Nandyal District Latest News
-
ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు
ఈ ఏడాది రబీ సీజన్లో నాలుగు ఎకరాల సొంత పొలంలో వరిసాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, కోత, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పైరు చేతికందటంతో ఇటీవలే నూర్పిడి పనులు చేపట్టాను. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 25 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. – చాకలి సుబ్బారావు, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం రెండేళ్ల నుంచి వరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి సాగుతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రబీలో మూడు ఎకరా సొంత పొలంలో వరి సాగు చేశాను. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ.1,500 లోపే ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ. 2,200 ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. – రఘునాథరెడ్డి, రైతు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం ● -
‘ప్రత్యేక’ నిర్లక్ష్యం!
● ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు మొదలవ్వని ప్రత్యేక తరగతులు ● ఉత్తర్వులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది మొదటి సంవత్సర విద్యార్థులు జిల్లాలో 6,813 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణులు అయ్యేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నెల 1వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ రెండో సంత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు సెకండియర్ తరగతులకు హాజరుకావాలా? ఫెయిల్ అయిన సబ్జెక్టులు చదువుకోవా లా? అని ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి జూన్ 4వతేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరపనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొత్తం 23,169 మంది పరీక్షలు రాస్తే 16,356 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితోపాటు రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఈ తేదీల్లోనే ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువ వచ్చినవారు, వచ్చిన మార్కులపై అనుమానమున్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజుల వివరాలు.. ● రీకౌంటింగ్కి ఒక్కో పేపర్కు రూ.260 ● రీవెరిఫికేషన్తో పాటు, స్కాన్ చేసిన సమాధాన పత్రానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300 ● సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్లో థియరీ పరీక్షలకు రూ.600 ● ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● ఫస్ట్ ఇయర్, సెకండియర్ థియరీ పరీక్షలకు రూ.1,200 ● వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.550 ● మొదటి, ద్వితీయ పరీక్షల్లో పాసై, మార్కులు పెంచుకునేందుకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1350, సైన్స్ విద్యార్థులు రూ.1,600. ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండియర్లోకి వచ్చిన విద్యార్థులకు ఈనెల 1 నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి -
రేపు ఆది శంకరుల జయంతి
శ్రీశైలంటెంపుల్: వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పాలధార–పంచధార ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు చేపడుతామన్నారు. శంకరులు శ్రీశైలంలోని పాలధార–పంచధార వద్ద కొంతసేపు తపస్సు చేసి ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని రచించారని తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణకు రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలను అందజేశారు. ఆదివారం మహారాష్ట్ర రాష్ట్రం పూణేకు చెందిన ప్రమోద్గుప్తా రూ.లక్ష , హైదరాబాద్కు చెందిన రమేష్ బాబు రూ. లక్ష, టీ.నాగేంద్రకుమార్ రూ.1,05,000, విరాళాన్ని పర్యవేక్షకులకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఓంకారంలో మహిళ అదృశ్యం ● ఆమె వద్ద 12 తులాల బంగారం బండిఆత్మకూరు: మండల పరిధిలోని ఓంకార దేవస్థానంలో ఓ మహి ళ మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరాబాద్ గ్రామానికి చెందిన జింకల లక్ష్మీదేవి తన కూతురు, మనువరాలు, మరి కొందరితో కలిసి ఒక ఆటోలో ఆదివారం ఉదయం ఓంకార పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసిన అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరే సమయానికి లక్ష్మీదేవి కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఆమె వద్ద సుమారు 12 తులాల బంగారం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎస్ఐ జగన్ మోహన్ సిబ్బందితో చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8985541339, 9849484977 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. క్వింటా వేరుశనగ రూ.7,394 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 1,212 క్వింటాళ్లు వచ్చాయి. క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,394 ధర పలికింది, కనిష్ట ధర రూ.3,860, మధ్యస్థ ధర క్వింటం రూ.5,627 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు 67 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,010, మధ్యస్థ ధర క్వింటం రూ.5,709, గరిష్ట ధర రూ.5,890, అదేవిధంగా మొక్కజొన్న 25 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం కనిష్ట ధర రూ.1,410, మధ్యస్థ ధర రూ.1,455, గరిష్ట ధర రూ.1,480కు వ్యాపారు లు కొనుగోలు చేశారు. -
డీఎస్జీఎస్డబ్ల్యూఓగా భాస్కర్నాయుడు
● నంద్యాల అధికారిగా కే లలితాబాయి కర్నూలు(అర్బన్): జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా (డీఎస్జీఎస్డబ్ల్యూఓగా) టీవీ భాస్కర్నాయుడు నియమితులయ్యారు. నంద్యాల జిల్లా డ్వామాలో ఎంఅండ్ఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కర్నూలు డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమితులైన భాస్కర్నాయుడు గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపీడీఓగా, జిల్లా పరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. అలాగే నంద్యాలలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే లలితాబాయిని నంద్యాల డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది డిప్యూటీ సీఈఓ, డీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ వేర్వేరు జిల్లాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారులుగా నియమించారు. -
నంద్యాలలో అదనపు కోర్టులు ప్రారంభం
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో ఆదివారం 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ అదనపు కోర్టులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ ప్రారంభించారు. అదనపు కోర్టుల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించి కాల్వర్క్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అదనపు కోర్టుల ఏర్పాటు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ఇది కక్షిదారులకు ఎంతో ఉపయోగమన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తి ప్రావీణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి జిల్లాలో మిగిలిన అనదపు కోర్టులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ ఆధ్వర్యంలో జడ్జీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జీలతో పాటు సీనియర్ న్యాయ వాదులు రామసుబ్బయ్య, పెద్ది శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, హుసేన్బాషా, సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్రెడ్డి, తులసిరెడ్డి, కృపావతి, వివేకానందరెడ్డి, రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ, రామ్మోహన్రెడ్డి, గోళ్ల జయకృష్ణ, ఖలీల్, తిరుపతి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘాలతో పోరాటాలను ఉద్ధృతం చేస్తాం
నంద్యాల(న్యూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఇతర కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తా మని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సీఐటీయూ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా నంద్యాల పట్టణంలో రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. 80 మంది చర్చల్లో పాల్గొన్నారన్నారు. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం స్థితి గతులను మెరుగు పడేందుకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లతో 12 గంటల పనివిధానాన్ని తెచ్చిందని, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక చట్టాల అమలు కోసం హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర మహాసభల్లో 25 తీర్మానాలు ఆమోదం చేసినట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పేర్కొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని, స్కీం వర్కర్ల సమస్యలపై ఐక్యపోరాటాలు, మహిళలకు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని, వర్కర్లకు రక్షణ భద్రత కల్పించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సున్నిపెంటలో కూటమి నేతల సర్వే చట్ట విరుద్ధం
● ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేయాలిశ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట గ్రామంలో ప్రైవేటు సర్వే చేసేందుకు కూటమి నాయకులకు ఎవరు హక్కు ఇచ్చారని, ప్రైవేటుగా సర్వే చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు.. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సున్నిపెంటలో ప్రతి గడప సర్వే చేపట్టారని, ఇందుకు ప్రజలు కూడా సహకరించారన్నారు. అయితే జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యే బుడ్డా, ఆయన అనుచరుడు యుగంధర్రెడ్డి మళ్లీ ప్రైవేటుగా సర్వే జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను వారి ఆధార్కార్డులు, ఇతర పత్రాల ద్వారా సేకరించి డాటా చోరీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, యుగంధర్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సున్నిపెంటలోని కొందరి వ్యక్తుల గృహాలు, స్థలాలను లాక్కోవడానికి టీడీపీ నేతలు పెద్ద కుట్ర పన్నుతున్నారని శిల్పా విమర్శించారు. సున్నిపెంటలో ఏ ఒక్కరూ భయపడవద్దనీ, ప్రజలందరికీ తాను అండగా ఉంటానన్నారు. తాము అధికారంలో ఉన్న ప్పుడు జీవో నంబర్ 40 ద్వారా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా చేసి, సచివాలయ వ్యవస్థ తీసువచ్చామన్నారు. స్థానికులకు ఇంటి యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు పేదల ఆస్తులను లాక్కునేందుకు యత్నించడం దారుణమన్నారు. సున్నిపెంట ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నా రు. అవసరమైతే సొంత ఖర్చులతో సుప్రీం కోర్టు వరకు ప్రజల ఆస్తులను కాపాడుతానని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీలో ‘రచ్చ’కెక్కిన విభేదాలు!
● ఒకే రోజు వేర్వేరుగా కోట్ల, ధర్మవరం కార్యక్రమాలు డోన్: తెలుగుదేశం పార్టీలోని రెండు ప్రధాన వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా తయారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం రెండు వర్గాలు ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొన్న సంఘటన లేదు. చాలాసార్లు తమ పట్ల ఎమ్మెల్యే వర్గం వివక్ష కనబరుస్తోందని ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు బాహాటంగా విమర్శలు చేశారు. ఆ మేరకు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు. గత శనివారం తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన స్వగ్రామం ధర్మవరం గ్రామంలో రచ్చబండ ప్రారంభోత్సవం పేరుతో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పర్యటించడం ధర్మవరం సుబ్బారెడ్డికి ఆగ్రహం కలిగించింది. దీంతో తన మద్దతుదారుడైన కోడుమూరు నియోజకవర్గంలోని కోట్ల స్వగ్రామమైన లద్దగిరి సర్పంచ్ హనుమంతు పదవీ విరమణ కార్యక్రమం అంటూ ధర్మవరం సుబ్బారెడ్డి అదేరోజు లద్దగిరి గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ డోన్ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థి కోట్ల చిన్నాన్న అయిన కోట్ల కోదండరామిరెడ్డి కుటుంబీకులను ధర్మవరం సుబ్బారెడ్డి కలవడంతో ఎమ్మెల్యే వర్గీయులకు పుండుమీద కారం చల్లినట్లయింది. ఎగువ అహోబిల క్షేత్రంలో అగ్నిప్రమాదం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిల క్షేత్రంలో కారధ్య నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఆదివారం గేటు వద్ద ఉన్న షెల్టర్ను ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థ పూర్తిగా కాలి బూడిదైంది. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
దళారులకు ‘షుగర్లెస్’
బనగానపల్లె: రబీలో షుగర్ లెస్ సాగు చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. దళారులు లాభాలు పొందుతూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సార్బీసీ, అవుకు రిజర్వాయర్ ఆయకట్టు, వ్యవసాయబోర్ల కింద రైతులు రబీలో సుమారు 15 వేల హెక్టర్లలో షుగర్లెస్, 1010 రకాల వరి సాగు చేశారు. ఇందులో ఎక్కువశాతం షుగర్లెస్ ఉంది. ఈ పంటకు మంచి డిమాండ్ ఉన్నందుననే గత రెండేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంట చేతికొచ్చే తరుణంలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. 20 రోజుల క్రితం 75 కిలోల బస్తా రూ.1,800 ధర ఉండగా ప్రైవేట్ వ్యాపారులు సిండికెట్గా మారడంతో రూ.1,550కి మించడం లేదు. పెట్టుబడి అధికంగా ఉండటం, దిగుబడి మాత్రం 28–30 బస్తాలకు మించకపోవడంతో రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. కౌలు రైతులు మరింత అప్పులపాలయ్యారు. షుగర్లెస్ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ పంటను దళారులు కొనుగోలు చేస్తున్నారు. పంట కల్లాలో చేరే సమయంలో వ్యాపారులు సిండికేట్గా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. షుగర్లెస్ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. – వెంకటేశ్వర్లు రైతు, కాపులపల్లి బనగానపల్లె మండలం -
బీసీ.. అక్రమాలన్నీ మీవే!
బనగానపల్లె: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదెవరో, ఉనికి కోసం రాజకీయం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి గురించి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి లేకుండా అక్రమాలు తారాస్థాయికి చేరడంతో ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. కమీషన్లు ఇచ్చేవారికే పనులు ఇస్తూ, గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను చూపారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడారు.. ఆయన మాటల్లోనే.. ఓపెన్ డిబేట్కు సిద్ధం ‘‘ నేను 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శాశ్వత మంచినీటి పథకాలు, రోడ్లు నిర్మాణం, ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేశాం. బనగానపల్లెలో వందపడకల ఆసుపత్రి, జీఎం టాకీసు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పిలించాం. కోవెలకుంట్ల, కొలిమిగుండ్లలో ఇదే విధమైన సౌకర్యం కల్పించాం. అన్ని మండల కేంద్రాల్లో రోగులకు వైద్య సౌకర్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాం. మంత్రిగా రెండేళ్లుగా మీరు ఏమి చేశారు? ఇద్దరి హయాంలో జరిగిన అభివృద్ధిపై ఓపెన్ డిబేట్కు మేం సిద్ధం. పేద రైతుల తరఫున పోరాడుతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 2020 మార్చిలో భానుముక్కలలో 65.11 ఎకరాల ఎస్ఆర్బీసీ స్థలాన్ని సేకరించాం. అప్పట్లో కోర్టుకు వెళ్లి పేదలకు స్థలం పంపిణీ జరకుండా అడ్డుకున్నారు. ప్రజలకు ఒక చట్టం, మంత్రికి ఒక చట్టమా? ఎన్నికల సమయంలో ఎన్ని కోట్లు అయినా సరే సొంత డబ్బులతో భూమిని కోనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు కదా.. ఆ హామీ ఏమైంది? అప్పట్లో మేం సేకరించిన భూమినే మీరు పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావడం నిజం కాదా? వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమి కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధమయ్యారు కదా! ఆలయ మాన్యం భూమి 85 ఎకరాలను ఇల్లూరుకొత్తపేట గ్రామంలో గతంలో పేదలకు పంపిణీ చేశారని, దాన్ని తీసుకుంటే పేద రైతుల తరఫున తప్పక పోరాడతాం. బలవంతంగా డబ్బులు వసూళ్లు కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మొత్తాన్ని టీడీపీ నాయకుడు రామేశ్వరరెడ్డి స్వాహా చేశారు. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసిందే. ఈ విషయంపై మంత్రి బీసీ ఎందుకు స్పందించడం లేదు. ఆల్ట్రాటెక్ రాంకో మహా సిమెంట్ ఫ్యాక్టరీల్లో మేం ఎంతో మందికి జీవనోపాధి చూపాం. ఇప్పుడు కమీషన్ల ఇచ్చేవారికే పనులు అప్పగిస్తున్నారు. బనగానపల్లె పట్టణంలో పలువురి నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఇలా వసూలు చేసి అభివృద్ధి కోసమని అబద్ధాలు చెబుతున్నారు’’ అని కాటసాని అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధిచెబుతారన్నారు. సమాధానం చెప్పాలి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి స్వగ్రామం యనకండ్లలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం. ఆ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే దానిని మూసివేయించి దానిపై ఉన్న నా ఫొటోలకు రంగులు వేయించారు. బనగానపల్లె పాతబస్టాండ్ కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్మిస్తే ఓర్వలేక కూల్చి వేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా పాతబస్టా ండ్లో పేద ప్రజలు జీవనోపాధి పొందుతున్న షాపులను తొలగించారు. ఇదే కారణంతో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాన్ని తొలగించారు. మంత్రి ఇల్లు కూడా రోడ్డుకు అడ్డంగా ఉంది ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పాలి. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలో వస్తే అదే స్థానంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు
నందికొట్కూరు: నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించి పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. నందికొట్కూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత బానిసలుగా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు నాయక్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా పీఆర్సీ నియమించకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యా యులు ధర్నా చేశారు. ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య మాట్లాడుతూ మధ్యంతర భృతి 30 శాతం, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు, 2003 డీఎస్సీ ఉపా ధ్యాయులకు మెమో నం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఎంఈటీఎస్ విధానాన్ని అమలు చేసి, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్హుసేన్, దస్తగిరి బాషా, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, నూరుల్లా, నౌమాన్బాషా పాల్గొన్నారు. -
నంద్యాలలో ‘బయోడైజెస్టర్’
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణను శాసీ్త్రయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో రూ. 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యంత్రం రోజుకు 1000 కిలోల తడి చెత్తను ఎరువుగా మారుస్తుందన్నారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహ స్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. తయారైన ఎరువును 30 రోజుల పాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ ఉంచితే అది మెత్తటి పొడి రూపంలోకి మారుతుందన్నారు. పట్టణంలోని హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ కేంద్రానికి తరలించి ఎరువుగా మార్చుకోవచ్చన్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బనగానపల్లె రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లావిద్యాధి కారి జనార్దన్రెడ్డి అన్నారు. టంగుటూరు, బనగానపల్లె కొండపేట మోడల్ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బడి పిలుస్తోందని ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్లు, నోటుపుస్తకాలు అందుతాయన్నారు. ర్యాలీ అనంతరం బనగానపల్లెలోని ఒక పాఠశాలలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై డోన్ డి విజన్ స్థాయి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇ చ్చారు. డోన్ డిప్యూటీ డీఈఓ వెంకటరెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్స్ మాధవీలత, రామ్మోహన్, ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్ జగన్మోహన్రెడ్డి, ఎంఈఓ స్వరూప పాల్గొన్నారు. జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రేషన్కార్డు కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 20 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 9000710508, 9666224931, 9440905477, 08518– 273710 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
నందికొట్కూరు: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు ను శనివారం హైకోర్టు జడ్జి, ఆంధ్రప్రదేశ్, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి. కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈయన వెంట హైకోర్టు జడ్జీలు కొనకంటి శ్రీనివాసరెడ్డి, ఎ. హరిహరనాథ శర్మ ఉన్నారు. వీరికి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్ధి, కర్నూలు జడ్జి రాజేంద్రప్రసాద్, ఎస్పీ సునీల్ షెరాన్, స్థానిక జడ్జిలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, వేద పండితులు పూర్ణ కుంభంతో, మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అడిషనల్ కోర్టులో హైకోర్టు జడ్జీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సర్వమతాల ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక కోర్టులపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 అదనపు కోర్టులు, కర్నూలు జిల్లాలో 21 అదనపు కోర్టులను మంజూరు అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామాంజనేయులునాయక్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ బొమ్మలసత్రం: విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా గడిపే పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పోలీసు వెల్ఫేర్ కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్డేను ఎస్పీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను విన్నవించగా, పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దుతు నంద్యాల: నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర దృశ్యకళల మాజీ డైరెక్టర్ సునీత అమృత రాజ్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షురాలు హుసేనమ్మ, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతంపైగా రిజర్వేషన్లను కల్పించారన్నారు. కేబినెట్ పదవులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, డిప్యూటీ సీఎం, హోంశాఖ, వైద్యారోగ్యశాఖ, టూరిజం.. ఇలా అనేక కీలక శాఖలను మహిళలకు కేటాయించారన్నారు. సంక్షేమ పథకాలు కూడా మహిళలకే వర్థింపజేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. -
సంజామలలో 44.8
నిర్మానుష్యంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతం కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత ఉమ్మడి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమైంది. బయట తిరగడం పక్కనపెడితే.. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో హీట్వేవ్ కొనసాగుతోంది. సంజామలలో ఈ నెల 16న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు నమోదైంది. 17న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఎండల తీవ్రతతో ఈ మండలం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 183 చలివేంద్రాలు ఏర్పాటు చేశారట! ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా.. పాదచారులకు తగిన ఉపశమన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ఎరువులు, పురుగుమందులు, విత్తన షాపుల ఎదుట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా.. చలి వేంద్రాలు, చలువ పందిళ్లు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. జిల్లా మొత్తం మీద ప్రభుత్వం, లోకల్ బాడీస్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి 183 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 10 శాతం వరకు పనిచేయడం లేదు. చలివేంద్రాల ఏర్పాటులో అంకెలగారిడీ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని 9 పాంత్రాల్లో 12 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు వంటి పట్టణాల్లో చలువ పందిళ్ల జాడ లేకపోవడం గమనార్హం.మండలం ఉష్ణోగ్రత ఆళ్లగడ్డ 44.5 బనగానపల్లి 43.7 రుద్రవరం 43.7 కొత్తపల్లి 43.6 కోడుమూరు 43.6 వెల్దుర్తి 43.6 మంత్రాలయం 43.5 నంద్యాల రూరల్ 43.5 చాగలమర్రి 43.4 కర్నూలు 43.4 ఉయ్యాలవాడ 43.3 కోవెలకుంట్ల 43.3 గూడూరు 43.1 దొర్నిపాడు 43.1 కల్లూరు 43.1 చిప్పగిరి 43 మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలురానున్న రోజుల్లో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు, వడగాలుల తీవ్రత నంద్యాల జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 నుంచి 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంజమల మండలంలో కొనసాగుతున్న హీట్వేవ్ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సంజామలలో 44.8.. ఆళ్లగడ్డలో 44.4 డిగ్రీలు నమోదు అధికమైన విద్యుత్ వినియోగం గిర్రున తిరుగుతున్న విద్యుత్ మీటర్లు 0 -
కమిషనర్ సారూ.. ఇదేం తీరు!
