కాలయాపన చేయొద్దు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలకు కావాల్సిన నిధులు సమకూర్చి త్వరగా భవనాలు నిర్మించాలి. కాలయాపన చేయకుండా.. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరగా పనులు ప్రారంభించాలి.
– బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (18ఎన్జికెఎల్72)
18 నెలల్లో పూర్తిచేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు జరుగుతున్నాయి. 18 నెలల్లో పూర్తిచేసి.. 2027 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో ప్రస్తుతం జటప్రోల్ దగ్గర పనులు కొనసాగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– రామచందర్, ఈఈ, ఈడబ్ల్యూఐడీసీ
●


