ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

Feb 27 2026 8:11 AM | Updated on Feb 27 2026 8:11 AM

ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్‌ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, లాజిస్టిక్‌ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం రీజినల్‌ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌లు గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్‌, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్‌ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement