నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్