డోన్: గత కొద్దిరోజులుగా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ తీరు పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రసాద్గౌడ్ వ్యవహార శైలిపై సామాజిక మాద్యమాల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఇటీవల జరిగిన చివరి సమావేశం ఎజెండాలో 45వ వార్డులో తాను నివసిస్తున్నట్లు పేర్కొంటూ తన కూతురు సాయి కీర్తనకు మున్సిపల్ కార్యాలయంలో నాన్ పీహెచ్ వర్కర్గా ఉద్యోగం కోసం ఎమ్మెల్యే సిఫారసు చేశారని అజెండాలో చేర్చారు. ఇదే అజెండాలో సాయి కీర్తన అనే అమ్మాయి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ను ఉద్యోగం కోసం అభ్యర్థించిందని మరోచోట పేర్కొనడం విశేషం. ● మున్సిపల్ పరిధిలో పన్నుల పర్యవేక్షణకు ప్రతి నెలా రూ.35 వేలు ప్రైవేటు వాహనం అద్దె కింద తీ సుకుంటూ ప్రైవేటు డ్రైవర్ను కాదని, రూ.50 వే లు వేతనం తీసుకుంటున్న మున్సిపల్ వాహన డ్రైవర్ ను తన కారు డ్రైవర్గా నియమించుకున్నారు. ● ఆగస్టు 15, జనవరి 26 లాంటి జాతీయ పర్వదినాల సందర్భాలతో పాటు వివిధ నాయకుల జయంతులు, వర్దంతులు జరిపే సమయంలో కూడా ఆయన డ్యాన్సుల పేరిట చిందులు తొక్కు తూ విమర్శలకు గురవుతున్నారు. పట్టణంలోని కోతులు, పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించానంటూ పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినటు ఆరోపణలు ఉన్నాయి. ● ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పాదాభివందనం చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదే ప్రసాద్గౌడ్ మూడేళ్ల క్రితం కర్నూలు జిల్లా గూడూరు కమిషనర్గా పనిచేస్తూ అక్కడి ఎమ్మెల్యే సుధాకర్ను మంత్రిగా చేసే వరకు విశ్రమించ రాదని పలు బహిరంగ వేదికల్లో మాట్లాడిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తు తం డోన్ కమిషనర్గా కాకుండా ఫక్తు టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ప్రసాద్గౌడ్ వైఖరి స్థానికులకు మింగుడు పడటం లేదు. ● స్థానిక పేరంటాలమ్మ గుడి వద్ద మున్సిపల్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ ఆంజనేయస్వామి గుడిని ప్రొక్లెయిన్లతో కూల్చివేశారు. ఇదే కమిషనర్ ఎమ్మెల్యే కోట్లను తప్పుదారి పట్టించి స్థానిక బోగందాని వంక బఫర్ జోన్ స్థలంలో మరో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి పునాదిరాయి వేయించారు. ఇక్కడ గుడి నిర్మించే పేరుతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే పన్నాగం పన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ ప్రసాద్గౌడ్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కూడా నేర్పరని కొందరు విమర్శిస్తున్నారు. కమిషనర్ వ్యవహార తీరుపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తరచూ వివాదాస్పదంగా డోన్ కమిషనర్ అడ్డగోలు నిర్ణయాలతో ప్రజాధనం వృథా అడ్డదారిలో కూతురికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం -
రేపు హైకోర్టు జడ్జీలు రాక
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టుల ప్రారంభోత్సవానికి ఆదివారం నంద్యాలకు హైకోర్టు జడ్జీలు వస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, కార్యదర్శి కందాల గౌరీశంకర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్ది, నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ కోనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ హరిహరనాథశర్మ, కలెక్టర్, ఎస్పీ, అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఐఏఎస్ లక్ష్యంగా చదువుతా సంజామల: ఆర్.లింగందిన్నె గ్రామానికి చెందిన మూరబోయిన గౌతమి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన మూరబోయిన లింగన్న, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె గౌతమి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెదటి సంవత్సరం బైపీసీ గ్రూప్లో 453 మార్కులు సాధించి అందరి నుంచి అభినందనలు అందుకుంటోంది. గౌతమి ఆరో తరగతి నుంచి పది వరకు కోవెలకుంట్ల గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియెట్ కర్నూలు జిల్లా బనవాసి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేదరికం వెంటాడుతున్నా చదువులో గౌతమి రాణిస్తోంది. ఐఏఎస్ లక్ష్యంగా ప్రణాళికతో చదువుతూ ముందుకెళ్తానని గౌతమి చెబుతోంది. జనగణనలో స్వీయ నమోదు విధానంపై అవగాహన నంద్యాల: జనగణన–2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముందుగా పోర్టల్లో నమోదు చేసుకుని, మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్యా స్థాయి, ఉపాధి వంటి అంశాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించాలన్నారు. నమోదు పూర్తిచేసే ముందు ఆప్షన్ ద్వారా వివరాలను పరిశీలించి, అనంతరం చేయాలని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా నమోదు చేయలేని వారికి ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. పెండింగ్లో 2,255 వ్యవసాయ కనెక్షన్లు నంద్యాల(అర్బన్): జిల్లాలో 2024 నుంచి ఇప్పటి వరకు 5,392 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 2,255 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంబంధించిన సీనియారిటీ జాబితాను అన్ని సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఈ జాబితాలో డిపాజిట్ చెల్లించి కనెక్షన్ల కోసం వేచి చూస్తున్న దరఖాస్తు దారుల వివరాలను సీనియారిటీ క్రమంలో పొందు పరించామని, దరఖాస్తు దారులు తమ దరఖాస్తు ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. అదే విధంగా 2,464 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 906 ట్రాన్స్ఫార్మర్లు అవసరంగా గుర్తించామన్నారు. రైతులు సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాను పరిశీలించి తమ వంతు వచ్చే వరకు సహకరించాలని జాబితాలో పేరు లేకపోయినా ఏవైనా పొరపాట్లు ఉన్నా వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కలిసి సరి చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. -
ఈద్గా కూల్చేసిన మంత్రి అనుచరులు
బనగానపల్లె: పట్టణ సమీపంలోని ఎస్సార్బీసీ కాలనీలో ఈద్గాను (ముస్లింల ప్రార్థనా మందిరం) రెండు రోజుల క్రితం అర్ధరాత్రి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు జేసీబీలతో కూల్చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పలువురు ముస్లిం నాయకులు తెలిపారు. ఈద్గా కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గురువారం ఉదయం కాటసాని రామిరెడ్డి బనగానపల్లెలోని తన ఇంటి నుంచి బయలుదేరగా, సీఐలు మంజునాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన, పోలీసు సిబ్బందితో వచ్చి అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లింలు పెద్ద ఎత్తున కాటసాని ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాను ఈద్గా వద్దకు వెళితే పోలీసులకు ఇబ్బంది ఏమిటని కాటసాని రామిరెడ్డి ప్రశ్నిస్తూ తన ఇంటి వద్దే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లెలో కొన్నేళ్ల కిందట ఎస్సార్బీసీ ఎస్ఈగా పని చేసిన హుస్సేన్మియా తన సిబ్బందితోపాటు పట్టణ ముస్లిం సోదరుల సహకారంతో ఎస్ఆర్బీసీ కాలనీలో మసీదు, మదర్సా, ఈద్గాను నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఎస్సార్బీసీ కాలనీలోని నివాసయోగ్యమైన ఇళ్లు, ఈద్గాను అర్ధరాత్రి కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సార్బీసీ కాలనీలోని క్వార్టర్స్, మసీదు, ఈద్గా, మదరసా జోలికి వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని కలెక్టర్తో మాట్లాడి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకున్నానని చెప్పారు. దానిపై అప్పట్లో బీసీ జనార్దన్రెడ్డి కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చారని గుర్తుచేశారు. తాను స్టేను తొలగింపచేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని కాటసాని రామిరెడ్డి వివరించారు. వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ఖైర్ మాట్లాడుతూ ఈద్గా కూల్చివేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ముస్లిం నాయకుల వెల్లడి ఈద్గాను పరిశీలించేందుకు బయలుదేరిన కాటసాని హౌస్ అరెస్ట్ బనగానపల్లెలో ఉద్రిక్తత -
మొబైల్కు వచ్చే లింక్లను ఓపెన్ చేస్తే ప్రమాదం
బొమ్మలసత్రం: గుర్తుతెలియని కొత్త నెంబర్ల నుంచి మొబైల్ ఫోన్కు వచ్చే లింక్లను ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడ్డట్టేనని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో నగదు మోసాలకు పాల్పడుతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్కు ఏపీకే ఫైల్స్ లింక్ను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింక్ను ఓపెన్ చేయగానే మొబైల్ఫోన్లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. ఆదమరిచి లింక్ ఓపెన్ చేస్తే వెంటనే పోలీసులు, 1930 నెంబర్కు ఫోన్చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్ కొలిమిగుండ్ల: ఐపీఎల్ టీ20 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. నందిపాడుకు చెందిన గుర్రాల కంబగిరి రాముడు అలియాస్ శ్రీరామ్ అనే వ్యక్తి గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహించాడు. సమాచారం అందుకున్న శ్రీరామ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు శ్రీరామ్ వద్ద బెట్టింగ్ ఆడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై వినతులకు ఆహ్వానం కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్(చైర్మన్ రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా) ప్రజల నుంచి వినతులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన తెలిపారు. బీసీల స్థితిగతులు, రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఆధారాలతో సహా ఈ నెల 30లోగా చేరే విధంగా పోస్టు ద్వారా పంపాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినతి పత్రాలను డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని 1వ అంతస్థు, కొనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజాపురం, విజయవాడ – 520010 అనే చిరునామాకు పంపాల్సి ఉందన్నారు. లేదా ఈ మెయిల్ (apbcdedicatedcommisson 2026 @gmali.com) ద్వారా పంపవచ్చన్నారు. సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నవోదయం’ ఎమ్మిగనూరుసెంట్రల్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన సాయిచరణ్ 485 మార్కులు, గణేష్ 477 మార్కులు, ప్రణీత్ 467 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈ.పద్మావతి గురువారం అభినందించారు. విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. -
చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
మృత్యు పంజా!కర్నూలు (హాస్పిటల్): అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన భార్య, అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మృతిని కళ్లారా చూసి గుండెపగిలేలా రోదిస్తున్న వ్యక్తి ఒకరు.. చెట్టంతా కు మారుడు, ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి లోకం వీడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు.. తీవ్రంగా గాయపడి హహాకారాలు చేస్తున్న క్షతగాత్రు లను చూసి చీకట్లో మృత్యువు వికటాట్టహాసం చేసింది. అందరూ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వా హనం గమ్యానికి చేరువైంది. ఇంతలో ఉలిక్కిపాటు. రెప్పపాటులో ఘోరం. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ చీకట్లు.. ఆర్తనాదాలు. ఘటనా స్థలం రక్తసిక్తం. కొందరు అప్పటికే ప్రాణం విడిచారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులపై మృత్యువు పంజా విసిరింది. మలుపులో మాటు వేసి లారీ రూపంలో ఎనిమిది మందిని మింగేసింది. మరి కొద్ది నిమిషాల్లో దైవ స్మరణలో తరలించాల్సిన వారిలో కొందరు విగతజీవులుగా మారగా.. మరి కొందరు క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు గూడ్స్ వాహనంలో మంత్రాలయం వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఫయాస్ మిల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. క్షతగ్రాతుల భాష అర్థం కాక వైద్యుల సతమతం.. చిలకలడోణ రోడ్డు ప్రమాద క్షతగాత్రులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ హాహాకారాలు అక్కడి వారిని కలిచి వేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో అమృత(11), తేజస్విని(15), దీక్షిత(16), వర్షిత(19), శుభ (34), జయమ్మ(60), ధన్యశ్రీ(14), దీపక్(16), ప్రతాప్(14), సునీత(20), భారతి(40), సునీల్కుమార్(25) ఉన్నారు. వీరిలో తేజస్విని, శుభల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు క్షతగాత్రులు ఏమి చెబుతున్నారో అర్థం గాక.. కన్నడ భాష అర్థం కాని వైద్యులు, సిబ్బంది చికిత్స అందించడంలో సతమతమయ్యారు. కన్నడ భాష స్వల్పంగా తెలిసిన వారు దగ్గరుండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారులు బాధతో విలవిలలాడి కొద్దిసేపు మూర్చపోయారు. ఎమినిమిది మంది మృత్యువాత, 12 మందికి తీవ్రగాయాలు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అందరూ కర్ణాటక రాష్ట్ర వాసులే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం -
సమష్టి పోరు
రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు. రాయలసీమ గురించి జగనన్న రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు మేలు చేసే విధంగా జగనన్న చేస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కోసం నిలిపివేయడం దారుణం. రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుందాం. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రజలు, రైతుల గురించి ఆలోచిస్తున్న జగనన్నకు మద్దతుగా ఉద్యమ బాట పడదాం. – బుట్టా రేణుక, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాట్లాడుతున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులుకర్నూలు(టౌన్): చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైతులంటే ఆయనకు గిట్టదు. తాగునీరు, సాగునీటి విషయంలో సీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇక పోరుబాట తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీమ ప్రాంత పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే సీమలో నీళ్లు పారాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం అమరావతి జపం సాగుతోందన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు.. సీమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట తప్పదని నేతలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు– సమాలోచన’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి, మద్దూరు సుభాష్ చంద్రబోస్, పార్టీ నేతలు షరీఫ్, కిషన్, రాఘవేంద్ర, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, నరసింహులు యాదవ్, రామాంజనేయులు, మహిళా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, సిట్రా సత్యనారాయణమ్మ, గాజుల శ్వేతారెడ్డి, సిద్దారెడ్డి రేణుకా, అరుణ, మంగమ్మ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ ప్రాంతానికి చెందిన 26వేల మంది రైతులు త్యాగం చేశారు. ఊళ్లు ఖాళీ చేశారు.. గూడు కోల్పోయారు. మరి అమరావతిలో 28వేల మంది రైతుల త్యాగం మాత్రమే చంద్రబాబుకు కనిపిస్తుందా. సీమ రైతులది త్యాగం కాదా. సీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం జగనన్న రూ.900 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. 10 శాతం పనులతో మొత్తం లిఫ్ట్ పూర్తవుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని లిఫ్ట్ పనులు నిలిపేశావు. లిఫ్ట్ వల్ల 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. – ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు. 1995 సంవత్సరం నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎం అయిన దివంగత వైఎస్సార్ వల్లే ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులతో నీళ్లు పారాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నా ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. వేదావతి, గుండ్రేవుల కోసం ఉద్యమిద్దాం. లిఫ్ట్ పనులు సాధించుకుందాం. సీమకు అన్యాయం జరుగుతున్నా రాయలసీమ టీడీపీ నేతలకు పౌరుషం లేదా?. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుదాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతం అంటే చిన్న చూపు. సీమలో పుట్టిన చంద్రబాబుకు చీము నెత్తురు లేదు. దివంగత నేత వైఎస్సార్ రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఆచరణలో చూపిస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఏ మాత్రం సాధ్యం కాదన్నారు. గురు శిష్యులు కలిసి రాయలసీమ రైతాంగాన్ని దగా చేశారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏడారి చేసే కుట్రలు చేస్తున్నారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తెలంగాణ సీఎం అడిగారని పనులు నిలిపివేయించారు. సీమ ద్రోహి చంద్రబాబు. సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై పోరాటం చేద్దాం. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే రాయలసీమకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. సీమకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాంత రైతులు, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుడితే ఆ పనులు నిలిపివేసి చంద్రబాబు ద్రోహిగా నిలిచారు. సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. – డాక్టర్ మధుసూదన్, ఎమ్మెల్సీ సీమ ప్రాంతానికి న్యాయం జరిగిందంటే ఒక్క వైఎస్సార్ కటుంబంతోనే. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44వేలకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపి వేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుదాం. లిఫ్ట్తో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్తెలంగాణ సీఎంకు సీమ ప్రాంతంలో జరుగుతున్న లిఫ్ట్ పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడు గిఫ్గ్గా ఇచ్చారు. సీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. జగనన్న హయంలో మంజూరైన లా యూనివర్సిటీని కూడా తరలించారు. హైకోర్టును లేకుండా చేశారు. తెలంగాణ కోసం 6 జిల్లాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. – బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిరెండేళ్లలో చంద్రబాబు నాయుడు 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం ప్రారంభించారా?. 10 పైసలు ఖర్చు చేసి వంద రూపాయిల బిల్డప్ తప్ప ఆయన చేసిందేమీ లేదు. రాయలసీమ వ్యక్తి అయిన చంద్రబాబు ఎప్పుడూ అమరావతి జపమే చేస్తున్నాడు. సీమ ప్రాంత ప్రజలు ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – వై.సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా సిగ్గు పడాలి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. సీమ ప్రాంత రైతులను దగా చేశారు. రైతులంటే ఎందుకంత కోపం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే లిఫ్ట్ పనులు నిలిపి వేసి చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం సీమ ప్రజలను నాశనం చేస్తావా? ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు. హంద్రీనీవా అంటే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు రైతులకు ఏం చేశాడో చెప్పాలి. – కంగాటి శ్రీదేవి, పత్తికొడ మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. సీమలోని రైతులు, ప్రజల దాహార్తి పట్టదా. భావి తరాల కోసం మనందరం పోరాడుదాం. ప్రాజెక్టులను సాధించుకుందాం. – ఎస్వీ విజయ మనోహరి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద సీమ ప్రజలకు, రైతుల కోసం జగనన్న లిఫ్ట్ పనులు ప్రారంభిస్తే వాటిని తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు నిలిపివేసి సీమకు అన్యాయం చేస్తున్నారు. సీమలోని టీడీపీ నాయకులు రాయలసీమ ప్రాజెక్టు సాధనకు కలిసి రాకుంటే పుట్టగతులుండవు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం సాగిస్తాం. – రాజీవ్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయ కర్త కర్నూలును రాజధానిగా కొనసాగించి ఉంటే బెంగళూరు, చైన్నె తరహాలో అభివృద్ధి సాధించేది. సీమ ప్రాంతాన్ని వైఎస్ కుటుంబం తప్ప ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగనన్న ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించుకుందాం.గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై ప్రజలను, రైతులను చైతన్యం చేద్దాం. ఇక సీమ రైతులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – తలారి రంగయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతుంది. రాయలసీమలో భూమి మంచిదే. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో రిజర్వాయర్లు నిర్మించారు. జగనన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీమ రైతుల త్యాగం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను అవమానిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది. – వంగాల భరత్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి చంద్రబాబు సీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు అమరావతి జపం చేస్తున్న టీడీపీ నేతలు సీమ ప్రాంత అభివృద్ధి పూర్తిగా విస్మరించారు కర్నూలులో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ సదస్సు గళం వినిపించిన సీమ ప్రాంత ముఖ్య నేతలు -
బాలుడి గొంతులో చిక్కుకున్న గోలి
ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి ఈర న్న, ఉష దంపతుల నాలుగేళ్ల కుమారుడు హన్విత్ ఇంటి దగ్గర ఆడుకుంటూ గోలిని మింగేశాడు. అది గొంతులో చిక్కుకుని నొప్పి వస్తూ గాలి తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని చూసి వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు ప్రసూన వెంటనే బాలుడి పరిస్థితిని చూసి ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల సమయంలోనే శస్త్ర చికిత్స లేకుండా, కుట్లు, కోతలు లేకుండా గోలిని సులభంగా బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
వైభవంగా ముగిసిన వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వసంతోత్సవాలు బుధ వారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర కృష్ణ ఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీలో పలు విభాగాలకు సంబంధించి పదవులను కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ● నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం శివనాగిరెడ్డిని స్టేట్ ఎంప్లాయీస్, పింఛనర్స్ వింగ్ సెక్రటరీగా, గోపవరం జయప్రకాష్ నారాయణరెడ్డిని జిల్లా యూత్వింగ్ వైస్ ప్రెసిడెంట్, పాణ్యంకు చెందిన జీ సుమంత్కుమార్రెడ్డిని పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, జీ మధుమోహన్రెడ్డిని జిల్లా ట్రెజరర్, సద్దల చంద్రశేఖర్రెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీ, బొనిగేని బాలుడును జిల్లా యూత్వింగ్ సెక్రటరీగా, రోషనాల సంతోష్కుమార్ను నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ● బనగానపల్లెకి చెందిన పేరం సత్యనారాయణరెడ్డిని జిల్లా సెక్రటరీ ఆర్గనైజర్, యేరాసి నాగేశ్వరరెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీ, కొట్టాల వెంకటేశ్వర్లును జిల్లా యూత్వింగ్ సెక్రటరీ, పీఆర్ చిన్నఓబుల్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ, కునుకుంట్ల హరి, గురుకంటి అకార్బాషాలను జిల్లా యూత్ వింగ్ ఎక్సిక్యూటీవ్ మెంబర్లుగా నియమించింది. ● డోన్కు చెందిన ఎద్దుల గజేంద్రనాధ్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ వైస్ప్రెసిడెంట్, మధుసూదన్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ, రజనికాంత్రెడ్డిని జిల్లా యూత్ వింగ్సెక్రటరీగా నియమించింది. ● శ్రీశైలంకు చెందిన ఎస్ లక్ష్మిరెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీగా, వీ నారపరెడ్డిని జిల్లా యూత్వింగ్ సెక్రటరీ, ఎల్ చక్రపాణియాదవ్ను, ఎం అల్లాబకాష్, సహ్రిఫా రాజ్, గుంటి శరత్కుమార్లను జిల్లా యూత్వింగ్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఎస్బీఎం కార్యక్రమాలపై శిక్షణ కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (గ్రామీణ్) కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లాలోని డీడీఓ, డీఎల్పీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీఆర్సీ ప్రిన్సిపాల్, జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలోని అధికారులకు జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో, నంద్యాల జిల్లాకు చెందిన అధికారులకు నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 22, మే 5, 12, 13వ తేదీల్లో డీఎల్పీఓ, డీడీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు వివిధ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. -
ఇంజినీర్ల కొరత.. పనులు సర్వేశ్వరుడికెరుక!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం వార్షిక బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది. అందులో ఇంజినీరింగ్ విభాగానికి బడ్జెట్ అగ్రభాగం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఏటా సుమారు రూ.వంద కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజినీరింగ్ విభాగంలో కొంత మందిదే హవా జరుగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొర త స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఉండాలి. గతంలో ఎస్ఈ పోస్టు మంజూరైనప్పటికీ దేవస్థాన ఈఓతో సమానమైన హోదా ఉంటుందని గతంలో పనిచేసిన ఈవోలు ఆ పోస్టును తొలగించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఇద్దరు ఉండాలి. వీరికి బీటెక్ అర్హత ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సప్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–1, డ్రాఫ్ట్మెన్–2 ఉండాలి. అలాగే ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేకాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్, ఫ్టిర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో ఎస్ఈ పోస్టు లేదు. అలాగే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లులో ఒకరికి మాత్రమే బీటెక్ అర్హత ఉంది. మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు డిప్లొమా అర్హత ఉంది. నలుగురు డీఈఈలకు గాను ఎవరూ లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరి కొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఒకే ఒక్క డ్రాఫ్ట్మెన్.. ఇంజినీరింగ్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టు డ్రాఫ్ట్మెన్. క్షేత్రంలో హెడ్ డ్రాఫ్ట్మెన్ ఒకరు, ఇద్దరు డ్రాఫ్ట్మెన్ ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్క డ్రాఫ్ట్మెన్ మాత్రమే ఉన్నారు. టెండర్ ప్రతిపాదనలను పరిశీలించడం, తనిఖీ చేయడం, రేట్ కోడింగ్ తనిఖీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తీసుకోవడం, బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం, పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవడం, టెక్నికల్ ఎవాల్యువేషన్, కండీషన్లు ప్రకారం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారా.. లేదా? తదితర ముఖ్యమైన విధులు డ్రాఫ్ట్మెన్ నిర్వహిస్తారు. ఈయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతుంటారని పలువు రు కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభా గంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
పువ్వుల నవ్వులు.. పచ్చని నేస్తాలు..!
