బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి | - | Sakshi
Sakshi News home page

బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి

Feb 28 2026 8:37 AM | Updated on Feb 28 2026 8:37 AM

బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి

బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి

శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్‌ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement