేట, వెల్దండ, బిజినేపల్లి మండలాల్లో గణనీయమైన లోటు నమోదైంది. నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం జిల్లాను తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాల రీచార్జి కూడా మందగించింది. ఫలితంగా బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ఆందోళన మొదలైంది. ఇప్పటికే వర్షాలపై ఆధారపడి సాగుచేసిన పత్తి, జొన్న, కంది పంటలు వాడుముఖం పట్టాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోతున్నాయి. స్ప్రింక్లర్ల సహాయంతో కొందరు రైతులు నీరుపారిస్తూ పంట దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. 239.6 మి.మీ. వర్షపాతమే.. ●జిల్లాలో సాధారణం కంటే 28 శాతం తక్కువ వర్షపాతం, భూగర్భ జలమట్టం 7.17 మీటర్ల లోతుకు.. గతేడాదితో పోలిస్తే 3.72 మీటర్ల క్షీణత పెద్దకొత్తపల్లిలో 60 శాతం వర్షపాతం లోటు అమ్రాబాద్లో 12.05 మీటర్ల లోతుకు నీరు ఆందోళనలో అన్నదాత -
అచ్చంపేటను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
అచ్చంపేట రూరల్: సీఎం రేవంత్రెడ్డి సహకారంతో అచ్చంపేటను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని హాజీపూ ర్ చౌరస్తా నుంచి అచ్చంపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుచేస్తూ రేవంత్రెడ్డి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ బాకీ కార్డు చేత పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిపక్ష నాయకుల కంటికి కనపడుతలేవా..? అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనలో ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. -
పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం భూషణ అయ్యవార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జలాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో గ్రామానికి చెందిన టీ–శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోమవారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం అమ్మవారికి బోనాలు నిర్వహించనునట్లు తెలిపారు. -
ముమ్మరంగా ఎలివేటెడ్ కారిడార్
జాతర మైదానంలోని విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 10 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అమ్మాపురం సమీపం నుంచి కురుమూర్తి గుట్ట వెనుక భాగం మీదుగా ప్రధాన ఆలయం వరకు చేపడుతున్న ఘాట్రోడ్డు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రహదారిని చదును చేసి కంకర పరచారు. బీటీ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. -
పారదర్శకంగా ఎంపిక చేశాం..
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఎక్కడా లోపం జరగలేదు. ప్రతి విషయంలో పారదర్శకత పాటించాం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులు ఎంపిక చేశాం. – రమేష్కుమార్, డీఈఓ, నాగర్కర్నూల్ ఆన్లైన్ విధానంలో కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఉపాధ్యాయుల అభ్యసన సామర్థ్యాలను బట్టి అవార్డుకు ఎంపిక చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ విధానం, సంఘాల జోక్యం లేకుండా నిజమైన ఉపాధ్యాయుడుకి న్యాయం జరగాలి. – సుబ్బయ్య, బీసీటీఏ జిల్లా ఉపాధ్యక్షుడు -
రూ.110 కోట్లతో రూపురేఖల మార్పు
కురుమూర్తి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.110 కోట్లతో పలు పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం వద్ద మహామండపం, జాతర మైదానంలో కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రాజగోపురం వద్ద రేకుల షెడ్డు, కోనేరు సమీపంలో విడిది సత్రం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. మెట్ల కష్టాలకు చెక్ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి అమావాస్య, శని, సోమవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. అయితే వృద్ధులు, దివ్యాంగులు కొండపైకి మెట్లు ఎక్కలేక రాజగోపురం వద్ద నుంచే స్వామివారిని దర్శించుకుని వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఘాట్రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాల్లోనే ప్రధాన ఆలయం వరకు చేరుకునే అవకాశం కలగనుంది. దీంతో భక్తుల ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. -
చెంచుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: చెంచు కుటుంబాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పునరావస కాలనీలో సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారంలో రూ.4.50 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులకు శనివారం వారు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.15.87 కోట్లతో.. పెద్దకొత్తపల్లి మండలంలోని బండరావిపాకుల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జెడ్పీ రోడ్డు వరకు నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా 6.95 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.5.7 కోట్లు, పాన్గల్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బండపల్లి మీదుగా జమ్మాపూర్ వరకు 4.40 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.3.60 కోట్లు, వీపనగండ్ల మండలం కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట–బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.6.56 కోట్లతో చేపట్టనున్నారు. పెంట్లవెల్లి పీడబ్ల్యూడీ రోడ్ సింగోటం, చింతలపల్లి, ఎన్మన్బెట్ల గ్రామాల వరకు నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు, మాచినేనిపల్లి శివారులో 5.68 కోట్ల వ్యయంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ప్లాంట్ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.175 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేంత్చంద్ర, ఎఫ్డీఓ చంద్రప్రకాశ్ సింగల్, అదనపు కలెక్టర్ దేవసహయం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉచిత ప్రయాణం ఇవ్వడంపై ఓర్వలేకపోతున్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తే మహిళలు చెడిపోతున్నారంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, మహిళలను ఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో ‘ప్రభాతభేరి’ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని, ఇందుకు కొండా సురేఖ, చిన్నారెడ్డి ఉదంతాలే నిదర్శనమని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అన్నారు. సురేఖ, చిన్నారెడ్డి అంశంలో తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారికి నోటీసులు ఇచ్చాం. వివరణలు తీసుకున్నాం. వాటిపై పీసీసీ, క్రమశిక్షణ నివేదికలు ఏఐసీసీకి అందజేశాం. తర్వాతే వారిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. సభలో జూపల్లి అరుణ్, ఇందిరా శోభన్, హన్మంతునాయక్, కళ్యాణ్రావు, విద్యాసాగర్రావు, రెడ్డి జ్యోతిసత్యం, షేక్ రహీంపాష, పసుపుల నర్సింహ, దండు నర్సింహ తదితరులు ఉన్నారు. బాచారంలో చెంకు కుటుంబాల పునరావాసం నిర్మాణాలకు భూమిపూజ మహిళలకు రూ.175 కోట్ల రుణాల చెక్కులు అందజేత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు -
రేవంత్ సర్కార్కు గుణపాఠం తప్పదు
కందనూలు: వ్యవసాయానికి కరెంటు కట్ చేసి రైతులను కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డికి అధికారాన్ని కట్ చేసేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో కరెంటు కోతలపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్ నుంచి సబ్స్టేషన్ వరకు రైతులు, ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద గల సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల పాలిట శనిగా కాంగ్రెస్ సర్కార్ మారిందని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా.. నీటిని ఎత్తిపోయడానికి చేసిన నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతుల కొంప ముంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కరువు వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ముందే హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని మండిడ్డారు. కేఎల్ఐ మోటార్ల ప్రారంభంలో జాప్యం.. ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి ప్రతిరోజు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించాలని ఎంత చెప్పినా వినలేదు మాజీ మంత్రి ఆరోపించారు. కేఎల్ఐ ద్వారా 200 రోజులు మోటార్లు నడిపినా 40 టీఎంసీల నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని, కానీ ఆంధ్ర ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రతిరోజు 10 టీఎంసీల మేర నీటిని తరలించకుపోతుంటే రేవంత్ సర్కార్ కళ్లప్పగించి చూశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు 420 హామీల్లో ఒక్కటి సక్రమంగా నెరవేర్చక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 420 సీఎంగా నిలిచారని ఆరోపించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం ఇచ్చారు. -
జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
కందనూలు: జిల్లాలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబం, మోటారు వాహనాల ప్రమాదాలు, బ్యాంకు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. అనంతరం లోక్ అదాలత్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి నసీం సుల్తానా, జిల్లా లీగల్సెల్ అథారిటీ నిహారిక, గోపిక నాగశ్రావ్య, శృతిదూత పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ఉప్పునుంతల: విధులల్లో నిర్లక్ష్యం చేసే డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంఆండ్హెచ్ఓ) డాక్టర్ కృష్ణ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను ఆయన తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, మరోసారి ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్లు, సిబ్బంది విధులపై నిర్లక్ష్యం చేస్తున్నారని, అన్ని పరికరాలు ఉన్నా రోగులకు అవసరమైన పరీక్షలు చేయడం లేదని సర్పంచు సీహెచ్ శ్రీనివాసులు డీఎంఅండ్హెచ్ఓ దృష్టికి తెచ్చారు. సీహెచ్సీలో ఉన్న అన్ని రకాల టెస్టులను చేయాలని డాక్టర్లకు డీఎంహెచ్ఓ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్, సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డాక్టర్లు స్వప్న, బిక్కులాల్, జాన్సీ, శ్రీకాంత్, మోతీలాల్, సిబ్బది పాల్గొన్నారు. నల్లమల అందాలు తిలకించిన అడిషనల్ డీజీ కొల్లాపూర్: రాష్ట్ర అడిషనల్ డీజీ అభిలాష బిస్తీ శనివారం కొల్లాపూర్లో పర్యటించారు. ఆమె సోమశిలలో కృష్ణానది అందాలను తిలకించి సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఏకో పార్కును, వ్యూ పాయింట్ను తిలకించారు. వ్యూ పాయింట్ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉందన్నారు. ఆమె వెంట అటవీ ఉద్యోగులు నవీన్, నిరంజన్, గోపాల్, అక్బర్ తదితరులు ఉన్నారు. ఐటీడీఏ పీఓగా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా మన్ననూర్: స్థానికంగా నిర్వహణలో ఉన్న సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి (పీఓ)గా నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా బాధ్యతలు స్వీకరించారు. శనివారం కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఐటీడీఏ ఏఓ జాఫర్ హుసేన్తో పాటు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు తీసుకున్న ఛాబ్రా పెండింగ్లో ఉన్న కొన్ని ఫైళ్లపై సంతకం చేశారు. సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకోవాలి అచ్చంపేట రూరల్: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అన్నారు. శనివారం పట్టణంలోని ఏయూపీఎస్లో సామాజిక సేవా కార్యకర్త సాదె రాజు సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ క్లా స్రూం, ఆర్ఓ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. -
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
విద్యార్థుల ఆకలి తీరుస్తూ.. ● ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులు ● వినూత్నంగా బోధనతో విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు ● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి ● జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం కోడేరు మండలంలోని రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నాగిళ్ల శ్రీశైలం. పాఠశాల విద్యలో 26 ఏళ్లుగా విద్యను బోధిస్తూ తరగతి గదిలో జ్ఞాన ప్రసారం కాదు జ్ఞాన నిర్మాణం జరగాలనే ఆలోచనతో.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని రూపొందించారు. వీటి ఆధారంగా గత రెండేళ్లుగా విద్యార్థులకు ప్రదర్శన చేస్తూ జిల్లాలో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచారు. బోధన బొమ్మలాటలో భాగంగా లింగ సమానత్వంపై ప్రదర్శన చేసి రాష్ట్రంలో జిల్లాకు రెండో బహుమతి సాధించారు. దీక్ష పోర్టల్లో ఈ కాంటెంట్ క్రియేటర్గా ప్రాథమిక స్థాయి పరిసరాల విజ్ఞానంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు రూపొందించిన వీడియోలు ప్రస్తుత ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ రూపంలో అందుబోటులో ఉన్నాయి. వంగూరు మండలంలోని తుమ్మలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రెండేళ్లుగా ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందిస్తూ.. విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు ఉపాధ్యాయుడు కోటేశ్వర్రావు. ఈయన 2024లో పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 32 మంది విద్యార్థులు ఉండగా.. హెచ్ఎం సైదులు, ఉపాధ్యాయులు సునీత, కవితతో కలిసి పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతూ 78 మంది విద్యార్థులను చేర్పించారు. అలాగే గ్రామ యువకులు, దాతల సహాయంతో పాఠశాలలో విద్యావలంటీర్ను ఏర్పాటు చేసి సాయంత్రం 5.30 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ బోధన అందిస్తున్నారు. గతేడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై స్ఫూర్తిగా నిలిచారు. – కందనూలు/ అచ్చంపేట -
ఆహ్లాదకర వాతావరణంలో..
దాతల సహకారంతో... తెలకపల్లి మండలంలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలకు 2024లో బదిలీలో భాగంగా హెచ్ఎం మల్లేష్ వచ్చినప్పుడు 38 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. గ్రామస్తుల సహకారంతో ఏటా విద్యార్థుల పెంచుతున్నారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ.. పాఠశాల విద్యార్థుల గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గ్రామస్తులు రూ.50 వేలు, తన సొంత డబ్బులు రూ.48 వేలతో పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలు, బోధనోపకరణాలకు వెచ్చించారు. ప్రస్తుతం పాఠశాలలో ముగ్గురు టీచర్లు, 66 మంది విద్యార్థులు.. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల కొనసాగుతోంది. ఐతోల్ ప్రాథమిక పాఠశాలశిథిలావస్థలో ఉన్న బడిని తన ఆలోచన, గ్రామపెద్దలు కంకణాల కృష్ణారెడ్డి, వారి సోదరులు, అందుగుల నాగేందర్రావు, వీరారెడ్డి, రమేష్గౌడ్ సహకారంతో రూ.25 లక్షలు వెచ్చించి నూతన పాఠశాలగా తీర్చిదిద్దారు తాడూరు మండలంలోని ఐతోల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వీరేష్. తాను పాఠశాలకు వచ్చినప్పుడు 22 మంది విద్యార్థులతో కొనసాగిన బడిని ప్రస్తుతం 44 మందితో విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ వారిని తన ఆలోచనకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ.. ప్రసంశలు అందుకుంటున్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట
కోస్గి/కోస్గి రూరల్: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. శుక్రవారం సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి.. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 2.53 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దోరెపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో బయలుదేరిన సీఎం ముందుగా రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించడంతోపాటు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలతోపాటు 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. రానున్న మార్చిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చింతల్దిండి రోడ్డులో రూ.30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గురుకుల పాఠశాల, కళాశాలలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన సందర్భంగా పట్టణంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెక్రెటరీ శ్రీధర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, డీఆర్ఓ రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్కుమార్, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్పర్సన్ భాగ్యశ్రీ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాలయ్య, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిపర్యటన సాగింది ఇలా.. 2.53 గంటలకు మద్దూరు మున్సిపల్ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర సీఎం రేవంత్రెడ్డితో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వచ్చారు. 2.56 గంటలకు పేట కలెక్టర్ ప్రియాంక ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 3.00 గంటలకు సీఎం కాన్వాయ్లో డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సీఎం భవన నిర్మాణ పనులను పరీశీలించారు. 3.25 గంటలకు స్థానిక పాత బస్టాండ్ ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సమీప కాలనీలోని మహిళలతో మాట్లాడారు. 3.45 గంటలకు గురుకుల కళాశాల నుంచి బయలుదేరి.. నారాయణపేట– కోస్గి ప్రధాన రహదారిపై ఇరువైపులా నిల్చున్న ప్రజలకు కారు డోర్లో నిలబడి అభివాదం చేస్తూ హెలీప్యాడ్కు చేరుకున్నారు. 4.00 గంటలకు సీఎం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి హెలిక్యాప్టర్లో కూర్చున్నారు. 4.08 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్బాద్కు హెలిక్యాప్టర్ బయలుదేరి వెళ్లింది. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చిలోగా పూర్తిచేయాలి మద్దూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 1.15 గంటలు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు -
విద్యార్థుల సంఖ్య పెంచి..
అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భరత్గౌడ్ కృషితో గతంలో 25 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 39 మంది చదువుకుంటున్నారు. డ్రాపౌట్ ఎక్కువ ఉన్న ఈ పాఠశాలలో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషిచేశారు. తెలుగు మీడియం అయినప్పటికీ విద్యార్థులకు ఆంగ్ల బోధన చేస్తుండటంతో కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తున్న తమ పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించారు. అలాగే పాఠశాల నిధులతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడమే కాకుండా గోడలపై తెలుగు, ఆంగ్లం పదాలు రాయించారు. -
యథేచ్ఛగా ఆక్రమణ.. నిర్మాణాలు!
కల్వకుర్తి టౌన్: పట్టణంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన మున్సిపల్ స్థలాలు, జాతీయ రహదారి ఆస్తులు, బఫర్జోన్ల విషయంలో నిబంధనలు అమలవుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవరకొండ రోడ్డులోని ఓ వెంచర్ పరిధిలో ఇంటి నిర్మాణం పేరుతో జాతీయ రహదారి వెంట ఉన్న రక్షణ గ్రిల్ తొలగించడంతో పాటు కోల్బావి బఫర్జోన్ వద్ద రక్షణ గోడ కూల్చివేయడం, రోడ్డు స్థలంలో బేస్మెంట్ వేసి రేకుల షెడ్డు నిర్మించినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్థలంలో ఆక్రమణలు.. కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో సర్వే నంబర్ 99/3లో వెంచర్ ఏర్పాటు చేసి మొత్తం 38 ప్లాట్లు వేశారు. నిబంధనల ప్రకారం వెంచర్లో 10 శాతం స్థలాన్ని, సుమారు 757 గజాలను గ్రామపంచాయతీ అవసరాల కోసం కేటాయించినట్లు రికార్డులు, స్థానికులు చెబుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ భూమి మున్సిపాలిటీకి చెందినదేనని అప్పటి కమిషనర్ సాబేర్అలీ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ అదే స్థలానికి కొత్త లేఔట్ రూపొందించి, కొత్త బై నంబర్లు కేటాయించి ప్రైవేటు వ్యక్తుల పేర్లతో చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్లాట్కు 160 గజాల స్థలం ఉండగా.. సంబంధిత డాక్యుమెంట్లో మాత్రం 225 గజాలు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అదనంగా చూపిన 65 గజాలు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం 757 గజాల్లో ప్రస్తుతం సుమారు 200 గజాల వరకు మాత్రమే ఖాళీగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి గ్రిల్ను తొలగించి చేపడుతున్న ఇంటి నిర్మాణం ఈ ఫొటోలో కనిపిస్తున్న షెడ్డు మున్సి పాలిటీ స్థలంలో ఏర్పాటు చేసింది. షెడ్డు నిర్మాణం చేసి, పక్కనే ఉన్న కోల్బావి కాల్వ బఫర్ జోన్ గోడ కూల్చి చదును చేసినా టౌన్ప్లానింగ్ అధికారులకు కనపడలేదు. జాతీయ రహదారి గ్రిల్ తొలగించి కోల్బావి బఫర్జోన్ గోడ ధ్వంసం మున్సిపల్ రోడ్డు స్థలంలో షెడ్డు నిర్మాణం సామాన్యుడికి మాత్రం ఎక్కడా లేని నిబంధనలు.. ప్రభుత్వ ఆస్తులపై అధికారుల ఉదాసీనత జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన గ్రిల్ను తొలగించడం పెద్ద తప్పిదం. గ్రిల్ తొలగించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతాం. – కౌశిక్, ఏఈఈ, ఎన్హెచ్ దేవరకొండ రోడ్డులో నిర్మిస్తున్న ఇంటిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. మరోసారి స్థలాన్ని పరిశీలించి ఏవైనా ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వెంటనే నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలు వెంటనే తొలగిస్తాం. – తనూజ, టౌన్ప్లానర్, కల్వకుర్తి మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని ఈ భూమి వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. లోకాయుక్తలో కేసు నం.4291/2013/ఆ1 నమోదై ఉండగా.. హైకోర్టులో 38268/2022, 33952/2023 కేసులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. భూమి హక్కులు, యాజమాన్యం, ప్రజాస్థల పరిరక్షణకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు సైతం తమ ఆస్తి హక్కులు, ప్రజా స్థల పరిరక్షణకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. సామాన్యుడు ఇంటి నిర్మాణంలో చిన్నపాటి నిబంధన ఉల్లంఘించినా నోటీసులు, జరిమానాలు, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకునే అధికారులు.. ప్రభుత్వ ఆస్తుల విషయంలో మాత్రం ఎందుకు అదేస్థాయిలో స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
పాంపాండ్ పనులు వేగవంతం చేయాలి
ఉప్పునుంతల: గ్రామైక్య మహిళా సంఘాలకు మంజూరు చేసిన వ్యవసాయ పొలాల్లో పాంపాండ్ (నీటి నిల్వ కుంట)ల పనులు వేగవంతం చేసి నిర్ధేశించి లక్ష్యం మేరకు పూర్తిచేయాలని డీఆర్డీఓ చిన్న ఓబులేసు అన్నారు. మంగళవారం మండలంలోని అయ్యవారిపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫాంపాండ్ పనులను డీఆర్డీఓ పరిశీలించారు. మండలంలో 15 గ్రామైక్య మహిళా సంఘాలకు ఒక్కో గ్రామైక్య సంఘానికి రెండేసి చొప్పున మంజూరైన 30 ఫాంపాండ్లను త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీఓ వరుణ్తేజ, ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడుకు సూచించారు. అలాగే కూలీల సంఖ్య పెంచాలని, ఇప్పటికీ ప్రారంభించని గ్రామైక్య మహిళా సంఘాల మహిళలకు పాంపాండ్ల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు జగత్రెడ్డి, ఈసీ కుర్మారెడ్డి, టీఏ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ కుట్టు మిషన్లు
● వందశాతం సబ్సిడీపై రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ మిషన్లు ● 18 నుంచి 55 ఏళ్లలోపు బీసీ మహిళలు అర్హులు ● జిల్లాలో ఇప్పటికే 2,492 మంది దరఖాస్తు ● ఈ నెల 15 వరకు గడువు అచ్చంపేట: నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్లో నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటింటా ఇందిరమ్మ పథకం పేరుతో ఉచితంగా ఆటోమేటిక్ కుట్టమిషన్ల అందించాలని నిర్ణయించింది. మహిళలకు టైలరింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. నియోజకవర్గానికి వెయ్యి.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తొలి విడతగా పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టు మిషన్ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 4 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. భవిష్యత్లో పథకాన్ని విస్తరించి ప్రతీ ఒక్కొరికి అందించేలా రూపకల్పన చేస్తున్నారు. వారు అనర్హులు.. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగి ఉండి.. తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలై ఉండాలి. మహిళలు ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్ష లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఉచిత కుట్టుమిషన్ పథకాన్ని వర్తింపజేస్తారు. అర్హులైన వారు http//tgobmms@ogg.gov.in పోర్టల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, కలెక్టర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023– 24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. పేదలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలతోపాటు మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది. కనీస విద్యార్హత ఉండాలి.. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. దరఖాస్తులు ఎక్కువ వస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస విద్యార్హత 5వ తరగతిగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, అర్హత పత్రాలను అప్లోడ్ చేసి.. పత్రాలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. నిబంధనల మేరకే.. అర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు ఈ నెల 15 వరకు కుట్టు మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 2,492 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం. గతంలో లబ్ధిపొందిన వారు అనర్హులు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, నిరుద్యోగ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. – ఇందిర, జిల్లా బీసీ సంక్షేమ అధికారి -
జాక్పాట్ కొట్టి.. సర్కారుకు ఎగ్గొట్టి!
సర్కారు సీరియస్ 2022– 23 రబీ సీజన్లో తమకు అదనంగా సీఎమ్మార్ ధాన్యం కట్టబెట్టారని.. అకాల వర్షాలతో తడిచి పాడైందంటూ మిల్లర్లు ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు కట్టాల్సిందేనంటూ స్పష్టం చేసినప్పటికీ.. కొందరు మిల్లర్లు అదే ఎత్తుగడతో ముందుకు సాగుతుండడం పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే జిల్లాలు, మిల్లర్ల వారీగా చిట్టా తెప్పించుకొంటుండగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. కేసుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు మిల్లర్లు భయంతో హైదరాబాద్లోనే మకాం వేసి.. పైరవీలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా.. తనిఖీలు ఆపాలని మరికొందరు మంత్రులు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఆ మిల్లుపై ఎనలేని ప్రేమ.. ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ బృందాలు ఇటీవల వరుసగా 14కిపైగా మిల్లులను జల్లెడ పట్టి దాదాపు రూ.245.10 కోట్ల అక్రమాలను బహిర్గతం చేశాయి. నవాబుపేట తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్మిల్లు, మహబూబ్నగర్, వనపర్తి, ఖిల్లాఘనపురం, పెబ్బేరు, కొత్తకోట, కేటీదొడ్డి తదితర ప్రాంతాల్లో నిల్వ వ్యత్యాసాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే హన్వాడ మండలం ఇబ్రహీంబాద్లోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్ మిల్లులో 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మె.ట., (1,26,772 బస్తాలు) ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలగా.. సదరు మిల్లు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీనిపై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని సంప్రదిస్తే ‘కేసు చేస్తే రికవరీ చేయలేం కదా’ అని చెప్పారు. మిగతా జిల్లాల్లో కేసులు చేశారు కదా అంటే నేరుగా సమాధానమివ్వకుండా దాటవేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రబీ సీజన్ 2022–23లో వేలం వేసిన సీఎమ్మార్ ధాన్యంలో అక్రమాలు నివ్వెరపరుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో రూ.వెయ్యి కోట్లకు పైగా సర్కారు పెట్టుబడిని రైస్ మిల్లర్లు పక్కా పథకం ప్రకారమే అప్పనంగా కాజేశారు. రూ.కోట్లు విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ఫోర్స్ బృందాల తనిఖీల్లో బట్టబయలు కాగా.. ఈ బాగోతం వెనుక ఎవరెవరున్నారనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ దందాలో సూత్రధారులు, పాత్రదారులపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా కూపీ లాగుతుండగా.. మరిన్ని కోణాలతోపాటు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మామూళ్లతో కట్టిపడేసి.. 2022– 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఆయా జిల్లాల్లో అసోసియేషన్ పేరిట మిల్లర్లందరూ కుమ్మకై ్క ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. సివిల్ సప్లయ్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని మామూళ్లతో మచ్చిక చేసుకొని.. దందా సాగించినట్లు తెలుస్తోంది. ముందుగా తమకు కేటాయించిన ధాన్యంలో కొంతమేర పాడై పోయేలా చేసిన మిల్లుల నిర్వాహకులు.. త్రిముఖ వ్యూహంతో నాటకాలకు తెరలేపారు. స్థిరాస్తుల కొనుగోలు.. మిల్లు షెడ్లో వేసిన నాణ్యమైన ధాన్యాన్ని మర ఆడించగా వచ్చిన బియ్యాన్ని మిల్లర్లు యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు తరలించి ఏకమొత్తంలో రూ.కోట్లు కూడగట్టారు. ఆ సొమ్ముతో కొందరు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు వారి చిట్టా తీసినట్లు తెలిసింది. 2022– 23 రబీ సీఎమ్మార్లో మిల్లర్ల నాటకాలు అసోసియేషన్ పేరిట కుమ్మకై ్క త్రిముఖ వ్యూహం.. కావాలని కొంత మేర ధాన్యం పాడైపోయేలా చేసి తొండాట నాణ్యతది మర ఆడించి యథేచ్ఛగా మార్కెట్లో విక్రయం అప్పనంగా సొమ్ము చేసుకుని.. నష్టమంటూ దొంగ కన్నీళ్లు -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
కందనూలు: §ólÔèæ…ÌZ MóS…{§ýl {糿¶æ$™èlÓ… {糆-糄ýS ¯éĶæ$-MýS$-ÌSOò³ MýS„ýS Ý뫨…ç³# ^èlÆý‡ÅË$ Ð]l*¯]l$-Mø-ÐéÌS° Æ>çÙ‰ GOMð ÞgŒæ, ç³Æ>Å-r-MýSÔ>Q Ð]l$…{† þç³ÍÏ MýS–Úë~-Æ>Ð]l# A¯é²Æý‡$. E™èl¢Æ>-Q…-yŠæÌZ ÌZMŠS-çÜ¿ýæ {糆-糄ýS ¯ól™èl Æ>çßæ$-ÌŒæ-V>…-«©Oò³ ´ùÎçÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$-yé°² °Æý‡-íÜçÜ*¢ HI-ïÜïÜ, sîæï³-ïÜïÜ í³Ë$ç³# Ðól$Æý‡MýS$ Ð]l$…VýSâýæ-ÐéÆý‡… ÝëĶæ$…{™èl… hÌêÏ-MóS…-{§ýl…ÌZ° GÐðl$ÃÌôæÅ M>Å…ç³# M>Æ>Å-ÌSĶæ$… ¯]l$…_ A…»ôæ-yýlPÆŠ‡ ^úÆý‡Ýë¢ Ð]lÆý‡MýS$ °Æý‡-çܯ]l Æ>ÅÎ ¡íÜ.. A¯]l…-™èlÆý‡… «§ýlÆ>² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> «§ýlÆ>²¯]l$-§ólª-Õ…_ Ð]l$…{† þç³ÍÏ Ð]l*sêÏ-yýl$™èl* ️ÌZ-MŠS-çÜ¿ýæ {糆-糄ýS ¯ól™èl Æ>çßæ$ÌŒæ-V>…-«-©Oò³ A{MýS-Ð]l$…V> ¯]lÐðl*§ýl$ ^ólíܯ]l G‹œ-I-B-ÆŠ‡¯]l$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$-yýl…Oò³ B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ÉìlÎÏÌZ HI-ïÜïÜ A«§ýlÅ-„ýS$yýl$ Ð]l$ÍÏ-M>-Æý‡$j¯]l QÆó‡Y ´ëÌŸY¯]l² çÜ¿ê Ðól¨-MýS¯]l$ "Ô¶æ$¨®' ^ólĶæ$-yýl…Oò³ ½gôæï³ §ólÔèæ…ÌZ §ýlã™èl$-ÌS¯]l$ AÐ]l-Ð]l$-¯]lç³Ç^ól Ñ«§ýl…V> ¡Æý‡$ E…§ýl-¯é²Æý‡$. Ððl…r¯ól ½gôæï³ M>Æý‡Å-MýS-Æý‡¢-ÌSOò³ GïÜÞ, GïÜt A{sêíÜsîæ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ*ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. {ç³fÌS çÜÐ]l$-çÜÅ-ÌSOò³ ´ùÆ>-yýl$-™èl$¯]l² Æ>çßæ$ÌŒæ-V>…-«-©Oò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$yýl… ÐéÇ Açßæ…-M>-Æ>°MìS °§ýl-Æý‡Ø-¯]l-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ A^èla…õ³r GÐðl$ÃÌôæÅ, yîlïÜïÜ A«§ýlÅ„ýS$yýl$ Ð]l…Ö-MýS–çÙ~, Ð]l¬°Þç³ÌŒæ O^ðlÆý‡Ã¯ŒS çÜ$¯ól…{§ýl ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
సర్పై ప్రత్యేక ప్రచార రోజులు
నాగర్కర్నూల్: ప్రత్యేక ప్రచార రోజులను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార రోజులను ప్రతిఒక్క ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, కాబట్టి ఫారం–6 ద్వారా నూతన ఓటర్లుగా నమోదు, ఫారం–7, 8కు అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పొందని ఓటర్లు కూడా ఈ ప్రత్యేక ప్రచార రోజుల్లో ఫారం–6తోపాటు డిక్లరేషన్ ఫారాన్ని జత చేసి బీఎల్ఓలకు అందజేయాలని చెప్పారు. ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సర్లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్కు హాజరయ్యే సమయంలో ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, రీ–హియరింగ్కు ఒకసారి మాత్రమే అవకాశం ఉన్నందున, ఓటర్లు తమకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారు తమ తల్లిదండ్రులిద్దరికీ సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత ఓటరు ధ్రువపత్రాన్ని, 2004కు ముందు జన్మించిన వారు తమ ధ్రువపత్రాలతోపాటు తల్లి లేదా తండ్రి ఆధారాలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ఓటర్లకు నోటీసులను అందజేశామని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నిర్ణీత సమయంలో హియరింగ్కు హాజరై, అవసరమైన ధ్రువపత్రాలను అందించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం
కందనూలు: జైల్లు శిక్ష అనుభవిస్తూ.. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. మంగళవారం ఆమె జిల్లాకేంద్రంలోని సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడుతూ వారికి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి.. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి తమ సంస్థ నుంచి ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీరామ్ ఆర్య, పవన శేషసాయి, భవానిబాయి, జైలు సిబ్బంది పాల్గొన్నారు. నేత్రదానంపై అవగాహన కందనూలు: నేత్రదానంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నేత్రదాన ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎవరైనా ఒక రు మరణించిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ చూపు వస్తుందని, కావునా వ్యక్తి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కోరారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్ల అద్దాలు అందజేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం కల్వకుర్తి రూరల్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.కోటితో ఎల్లికల్ రోడ్డులో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు, వీధి వ్యాపారులకు ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. అనంతరం హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, జిల్లెల్ల రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ షానావాజ్ఖాన్, తహసీల్దార్ ఇబ్రహీం, కమిషనర్ మహమ్ముద్షేక్, శ్రీకాంత్రెడ్డి, రమాకాంత్రెడ్డి, రాహుల్, బాల్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026రాఖీ వేళ.. ఆర్టీసీకి కాసుల వర్షం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈసారి రాఖీ పండుగతో ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. వరుసగా సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 490 ప్రత్యేక బస్సులను నడిపారు. పండుగ వేళ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీజియన్ పరిధిలోని పది డిపోల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. ఆగస్టు 27న మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 5,21,227 మంది ప్రయాణికుల ద్వారా రూ.2,63,11,000 రాగా.. 28న 5,88,639 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,43,32,000, 29న 5,97,940 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,20,47,000 ఆదాయం వచ్చింది. అలాగే ఆగస్టు 30న 5,47,837 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,12,03,000, ఆగస్టు 31న అత్యధికంగా 5,80,705 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,65,37,000 సమకూరింది. ఐదు రోజులకు కలిపి మహబూబ్నగర్ రీజియన్కు మొత్తం రూ.16,04,31,000 వచ్చింది. డిపోల పరంగా చూస్తే మహబూబ్నగర్ అత్యధికంగా రూ.2,55,99,000, రెండో స్థానంలో వనపర్తి రూ.2,14,09,000 ఆదాయం పొందాయి. ఐదు రోజుల్లో రూ.16.04 కోట్ల రాబడి 28.36 లక్షల మంది ప్రయాణం.. 490 ప్రత్యేక బస్సులు ఒక్క 31వ తేదీనే రూ.3.65 కోట్ల ఆదాయం 5 రోజుల ఆదాయం వివరాలు.. అందరి సమష్టి కృషితో సాధించాం అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగుల సమష్టిగా అంకితభావంతో పనిచేయడంతోనే ఈ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలకు దూరంగా ఉండి విధులకు హాజరవడం గర్వకారణం. పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. – పి.సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ -
వణికిస్తున్న విషజ్వరాలు
అచ్చంపేట: జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికితోడు పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి.. ఎక్కడికక్కడ మురుగు నిలిచి.. ఈగలు, దోమలు అధికమై జనాన్ని ఆస్పత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇది పెద్ద ప్రమాదమేమి కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ ఎక్కువగా.. ఐపీ తక్కువగా ఉంటోంది. మందులతోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని, నిర్లక్ష్యం చేసిన వారు ఇన్పేషెంట్గా చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వారం, పదిరోజులపాటు.. జలుబు, దగ్గుతో మొదలై వైరల్ ఫీవర్లుగా మారుతున్నాయి. సాధారంగా బాధితులకు తీవ్రమైన జ్వరంతోపాటు నొప్పులు, అలసట, బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారం, పది రోజులకు కానీ ఆరోగ్యం కుదుటపడటం లేదు. అయితే సరైన నిర్ధారణ లేకుండా చికిత్స తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ, పల్లెలు, పట్టణాల్లో మాత్రం కొందరు ఆర్ఎంపీలు అర్హతకు మించి డెంగీ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. డెంగీకి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ఔషధం లేదు. ఆర్ఎంపీలు మాత్రం అధిక డోస్ యాంటీ బయోటిక్స్ వినియోగిస్తున్నారు. నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రి సహా జిల్లాలోని సీహెచ్సీలు, పీహెచ్సీలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్లతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్ ఫీవర్, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులూ నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జ్వర పీడితులు ఎక్కువగా స్థానిక వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నిర్ధారణ కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్లు ఏర్పాటు చేసి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్లు, మెడికల్ దుకాణాల్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు ప్రమాదరకరమైన యాంటీ బయాటిక్ ఇంజెక్షన్, సైలెన్లు ఎక్కిస్తూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. రక్త పరీక్షలతోపాటు స్కానింగ్ల పేరిట రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. రక్తకణాలు కాస్త తక్కువగా ఉన్నా.. అడ్మిట్ కావాలని సూచిస్తూ.. మూడు, నాలుగైదు రోజులు చికిత్స అందించి రూ.20–30 వేలకు పైగా బిల్లు వేస్తున్నారు. జ్వరం వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తికి రోజుకు రూ.2–4 వేలకు పైగానే ఖర్చు అవుతుండగా.. ఇందులో మందులు అదనం. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు కోరుతుండగా.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు శూన్యంగా ఉన్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదుతో.. చిన్నారెడ్డి వ్యాఖ్యలను మేఘారెడ్డి ఖండించడంతోపాటు తాను డబ్బులు ఎవరికిచ్చి సీటు తెచ్చుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. దీనిపై టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీ, సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం చర్యలకు సిఫార్సు చేయడం.. సీరియస్గా పరిగణించిన పార్టీ అధిష్టానం సుమారు రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో ఇబ్బందులు ఓపీలో పెరుగుతున్న రోగులు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు టెస్టుల పేరుతో దండుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు మరోవైపు స్థాయికి మించి వైద్యంతో ఆర్ఎంపీల చెలగాటం వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరం ముదిరితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి.. ఇతర వ్యాధులకు దారి తీసి ప్రాణాంతకం కావొచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి.. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. 24 గంటలపాటు వైద్యులు, ఓపీ, ఐపీ, మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ అమ్రీన్, సివిల్ అసిస్టెట్ సర్జన్, అచ్చంపేట -
అచ్చంపేట సబ్ కలెక్టర్గా సలోని ఛాబ్రా
అచ్చంపేట/ లింగాల: అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం (ఆర్డీఓ) నూతన సబ్ కలెక్టర్గా సలోని ఛాబ్రా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన యాదగిరి బదిలీపై హైదరాబాద్ సీసీఎల్ఏకు వెళ్లారు. హర్యానా రాష్ట్రం గుర్గ్రామ్కు చెందిన ఆమె 2024లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమెను అచ్చంపేట సబ్ కలెక్టర్గా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్కు అచ్చంపేట తహసీల్దార్ సైదులుతోపాటు బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర మండలాల తహసీల్దార్లు ఘనంగా సన్మానించి.. అభినందనలు తెలిపారు. చెంచుల ఇళ్ల స్థలాల పరిశీలన లింగాల మండలంలోని చెన్నంపల్లిలో చెంచులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూమి వివాదాస్పదంగా మారడంతో సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా పరిశీలించారు. జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఎర్రపెంట, చెన్నంపల్లి చెంచులు ఈ భూమిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2005లో సర్వే నం.436లో 4 ఎకరాల భూమిలో ఎర్రపెంట, చెన్నంపల్లికి చెందిన 72 మంది చెంచులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా.. వారు పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. దీంతో కాలానుగుణంగా స్థలం ఆక్రమణకు గురికావడం, కొందరు చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొనుగోలు చేశారు. ఈ మేరకు చెంచులతో వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్కు అందజేస్తానని, చెంచులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, ఆర్ఐ ఇందిర, సర్పంచులు శ్రీశైలం, లలిత, నాయకులు గోవింద్, చిరంజీవి, చెంచులు పాల్గొన్నారు. -
నేడు మద్దూరులో సీఎం పర్యటన
● పలు అభివృద్ధి పనుల పరిశీలన ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ నారాయణపేట/కోస్గి/కొత్తపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మద్దూర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు పోలీస్స్టేషన్లో నిర్వహించిన ఏఎస్ఎల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెలిప్యాడ్ నుంచి సీఎం పర్యటించే మార్గంలో రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం, అగ్నిమాపక, బ్యారికేడింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సీఎం రూట్లో రహదారి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, జనసందోహం, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం వాహనం వద్దకు ఎవరూ రాకూడదు సీఎం వాహనం సమీపానికి ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అంతకుముందు నారాయణపేట కలెక్టర్, ఎస్పీ మద్దూర్ సమీపంలోని హెలిప్యాడ్, డిగ్రీ కళాశాల, గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవన నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. -
వద్దన్నా.. వినరే!
మా పొలం వరిపంట సాగుకే అనుకూలం. అంతేకాకుండా కేఎల్ఐ కాల్వకు సాగునీరు వచ్చింది. బోర్లలో సైతం నీరు ఉన్నాయి. అందుకే వద్దన్నా వరిసాగు వేశాను. సన్నరకాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా వరిసాగుకు మొగ్గు చూపాను. పంట పండించడం సులువుగా ఉంటుంది. – బాలస్వామి, రైతు, అల్లాపూర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసినా రైతులు వినడంలేదు. లక్ష్యానికి 60 శాతానికి పైగా సాగు చేశారు. ఇక ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావంతో ఆరంభంలో వరిసాగు విషయంలో రైతులు ఆందోళన చెందారు. అధికారులు సైతం ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు. వర్షాలు కురవవని, భూగర్భజలాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. కాల్వ నీరు వచ్చినా పూర్తిస్థాయిలో విడదల చేయడం కష్టమేనని ఎన్నిసార్లు చెప్పినా రైతులు చివరికి వరిసాగుకే మొగ్గుచూపారు. వ్యవసాయాధికారులు మొదట్లో జిల్లావ్యాప్తంగా వానాకాలం వరిసాగు 1.90 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి సగం కూడా కష్టమేనని భావించారు. తీరా రైతులు 1,30,137.30 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ లెక్కలో తేలడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. 68 శాతం విస్తీర్ణంలో సాగుచేయగా.. ఇందులోనూ సన్నరకాలకే రైతులు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం వాటికే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో దొడ్డు వడ్లకు బదులు సన్నరకమే ఎక్కువగా నాటారు. 1,10,616 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారని వ్యవసాయ గణాంకాల్లో తేలింది. వరిసాగుతో మొత్తం 3,86,507.78 మె.ట., దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నాలు సాగుచేస్తేనే బోనస్ వస్తుంది. రైతులు టీ–అగ్రిసీడ్స్ పోర్టల్లో నమోదు చేసుకుంటేనే క్వింటాకు రూ.500 బోనస్ వారి ఖాతాల్లో జమవుతుంది. అందుకు ఈ నెల 10లోగా విత్తన వివరాల నమోదు చేయాలి. విత్తనాలు విక్రయించిన డీలర్లు రైతు పేరు, మొబైల్ నంబర్తో పాటు, విత్తన రకం..? ఎన్ని బస్తాలు..? కంపెనీ పేరు..? లాట్, బిల్ నంబర్ తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్ పోర్టల్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాబావ పరిస్థితుల నెలకొన్నా ఎగువన కురిసిన వర్షాలతో వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి రావడంతో రైతుల్లో ధైర్యం వచ్చింది. కేఎల్ఐ నీరు విడుదల చేయడంతో భయపడాల్సిన అవసరం లేదని నమ్మకంతో వరిసాగుకు మొగ్గుచూపారు. దీంతో వరిసాగుపై అధికారులు అంచనాలు తలకిందులైంది. 1.90లక్షల సాగుకు మందుగా లక్ష్యంగా పెట్టుకున్నా రైతులు ఆస్థాయిలో సాగు చేయకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో 1.30లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఆశ్చరం. శ్రీశైలం ప్రాజెక్టులో రోజురోజుకు నీరు తగ్గిపోతుంది. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వార సాగు నీరు పంట చేతికొచ్చేవరకు నీరు వస్తుందా అన్న అనుమానం తలెత్తుతుంది. నీరు రాకపోతే వరిసాగు పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంటుంది.వరిసాగు: 1,30,137.30 ఎకరాలు దిగుబడి అంచనా: 3,86,507.78 మెట్రిక్ టన్నులు సన్నాల దిగుబడి: 3,31,850.12 మెట్రిక్ టన్నులు ఆరంభంలో వెనకాడినా.. కేఎల్ఐ నీటి విడుదలతో ప్రాధాన్యం ప్రభుత్వం ఎంత హెచ్చరించినా 68శాతం పంట శ్రీశైలంలో రోజురోజుకూ తగ్గిపోతున్న నీటిమట్టం చివరికి చేతికొస్తుందో.. లేదోనని సందిగ్ధం -
వేటు.. దారెటు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయనపై వేటు పడింది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన సైతం వెలువడింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న సీనియర్ నేతపై ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుండగా.. ఆయన దారెటు అనేది హాట్టాపిక్గా మారింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. చిన్నారెడ్డి 1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 1989 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999–2004, 2004–2009, 2014–2018 కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2018లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ చేజారడం నుంచి మొదలు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం మొదట ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మేఘారెడ్డికి టికెట్ కేటాయించడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2024లో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారడంతో మనస్థాపానికి గురైన ఆయన పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. అనివార్యత పరిస్థితుల్లోనేనా.. సీఎం రేవంత్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కొండా సురేఖ సైతం విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమైపె వేటు వేసే క్రమంలో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని కాంగ్రెస్తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డి వర్గీయుల్లో అయోమయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించిన క్రమంలో ఆయన అనుచర వర్గంలో నిరాశ అలుముకుంది. ఆయన మాట్లాడింది పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కావని, దశాబ్దాలుగా జెండా మోసిన పాత కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కా రని వారు చెబుతున్నారు. 48ఏళ్ల క్రమశిక్షణకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన, అ యోమయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ముదిరిన విభేదాలు.. వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పలుమార్లు చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు. కేబినెట్ హోదాలో తనకు కేటాయించిన గన్మెన్లు, ప్రభుత్వ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేఘారెడ్డి సైతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య క్రమక్రమంగా విభేదాలు మరింత ముదిరాయి. ఘాటు విమర్శలతో.. ఇటీవల గోపాల్పేటలో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటిని భరిస్తూ వస్తున్నానని, లేకుంటే తాను మరో జీవన్రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చినా ఇక్కడ డబ్బులకు లొంగి తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని అనుభవించిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి తొలగింపు సీనియర్ నేతపై కాంగ్రెస్ అధిష్టానం ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరువ్యాప్తంగాహస్తం శ్రేణుల్లో కలకలం భవిష్యత్పై జిల్లెల అనుచరుల్లో అయోమయం -
ఎట్టకేలకు విచారణ!
నాగర్కర్నూలు/అచ్చంపేట: జిల్లాకేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పురపాలికలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధుల గోల్మాల్పై గతంలోనే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ‘సాక్షి’ కథనానికి మరింత బలం చేకూరింది. అయితే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉందనే దానిపై అప్పట్లో సీడీఎంఏకు నివేదిక పంపించారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. అప్పటి నుంచి దాచి ఉంచిన నివేదికను ప్రస్తుతం బయటకు తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2021 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు మున్సిపాలిటీలో పనిచేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది నెలవారీ వేతనాల చెల్లింపుల్లో సుమారు రూ.1,26,51,946 మేర దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. అయితే నిధుల గోల్మాల్లో మున్సిపల్ మాజీ కమిషనర్ బి.నరేశ్బాబుతో పాటు మొత్తం 8 మంది అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మున్సిపాలిటీలో నిధులు పక్కదారి పట్టిన విషయంలో 8మంది అధికారుల హస్తం ఉన్నట్లు రెండేళ్ల క్రితమే వెలుగు చూసింది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో సమగ్ర విచారణ జరపకపోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బి.నరేశ్బాబు (అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం దేవరకద్ర మున్సిపల్ కమిషనర్) డి.శ్రీలత అప్పటి మాజీ జేఏవో (ప్రస్తుతం మల్కాజిగిరి జోనల్ ఆఫీస్ ఫైనాన్షియల్ అడ్వైజర్) జి.అన్వేష్ అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్) జి.యాదయ్య అప్పటి మున్సిపల్ కమిషనర్ (ఎఫ్ఏసీ) (ప్రస్తుతం కోస్గి మున్సిపల్ మేనేజర్) కె.జయంత్కుమార్రెడ్డి అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు) ఎండీ అబ్దుల్ సలాం అప్పటి మేనేజర్ (ప్రస్తుతం ఎల్లంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు) డి.మురళి అప్పటి శానిటరీ ఇన్స్పెక్టర్, (ప్రస్తుతం అచ్చంపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు) కె.రాములు అప్పటి జూనియర్ అసిస్టెంట్ (పదవీ విరమణ పొందారు) వీరిలో ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్, ఎఫ్ఏసీ కమిషన్ (మేనేజర్) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్శాఖ మూడు జీవోలను విడుదల చేసింది. గత జూలై 31న వెల్లువడిన జీవో నం. 742 ప్రకారం ఉమ్మడి విచారణ ద్వారా ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 8 మంది ఉద్యోగులపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం 1991 రూల్ 24 కింద ఉమ్మడి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వమే క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తుందని.. నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఇక గత జూలై 31న రెండో జీవో 743 ప్రకారం ఈ కేసులో నిబంధన 20 ప్రకారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.మారుతి ప్రసాద్ విచారణాధికారిగా నియమించారు. ఆయన నెలరోజుల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. అదే రోజు మూడో జీవో 744 ప్రకారం క్రమశిక్షణ అధికారి తరఫున అభియోగాలను విచారణాధికారి ముందు ఉంచడానికి ప్రస్తుత నాగర్కర్నూల్ మున్సిపల్ కమిషనర్ను ప్రెజెంటింగ్ ఆఫీసర్గా నియమించారు. ఈ విషయంపై ప్రస్తుత కమిషనర్ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. నిధుల దుర్వినియోగంలో పాత్ర ఉందని భావిస్తున్న అప్పటి జూనియర్ అసిస్టెంట్ కె.రాములు రిటైర్డ్మెంట్ తర్వాత బెనిఫిట్స్ నిలిచిపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఎందుకు బెనిఫిట్స్ నిలపుదల చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు సీడీఎంఏను కోరడంతో.. నిధుల గోల్మాల్ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో చేతివాటం సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 8మంది అధికారులపై ఆరోపణలు -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
కందనూలు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజు బకాయిల పేరుతో కొన్ని కళాశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, సంయుక్త కార్యదర్శి శివ, తిమ్మాజిపేట మండల కన్వీనర్ వెంకటేశ్, మల్లేష్, జీవన్, మార్కండేయ, జగన్, జ్ఞానేశ్వర్, లోకేష్, కీర్తన, కృష్ణవేణి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
కందనూలు: బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సాఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేసి.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత తీర్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు. వైఎస్సార్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి
అచ్చంపేట రూరల్: అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం, సాగునీటి నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎల్నినో కారణంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి.. అధోగతి పాలుజేసిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి, కొట్లాట పెట్టారని.. మిగతా ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలుచేసిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. రైతుభరోసా రూ. 15వేలు, చేయూత పింఛన్ పెంపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తుండగా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందిస్తే ఎరువులు అడుగుతారని.. ఆ తర్వాత పంట మద్ధతు ధరకు కొనకపోతే బీఆర్ఎస్ వారు ధర్నాలు చేస్తారని.. పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆటో కార్మికులకు సైతం ప్రతినెలా రూ. 2వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 33 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
రాజ‘కీ’యం.. రసవత్తరం!
● సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్పై కొనసాగుతున్న ఉత్కంఠ ● వెయ్యి రోజుల పాలనపై పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు ● చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్ నేతల ప్రెస్మీట్లు ● పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● దగా పాలన అంటూ రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు ● ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్రెడ్డి మద్దూరు పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కలవని చేతులతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ దూకుడు మంత్రంతో.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనపై చర్యలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు నడుస్తున్నాయి. -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 75 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్పై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలోనే మరో 33 మందికి పైగా ఉపాధ్యాయులను ఫారిన్సర్వీస్పై పంపేందుకు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉండగా.. మిగిలిన వారు డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారు. బీఈడీకి 10, డైట్కు 12 మంది ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క బీఈడీ కళాశాల, ఒక డైట్ కళాశాల ఉంది. ఇందులో అధ్యాపకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. బీఈడీ కళాశాలలో ఉన్న ఏకై న రెగ్యులర్ పోస్టు గోవిందరాజులు నారాయణపేట ఇన్చార్జి డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైట్ కళాశాలలో రెండు రెగ్యులర్ పోస్టులు ఉండగా ఇటీవల మహబూబ్నగర్ డీఈఓగా విధులు నిర్వహించిన రవీందర్ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్లో ఉన్నారు. మరో పోస్టులో ప్రస్తుత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరాజుల్లాఖాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండు కళాశాలల్లో పోస్టుల భర్తీకి సీబీటీ పరీక్ష నిర్వహించి ఈ నెల 6వ తేదీన బీఈడీ కళాశాలకు, 7వ తేదీన డైట్ కళాశాలకు ఇంటర్వ్యూ, డెమోలు నిర్వహించారు. బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏడాది కాలానికి ఫారిన్ సర్వీస్పై విధులు కేటాయించనున్నారు. గతంలో తాత్కాలికంగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కొందరి డిప్యూటేషన్లు రద్దు చేసి.. తాజాగా ఎంపికై న వారికి అవకాశం కల్పించనున్నారు. బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. అయినా ఇతర విధులకు కేటాయింపు బీఈడీ, డైట్ కళాశాలలకు 22 మంది.. డీఈఓ కార్యాలయాల్లో మరికొందరు ఉమ్మడి జిల్లాలో 75 మందికిపైగా ఫారిన్ సర్వీస్లో.. 81 మంది మానిటరింగ్ టీంల్లో.. అనుభవజ్ఞులైన స్కూల్ అసిస్టెంట్లను బోధనేతర విధులకు పంపడంపై విమర్శలు బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉండగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయించడంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండటంతో వారి స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విద్యార్థులకు సబ్జెక్టు బోధనలో నష్టం జరిగే ప్రమాదం ఉంది. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపే అవకాశం ఉన్నా.. సబ్జెక్టు నిపుణులైన స్కూల్ అసిస్టెంట్ల స్థానాన్ని తాత్కాలిక ఏర్పాట్లతో భర్తీ చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క జిల్లాలోనే 33 మందికిపైగా.. మహబూబ్నగర్ జిల్లాలో 33 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్లో ఉండగా.. వీరిలో 22 మంది బీఈడీ, డైట్ కళాశాలల్లో, మిగతా వారు డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో ఆరు చొప్పున, మిగతా జిల్లాల్లో ఐదు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. బదిలీ చేశాం.. డైట్, బీఈడీ కళాశాలల్లో విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్పై బదిలీ చేశాం. మానిటరింగ్ టీంలకు కూడా ఓడీ సౌకర్యంతో ఉపాధ్యాయులను కేటాయించాం. డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్పై విధులు నిర్వహిస్తున్నారు. వీరు వెళ్లిన పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను త్వరలో చేపట్టనున్న సర్దుబాటు ప్రక్రియలో భర్తీ చేస్తాం. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ -
రైల్వే హబ్గా తీర్చిదిద్దుతాం
● గద్వాలలో రూ.66కోట్లతో మరో ఓఆర్బీ నిర్మాణం ● జోగుళాంబ హాల్ట్లో రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి ● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల రైల్వేస్టేషన్లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా స్టేషన్ అభివృద్ధిపై ఏర్పాటుచేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. అదే విధంగా జోగుళాంబ హాల్ట్లో రూ.6కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మతో చర్చించారు. అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్వాల స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ ప్రారంభమై వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 520 ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,883కోట్లతో 118 ఆర్ఓబీ, ఆర్యూబీల పనులు చేపడుతున్నట్లు వివరించారు. గద్వాలలో రూ. 66కోట్లతో మరో ఆర్ఓబీ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జోగుళాంబ హాల్ట్లో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. పలు రాష్ట్రాల నుంచి అలంపూర్ క్షేత్రానికి భక్తులు వస్తున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జోగుళాంబ హాల్ట్లో అన్ని రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్ క్షేత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కేంద్ర పర్యాటకశాఖ ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. పర్యాటక అబివృద్ధి పనులపై ఎంపీ, కలెక్టర్తో త్వరలోనే సమీక్షిస్తామన్నారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. విమానాశ్రయాన్ని తలపించేలా గద్వాల రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయ న్నారు. గద్వాల–డోర్నకల్, మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ మధుమోహన్, దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఓ పురేందర్కుమార్, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్చైర్మన్ శంకర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. -
విద్యా నైపుణ్యాలు పెంపొందించాలి
చారకొండ: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. వారిలో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డీఈఓ రమేశ్కుమార్ సూచించారు. సోమవారం చారకొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తరగతుల వారీగా పరిశీలించారు. విద్యార్థినులకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించి.. వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చదువులో వెనకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని తెలిపారు. డీఈఓ వెంట ఎస్ఓ మంజుల ఉన్నారు. -
ఉద్యోగుల పోరుబాట
కందనూలు: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకు దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లుసమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా ఆందోళన ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి నేడు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదంటున్న ఉద్యోగులు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలి. సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలి. రెండవ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసేందుకు ప్రతినెలా రూ. 2వేల కోట్లు విడుదల చేసి, ఉద్యోగుల బకాయిలను త్వరగా చెల్లించాలి. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు.. ఇటీవల పలుమార్లు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర జేఏసీ బాధ్యులు సీఎం, డిప్యూటి సీఎంతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడం, స్పష్టమైన హామీలు రాకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అందులో భాగంగా పలు దఫాలుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 4,625 -
సంచార జాతుల అభ్యున్నతికి కృషి
కందనూలు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంచార జాతుల చరిత్ర, వారు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వివిధ కారణాలతో సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించవచ్చన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సంచార జాతుల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే.. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీరాములు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 64 ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవ సహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం తిమ్మాజిపేట రైతువేదికలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు అందక పేదలు అవస్థలు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సొంతిల్లు లేని పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండో విడత గుడిసెలు, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లల్లో నివాసమున్న పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుద్ధసముద్రంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేరళ్లపల్లి, మరికల్లో పలువురిని పరామర్శించి.. రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయంతి, ఎంపీడీఓ శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వివేక్రెడ్డి, నాయ కులు వెంకట్రామారెడ్డి, మల్లయ్యగౌడ్, నాగ సాయిలు, శ్రీనివాస్ బహదూర్, రవూఫ్, భాస్కర్రెడ్డి, లక్ష్మీనారా యణ, మాధవ్, గిరిజ, వెంకటయ్య పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి ● జోగుళాంబ క్షేత్రంలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రారంభం అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ● ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయ విశిష్టతను తెలయజేస్తూ, మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు ఫుడ్ కోర్టు, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన జోగుళాంబ, గద్వాల రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, టూరిజం అండ్ కల్చరల్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
వాయిదాల పర్వం
● ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు ● మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు ● వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ● ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు –8లో uకొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. పాడైపోయిన మోటార్లు.. కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టును ఎల్లూరు సమీపంలోని రేగుమాన్గడ్డ వద్ద నిర్మించారు. ఈ లిఫ్టులో 5 మోటార్లు ఉండగా.. నాలుగు మోటార్లతో నీటి పంపింగ్ చేపట్టి, ఒక మోటార్ను స్పేర్లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 2012 సెప్టెంబర్లో కేఎల్ఐ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అదే నెలలో ఎయిర్ ఫ్రెషింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పంపు మోటార్లు పాడవగా.. వెంటనే వాటికి మరమ్మతు చేశారు. 2014 సెప్టెంబర్లో 5వ నంబర్ పంపు మోటార్లోకి నీళ్లు చేరి పాడైంది. తర్వాతి కాలంలో మరో పంపు మోటార్ కూడా మరమ్మతుకు గురైంది. మూడున్నరేళ్ల క్రితం నిధులు.. కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్ఐ ద్వారా నీటి లిఫ్టింగ్ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు. పాడైన మోటార్లు 2 పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగితే కేఎల్ఐ ప్రాజెక్టుకు కొంత విరామం ఇవ్వాలనుకున్నాం. అయితే పలు కారణాలతో అది సాధ్యపడటం లేదు. తాగునీటి అవసరాల కోసం రెగ్యులర్గా కేఎల్ఐ ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నాం. పాడైన మోటార్ల మరమ్మతుకు ఇంకా కొంతకాలం ఆగక తప్పదు. – లోకిలాల్నాయక్, నీటిపారుదల శాఖ ఈఈ కేఎల్ఐ ప్రాజెక్టు డిజైన్లో అప్రోచ్ చానల్ నుంచి సర్జిపూల్లోకి నీళ్లు వెళ్లే ప్రాంతంలో హెడ్రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో నది నీళ్లు నేరుగా సర్జిపూల్లోకి చేరుకుంటాయి. వరదలు, నదీ ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో నీటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఏర్పడే ఎయిర్ ఫ్రెషింగ్ లిఫ్టుపై ప్రభావం చూపుతోంది. ఈ కారణంతోనే 5వ నంబర్ మోటార్లోకి నీళ్లు చేరి పాడైంది. అదే సమయంలో పంప్హౌజ్లోని సిమెంట్ కాంక్రీట్ గోడలకు కూడా కొంతమేర పగుళ్లు వచ్చి నది నీళ్లు పంప్హౌజ్లోకి చేరాయి. వీటికి తాత్కాలిక మరమ్మతు చేపట్టి లిఫ్టును నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించాలంటే అప్రోచ్ చానల్ టన్నెల్ ప్రారంభంలో షెట్టర్ ఏర్పాటు చేయడమే మార్గమని ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. షట్టర్ ఏర్పాటు, మోటార్ల మరమ్మతు జరగాలంటే కేఎల్ఐ లిఫ్టునకు కనీసం 2, 3 నెలల విరామం ఇవ్వాలని, అది ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. -
ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు
కందనూలు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ నేత డా.నాగం శశిధర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగుల హెల్త్కార్డుల విషయంలో తాత్సారం చేయడం సరైంది కాదని అన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని గుర్తుచేశారు. ఇప్పటికై నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, కౌన్సిలర్ అర్జునయ్య, భీముడు, సత్యం ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రూప్–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్ స్టడీస్లో ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్క్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
అచ్చంపేట రూరల్: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఐనోల్ గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న విద్య, వసతులు, భోజనం ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి అల్ఫాహారం తీసుకున్నారు. మత్తు.. భవిష్యత్కు గొడ్డలి పెట్టు కల్వకుర్తి రూరల్: మత్తు పదార్థాలు యువత భవిష్యత్కు గొడ్డలి పెట్టువంటివని.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలు వినియోగించకుండా చైతన్యం చేసేందుకు నిర్వహించిన 2కే రన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమాజంలోని ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. మరింత మంది ముందుకొచ్చి.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2కె రన్లో విజేతలుగా నిలిచిన వారికి బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగి రత్నమాల ఆనంద్కుమార్, మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, సంజీవ్ యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి, పసుల రమాకాంత్రెడ్డి, కౌన్సిలర్లు, శ్రీకాంత్ రెడ్డి, పుస్తకాల రాహుల్, ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యుడు బాలస్వామి పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యకు శ్రీకారం
కోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్ ల్యాబ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మహబూబ్నగర్ : జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్, బాలికల జూనియర్, జడ్చర్లలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, దేవరకద్ర, బాలానగర్, కోయిల్కొండ జూనియర్ కళాశాలు. నారాయణపేట : మక్తల్, నారాయణపేట జూనియర్ కళాశాలలు నాగర్కర్నూల్ : కల్వకుర్తి, బిజినేపల్లి, నాగర్కర్నూల్ బాలుర కళాశాలలు వనపర్తి : ఆత్మకూర్, వనపర్తి బాలికల జూనియర్ కళాశాల. జోగుళాంబ గద్వాల : గట్టు, అయిజ, ధరూర్, గద్వాల బాలుర, గద్వాల బాలికల కళాశాల. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక ల్యాబ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు దశల వారీగా అన్ని కళాశాలల్లో అమలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమ గ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్ ల్యాబ్ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్రావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి, నారాయణపేట అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. మొదటి విడతలో 19 కళాశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఒక్కో కళాశాలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఆయా కళాశాలల్లో ప్రత్యేక గదులు నిర్మించి కంప్యూటర్ ల్యాబ్గా వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
భీమా కాల్వలోపూడిక తొలగింపు
పాన్గల్: మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామం బొల్లిగట్టు సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23లో పేరుకుపోయిన పూడిక, జమ్ము తొలగింపు పనులను శనివారం యంత్రాలతో చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో గ్రామానికి చెందిన పలువురు రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాల్వలో పేరుకపోయిన పూడిక తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం అధికారులు పనులు ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
చారకొండలో హీరో శర్వానంద్
చారకొండ: నిత్యం సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే సినీ హీరో శర్వానంద్ నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జూపల్లి రెవెన్యూ శివారులో జేపల్లి సమీపాన భూమిని కొనుగోలు చేసిన ఆయన శనివారం రిజిస్ట్రేషన్ నిమిత్తం చారకొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూమికి సంబంధించిన పత్రాలతో నిబంధనల మేరకు తహసీల్దార్ ఉమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సుమారు 25 ఎకరాల భూమి కొ నుగోలు చేసినట్లు తెలిసింది. చారకొండకు సినీ హీరో రావడంతో అభిమానులు పెద్దఎత్తున తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రాజీ మార్గంతో సమయం, డబ్బు ఆదా కందనూలు: లోక్అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో కక్షిదారులు అప్పీల్ లేని తీర్పును పొంది.. సమయం, డబ్బును ఆదా చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న లోక్అదాలత్పై శనివారం జిల్లా కోర్టు హాల్లో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. లోక్అదాలత్లో భూ తగాదాలు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్, కుటుంబ తగాదాలు, మోటారు వాహనాల ప్రమాద కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు. కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకోవడం ద్వారా మానవ సంబంధాలు బలపడతాయని అన్నారు. సెప్టెంబర్ 12న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమా సుల్లానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి ఉన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయం కందనూలు/కల్వకుర్తి రూరల్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్, కల్వకుర్తి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ల్లో ఆయన మాట్లాడారు. తమ సంఘం చేపట్టే కార్యక్రమాలు కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి కోసమేనని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉందని.. అందులో కార్మికుల పాత్ర కీలకంగా ఉండేందుకు రాబోయే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూను గెలిపించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించామని.. ఎన్నో విజయాలతో కార్మికులకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ, కార్మికులను వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జగదీశ్వర్, రవి, శంకర్, నాగయ్య, అహ్మద్ ఖాన్, వీఎస్ నారాయణ, మధు, బాబురావు, పెంటయ్య, చంద్రయ్య, శేషమ్మ, మల్లయ్య, సంతోష్రెడ్డి, మంజుల, ఆరిఫ్, సదానందం పాల్గొన్నారు. -
పారదర్శకంగా నోటీసుల జారీ ప్రక్రియ
కందనూలు: ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. బీఎల్ఓలు సదరు వ్యక్తులకు మాత్రమే నోటీసులను అందజేసేలా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం సంబంధిత వ్యక్తి నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. నోటీసుల జారీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఓటర్లు హియరింగ్ సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల విషయంపై కూడా ముందుగానే స్పష్టత ఇవ్వాలన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఈఆర్ఓలకు హియరింగ్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనామలీస్, నోమ్యాపింగ్కు సంబంధించిన వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా నిబంధనల మేరకు పంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఒక చిరునామాలో నివసిస్తున్న వ్యక్తులను మరో చిరునామాలో చూపించడం, ఒక చిరునామాలో నివసించని వ్యక్తులను అదే చిరునామాలో ఉన్నట్లు నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వస్తే, సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి తప్పిదాలు సంబంధిత బీఎల్ఓల నిర్లక్ష్యం ద్వా రా జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చెన్నయ్య ఉన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగించాలి.. రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించి.. రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ సాంకేతికత ప్రదర్శనలతో పాటు ఇన్స్ట్రక్షనల్ ఫారంలో కొనసాగుతున్న వివిధ యూనిట్లను పరిశీలించారు. కేవీకే ద్వారా అందిస్తున్న సాంకేతిక సేవలు రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా, ఫలితాలు కనిపించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా, మార్కెట్ డిమాండ్, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టేలా ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్ వెంట సీనియర్ సైంటిస్ట్ డా.శైలజ ఉన్నారు. -
రేషన్.. పరేషాన్!
● పది రోజులుగా చౌకధర దుకాణాల మూత ● మూడు నెలల రేషన్ బియ్యం అందక లబ్ధిదారుల ఆందోళన కల్వకుర్తి రూరల్: మూడు నెలల రేషన్ బియ్యం తీసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటం.. చాలా వరకు చౌకధర దుకాణాలు మూతపడి కనిపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతినెలా మొదటి తేదీలోపే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ నెల మాత్రం 5వ తేదీ తర్వాతే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోని 132 షాపులకు బియ్యం సరఫరా జరిగింది. ఆ వెంటనే వినియోగదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టి బియ్యం తీసుకున్నారు. కొన్ని రోజులకే రేషన్ దుకాణాల్లో బియ్యం అయిపోవడం.. మళ్లీ సరఫరా కాకపోవడంతో మూతపడ్డాయి. పది రోజులుగా షాపులన్నీ మూసి కనిపిస్తుండటంతో బియ్యం తీసుకోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 98శాతం రేషన్ బియ్యం పంపిణీ పూర్తి చేశాం. ఈ నెల 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. చౌకధర దుకాణాల్లో బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, డీఎం, సివిల్ సప్లయ్శాఖ జిల్లాలో 558 చౌకధర దుకాణాలు.. జిల్లావ్యాప్తంగా 558 రేషన్ దుకాణాలు ఉండగా.. అత్యధికంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 132 దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలకు 35వేల క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 30వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. మరో 5వేల క్వింటాళ్లు ఆదివారం నాటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కల్వకుర్తిలో లబ్ధిదారుల తాకిడి ఎక్కువగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లు శనివారం గోదాం ఇన్చార్జి శశిధర్రావును కలిసి బియ్యం సరఫరా చేయాలని విజ్ఞిప్తి చేశారు. బియ్యం లేకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే గడువులోగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తేనే మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. -
అచ్చంపేట అభివృద్ధికి అహర్నిశలు కృషి
అచ్చంపేట రూరల్: అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 24.50కోట్లతో మద్దిమడుగు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో రూ. 15 కోట్లు హరిత హోటల్కు మంజూరు చేశారన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు రూ. 100కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. మొదటి విడతలో రూ. 36కోట్లు మంజూరయ్యాయని.. త్వరలోనే జీఓ రానుందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా మద్దిమడుగు ప్రాంతానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే విధంగా పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో రాజీవ్ మినీ స్టేడియాల ఏర్పాటు కోసం రూ. 2కోట్ల చొప్పున మంజూరయ్యాయని పేర్కొన్నారు. అచ్చంపేటలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియానికి రూ. 8.50కోట్లు మంజూరు కాగా.. మరో రూ.6కోట్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే వైఎస్సార్ పార్కు కోసం రూ. 4కోట్లు మంజూరైనట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సహకారంతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. క్రీడలు జీవితంలో భాగం కావాలి నాగర్కర్నూల్: క్రీడలు జీవితంలో భాగం కావాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం పెంపొందుతాయని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, డీవైఎస్ఓ సీతారామ్, డీఈఓ రమేశ్కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆదర్శం.. చెంచుగూడెం
ప్రకృతి వ్యవసాయం వైపు గిరిపుత్రుల అడుగులు ● తోటల పెంపకం, కూరగాయల సాగుపై దృష్టి ● ఆధునిక పద్ధతులు, యంత్రాలతో వ్యవసాయంలో రాణింపు ● ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని సత్ఫలితాలు ● మైదాన ప్రాంత రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నల్లమల చెంచులు –8లో u●మాకు ఎకరాన్నర భూమి ఉండగా.. అర ఎకరంలో బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయలు పండిస్తున్నాం. రోజు విడిచిరోజు కూరగాయలు తెంపి విక్రయిస్తాం. సగటున రోజుకు రూ.2–3 వేల ఆదాయం వస్తుంది. కూరగాయల సాగుకు ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాం. అటవీ ప్రాంతం దగ్గర ఉండటంతో తరుచుగా జంతువులు వస్తుంటాయి. వాటి నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వం కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – నిమ్మల సాలెమ్మ, చెంచుగూడెం, బల్మూర్ మండలం ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో వానాకాలం పంట వేయలేదు. యాసంగిలో వేరుశనగ పంట సాగు చేసేందుకు భూమి బీడుగా ఉంచాం. కాడెద్దులతో కూలీ పనికి వెళ్తున్నా. మా గూడెంలోని కుటుంబాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయ పనులకు తోడు ఉపాధి హామీ పథకం పనులు కూడా చేస్తున్నాం. – ఉడుతనూరి నర్సింహ, రైతు, చెంచుగూడెం బల్మూర్ మండలం గతంలో మాకు అటవీ సంపదలే ఆసరాగా ఉండేవి. మా గూడెంలోని చెంచులందరూ ఇతర ప్రాంతాలకు వలస పోయేవాళ్లు. ఇప్పుడు వ లస పోకుండా ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడే ఉంటూ ఉపాధి పనులు, పత్తి తీ యడం, మేసీ్త్రల కింద కూలీ పనులకు వె ళ్తున్నాం. మా గూడెంలో సగం మందికి వ్యవసాయ భూమిలేదు. గతంలో ఇచ్చిన మాదిరిగా ప్రభుత్వం మాకు భూమి ఇవ్వాలి. – నిమ్మల విజయ్కుమార్, కూలీ, చెంచుగూడెం బల్మూర్ మండలం జనజీవన స్రవంతికి దూరంగా.. నల్లమల అడవిలో నివశిస్తూ.. దుర్భరమైన జీవితాలు గడిపిన చెంచులు.. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. ఒకానొక సందర్భంలో నాగరిక సవూజానికి దూరంగా ఉంటూ.. అటవీ ఉత్పత్తుల సేకరణ, వలసలే ప్రధాన వృత్తిగా కొనసాగిన చెంచుగూడెం చెంచులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) వీరి కోసం ఖర్చు చేసిన నిధులు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొంటూ చెంచులు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. వ్యవసాయంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తూ ఇతర వర్గాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి, పత్తి, మినుములు, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ వంటి సంప్రదాయ పంటలతోపాటు ఆయిల్పాం, మామిడి తోటలు, కూరగాయల తోటలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. – అచ్చంపేట/ బల్మూర్ చెంచులు వ్యవసాయ రంగంలో రాణించేందుకు 1996లో ఐటీడీఏ ఐపాడ్ పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. అప్పట్లో బల్మూరు మండలంలోని చెంచుగూడెంలో 75 చెంచు కుటుంబాలు ఉండగా 32 కుంటుంబాలకు పండ్ల తోటల పెంపకానికి చేయూత అందించారు. ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాల చొప్పున 64 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. మొదట ఏడు బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం, పైపులైన్, ఎద్దులు ఇచ్చారు. ప్రస్తుతం 40 బోర్లు, మోటార్లు ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ప్రగతి సాధించి సొంతంగా బోర్లు వేసుకుంటున్నారు. కొంతమంది చెంచులు మామిడి తోటలు తొలగించి కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగు చేస్తున్నారు. నల్లమలోని చెంచుపెంటల్లో 300లకుపైగా ఎకరాల్లో తోటలు పెంపకం ప్రోత్సహించగా చాలాచోట్ల ఈ పథకం విఫలం కాగా చెంచుగూడెం చెంచులు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సత్ఫలితాలు సాధించారు. గూడెంలో సగం కుటుంబాలకు వ్యవసాయ భూమి లేకపోవడంతో ఉపాధి హామీ పనులతోపాటు ఇతర పనులు చేసుక ్డుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వలసలు వెళ్లిన ఈ గ్రామ చెంచులు ప్రస్తుతం ఇక్కడే ఉంటూ అందుబాటులో ఉన్న పనులు చేసుకుంటున్నారు. తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం చేసేందుకు చెంచు రైతులు వ్యవసాయ కుంట (పాంపాండ్)లు నిర్మించుకున్నారు. పైపులైన్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించుకుంటూ తక్కువ నీటితో ఆయిల్పాం, మామిడి తోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు. మామిడితోటలు, ఆయిల్పాం తోటల్లో వేరుశనగ, మినుమలు, మొక్కజొన్న వంటి అంతర్ పంటలు సాగు చేస్తున్నారు. ఆఽదునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఐటీడీఏ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం నమూనా క్షేత్రం ఏర్పాటు చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల రైతులు అనేక ప్రయోజనాలు పొందుతూ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాల నిర్జీవంగా మారుతున్నాయనే కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ చెంచులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించారు. వీరు పండించే ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. సమీప గ్రామాల ప్రజలు ముందుగానే వీరు పండించే పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. చెంచులు తమకు ఉన్న ఎకరా, అర ఎకరా పొలంలోనే కూరగాయలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా గోంగూర, బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయ వంటి కూరగాయలు పండిస్తూ నెలకు సుమారు రూ.30–50 వేల ఆదాయం పొందుతున్నారు. కూలీలతో పని లేకుండా కుటుంబ సభ్యులే కూరగాయలు మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. అప్పట్లో మా బాధలను గుర్తించిన ప్రభుత్వం మాకు భూములు ఇచ్చి మామిడితోటలు పెట్టించారు. తోట పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ తోటను తొలగించి 3 ఎకరాల పొలంలో ఆయిల్పాం మొక్కలు నాటాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంతో దీని వైపు మొగ్గు చూపాం. మరో 2.5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పత్తిపంటను స్ప్రింక్లర్లతో నీటిని తడుపుతున్నాం. పైపులైన్, డ్రిప్ ఇరిగేషన్తోపాటు వాడుతున్నాం. – కాట్రావత్ వరలక్ష్మి, మహిళా రైతు, చెంచుగూడెం, బల్మూర్ మండలం -
పతకాల పంట!
కుస్తీ పట్టుతోరెజ్లింగ్లో సత్తా చాటుతున్న పాలమూరు ఆడబిడ్డలు ● మట్టి బరిలో మొదలైన ప్రస్థానం.. జాతీయ వేదికపై పతకాల వేట ● అంతర్జాతీయస్థాయిలో బరిలోకి దూసుకెళ్లే లక్ష్యం.. ఒకప్పుడు కుస్తీ అంటే మగవాళ్ల క్రీడగానే చూసేవారు. కానీ ఇప్పుడు అదే మట్టిబరిలో పాలమూరు ఆడబిడ్డలు సవాల్ విసురుతున్నారు. తండాల నుంచి వచ్చిన ఈ బాలికలు.. చెమట చిందిస్తూ, పట్టుదలతో సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన గీత, నాగలక్ష్మి, ప్రియమణి, బాలమణి, సీతామహాలక్ష్మి రెజ్లింగ్లో తమదైన ముద్ర వేస్తున్నారు. గీత వరల్డ్ చాంపియన్షిప్ ట్రయల్స్కు సిద్ధమవుతుండగా.. నాగలక్ష్మి ‘తెలంగాణ కేసరి’గా నిలిచింది. మిగిలిన క్రీడాకారిణులూ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ బరిలో దిగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. – మహబూబ్నగర్ క్రీడలు చికర్లగడ్డతండాకు చెందిన ప్రియమణి ధన్వాడ కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. కొన్నేళ్లుగా రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్న ఆమె జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2025లో మహారాష్ట్రలో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరప్రదేశ్లో జరిగిన అండర్–17 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్లో పాల్గొంది. ఈ ఏడాది మహారాష్ట్రలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్లోనూ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగింది. రెజ్లింగ్లో మరింత రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ప్రియమణి చెబుతోంది. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున.. ● గతేడాది కంటే రూ.10 వేలు అదనం ● పర్యవేక్షణ మరింత పటిష్టం చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈలు, క్లస్టర్ జీహెచ్ఎంల పర్యవేక్షణ.. పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నా యి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది. నిధుల వినియోగం ఇలా.. రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
శ్రీశైలంలో 873.4 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నీటి ప్రవాహం లేదు. దీంతో గురువారం 159.3828 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారు 3 టీఎంసీల నీటిమట్టం తగ్గినట్లయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. కురుమూర్తిలో ఘనంగా పవిత్రోత్సవాలు చిన్నచింతకుంట: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మాపురంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణులు యజ్ఞ మండపంలో స్వామివారికి, అమ్మవారికి బ్రహ్మకలశం, అష్టోత్తర శతనామార్చన, కలశాభిషేకం తదితర పూజలను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. అనంతరం పవిత్రారోపణ కార్యక్రమంలో భాగంగా పవిత్ర మాలలను ఆలయ చైర్మన్ బత్తుల బాలు యజ్ఞ మండపం నుంచి ప్రధాన ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్లు, ఉత్సవమూర్తులు, ద్వారపాలకులు, గరుడవాహనం, ధ్వజస్తంభం, బలిపీఠానికి పవిత్ర మాలలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నేషనల్ ఫుట్బాల్ పోటీలకు రోహిత్ మహబూబ్నగర్ క్రీడలు: కర్ణాటక రాష్ట్రం బెంగళూర్లో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ ఫుట్బాల్ బీసీ రాయ్ ట్రోఫీలో జిల్లాకు చెందిన రోహిత్ మేఘావత్ ఎంపికై నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్పీ వెంకటేశ్, భానుకిరణ్ తెలిపారు. 20 రో జులుగా హైదరాబాద్లో నిర్వహించిన సన్నాహక శిబిరంలో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. -
గణిత సామర్థ్యాల పెంపునకు చర్యలు
కందనూలు: విద్యార్థుల్లో ప్రాథమిక భాషా, గణిత సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ పాయింట్లలో ఫొటో దిగి విద్యాశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడం ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించేందుకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తదుపరి తరగతుల్లో విద్యను సులభంగా అభ్యసించేందుకు ప్రాథమిక దశలోనే భాషా, గణిత సామర్థ్యాలు పటిష్టంగా ఉండటం ఎంతో అవసరమని, విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయికి అనుగుణంగా నిర్దిష్ట అభ్యసన లక్ష్యాలను నిర్దేశించి, వాటిని సాధించేలా బోధనా ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, వాక్యాలను అర్థం చేసుకోవడం, తమ ఆలోచనలను వ్యక్తపరచడం వంటి భాషా సామర్థ్యాలతోపాటు సంఖ్యలను గుర్తించడం, లెక్కించడం, కూడిక, తీసివేత వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రతి ప్రాథమిక పాఠశాల, కాంప్లెక్స్, మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు డీఈఓ చెప్పారు. -
అనుబంధాల వేడుక
ఆత్మీయుల కలయిక.. ఆనందంగా జరుపు కొంటాం.. సరిపోని బస్సులు రాఖీ పండుగ నేపథ్యంలో గురువారం మహబూబ్నగర్తోపాటు ఉమ్మడి జిల్లాలో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. –9లో u●హిందూ సంప్రదాయంలో అనుబంధాలు, ఆప్యాయతలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే రాఖీ పండుగ వచ్చిందంటే ఊరు, వాడ అంతా సందడే. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ జరుపుకొనే ఈ పండుగకు మార్కెట్లు, దుకాణాలు సందడిగా మారాయి. గత మూడు రోజుల నుంచే జిల్లాకేంద్రంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, నల్లవెల్లి రోడ్, శ్రీపురం చౌరస్తాలతోపాటు ప్రధాన పట్టణాలు, గ్రామాల్లోని దుకాణాల్లోనూ రాఖీల అమ్మకాల జోరు కొనసాగుతుంది. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు ఆకృతుల్లో రాఖీలను అందుబాటులో ఉంచారు. ఆధునిక కాలంలోనూ ఆదరణ తగ్గని రాఖీ పండుగ ఎక్కడున్నా తమవారికి రాఖీలు పంపి.. సంబురం సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షల వెల్లువ అప్యాయత, అనురాగాలను చాటే ‘రక్షా’నుబంధం చిన్నారులకు రాఖీ పండుగ అంటే మరీ సరదా. అక్క, చెల్లిని అడిగి మరీ రాఖీ కట్టించుకుంటారు. దీంతో చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా బాల గణేష్, భీమ్, బెన్టెన్, మిక్కీమౌస్ లాంటి బొమ్మల రాఖీలు ఉన్నాయి. రంగురంగుల లైట్లు వెలుగుతూ అందంగా కనిపించే రాఖీలు సైతం పిల్లల కోసం కొనుగోలు చేస్తుంటారు. సోదర, సోదరీమణులు ఉత్సాహంగా జరుపుకొనేదే రాఖీ పండుగ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ప్రతి ఏడాది అందరం కలిసి మా ఊరెళ్లి అన్నా, తమ్ముడికి రాఖీ కడుతాం. ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొంటాం. – శాంతమ్మ, పెద్దకొత్తపల్లి ఈ ఏడాది రాఖీ గిరాఖీలు పెద్దగా లేవు. వర్షాలు పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్నా.. ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి గిరాకీ బాగా తగ్గిందనే చెప్పాలి. – సురేందర్రావు, వ్యాపారి, నాగర్కర్నూల్ -
విద్య, వైద్యరంగాల్లో సమస్యలు పరిష్కరించాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైన విద్య, వైద్యరంగాలను పూర్తిస్థాయిలో విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిపై ఇప్పటికే అన్ని జిల్లాల కార్యదర్శులకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చే యాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్నిరకాల సేవలను అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జీఎస్.గోపి, మండల కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేష్, అజయ్, శంకర్ పాల్గొన్నారు. -
ఎస్సీల అభివృద్ధికే నిధులు ఖర్చు చేయాలి
కందనూలు: ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్పై సమీక్ష సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కేవలం లెక్కల్లో కాకుండా.. వాటి ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలకు అవసరమైన ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని చెప్పారు. ప్రతి శాఖకు మంజూరైన నిధులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగానికి ముందుగానే కార్యాచరణ రూపొందించుకొని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను సకాలంలో ప్రారంభించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నిధులను సకాలంలో, నిబంధనల మేరకు వినియోగించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
400 ఏళ్ల ‘నూలు’ పండుగ
అచ్చంపేట: రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. 46వ నూలు పూర్ణిమ సందర్భంగా గురువారం సాయంత్రం అచ్చంపేటలోని శ్రీరాంనగర్కాలనీకి చెందిన కోటకిశోర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజల అనంతరం శివపార్వతులను అశ్వవాహనంపై విశేష అలంకరణతో పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళలు కోలాటాలు, డప్పులు, మంగళవాయిద్యాలు, హారతులు, అడుగుల భజనలతో భక్త మార్కండేయ శివాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం మార్కండేయ ఆలయంలో అఖండ భజనలు నిర్వహించారు. నూలు పూర్ణిమను సంప్రదాయబద్ధంగా, శుభసూచికగా భావించి జరుపుకొంటాం. ఎంతో నిష్టగా ఉండి నూలుతో కంకణం, జంధ్యం తయారు చేసి.. ధరిస్తాం. ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలు కొనసాగించేలా చైతన్యం చేస్తున్నాం. అనాదిగా పద్మశాలీలు నూలు పుట్టిన దినాన్ని రాఖీ పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీ. అచ్చంపేటలో 46 ఏళ్లుగా సామూహికంగా చేపడుతున్నాం. – కిశోర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు, అచ్చంపేట -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మోడల్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, హెచ్ఎంలు (15 ఏళ్లు), ఉపాధ్యాయులు (పదేళ్లు) బోధనా అనుభవం గలవారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 1లోగా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాల కోసం అకడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్కుమార్ (90101 92288)ను సంప్రదించాలని సూచించారు. రోడ్డు పనులు పూర్తిచేయాలి వెల్దండ: మండలంలోని కొట్ర గేట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులను జిల్లా రవాణ భద్రత శాఖ అధికారి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 22 కిలోమీటర్ల బీటీరోడ్ల నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కొట్రతండా నుంచి కల్వకుర్తి నాలుగు వరుసల రోడ్డు, కొట్ర గేట్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ వరకు చేపట్టిన రెండు వరుసల రహదారి, కల్వర్టుల నిర్మాణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి.. బీటీరోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ వెంకటస్వామి, ఏఈలు సయ్యద్సోయద్దీన్, లక్ష్మీపతి తదితరులున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి వెల్దండ: గ్రామాల్లో రైతులు, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్శాఖ హైదరాబాద్ రూరల్ జోన్ ఇంజినీయర్ బాలస్వామి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ప్రజాబాటలో భాగంగా జిల్లా ఎస్సీ నరసింహారెడ్డితో కలిసి ఆయన వెల్దండ మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది చూడాలన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు కాలనీలు పెరిగిన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఈ శంకరయ్య, ఎస్ఏఓ పార్థసారథి, ఏఈ వెంకటేశ్వర్గౌడ్, సిబ్బంది అంకిత, లక్ష్మణ్నాయక్, యాదయ్య, లస్కర్, యాదగిరి, రామకృష్ణ , భాను, సికిందర్ తదితరులు ఉన్నారు. మూలవిగ్రహాల ఫొటోలు తీయడం నిషేధం అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో వెలసిన మూలమూర్తుల ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధించినట్లు ఆలయ ఈఓ దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి మూల విగ్రహాలతోపాటు అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం ఫొటోలు, వీడియోలు తీయరాదని చెప్పారు. ఇకపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్ట్రాగాంలలో రీల్స్ రూపంలో పోస్టు చేయరాదని పేర్కొన్నారు. మీడియాతోపాటు భక్తులు, ప్రజలు, ఆలయ అర్చక, సిబ్బంది ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆమె కోరారు. 30న కేంద్ర మంత్రి రాక ఉండవెల్లి: జోగుళాంబ ఆలయ సందర్శన, జోగుళాంబ హాల్ట్ పర్యవేక్షణకు గాను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం విచ్చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ముందుగా ఆదివారం సాయంత్రం రోడ్డు మార్గంలో అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాద్ స్కీం నిధులతో ఏర్పాటు చేస్తున్న లేజర్ లైట్ను వీక్షించి హరిత హోటల్లో బస చేస్తారన్నారు. అనంతరం సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వేస్టేషన్ పనులను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీసి పర్యవేక్షిస్తారు. అనంతరం గద్వాలకు బయలుదేరి వెళ్తారు. -
పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్నునాయక్
కందనూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చిన్నునాయక్ (హెడ్కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ను నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలవగా.. ఆయన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పోలీస్ అసోసియేషన్ అనేది కేవలం ఒక సంఘం మాత్రమే కాదని, అది పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవానిరతిని మరింత బలోపేతం చేసే కీలక వేదిక అన్నారు. పోలీస్ శాఖలోని ప్రతిఒక్కరి సమస్యల పరిష్కారం, సంక్షేమానికి నూతన కార్యవర్గం బాధ్యతాయుతంగా కృషి చేయాలని, విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి అధికారులు, సిబ్బందికి మధ్య వారదిగా ఉంటూ ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యక్షులుగా అశోక్రెడ్డి (సీఐ), రాములు (ఎస్ఐ), కార్యదర్శిగా మాధవరెడ్డి(ఎస్ఐ), సహ కార్యదర్శిగా రమేష్, కార్య నిర్వాహక కార్యదర్శిగా రాములు, కోశాధికారిగా శ్రీనివాసులు, సభ్యులుగా రవివర్మ, నాగరాజు, శారద, శ్రీనయ్య, కిషోర్రెడ్డి, హరిలాల్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శంకర్, ఏఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
విత్తన వ్యాపారంలోకి పీఏసీఎస్లు
● ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సంఘాలదే బాధ్యత ● రైతులకు నాణ్యమైన విత్తనాలు.. సంఘాలకు స్థిరమైన ఆదాయం ● ఐదు జిల్లాల్లో 9 పీఏసీఎస్లతో పైలట్ ప్రాజెక్టు మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీకే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక విత్తనోత్పత్తి వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ చేపట్టి ఆదాయాన్ని పెంచుకోనున్నాయి. స్థానికంగానే నాణ్యమైన విత్తనాలు లభించడంతో రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో పీజేటీఎస్ఏయూ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్నగర్ డీసీసీబీలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన 9 పీఏసీఎస్ల ప్రతినిధులు, సీఈఓలతో పాటు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్కే రావు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనమే అధిక దిగుబడి, రైతుల ఆదాయానికి కీలకమన్నారు. పీఏసీఎస్లు విత్తనోత్పత్తిని లాభదాయక వ్యాపారంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పీజేటీఎస్ఏయూ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ ఎంవీ నాగేష్ మాట్లాడుతూ విత్తన ఎంపిక నుంచి సాగు, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ పీజేటీఎస్ఏయూ, నాబార్డు, సహకార శాఖ, పీఏసీఎస్లు, రైతుల సమన్వయంతో ప్రాజెక్టును విజయవంతం చేయవచ్చన్నారు. ఆర్ఏఆర్ఎస్ పాలెం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ మాట్లాడుతూ విత్తనోత్పత్తికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ మహ్మద్ షఫీ ఉల్లా ఖాన్, నాబార్డు డీడీఎంలు షణ్ముఖచారి, మహేందర్, డీసీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అటకెక్కిన ఆన్లైన్ సేవలు
● గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి రాని డిజిటల్ సేవలు ● ఆపరేటర్లు లేక నిరుపయోగంగా పరికరాలు కల్వకుర్తి రూరల్: గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలు అటకెక్కాయి. టీ ఫైబర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. జీపీల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయకపోవడం, ఆపరేటర్లను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. క్లస్టర్ పంచాయతీ కార్యాలయాల్లో సర్వర్ ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆపరేటర్లు లేక ఇబ్బందులు.. జిల్లాలో 454 గ్రామ పంచాయతీలు ఉండగా.. 9 క్లస్టర్ గ్రామాల్లో సర్వర్లు, ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా వరకు వాటిని వినియోగించడం లేదు. దీంతో కార్యదర్శులు ఏ పని అవసరమున్నా మండల కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీడీఓ కార్యాలయంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు ఉండటంతో వారి ద్వారా కార్యదర్శులు ఆన్లైన్ పనులు చేయించుకుంటున్నారు. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఆపరేటర్లు మాత్రమే ఉండటంతో పనిభారం పెరిగి.. సరైన సమయంలో పనులు కావడం లేదు. కాగా, కొన్ని క్లస్టర్లలో ఉండాల్సిన కంప్యూటర్లను ఎంపీడీఓ, ఉపాధి హామీ కార్యాలయాలలో వినియోగిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని క్లస్టర్ గ్రామాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఆపరేటర్లను నియమించలేదు. కేవలం 60 మంది ఆపరేటర్లు మాత్రమే ఉండటంతో వారంతా ఆయా మండలాల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో లేవు. మండల పరిషత్ కార్యాలయంలోనే పనులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తాం. – శ్రీరాములు, డీపీఓ -
నోటీసుల కలవరం!
● అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల ఆందోళన ● తగిన గుర్తింపు కార్డు చూపిస్తేనే అర్హులుగా గుర్తింపు ● నేడు జిల్లావ్యాప్తంగా గ్రామ/వార్డు సభలు అచ్చంపేట: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. అందులో చాలా మంది తమ పేర్లు కనిపించడం లేదు. మరికొందరి పేర్లు ఉన్నప్పటికీ.. వివరాలు సరిగ్గా లేవని, అన్మ్యాపింగ్ కాలేదని నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే సరైన స్పష్టత లేకుండా చాలా మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సభలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ కల్వకుర్తి నియోజకవర్గాల్లో 8,35,482 (85.52 శాతం) మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించగా.. అందులో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లు 1,81,115 మంది ఉన్నట్లు తేలింది. వీరు సరైన పత్రాలు చూపిస్తేనే తుది జాబితాలో స్థానం దక్కుతుంది. 1.81లక్షల మందికి నోటీసులు.. గత జూన్లో ఎన్నికల సంఘం ప్రకటించిన జిల్లా ఓటర్ల జాబితాలో 9,76,987 మంది ఉన్నారు. అదే నెల 25 నుంచి ప్రారంభమైన ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. అందులో 8,35,482 మందికి స్థానం దక్కగా.. మరో 1,41,505 మంది ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే గాక, ఫారం తీసుకోని వారు, తీసుకున్నా ఇవ్వనివారు ఉన్నారు. అయితే ముసాయిదా జాబితాలోని 1,65,552 మందికి సంబంధించి పేర్లలో అక్షర దోషాలు, చిరునామా, ఫొటోలు తప్పుగా ఉండి, మ్యాపింగ్ వివరాల్లో వ్యత్యాసం రావడంతో అనామలీస్ జాబితాలో చేర్చారు. మరో 43,131 మంది వివరాలు 2002 ఓటరు జాబితాతో పోల్చినప్పుడు వివరాలు లేక మ్యాపింగ్ కాలేదు. వారందరికీ బీఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. మరికొందరికి సెల్ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈఆర్వో, ఏఈఆర్వో వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. సర్ ప్రక్రియలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామ/వార్డు సభలు కీలకం కానున్నాయి. ఈ సభల్లో ఈ నెల 17న ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల వారీగా చదివి వినిపిస్తారు. జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరును తుది జాబితాలో ఉండేలా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు గ్రామ/వార్డు సభ వేదిక కానుంది. ప్రజల సమక్షంలో పేర్లను చదివే అవకాశం ఉండటంతో ఎక్కడైనా ఏఎస్డీడీ జాబితాలో ఉన్న ఓటర్లు స్థానికంగానే ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వెంటనే వారిని గుర్తిస్తారు. బోగస్ ఓట్లు, తదితర అభ్యంతరాలు వస్తే వాటిని నమోదు చేసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి వివరాలను సేకరిస్తారు. ఈ సభల్లో ఫారాలు–6, 7, 8 అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు.. ముసాయిదా జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు తెలిపేందుకు.. పేర్లు, చిరునామాలు వంటి వాటిలో తేడాలు, అక్షర దోషాలు ఉంటే మార్పులు, చేర్పులకు వీటిని ఉపయోగిస్తారు. జిల్లాలో గత జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు: 9,76,987 ముసాయిదా జాబితా : 8,35,482 అనామలీస్ ఓటర్ల సంఖ్య: 1,65,552 తొలగించిన ఓటర్లు 1,41,525 మ్యాపింగ్ కాని వారు 43,131 ముసాయిదా జాబితాలో పేర్లు ఉన్నాయా.. లేదా అని జిల్లావాసులు కొందరు నేరుగా, మరికొందరు ఆన్లైన్లో చూసుకుంటున్నారు. అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండటంతో చివరి వరకు కొనసాగుతాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదా విడుదలైతే ఓటు హక్కు ఉన్నట్టేనని ఇన్నాళ్లు భావించగా.. ఒక్కసారిగా నోటీసులు రాగానే అవాక్కయ్యారు. అనామలిస్, మ్యాపింగ్ కాని వారికి కూడా జాబితాలో చేర్చడంతో ఈ పరిస్థితి ఎదురువుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు, గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ముసాయిదా ఓటరు జాబితాను చదివి వినిపిస్తారు. ఈ సభలోనే తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడిస్తారు. అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన వివరాలను బీఎల్ఓల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరును తుది జాబితాలో ఉండేలా చూసేందుకు గ్రామ/వార్డు సభలు వేదికగా ఉపయోగపడుతాయి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ -
పర్యాటక సందడి
● సోమశిలలో బోటు షికారికి పర్యాటకుల ఆసక్తి ● ఏడు రకాల బోట్లను అందుబాటులో ఉంచిన టూరిజంశాఖ ● బోటింగ్ సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొల్లాపూర్: శ్రీశైలం జలాశయానికి వరద జలాలు రావడంతో కృష్ణానది కళకళలాడుతోంది. నదీ తీర ప్రాంతాల్లో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు, టూరిజంశాఖ ఏర్పాటుచేసిన బోట్లలో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించిన సోమశిల వ్యూ పాయింట్ను తిలకించేందుకు బారులు తీరుతున్నారు. రెండు, మూడు వారాలుగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. నదీ తీర ప్రాంతాల్లో ఇలా.. శ్రీశైలానికి వరద జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో సోమశిల వద్ద పర్యాటక బోట్ల సేవలను ఇటీవలే ప్రారంభించారు. ఏడు రకాల బోట్లు పర్యాటకులు విహరించేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్ సేవలను ఇంకా ప్రారంభించలేదు. ఆఫ్లైన్లోనే టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నదిలో బోటింగ్కు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ ప్రాంతాలను కూడా పర్యాటకులు తిలకిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొరవడిన నిఘా.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల సోమశిలలో కొందరు పర్యాటకులు అర్ధరాత్రి సమయంలో బోటింగ్ సిబ్బందిపై దాడి చేశారు. రాజకీయ నాయకుల జోక్యంతో దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసులు నమోదుచేసి వదిలిపెట్టారు. దీంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించేందుకు పకడ్బందీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ వంటి ప్రాంతాల్లో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్పీడ్ బోట్: ఒక్క ట్రిప్పు రూ.400 చార్జీ ఉంటుంది. నలుగురు వ్యక్తులు తిరగొచ్చు. అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. అదనపు వ్యక్తులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మినీ లాంచీ : ఇందులో 60మంది వరకు ప్రయాణించవచ్చు. పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చార్జీ వసూలు చేస్తున్నారు. జెట్స్కీ బోట్ : ఒక వ్యక్తి మాత్రమే దీనిపై రైడ్ చేయవచ్చు. టికెట్ చార్జీ రూ.500 ఉంటుంది. ఫనీయాక్ : ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.200 టికెట్ చార్జీ. పెడల్ బోట్ : ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. కై యాక్ బోట్ : ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణిస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్ చార్జీ. స్వాన్బోట్ : ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్ చార్జీ. వ్యూ పాయింట్ తిలకించేందుకు ఒక్క ట్రిప్పు రూ.800 ధర నిర్ణయించారు. వాహనంలో 4 నుంచి 6 మంది వరకు వెళ్లొచ్చు. ప్రయాణ సమయం 40 నిమిషాలు. రెండు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షించవచ్చు. అటవీశాఖ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సమీపంలో ఎకో పార్కు నిర్మించారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలో నల్లమల అడవిలో ఎత్తయిన కొండపై వ్యూ పాయింట్ ఏర్పాటుచేశారు. ఇక్కడినుంచి చూస్తే సోమశిల గ్రామంతో పాటు కృష్ణానది ప్రవాహం, నల్లమల పచ్చదనం కంటికి ఇంపుగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ సేవలను గతనెల 8న రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నాటి నుంచి వ్యూ పాయింట్ను తిలకించేందుకు కూడా పర్యాటకులు వస్తున్నారు. వారి కోసం అటవీశాఖ అధికారులు రెండు వాహనాలను ఏర్పాటుచేశారు. టికెట్ బుకింగ్ ఆఫ్లైన్లోనే కొనసాగుతోంది. పర్యాటకులకు నల్లమల అందాలను చూపించేందుకు సోమశిల నుంచి అమరగిరి వరకు నూతనంగా మట్టిరోడ్డు నిర్మించారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్
కొల్లాపూర్ రూరల్: పోలీసు ఉద్యోగాల సాధనకు సన్నద్ధమవుతున్న కొల్లాపూర్ నియోజకవర్గ యువతకు రత్నగిరి ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులకు మెరుగైన శిక్షణ అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కొల్లాపూర్ మినీ స్టేడియంలో వంద రోజులపాటు ఉచిత శిక్షణ కొనసాగుతుందని.. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, శిక్షణ ప్రారంభ తేది, ఇతర పూర్తి వివరాలను త్వరలో రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ వెల్లడిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు హనుమంత్, కౌన్సిలర్లు బోరెల్లి మహేశ్, నర్సింహ, కర్నె శివ, పసుపుల నర్సింహ, రాజశేఖర్గౌడ్, వేణుగౌడ్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
కందనూలు: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జామ మసీదు నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. జామియా నిజామియా అరబీ యూనివర్సిటీకి చెందిన మౌలానా ముఫ్తీ మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఖాద్రి, ఖతీబ్ ముఫ్తీ గుల్జార్ అహ్మద్ మిస్బాహి మహమ్మద్ ఆధ్యాత్మిక బోధన చేశారు. ప్రతి ముస్లిం అల్లా సూచించిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, ఫిక్రే రజా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పాలకుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు
నాగర్కర్నూల్: పాలకుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే రూ. 1,000 కోట్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నార్లాపూర్ వద్ద ప్రారంభిస్తే.. కేఎల్ఐకి ఇబ్బందులు ఏర్పడతాయని లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఐదు మోటార్లు ధ్వంసమయ్యాయన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వాటికి మరమ్మతు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్లే ప్రభుత్వం కాల్వల సామర్థ్యం కుదించిందని.. నార్లాపూర్ నుంచి అండర్ గ్రౌండ్ పనులకు అనుమతులు కమీషన్ల వల్లే ఇచ్చారని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నా.. కమీషన్ల కోసం ఏదుల నుంచి నీటిని తరలించేందుకు నిధులను మంజూరు చేశారని విమర్శించారు. సాగునీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఉండటంతో నల్లగొండ జిల్లాకు నీటిని తరలించేందుకు రూ. 1,800 కోట్లు మంజూరు చేశారని.. మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి పాలమూరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని.. ఈ మేరకు రైతులను చైతన్యం చేసి పాలకుల వైఫల్యాలను ఎండగడతానని అన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్ ఉన్నారు. -
శ్రీశైలంలో 874.70 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రం నాటికి 874.70 అడుగులు (162.0554 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ.. 14,359 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం 164.7532 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారుగా 2 టీఎంసీల నీటిమట్టం తగ్గింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.663 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్కు 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 8వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. 170.477 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 14 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
లింగాల: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం లింగాలలోని ఎస్టీ బాలుర వసతి గృహం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, అప్పాయపల్లి, క్యాంపు రాయవరం ఆశ్రమ పాఠశాలలను డీటీడీఓ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆయా పాఠశాలల స్థితిగతులు, నిర్వహణ, అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న అల్పాహారం, భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన హెచ్డబ్ల్యూలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ పాటిస్తూ, నాణ్యమైన భోజనం, తాజా కూరగాయలు అందించాలని చెప్పారు. వసతి గృహాలలో ఎంత మంది వర్కర్లు పని చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. -
జోరుగా సబ్స్టేషన్ల నిర్మాణం
నాగర్కర్నూల్: విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. గృహ వినియోగమే కాకుండా వ్యవసాయ వాడకం సైతం అధికమైంది. వీటికితోడు చిన్న, పెద్ద పరిశ్రమలు పుట్టుకొస్తుండటంతో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోయి.. నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటికే 33/11 కేవీ సబ్స్టేషన్లు 107 ఉండగా.. అదనంగా మరో 39 స్టేషన్ల నిర్మాణం చేపడుతోంది. ఇవేకాక ఇవేకాక 132/33, 220/132 సబ్ స్టేషన్లు నిర్మించాలన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నారు. 220/132 నిర్మాణంలో జాప్యం మరికల్ వద్ద చేపట్టిన 220/132 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇది ప్రారంభమైతే వనపర్తి, జడ్చర్లలోని కొన్ని గ్రామాలు, లట్టుపల్లి, మంగనూరు తదితర గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం లట్టుపల్లి, మంగనూరు చుట్టుపక్కల గ్రామాలు, రైతులు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. నాలుగైదు నెలల్లో పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో 220/33 సబ్స్టేషన్ అమ్రాబాద్కు మంజూరు చేయగా.. టెండర్ పిలవాల్సి ఉంది. ● వంగూరు మండలం పోల్కంపల్లి వద్ద 132/33 సబ్స్టేషన్ మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఈ విద్యుత్ స్టేషన్తో వెల్దండ, చారకొండ మండలాలతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లలో విద్యుత్ సమస్య చాలా వరకు తీర్చవచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో మంజూరైనవి కలిపి.. జిల్లాలో ప్రస్తుతం 107 33/11 కేవీ సబ్స్టేషన్లు ఉండగా.. వీటికి తోడుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా 39 నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.3– 3.50 కోట్ల వరకు వెచ్చిస్తుండగా.. 39 స్టేషన్లకు గాను రూ.130 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మూడు మాత్రం పదేళ్ల కిందట మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. వెల్దండ మండలంలోని పోతేపల్లి, కొల్లాపూర్ పరిధిలోని మంచాలకట్ట, పెంట్లవెల్లి గ్రామాల్లో మంజూరైన సబ్స్టేషన్ల నిర్మాణంలో వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీటిపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించి పనులు వేగవంతం చేస్తున్నారు. త్వరలో ప్రారంభించాలన్న లక్ష్యంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఇవే కాక జిల్లాలోని వివిధ మండలాల్లో 36 సబ్స్టేషన్లు కొత్తగా మంజూరయ్యాయి. కొన్ని టెండర్ దశలో, మరికొన్ని వివిధ దశల్లో పనులు నడుస్తున్నాయి. వీటి పనుల్లోనూ వేగం పెంచి పూర్తిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే ఐదేళ్ల డిమాండ్ అంచనా వేసి కొత్తగా మంజూరు జిల్లాలో కొత్తగా 39 33/ 11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం రూ.130 కోట్లకుపైగా వ్యయంతో ముమ్మరంగా పనులు -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎస్పీ
కందనూలు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని, రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో మనం తీసుకునే ప్రతి అడుగు ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, సీఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో 875.20 అడుగుల నీటిమట్టం అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 875.20 అడుగుల 164.7532 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 11,500 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అయితే సోమవారం ఉదయం 166.7052 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వదలడంతో ఒక టీఎంసీ మేర తగ్గింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్కు 31,364 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. -
లాభదాయక పంటలే సాగుచేయాలి
కందనూలు: లాభదాయక పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అన్నారు. నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహణ, పర్యాటక అభివృద్ధి, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, వ్యవసాయ తదితర అంశాలపై మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ చెన్నయ్య, డీఎఫ్ఓ రేవంత్చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ప్రస్తుత వాతావరణం, నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఆయిల్పాం, మొక్కజొన్న, బిందు సేద్యం ద్వారా కూరగాయలు, ఇతర లాభదాయకమైన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ డిమాండ్, నీటి లభ్యత, పంటల ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సోమశిల, మన్ననూరు ఎకో టూరిజం, పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఆర్ఓ పాండు, జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. నాగర్కర్నూల్: జవహర్ నవోదయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో నవోదయ అడ్వైజరీ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలపై చర్చించగా.. ప్రిన్సిపల్ పూర్ణిమ పాఠశాలలోని ప్రస్తుత పరిస్థితులను కమిటీకి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నవోదయ విద్యాలయానికి అవసరమైన వనరులు, మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందాలని సూచించారు. ఆమోదం పొందిన ప్రతిపాదనల మేరకు జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎఫ్ఓ రేవంత్చంద్ర, నవోదయ వైస్ ప్రిన్సిపల్ సుధారాణి, ఆఫీస్ సూపరింటెండెంట్ మాణిక్ప్రభు, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగీకారం తెలపని 166 కుటుంబాలు..
నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. -
గిరిజనేతరులు సై.. చెంచులు నై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. తొలి దశలో 4 గ్రామాలు.. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు. వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం.. గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన -
పెంటల్లోనే ఉపాధి కల్పించాలి..
నల్లమలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ.. అడవినే నమ్ముకుని జీవిస్తున్న మమ్మల్ని తల్లి ఒడి నుంచి విడదీయడం సమంజసం కాదు. మేము ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం మాకు అండగా ఉంటూ పెంటల్లోనే జీవనోపాధి కల్పించాలని ఆశిస్తున్నాం. – చిగుర్ల లింగేష్, డిగ్రీ విద్యార్థి, సార్లపల్లి పూర్తి పరిహారం అందాకే నిర్ణయం.. మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు, గిరిజనేతరుడు, సార్లపల్లి కొందరు ఇబ్బంది పెడుతున్నారు సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ, అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అమ్రాబాద్ ఫారెస్ట్లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం. – రేవంత్ చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ బలవంతం లేదు.. హైదరాబాద్లోని కాలనీల తరహాలో బాచారం పునరావాస కేంద్రంలో అడవి బిడ్డలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వసతులు కల్పిస్తాం. చెంచులను ఇబ్బంది పెట్టేది లేదు. బలవంతం లేదు.. స్వచ్ఛందంగా వచ్చిన వారికి పునరావాసం కల్పిస్తాం. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి -
నేత్రదానంపై అవగాహన అవసరం
కందనూలు: నేత్రదానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఒకరి నేత్రదానంతో ఇద్దరికి చూపు వస్తుందని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం బిజినేపల్లి మండలంలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 41వ నేత్రదా న పక్షోత్సవాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయి ంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్రదా నం ప్రతి కుటుంబం సంప్రదాయంగా మార్చుకో వాలని, అంధులకు చూపునివ్వాలని కోరారు. కంటిలో కార్నియా ఇన్ఫెక్షన్, దెబ్బల వలన, కంట్లో రసాయన పడటం వల్ల, పోషక విలువలు లోపించడం వలన కార్నియా స్వచ్ఛత కోల్పోవడం ద్వారా అంధత్వానికి దారితీస్తుందన్నారు. ఎవరైనా మర ణించిన తర్వాత తమ నేత్రాలను 6 గంటలలోపు దానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, వైద్యాధికారి ప్రియాంక, సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రామసభల నిర్వహణ
నాగర్కర్నూల్/ కందనూలు: జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం సర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఆయన వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గురువారం అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని, బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనామలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నోటీసులు అందించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామన్నారు. గురువారం నిర్వహించే గ్రామసభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. సభల నిర్వహణ వివరాలను సక్రమంగా డాక్యుమెంటేషన్ చేసి, సభల ఫొటోలను బీఎల్ఓ రిజిస్టర్లో భద్రపరచాలని స్పష్టం చేశారు. -
సారుసారుకో కొత్త కారు..!
మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..! విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పీయూలో విద్యార్థుల భవిష్యత్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. వీసీ మారినప్పుడల్లా.. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్ చాన్స్లర్ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణ కాలంలో ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్కు కేటాయించి.. రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ వాహ నం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్ మోడల్) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం ప్రస్తుతం వీసీ శ్రీనివాస్ ఇన్నోవా హై 2.5జెడ్, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్ రమేష్బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్ రాథోడ్ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు యూనివర్సిటీలో సరిపడా హాస్టల్ గదులు లేవని.. తాగడానికి మంచి నీరు, చదువుకోవడానికి లైబ్రరీలో ఆధునిక పుస్తకాలు, ల్యాబ్ సౌకర్యాలు లేవని.. విద్యార్థుల కష్టాలు పట్టని అధికారులకు ఈ లగ్జరీ కార్ల మోజు ఎందుకని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం నిబంధనలకు నీళ్లు.. -
పట్టించుకోవడం లేదు..
జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల ఓ కొర్పొరేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ టారిఫ్ రేట్లను కాదని రోగుల వద్ద అదనపు వసూలు చేస్తున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఉన్నాతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. – కేతేపల్లి శంకర్, పెద్దముద్దునూర్, నాగర్కర్నూల్ మండలం ఆ భూములు తొలగించాలి.. ఉప్పునుంతల మండలం విఘ్నేశ్పూర్ శివారులో 140 మందికి సంబంధించి 136 ఎకరాలు నిషేధిత 22ఏలో చూపించారని వీటిని తొలగించాలని గ్రామ స్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూమిని తాము చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుచేస్తున్నామని పేర్కొన్నారు. –విఘ్నేశ్పూర్ గ్రామస్తులం, ఉప్పునుంతల మండలం -
ఖాళీల భర్తీ ఎప్పుడో..?
కందనూలు: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ, నోటిఫికేషన్లో జారీ మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ చేపడుతున్నారు. కానీ, జిల్లాలో ఖాళీ పోస్టులను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించినా ఇప్పటికీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో టీచర్, సహాయకులు లేని అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. అందని పౌష్టికాహారం.. అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని సంవత్సరాలుగా టీచర్లు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. చిన్నారులు ఆటపాటలు, బోధనకు దూరమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో టీచర్లు లేక సహాయకులు పిల్లలకు భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సహాయకుల పోస్టులు సంవత్సరాల తరబడి భర్తీ చేయకపోవడంతో వారి విధుల్ని సైతం టీచర్లే నిర్వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందక ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. టీచర్లు, ఆయాలదే కీలకపాత్ర.. జిల్లాలో అంగన్వాడీ నిర్వహణ పూర్తిగా జిల్లా మహిళా, శిశు సక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందులో భాగంగా జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1,132 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 171 టీచర్ పోస్టులు, 558 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో వీరే కీలకపాత్ర వహిస్తున్నారు. వీరు అంగన్వాడీల నిర్వహణతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ కార్యక్రమాలు, బూత్ లెవల్ అధికారులుగా ఎన్నికల విధుల్లోనూ సేవలందిస్తారు. ఈ విధంగా వారికి పలు రకాల విధులు కేటాయించడంతో వారిపై పనిభారం ఎక్కువై ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా పోస్టులు భర్తీ చేసినట్లయితే తమకు పనిభారం తగ్గి.. సేవలు మెరుగుపడుతాయని వారు భావిస్తున్నారు. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో ఖాళీగా టీచర్, ఆయా పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయనుండగా ఆశావహులు నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో పదో తరగతి చదివినవారికి ఆంగన్వాడీ పోస్టులు ఇవ్వగా.. ప్రస్తుతం విద్యార్హత ఇంటర్మీడియట్ పెంచారు. ఆయాలకు పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఇంటర్ చదివి స్థానికంగా నివాసం ఉండే అర్హులైన మహిళలను టీచర్గా నియమించనున్నారు. గతంలో మాదిరిగానే కమిటీ చైర్మన్గా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇంటర్లో సాధించిన మార్కులకు మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టనుండగా నోటిఫికేషన్ వస్తే దరఖాస్తు చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ పోస్టుల కోసం నిరీక్షణ నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జిల్లావ్యాప్తంగా 171 టీచర్, 558 సహాయకుల పోస్టులు భర్తీ కోసం అశావహుల ఎదురుచూపులు ఉమ్మడి పాలమూరులో మిగతా చోట్ల మొదలైన ప్రక్రియ -
గ్రీవెన్స్కు 2 అర్జీలు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 2 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 1 భూమికి సంబంధించినవి, 1 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చాయన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు. శ్రీశైలంలో తగ్గిననీటిమట్టం అచ్చంపేట/ ఆత్మకూర్: ఎగువనున్న జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయానికి 7,134 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 875.70 అడుగుల వద్ద 166.7052 టీఎంసీల నీటిమట్టం ఉంది. అయితే ఆదివారం 168.2670 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు వదులుతుండటంతో 2 టీఎంసీల మేర తగ్గింది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు ఐదురోజుల నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రబుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. తగ్గిన విద్యుదుత్పత్తి... ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి ప్రాజెక్టులు బలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలి
బల్మూర్: బల్మూరు శివారులో నిర్మించబోయే ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ తక్షణమే డిజైన్ మార్పు చేసి రైతులను ఆదుకోకపోతే బాధిత రైతులను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, నాగరాజు, లాల్ అహ్మద్, బాబర్, శ్రీరామ్, శ్రావణ్కుమార్, కృష్ణయ్య, అంజి, బాలరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తవ్వేస్తున్నారు..
మా పొలంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఇసుక తవ్వి ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. ఈ విషయాన్ని అడిగితే నాపైనే తిరిగి దాడి చేశారు. నా పొలంలో ఇసుక తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. – ఈశ్వరయ్య, అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం చర్యలు తీసుకోండి మా గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు మాపై దాడి చేస్తున్నారు. నా భర్త చాలా ఏళ్ల కిందట మరణించగా.. కూతురు నాసు చిట్టెమ్మ (అంధురాలు) మాత్రమే ఉంటున్నాం. వారు రాత్రి సమయంలో మా ఇంటిపై రాళ్లు వేస్తూ, తలుపులు కొడుతూ.. దూషిస్తూ ఇబ్బందులకు గురుచేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించి.. మాకు రక్షణ కల్పించాలి. – నాసు లక్ష్మమ్మ, పోతిరెడ్డిపల్లి, వంగూర్ మండలం -
రోడ్లు అభివృద్ధి చెందితేనే పరిశ్రమలు
అచ్చంపేట/ బల్మూర్/ పెంట్లవెల్లి: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో జాతీయ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్ల అంచనాతో చేపట్టనున్న 3 రహదారి అభివృద్ధి పనులకు బల్మూర్లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులు, నాలుగు లేన్ల రోడ్లు, ఎలివేటేడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్, రావిర్యాల నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవేల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. బుల్లెట్ ట్రైన్ హబ్గా ఉంటే శంషాబాద్ వద్ద 500 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. శంషాబాద్, ఫ్యూచర్ సిటీ మీదుగా బెంగుళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు నల్లమల మీదుగా కర్నూలు వెళ్తుందన్నారు. రాత్రివేళ ఫారెస్టులో ప్రయాణం చేసే అవకాశం లేక శ్రీశైలంలో నైట్ ఎక్కువగా ఉండరని, ఘాట్ రోడ్డులో ఇబ్బందులు పోవాలంటే కారిడార్ నిర్మాణం జరగాలన్నారు. ఈ ప్రాజెక్టుతో నల్లమల ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి.. పర్యాటరం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ఆర్బీఐ గ్యారంటీ ద్వారా బ్యాంక్ లోన్ తీసుకొని రూ.7,200 కోట్లతో ప్లాన్, నాన్– ప్టాన్ కింద రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. రోడ్లు బాగుంటేనే ప్రయాణికులు ఇంటికి క్షేమంగా వెళ్తారని, మారుమూల ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉంటే పరిశ్రమలు వచ్చి.. యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ఆరు వరుసలతో శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్ అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇస్తాం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న మంత్రి జూపల్లి,ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ -
జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్సాగర్కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పార్టీని బలోపేతం చేయాలి గద్వాల: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత లోపాలు, కేడర్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రాజీవ్రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు తరలిన ఉద్యోగ, ఉపాధ్యాయులు కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అనే డిమాండ్తో సీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగులకు శాపంగా మారిన సీసీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కృషి ఫలితమే కేఎల్ఐ ప్రాజెక్టు కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మితమైందని వైఎస్సార్సీపీ నందికొట్కూర్ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేఎల్ఐ ప్రాజెక్టు వరప్రదాయిని అని పేర్కొన్నారు. ఐదేళ్ల వ్యవధిలోనే కేఎల్ఐ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారని గుర్తు చేశారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3 లక్షలపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్యాదవ్, నాయకులు మధు, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా విలేజ్ ప్రొఫైల్
● సిద్ధమవుతున్న మూడేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ● వందకుపైగా అంశాలపై వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు ● గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సన్నాహాలు అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. రాబోయే మూడేళ్లలో (2026–29) గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన అంశాలతో కూడిన తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీసీడీపీ) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జిల్లాలో 461 గ్రామ పంచాయతీల వారీగా పూర్తి వివరాలను సేకరిస్తున్న కార్యదర్శులు విలేజ్ ప్రొపైల్ను సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి మొత్తం వందకుపైగా అంశాలను నివేదికలో నమోదు చేస్తున్నారు. పంచాయతీ పేరు మొదలుకొని ఊరి విస్తీర్ణం, వా ర్డులు, రేషన్కార్డులు, నివాసాలు, కుటుంబాలు, కులాల వారీగా జనాభా, గుడులు, బడులు, రోడ్లు, మహిళా సంఘాలు, రైతులు, అక్షరాస్యత శాతం, చే పట్టాల్సిన అభివృద్ధి పనులు తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మరుగుదొడ్లు, సీసీరోడ్లు, తాగునీరు గ్రామాల్లో మరుగుదొడ్లు అవసరమైన వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డిని స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12 వేలతో నిర్మించనున్నారు. అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల సముదాయాలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా తాగునీరు సరఫరా చేసేందుకు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్ల విస్తరణతోపాటు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. పాత చేతిపంపులు, మోటార్ల మరమ్మతు కోసం అవసరమైన అంచనాలను నివేదికలో చేరుస్తున్నారు. అలాగే అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామాల మధ్య లింక్ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాలు శుభ్రంగా కనిపించేలా డ్రెయినేజీల నిర్మాణం, వీధుల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాల అవసరాలను గుర్తిస్తున్నారు. కాగా ఉపాధి హామీలో వన మహోత్సవం కింద అవెన్యూ ప్లాంటేషన్, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహిళా సంఘాలు, వారు తీసుకున్న రుణాలతో స్థాపించిన వ్యాపారాలను నివేదికలో పొందుపర్చుతున్నారు. గ్రామ సమగ్ర సమాచారం ప్రతి పౌరుడు సులభంగా తెలసుకునేలా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. -
ప్రణాళికతో సన్నద్ధం కావాలి
పోలీసు ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజానికి సేవ చేసేందుకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతోపాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీగా వ్యాయామం, రన్నింగ్, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్ టెస్టులు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవడంతోపాటు రివిజన్ చేయడం ముఖ్యం. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు. – రాజశేఖర్, ఎస్ఐ, కల్వకుర్తి ప్రభుత్వం పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషకరం. గత కొన్ని నెలల నుంచి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రతిరోజు రన్నింగ్ చేయడంతోపాటు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా. – తిరుపతి, అభ్యర్థి, నాగనూలు, నాగర్కర్నూల్ మండలం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గ్రంథాలయ సమయం వేళలు మార్చాలి. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయం మార్చి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తే చదువుకోవ డానికి మరింత వెసులుబాటు కలుగుతుంది. – శివ, అభ్యర్థి, పెద్దపల్లి, తెలకపల్లి మండలం కొన్నిరోజుల నుంచి పోలీసు ఉద్యోగం కోసం జిల్లా గ్రంథాలయంలోనే చదువుతున్నా. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఎలాగైనా ఈసారి పోలీసు ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నా. లైబ్రరీలో చదవడానికి కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు. అధికారులు చొరవ తీసుకొని మాకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. – బాలు, అభ్యర్థి, అవురాసిపల్లి, నాగర్కర్నూల్ మండలం ● -
కొలువుదీరాల్సిందే..!
–8లో uకందనూలు: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేయడంతో అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఆయా కొలువులు సాధించాలంటే చదువుతోపాటు దేహదారుఢ్యం కీలకంగా మారనుంది. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకపక్క మైదానంలో పరుగులు మొదలుపెడుతూ.. మరోపక్క పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే తపనతో నిరుద్యోగులు తమ మెదడుకు పదును పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 116 పోలీసు కానిస్టేబుళ్లు, జోన్ పరిధిలో 11 ఎస్ఐలకు నోటిఫికేషన్ విడుదవగా.. ఇందుకు సంబంధించి ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. 22 పోలీస్ స్టేషన్లలో.. జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం 116 కానిస్టేబుల్ పోస్టులు, జోగుళాంబ జోన్–7 పరిధిలో 9 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. గత నియామకాల మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, శారీరక ప్రమాణాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే కొలువుదీరడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు ప్రక్రియ, పరీక్షల షెడ్డ్యూల్, శారీరక పరీక్షల తేదీల కోసం జిల్లాలోని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని గ్రంథాలయాలకు ఉద్యోగార్థుల తాకిడి మొదలైంది. జిల్లాకేంద్రంతోపాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో అభ్యర్థులు పోలీసు కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రతిరోజు గ్రంథాలయాలకు చేరుకొని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నాగర్కర్నూల్లోని జిల్లా గ్రంథాలయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అభ్యర్థులతో సందడిగా ఉంటుంది. నిర్వాహకులు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో ప్రతిరోజు వంద మంది వరకు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి వస్తున్నారు. అయితే గ్రంథాలయంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. ఒక పార్ట్ టైం ఉద్యోగి, ఒక స్వీపర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జోన్ పరిధిలో పోస్టుల వివరాలు ఇలా.. గ్రంథాలయాలకు పెరిగిన నిరుద్యోగుల తాకిడి ఉదయం, సాయంత్రం వేళల్లో పుస్తకాలతో కుస్తీ జిల్లాలో 116 కానిస్టేబుల్, జోన్ పరిధిలో 11 ఎస్ఐ పోస్టులు ఈ నెల 19 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ -
ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డు
ఉప్పునుంతల/ అచ్చంపేట రూరల్/ చారకొండ: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రేషన్కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఉప్పునుంతల, అచ్చంపేట, చారకొండలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సీఎం రేవంత్రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉండి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందరమ్మ ఇళ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. తహసీల్దార్లు సునీత, సైదులు, ఉమ, డీటీ రమేష్నాయక్, సర్పంచ్ శ్రీనివాసులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, మండలాధ్యక్షులు లక్ష్మీనారాయణ, భీముడునాయక్ పాల్గొన్నారు. -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 8 చోట్ల ప్లాంట్లు రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్లో 30 (20+10), మహబూబ్నగర్లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్కర్నూల్లో 20 , షాద్నగర్లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మెయిన్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
తాడూరు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మల్యే రాజేష్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇంద్రకల్లో రూ.20 లక్షలతో నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రతిపక్ష నాయకులు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా పాలనపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో పీఆర్ఏఈ శివకృష్ణ, మాజీ సర్పంచ్ వెంకటయ్య, చైర్మన్ రాంచంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ రమణరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, సర్పంచ్ మల్లయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీకి.. భవనం కష్టాలు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలో గతేడాది ప్రారంభమైన బాసర ట్రిపుల్ ఐటీకి సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులకు వసతి, తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. గతేడాది బండమీదిపల్లిలోని రెడ్డి హాస్టల్లో తరగతులు, వసతి ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది రెండో బ్యాచ్ విద్యార్థులు చేరడంతో వారికి బీకేరెడ్డి కాలనీలోని మరో భవనాన్ని కేటాయించారు. దీంతో ఏటా వేర్వేరు భవనాల్లో కళాశాల నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం కోసం జడ్చర్ల సమీపంలో 43 ఎకరాల స్థలాన్ని కేటాయించి గతేడాది శంకుస్థాపన చేశారు. తొలివిడతలో రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో రెండు బ్యాచ్ల విద్యార్థులకు వేర్వేరు భవనాలు, ల్యాబ్లు, హాస్టళ్లు, మెస్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పీయూసీ–1లో 200 మంది, పీయూసీ–2లో 203 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు బ్యాచ్లకు వేర్వేరుగా వసతులు కల్పించాల్సి రావడంతో యాజమాన్యంపై అదనపు భారం పడుతోంది. సొంత భవనం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కొత్త భవనంలోనే తరగతులు ఈ ఏడాది చేరిన పీయూసీ–1 విద్యార్థులకు బీకేరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కొత్త భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయని సీనియర్ అధ్యాపకులు శ్రవణ్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో పాటు అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో రెండు మెస్లు, రెండు ల్యాబ్లతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సొంత భవనం లేక.. ఏటా కొత్త భవనాల్లో తరగతులు గతేడాది రెడ్డి హాస్టల్.. ఈసారి బీకేరెడ్డి కాలనీలో తరగతులు, వసతి నేటి నుంచి రెండో బ్యాచ్కు పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం -
రెవెన్యూ లీలలెన్నో!
ఎన్ఓసీ ఇచ్చింది వారే.. 22–ఏలోకి చేర్చింది వారే! ● ప్రభుత్వ భూములు పక్కదారి.. ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలోకి.. ● రిజిస్ట్రేషన్ కాక లబోదిబోమంటున్న యజమానులు ● జిల్లాలో వెలుగులోకి పలు సర్వే నంబర్లు అచ్చంపేట: రెవెన్యూ అధికారుల నిర్వాహకంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలైన ప్రభుత్వ భూములను వదిలేసి.. ప్రైవేటు ప్లాట్లు, నివాసగృహాలను ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆందోళన చెందుతున్నారు. డబ్బులు అవసరం ఉండి.. ప్లాట్లు, ఇతర భూములను అమ్ముకోవడానికి వెళ్తే.. రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా వృథా అవుతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్లో రెవెన్యూ అధికారులు నిషేధిత ప్రభుత్వ ఆస్తులు, భూముల జాబితా 22–ఏను అప్డేట్ చేశారు. ఈ క్రమంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో యజమానులకు కష్టాలు మొదలయ్యాయి. కొందరు అధికారులు చేసిన తప్పిదాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్లాట్ బుక్ కావడం లేదు.. మాకు అచ్చంపేటలోని సర్వేనం. 301/అ, 294/అ2, 294/అఇ, 294/అ/2/ఇలోని వెంచర్లో 5, 6 జాయింట్ ప్లాట్లలో మొత్తం 308 గజాల స్థలం ఉంది. ఇందులో 5వ నంబర్ ప్లాట్ను మూడు నెలల క్రితం ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశాం. ఇప్పుడు 6వ నంబర్ ప్లాట్ను అమ్ముకున్నాం. రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ కావడం లేదు. ఈ విషయం అచ్చంపేట సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసికెళ్లాం. 22ఏ నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పంపిస్తామంటే దరఖాస్తు చేశాం. ఇంత వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. రెండు నెలల్లోనే మా ప్లాట్ల రిజిస్ట్రేషన్లో ఇంత తేడా కనిపించింది. – వెన్నమనేని ప్రణిత, హైదరాబాద్ ముందుగా వివరాలు తెలుసుకోవాలి.. మా దృష్టికి వచ్చిన సర్వేనంబర్లను ఇప్పటికే రెండు పర్యాయాలు కలెక్టర్కు పంపించాం. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే క్రయ, విక్రయదారులు స్లాట్ బుక్ చేసుకోవద్దు. ముందుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించి, వివరాలు తెలుసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎవరు కూడా డబ్బు వృథా చేసుకోవద్దు. ప్రభుత్వం త్వరలోనే సమస్య పరిష్కరిస్తుంది. – క్రిష్టఫర్, సబ్ రిజిస్ట్రార్, అచ్చంపేట నిలిచిన రిజిస్ట్రేషన్లు.. అచ్చంపేట పట్టణానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఫారం–2లో నాన్ అగ్రికల్చర్ కింద రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22ఏ (1) (బి) ద్వారా సుమారు 15 సర్వే నంబర్లలో 45.28 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొన్నారు. ఇవి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలు, ఆరోగ్య కేంద్రం, శ్మశాన స్థలం మొదలైన ఉపయోగాల కోసం చూపబడ్డాయి. సర్వేనంబర్ల వారీగా 283అ5, 284, 285, 294, 326అ/2, 344అ/1/1ఆ, 353/అ1,353/అ2, 353అ2, 362/అ1/2, 369, 370, 371, 373అ, 373ఈ ఉన్నాయి. అయితే 169, 237, 301/అ, 285, 294, 294/అ2, 294/ఆఇ, 294/ఆ/2/ఇ, 353/అ1, 353అ2, లింగాల 2,17, టంగాపూర్ 30, లింగోటం 240 సర్వే నంబర్లలో నివాస గృహాలు, ప్లాట్లు ఉండగా.. వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. గతంలో ఈ భూములకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్ఓసీల ఆధారంగా వెంచర్ల అనుమతులు పొంది.. రియల్ వ్యాపారులు ప్లాట్లను అమ్ముకున్నారు. అయితే ఎన్ఓసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులే ఇప్పుడు ఈ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు లబోదిబోమంటున్నారు. -
వానాకాలం.. వారాబందీ!
● ఆరుతడి పంటలకే ప్రాధాన్యమంటున్న అధికారులు ● వరి సాగుకే ఆసక్తి చూపుతున్న అన్నదాతలు ● ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు.. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఏర్పడినప్పటి నుంచి ఏటా వానాకాలంలో వరి సాగు కోసం పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసే అధికారులు.. ఈ ఏడాది మాత్రం వారాబందీ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నా.. వానాకాలంలో వారాబందీ ఏమిటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా ఈసారి ఆరుతడి పంటలకే సాగునీరు వదులుతామని అధికారులు ఐడీబీ సమావేశంలో నిర్ణయించారు. వరి నారుమడులు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఎలాగైనా తమ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలాలని వేడుకుంటున్నారు. జలాశయాలు, ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని.. తక్కువ నీటిని వినియోగించాలంటూ గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి సీజన్లో వారాబందీ పద్ధతిన సాగునీటిని అందించిన అధికారులు.. వానాకాలం సీజన్లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిదిలో ఈసారి రబీ పంట సాగుకోసం ప్రాజెక్టు సమీపంలోని రామన్పాడ్ రిజర్వాయర్తో పాటు శంకర సముద్రం, గోపల్దిన్నె వరకు అమరచింత ఎత్తిపోతలు, కురుమూర్తి ఎత్తిపోతల ద్వారా వారంలో 4 రోజులు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లా పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల వరకు ఉండగా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. వానాకాలం విస్తీర్ణం ఖరారు.. జూరాల ఎడమ కాల్వ కింద ప్రస్తుత వానాకాలం సీజన్లో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటిని వానాకాలం పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించనున్న నేపథ్యంలో ముందస్తుగా వారాబందీ అమలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు వానాకాలం సీజన్లో వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నాం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరుతడి పంటలకుగాను వారంలో 4 రోజుల పాటు నీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా వేసవిలో కాల్వల్లో పూడికతీత చేపట్టాం. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
దరఖాస్తుల ఆహ్వానం
కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించి అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హులైన వారు ఈ నెల 27వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 92900 86457, 99638 68115 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. శనేశ్వరుడికి తైలాభిషేకాలు కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్టాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణమాసం శుక్లపక్షం జేష్ట మూలనక్షత్రం సందర్భంగా ఆలయ పూజారి గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరమశివుడిని దర్శించుకుని.. రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు. జూరాలకు 52వేల క్యూసెక్కుల వరద గద్వాల/అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం 52వేల క్యూసెక్కుల వరద న మోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.567 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 318.46 మీటర్లు (9.542 టీఎంలు) నీరు ఉంది. హైడల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి 37,394 క్యూసెక్కులు, భీమా–1కు 1,300, భీమా–2కు 872, కోయిల్సాగర్కు 630, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 585, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 49,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ● శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం స్పల్పంగా కొనసాగుతోంది. జలాశయం నీటిమట్టం 215.80 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రం నాటికి 167.4860 టీఎంసీలుగా నమోదైంది. 885 అడుగుల నీటి మట్టానికి గా ను 875.80 అడుగులుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 16.998 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శనివారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 82.131 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో మొత్తం 148.271 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు వివరించారు. -
సర్ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన
నాగర్కర్నూల్/కందనూలు: ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని 13,216 మంది ఓటర్లను గుర్తించినట్లు చెప్పా రు. అదే విధంగా ఓటర్లు సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారాల్లో ప్రస్తుతం నమోదైన వారి వివరాలను గత జాబితాతో సరిపోల్చి పరిశీలించినట్లు తెలిపారు. ఈ వివరాల విశ్లేషణలో మరో 1,02,635 మంది ఓటర్లను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. రెండు విభాగాల్లో గుర్తించిన 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నో టీసులు అందిన ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓ టర్ల వివరాలను మరింత స్పష్టంగా ధ్రువీకరించేందుకు, అర్హులైన ఓటర్లను నిర్ధారించేందుకు ఈ ప్రక్రి య చేపడుతున్నట్లు వివరించారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అన్నా రు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శా తం మరింత పెంచేందుకు మండల అధికారు లు, పర్యవేక్షణ బృందాలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు అలవడేలా చూడాలన్నారు. పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేందుకు ప్ర త్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే భవితా కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల గల పిల్లలకు చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ రమేశ్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటాజీ, ఎల్డీఎం చంద్రశేఖర్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు కిరణ్కుమార్, నూరుద్దీన్ ఉన్నారు. -
సగరులను బీసీ ఏ గ్రూపులో చేర్చకపోతే ఉద్యమిస్తాం
లింగాల: సగరులను బీసీ డీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. మండల పరిధిలోని అంబట్పల్లిలో శనివారం నిర్వహించిన సగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందరర్భంగా సగర గ్రామ అధ్యక్షుడు వేముల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సగరులు అన్ని రంగాలలో వెనుకబడి దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సగరులను బీసీ ఏ లోకి మార్చుతూ జీవో 166ను విడుదల చేయగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సగరులను తిరిగి బీసీ డీ లోనే కొనసాగిస్తున్నారన్నారు. సగరులను బీసీ ఏ గ్రూపులోకి మార్చడానికి అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు భగీరథ మహర్షి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని సగర కమ్యూనిటీ భవనం దగ్గర ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, గ్రామ సర్పంచు శ్రీవాణి హన్మంత్రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం
● రెవెన్యూ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెంట్లవెల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెంట్లవెల్లి మండలకేంద్రంలో ఆయన అధికారులతో సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ప్రధానంగా భూ సమస్యలను పలువురు రైతులు ఏకరువు పెట్టారు. భూముల మ్యుటేషన్ కోసం రోజుల తరబడి మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. రోజుల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని.. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పెంట్లవెల్లిలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. క్రీడా ప్రాంగణం కోసం 5 ఎకరాల భూమిని ఇస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భాస్కర్, రామన్గౌడ్, నర్సింహయాదవ్, గోపినాయక్, ఎండీ కబీర్, రూపం నాగరాజు పాల్గొన్నారు. -
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
పెంట్లవెల్లి: ‘సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు.. వారిని లంచాలు అడుగుతూ కావాలని కాలయాపన చేస్తే సహించేది లేదు.. ఒక్కో దరఖాస్తుకు.. ఒక్కో రేటు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు.. కార్యాలయం మొత్తం అవినీతిమయంగా మారిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆర్డీఓదే’ అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి.. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఏయే గ్రామం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. ఇంకా పెండింగ్లో ఎన్ని ఉన్నాయి.. వాటికి సంబంధించి రికార్డులు చూపించాలని ఆదేశించారు. అలాగే చాలాకాలంగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గమనించిన మంత్రి.. ఆర్డీఓ బన్సీలాల్ను సైతం తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని పెండింగ్ పైళ్లపై ఆరా తీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆర్డీఓ, తహసీల్దార్ భాస్కర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. మీరు కాలయాపన చేయడం ఏమిటని మండిపడ్డారు. కచ్చితంగా పెండింగ్లో ఉన్న పైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. లంచాలు అడుగుతూ కాలయాపన చేస్తే కఠిన చర్యలు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్డీఓ, తహసీల్దార్ల పనితీరుపై ఆగ్రహం టెంటు వేసుకుని కూర్చుంటా.. శనివారం కార్యాలయం దగ్గర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టెంటు వేసుకుని కూర్చుంటా.. మండల ప్రజలు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా దరఖాస్తు రూపంలో రాసుకుని రేపు నాకు ఇవ్వండి.. అలాగే గతంలో పనుల కోసం ఏ అధికారికి ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పండి.. ఎవరికై నా మొహమాటం టే దరఖాస్తు రూపంలో పూర్తి సమాచారంతో ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు. సోమవారం నుంచి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర ప్రత్యేకంగా ఒక అబ్బాయిని పెట్టి.. ఏ దరఖాస్తులు వస్తున్నాయో పూర్తిగా చదివి తమ ఆఫీసుకు పంపించాలని స్థానిక నాయకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు రామన్గౌడ్, గోవింద్గౌడ్, గోపినాయక్, నర్సింహయాదవ్, భాస్కర్గౌడ్, ఆసిఫ్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద
● 11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ● శ్రీశైలానికి తగ్గిన వరద.. 167.87 టీఎంసీల నిల్వ గద్వాల/ఆత్మకూర్/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
కందనూలు: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసం, అటవీ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్లు, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో వీసీ ద్వారా సమగ్ర సమగ్ర సమీక్ష నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట ఎత్తిపోతల పథకం తదిత సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణకు సంబంధించిన ప్రతి కేసును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, భూ యజమానులు, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ, నీటి పారుదల, అటవీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని చెప్పారు. అలాగే నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ చర్యలను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఆయా అంశాలపై పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. -
పక్కాగా పంటల లెక్క
నాగర్కర్నూల్: ఏటా వ్యవసాయాధికారులు పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఈ లెక్కల్లో పూర్తిస్థాయి కచ్చితత్వం ఉండవు. కొంత సమాచారం సేకరించి అంచనాలు వేసి ఆ గ్రామంలో ఈ పంట ఎన్ని ఎకరాలు.. మరో గ్రామంలో ఎన్ని ఎకరాలు అని నోటి లెక్కలు వేసి.. మండల, జిల్లావ్యాప్తంగా విస్తీర్ణం నిర్ణయిస్తారు. ఈ లెక్కల ఆధారంగా ఎరువుల కేటాయింపు, పంటల దిగుబడి కొనుగోళ్లు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వస్తుండటంతో.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తారుమారవుతాయి. అయితే ఇకపై కాకి లెక్కలకు పుల్స్టాప్ పెట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా పూర్తిస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం కచ్చితత్వంగా ఉంటుంది. వలంటీర్ సహాయంతో డిజిటల్ క్రాప్ సర్వే చేయనుంది. ఇక పంటల సాగు వివరాలు, ఎకరాలు, సర్వే నంబరుతో సహా, రైతుల పేర్లు వెలుగులోకి రావడంతో ఆ లెక్కలతోనే సాగు చేసిన ఎకరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా ఇవ్వనుందని సమాచారం. డిజిటల్ క్రాప్ సర్వే.. కేంద్ర ప్రభుత్వం చిన్న గ్రామం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో, ఏ రైతు ఎంత సాగు చేశారో కచ్చితమైన లెక్కలు ఉండాలనే నిర్ణయంతో డిజిటల్ క్రాప్ సర్వే కొత్త యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రతి పంట విస్తీర్ణంతోపాటు ఏ స్థలం ఎక్కడ, ఏ రైతు పొలంలో వేశారో తేలనుంది. గ్రామం నుంచి మండలంలో జిల్లాలో, రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు వేశారో ఎంత మంది రైతులో సంఖ్య తేలుతుంది. అన్ని రకాల పంటల వివరాలు ఎకరాల్లో కచ్చితమైన సమాచారం ఉంటుంది. దీంతో రైతుల వద్ద ఉన్న పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనాకు రావచ్చు. మార్కెట్ కొనుగోలు, విక్రయాలకు కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వివరాలు అన్నింటిని రైతులు పేర్లతో సహా ధాన్యం కొనుగోలు చేసే ఏజెన్సీలకు అప్పగిస్తారు. సాగు విస్తీర్ణంపై కచ్చితమైన లెక్కల కోసం డిజిటల్ యాప్ వలంటీర్తో ప్రతి సర్వేలో పంటల ఫొటో చిత్రీకరణ ఇక నుంచి పంటల సాగు విస్తీర్ణంపై కాకి లెక్కలకు చెల్లు పంటల దిగుబడి కొనుగోలుపై తేలనున్న లెక్క సీజన్ వారీగా సాగు చేసిన విస్తీర్ణంకే రైతు భరోసా -
ఎస్జీఎఫ్లో.. క్రీడల సందడి!
పీయూలో సీపీఆర్పై అవగాహనమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో విద్యార్థులకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిపుణులు బాబుల్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్షాక్, రోడ్డు ప్రమాదాలు తదితర ఘటనల్లో వ్యక్తులు స్పృహ కోల్పోయినప్పుడు వెంటనే అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. కొన్ని నిమిషాల్లో సీపీఆర్, ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడడంతో పాటు పరిస్థితి విషమించకుండా నిరోధించవచ్చన్నారు. కార్యక్రమంలో లయన్ నటరాజ్, అశ్విని చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీ యస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు మహబూబ్నగర్ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలతో పాటు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరో సారి ఎస్జీఎఫ్ క్రీడల సందడి నెలకొననుంది. ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు హైదరాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ, అండర్– 17, అండర్–19 బాల,బాలికల వాలీబాల్, క్రికె ట్, అండర్–14, అండర్–17, అండర్–19 బా ల, బాలికల హ్యాండ్బాల్, అండర్–19 బాల, బాలికల నెట్బాల్, అండర్–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్జీఎఫ్ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువు రు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. జిల్లాకేంద్రంలో జరిగిన అండర్–19 ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ టోర్నీ (ఫైల్) ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో జడ్చర్ల, మహబూబ్నగర్ పట్టణాల్లో అండర్–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది. టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తాం జిల్లాలో ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణకు సంబంధించి డీఈఓ ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీన మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో పీడీ, పీఈటీల సమావేశం నిర్వహిస్తాం. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు, ఒక బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించడానికి ప్రతిపాదనలు ఇచ్చాం. జిల్లాకు ఏ టోర్నీ కేటాయించినా విజయవంతంగా నిర్వహిస్తాం. – వేణుగోపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్నగర్ రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్నగర్ నుంచి ప్రతిపాదనలు అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు అండర్–17 బాలికల జాతీయ క్రికెట్ టోర్నీకి ప్రతిపాదన -
వరములివ్వమ్మా.. వరలక్ష్మీ
శ్రావణమాసాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని సత్యసాయి మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించినట్లు ఆలయ అర్చకుడు రాజశేఖర్శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కన్వీనర్ బాలరాజు, మహిళా కన్వీనర్ సువర్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలోనూప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు చేశారు. – కందనూలు -
సీఎం సొంత జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం
కందనూలు: కల్యాణలక్ష్మితోపాటు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రద్దు చేస్తే ఆడబిడ్డల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసం నుంచి గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని ఎన్నో పథకాలను ప్రకటించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలకు మంగళం పాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పేదింటి బిడ్డల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అందించడంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఏ పార్టీ వారో తెలుసుకొని సంతకం పెడుతున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు చేతులెత్తేశారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దుచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఏ ఒక్కరోజు కూడా రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ అర్చనకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ధర్నాలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్యకర్తలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. చివరికి ఆర్డీఓ అర్చన బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. -
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీచేయాలి
నాగర్కర్నూల్ రూరల్: ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అనేక మంది పేద విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. సరైన వసతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నల్లమల ప్రాంతంలో కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా.. జిల్లావాసి, సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదలకు ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉండగా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం యువతకు జాబ్ క్యాలెండర్ అమలు చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.5 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, శ్రీనివాసులు, రామయ్య, శివవర్మ, అశోక్, కాశన్న, నాగరాజు, సైదులు, మల్లేష్, నాగరాజుగౌడ్, మధు, తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 13 వరకే..