ప్రకృతితో మమేకమైతే జీవితంలో సంతోషం విరబూస్తుంది. గొడ్డలితో నరికినా నీడనిస్తూ, ఫలాలను అందిస్తూ చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచడం చెట్లకే చెల్లు. కర్నూలు నగర శివారు, వెంకయపల్లె ఎల్లమ్మకు వెళ్లే దారిలోని చెట్లు(గోల్డెన్ ట్రంపెట్) సరిగ్గా నెల రోజుల క్రితం ఒళ్లంతా పూలతో నవ్వులు చిందించాయి. పసుపు పచ్చని పూలు గాలికి రాలిపడుతూ ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఇవే చెట్లు నేడు పచ్చని ఆకులతో చల్లని నేస్తాలుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నెల రోజుల క్రితం పువ్వులతో నిండిన చెట్లు ప్రస్తుతం ఆకుపచ్చని ఆకులతో ఆహ్లాదాన్ని పంచుతూ.. -
మరణంలోనూ తోడుగా..
గోస్పాడు: కలకాలం కలసి ఉంటామని పెళ్లి నాడు చేసిన ప్రమాణాన్ని మృత్యువు సైతం వారిని విడదీయలేదు. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట దాదాపు 60 ఏళ్లు కలతలు లేకుండా ఆనందంగా కొనసాగారు. కొన్నాళ్లు కుటుంబ బాధ్యతలతో తలమునకలైనా.. ఆ తర్వాత వృద్ధాప్యంలో కుమారుడి సపర్యలతో జీవితాన్ని గడుపుతుండగా మృత్యువు గంటల వ్యవధిలో వారిని తీసుకెళ్లింది. వారి వైవాహిక జీవితానికి తోడుగా ముగింపు పలకడం కుటుంబీకులు, గ్రామస్తులను కలిచివేసింది. ఈ విషాద ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోరెడ్డి అంకాల్ రెడ్డి (88), వెంకటసుబ్బమ్మ (81)కు దాదాపు 60 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ దంపతులు పాడి పశువులతో పాటు పొలాలు సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మొదటి నుంచి భార్యాభర్తలు ఎలాంటి కలతలు లేకుండా ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ ప్రశాంత జీవితాన్ని గడిపారు. వృద్ధాప్యంలో కూడా కుమారుడు వెంకటేశ్వరరెడ్డి వద్ద ఉంటూ కాలం వెల్లదీశారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కుమారుడు సపర్యలు చేస్తుండేవారు. అయితే వృద్ధాప్యం వల్ల ఇద్దరూ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజన అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వెంకటసుబ్బమ్మ ఆయాస పడుతుండడంతో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి గమనించి పలుకరిస్తుండగా కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది. భార్య ఇక లేదని తెలుసుకున్న అంకాల్రెడ్డి గుండె ఆగిపోయింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తండ్రి నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు కుమారుడు గుర్తించాడు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దంపతులు ఇద్దరూ ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి 60 ఏళ్ల వైవాహిక జీవితం తోడుగానే ముగింపు సాంబవరం గ్రామంలో విషాదం -
నోటీసులు ఇవ్వకుండా శ్రీహరిని అరెస్టు చేయడమేంటి?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్యకర్నూలు (టౌన్): పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీహరి ఒక జర్నలిస్టుగా పనిచేశారన్నారు. మీడియా ఇన్చార్జ్గా పనిచేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. ‘అసలు నోటీసులు ఇచ్చారా.. భయభ్రాంతులు చేయడం కోసమే కదా.. ఆటవిక పాలనలో ఉన్నామా..? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున అంబేడ్కర్కు దండలు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు అర్హుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభు త్వం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. శ్రీహరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అతన్ని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అవకాశం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షలకు 8281 మందికి 7470 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూర్ రావూస్ డిగ్రీ కళాశాల, ఎస్ఎమ్ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షల్లో కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 3575 మందికి 3381 మంది విద్యార్థులు హాజరు కాగా 194 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వంకలోకి దూసుకెళ్లిన లారీ పత్తికొండ రూరల్ : మండల పరిధిలోని అటికెలగుండు గ్రామ సమీపంలోని మలుపులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. బనగానపల్లె నుంచి ఆదోనిలోని రైస్మిల్లుకు వడ్ల లోడుతో లారీ బయల్దేరింది. దేవనబండ–ఆటికెలగుండు మలుపు దగ్గర అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం హమాలీలతో వడ్లను వేరే లారీలోకి మార్చారు. సుళువాయిలో గడ్డివాములు దగ్ధం హొళగుంద: సుళువాయి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్ఠం సంభవించింది. గ్రామానికి చెందిన హరిజన పెద్ద ఈరన్న, వెండికట్ట వసంతకుమార్, బసాపురం రమేశ్, చాకలి పరుశురాం అనే రైతులు వరిగడ్డిని కొని ఎస్సీ కాలనీ సమీపంలో నిల్వ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుండి గడ్డివాములకు మంటలు అంటుకుని కాలిపోయాయి. స్థానికులు ఆలూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే కాలి బూడిదయ్యాయి. కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ విడుదల చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలస్టులు రూ.1250 ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. www.cfmr.ap.gov.in అనే సైట్లో లాగిన్ అయి హెడ్ అకౌంట్ 8342–00–120–01–03–001, డీడీఓ కోడు 2703 0802 003 నందు ప్రీమియం చెల్లించేలాని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య ప్యాపిలి: పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు (29) అలియాస్ బిట్టు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. రామాంజనేయులు కొద్ది సంవత్సరాల క్రితం గుడిపాడుకు చెందిన మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి రెండు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మద్యం సేవించే అలవాటు ఉన్న రామాంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన రెండు చేతులను కోసుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన బంధువులకు విషయం చెప్పింది. బుధవారం వారు ఇంటి వద్దకు వచ్చి చూడగా లోపల గడియ పెట్టినట్లు గుర్తించి వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. రామాంజనేయులు మృతి చెంది ఉండటంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కొట్టేసిన ఫోన్లు పట్టేశారు
కర్నూలు: రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. బాధితులు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు విడతల్లో రూ.3.70 కోట్ల విలువ చేసే 1,873 సెల్ఫోన్లను రికవరీ చేయగా, తాజాగా నాలుగో విడత రూ.1.10 కోట్ల విలువ చేసే 529 సెల్ఫోన్లను రికవరీ చేశారు. బాధితులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఎస్పీ చేతుల మీదుగా రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్రావు, శివశంకర్, మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు. మొబైల్ పోగొట్టుకుంటే.. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీస్ వెబ్సైట్ http://kurnoolpolice.in/mobiletheft లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు ఫారం నింపాలి. పేరు, జిల్లా, పోలీస్స్టేషన్ పరిధి, మొబైల్కు సంబంధించిన ఐఎంఈఐ–1, ఐఎంఈఐ–2 నెంబర్లతో పాటు బిల్లులు ఆన్లైన్లో సమాచారం పొందుపరిస్తే సాంకేతికత ఆధారంగా ట్రాక్ చేసి ఎక్కడుందో పోలీసులు గుర్తిస్తారు. -
రోగి కడుపులో అతి పెద్ద కణితి
● విజయవంతంగా తొలగించిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): ఓ రోగి కడుపులో ఏర్పడ్డ అతి పెద్ద క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్ వివరాలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతానికి చెందిన జి.మత్తయ్య(75)కు చాలా ఏళ్లుగా కడుపులో గడ్డ(కణితి) ఉంది. ఈ నెల 6న ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం చేరాడు. జనరల్ సర్జరీ మొదటి యూనిట్ వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి రెట్రోపెరిటోనియల్ లైపోసోర్కోమా అనే ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కడుపులో ముప్పావు భాగాన్ని ఆక్రమించేంత పెద్దగా ఉంది. ఈ అతి పెద్ద కణితి అతని ఎడమ మూత్రపిండాన్ని పక్కకు జరిపింది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఈ నెల 15న ఆయనకు మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ హరచరణ్తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అజమ్ముల్ హుసేన్, పీజీలు ఉన్నారు. అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ్రామ్ సహకరించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
అమ్మ కష్టాన్ని చూసి చదివా
మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను. – అన్నపురెడ్డి మరియమ్మ, నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గతేడాదితో పోల్చితే ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుబడి, ద్వితీయ సంవత్సరంలో పెద్దగా మార్పులేదు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల కాగా మొదటి సంవత్సరం 70.50 శాతం, రెండో సంవత్సరం 78.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 13,957 మంది విద్యార్థులు హాజరు కాగా 9 వేల మంది విద్యార్థులు (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,343 విద్యార్థులకు గాను 688 మంది (61.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ విద్యార్థులు జనరల్ విభాగంలో 12,657 మందికి గాను 9,297 మంది (78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,233 మందికి గాను 827 పాస్ (76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ ఫలితాలను విడుదల చేశారు. జిల్లా మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో 25వ స్థానం, ఇంటర్ రెండో సంవత్సరంలో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షల్లో 6,363 మందికి గాను 3,576 మంది బాలురు పాస్ అయ్యారు. అలాగే బాలికలు 7,694 మందికి గాను 5,424 మంది పాస్ అయ్యారు. అలాగే వొకేషనల్లో బాలురు 692 మందికి గాను 286 మంది పాస్ కాగా, బాలికలు 651 మంది గాను 402 మంది పాస్ అయ్యారు. అదే విధంగా ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో బాలురు 5,679 మందికి గాను 3,815 మంది పాస్ కాగా, బాలికలు 6,978 మందికి గాను 5,482 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ పరీక్షల్లో బాలురు 583 మందికి గాను 331 మంది పాస్ కాగా బాలికలు 650 మందికి గాను 496 మంది ఉత్తీర్ణత సాధించారు. గోస్పాడు మోడల్ స్కూల్లో 99.16 శాతం జిల్లాలో 19 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. మొదటి సంవత్సర ఫలితాల్లో 1,489 మందికి గాను 1,092 మంది (74.89 శాతం), ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 1,359 మందికి గాను 1,104 మంది (83.57 శాతం) విద్యార్థులు ఉతీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో జిల్లాలో 100 శాతం ఫలితాలు రాలేదు. మొదటి సంవత్సరంలో గోస్పాడు మోడల్ స్కూల్ 99.16 శాతం సాధించగా, అతి తక్కువలో జూపాడుబంగ్లా మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల 63 శాతం సాధించింది. రెండు కేజీబీవీల్లో వంద శాతం.. జిల్లాలో 26 కేజీబీవీ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 813 మంది విద్యార్థులకు గాను 573 మంది (70.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 653 మందికిగాను, 490 మంది (75.04శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో గోస్పాడు, మిడుతూ రు కేజీబీవీలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఆళ్లగడ్డ కేజీబీవీ అతి తక్కువ 31 శాతం సాధించి చివరలో నిలిచింది. శ్రీశైలం కళాశాలలో 98 శాతం.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నా యి. ఈ కాలేజీలకు చెందిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో 2,599 మందికి గాను 1170 (45.72 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,203 మందికి గాను 1,498 (67.9 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం అత్యధికంగా శ్రీశైలం ప్రభుత్వ జూనియర్ కళాశాల 98 శాతం, అతి తక్కువ ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజీ 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇలా.. జిల్లాలో ఆరు సోషల్ వెల్ఫేర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో 441 మందికి గాను 410 మంది (93 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 390కి గాను, 377 మంది (97 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ● ఒకేషనల్ 9 ప్రభుత్వ కళాశాలల్లో 1,343 మందికి గాను 688 పాస్ కాగా (51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 1,233 మంది విద్యార్థులకు గాను 827 మంది పాసై (67శాతం) ఉత్తీర్ణులయ్యారు. ● జిల్లాలో మూడు బీసీ వెల్ఫేర్ కళాశాలలో మొదటి సంవత్సరం 243 మందికి గాను 230 మంది పాస్ కాగా 94.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 238 మందికి గాను 222 మంది (94శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ మూడు కళాశాలల్లో మొదటి సంవత్సరం 282 మందికి గాను 252 మంది (89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 295 మంది విద్యార్థులకు గాను 268 మంది (90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు.. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో జీవమణి (438) ఆత్మకూరు, ఎంపీసీ విభాగంలో గురుపవిత్ర (458) ఆళ్లగడ్డ, సీఈసీలో ధనలక్ష్మి (489) ఉయ్యాలవాడ, రమేష్ (475) కొలిమిగుండ్ల, షేక్ జరీనాబేగ్ (487) నంద్యాల, సెకండియర్ ఎంపీసీలో రమ్య (984) ప్యాపిలి, లక్ష్మీనరహరి (983) కోవెలకుంట్ల, షేక్ రియాజ్ (961), శీశైలం, సీఈసీలో అక్బర్బాబు 951(డోన్), ఉసేన్బీ (900) సంజామల, బైపీసీలో సీమ 974 (గోస్పాడు), స్వరూపరాణి (971) పాములపాడు.. తో పాటు పలువురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఇంటర్లో ఎంపీసీలో నాకు 984 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కష్టపడి పడి నన్ను చదివించారు. కష్టపడి చదివించిన వారి రుణాన్ని ఇంజనీర్ను అయి తీర్చుకుంటా. వారి ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తా. ఇంజనీర్ కావాలని ఉంది. – రమ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలి రీకౌంటింగ్కు అవకాశం... రీ వెరిఫికేషన్ దరఖాస్తులు ఈనెల 20 నుంచి 27 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల ఫీజు, చెల్లించాల్సిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కోవెలకుంట్ల: మండలంలోని వెలగటూరుకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన షాలిని నంద్యాల పట్టణంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రసాయన ద్రావణం(పేడపౌడర్) తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా ఫస్టియర్లో 70.50 శాతం, సెకండియర్లో 78.56 శాతం ఉత్తీర్ణత సత్తాచాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు -
వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
● ఐదుగురిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలుమహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై తరచూ ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.10 గంటల వరకు ఇద్దరు వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్లు విధులు హాజరు కాలేదు. అయితే విధులకు హాజరు కాని ముగ్గురు సిబ్బంది తరఫున స్థానిక ఎంపీహెచ్ఈఓ హుసేన్రెడ్డి ద్వారా మూమెంట్ రిజిస్టర్లో సంతకాలు చేసినట్లుగా ఉండటంతో కలెక్టర్ గుర్తించి తీవ్రంగా పరిగణించారు. ఐదుగురు వైద్య సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆసుపత్రిలో తనిఖీలు ముగించి పక్క గ్రామమైన అబ్బీపురం సచివాలయం వద్దకు చేరుకోగా అక్కడికి వైద్యాధికారులు భగవాన్దాస్, వేణుకార్తికేయలు చేరుకోగా ఇదేనా ‘మీ సమయ పాలన’ అంటూ మండిపడ్డారు. -
భక్తిశ్రద్ధలతో దేవర
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని సోగనూరు గ్రామంలో శ్రీమారెమ్మవ్వ, శ్రీసుంకులమ్మవ్వ దేవర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. దేవర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంభాలతో అమ్మవార్ల దేవాలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బంధువులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశం అధికంగా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసివారి కంటే ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్లోనూ పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులువుగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిసెట్ రాసేందుకు పదోతరగతి విద్యార్థులు సైతం పోటీ పడవచ్చని తెలియజేస్తున్నారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఐటీఐ విద్యార్థులు బ్రిడ్జి పరీక్ష ద్వారా డిప్లొమా కోర్సుల్లో ద్వితీయ ఏడాదికి అడ్మిషన్ అందుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంతటి సువర్ణావకాశాలు గల ఈ కోర్సులపై జిల్లాలోని పాలిటెక్నిక్ సిబ్బంది సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ఉజ్వల భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కళాశాలల వివరాలు... జిల్లాలో మొత్తం ఐదు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీలు 3, ప్రైవేటు 2 కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (నంద్యాల), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీశైలం), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (బేతంచెర్ల), ప్రైవేటు కళాశాలలు: ఎస్వీఆర్ ఇంజనీరింగ్(నంద్యాల), వాసవీ పాలిటెక్నిక్(బనగానపల్లె) ఉన్నాయి. బ్రాంచ్లు, సీట్ల వివరాలు... ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సీఎంఈ, బీఎం, సీహెచ్ఎస్టీ, సీసీపీ, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు. అయితే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్ మాత్రం మూడున్నరేళ్ల కోర్సు. ప్రారంభమైన ఉచిత శిక్షణ... జిల్లాలోని మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ను అందించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ప్రవేశం ఇలా.. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్హతతో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పాలిటెక్నిక్లో చేరొచ్చు. అలాగే ఇంటర్ ఒకేషనల్ చేసిన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరై ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అలాగే ఐటీఐ ట్రేడ్లలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్రిడ్జి కోర్సు ద్వారా నిర్వ హించే అర్హత పరీక్షకు హాజరవ్వాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇదివరకే పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్కు దరఖాస్తు చేసుకో వచ్చు. ప్రవేశం నాటికి పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడడానికి పాలిటెక్ని క్ సరైన మార్గం. విద్యార్థులకు ఇదో మంచి అవకాశం, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. పై చదువులకు సైతం ఉపయోగపడుతుంది. విద్యార్థులకు బుధవారం నుంచి ఉచితంగా శిక్షణ సైతం అందిస్తున్నాం. – శైలేంద్రకుమార్, పాలిసెట్ కన్వీనర్, నంద్యాలఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు అవకాశం ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో ద్వితీయ ఏడాదిలో నేరుగా ప్రవేశం బ్రిడ్జి పరీక్ష ద్వారా ఐటీఐ విద్యార్థులకు సెకండియర్లో అడ్మిషన్ 25న ప్రవేశ పరీక్ష డిప్లొమో కోర్సులతో చక్కటి ఉపాధి -
అందరికీ ఆదర్శం అంబేడ్కర్
సాక్షి, నంద్యాల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరికీ ఆదర్శమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంత్యుత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నంద్యాలలో అంబేడ్కర్ భవనం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. అంబేడ్కర్ చిన్నతనంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ, ఉన్నత విద్యను సాధించి గొప్ప స్థాయికి ఎదిగారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, పలు సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, లింగుస్వామి, దండు వీరయ్య, డీవీఎంసీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి పాల్గొన్నారు. -
వైభవంగా వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకళలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్లుపీతాంబరాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 26 నుంచి ‘శాప్’ ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో 2026–27 ఏడాదికి ఏప్రిల్ 26 నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 నుంచి 19 సంవత్సరాల్లోపు ఉన్న క్రీడాకారులు, 01–01–2008 నుంచి 01–01–2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కోచింగ్, వసతి, భోజనం, ఆధునిక శిక్షణ సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలు https://soprts.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది. -
గుక్కెడు నీరివ్వలేని చంద్రబాబు ప్రభుత్వం
● దోచుకో.. దాచుకో అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి లేదు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: తీవ్రమైన ఎండలతో మంచినీరు దొరకక, గొంతులు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీరు ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్ , పవన్కు ‘దోచుకో.. దాచుకో’ అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఆలూరులో 20 రోజులకు ఒక సారైనా తాగునీరు రావడం లేదన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలంలోని మొలగవల్లి, కురుకుంద, హులేబీడు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామా ల్లో నెల తరబడి మంచినీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు తాళం వేశారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి ఏదైనా చేస్తామని చెప్పి వెవెళ్లారన్నారు. గత పదేళ్లుగా కురుకుంద గ్రామస్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో పక్కనే ఉన్న హెబ్బటం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో కనీసం చలనం లేదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీటి పైపు లైన్లు మార్చాలని గత జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కు ఎస్టిమేట్ వేసి వినతిపత్రం ఇచ్చారన్నారు. డీఆర్సీ మీటింగ్లో కూడా చాలా సార్లు తాగునీటి సమస్యపై ప్రస్తావించినా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలకే పరిమితంగ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి తిరగడం కాదని, తాగునీరు, రోడ్లు సమస్య తీర్చాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇన్చార్జ్ పదవి పోతే వారు ఇక్కడ ఉండబోరన్నారు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పక్కనే ఎల్ఎల్సీ పారుతున్నా.. ఎస్ఎస్ ట్యాంకులు సామర్థ్యం పెంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్ద ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్ సృజన ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాన్ని విస్మరించిందన్నారు. నగరడోణ రిజర్వార్కు బిల్లు చెల్లిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయన్నారు. -
ఉగ్ర భానుడు
● కోడుమూరు, సంజామల మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాపై బానుడు విరుచుకుపడుతున్నాడు. మంగళవారం ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. ఏప్రిల్ మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. అత్యధిక మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్కుమార్ తెలిపారు. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు గంజర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాటసాని ఇంటి వద్దకు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో సత్యనారాయణ, మద్దిలేటి, గోరంట్ల, మారెళ్ల కిట్టు, నాగేష్ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారి భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలు నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, గని రామలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో కారు బోల్తా
మహానంది: నల్లమలలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మద్యం వ్యసనం మానుకునేందుకు పాణ్యం వద్ద పసురు, అంత్రాలు వేస్తున్నారని తెలుసుకుని గుంటూరు పట్టణానికి చెందిన ముగ్గురు కారులో బయలుదేరి వచ్చారు. వచ్చిన పని చూసుకొని నంద్యాల, గాజులపల్లె మీదుగా తిరిగి వెళ్తున్నారు. గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఊరు నీరడుగుతోంది
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీరందిస్తామని సర్కారు చెప్పడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. దీంతో వేసవి కాలం ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తింది. పలు గ్రామాల్లో ప్రజలు తమ దాహం తీర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ గ్రామంలోని చల్లా కాలనీలో ప్రధాన తాగునీటి పైపు లైన్ వెళ్తుంది. అయిత, అక్కడ నివసించే 50 కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కారు రావడంతో కుళాయి కనెక్షన్ల ఏర్పాటు అంశం అటకెక్కింది. రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు కనిపించిన అధికారులను, పాలకులను కలిసి పనులు వదులుకొని సుదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని, తమ ఇళ్ల ముందే పైపులైన్ వెళ్తుందని కుళాయి కనెక్షన్లు ఇచ్చి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చల్లా కాలనీవాసులు వాపోతున్నారు. – సంజామల -
కోటకొండ కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు
రుద్రవరం: కోటకొండ గ్రామ సమీపంలోని కుంటలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.గత రెండు రోజుల నుంచి రాత్రి సమయాల్లో జేసీబీలతో తవ్వి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ కుంటలో మట్టి తవ్వకాలు సాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలో ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వడం వల్ల వర్షాలు కురిసినప్పుడు నీరు కుంటకు ఉన్న తూముల వైపు రాకుండా ఆ గుంతల్లోనే ఉండి పోతుందని వాపోయా రు. అలా తూముల ద్వారా నీరు అందక పోతే దిగువన ఉన్న ఆయకట్టు పొలాలకు నీరు పారక పంటలు పండించుకోలేక పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుంటలో మట్టి తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు కోరారు. వీఆర్వో గురుస్వామిని వివరణ అడగ్గా కుంటలో మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. -
నిప్పుల వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై బానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నెల 12న నంద్యాల జిల్లాలో గరిష్టంగా 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం సంజామలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంజామల మండలంలో కావడం గమనార్హం. ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీలు, కోవెలకుంట్లలో 43.3, ఉయ్యలవాడలో 43.3, గూడూరులో 43, బనగానపల్లిలో 42.8, కర్నూలులో 42.8, కోడుమూరులో 42.7, గోస్పాడులో 42.7, నంద్యాల రూరల్లో 42.7, పాణ్యంలో 42.6, మంత్రాలయంలో 42.5, చాగలమర్రిలో 42.5, కొలిమిగుండ్లలో 42.4, రుద్రవరంలో 42.4, కొలిమిగుండ్లలో 42.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతోది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బతో వృద్ధుడు మృతి పగిడ్యాల: నెహ్రూనగర్లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కొంతలపాడు నాగన్న(70) ఆదివారం నీటి మునక పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతకు సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. స్థానిక ఆర్ఎంపీని ఇంటికి పిలిపించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా అప్పటికే మరణించాడన్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
ఎన్హెచ్ 40లో ‘క్యూఆర్ కోడ్’ సేవలు
● స్కాన్ చేస్తే పెట్రోల్ బంక్లు, పంక్చర్ షాపుల వివరాలు కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, ఇ–చార్జింగ్ స్టేషన్లు వంటి వసతులు ఎక్కడ ఉన్నాయి అనే ఆందోళన ప్రయాణికుల్లో సహజంగా ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గం 40వ నెంబర్ జాతీయ రహదారిలో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సౌకర్యార్థం వినూత్నంగా క్యూఆర్ కోడ్ సేవలు అమలులోకి వచ్చాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి కడప వరకు విస్తరించి ఉన్న 189 కిలోమీటర్ల మేర రహదారిలో క్యూఆర్ కోడ్ ఆధారిత సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులకు ఇకపై ఒక డిజిటల్ గైడ్లా మారనుంది. సోమవారం (13వ తేదీ) నుంచి 40వ జాతీయ రహదారిలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్టు హెడ్ వి.మదనమోహన్ విలేకరులకు తెలిపారు. ఒక్క స్కాన్తో అన్ని వివరాలు హైవే వెంట ప్రయాణించేటప్పుడు స్మార్ట్ బోర్డులను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయగానే మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ప్రధానంగా అత్యవసర సేవా కేంద్రాలు, జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబర్ 1033, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలు, సమీపంలోని పోలీస్స్టేషన్ నెంబర్లు ఇట్టే తెలిసిపోతాయి. 189 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ, బాధ్యతలు, కాలపరిమితి, టోల్ప్లాజాల మేనేజర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నెంబర్లు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, పంక్చర్ షాపులు, ఇ–చార్జింగ్ స్టేషన్ల లొకేషన్ల వివరాలు కూడా ఒక్క స్కాన్తో తెలుసుకోవచ్చు. -
శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలో టోల్గేట్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లే రహదారిపై ఉన్న నో ఎంట్రీ గేట్ రాడ్ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన 9 మంది శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కారులు బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో శ్రీశైలం టోల్గేట్ వద్దకు చేరుకున్నారు.గేట్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకునే క్రమంలో కారు అదుపుతప్పి వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న నో ఎంట్రీ చెక్ పోస్ట్ రాడ్ను బలంగా ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న మల్లమ్మ (50), మంజుల, జగదీష్, సాయి కార్తీక్ అనే నలుగురికి బలమైన కాయాలు కాగా ప్రవీణ్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని అంబులెన్స్లో వైద్యశాలకు తరలించగా మల్లమ్మ ప్రాణాలు వదిలింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్బాబు, దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు వైద్యశాలకు చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు -
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని వెలగటూరు రస్తాలో జుర్రేరు వాగుకు చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన బాలకృష్ణ(32) అదివారం చేపలు పట్టుకునేందుకు బైక్పై జుర్రేరు వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టుకునే తరుణంలో ప్రమాదవశాత్తు వాగు నీటి గుంతలో మునిగిపోయాడు. గుంత లోతుగా ఉండటంతో పాటు పూడిక పేరుకు పోవడంతో అందులో చిక్కుకుపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకోగా ఒడ్డున బైక్, చెప్పులు ఉండటంతో నీటిలో పడి పోయి ఉంటాడని భావించి ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వాగులో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వినతుల పరిష్కారానికి చర్యలు
నంద్యాల: ప్రజలు అందజేసిన వినతులను చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.... ● ఆస్తి తీసుకుని తమ యోగక్షేమాలు చూడటం లేద ని ఆత్మకూరులోని ఇందిరానగర్కు చెందిన యోహాన్, అంకమ్మ ఎస్పీ ఎదుట వాపోయారు. ● చేతబడులు చేసే ఆత్మకూరుకు చెందిన షేక్. నజురున్ భారీ మొత్తంలో బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోసం చేసిందని, మీరు స్పందించి న్యాయం చేయాలని ఓ మహిళ ఎస్పీకి విన్నవించారు. ● ట్రాక్టర్ ఇంజన్ను రిపేర్ కోసం ఆటోనగర్లో వీరేష్ అనే వ్యక్తికి ఇస్తే, అతను వేరే వాళ్లకు అమ్మివేసి కనిపించకుండపోయాడని గడివేముల మండలం కొరటమద్దికి చెందిన లక్మీరామిరెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
సాక్షి, నంద్యాల: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పరిష్కరించిన కొన్ని గ్రీవెన్సులు మళ్లీ రీఓపెన్ అవుతున్నాయని, అలాంటి వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. నేడు జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఇటీవల బేతంచెర్ల మండలంలోని కృష్ణాపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. కొన్ని శాఖల సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. విద్యుత్ సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేందుకు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కేసీ కాలువ, తెలుగు గంగ మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం -
సర్కారు బస్సు కదలనంటోంది!
ఊడుతున్న చక్రాలు..పనిచేయని స్టీరింగ్లు, పొలాలు, చెరువుల్లోకి దూసుకెళ్తున్న వాహనాలు కొన్ని..పొగలు కక్కుతున్నవి మరికొన్ని..కాలం చెల్లినవి ఇంకొన్ని వెరసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే ఏదో తెలియని భయం. ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనేవారు ఇప్పుడా పరిస్థితి లేదు. బస్సులు ఎక్కడ మొండికేసి మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. కూటమి సర్కారు కాలం చెల్లిన బస్సులు, పాతవాటికి ౖపైపెన మరమ్మతులు చేసి తిప్పుతుండటమే దీనికి ప్రధాన కారణం. సోమవారం కడప నుంచి కర్నూలుకు బయలు దేరిన కడప డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. ఇంజన్ బెల్ట్, బెరింగు పోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో ఈ బస్సులోని 60 మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. ముందుగానే టికెట్లు తీసుకొని ఉండటంతో చేసేది లేక కడప వైపు నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఎక్కి వెళ్లారు. మహిళలకు, దివ్యాంగులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు ముందుగా బస్సుల కండీషన్పై దృష్టిసారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – చాగలమర్రి -
వైభవోపేతం.. వసంతోత్సవం
ఆళ్లగడ్డ: మహా పుణ్యక్షేత్రం అహోబిలం సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం దేవాలయం ఎదురుగా ఆకర్షణీయంగా నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవంలో భాగంగా ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
సీమజోన్లో 25 మంది సీఐల బదిలీ
● ఉమ్మడి జిల్లాలో 15 మందికి స్థానచలనం ● వీఆర్లో ఉన్న ఇద్దరికి పోస్టింగులు బదిలీ అయిన సీఐలు కర్నూలు: రాయలసీమ జోన్ కర్నూలు, అనంతపురం రేంజ్ల పరిధిలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 25 మంది సీఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఇందులో ఒకరు సత్యసాయి, మరొకరు వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. అలాగే అనంతపురం రేంజ్లో వీఆర్లో ఉన్న ఒకరికి చెన్నూరు యూపీఎస్, కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న మరొకరిని మంత్రాలయం పీఎస్కు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న మరో ఇద్దరు అనంతపురం రేంజ్కి బదిలీ అయ్యారు. పేరు ప్రస్తుత సర్కిల్ బదిలీ అయిన సర్కిల్ జి.వి.నాగరాజరావు కర్నూలు టూటౌన్ ఆళ్లగడ్డ యూపీఎస్ ఎం.శ్రీధర్ ఫ్యాక్షన్ జోన్, కర్నూలు కర్నూలు టూటౌన్ ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ యూపీఎస్ కౌతాళం యూపీఎస్ ఎన్.అశోక్ కుమార్ కౌతాళం యూపీఎస్ నందికొట్కూరు వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైం సెల్, కర్నూలు డి.మస్తాన్ వలి సోషల్ మీడియా అండ్ సీసీఎస్–2, సైబర్ క్రైం సెల్, కర్నూలు కర్నూలు కె.శ్రీనివాస నాయక్ సీసీఎస్–2, కర్నూలు ఆస్పరి, కర్నూలు దస్తగిరి బాబు వీఆర్, కర్నూలు మంత్రాలయం పి.రామాంజులు మంత్రాలయం పులివెందుల ట్రాఫిక్ వి.సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ డీటీసీ, నంద్యాల డి.హాజీవలి డీటీసీ, నంద్యాల సీసీఎస్,వైఎస్సార్ కడప జి.మారుతి శంకర్ కొత్తచెరువు, సత్యసాయి జిల్లా కర్నూలు వన్టౌన్ ఎం.పార్థసారధి కర్నూలు వన్టౌన్ ఫ్యాక్షన్జోన్, కర్నూలు ఎ.గంగాధర్ వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం కె.ఉలసయ్య వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం -
నీడ, నీరు కరువే..
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే నెలలో ఎండలు, వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఈ సమయంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే 2–3 డిగ్రీలకు పైగా అధికంగా అంటే 43 డిగ్రీల వరకు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటికే నంద్యాల రూరల్, కౌతాళం, ఆళ్లగడ్డ, ఆలూరు, కర్నూలు, కల్లూరు, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల చివరిలోపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, మే నెలలో 45–47 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల బెడద తీవ్రతరమవుతున్నా ఉపాధి కూలీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘ఉపశమనం’ కాగితాల్లోనే! ● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సురక్షిత మంచి నీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశించింది. ● ప్రతి గంటకు నీటిని తాగే విధంగా వాటర్ బెల్ పద్ధతిని అమలు చేయాలి. ● గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే తాటాకు 8, ఈతాకు తదితరాలతో పని ప్రదేశంలో పందిళ్లు వేయాలి. ● ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్స సామాగ్రిని(ఫస్ట్ ఎయిడ్ బాక్స్) పని ప్రదేశంలో సిద్ధంగా ఉంచాలి. ● ఆరోగ్య శాఖ సహకారంతో పని ప్రదేశాల్లో ఏఎన్ఎం సేవలను ఉపయోగించుకోవాలి. ●ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ●ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి వెళ్లి 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలి. ● అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తిరిగి పని కొనసాగించాలి. ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు ● జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాలి. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 16శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. ● అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రతకు కారణమవుతోంది. ● ఈసారి ఎల్నినో ప్రభావం కూడా భయపెడుతోంది. మామూలుగా వేసవి మే నెల చివరితో ముగుస్తుంది. అయితే ఎల్నినో ప్రభావంతో సారి ఆగస్టు వరకు ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలా.. గత వైఎసార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో వేసవి ఉపశమన చర్యలు పక్కాగా అమలయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఎండల నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్ సరఫరా చేసింది. షేడ్స్ కింద నీళ్లు తాగి కొద్ది సేపు సేదతీరడం, భోజనం చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం విశేషం. ప్రస్తుతం ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 28వేలు, నంద్యాల జిల్లాలో 24వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. నిప్పుల కొలిమిని తలపించే ఎండల్లో పనులు చేస్తున్నప్పటికీ ఉపశమన చర్యలు లేకపోవడం గమనార్హం. ఉదయం 9 గంటలకే వడగాలుల తీవ్రత పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పటైన తర్వాత 2025లో ఉపాధి కూలీల కోసం షేడ్స్ సరఫరా చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎక్కడా పని ప్రదేశంలో నీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలే లేవు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల జాడే లేకుండాపోవడం గమనార్హం. ఉపాధి కూలీలకు నీడ సదుపాయం వెతికినా కనిపించదు. వాటర్బెల్ పాటించకపోవడం కూలీల ప్రాణం తీస్తోంది. -
శ్రీశైలం ఘాట్లో చిరుత కలకలం
శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలోని వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు. జొన్న కొనుగోలుకు మార్గదర్శకాల జారీ నంద్యాల(అర్బన్): రబీ 2025–26లో సాగు చేసిన జొన్న పంట కొనుగోళ్లకు మార్గదర్శకా లు జారీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అశ్వర్థ నారాయణ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనుగోళ్లు ఉంటాయని, హైబ్రీడ్ రకం క్వింటా రూ.3,699గా ధర నిర్ణయించడమైనదన్నారు. రైతులు తమ పంట విక్రయానికి ముందు తప్పని సరిగా ఈ క్రాప్ నమోదుతో పాటు ఈకేవైసీ పూర్తి చేసి సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. ఆన్లైన్ విధానంలో మాత్రమే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు. పెరిగిన ‘తర్తూరు’హుండీ ఆదాయం జూపాడుబంగ్లా: తర్తూరుజాతరను పురస్కరించుకుని శ్రీలక్ష్మీరంగనాథస్వామి, అమ్మవార్ల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. సోమవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఈఓ సాయికుమార్ అధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన బాలాజీ సేవా ట్రస్టు సభ్యులు నగదును లెక్కించగా రూ.16,11,871 ఉంది. గతేడాది రూ.11,21,770 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.4,90,101 అదనంగా వచ్చినట్లు ఈఓ తెలిపారు. కాగా కానుకల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు 21 మంది ఎంపిక నంద్యాల(న్యూటౌన్): ఎవరెస్ట్ బేస్ క్యాంపు శిక్షణకు మొత్తం 21మంది ఎంపికై నట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు తెలిపారు. ఎంపికై న వారిలో నంద్యాల జిల్లాకు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం వారిని అభినందించి డీఈఓ మాట్లాడారు. ఎవరెస్ట్ అధిరోహించేందుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చి ఈనెల 15వ తేదీన ఖాట్మండుకు పంపుతున్నట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో సహిత విద్య కో ఆర్డినేటర్ జగన్మోహన్రెడ్డి, ప్రసన్నకుమార్ ఉన్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లాలోని ఏడు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గడివేముల మండలం బిలకలగూడూరు–4, డోన్ మండలం కొచ్చెరువు–2, మహానంది మండలం మహానంది–2, వెలుగోడు మండలం గుంతకందాల–1, కొత్తపల్లి మండలం జానలగూడెం, అవుకు మండలం పిక్కిళ్ల పల్లి తండా, సంజామల మండలం సి.కానాలలో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నంద్యాలలోని ఆదర్శ నగర్, చాబోలు టెక్కె, రోజాకుంట–2, భీమవరం–1లలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన మహిళలు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు. గొర్రెలను తప్పించబోయి.. కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్దీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవారం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు వైపు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఎదురయ్యాయి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): సమగ్రశిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ స్టాస్టికల్ ఆఫీసర్, ప్రోగ్రాం ఆఫీసర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ), గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న వారు మాత్రమే అర్హులని, స్కూల్ అసిస్టెంట్లకు కనీసం 5 సంవత్సరాలు, సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు కనీసం 8 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 15 నుంచి 20లోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు. -
మోసకారి చంద్రబాబు
బేతంచెర్ల: అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన పొదుపు గ్రూపుల మహిళలు, తొలగించిన (వీఓఏ) బుక్ కీపర్లు మాజీ మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని వెలుగు ఏపీఎంలు తమని అన్యాయంగా తొలగిస్తున్నారని చెప్పారు. ఆలాగే బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుల సిఫారసుతో నియమితులైన వీఓఏల దగ్గరకు వెళ్లలేదని కారణంతో ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ బాధ్యతగా పనిచేస్తున్న బుక్ కీపర్లను తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ నాయకుల మాటలు విని వారి మెప్పు కోసం బుక్ కీపర్లను అక్రమంగా తొలగిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పొదుపు మహిళలు, వీఓఏలు ఐక్యంగా ఉండి అధికారులు నిబంధనలు పాటించకపోతే నిలదీయాలన్నారు. మీకు అండగా మేము ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలుకు నోచుకోలేదన్నారు. నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
నష్టపోతున్నాం
మేం 18 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.30 వేల వరకు పెట్టాం. కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2400 ఉంటే దళారీలు.. రూ.1500 ధరతో అడుగుతున్నారు. తెలంగాణలో అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్లలో పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాకు రూ.900 వరకు నష్టపోతున్నాం. ఇప్పటికై న చంద్రబాబు ప్రభుత్వం చొరువ తీసుకొని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – తిరుమలేశ్వరరెడ్డి, మొక్కజొన్న రైతు, రేమడూరు గ్రామం, కల్లూరు మండలం -
వసంతోత్సవాలకు అంకురార్పణ
ఆళ్లగడ్డ: లోక కల్యాణార్థం విశ్వశాంతిని కోరుతూ శ్రీ అహోబిలేశుడి వార్షిక వసంతోత్సవాలకు నాంది పలుకుతూ దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి అంకురార్పణ పూజలు చేపట్టారు. సోమవారం నుంచి వైభవంగా సాగే కృతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు మృత్సంగహణం, రక్షాబంధనంతో ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారంగా రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మత్స్యంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి ఉత్సవాలకు నాంది పలికారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామిని ఉభయ దేవురులతో యాగశాలలో కొలువుంచి తిరుమంజనం చేపట్టారు. కొత్తపల్లి: మండలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. కృష్ణాజలాల నుంచి ఆలయం బయటపడడంతో భక్తులు ప్రాచీన సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. దీంతోపాటు ప్రాచీన గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్మెంట్లలో తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. ఎవరెస్టు బేస్ క్యాంప్నకు ఎంపిక వెలుగోడు: పట్టణానికి చెందిన బండి స్వాతి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అవసరాలు ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థిని ఎవరెస్టు బేస్ క్యాంప్ సాహసయాత్రకు ఎంపికై ంది. ఈనెల 14 నుంచి 30 వరకు రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ అధికారుల పర్యవేక్షణలో ఈ సాహస యాత్ర జరగనుంది. ఈ యాత్రలో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొననుండగా, అందులో తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ ఎం.నళిని తెలిపారు. ఈ సందర్భంలో కళాశాల అధ్యాపక బృందం బండి స్వాతికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. -
పద్మావతి ఏజెన్సీపై కార్మికుల ఆగ్రహం
● రెండు నెలలుగా వేతనాలు అందక అవస్థలు ● శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనం వద్ద కార్మికుల నిరసనశ్రీశైలంటెంపుల్: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్కీపింగ్కార్మికులు ఆదివారం ఉదయం దేవస్థాన పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికులపై పద్మావతి ఏజెన్సీ చిన్నచూపు చూస్తోంది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. కిరాణ కొట్టులో కూడా నిత్యావసర సరుకులు అప్పు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే మా జీవనం ఎలా గడుస్తుందని కార్మికులు గగ్గోలు పెట్టారు. వేతనాల గురించి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులను అడిగితే దేవస్థాన ఈఓ బిల్లులు చేయడం లేదని సమాధానం చెబుతున్నట్లు కార్మికులు తెలిపారు. అంతేకాకుండా ‘మీకు ఇష్టం వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లి చెప్పుకోండి ఏమి చేయలేరు.. మీరు ఫిర్యాదు చేసే నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాం’ అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. 10 మంది చేసే పని దగ్గర నలుగురితో చేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా కార్మికుల ఖాతాలో వేతనాలు ఎక్కువ వేసి తిరిగి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులు వెనక్కి ఇప్పించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికై న శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్పందించి కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు పేర్కొన్నారు. -
తెలుగు తమ్ముడి జల దోపిడీ
● ఉచిత మినరల్వాటర్ ప్లాంట్ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు తెలుగు తమ్ముళ్లు దోపిడీకి శ్రీకారం చుట్టారు. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెకు చెందిన ఓ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచిత మినరల్ వాటర్ప్లాంట్ నీటిని అమ్ముకుంటూ జలదోపిడికి పాల్పడుతున్నాడు. గ్రామంతోపాటు కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆర్టీసీ బస్టాప్ సమీపంలో ఉచిత మినరల్ వాటర్ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లు, వాటర్మెన్కు వేతనం, తదితర నిర్వహణ ఖర్చులకు సంబంధించి ఏడాదికి రూ.1.50 లక్షలకు పైగా గ్రామ కమిటీ (రైతు సంఘం) భరిస్తూ ఈ ప్లాంట్ను నిర్వహిస్తోంది. గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త, టీడీపీ నేత గత 20 నెలల నుంచి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న విషయం ఇటీవల బయటపడింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్లాంట్ నుంచి ప్రతి రోజు క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సదరు టీడీపీ నేత నెలకు రూ. 1,500 చొప్పున పాఠశాల యాజమాన్యం నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరవై నెలల నుంచి ప్రతి నెలా ఫోన్పే ద్వారా డబ్బులు ఆయన ఖాతాకు జమ అయినట్లు ఫోన్పే లావాదేవీలు లీక్ కావడంతో టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక స్కూల్ యాజమాన్యం నుంచే డబ్బులు వసూలు చేస్తు న్నాడా.. ఇతర వ్యక్తుల వద్ద నుంచి కూడా నీటిని పట్టుకున్నందుకు డబ్బులు తీసుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ప్లాంట్ ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయగా టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేత జలదోపిడీకి తెరలేపి నీటిని అమ్ముకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉచిత ప్లాంట్ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత తీరును పలువురు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. -
పూలే సేవలు స్ఫూర్తిదాయకం
సాక్షి, నంద్యాల: సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారి తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన సాధనమని పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సీ్త్ర విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఎదురు చూస్తున్నాం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 12వ వేతన సవరణ కమిషన్ వేయడంతో పాటు మధ్యంతర భృతి ఇవ్వాలనేది ప్రదానమైన డిమాండ్. దీనికోసమే ఎదురు చూస్తున్నాం. పెండింగ్లో ఉన్న డీఏలతో పాటు నాలుగు విడతల సరండర్ లీవ్లు, డీఏ, పీఆర్సీ అరియర్స్ కూడా చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రధానమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. – వి.జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్, కర్నూలు -
ఎక్కడి బిల్లులు అక్కడే!
చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,200 ఇప్పటికి పెండింగ్లో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.1,800 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.1,400 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. రెండేళ్లలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు రూ.220 కోట్ల వరకే. ఉద్యోగుల ఆర్థిక బకాయిలకు సంబంధించి ట్రెజరీ నుంచి వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం ఎపుడో అనేది ప్రశ్నార్థకం అయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వెతలు అన్ని ఇన్నీ కావు. 2024 జూన్లో పదవీ విరమణ చేసిన వారికి 10 నెలల సెలవు వేతనం, గ్రాడ్యుటీ, కమిటేషన్ తదితర ఆర్థిక బెనిఫిట్స్ వందలాది మందికి ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో పెట్టినప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు రొడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. -
ప్రైవేటు సైన్యంతో మంత్రి బీసీ వసూళ్ల దందా
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె: ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి వసూళ్ల దందా నడుపుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఆయన స్వగృహం వద్ద శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి బీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత లోపం ఉన్నాయంటూ కాంట్రాక్టర్లను తన వద్దకు రప్పించుకుని కమీషన్ల వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సమా ధానం చెప్పాలన్నారు. మంత్రి బీసీ బనగానపల్లెలో చుట్టూ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక టిప్పర్ నుంచి రూ. 300, గ్రావెల్ టిప్పర్ నుంచి రూ.1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బెల్టుషాపులు, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. వ్యాపారులను భయపెట్టి రూ.కోట్లు వసూలు కేసీవీఆర్ ప్రాజెక్టు యజమాని జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి బీసీ అక్రమ కేసులు పెట్టించి, ఆయన ద్వారా రూ.30 కోట్లు అక్రమంగా వసూళ్లు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వ్యాపారి నూకల విజయుడు ఇంటికి మూడు రోజుల పాటు విద్యుత్ ను తొలగింపజేసి ఆయనతో పాటు సోదరుడు నూకల సుబ్బయ్య, వారి బావ ద్వారా రూ.3 కోట్లు, బనగానపల్లె పట్టణంలో ఫంక్షన్హాల్ యజమాని వేణుగోపాల్ వద్ద నుంచి రూ.1.5 కోట్లు, డాక్టర్ మహమ్మద్హుస్సేన్, శ్రీనివాసరెడ్డిని బెదిరించి అక్రమంగా వసూలు చేశారన్నారు. పొగాకు కొనుగోలుదారుల నుంచి మంత్రి అనుచరులు బేలుకు రూ.2 వేలు వసూలు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్సార్బీసీకి చెందిన మిగులు స్థలాల్లో ఇంటి స్థలాల పంపిణీ చేయబోగా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్న బీసీ ఇప్పుడు అదే స్థలంలో స్థలాల పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ప్రచారంలో బనగానపల్లె పట్టణంలో ప్రచారంలో భూమిని కొనుగోలు చేసి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్న మంత్రి బీసీ ఇప్పుడు ఎస్సార్బీసీ స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమికి మంత్రి ఎసరు పెట్టారని విమర్శించారు.పంటలను ఎలా కాపాడుకోవాలి జిల్లాలో ఎస్సార్బీసీకి నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేక పోతున్నారని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్కు వరద వచ్చిన సమయంలోనే గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపి ఉంటే ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడేది కాదన్నారు. ఇటీవల నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పగా, ఆ సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్రెడ్డి నీటి సమస్య ఉండదని చెప్పారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గతేడాది అవుకు రిజర్వాయర్ లీకేజీ ఏర్పడితే చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రమవుతుందని జెడ్పీ చైర్మన్ అన్నారు. -
మహానందిలో వీకెండ్ సందడి
మహానంది: మహానంది క్షేత్రం శనివారం భక్తులతో కళకళలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోనేర్లలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఉచిత, శీఘ్ర, మహదాశీర్వాచనం, అభిషేకం ,అర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆది, సోమవారాల్లో నిరంతర దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు. శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లో సాంకేతిక సమస్య శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం ఉదయం శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లో టికెట్ల బుకింగ్కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల మల్లన్న ఆర్జిత సేవా టిక్కెట్లు, స్పర్శ దర్శనం టిక్కెట్లు బుకింగ్ చేసినా డౌన్ లోడ్ కాకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. బుకింగ్ హిస్టరీలో వివరాలు చూపించకపోవడం గందరగోళానికి తావిచ్చింది. వారాంతపు రోజు కావడంతో ఆన్లైన్లో టికెట్ల బుకింగ్కు భక్తులు అవస్థలు పడ్డారు. ఈ సమస్య మూడు గంటల పాటు ఇబ్బందులు పెట్టినట్టు భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై దేవస్థానం అధికారులను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లా పరిధిలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టులలోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 101 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు అభ్యర్థినులు తప్పని సరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 2025 జూలై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలని, తప్పని సరిగా వివాహితురాలై స్థానిక నివాసం ఉండాలన్నారు. ఆయా పోస్టుకు అభ్యర్థి పదవ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఒక వేళ పదవ తరగతి వారు ఎవరూ లేకపోతే ఎక్కువ చదువు చదివిన వారు అర్హులుగా ఉంటారన్నారు. ధ్రువీకరణ పత్రాలతో స్థానిక సీడీపీఓ కార్యాలయంలో ఈనెల 14 నుంచి 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. సూర్యుడి ప్ర‘తాపం’ ● గోస్పాడులో 42.8, మంత్రాలయంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కర్నూలు (అగ్రికల్చర్): సూర్యుడి ప్రతాపానికి కర్నూలు, నంద్యాల జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి.పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంత్రాలయంలో 42.7, ఆళ్లగడ్డలో 42.6, దొర్నిపాడులో 42.3, కౌతాళంలో 42.2, నంద్యాల రూరల్లో 42.1, చాగలమర్రిలో 42 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ మధ్యాహ్నం సమయంలో సాధారణంగా 30 శాతం ఉండాలి. అయితే 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ దక్షిణ మాడ వీధులలోని నిత్య కళావేదికపై హైదరాబాద్కు చెందిన గురు నృత్యాలయ కూచిపూడి డాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివపంచాక్షరి స్తోత్రం, చిదంబరస్తోత్రం, జతిస్వరం, నమశ్శివాయతే తదితర గీతాలకు హిమశ్రీ, హిమవర్షిణి, సహస్ర, ధాత్రి, మయూఖ, శ్రీశ్రేష్ఠ, వైష్ణవి, అభిజ్ఞ తదితరులు నృత్యప్రదర్శన చేశారు. -
వరి రైతులకు ‘మద్దతు’ కరువు
ఆరబోసిన ధాన్యంపాణ్యం: రబీలో వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి ?2,389గా నిర్ణయించింది. రైతులకు 75 కేజీల బస్తాకు రూ. 1,776 నుంచి రూ. 1,791 వరకు లభించాలి. అయితే మార్కెట్లో రూ.1,600 కూడా అందడం లేదు. మద్దతు ధర కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టమే మిగిలింది! ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రబీ సీజన్లో వరి సాగు చేశారు. విత్తనం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను కష్టాలు వెంటాడాయి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వకపోవడంతో దొరికిన చోట రూ.500 వెచ్చించి బస్తా చొప్పున తీసుకున్నారు. అధిక ధరతో యురియాను కొనుగోలు చేసి పంటను కాపాడుకున్నారు. ఎకరానికి రూ. 30వేలకు పైగానే ఖర్చు రాగా దిగుబడి మాత్రం 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వచ్చింది. పంట వచ్చిన వారం రోజులు మాత్రమే బస్తా రూ. 1900 వరకు పలికింది. ఇరవై రోజుల నుంచి రూ.1600తో కూడా కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు కష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నిర్మిస్తే.. టీడీపీ పేరు మార్చుకుంటోంది!
● స్వర్ణ గ్రామాలుగా గ్రామ సచివాలయాలు చిప్పగిరి: పేర్లు మార్చవచ్చు కానీ, కట్టిన భవనాలను మార్చలేరనే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామా ల్లోనే లక్షలాది రూపాయలు వెచ్చించి సచివాలయ వ్యవస్థకు కొత్త రూపు తీసుకొచ్చింది. మండల కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగులను నియమించి సేవలు ఇంటి తలుపు తట్టేలా పాలన సాగించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలనలో కొత్తదనం చూపడం పక్కనపెడితే.. క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయాలకు పేరు మార్పుతో ప్రజల్లో నవ్వుల పాలయ్యేందుకు సిద్ధమైంది. స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు గ్రామ సచివాలయాల పేర్లు మార్చే దిశగా చర్యలు చేపట్టడం విమర్శలకు తా విస్తోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టి పేర్లు మార్చుకుంటే బాగుంటుంది కానీ, ఎవరో కట్టించిన నిర్మాణాలకు వీళ్లు పేర్లు మార్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం
గత ఏడాది వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, పైప్లైన్లు తదితర నీటి సమస్యలను తీర్చేందుకు రూ.2 కోట్లను రిజర్వులో ఉంచుకున్నాం. అప్పట్లో రిజర్వులో ఉంచుకున్న మొత్తంతోనే జెడ్పీటీసీల ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.కోట్లలో ఉన్న స్టాంప్ డ్యూటీ లక్షలకు పడిపోయింది. జెడ్పీకి సొంత ఆదాయ వనరులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడం చాలా బాధాకరం. – యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్థానిక సంస్థలకు నిధులు విడుదలయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీని జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – పోచా జగదీశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, జూపాడుబంగ్లా -
అరటి రైతుల ఆక్రందన
తుగ్గలి : ఏ పంట సాగు చేసినా రైతును కుదిపేస్తున్నాయి. లాభాలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడు. ఈ క్రమంలో అరటి రైతు కూడా చేరాడు. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు దెబ్బతీస్తుంటే.. మరో వైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ధరలు పాతాళానికి పడి పోయి అరటి రైతుకు శాపమైంది. పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం 150 ఎకరాల్లో అరటి పంట సాగైంది. పంట సాగు కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అడిగే వారు లేక, మార్కెటింగ్ సౌకర్యం లేక తోటల్లోనే అరటిని వదిలేసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు టన్ను రూ.20 వేలకు పైగానే ధర ఉంది. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కోతకు వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు. కొనుగోళ్లకు ముందుకురాని వ్యాపారులు.. అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని పరస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు. -
కేంద్ర బృందం ఉపాధి పనుల పరిశీలన
నంద్యాల(అర్బన్): చాబోలు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను సెంట్రల్ మానిటరింగ్ టీం సభ్యులు పరిశీలించారు. టీం లీడర్ అజయ్కుమార్ సాహు, రూబల్ కుమార్లు ఎస్ఏ జీవై, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్, పీఆర్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, ఎన్ఆర్ఎల్ఎం పెన్షన్స్ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన కూలీలందరికీ పను లు కల్పించాలని, పనులు, కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట పీఆర్ డీఈ మోహన్రావు, ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఎంపీడీఓ శివనాగజ్యోతి, ఏపీడీ సాంబశివరావు, కోర్స్ డైరెక్టర్లు ఏసుదాసు, పరమేష్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఏఈఓ గనేష్, ఈసీ మగ్బుల్, వెలుగు ఏపీఎం రామశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి ఎత్తిపోతల నిలిపివేత జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. కేసీ కాల్వకు మూడు మాసాల క్రితమే సుంకేసుల డ్యాం నుంచి నీటిసరఫరా నిలిచిపోగా, రైతుల ఆందోళనల నేపథ్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా వారం క్రితం వరకు నీటిని విడుదల చేశారు. 2025–26 ఏడాదికి గాను కేసీ కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. 2026–27 ఏడాదికి గాను వర్షాలు సంవృద్ధిగా కురిస్తే జూలై, ఆగస్టు మాసంలో కేసీ కాల్వకు సాగునీటిని సరఫరా చేసే అవకాశాలున్నాయి. కాగా తాగునీటి అవసరాల నిమిత్తం కేసీ కాల్వకు సుంకేసుల డ్యాం నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో పాటు ముచ్చుమర్రి వద్ద నిల్వ చేసిన 200 క్యూసెక్కుల నీటిని పశువులు, జీవాలు, తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నేడు మూడు మండలాలకు ఎల్లో అలర్ట్ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. ఈ నెల 11న నంద్యాల జిల్లాలోని పలు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం వెలుగోడులో 44.5, ఆత్మకూరులో 44.8, కొత్తపల్లిలో 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బనగానపల్లిలో 42.3, నంద్యాల రూరల్ లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 41.9, చాగలమర్రిలో 41.9, సంజామలలో 41.8, రుద్రవరంలో 41.7, కర్నూలులో 41.4, గడివేములలో 41.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నెల్లూరు ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి రానున్నారు. గతంలో ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన ప్రమోద్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్కు విత్తనాల కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు విత్తనాలు కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాల కోసం పంపించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టి అరకొరగా కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 12,674 క్వింటాళ్లు, రబీ సీజన్కు 9480 క్వింటాళ్లు కేటాయించింది. వేరుశనగ కర్నూలు జిల్లాకు 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2136 క్వింటాళ్లు, కొర్ర కర్నూలు జిల్లాకు 76 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 27 క్వింటాళ్లు, మినుములు నంద్యాల జిల్లాకు 40 క్వింటాళ్లు చొప్పున కేటాయించింది. కర్నూలు జిల్లాలో కూడా మినుము సాగవుతున్నప్పటికీ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పచ్చ రొట్ట ఎరువుల విత్తనాలైన దయంచ కర్నూలు జిల్లాకు 1,681 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 5,685 క్వింటాళ్లు, సన్హెంప్ విత్తనాలు కర్నూలు జిల్లాకు 4 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 76 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు కర్నూలు జిల్లాకు 190 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 1516 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్నంద్యాల: నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. మహిళల భద్రత, సైబర్ క్రైం, శాంతిభద్రతల పరిరక్షణ, హత్యలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించాల న్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ వారి సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు భద్రతకు పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల దర్యాప్తు, పరిష్కారం, ప్రాపర్టీ నేరాలలో ముద్దాయిల అరెస్ట్, బందోబస్తు విధులు మొదలగు వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, డీఎస్పీ రామంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
జీడీపీకి ఎల్లెల్సీ నీరు
గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువ నీటిని అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లోకి మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్కు చేరిన నీటిని 50 క్యూసెక్కుల నీరు ఎస్కేప్ చానల్ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్కు మళ్లించారు. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎల్లెల్సీ ద్వారా నీటి ని జీడీపీలోకి మళ్లించినట్లు ఏఈ మహమ్మద్ అలీ శుక్రవారం తెలిపారు. అలాగే జీడీపీ కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. -
బినామీ పేర్ల నమోదును అరికట్టండి
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: ప్రభుత్వ భూముల్లో బినామీ పేర్ల ప్రక్రియను తక్షణమే అరికట్టాలని, నిజమైన రైతులకు మాత్రమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ విద్యాసాగర్ను కలిసి భూముల అన్యాక్రాంతమవుతున్న అంశంపై సమగ్రంగా చర్చిరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మండలంలోని చింతలపల్లె, గుట్టపాడు, ఓర్వకల్లు గ్రామాల్లో భూములు బినామీ పేర్లమీద నమోదవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014– 2019 వరకు భూములను సాగు చేసుకున్న రైతులు, అప్పట్లో అర్జీలు సమర్పించిన వారు, కోర్టులను ఆశ్రయించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన రైతులను గుర్తించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించి వాస్తవంగా భూములను సాగు చేసుకున్న రైతులకు మాత్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఓర్వకల్లు గ్రామ రెవెన్యూ పరిధిలో 440–488 సర్వే నంబర్లలో సుమారు 48 సర్వే నంబర్లలో బినామీ పేర్ల మీదుగా ఎంట్రీలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదే విధంగా చింతలపల్లె గ్రామంలో కూడా బినామీ వ్యక్తుల పేర్లు నమోదు జరుగుతోందన్నారు. ఇప్పటికై న బినామీ పేర్లమీద నమోదు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా, నిజమైన లబ్దిదారులకు మాత్రమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బినామీల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాటసాని వెంట జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, చేట్ల అనిల్కుమార్, బి.ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యా లు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యకు, చెల్లెలుకు తేడా తెలియని వ్యక్తి రాధాకృష్ణ అని, చేతిలో పేపరు, టీవీ చానల్ ఉంది కదా అని ఏది చెబితే అది రాసి, ఏమంటే అది మాట్లాడి వైఎస్సార్సీపీపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపీడీకి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అందరి నోట్లో మావిగన్ చర్చ జరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు పిచ్చి ప్రేలాపన మాటాలు మాట్లాడుతున్నారన్నారు. తాము ఎర్రనాయుడు గురించి మాట్లాడవచ్చు అయితే తమకు సంస్కారం ఉందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, వెంటనే రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. -
అప్పుడు రూ. 20 వేలు.. ఇప్పుడు రూ. 4 వేలే
నేను రూ.50వేలు కౌలుతో 4 ఎకరాలు తీసుకుని అరటి పంట సాగు చేశా. రూ.10 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. పంట బాగానే పండినా ధరల్లేవు. యుద్ధంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను రూ.20 వేలకు పైగా ధరలు యుద్ధం కారణంగా ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. పంట కోనుగోలుకు వ్యాపారులు ఎవరూ రాక దిక్కుతోచడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఆకుల శ్రీనివాసులు, కౌలు రైతు, తుగ్గలి -
బాలికపై అత్యాచారయత్నం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రోడ్డులో యనకండ్ల వాగు వంతెన వద్ద ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన గౌండ పని చేసే రవితేజ నంద్యాల రోడ్డులోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్న స్విమ్మింగ్పూల్ వద్దకు సరదాగా ఈతకు వెళ్లాడు. సమీపంలోని రౌండ్ల వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతు రు, ఎనిమిదేళ్ల కుమారుడిని వెంట తీసుకుని పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడంతో వారు నడుచుకుంటూ బయల్దేరారు. అయితే స్విమ్మింగ్పూల్ నుంచి ఇంటికి బయల్దేరిన రవితేజ మార్గమధ్యలో బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక వెంట ఉన్న తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. ఈ మేర కు గాయపడిన బాలికను స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్పన తెలిపారు. యువకుడికి దేహశుద్ధి పోలీసులకు అప్పగింత -
పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
● ఇంటి స్థలం తమదే అంటూ బెదిరింపు ● కన్నీటి పర్యంతమైన శివమ్మబాయి నందికొట్కూరు: టీడీపీ నాయకులు దౌర్జన్యం శ్రుతిమించి పోయింది. స్థలాలను కబ్జా చేసేందుకు పేదలను బెదిరిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతో శుక్రవారం జంగంపాడు గ్రామంలో శివమ్మ బాయి కన్నీటి పర్యంతమవుతూ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తమకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఈ స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పూరి గుడిసె వేశారని తెలిపారు. ఈ స్థలం కోసం ఇద్దరు గొడవపడి గ్రీవెన్స్కు వెళ్లారని, అధికారులు పరిశీలించి పూలు నాయక్పై ఈ స్థలం ఉందని తేచ్చి చెప్పారన్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇంటి స్థలాన్ని రద్దు చేయాలని అధికారులతో నోటీసు పంపారన్నారు. తన భర్త పూలునాయక్ పక్షవాతం రోగంతో మంచానికే పరిమితమయ్యారని, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
చెత్త పలుకుల రాధాకృష్ణను అరెస్టు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిఆత్మకూరు: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన కార్యకర్తలతో కలిసి రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ మాట్లాడడం సరికాదన్నారు. ఆయనకూ భార్యాపిల్లలు ఉన్నారని, మహిళల విషయంలో సభ్యసమాజం తలదించుకు నేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జర్నలిస్టులుగా నైతిక విలువలను కాపాడాల్సిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన మహిళలపై దురుసుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, చానళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పాలనలో లబ్ధి పొందేందుకు రోత పలుకులు పలికారని విమర్శించారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అంతకుముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేశం తిరుపంరెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల పార్టీ అధ్యక్షులు సయ్యద్మీర్, రాజమోహన్రెడ్డి, అంబాల ప్రభాకర్రెడ్డితో పాటు ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా శివరామచంద్రరావు