రైతు బీమాలో ఉన్న రైతులు ఈ నెల 13 వరకు చనిపోయిన వారి వివరాలు మాత్రమే తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. 14 నుంచి చనిపోయిన వారి వివరాలు ఏమి తీసుకోవద్దని చెప్పారు. వీరికి ఏ పథకం కింద బీమా ఇస్తారో పూర్తి సమాచారం లేదు. ఇక రైతుబీమాకు సంబంధించి 159 మంది రైతులకు పరిహారం అందించాల్సి కుటుంబాలకు అందించాల్సి ఉంది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి పునరుద్ధరించాలి.. రైతు బీమా ఎంతో మంచి పథకం. అలాంటి పథకాన్ని తొలిగించే ఆలోచన విరమించుకోవాలి. గతంలో రైతు చనిపోతే కుటుంబానికి ఎలాంటి పరిహారం అందేది కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతో మంది రైతు కుటుంబాలకు మేలు జరిగింది. ఈ పథకాన్ని పునరుద్ధరించాలి. – వెంకటయ్య, రైతు, మర్రిపల్లి ● -
ప్రతి టీకాకు డిజిటల్ నమోదు తప్పనిసరి
కందనూలు: ప్రతి టీకాకు డిజిటల్ నమోదు తప్పనిసరి చేయాలని డీఐఓ సురేష్బాబు అన్నారు. గురువారం డిజిటల్ వ్యాక్సినేషన్ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యు–విన్ పోర్టల్ వినియోగంపై డీఐఓ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల నూతన నమోదు, టీకా డోసుల వివరాలు, ఆన్లైన్లో ఎంట్రీ, డేటా అప్డేషన్తోపాటు పోర్టల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం సురేష్బాబు మాట్లాడుతూ ప్రతి చిన్నారి, గర్భిణికి సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను 100 శాతం యు–విన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఏపీఓ రాజేశ్వర్, యు–విన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ, వీసీసీఎం దివ్య, హెచ్ఈఓ శ్రీనివాసులు, ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 131.279 మి.యూ., విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 131.279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు. 23న కబడ్డీ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు. 2 ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని రెండు ఎరువుల దుకాణాల లైసెన్స్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ వనపర్తి డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకుడు ప్రభాకర్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని స్రవంతి ఫర్టిలైజర్స్, పవన్ ట్రేడర్స్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని కొందరు రైతులు ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. స్పందించిన మండల వ్యవసాయ అధికారి ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలో విచారణ చేసి నివేదికను జిల్లా అధికారులకు అందజేశారు. అధిక ధరలు వసూలు చేయడం నేరమని గుర్తించిన ఏడీఏ ప్రభాకర్ రెండు దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆయా దుకాణాల్లో ఎలాంటి ఎరువుల విక్రయాలు జరపరాదని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుతో జప్తు చేసిన ఎరువులకు సంబంధించి కోర్టులో 6ఏ కేసు నమోదు చేశామని చెప్పారు. -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి.. హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 317 మంది ఉండగా, గురువారం 229 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు. గైర్హాజరైన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వందశాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్నను ఆదేశించారు. తరచూ గైర్హాజరవుతున్న వారితో కారణాలు తెలుసుకోవాలని, అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించారు. ఆరోగ్య సమస్యల కారణంగా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థినులు నిరంతరం పాఠశాలకు హాజరైతేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పాఠశాలలో అవసరమైన చిన్నపాటి మరమ్మతు కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించరాదని డీఈఓ రమేష్కుమార్కు సూచించారు. అలాగే ఇంటర్ విద్యార్థినుల కోసం నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించి.. త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ కుర్మయ్య, ఇన్చార్జి జీసీడీఓ నిర్మల తదితరులున్నారు. -
కళాశాలలకు నిధుల జోష్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కళాశాలలు కాంపోజిట్ ల్యాబ్ గ్రాంట్ నిధులు జోగుళాంబ గద్వాల 8 5.50 4.80 మహబూబ్నగర్ 15 12.25 9.40 నాగర్కర్నూల్ 16 9.25 6.20 నారాయణపేట 10 6.50 6.20 వనపర్తి 12 6.50 6.64 61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. కళాశాల, ల్యాబ్ల నిర్వహణకు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించుకోవాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం అభినందనీయం. – రమణి, డీఐఈఓ -
రైతు బీమాకు ఎగనామం
ఉప్పునుంతలలోని కొత్త రాంనగర్కు చెందిన రైతు గుర్రపు పాండు(40) బుధవారం రాత్రి పత్తి పంటకు నీళ్లు పారబెట్టి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. గురువారం ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే మృతిచెందాడు. అయితే ఇతను గుండెపోటుతో చనిపోయాడా.. లేక పాముకాటుతోనా అన్న అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. చివరికి రైతు బీమా కోసం కుటుంబ సభ్యులు వ్యవసాయ విస్తరణాధికారికి సమాచారం ఇవ్వగా బీమా లేదని గడువు ముగిసిందని చెప్పడంతో ఇటు కుటుంబ సభ్యులు, అటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుకు ఇల్లు కూడా లేదని, కేవలం మూడు ఎకరాల పొలం మాత్రమే ఉందని, కనీసం రైతు బీమా ఉంటే రూ.5 లక్షల పరిహారం అందేదని ఆవేదన చెందుతున్నారు. రైతుకు అండగా ఉన్న బీమా తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. -
సాగునీటిని వృథా చేయొద్దు
నాగర్కర్నూల్ రూరల్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటిని వృథా చేయొద్దని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన కల్వకుర్తి ఎతిపొతల పథకంలో భాగంగా నిర్మించిన డీ–8 కెనాల్ పరిధిలోని కాల్వలను బైక్పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుంచి సాకర్పల్లి– ఏదుట్ల, గోపాల్పేట, రేమద్దుల, సింగాయపల్లి తురకపల్లి, గోప్లాపూర్ వరకు కాల్వలను పరిశీలించి.. నీటి ప్రవాహం వల్ల కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితి గురించి సాగునీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం కాల్వలను పర్యవేక్షించాలని ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, కోడేరు మాజీ ఎంపీపీ రాంమోహన్రావు, సాగునీటి పారుదల శాఖ అధికారులు తదితరులున్నారు. కేఎల్ఐ కాల్వను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మక్తల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నియోజకవర్గంలో రూ.178.84 కోట్లతో 25 అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని కాచ్వార్ టోల్గేట్ వద్ద పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికి బైక్ ర్యాలీగా నల్లజానమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటికి చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వాకిటి తల్లి రాములమ్మ ను సీతక్క శాలువాతో సన్మానించారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి 25 ఏళ్లు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి ద్వారక ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీడీ విడుదల.. మక్తల్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన రాజకీయం 2001, ఆగస్టు 20న మక్తల్ సర్పంచుగా ప్రారంభమైందన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల అండదండలతో నేడు ఈ స్థాయికి ఎదిగానని.. కార్యకర్తలే దేవుళ్లని.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. మక్తల్, ఆత్మకూర్, నర్వ, మాగనూర్, అమరచింత మండలాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఊట్కూర్ మండంల మల్లేపల్లి వంతెన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశామన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి
కందనూలు: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పోలీసు, ఎకై ్సజ్శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్అదాలత్పై పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 12న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, బ్యాంకు రుణ సంబంధిత కేసులు, చెక్బౌన్స్, కుటుంబ, భూ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో సుమారు 7,300 పెండింగ్ కేసులు ఉన్నాయని.. వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జిషీట్ల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో అలసత్వం వహించరాదన్నారు. బాలలను పనిలో పెట్టుకునే దుకాణాలు, ఏజెన్సీలు, కంపెనీల లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్బౌన్స్ కేసుల పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, న్యాయమూర్తులు శ్రుతిదూత, శ్రీనిధి ఉన్నారు. -
మహిళల రక్షణ కోసమే షీటీంలు
అచ్చంపేట రూరల్: మహిళలు, బాలికల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండలంలోని ఐనోలు గిరిజన బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలను ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే డయల్ 112 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. షీ టీం బృందం సత్వరం స్పందించి బాధితులకు అండగా నిలిచి.. పోకిరీల భరతం పడతారన్నారు. బాలికలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని.. సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన లింకులను లేదా అనవసరమైన వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. అదే విధంగా మానవ అక్రమ రవాణా చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, సీసీఎస్ సీఐ శంకర్, షీ టీం జిల్లా ఇన్చార్జి విజయలక్ష్మి, సిద్ధాపూర్ ఎస్ఐ అంజయ్య, షీ టీం బృందం వెంకటయ్య, మల్లేష్, వెంకట్నాయక్, జానకీరాములు పాల్గొన్నారు. సర్ ప్రక్రియ వేగవంతం కందనూలు: ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 910 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ కాని ఓటర్లు 13,216 మంది ఉన్నారన్నారు. అదే విధంగా పేర్లు, తల్లిదండ్రుల పేర్లు తదితర వివరాల్లో తేడాలు ఉన్న అనామలిస్ జాబితాలో 1,02,635 మంది ఉన్నారని వివరించారు. వీసీ అనంతరం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై.. ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై, పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య ఉన్నారు. ఆరుతడి పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ● విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్ భూత్పూర్: రాష్ట్రంలో ఆరుతడి పంటల సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని, కాబట్టి రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి ఆయా పంటలు, కూరగాయల తోటలు సాగు చేయాలని విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం మండలంలోని శేరిపల్లి (హెచ్) గ్రామంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ రైతులు, సర్పంచులకు ఆరుతడి పంటల సాగు, పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు పంటల సాగుపై ముందుకు వెళ్లాలని, రైతులు వ్యవసాయమే కాకుండా గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, మునుగ తోటల సాగు వైపు దృష్టి సారించాలని, ఎకరా పొలంలో నాలుగు రకాల పంటలు సాగుచేయాలని సూచించారు. మునుగ సాగులో మునగ ఆకు పొడి కిలో దాదాపు రూ.వెయ్యి ఉంటుందని, హైదరాబాద్ వంటి నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో పండే ఆహార పంటలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఆరుతడి పంటలే రైతును రాజుగా చేస్తాయని వివరించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. భూత్పూర్లోని 33/11 కేవీ సబ్స్టేషన్ను ఆయన కలెక్టర్ కుష్బూ గుప్తాతో కలిసి తనిఖీ చేశారు. -
జత కట్టారు..
జమ్ము తొలగించారుపాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ఉన్న కేఎల్ఐ డీ–1 కాల్వలో జమ్ము, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎర్లకుంటతండా సమీపం నుంచి తెల్లరాళ్లపల్లితండా వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర కాల్వలో పెరిగిన జమ్ము, పూడిక తొలగించకపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కాల్వ ద్వారా మండలంలో తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లితండా, చిక్కేపల్లి గ్రామాల్లో సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా.. సాగునీరు సక్రమంగా అందక సగం కూడా సాగు కావడం లేదు. ఖరీఫ్ సీజనల్లోనైనా జమ్ము, పూడిక తొలగించి సాగునీరు సాఫీగా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేది లేక రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండ్రోజులుగా కాల్వలో పేరుకపోయిన జమ్ము తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాల్వ ద్వారా సాగునీరు సరఫరా అవుతున్నా.. జమ్ముతో తండా వరకు సాగునీరు సరఫరాగాకపోవడంతో స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నట్లు రైతులు వివరించారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మత్తులో టీనేజర్స్..!
● కొల్లాపూర్ పట్టణ శివారులోని శ్మశాన వాటిక, బక్కాయిపల్లి చెరువు, అమరగిరి వెళ్లే రోడ్డు, కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద, ఇతర నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు యువత, విద్యార్థులు నిత్యం గంజాయి తాగుతున్నారు. ఆరు నెలల క్రితం పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుంటే.. 20 మందికి పైగా గంజాయి తాగే వారి పేర్లు బయటకు వచ్చాయి. వారందరినీ స్టేషన్కు పిలిచి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిలో నలుగురిపై కేసులు నమోదై జైలుకు సైతం వెళ్లారు. అయితే ఇప్పటికీ అక్కడ గంజాయి వినియోగం ఏమాత్రం తగ్గలేదు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్నగర్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా పెంచాం. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి విక్రయించినా, తాగినా కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వారి సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలతో కలిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ నాగర్కర్నూల్/పాలమూరు: ‘ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసగా మారుతున్న కొందరు టీనేజర్స్, యువకులు.. చివరికి వాటి విక్రేతలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఎకై ్సజ్– పోలీసులు చేసిన దాడుల్లో 16 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికంగా పట్టుబడటం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. గంజాయి అధికంగా వినియోగంతో విచక్షణ కోల్పోయి.. పలు నేరాలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. మెడికల్ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఇతర కళాశాల్లోనే గంజాయి సరఫరా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నా.. మరోవైపు గంజాయి వినియోగం మాత్రం కట్టడి కావడం లేదు. ఒక్కో పాకెట్లో 12 గ్రాములు నింపి ప్యాక్ చేసి రూ.400–500 విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్లో ఉండే పొగాకులో కలిపి తీసుకుంటూ.. ఒక రకమైన మత్తుకు బానిసగా మారుతున్నారు. ఇందుకోసం యువత గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక గదులు, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 16–25 ఏళ్లలోపు వారితోపాటు ఆటోడ్రైవర్లు దీనిని అధికంగా తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలే అడ్డా తరుచూ వినియోగంతో మానసికంగా పలు మార్పులు సరఫరాలో ప్రముఖంగా మైనర్లతోపాటు 25 ఏళ్లలోపు యువతే.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఇదే పరిస్థితి -
రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సత్ఫలితాలు
ఉప్పునుంతల/తెలకపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సత్ఫలితాలు వస్తున్నాయని.. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 620 ఎఫ్పీఓల ద్వారా రూ. 5వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.సురేంద్ర మోహన్ అన్నారు. ఉప్పునుంతల పీఏసీఎస్ ఎఫ్పీఓ ఆధ్వర్యంలో రూ. 2.50కోట్లతో ఏర్పాటుచేసిన వేరుశనగ డికార్డికేటర్ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. ఎఫ్పీఓల ద్వారా వచ్చే రెండేళ్లలో రూ. 10వేల కోట్ల టర్నోవర్కు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న చిన్నా, సన్నకారు రైతులు పండించిన పంటను నేరుగా అమ్ముకుంటే తక్కువ లాభం వస్తుందని.. అదే రైతులు ఎఫ్పీఓల ద్వారా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటుచేసుకొని పండించిన పంటను గ్రాండింగ్, క్రాసింగ్, వాల్యూ ఆడిషన్ చేసి విక్రయిస్తే అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎఫ్పీఓల ద్వారా వచ్చే లాభాన్ని షేర్ హోల్డర్లుగా ఉండే రైతులకే చెందుతుందన్నారు. రాష్ట్రంలో 311 పీఏసీఎస్లను ఎఫ్పీఓలకు ఎంపికం చేయగా.. ఉప్పునుంతల పీఏసీఎస్ నాగర్కర్నూల్ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండటం అభినందనీయమన్నారు. ఈ ఎఫ్పీఓలో సుమారు 1500 మంది రైతులు సభ్యులుగా ఉండగా.. ఏడాది వ్యవధిలోనే మంచి ప్రగతిని సాధించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటగా వేరుశనగ డికార్డికేటర్ ప్రారంభించినట్లు వివరించారు. పీఏసీఎస్ పాలక వర్గం, రైతుల కోరిక మేరకు రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారితో మాట్లాడి బ్రీడర్ సీడ్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోల్డ్ ఆయిల్ మిల్లును సురేంద్ర మోహన్ పరిశీలించారు. నూనె తయారీ యంత్రాల పనితీరు, నాణ్యతా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం జమిస్తాపూర్లో రైతు మన్నెపురెడ్డి 25 ఎకరాల్లో సాగుచేసిన అయిల్పామ్ తోటను పరిశీలించారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్లు మడ్డు నరేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, సర్పంచ్ సీహెచ్ శ్రీనివాసులు, డీసీఓ రఘునాథరావు, జిల్లా కోఆపరేటివ్ సూపరింటెండెంట్ మధు, సీనియర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంరావు, డీఏఓ ఎం.చంద్రశేఖర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మధు, ఏఓ రమేశ్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సీఈఓలు రవీందర్రావు, రాజవర్ధన్రెడ్డి, ధర్మవీర్, రైతు సంఘం ప్రతినిధి కట్టా అనంతరెడ్డి ఉన్నారు. -
కల్వకుర్తిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలంలో తర్నికల్ నుంచి శ్రీరాంనగర్ వరకు రూ. 3.20కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తర్నికల్, తురకలపల్లి, పంజాగుల గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. పంజాగులలో రూ. 30లక్షలతో ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గంలో రూ. వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు బీటీరోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అశోక్రెడ్డి, ఆనంద్ కుమార్, జిల్లెల రాములు, సంజీవ్ యాదవ్, సురేందర్ రెడ్డి, బాల్రెడ్డి, పసుల రమాకాంత్రెడ్డి, శ్రీపురం హరీశ్రెడ్డి, విజయభాస్కర్, ఆంజనేయులు యాదవ్, వరలక్ష్మి, పవన్కుమార్రెడ్డి, శ్రీలత, శేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దు
● విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలి ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి కందనూలు/కల్వకుర్తి టౌన్: జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పకడ్బందీగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత, పోషకాహారం, మాతృత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, శారదాలతో కలిసి కల్వకుర్తి పట్టణంలోని పలు రేషన్ దుకాణాలు, గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించిన పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై పాఠశాల స్థాయిలోనే కాకుండా, సంబంధిత అధికారులు కూడా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం, లబ్ధిదారుల హాజరు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. కల్వకుర్తిలోని హనుమాన్ నగర్, సుభాష్నగర్ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా.. మెనూ అమలు, భోజనం నాణ్యత, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. అంగన్వాడీ చిన్నారులకు ఇస్తున్న గుడ్లు చిన్న పరిమాణంలో ఉండటంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అందించే భోజనంలో నాణ్యత పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెనూలో ఉన్న ఆహారానికి బదులు కేవలం పప్పుచారు వడ్డించిన వంట ఏజెన్సీ నిర్వాహకులను మందలించారు. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని డీఈఓ రమేశ్కుమార్కు సూచించారు. బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్తో భోజనం అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. డీసీఓ, పాఠశాల ప్రిన్సిపల్కు మెమోలు జారీచేయాలని సూచించారు. అదే విధంగా బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం బాలుకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీడబ్ల్యూఓ ఉమాపతి, డీఎంహెచ్ఓ కృష్ణ, డీటీడబ్ల్యూఓ కోటాజీ, డీఆర్డీఓ ఓబులేష్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి పాండు, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, ఎంఈఓ శంకర్నాయక్ ఉన్నారు. -
మొదలైన ‘సర్’ రెండో దశ!
నేటి నుంచి నోటీసుల జారీ ● సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ● అక్టోబర్ 15వరకు పరిష్కారం.. 19న తుది జాబితా విడుదల అచ్చంపేట: ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి దశ ముగిసింది. బుధవారం నుంచి నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ అధికారులు(ఈఆర్వోలు) నోటీసులు జారీచేసే ప్రక్రియతో రెండో దశ మొదలుకానుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఫారం–6 ద్వారా ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సరిగ్గా ఉంటే తిరిగి వారి పేర్లను జాబితాలో నమోదు చేయనున్నారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16 వరకు వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్స్ను పరిశీలించి.. అర్హత ఉన్నవారి వివరాలను సరిచేయనున్నారు. అక్టోబర్ 19న వెలువడే తుది జాబితాలో అసలు ఓటర్లు ఎంత మంది అనేది స్పష్టత రానుంది. ఆధారాలు చూపిస్తేనే ఓటు హక్కు.. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఈఆర్వోలు ఇచ్చిన నోటీసులు జారీచేసే ప్రక్రియ చేపడుతారు. పోలింగ్ కేంద్రాల వారీగా నోటీసులు అందించి.. అర్హత నిరూపించుకోవడానికి ఇచ్చిన గడువు, విచారణకు హాజరు కావాల్సిన తేదీలతో కూడిన పత్రాలను పంపిణీ చేస్తారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి ధ్రువపత్రాలను స్వీకరిస్తారు. 2002కు ముందు ఓటు హక్కు లేని వారు, తండ్రి వయసుతో సరికాని వారు, చిరునామా సక్రమంగా లేనివారు, తండ్రి, అన్నదమ్ముల మధ్య వయసు తేడా ఉన్నవారు అధారాలు చూపిస్తే ఓటు హక్కును పునరుద్ధరించనున్నారు. రంగంలోకి రాజకీయ పార్టీలు.. మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఈ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం.. నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్ల తొలగిపోయాయా? అనే దానిపై ఇంటింటికి వెళ్లి ప రిశీలించడం.. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ము సాయిదా జాబితాలో తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం కీలకంగా మారింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 9,76,987 అనామలిస్ 1,65,552 అన్మ్యాప్డ్ ఓటర్లు 15,563 ప్రతి ఓటరు పరిశీలించుకోవాలి అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ముసాయిదా జాబితాలో పేరులేని అర్హత కలిగిన వ్యక్తులు, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు కోరుకునే వారు నిర్ణీత గడువులోగా క్లైయిమ్స్, అభ్యంతరాలు లేదా సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం క్లైయిమ్స్, అభ్యంతరాలు పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తాం. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ -
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. మంగళవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 65.849 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 50.600 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 116.449 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. -
ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం
పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
చేయూతకు నిబంధనాలు!
నిబంధనలు ఇవే.. కొత్త పింఛన్ మంజూరుకు వితంతులు, ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్ల వయసు ఉండాలి. దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా 40శాతం దివ్యాంగత్వం కలిగి ఉండాలి. గీత కార్మికులు 50ఏళ్ల పైబడి, కల్లుగీత కార్మిక సహకార సంఘంలో సభ్యత్వంతో పాటు ఎకై ్సజ్శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు సైతం 50 ఏళ్లు పైబడిన వారు అర్హులు. పైలేరియా వ్యాధిగ్రస్తులు వయసుతో సంబంధం లేకుండా గ్రేడ్–2, గ్రేడ్–3 బాధితులై ఉండాలని నిబంధనలు ఉన్నాయి. డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్న ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలలోపు, మూడెకరాలకు మించకుండా తరి భూమి, 7.5 ఎకరాల వరకు నీటిపారుదల లేని భూమి ఉన్నవారు అర్హులు. ఇక లైట్ లేదా హెవీ మోటారు వాహనాలు కలిగి ఉన్న వారు సైతం పింఛన్కు అనర్హులు. పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారే కాకుండా.. ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు సంస్థల్లో ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు పింఛన్కు అనర్హులుగా తేల్చనున్నారు. నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్తగా కొన్ని వర్గాలకు పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు విధించింది. అయితే దరఖాస్తు ఫారంలో ఎక్కడా వృద్ధాప్య కాలం లేదు. వారు సైతం దరఖాస్తులు ఇస్తే.. నిరాకరించకుండా తీసుకోవాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే పింఛన్ మంజూరుకు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా ఒక్కో దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి.. నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుదారుడి కుటుంబం వివరాలను సేకరించనున్నట్లు సమాచారం. ఆ నిబంధనల ప్రకారం చాలా మంది పింఛన్కు అనర్హులుగా తేలుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుల వెల్లువ.. కొత్తగా పింఛన్ కోసం అర్హులైన వారు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామంలో 30 నుంచి 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వృద్ధులకు పింఛన్ మంజూరు చేయకున్నా.. వారు మనస్తాపానికి గురవుతారనే ఉద్దేశంతో వారు ఇచ్చే దరఖాస్తులు సైతం తీసుకుంటున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులకు లాగిన్ ఐడీ ఇచ్చారు. మంగళవారం నుంచి దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. పింఛన్ మంజూరుకు కఠిన నియమాలు 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన సమగ్ర విచారణ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక మొదలైన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు -
సీటుంది.. వసతి లేదు!
ప్రత్యామ్నాయం ఏదీ? కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్గా వినియోగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్తోపాటు పరిసరాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నా.. వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వసతులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేక పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉంటుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. లా, ఇంజినీరింగ్లో ఖాళీలు లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో 140 సీట్లకు 97 మంది చేరగా.. 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది చేరగా.. 53 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.ఇంజినీరింగ్లో 180 సీట్లకు 125 మంది చేరగా.. 55 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు ఉన్నాయి. హాస్టల్ వసతి లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు సీట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వీటిలో చేరే వారికి ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6–8 వేల భారం కొత్త హాస్టళ్లు నిర్మాణంలో.. అప్పటివరకు అవస్థలే!బాలికల హాస్టల్లో 680 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి 190 మందికిపైగా ఉండటంతో గదుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలుగురు ఉండాల్సిన గదుల్లో ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. -
వందశాతం లక్ష్యంతోపనిచేయాలి
అచ్చంపేట రూరల్: డిజిటల్ ఇండియాలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేసేందుకు యూ–విన్ పోర్టల్ ఎంతో కీలకమైందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.సురేశ్బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో యూ–విన్ పోర్టల్పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాక్సినేషన్ సేవలను డిజిటల్ రూపంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు వందశాతం లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రతి చిన్నారి, గర్భిణికి అందించే టీకా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా టీకా సర్టిఫికెట్లతో పాటు తదుపరి డోసుల అలర్ట్ సకాలంలో అందుతాయన్నారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సిబ్బంది రాజేశ్వర్, బిక్కులాల్, హనుమంతు పాల్గొన్నారు. -
అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
లింగాల: మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రాంబాబు ఇటీవల లంచం తీసుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలో అద్దెకు ఉన్న ఓ అధికారి ఇంట్లో సైతం సోదాలు చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. గత జూలై 23న లింగాల మండలానికి చెందిన కొందరు రైతులు ఎడ్లబండ్లపై వ్యవసాయ పనిముట్లను తీసుకొని వస్తుండగా.. రేంజ్ పరిధిలోని కొర్రమడుగు సమీపంలో బీట్, సెక్షన్ ఆఫీసర్లు అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేశారన్నారు. మొత్తం రూ. 1.50లక్షలు డిమాండ్ చేయగా.. రూ. 50వేలు ముందస్తుగా తీసుకున్నారని బాధిత రైతులు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ సీఐ జిలానీ, మరికొందరు సిబ్బంది ఉన్నారు. రైతుల నుంచి లంచం తీసుకున్న ఇద్దరు అధికారుల అరెస్టు -
పాపన్నగౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
నాగర్కర్నూల్/కొల్లాపూర్ రూరల్: సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సాగించిన పోరాటాన్ని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న అసమానతలు, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు లభించేలా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ● మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి శివారులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వేనం. 119లో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి.. ప్లాంట్ ఏర్పాటుకు ఆ స్థలం ఎంత వరకు అనుకూలంగా ఉంటుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని ఆధికారులకు సూచించారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరు సమకూరుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, స్థల ఎంపిక, మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రసారం తదితర అంశాలపై పూర్తి వివరాలతో ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ భన్సీలాల్, ఎంపీడీఓ వెంకట్రావు ఉన్నారు. -
ఆహారంలో నాణ్యత లోపించొద్దు
అచ్చంపేట రూరల్: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపించొద్దని డీటీడీఓ ఆర్.కోటాజీ అన్నారు. మంగళవారం అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం మల్లేష్ ఉన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయండి అచ్చంపేట: ప్రజాసమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వారిని జైళ్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జక్క బాలయ్య, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అచ్చంపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడే వారిని ప్రభుత్వం గౌరవించాల్సి ఉండగా.. వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను విస్మరించి.. ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. రాజకీయ, ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్న వారిని విడుదల చేసి.. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు పంబలి బాలయ్య, ముద్దునూరి లక్ష్మీనారాయణ, ఇమ్మడి విజయమోహన్, బియ్యం శ్రీశైలం, కాట్రవత్ శ్రీనునాయక్, సీఎల్సీఎన్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్ ఉన్నారు. -
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ
కందనూలు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే పరువునష్టం దావా వేస్తారా అని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాలులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ను బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై రాహుల్గాంధీ వాస్తవాలను మాట్లాడుతుంటే.. ఎదుర్కోలేక ఆయనపై పరువునష్టం దావా వేయడం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజుకుమార్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి ఉన్నారు. -
సరిపోవడం లేదు..
నాకున్న మూడున్నర ఎకరాల్లో వేరుశనగ వేద్దామని దుక్కిదున్నాను. కరెంట్ కోతలతో నీరు రెండు ఎకరాలకే సక్రమంగా పారించలేకపోతున్నా. మరో ఎకరా కూడా పెడితే ఎండిపోవడం ఖాయం. బోరులో నీళ్లున్నా కరెంట్ కోతల వల్ల ధైర్యం చేయలేకపోతున్నా. చాలా ఏళ్ల తర్వాత కరెంట్ కోతలు చూస్తున్నా. ప్రభుత్వం చొరవ తీసుకొని 18 గంటలు సరఫరా చేయాలి. – కుమ్మరి లాలయ్య, రైతు, మార్చాల ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు చేశాం. జిల్లాలో ప్రస్తుతం 11 గంటలు సింగిల్ ఫేజ్, 13 గంటలు త్రీఫేజ్ ఇస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు విధానంలో రైతులు మార్పులు పాటించాలి. 13 గంటల విద్యుత్ సరఫరాతో ఎంత సేద్యం చేయొచ్చో ఆ మేరకే పంటల సాగు చేసుకోవాలి. ఈ సీజన్ ఇంతకంటే ఎక్కువ కరెంట్ ఆశించవద్దు. – నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ -
సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ విఫలం
కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రను నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయాలని కుట్రతో హైకోర్టులో ఒక న్యాయవాది వేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడతామని వెంటనే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చి నయవంచనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం విస్మరించి పాలన సాగిస్తే ప్రజలు సహించరని, ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు విజయ్గౌడ్, సూర్యప్రకాశ్రావు, కృష్ణారెడ్డి, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం.. పెంట్లవెల్లి: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొడతామని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి అన్నారు. పెంట్లవెల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెంట్లవెల్లి మండల ప్రజలు ఓట్లు వేయలేదనే కక్ష్యతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ చిట్టెమ్మ, నాయకులు రాజేష్, సరిత, రాజు, పరశురాముడు, ప్రమోద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాబితాలో మీ పేరుందా..!
అచ్చంపేట: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)–2026 ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద జాబితా ప్రదర్శించారు. మృతిచెందిన వారితోపాటు శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓట్లు కలిగిన వారిని జాబితా నుంచి తొలిగించారు. బీఎల్ఓలు 45 రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి.. పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి.. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేశారు. ప్రస్తుతం వెలువడిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందా.. లేదా.. అని వెతికే పనిలో ఓటర్లు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో సర్ ప్రక్రియకు ముందు 32,35,733 మంది ఓటర్లు ఉండగా.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 27,72,578 మంది ఓటర్ల పేర్లను బీఎఓలు డిజిటలైజేషన్ చేశారు. వీరి పేర్లను మాత్రమే ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ఫారాలు తిరిగి ఇవ్వని, అన్ కలెక్టబుల్ (అబ్సెంట్), పర్మనెంట్ షిఫ్ట్, డెత్, డూప్లికేట్ (ఎఎస్డీడీ) 4,63,155 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ప్రచురించారు. ముసాయిదా జాబితాలో ఉండే 8,84,030 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు (అనామలిస్) కలిగి ఉండటం, మ్యాపింగ్ జరగకపోవడంతో వారిని అనుమానాస్పద ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరికీ అక్టోబరు 15 వరకు ఎలక్ట్రోరల్ రిజిస్టర్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించిన 4,63,155 మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లు కలిపితే 13,47,185 మంది జాబితాలో తమ పేరు తొలిగింపు ముప్పు ఎదుర్కోనున్నారు. నోటీసులు అందుకోనున్న 8,84,030 మంది ఓటర్లలో 1,21,434 మంది అన్మ్యాప్డ్ ఓటర్లు ఉండగా.. మిగిలిన 7,62,596 మంది ఓటర్లలో వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/ తల్లిదండ్రులు/ వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో పూరించాల్సి ఉండగా.. ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన/ లేక తప్పుడు వివరాలు ఇచ్చిన 1,21,434 మంది ఓటర్లను అన్ మ్యాప్డ్గా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఎన్యూమరేషన్ ఫారంలోని సర్–2002 ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పడం లేదు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 4,63,155 మంది ఓట్ల తొలగింపు 32.35 లక్షల నుంచి 27.72 లక్షలకు తగ్గిన సంఖ్య ముసాయిదాలో పేర్లున్న 8.84 లక్షల మందికి నోటీసులు గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ.. అభ్యంతరాలు, అప్పీల్కు నెలరోజుల గడువు నమోదుకు మరో అవకాం.. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయింలు, అభ్యంతరాలపై అందే దరఖాస్తులను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అలాగే అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతతోపాటు ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని వారు నిబంధనల ప్రకారం ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫారం–7, ఓటరు పేరు, చిరునామా, ఛాయాచిత్రం తదితర వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం–8 వినియోగిస్తారు. వచ్చిన క్లెయింలు, అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబరు 19న తుది జాబితా ప్రచురిస్తారు. ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు స్థానికంగానే ఉండి జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్లో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్లు కచ్చితంగా తమ పేరు ఉందో.. లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని. -
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ఉప్పునుంతల: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఉప్పునుంతలలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఎఫ్పీఓ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన వేరుశనగ డికార్డికేటర్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు అన్నిరకాల సేవలు అందిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. మున్ముందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పామాయిల్, కూరగాయలు, పండ్ల తోటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మిల్క్ చిల్లింగ్ సెంటర్కు కావాల్సిన స్థలాన్ని సమకూర్చడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. రైతులు సహకారం సంఘం సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, టీజీసీయూ ఎండీ అన్నపూర్ణ, కోఆపరేటివ్ యూనియన్ జాయింట్ రిజిస్ట్రార్ పరిమళ, డీసీఓ రఘునాథరావు, సూపరింటెండెంట్ మధు, డీసీసీబీ డీజీఎం కృష్ణప్రసాద్, డీసీసీబీ అచ్చంపేట బీఎం సాహెదాబేగం, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 36 అర్జీలు స్వీకరించారు. వీటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో తొలిరోజు నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో మొత్తం 103 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 13.. కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రయేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఏఎస్పీ 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమికి సంబంధించినవి, 5 తగు న్యాయం కోసం, 1 భార్యాభర్తల గొడవకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, వీటి పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఏఎస్పీ చెప్పారు. వైభవంగా వెంకన్న శోభాయాత్ర కందనూలు: పవిత్ర గరుడ పంచమిని పురస్కరించుకొని వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి, అలివేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు ప్రసాదస్వామి తెలిపారు. కారుకొండతండా ఆర్ఆర్కాలనీ గ్రామ సర్పంచ్ ముడావత్ గోపాల్నాయక్ దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు దేవాలయం నుంచి ప్రారంభమై కారుకొండ కాలనీ వీధులగుండా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో నవోదయ ప్రాంగణం వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుధారాణి పాల్గొన్నారు. -
తేలనున్న ఓట్ల లెక్క!
● నేడు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన ● జిల్లాలో 1,65,607 మంది ఓటర్లకు నోటీసులు ● వివరాలు సేకరించే పనిలో బీఎల్వోలు ● ఈఆర్వోల ద్వారా ఆన్ మ్యాఫ్డ్ ఓటర్ల వివరాలపై విచారణ అచ్చంపేట: సర్ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తిచేసిన యంత్రాంగం.. సోమవారం ఓటరు ముసాయిదా జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9,76,987 మంది ఓటర్లు ఉండగా, బీఎల్ఓలు 8,35,484 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఫారాలు ఇవ్వలేకపోయిన 1,41,503 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించనున్నారు. ఓటరు వివరాల్లో తేడాలు(అనామలిస్) కలిగిన వారితో పాటు ఆన్మ్యాఫ్డ్ ఓటర్లకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు విచారణకు పిలువనున్నారు. సుమారు 8.35లక్షల మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. వీరిలో సుమారు 1.65లక్షల మందికి పైగా ఓటర్లు నోటీసులు అందుకోనున్నారు. అయితే అర్హులై ఉండి, ముసాయిదా జాబితాలో పేర్లులేని వారికి మరో అవకాశం కల్పించనున్నారు. అనుమానాస్పద ఓట్లపై విచారణ.. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, వివరాలు తప్పుగా ఉన్న, ఇంటిపేరు, అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్లకు నోటీసులు అందజేసే ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు బూత్స్థాయి అధికారుల ద్వారా నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వారీగా నోటీసులు అందించి.. అర్హత నిరూపించుకోవడానికి ఇచ్చిన గడువు, విచారణకు హాజరు కావాల్సిన తేదీలతో కూడిన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న ఓటరు గరిష్టంగా 15 రోజుల వ్యవఽధిలో ఈఆర్వో ఎదుట విచారణకు హాజరవ్వాలి. ఎన్నికల సంఘం తెలిపిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి చూపాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, వయసులో వ్యత్యాసాలు, ఇతర వివరాల్లో లోపాలు వంటి మొత్తం తొమ్మిది రకాల సమస్యలు ఉన్న సుమారు 1,65,607 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీడియో కాల్లో కూడా పరిశీలన.. ఒక గ్రామం, పట్టణంలో ఎక్కువ మంది నోటీసులు అందుకున్న ఓటర్లు ఉంటే.. వారి వద్దకే ఈఆర్వో, ఏఈఆర్వోలు వెళ్లి విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దూర ప్రాంతంలో ఉన్నవారు, హాజరు కాలేకపోతున్నవారు ఉంటే, వారిని డిజిటల్ విధానంలో విచారించే అవకాశం కల్పించింది. వీడియో కాల్ ద్వారా మాట్లాడి, పత్రాలను ఆన్లైన్లో తనఖీ చేయనున్నారు. అర్హులైన వారి ఓటు హక్కు కొనసాగించనున్నారు. జిల్లాలో ఓటర్ల వివరాలిలా.. నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ గల్లంతైన వారు వివరాల్లో తేడాలు నాగర్కర్నూల్ 2,40,571 2,02,407 38,164 38,358 అచ్చంపేట 2,48,362 2,08,589 39,773 36,170 కొల్లాపూర్ 2,42,699 2,07,598 35,101 28,162 కల్వకుర్తి 2,45,355 2,16,890 28,465 62,917 -
పకడ్బందీగా ప్రక్రియ..
ముసాయిదా ఓటరు జాబితా తదుపరి కార్యాచరణను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లాలో ఇప్పటివరకు 84 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. అనామలిస్ ఓటర్లకు నోటీసుల జారీ, విచారణకు సంబంధించి 18మంది మండలస్థాయి ట్రైనర్లు బీఎల్ఓలకు సమగ్ర అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా, అనర్హుల నమోదుకు అవకాశం లేకుండా నిబంధనల మేరకు సమగ్ర పరిశీలన జరపాలి. మ్యాపింగ్ వివరాలు సమర్పించని వారు, ఎన్యూమరేషన్ పత్రంలో ఒక భాగాన్ని మాత్రమే పూర్తి చేసిన వారు కూడా ముసాయిదా జాబితాలో ఉంటారు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ -
సానుకూలంగా స్పందించారు..
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు– మన్ననూర్– సిరిగిరిపాడు వరకు జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాముఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ రహదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదు. కొత్త రోడ్ల మంజూరు కోరుతూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్తల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్నగర్ -
సర్వేలతోనే సరి..!
● ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు ● చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం ● పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ● ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. -
ఏటీసీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు
తీజ్ సంబరాలు ● ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యాలు ● మొలకల బుట్టలతో భారీ ఊరేగింపు ● గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు ● రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి –8లో uచిన్నచింతకుంట: యువతకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పల్లమర్రి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మారుమూల ప్రాంత యువతకు సైతం ఆధునిక విద్య, సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో 119 ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసి.. 65 ఐటీఐలను ఆధునికీకరించినట్లు వెల్లడించారు. ఈ సెంటర్ల ద్వారా రోబోటిక్స్ ఆధునిక యంత్రాల నిర్వహణ, ఆగ్రో ప్రాసెసింగ్ తదితర సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏటీసీ కేంద్రాలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఏటీసీ సెంటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత యవతకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. శిక్షణ పొందిన యువతకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఏటీసీని విస్మరించిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కార్మికుల ను, వారి సంక్షేమాన్ని విస్మరించి మహారాష్ట్రలో రూ.500 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్, జాయింట్ డైరెక్టర్ నరేష్, రీజి నల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ, పల్లమర్రి సర్పంచు లక్ష్మి, తహసీల్దార్ ఎల్లయ్య పాల్గొన్నారు. -
ప్రజావాణి మరింత చేరువ!
● ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ ● వినతుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు ● అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు ● వేగవంతంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అచ్చంపేట/కల్వకుర్తిటౌన్: ప్రజా సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కేంద్రాల్లోనే వినతులు స్వీకరించడం ద్వారా ప్రజలకు దూరభారం తగ్గడంతో పాటు సమయం, ఖర్చు ఆదా కానుంది. నోడల్ అధికారిగా ఎంపీడీఓ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఆయా మండలాల్లో విధులు నిర్వర్తించే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, అటవీ, గృహనిర్మాణ, నీటిపారుదల, ఉద్యానవన, మండల పంచాయతీ అధికారులు, ఐసీడీఎస్, ఎకై ్సజ్, పోలీస్ వంటి ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. పకడ్బందీగా నిర్వహణ.. నోడల్ అధికారి పర్యవేక్షణలో ప్రజావాణి నిర్వహణ పకడ్బందీగా జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లతో పాటు హెల్స్డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగుల కోసం వీల్చైర్, వైద్య శిబిరంతో పాటు ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, పిల్లలతో ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అన్లైన్లో ఫిర్యాదుల నమోదు.. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు, 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్లో నమోదు చేసి.. ఫిర్యాదుదారుడికి ఐడీతో కూడిన రశీదు ఇస్తారు. కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గిరిజనులు దూర ప్రాంతాల నుంచి రాలేక మన్ననూర్ ఐడీటీఏ కార్యాలయంలో వినతులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు, రేషన్, భూ సమస్యలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై వినతులు ఇవ్వడానికి మండల ప్రజావాణి ఒక వేదికగా ఉపయోగపడనుంది. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, ప్రత్యేక ఐడీ ఇవ్వనున్నారు. అలాగే గడువులోగా పరిష్కారించడం, పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. అయితే స్థానికంగా మండల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. -
శరవేగంగా వీవో భవనాలు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ మహిళా సంఘాలకు సమాఖ్య భవనాలు మంజూరు చేసింది. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు శాశ్వత వేదికలు ఉండేలా చేపట్టిన గ్రామ సమాఖ్య భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిని ప్రతి గ్రామంలోని మహిళా పొదుపు సంఘాలు (ఎస్హెచ్జీ) కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్ జీ) కింద జిల్లాకు మంజూరు చేసింది. గ్రామ మహిళా సంఘం భవనం (వీవో)లు ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. డిసెంబరు మాసంలో ఎట్టి పరిస్థితుల్లో నూతన భవనాల్లోకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని మహిళా సంఘాలు కలిసి సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం జిల్లాకు మొత్తం 224 వీవో భవనాలు ఈ ఏడాది జనవరిలో మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో స్థలాలు కూడా దొరకడంతో స్థానిక సర్పంచ్లు, సంబంధిత అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. అయితే వీటి నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. పాత కాంట్రాక్టర్లను, స్థానిక సర్పంచులు ఎలాగోలా ఒప్పించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లాలో లింగాల మండలం రాంపూర్, బాకారంతోపాటు మొత్తం 21 వీవో భవనాలు అన్ని హంగులతో పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 182 భవనాల పనులు పురోగతిలో ఉండగా.. సైట్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. మరో 21 చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ వీవో భవనాల పనులపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ భవనాలు పూర్తయితే గ్రామాల్లో మహిళా సంఘాల సమావేశాలు,ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చక్కని వేదికగా మారనున్నాయి. శాశ్వత వేదికలు ఉండాలనే ఉద్దేశంతో కార్యాలయాల మంజూరు ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున నిధులు అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
రైతుల వ్యవసాయ భూముల నిర్వహణ కోసం భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ధరణి స్థానంలో కొత్త భూ భారతి పోర్టల్ను ప్రారంభించారని గుర్తుచేశారు. రైతు భరోసా, రైతుల రుణమాఫీ పథకాల అమలుతోపాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి.. వారి అభ్యున్నతికి కృషిచేస్తుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఇందులో భాగంగా 6,496 మంది రైతుల నుంచి 24,244 మె.ట., సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. -
స్మార్ట్ కార్డులతో పేదలకు భరోసా
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ మల్లురవి, కలెక్టరు హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి రేషన్ స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డులతో పేదలకు మరింత భరోసా లభిస్తుందన్నారు. జిల్లాలో 2,77,457 పేద కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావడంతో ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సరుకులు పొందడమే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు తదితర ప్రయోజనాలు పొందేందుకు ప్రధాన ఆధారంగా ఉంటుందన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
నాగర్కర్నూల్ రూరల్: ప్రతిఒక్కరికీ చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ శ్రీదేవి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన ఉంటేనే సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం గురించి వివరించారు. విద్యార్థి దశ అనేది భవిష్యత్కు బంగారు బాట వంటిదని, విద్యార్థులు అందరూ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజశేఖర్రావు, న్యాయవాది శ్రీరామ్ ఆర్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
వెల్దండ: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, మోతీలాల్ నాయక్, పర్వత్రెడ్డి, బచ్చు రామకృష్ణ, శంకర్నాయక్, హరికిషన్నాయక్, కృష్ణ, ఎర్ర శ్రీను, భరత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి పథంలో పయనిద్దాం..
నాగర్కర్నూల్● సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా ముందుకు ● కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ప్రజలు ● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ● అట్టహాసంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు మద్యానికి గుడ్బై స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రాపూర్ గ్రామంలో మద్యపానం నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026–8లో uజాతీయ జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, చిత్రంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణ తదితరులు కందనూలు/ నాగర్కర్నూల్ రూరల్: జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పాటుపడుతోందని, ప్రభుత్వం కేటాయించే నిధులతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో చిన్నారెడ్డితోపాటు ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతో కందనూలును అన్నిరంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు కలిసికట్టుగా పయనిద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుందని చిన్నారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే దాదాపు 10.22 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. మహిళలు ప్రయాణ చార్జీల భారం తగ్గించుకొని దాదాపు రూ.482.15 కోట్లు ఆదా చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ నెల 2025 సంవత్సరం నుంచి రేషన్ కార్డు దారులందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 2,79,133 రేషన్ కార్డులకు గాను 8,99,385 మంది కుటుంబ సభ్యులకు సన్నరకం బియ్యంను 552 రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. కులగణన, మీసేవ ద్వారా వచ్చిన 42,647 కొత్త దరఖాస్తులను గ్రామసభలో ఆమోదించుకొని 40,765 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, భద్రత, సౌలభ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. వీటికి లబ్ధిదారుల ఎంపిక చేసి త్వరలో మంజూరు పత్రాలు జారీ చేస్తామని వివరించారు. మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.5,861 కోట్లు కేటాయించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. వీటితో అసంపూర్తి పనులు పూర్తయితే 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే మత్స్యశాఖలో ఇప్పటి వరకు 235 సహకార సంఘాలు ఉండగా 17,100 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్లో 900 మంది మత్స్యకారులకు ఏటా జీవనోపాధి కోసం లైసెన్స్ ఇస్తున్నామన్నారు. మాతాశిశు సంరక్షణ ద్వారా 4,765 మంది గర్భిణులకు 12 వారాలలోపు నమోదు చేసి 4,032 మందికి టీడీ ఇంజెక్షన్లు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. సమగ్ర మహిళా ఆరోగ్యం పథకం కింద 8 రకాల స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ ద్వారా రోజువారిగా 53,300 లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నాయని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, రోగ నిరోధక శక్తి పెంపు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2025– 26 సంవత్సరంలో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా 427 యూనిట్లకు యువత దరఖాస్తు చేసుకోగా 352 యూనిట్లు బ్యాంకు రుణాల ద్వారా సహాయం అందించినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 55,08,85,000 మంది కూలీలకు 15.78 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. సీ్త్రనిధి పథకం ద్వారా రూ.75 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. -
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? సర్వే సాగిందిలా..