కర్నూలు: కర్నూలు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా న్యాయవాది ఎం.శివరామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం ఉదయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక స్తోమతలేని నిందితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవల్లో భాగంగా క్రిమినల్ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తారు. గడచిన రెండు సంవత్పరాల నుంచి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా పనిచేసి పలు కేసుల్లో తన వాదనలు వినిపించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టువారు ఇచ్చిన నోటిఫికేషన్లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ధరఖాస్తు చేసుకోవడంతో శివరామచంద్రరావును ఎంపిక చేసి నియమించారు. -
త్వరగా భూ రీసర్వే పూర్తి చేయండి
శిరివెళ్ల: భూ రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని జేసీ కొల్లాబత్తుల కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక 3వ సేవా కేంద్రం ( సచివాయంను) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. భూ రీసర్వేపై ఆరా తీయగా మండల కేంద్రంలో 11,559 మంది రైతులకు సంభంధించి భూముల సర్వే తుదిశకు చేరుకుందని ఇంకా 2,390 రైతు ఖాతాలకు చెందిన భూములను సర్వే చేయాల్సి ఉందని వీర్ఓ ప్రసాదు వివరించారు. వారం లోగా సర్వే పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. ఇతర కేంద్రాలకు పంపుతున్నారన్న ఫిర్యాదు వస్తున్నాయని జేసీ అన్నారు. ఫిర్యాదులు కాకుండా చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చౌక దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తన కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పీఎల్ వరలక్ష్మి సూచించారు. శుక్రవారం కల్లూరు మండల పరిధిలోని వివిధ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు పరిధిలోని ఏపీ సీడ్స్ గోదాముల్లో వివిధ విత్తనాల ప్రాసెసింగ్ను గమనించారు. విత్తనాల నాణ్యతను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మహాలక్ష్మి జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాల్లో హెచ్టీ పరీక్షలు నిర్వహించారు. అగ్రో లైఫ్లో ప్రైవేటు లిమిటెడ్ పురుగు మందుల గోదామును తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏఓ విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
నంద్యాల(అర్బన్): సరదాగా ఈతకు వెళ్లి చెక్ డ్యాంలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని పొ న్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షేక్ మోదిన్కుమారుడు షేక్ సోహేల్ గురువారం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న కేసీ కెనాల్ చెక్డ్యాంలో ఈతకు వెళ్లాడు. లోతు గమనించని సోహేల్ డ్యాంలో దూకడంతో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరని కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం సోహేల్ శవమై తేలాడు. ఈ మేరకు మృతుడి తల్లి షేక్ షబానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఉత్తమమైనది హోమియో వైద్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దికర్నూలు: హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కబర్ది మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించడానికి ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి మాట్లాడుతూ..చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు మహదేవ్రావ్, డాక్టర్ పీవీ హరినాథ్, కర్నూలు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ చంద్రుడు, వైద్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తీర్చేదెట్లా
నేను తువ్వదొడ్డి గ్రామం వద్ద 8 ఎకరాలు ఏడాదికి రూ.1.76 లక్షల చొప్పున కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశా. తొలి ఏడాది రూ.22 లక్షలు, రెండో ఏడాది రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. తొలి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం జరిగింది. లక్షన్నర మాత్రమే చేతికొచ్చింది. ఇప్పుడు కొనేనాథుడే లేడు. కోత కూలీల ఖర్చులు కూడా రావని పంటంతా వదిలేశా. సాగుకు అయిన రూ.30 లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం. – ఆర్ సుంకన్న, కౌలు రైతు, రామకొండ -
త్వరలో నూతన అదనపు కోర్టులు ఏర్పాటు
నంద్యాల(వ్యవసాయం): నంద్యాలలో నాలుగు నూతన అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది తెలిపారు. శుక్రవారం కోర్టు కాంప్లెక్స్లోని నాలుగు కోర్టులకు సంబంధించిన గదులను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోర్టు కాంప్లెక్స్లో తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టులకు అవసరమైన వసతులు అన్ని ఉన్నాయన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు రూ.21 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈనెల 18, 19 తేదీలలో నంద్యాలలో నాలుగు కోర్టులు, నందికొట్కూరులో ఒక కోర్టు, కర్నూలులో రెండు కోర్టులను హైకోర్టు జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి హైకోర్టు అనుమతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, రెండవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కర్రి లక్ష్మి, ఆర్డీవో విశ్వనాఽథ్, తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, జయకృష్ణ, శివశంకర్ రెడ్డి, ఏపీపీ రాజేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి, గౌరీ శంకర్ తదితర కోర్టు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
మారని చేనే‘తల రాత’
కర్నూలు(అగ్రికల్చర్): నష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం లేదు. ఘన కీర్తిని సొంత చేసుకున్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కో పరం చేయడానికి చర్యలు చేపట్టింది. దీంతో తమ తల రాతలు మారబోవని చేనేత కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఏర్పాటు అయ్యింది. ఈ సంఘాన్ని మురార్జీదేశాయ్ స్వయంగా వచ్చి పరిశీలించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం వ్యవస్థాపకుడు మాచాని సోమప్ప నాటి జవహర్లాల్ నెహ్రూతో గుంతకల్లులో సమావేశమై చేనేత వస్త్రాల ఉత్పత్తి, విశిష్టతను వివరించారు. ఈ సొసైటీకి ఇంటర్నేషనల్ అవార్డుతో పాటు పలు నగదు పురస్కారాలు కూడా దక్కాయి. ఎంతో ఘనకీర్తిని గడించిన ఎమ్మిగనూరు చేనేత సహకర సంఘం ఒకప్పుడు 2000 మంది సభ్యు లతో ఏటా కోట్ల రూపాయల టర్నోవర్తో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం రూ. 6 కోట్లు నష్టాల్లో ఉంది. ఆర్థిక వెసులుబాటు ఇవ్వకుండా.. నష్టాల్లో ఉన్న సంఘాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మొదటి దశలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం షో రూముల్లో ఆప్కో ఉత్పత్తులు ఉంచి విక్రయించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సంఘాన్ని ఆప్కో పరం చేసే కుట్రదాగి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండేళ్లలో ఆప్కో తమ షోరూములకు కొత్త సరుకు అనేదే పంపిన దాఖలాలు లేవు. లేని అప్కో ఉత్పత్తులను ఎమ్మిగనూరు సంఘం షోరూముల్లో ఉంచి విక్రయిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నష్టాల్లో ఉన్న సంఘానికి ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు మాత్రం లేవు. ఆధిపత్య పోరు సంఘంలో 59 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతభత్యాలకే రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపితే సంఘానికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 59 మందిలో 18 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. పాలకవర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం రిటైర్డ్ అయిన వారిని కూడా కొనసాగిస్తుండటంతో సంఘంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రిటైర్డ్ అయిన వా రిని కొనసాగించడం అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పాలక వర్గాలు, సంఘం సెక్రటరీల మధ్య ఆధిపత్య పోరు కూడా సంఘం నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమవుతోందనే విమర్శలు ఉన్నాయి. తగ్గిపోయిన ఉత్పత్తులు ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు 2000 మంది సభ్యులతో కళకళలాడిన సంఘంలో నేడు 500 మంది కూడా సభ్యులు లేరు. ఇందులో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నది 200 మంది వరకే. ఇందువల్ల ఉత్పత్తులు పడిపోయాయి. ఆధునిక యుగంలో కొత్త కొత్త డిజైన్లతో రాణించాల్సి ఉండగా... నేటికి సంప్రదాయ వస్త్రాలైన దోవతులు, పంచలు, టువాళ్లు, దోమతెరలకే పరిమితం అయ్యింది. నాగరికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో సంప్రదాయ వస్త్రాలకు ఆదరణ తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసింది. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆధునాతన పరికరాలను సరఫరా చేసింది. ప్రత్యేకంగా డిజైనర్లను కూడా నియమించింది. ఫలితంగా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తులు పెరిగాయి. సంఘానికి వివిధ రూపాల్లో ఏడాదికి రూ.60 లక్షల వరకు ఆర్థిక చేయూత దక్కింది. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం ఐదేళ్లు అందించింది. రూ.6 కోట్ల నష్టాలు! ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నష్టాల్లో కూరుకపోయింది. 2024–25 ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ సంఘానికి ఉన్న నష్టాలు రూ.6 కోట్లు. 2025–26 సంవత్సరంలో ఆడిట్ చేస్తే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 16 అవుట్లెట్స్ (షోరూములు) ఉన్నాయి. ఒక షోరూం ద్వారా రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ. 2500 మాత్రమే. 16 షోరూములలో రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ.40 వేలు మాత్రమే. అంటే నెలకు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరగుతోంది. గణనీయంగా పడిపోయిన చేనేత వస్త్రాల ఉత్పత్తి చేనేత కార్మికులను ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కో పరం చేసేందుకు అడుగులు తొలి దశలో ఆప్కో ఉత్పత్తుల అమ్మకాలు మలి దశలో విలీనం చేసేందుకు కసరత్తు -
సమస్యలపై ఉపాధ్యాయుల నిరసన గళం
● మూల్యాంకన కేంద్రం ఎదుట ఆందోళననంద్యాల(న్యూటౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరడతామని నంద్యాల జిల్లా ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జనరల్ సెక్రటరీలు దస్తగిరిబాషా, వరప్రసాద్, కార్యవర్గ సభ్యుడు నగరి శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పట్టణ సమీపంలో ఉన్న ఎస్డీఆర్ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 30 శాతం ఐఆర్ ప్రకటన ఇవ్వాలన్నారు. దీర్ఘకాలిక బకాయిల చెల్లించడంతోపాటు నాలుగు పెండింగ్ డీఏల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఏకీకృత రూల్స్ సమస్యల పరిష్కరించాలన్నారు. బోధనేతర కార్యక్రమాల రద్దు చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కమ్యూటేషన్, లీవ్ఎన్వెస్మెంట్ ఆలస్యం లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఈఓల బదిలీలు, ఎంఈఓ, హెచ్ఎంల పరస్పర బదిలీలు చేపట్టాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు, ఎయిడెడ్, యాజమాన్యాల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగబోదని వెల్లడించారు. ప్రతి పాఠశాలలో నాన్టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలని కోరారు. నాయకులు రవికుమార్, స్వామిశంకర్, సుబ్బన్న, లక్ష్మణ్నాయక్, అజాంబేగ్, వరప్రసాద్ పాల్గొన్నారు. -
బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి
కర్నూలు: బాలలకు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలలు, న్యాయచట్టంపై గురువారం అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల నేరస్తుల్లో నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. బాల నేరస్తులను సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పిలుపునిచ్చారు. జువైనెల్ జస్టిస్ యాక్ట్ గురించి చైర్మన్ కమ్ ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ టి.అపర్ణ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవల కోసం శాశ్విత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకటహరినాథ్ పలు రంగాలకు సంబంధించి ఎలాంటి సేవల్లో లోపం కాని, నష్టం కాని, అన్యాయం కాని జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్లో వినతిపత్రంతో పాటు తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా తక్కువ సమయంలో న్యాయం చేస్తామని తెలిపారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు మాట్లాడుతూ పిల్లల కేసుల పట్ల ఎలా విచారణ చేయాలో పోలీసులకు తెలియజేశారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ బాషా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
బేతంచెర్ల: గ్రామ సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని గురువారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆన్లైన్ హాజరు నమోదును పరిశీలించారు. విధులకు హాజరుకాని పంచాయతీ గ్రేడ్–5 సిబ్బంది, వీఆర్వోపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ సచివాలయంలో రిజిష్టర్లను పరిశీలించి ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రీ సర్వేకు సంబంధించి వీఆర్వో, సర్వేయర్ అందుబాటులో లేరని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. గోస్పాడు పీహెచ్సీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భవతులతో మాట్లాడారు. రక్తహీనత సమస్య తలెత్తకుండా సమయానికి మంచి పోషకాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జూలేపల్లి గ్రామంలో సంచారచికిత్స కార్యక్రమాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎన్సీడీ సర్వేని వేగవంతం చేయాలన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ 14 సంవత్సరాల బాలికలందరికీ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా అందుతున్నయా లేదా అనే విషయంపై రోగులతో ఆరా తీశారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ షబ్బీర్ హుస్సేన్ వలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో జిల్లా నాయకులకు పదవులు బొమ్మలసత్రం: జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు వివిధ విభాగాలకు సంబంధించి పదవులను కల్పించారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం.శివనాగిరెడ్డిని స్టేట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఎస్వీఎన్వీ ప్రసాదరెడ్డిని నంద్యాల జిల్లా ఎంప్లాయ్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. పాణ్యానికి చెందిన కాల్వ లక్ష్మిపతిని రాష్ట్ర పబ్లిక్ వింగ్ సెక్రటరీగా, పొంగులేటి సుభాషిణిరెడ్డిని స్టేట్ అంగన్వాడీ వింగ్ సెక్రటరీగా, యాతా సురేష్ను స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. బనగానపల్లెకు చెందిన అందె శ్రీనివాసరెడ్డి, పోరెడ్డి మనోహర్రెడ్డిలను స్టేట్ రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా, నందికొట్కూరుకు చెందిన వి.రామకృష్ణారెడ్డిని నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షులుగా నియమించారు. నిప్పుల కొలిమి ● దొర్నిపాడులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దొర్నిపాడులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గోస్పాడులో 42.8, ఆళ్లగడ్డలో 42.7, రుద్రవరంలో 42.6, చాగలమర్రిలో 42.3, నంద్యాల రూరల్లో 42.3, అవుకులో 42.2, బనగానపల్లిలో 42.2, కౌతాలంలో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్న సమయంలో గాలిలో తేమ 10 శాతానికి పడిపోతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. -
మొక్కజొన్న రైతు కుదేలు!
నేను 11 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ. 40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట దిగుబడి చూస్తే ఏం మిగిలేలా లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లేదు. మేము కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి –భూపాల్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం,సంజామల మండలం గతేడాదిలాగే ఏడాది కూడా మొక్కజొన్న కలిసి రాలేదు. ఈ రబీలో 6 ఎకరాల్లో పంట వేశాను. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే, మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. క్వింటా రూ. 1750లోపే పలుకుతుంది. – పేరం వెంకటేశర్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం, సంజామల మండలం సంజామల: గత రెండేళ్లుగా రైతులకు వ్యవసాయం కలిసి రావడం లేదు. అతివృష్టి, అనావృష్టికి తోడు ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయం. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక, దళారులు అడిగిన ధరకు విక్రయించలేక సతమతమవుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి సహకరించక, నిల్వ చేసుకునే సదుపాయం లేక వ్యాపారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నారు. ఖరీఫ్ కలిసి రాలేదు. కనీసం రబీ సీజనైనా తమకు నష్టాల నుంచి గట్టెక్కిస్తుందేమోననే ఆశతో నంద్యాల జిల్లాలో భారీగా మొక్కజొన్న సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 29,713 ఎకరాలు కాగా రికార్డు స్థాయిలో 72, 896 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. జిల్లాలో పాములపాడు, బనగానపల్లె, రుద్రవరం, చాగలమర్రి, ఆళ్లగడ్డ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. ‘మద్దతు’ ప్రకటనలకే పరిమితం విత్తు నుంచి కోత వరకు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దిగుబడి 30 నుంచి 35 క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించి జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో చేతికొచ్చిన దిగుబడిని ఎక్కడ విక్రయించుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ధర తగ్గించి అడుగుతున్నారు. నాణ్యతను బట్టి క్వింటం రూ. 1500 నుంచి రూ. 1750కు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ధరకు విక్రయిస్తే కష్టమంతా పెట్టుబడులకే సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట చేతికి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకునేవారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మొక్కజొన్న రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం సాధారణ సాగు నందికొట్కూరు 5957 20095 ఆళ్లగడ్డ 11176 19957 బనగానపల్లె 6394 17102 శ్రీశైలం 2445 7160 డోన్ 997 2067 నంద్యాల 568 1689 పాణ్యం 2176 4826 మొత్తం 29,713 72,896 ప్రకటనకే పరిమితమైన మద్దతు ధర జిల్లాలో ఎక్కడా కానరాని కొనుగోలు కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ప్రభుత్వ తీరుతో నష్టపోతున్న రైతులు -
ఖబడ్దార్.. ఒళ్లు దగ్గర పెట్టుకో!
కల్లూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారి పెళ్లాలను చెల్లెలుగా అనుకొని వారికి సంబంధాలు చూడాలని వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణా ఖబడ్దార్... ఒళ్లు దగ్గర పెట్టుకో అని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కర్నూలు నగరంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయం దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి శాంతియుతంగా నిరసన చేశారు. ఆంధ్రజ్యోతి పత్రులను దహనం చేశారు. సిగ్గుమాలిన చర్య వైఎస్సార్సీపీ జోనల్ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, అరుణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మహిళలు ఏబీఎన్ రాధాకృష్ణా చెత్త పలుకుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజమని నినాదాలు చేశారు. చానల్, పేపర్కు యజమానిగా ఉన్న వ్యక్తి ఇటువంటి మాటాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. సాధారణంగా పత్రికల్లో కథనాలు, వార్తాలు సమాజానికి మేలుకోలుపే విధంగా ఉండాలని, ఏబీన్ రాధాకృష్ణ మాత్రం మహిళల గురించి నీచంగా మాట్లాడారన్నారు. ఇంట్లో మహిళలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక టీడీపీకి కరపత్రికగా మారిందని విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను, నాయకులు పోలీసులు అడుకోవడం దారుణమన్నారు. నిరసనలో తాజా మాజీ కార్పొరేటర్లు సుదర్శన్రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు తిరుపాల్, గోపాల్రెడ్డి, శివారెడ్డి, సాయి, హేమలత, మహేశ్వర్రెడ్డి, యూనస్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
సాక్షి, నంద్యాల: వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటేష్ శేషాద్రి తెలిపారు. నంద్యాలలోని స్పెషల్ సబ్ జైలును బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్ జైల్లో గదులను, వంటశాలను, పరిసరాలను పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య విషయాలను, కేసుల విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ విజ్ఞాన సదస్సుపై ఖైదీలకు అవగాహన కల్పించారు. జడ్జి వెంట జైలు సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డి, సిబ్బంది రామచంద్రారెడ్డి ఉన్నారు. ఎస్సార్బీసీకి నీటి విడుదల బంద్ బనగానపల్లె: ఎస్సార్బీసీకి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో 1.62 లక్షల ఎక రాల ఆయకట్టు ఉంది. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో 58వేల ఎకరాలు ఉండగా రబీలో 12 వేల ఎకరాల్లొ మొక్కజొన్న, 16వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరికొన్ని పంటలను ఇతర విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం వరి వెన్ను, మొక్కజొన్న కంకిదశలో ఉంది. ఈనె ల చివరి వరకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలోని మొత్తం పంటలన్నీ చేతికి వచ్చే అవకాశం ఉంది. గోరుకల్లు రిజర్వాయర్లో నీరు ఉన్నప్పటికీ ఎస్బార్బీసీకి విడుదల నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మే చివరి వరకు నీటిని ఇచ్చేవారని, ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అర్థకం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి సాక్షి, నంద్యాల: జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను అడ్హక్ తహసీల్దార్లుగా నియమిస్తూ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు పది మంది తహసీల్దార్లుగా పదోన్నతులు పొందినట్లయ్యింది. ఆళ్లగడ్డ డిప్యూటీ తహసీల్దార్ రాజీవ్రెడ్డిని బనగానపల్లె తహసీల్దార్గా, బనగానపల్లె సీఎస్డీటీగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్రెడ్డిని అవుకు మండల తహసీల్దార్గా నియమించారు. గోస్పాడు డిప్యూటీ తహసీల్దార్ హరితను కలెక్టరేట్ డీ సెక్షన్ కో ఆర్డినేటర్గా, బండిఆత్మకూరుగా డిప్యూటీ తహసీల్దార్ గురునాదంను కలెక్టరేట్ డీసెక్షన్ సూపరింటెండెంట్గా నియమించారు. డీఎస్ఓ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఫక్కీర్ అహ్మద్ను ఆత్మకూరు డీఏఓగా, నేషనల్ హైవే డీటీగా విధులు నిర్వహిస్తున్న అనితను కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్గా నియమించారు. ఎస్ఆర్బీసీ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న శ్రీవాణిని నంద్యాల మండల తహసీల్దార్గా, మహానంది డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిని మహానంది తహసీల్దార్గా, వెలుగోడు డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న చంద్రశేఖర్ను సంజామల తహసీల్దార్గా, పాణ్యం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న శివశంకర్ను పాణ్యం తహసీల్దార్గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కనీస గౌరవం లేదా?
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి కర్నూలు (టౌన్): మహిళలపై కనీస గౌరవం లేకుండా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి అన్నారు. కర్నూలులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనను తీసుకువచ్చారని, దీనిపై ప్రజలు, మేధావులు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని అయితే వేల కోట్లు దోపిడీ చేసుకోవచ్చుననే దురాశతో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతి రాజధానికి జగనన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో దోపీడీకి వ్యతిరేకమన్నారు. భార్యకు, చెల్లికి తేడా తెలియని దౌర్భాగ్యస్థితిలో జర్నలిస్టు రాధాకృష్ణ ఉండటం సిగ్గుచేటైన విషయమన్నారు. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేష్ ఖండించకపోవడం దారుణమన్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్ రాధాకృష్ణ ఉపసంహరించుకొని బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. -
రాధాకృష్ణవి ‘చెత్త’పలుకులు
ఆలూరు రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకొని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మావిగన్ను ప్రతిపాదించారన్నారు. ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేని రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరోపని లేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ఈనాడు ఎల్లో మీడియా కూటమి కుల పిచ్చితో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారన్నారు. అమరాతి పేరిట చంద్రబాబు అండ్ బ్యాచ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. అమరాతి ప్రజల రాజధానిగా కాకుండా కమ్మ రాజధానిగా మారుతోందన్నారు. కారుకూతలు కూసిన రాధాకృష్ణ రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు ఆందోళనలు కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీనీ నాయకులు చిన్న ఈరన్న, రామాంజినేయులు, ఎస్కే గిరి, వెంకటేషులు, ఎల్లప్ప, లక్ష్మిరెడ్డి, ఉరుకుందు, మారెప్ప, ఈరన్న, కో–ఆప్షన్ మెంబర్ బాషా పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఊడిగం చేసుకోండి
● మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: ‘ఏబీఎన్ రాధాకృష్ణా.. చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసుకోండి. మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏబీఎన్ రాధాకృష్ణపై కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ చానల్లో ఈ నెల 4న వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యనాలు చేయడం దారుణామన్నారు. జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాడం చాలా బాధాకరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు తిరిగి మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేయడం చూశాం గాని ఒక పత్రిక, చానల్ యజమాని ఇలా మాట్లాడటం మొదటిసారి అన్నారు. మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారం ఎవరు ఇచ్చారు? తనకు సంస్కృతి ఉందని, అలాగే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, అసభ్య పదజాలం వాడటం లేదని కాటసాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కు రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుందనే ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు తన ‘పచ్చ’ మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘మావిగన్’ అంశంపై మాట్లాడాలని, మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు భార్యల గురించి మాట్లాడే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలను గౌరవించాలని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని పురణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జోనల్ విభాగం అధ్యక్షులు గాజుల శ్వేతారెడ్డి, జనరల్ సెక్రటరీ అక్కిమి హనుమంతురెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, భీమేశ్వర్రెడ్డి, బస్తిపాడు రమణారెడ్డి, సుంకన్న, సాయి, హేమలత పాల్గొన్నారు. -
కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ– గ్రేడ్
కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అకడమిక్ అడ్వయిజర్లు పరిశీలించి ఏ– గ్రేడ్ ప్రకటించారు. అకడమిక్ అడ్వయిజర్లు హనుమంతరెడ్డి, కాశీంసాహెబ్ కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కళాశాలలో మౌలిక వసతులు, అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని గుర్తించి కళాశాలకు ఏ– గ్రేడ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కళాశాలకు ఉత్తమ గ్రేడ్ రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏటా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ కళా శాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నా రని అన్నారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వ కర్త భాస్కర్రెడ్డి, అధ్యాపకులు రామసుబ్బారెడ్డి, నరేంద్రనాథరెడ్డి, కృష్ణశశాంక, కృష్ణదాసు,నాగేశ్వరరెడ్డి, రాజశేఖర్, అన్నపూర్ణ, రమణారెడ్డి, లక్ష్మిదేవి, షహనాజ్, తదితరులు పాల్గొన్నారు. గురుకుల ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డుల విడుదల నంద్యాల(న్యూటౌన్): 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ర్యాంకు కార్డులను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ ఎంఈ గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ ర్యాంకు కార్డు కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు https:// apbragcet. apcfss. in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచారం శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలోని సందర్శనీయ స్థలాల లో ఒకటైన సాక్షి గణపతి ఆలయం వద్ద సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించినట్లు సీసీఫుటేజ్లో కనిపించింది. ఆలయం పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి ఆలయ గ్రిల్ గేట్ వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు దాటి వెళ్లడం కనిపించింది. రాత్రి వేళ శ్రీశైలం – సున్నిపెంట మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాల ని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులు? నంద్యాల(అర్బన్): పట్టణం క్రాంతినగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తాలూకా పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకే కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ముగిసిన ఇంటర్ మూల్యాంకనం
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్కు చెందిన 1,93,831 జవాబు పత్రాలను 29 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్గా ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాకాధికారి శంకర్నాయక్ వ్యవహరించారు. సాధారణంగా ఇప్పటి వరకు మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్)ను విడదీసి బండిళ్లు ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించే వారు. అక్కడ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఓఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, మార్కుల నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించే వారు. ఈ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు గత ఏడాది తొలిసారిగా ప్రతి స్పాట్ కేంద్రానికి స్కానర్ను అందజేశారు. స్కానింగ్ అనంతరం మరొకసారి మార్కు ల నమోదును నిర్ధారించడం వలన విద్యార్థికి నష్టం కలగదు. స్కానర్ ద్వారా ‘స్పాట్’ కేంద్రంలో మూ ల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. స్పాట్ ముగియడంతో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి ఫలితాలపై పడింది. ఈ నెల 15న ఇంటర్ ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి శంకర్నా యక్ నేతృత్వంలో మూల్యాంకన ప్రక్రియ సజావుగా సాగింది. 690 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లను మూల్యాంకనం చేయగా, 111 మంది స్క్రూటినైజర్లు తనిఖీ చేశారు. మూల్యాంకన ప్రక్రియలో 83 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 18 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్, జెన్1, జెన్2, ఇద్దరు చీఫ్ కోడింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి ● మద్యం సేవించి విధులకు హాజరైన పంచాయతీ సెక్రటరీపై వేటు గోస్పాడు: సమయ పాలన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె పసురపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదన్నారు. గ్రామంలోని సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేని విషయాన్ని గుర్తించారు. ‘స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్’ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీఓపై చార్జీలు ఫ్రేమ్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు కూడా సచివాలయాలు, ఇతర శాఖల్లో సిబ్బంది పని తీరు పట్ల పర్యవేక్షణ లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్ మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు కలెక్టర్ గమనించారు. వెంటనే పోలీసులను పిలిపించి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి సంబంధిత సెక్రటరీపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, సచివాలయంలో ఆన్లైన్ హాజరు నమోదు చేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష
కర్నూలు: పోలీసు శాఖ సర్వీసులోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో మంగళవారం సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు 72 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేర స్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనపరచిన వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తారు. డీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ పీరా, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ డీఎస్పీలు శ్రీనివాసులు, బాలస్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్తో సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేంద్ర నిధుల వినియోగంపై విచారణ
రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం, కొండమాయపల్లె గ్రామాల్లో మంగళవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం లీడర్లు అశోక్కుమార్, సాసో అండర్ సెక్రటరీ రబల్కుమార్, ఎకనామిక్ అధికారి మోర్డు జిల్లాలో కేంద్ర నిధుల వినియోగంపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వారు స్థానిక చంద్రునిపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహలను పరిశీలించారు. అలాగే పడమటి వీధిలో పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసుకున్న గేదెల యూనిట్ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఈజీపీ పథకం ద్వారా కుటుంబ జీవన ప్రామాణాలు పెరిగాయా అనే అంశంపై విచారణ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ శ్రీధర్రెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరెడ్డి, ఏపీడీ సాంబశివరావు, ఏపీఓ గౌరీబాయ్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ నాగరాజు, ఏపీఎం వసంతకుమారి ఉన్నారు. నంద్యాల: జిల్లాలో భూగర్భ జలాల శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరులన్నింటినీ క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, యథావిధిగా పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాల స్థాయి క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. ఉపాధి హామీ పనులను శాతం వంద పూర్తిచేయాలన్నారు. అలాగే వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించేందుకు తహసీల్దార్లు తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా భూగర్భ శాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివ శంకర్, డ్వామా పీడీ సూర్యనారాయణ మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవా న్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, కుంభహారతి, సాత్వికబలి, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వి కబలిని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం అమ్మవారి కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించారు. ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జపపారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా చేపట్టారు. అలాగే శాంతి ప్రక్రియలో భాగంగా అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజలు చేసిన తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన ఐదు వేలకుపైగా కొబ్బరికాయలు, 20 వేల గుమ్మడికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు కూడా పూజలు చేపట్టారు. స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. తొలి విడత సాత్వికబలి అనంతరం హరిహరరాయగోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు చేసి సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. అమ్మవారికి కుంభహారతి.. సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. కుంభోత్సవ పూజ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవో, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చివరిగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభరాశి వద్ద పూజలు చేస్తున్న భక్తులుఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించిన దృశ్యం కుంభహారతితో వస్తున్న స్త్రీ వేషదారణలో పురుషుడు మహిషాసురమర్ధినికి పూజలు చేస్తున్న దృశ్యం -
రాలిపోయిన ఆశలు
2024లో ఎకరాకు సగటున 6–8 టన్నుల దిగుబడి వచ్చింది. 2025లో 2–3 టన్నుల వరకే దిగుబడి పరిమితమైంది. ఈ సారి మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్ల తామర విజృంభించింది. దీనికి తోడు తేనెమంచు పురుగులు చుట్టుముట్టి తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే మొత్తం రాలిపోయింది. మామిడిలో కనిపించని పిందె, కాయలుకర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల వచ్చినా మార్కెట్లో మామిడి కనిపించని పరిస్థితి. మామూలుగా మార్చి రెండో వారం నుంచే మధుర ఫలం నోరూరిస్తుంది. మే నెల వరకు మామిడి మార్కెట్ను తనవైపు తిప్పుకుంటుంది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి గల్లంతవడం రైతులతో పాటు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే బేనిసా మామిడి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి. దీనినే బంగినపల్లి మామడిగా వ్యవహరిస్తారు. మొదటిసారి ఈ బేనిసా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం ఎకరాకు సగటున 4 టన్నులు వస్తుంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 53వేలకు పైగా టన్నుల దిగుబడి రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక తోటల్లో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మామిడి కూడా లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా పూత వచ్చింది. ఈ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 95 శాతంపైగా రాలిపోయింది. దాదాపు 10వేల ఎకరాల్లో అస్సలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో ఎకరాకు అర్ధ టన్ను వరకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లబోదిబోమంటున్న వ్యాపారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్, కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెళగల్, హాలహర్వి, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాల్లో తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్లతామర, తేనెమంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగుమందులు పిచికారీ చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండాపోయింది. కాయలు లేక వెలవెలబోతున్న చెట్లను చూసి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామిడి పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్లతామర. నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏప్రిల్ నెలలోనూ కనిపించని మధుర ఫలం ముంచిన నల్లతామర, తేనేమంచు పురుగులు దాదాపు 10 వేల ఎకరాల్లో కనిపించని కాయలు పంట లేక టన్ను ధర రూ.లక్షకు పైనే.. లబోదిబోమంటున్న వ్యాపారులు -
మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
● గూగుల్ మ్యాప్ ద్వారా కాల్వబుగ్గ ఆలయ పరిసరాలు గుర్తించి చోరీ ● సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన పోలీసులు కర్నూలు: కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. గత నెల 17వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవారికి చెందిన వెండి వస్తువులు అపహరించారు. దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ, నరసింహశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు సునీల్ కుమార్, ధనుంజయ, అఖిల్లతో కలసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి 20 రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా పక్కా ఆధారాలతో మహారాష్ట్ర ముఠానే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర పూణెకు చెందిన అర్జున్ పూనం కుంబ్హర్, మహారాష్ట్రలోని చించ్వడ్కు చెందిన అక్షయ్ జైసింగ్ ఠాకూర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తమ సహచరులు జర్నల్, అమిత్, బజరంగిలతో కలసి ఈ నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. గూగుల్ మ్యాప్లో గుర్తించి దోపిడీ... నిందితులు ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి మొత్తం ఐదుగురు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించారు. అలాగే టోల్గేట్లలోని సీసీ ఫుటేజీ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మిగిలిన మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేసి మిగిలిన వెండి ఆభరణాలు కూడా రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అ రెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఆలయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. -
మరణంలోనూ వీడని బంధం
● మూడు గంటల వ్యవధిలోనే గూళ్యంలో దంపతుల మృతి హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం. -
శుభగాత్రి..గిరిజాపుత్రి!
మహాశక్తి పీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి రూపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. అయితే, ఎప్పుడూ ఆమె నిజరూపంలో కనిపించరు. ప్రత్యేక అలంకరణలో మాత్రమే భక్తులకు అనుగ్రహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు అది కూడా కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారు నిజరూపదర్శనంలో అగుపిస్తారు. నేడు వార్షిక కుంభోత్సవం సందర్భంగా భక్తులకు ఆ దర్శన భాగ్యం లభించనుంది. ఒకప్పుడు చెంచుల ఉత్సవంగా ఉన్న ఈ కుంభోత్సవం నేడు సకల జనులదిగా మారడం విశేషం. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ఆలయపు జానపద ఆచారాల్లో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. గతంలో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమ్మవారి ఆలయం మూసివేసేవారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత గుడి తెరచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమలతో పూజించేవారు. ముందుగానే అమ్మవారి గర్భాలయం తెరచినప్పటికీ ముఖమండపంలోని శక్తియంత్రం వెనుకాల వండిన అన్నం పెద్ద రాశిగా పోసి ఒక దున్నపోతును తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి దాని తల నరికేవారు. తర్వాత ఆ తలను అన్నపురాసిపై దేవి విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంచేవారు. అలాగే నాలుగు మేకపోతులను బలిఇచ్చి అన్నపు రాశికి నాలువైపులా వాటి తలలను ఉంచి అవి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఉంచేవారు. కాలక్రమేణ చెంచుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికితోడు జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలు, జంతుప్రేమికుల విన్నపం మేరకు దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయశాఖ చట్టం చేసింది. దీంతో జంతుబలి నుంచి సాత్వికబలి దిశగా కుంభోత్సవం మారింది. ప్రస్తుతం సాత్వికబలిలో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు, తమ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కుంభోత్సవం రోజు పూజలు ఇలా కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యధావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జపపారాయణలు చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకం జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. నిజరూప దర్శనంఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరింపబడి ఉంటుంది. అయితే, సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు, 9 రకాల పిండివంటలతో మహానివేదన గావించాక ఈ ఉత్సవం ముగుస్తుంది. కుంభోత్సవం రోజు సాయంత్రం ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు చీరను ధరించి సీ్త్ర వేషంలో అమ్మవారికి హారతి తీసుకువస్తాడు. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులను నిర్వహించే ఉద్యోగి సీ్త్ర వేషాన్ని ధరిస్తాడు. స్వామిఅమ్మవార్ల సహస్రదీపాలంకరణ సేవా మండపం నుంచి భాజాభజంత్రీలతో ఈ హారతి తీసుకుని రావడం జరుగుతుంది. దీనికే కుంభహారతి అని పేరు. ఈ హారతి తెచ్చేటప్పుడు సీ్త్ర వేషధారి ముఖం కనపడకుండా చీరకొంగుతో ముసుగువేస్తారు. కుంభహారతి గర్భాలయం వద్దకు చేరుకున్న వెంటనే అర్చకులు గర్భాలయ ద్వారాలు తెరచి ఆ వేషధారి అమ్మవారికి హారతిని సమర్పించి అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారిని మొదటగా దర్శించుకునేది ఈ సీ్త్ర వేషధారే. శ్రీశైల భ్రమరాంబాదేవికి నేడు వార్షిక కుంభోత్సవం దక్షిణాచార సంప్రదాయంతో జంతు బలులు నిషేధం నాటి చెంచుల ఉత్సవం.. నేడు సకల జనుల ఉత్సవం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో అమ్మవారికి సాత్వికబలి అమ్మవారి నిజరూపదర్శనంతో పులకించనున్న భక్తజనం -
తర్తూరు జాతరకు వెళ్లొస్తుండగా..
● రుద్రవరం వద్ద ఆటో బోల్తా ● ఒకరు దుర్మరణం..పలువురికి గాయాలు పాములపాడు: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో జరిగే తిరునాలకు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఆత్మకూరు మండలం నాగలూటి గూడెం చెందిన ఆరుగురు ఆటోలో తర్తూరు తిరునాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆటోను డ్రైవర్ పులిచెర్ల బయ్యన్న వేగంగా నడుపుతూ రుద్రవరం వద్ద ఎన్హెచ్ 340సీ ఫ్లైఓవర్ వంతెనపై డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో అందులోని వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైదశాలకు తరలించగా నిమ్మల బయమ్మ అనే మహిళ మృతి చెందారు. గుర్రప్ప, అంకమ్మ అనే మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ధ్రువీకరించిన విత్తనాలు మేలు కర్నూలు(అగ్రికల్చర్): లైసెన్స్ కలిగిన డీలరు దగ్గర ధ్రువీకరించిన విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు చేసిన విత్తనం బిల్లు, ఖాళీ ప్యాకెట్, పంట చివరి వరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. విత్తనాల అమ్మకాల్లో అక్రమాలు గమనిస్తే సంబంధిత వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకరావాలని, టోల్ఫ్రీ నంబరు 83413 02863కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తాం
నంద్యాల: ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోరుమానుకొండకు టీబీ రహిత పురస్కారం బేతంచెర్ల: మండల పరిధిలోని గోరుమాను కొండను 2025 సంవత్సరానికి టీబీ రహిత గ్రామంగా ప్రకటించారు. సోమవారం డీఎంహెచ్ఏ వెంకట రమణ అందుకు సంబంధించిన ప్రశంసాపత్రం, మెమోంటోను వైద్య సిబ్బందికి అందజేశారు. రానున్న రోజుల్లోనూ టీబీ రహిత గ్రామంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాజీ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, అధికారులు, వైద్య సిబ్బంది కృషితోనే తమ గ్రామం టీబీ రహిత పురస్కారం అందుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా భూమి నాకు ఇప్పించండి నంద్యాల(అర్బన్): ఇండియన్ ఆర్మీలో పని చేసిన తనకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సాగు భూమిని ఇతరులు ఆక్రమించుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని రిటైర్డు ఆర్మీ జవాన్ ఈఎస్పీ ప్రసాదరావు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక నూనపల్లె సమీపంలోని రిటైర్డు ఆర్మీ ఉద్యోగుల కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బండిఆత్మకూరు మండలం జీసీపాలెం గ్రామం సర్వేనం. 328/2లో మూడున్నర ఎకరాల సాగు భూమి ఇస్తూ తాత్కాలిక పొజిషన్ పట్టా కేటాయించారన్నారు. నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రెన్యూవల్ చేయించుకున్నానన్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడటంతో భూమి సాగు కష్టమైందన్నారు. ఈ క్రమంలో అధికారులు తన భూమిని స్థానికులు పెద్దినేని మురళీమోహన్ పేరు మీద ఆన్లైన్ చేశారని, దీనిపై పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి తన భూమి తనకే చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డు ఆర్మీ జవాన్ల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీలో మట్టి తోడేళ్లు!
● టీడీపీ నేతల అండ ● యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపుగోనెగండ్ల: టీడీపీ నేతల అండతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం జేసీబీలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల సమీపంలోని తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 20 రోజుల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిని పలు గ్రామాల్లోని ఇళ్లు, వెంచర్లు నిర్మించే వారికి అమ్ముతున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1300 దాకా వసూలు చేస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. జీడీపీ ఎగువ ప్రాంతంలో మట్టిని తవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే టీడీపీ నేత అండ ఉండటంతో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి మాయం అవుతోందని, గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. గుంతలమయం అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నుల్లోనే ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులే అక్రమ ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్కు రూ.200 ఇవ్వాలని ఆ నాయకులు వసూలు చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వడంతో జీడీపీ ఎగువ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతాలను రైతులు తమ పశువులను మేపించేందుకు వెళ్తుంటారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్తుంటారు. గతంలో గుంతలు పడిన ప్రదేశంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇప్పుడు కూడా మట్టి మాఫియా కోసం జేసీబీతో గుంతలు గుంతలు తవ్వడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలకు ఉన్నతాధికారుల నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారం రోజులుగా మా సిబ్బందిని రాత్రి 12 గంటలకు వరకు కాపాలగా పెట్టాం. అయినా తప్పించుకొని తెల్లవారు జామున 3 గంటల సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ కళ్లుగప్పి తరలింపు రాత్రిపూట అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండడంతో ఉదయం చూడగానే పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ప్రాజెక్టు సిబ్బంది నలుగురు కాపలాగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి -
పనితీరు మార్చుకోవాలి
● 412 మందిలో 106 మంది అధికారులకు ‘సున్నా’ మార్కులు ● అధికారులపై కలెక్టర్ రాజకుమారి అసంతృప్తి నంద్యాల: జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 412 మంది అధికారుల పనితీరును ఓపీటీఎస్ ద్వారా అంచనా వేయగా 106 మందికి గ్రీవెన్స్ పరిష్కారంలో ‘సున్నా’ మార్కులు రావడం ఆందోళనకరమన్నారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎండార్స్ చేసిన పిటిషన్లను సైతం కొందరు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మొత్తం 35 ముఖ్యమైన అర్జీలను పెండింగ్లో ఉంచడం లేదా తప్పుడు కారణాలతో మూసివేయడాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యక్ష విచారణ సాగుతోందన్నారు. దేవదాయ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ర్యాంకులు కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చేవారం నుంచి పీజీఆర్ఎస్ 9.30గంటల నుంచే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహణ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● రాష్ట్రంలో పోలీసులు పేరుకు మాత్రమే ● శాంతిభద్రతలను గాలికి వదిలేశారు ● ప్రతిపక్షనేతను తిట్టేందుకే అనితకు మంత్రి పదవి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం బొమ్మలసత్రం: ‘అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నార’ని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణి హాజరుకాగా ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూర్య నారాయణరెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాల నుంచి ఆవిర్భవించిందన్నారు. 2024 ఎన్నికల్లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడి 22 నెలలు గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను గర్భిణి చేసి 5 సార్లు కడుపు తీయించటం దారుణమన్నారు. జరిగిన అన్యాయంపై బాధితురాలు ప్రశ్నిస్తే కర్రతో నడిరోడ్డుపై దాడి చేశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించటంతో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత ప్రతిపక్షనేతను తిట్టేందుకే సరిపోయారని నియోజకవర్గం దాటి గంజాయి తరలివెళ్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. పీఏని అడ్డుగా పెట్టుకొని ఆమె వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. పవన్వి అన్ని ప్రగల్భాలే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలికి వదిలేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి సరిపోయారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే తాటా తీస్తామని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో మత్తుపదార్థాల విక్రయాలు జరగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవించి పట్టుబడితే అతనిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తిరిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి సర్కారు నీరుగార్చిందన్నారు. ఈ బిల్లును టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసా, మాజీ డైరెక్టర్ సునీతా అమృతరాజ్, జెడ్పీటీసీలు దివ్య, ఖలీమున్నీసా, ఎంపీపీలు వెంకటేశ్వరమ్మ, హుస్సేన్బీ, శారదమ్మ, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనపైనే ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్ ● తప్పిన ప్రమాదం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. -
ఏ‘మనీ’ చెప్పాలి?
నగదు లేక ఖాళీగా ఉన్న ఏటీఎం కేంద్రం కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచి ఉంచినా డబ్బు అంతంతమాత్రమే ఉండటంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నగదు కొరతతో కర్నూలులోని కలెక్టరేట్, గాయత్రీఎస్టేట్, బుధవారం పేట, పెద్దాసుపత్రి, యూకాన్, సెంట్రల్ ప్లాజాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ఈ దుస్థితి ఏర్పడింది. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని ఈఈలు, డీఈఈ, ఏడీఈలను విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు కొరత!
● మూతపడుతున్న ఏటీఎంలుకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు మూత పడుతున్నాయి. ఐదారేళ్లుగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ తాగినా, పల్లీలు కొన్నా.... ఫోన్పేను వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో 90 శాతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఆర్బీఐ నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి నగదు రావడం లేదు. గతంలో వారానికి కనీసం ఒకసారి నగదు వచ్చేది. ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ.500 నోట్లు వచ్చేవి. ఆర్బీఐ నుంచి జిల్లాల్లోని కరెన్సీ చెస్ట్లకు నగదు సరఫరా దాదాపు నెల రోజులుగా లేకుండా పోయింది. గతంలో పెట్రోలు బంకులు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగేది. నేడు ఇందులో కూడా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో నగదు సర్క్యులేషన్ తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎంతమేర ఉన్నప్పటికీ చేతిలో అవసరాలకు కొంత నగదు ఉంచుకోవడం సర్వసాధారణం. చేతిలో రూ.1000, రూ.2000 ఉంచుకునేందుకు కూడా నగదు లభించడం లేదు. నగదు లేకపోవడంతో జిల్లాలోని ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఏటీఎంలో రూ.500 నోట్లు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ నోట్లు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఏటీఎంలు మూత పడుతున్నాయి. బ్యాంకులు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చారు. నగదు లభ్యతను బట్టి బ్యాంకులు ఏటీఎంల్లో పెడుతున్నాయి. పలు బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు పడిపోవడంతో ఏటీఎంలను మూసేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 153 ఉన్నాయి. ఇందులో బ్రాంచీల ఆధ్వర్యంలో 63, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 90 పనిచేస్తున్నాయి. వీటిలో 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో అత్యధిక ఏటీఎంలు పనిచేయడం లేదు. కలెక్టరేట్లోని ఎస్టీఐ ట్రెజరీ బ్యాంకు ఏటీఎం కొద్ది రోజులుగా మూత పడింది. దీంతో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు ప్రధానంగా రూ.500 నోట్లు సరఫరా పెరిగితేనే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంది. -
రేపు శ్రీశైల భ్రామరీకి కుంభోత్సవం
● సాత్వికబలిగా గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ● సీ్త్ర వేషంలో పురుషుడు అమ్మవారికి కుంభహారతి శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు. మంగళవారం ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. తరువాత అమ్మవారి ఆల యం ముందు రజకునిచే ముగ్గు వేయించి, భ్రమ రాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్వికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేపడుతారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తాడు. అనంతరం రెండో విడత సాత్వికబలిని సమర్పిస్తారు. తరువాత భక్తులను అమ్మ వారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. -
పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభం
కల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ఈనెల 5 నుంచి 14వ తేదీ (బాబు జగ్జీవన్ రామ్ జయంతి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి) వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ అన్నారు. ఆదివారం కల్లూరు మండలం ఎ.గోకులపాడులో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూర్య ఘర్ పథకం, రాష్ట్ర ప్రభుత్వ యూఎల్ఏ మోడల్ ద్వారా పెద్ద ఎత్తున సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 23,077 గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కిట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శుభకార్యానికి వచ్చి.. మృత్యుఒడికి.. ● కుందూనదిలో జారిపడి పదేళ్ల బాలిక మృతి బండిఆత్మకూరు: బంధువుల శుభాకార్యానికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ మృత్యుఒడి చేరింది. నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాల గ్రామానికి చెందిన షేక్ సుభాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పార్నపల్లి గ్రామంలో జరిగే బంధువుల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. సరదాగా గడుపుతున్న సమయంలో సుభాన్బాషా కుమార్తె షబానా (10) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు మహానంది: ఎండలను దృష్టిలో ఉంచుకుని మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానంలోని రాజగోపురం ముందు భాగంతో పాటు ఆలయంలో ఉన్న క్యూలైన్లు, కోనేరు ప్రాంతాలు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, తదితర ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, కొబ్బరిపీచు మ్యాట్లను వేయించారు. ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది ఆదివారం ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వం ఉపాధ్యాయు ల సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామపక్కీర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నూర్మహమ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్ రద్దుకు కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. -
నిర్వహణ ఇంత అధ్వానమా?
డోన్: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజాప్రయోజన పనుల నిర్వహణను గాలికొదిలేయడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఉదయం తన స్వగృహం నుంచి వాకింగ్ చేస్తూ స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను సందర్శించారు. రెండేళ్ల క్రితం రూ.3.50 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ఆవరణ కళాహీనంగా తయారై కుక్కలు, పందులకు ఆవాసంగా మారడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరగడంతో అసహనం వ్యక్తం చేశారు. జాతి సంపద అయిన వసతిగృహం నిర్వహణకు కనీసం వాచ్మెన్ను కూడా నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. వాకర్ల కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడం శోచనీయమన్నారు. పట్టణంలో రూ. లక్షల ప్రజాధనంతో తమ హయాంలో నిర్మించిన ఏడు పార్కులు నేడు ఆలనాపాలనా లేక బోసిపోయాయన్నారు. పార్కుల్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల కోసం దుకాణాలను ఏర్పాటు చేస్తే వాటిని నేటి వరకు తెరిపించకపోవడం దారుణమన్నారు. స్విమ్మింగ్ పూల్, పార్కులు మూత పడటానికి కారణం టీడీపీ నాయకులేనన్నారు. అనవసరమైన స్థల వివాదాన్ని సృష్టించి ప్రజాధనాన్ని వృథా చేశారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్కు, స్విమ్మింగ్ పూల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎంపీపీ భవనం పరిశీలన.. రూ.3.50 కోట్లతో పట్టణ నడిబొడ్డున నిర్మించిన ఎంపీపీ నూతన భవనాన్ని ఆదివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పరిశీలించారు. ఈ సంద ర్భంగా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు శ్రమించిన ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి సోదరులతో పాటు వైస్ ఎంపీపీ ఎర్రిస్వామిని అభినందించారు. యూరోపియన్ మోడల్లో నిర్మించిన ఈ భవనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాజీ మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, క్లస్టర్ యూనివర్సిటీ మాజీ సభ్యులు నాగభూషణం రెడ్డి, పార్టీ నాయకులు మల్యాల శ్రీనివాసరెడ్డి, తాడూరు జయచంద్ర, విశ్వనాథ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, క్వాలిటీ అబ్దుల్లా, ఆర్ట్ రమణ, వంశీ, డీలర్ కృష్ణ, మేడా రఘు, ఉమామహేశ్వరరావ్, ధనుంజయరెడ్డి, రాజా మహేష్, సుభాన్, పాలుట్ల రఘురాం, ఫారెస్ట్ మౌళాలి, మహేశ్వరరెడ్డి, గడ్డం సురేష్, సుంకన్న తదితరులు ఉన్నారు. పార్కులు, స్విమ్మింగ్ పూల్ను ఎందుకు పట్టించుకోవడం లేదు పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
ప్రత్యేక ప్రొటోకాల్తో దోపిడీ
హౌస్కీపింగ్ నుంచి ఒకరిని, శానిటేషన్ నుంచి ఒకరిని ఇద్దరు సూపర్వైజర్లను ప్రొటోకాల్ కింద ఏర్పాటు చేసుకుని తనకు తెలిసిన వారు వస్తే వారిని దర్శనాలకు పంపిస్తూ ఏజెన్సీ ప్రతినిధులు దర్శనాల దందా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనం టికెట్లు కూడా ఎన్ని అడిగితే అన్ని ఆ విభాగపు అధికారులు వీరికి రెడ్ కార్పెట్ వేసి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని సార్లు టికెట్లు లేకుండానే దర్శనం చేయించి వారి వద్ద నుంచి టికెట్టు డబ్బులు వసూలు చేస్తూ ప్రోటోకాల్కు వెళ్లే సూపర్వైజర్, ఏజెన్సీ ప్రతినిధులు..వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పద్మావతి ఏజెన్సీపై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దేవస్థాన ఉన్నతాధికారులు, చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
స్ఫూర్తిప్రదాత జగ్జీవన్ రామ్
నంద్యాల: దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాన్ని ముందుగా వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సమాజానికి మార్గదర్శకమన్నారు. సమాజంలో కార్మిక చట్టాల ప్రాముఖ్యతను వివరిస్తూ, చట్టాల సహాయంతో సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, దీనికి బాబూజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, ఏ. చిన్న వెంకట సుబ్బయ్య, దండు వీరయ్య, ఎన్. లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆల య క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పాలిసెట్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభమైనట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ శైలేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి రోజున 200 మంది హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్ విద్య తో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అభ్యర్థు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్స్లో ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైందన్నారు. పదో తరగతి విద్యార్థులందరూ https//:polycet ap.ap.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఈనెల 9 వరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. సమాచారం కోసం 9912377723 సంప్రదించాలని పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి నంద్యాల: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామాల్లో ఉన్న బోర్వెల్స్కు తప్పనిసరిగా జియో మ్యాపింగ్ చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ జూనియర్ ఇంజినీర్లు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార మాధ్యమాల్లో వెలువడే తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్కు నివేదికలు అందజేయాలన్నారు. ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర శనివారం క్వింటా రూ.9,079 గా నమోదయ్యింది. గత వారం రోజుల నుంచి రోజుకు రూ.100 చొప్పున పెరుగుతూ శనివారానికి రూ.9 వేలు పైనే ధర పలికింది. ఈ మేరకు 1248 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ట ధర రూ. 9,079, మధ్య ధర రూ.8,742, కనిష్ట ధర రూ.4,189గా నమోదయ్యింది. -
గమ్యం చేరేదెట్టా
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో గత ఏడాది జూలై నెల నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిచేది. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు తిరుపతికి వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరుంగా ఉండేది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైలును రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతి ఒకే రైలు ఉండటంతో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. – డీసీ ఉసేన్, కోవెలకుంట్ల నంద్యాల నుంచి రేటిగుంట వరకు ప్రస్తుతం ఒకే డెమో రైలు నడుస్తోంది. ఈ రైలు ఉదయం 6.45 గంటలకు కోవెలకుంట్లకు చేరుకుంటుంది. ఈ రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. ఇదే సమయంలో రేణిగుంట నుంచి నంద్యాలకు మరో ప్యాసింజర్ రైలు నడిపితే ప్రయాణికులకు అన్ని విధాలా రైలు ప్రయాణం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలి. – రాజేశ్వరరెడ్డి, జోళదరాశి గ్రామం, కోవెలకుంట్ల మండలంకోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గం లో రైళ్ల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటంతో రెండు జిల్లాల ప్రయాణికులు అవస్థలు పడుతు న్నారు. ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిమీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపా డు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగాన పల్లె, మద్దూరు, నంద్యాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంత పురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో డెమో రైలు మినహా మిగిలిన ఎక్స్ప్రెస్ రైళ్లు రాత్రి వేళల్లో మాత్రమే తిరుగుతుండటం, ఇటీవలే ఒక ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ప్రజలకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి నంద్యాల మీదు గా తిరుపతికి ప్రత్యేక రైలు తిరుగుతుండేది. నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాలకు గురువారం ఉదయానికి నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా తిరు పతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంట లకు నంద్యాలకు చేరుకునేది. ఈ ప్రత్యేక రైలును మార్చి 1వ తేదీ నుంచి రద్దు చేయడంతో ఈ మార్గం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లుకు మాత్రమే పరిమితమైంది. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల రాకపోకలను పెంచాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నా రైల్వేశాఖ రైళ్ల పెంపును కంటితుడుపుగా చేపడుతోంది. ఉన్న రైలును రద్దు చేయడం, ప్రస్తుతం నడుస్తున్న తిరుపతి రైలుకు కోవెలకుంట్లలో శాశ్వత స్టాపింగ్ లేకపోవడంతో రైల్వేశాఖ ఆరు నెలలకొకసారి స్టాపింగ్ ప్రక్రియను రెన్యువల్ చేయాల్సి వస్తోంది. రైల్వే అధికారులు ఏమాత్రం అనుమతి నిరాకరించినా ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు కోవెలకుంట్లలో స్టాపింగ్ ఉండదు. నిత్యం వందల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే అధికారులు పగటి వేళ్లలో ఈ మార్గంలో రైళ్లను నడపకపోవడంతో అవస్థలు పడుతున్నారు.● తిరుమల ఎక్స్ప్రెస్ రైలును కడప నుంచి నంద్యాల వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉన్నా ఆ రైలును నంద్యాలకు కాకుండా అనంతపురం జిల్లా గుంతకల్లు వరకు పొడిగించడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ● ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురంకు కొత్తగా ప్యాసింజర్ రైలును మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రైలు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా కడప వరకు ఉంటుందని ప్రజలు భావించారు. అలా కాకుండా నంద్యాల నుంచి మార్కాపురానికి మార్చడంతో ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరు నెలలు గడిచినా గుంతకల్లు– మార్కాపురం రైలు పట్టాలెక్కలేదు. ● ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వ్యాపించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించలేదు. నాందేడ్ – నంద్యాల– తిరుపతి రైలు రద్దు ఎర్రగుంట్ల రైల్వేమార్గంలో పట్టాలెక్కని ప్రతిపాదన రైళ్లు అరకొరగా నడుస్తున్న రైళ్లలో కిక్కిరిసి ప్రయాణం రెండు జిల్లాల ప్రయాణికులకు తప్పని నిరీక్షణ -
ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి బీసీ హామీ నిలుపుకోవాలి
బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్రెడ్డి దంపతులు ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా తాను నిరుపయోగంగా ఉన్న ఎస్సార్బీసీ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయగా బీసీ కోర్టు ద్వారా అడ్డుకున్నారన్నారు. చివరకు న్యాయస్థానంలో స్టే తొలగింపుతో పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగాయని, అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పట్టాల పంపిణీ జరగలేదన్నారు. నాడు ఎస్సార్బీసీ స్థలంలో పట్టాల పంపిణీ ప్రమాదమని పేర్కొన్న బీసీ జనార్దన్రెడ్డి నేడు అదే స్థలంతో పాటు పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని మంత్రి బీసీ పేర్కొనడం శోచనీయమన్నారు. దాత లు వెంకటేశ్వరస్వామికి భక్తితో దానంగా ఇచ్చిన భూమిని దేవాలయ అభివృద్ధికి వినియోగించాలన్నారు. మండలంలోని పలుకూరు గ్రామంలోని శివాలయానికి చెందిన 308 సర్వే భూమిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు యథేచ్ఛగా అక్రమమైనింగ్కు పాల్పడటంతో ఆలయ పూజారి జిల్లా కలెక్టర్, మైనింగ్ దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హిందూ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సంఘాలు, సంబంధింత అధికారులు స్పందించాల ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో తమకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి దంపతులు పట్టణంలో ఇంటింటి వద్దకు వెళ్లిన సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ భూమితో సంబంధం లేకుండా, తమ సొంత డబ్బుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయండి ఆలయ భూముల్లో మంత్రి అనుచరులు దర్జాగా మైనింగ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు తరలివచ్చారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీ సుదర్శన హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో ఈ కార్యాక్రమాన్ని ముగించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలంకరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. -
తండ్రి హత్య కేసులో కుమారుల అరెస్ట్
కౌతాళం: ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరుల సమావేశంలో సీఐ అశోక్కుమార్ వివరాలు వెల్లడించారు. కుంటనహాల్ గ్రామంలో గత నెల 30వ తేదీన తెల్లవారు జామున నన్నేసాబ్ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం కుమారులే తండ్రిని చంపారని విచారణలో తేలింది. పరారీలో ఉన్న నన్నేసాహెబ్ పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, చిన్న కుమారుడు జునైద్, జునైద్ స్నేహితుడు రీహన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్తిలో తమ వాటా ఇవ్వకుండా తండ్రి అలసత్వం వహిస్తున్నాడన్న అనుమానంతో మానసికంగా కుంగి నిందితులు తండ్రి హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే ముగ్గరు కలిసి గత నెల 30వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న నన్నేసాబ్ను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడు నన్నేసాబ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, పీడిబాకు, సెల్ఫోన్ను స్వాదినం చేసుకుని నిందితుల్ని రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు. -
వైభవంగా సుశమీంద్ర తీర్థుల ఆరాధన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ జయంతి ఆరాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా డోలోత్సవ మండపంలో జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. వేడుకల్లో భాగంగా సుశమీంద్ర తీర్థులు మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీసుశమీంద్ర తీర్థుల బృందావనానికి పంచామృతాభిషేకాలు, మంగళహారతులు చేపట్టారు. అనంతరం శ్రీ సుశమీంద్ర తీర్ధులు చిత్రపటానికి పుష్పార్చన, దీపారాధన చేశారు. ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మట్లాడుతూ.. శ్రీరాఘవేంద్రస్వామి మఠం గురువులు పూర్వపీఠాధిపతి శ్రీ సుశమీంద్ర తీర్థుల సేవలు మరవరానివి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, మంత్రాలయం మఠం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. అన్నదాన కోసం రెండు లక్షల విరాళం: ప్రముఖ పుణ్యక్షేత్రంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కోసం ఆదోనికి చెందిన మీనప్ప కుటుంబ సభ్యులు రెండు లక్షలు రూపాయలు అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు.అనంతరం ఆ కుటుంబ సభ్యులకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలతో శ్రీరాఘవేంద్రల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. -
వైభవంగా శ్రీవారి రథోత్సవం
క్రిష్ణదొడ్డిలో జనసందోహం మధ్య సాగుతున్న శ్రీ వారి రథోత్సవం సి బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో కొండపై వెలసిన శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా సాగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామికి భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజార్లు గణపతి పూజ, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభం ప్రారంభించారు. కుంభం కాగు రథం దగ్గరకు చేరుకోగా శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు మహారథోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. పార్వేటకు బయలుదేరిన స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పూజార్లు వేంకటేశ్వర స్వామికి పార్వేట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను అశ్వ, గజారోహణం తదనంతరం పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. శనివారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్!
పాణ్యం: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. గోరుకల్లు గ్రామంలో శుక్రవారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తన రాజకీయ అనుభవంలో ఇంతలా టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడటం చూడలేదన్నారు. యూరియా, మద్యం, ఇసుక, ఇతర అభివృద్ధి పనుల్లో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకే పనులు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు అధికారులు ప్రజల వినతులను కూడా స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయించి సామాన్య ప్రజలను సైతం వేధిస్తున్నారన్నారు. మహిళలపై టీడీపీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న లైంగిక దాడులపై కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాజధాని పేరుతో రేట్లు పెంచి దోచుకుంటున్నారన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వస్తాయని కాటసాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోవడంపై వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రేగటి పెద్దస్వామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. పెద్దస్వామి దర్గాలలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జింకల సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ఉసేన్సా, వెంకటరామిరెడ్డి, లక్ష్మీమద్దయ్య తదితరులు పాల్గొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదు ప్రజల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తాం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
నాసరరెడ్డి సేవలు ఆదర్శం
● జెడ్పీ సీఈఓను సన్మానించిన అధికారులు, ఎంపీడీఓలుకర్నూలు(అర్బన్): తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మన్ననలను పొందిన జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి అందరికీ ఆదర్శమని పులువురు కొనియాడారు. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ డీఎస్జీఎస్డబ్ల్యూఓగా అనంతపురానికి పదోన్నతిపై వెళ్తున్న జి. నాసరరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి భాస్కర్, ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీఓ, జెడ్పీ ఏఓ, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ఎంపీడీఓలు జ్యోతి, దస్తగిరిబాబు, దశరథరామయ్య మాట్లాడుతూ నెలలుగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను కూడా తక్కువ సమయంలోనే సులభంగా పరిష్కరించారని తమ అనుభవాలను వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్లో ఎప్పుడు జెడ్పీలో జాప్యం జరగలేదన్నారు. నాసరరెడ్డిని మార్గదర్శకంగా తీసుకొని విధులు నిర్వహిస్తామని పలువురు ఎంపీడీఓలు భావోద్వేగంతో అన్నారు. -
దొంగ అరెస్ట్
● రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి నగదు స్వాధీనం నంద్యాల: జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ వివరాలు వెల్లడించారు. నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్సార్నగర్కు చెందిన షేక్ బాబావలీ నంద్యాల తాలూకా, బండిఆత్మకూరు, రేవనూరు, సంజామల, గడివేముల, బేతంచెర్ల, అవుకు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శుక్రవారం నందమూరి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్లేని బైక్పై వస్తున్న బాబావలీ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 98 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.54,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ సురేష్ కుమార్తోపాటు నంద్యాల తాలూకా సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ మందాజావళి, ఎస్పీ అభినందించారు.దొంగ అరెస్ట్ చూపుతున్న ఎస్పీ సునీల్ షెరాన్స్వాధీనం చేసుకున్న పోలీసులు -
జూనియర్ సివిల్ జడ్జిగా మహమ్మద్ ఆజం
కర్నూలు: కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ ఆజం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి అల్లాబకాష్ కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి షేకున్బీ గృహిణి. మహమ్మద్ ఆజం ప్రాథమిక విద్య కర్నూలులో, పెండేకంటి లా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్డీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆజాం మాట్లాడుతూ.. జ్యుడీషియల్ పరీక్షలు రాయాలంటే కృషి, పట్టుదల ప్రధానమని, తల్లిదండ్రులు, చిన్నమ్మ, చిన్నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆజాంకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్జి ఉద్యోగం సాధించిన రాచర్ల యువకుడు ప్యాపిలి: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని ఎందరో నిరూపిస్తున్నారు. ఇదే కోవలో రాచర్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రామచంద్రారెడ్డి, విజయలక్ష్మిల కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాచర్లలోనే పదో తరగతి, హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. పంజాబ్లోని నేషనల్ లా యూనివర్సిటీలో 2024లో బీఏఎల్ఎల్బీ హానర్స్ పూర్తి చేసి 2025 జనవరిలో జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకుని ప్రణాళికతో చదివారు. 2025 జూలైలో ప్రిలీమ్స్, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు రాసి, 2026 మార్చిలో ఇంటర్వ్యూలో ప్రతిభ చాటారు. ఏప్రిల్ 2 వ తేదీ విడుదలైన సెలెక్షన్ జాబితాలో 250 మార్కులకు గాను 175.75 మార్కులు సాధించి జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి మేనమామ కంబిరెడ్డి స్ఫూర్తితో చదివినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జడ్జిగా ఎంపిక కావడం వెనుక తల్లిదండ్రుల పోత్సాహంతో పాటు మేనమామ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంపై రాచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉన్నప్పటికీ స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పాఠశాలకు పిలిపించి విద్యాబోధన అందిస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పడడంతో అరవింద్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలను పర్యవేక్షించి వాటిని సరి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి... ఆదోనిలో నిబంధనలకు విరుద్ధంగా చదువులు కొనసాగించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పైకప్పు పెచ్చులూడి గాయాలపాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు సంజయ్, శశిధర్ పరామర్శించారు. -
విండ్ పవర్లో టీడీపీ నాయకుడి పెత్తనం
● వాహనాల యజమానుల నుంచి కమీషన్లు ● తాజాగా సెక్యూరిటీ సూపర్వైజర్పై దాడి సాక్షి టాస్క్ఫోర్స్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు రెచ్చిపోతున్నారు. ఏమి చేసినా తమను అడిగేవారు లేరంటూ హద్దుమీరి ప్రవరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొద్ది రోజులుగా విండ్ పవర్లో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నాయకుడు తాజాగా సెక్యూరిటీ సూసర్వైజర్పై దాడికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం యర్రగుడి సమీపంలోని కొండల్లో ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ విండ్ వపర్ (గాలిమరలు) ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలో ఎవరైనా వాహనాలు, జేసీబీలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ వారి నుంచి నెలకు కొంత మొత్తాన్ని కమీషన్గా ఇవ్వా లని వాహనాల యజమానులను బెదిరిస్తూ వచ్చాడు. అలాగే అక్కడ పని చేస్తున్న కొందరిని మచ్చిక చేసుకు ని హవా నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీన యర్రగుడి సమీపంలో విండ్పవర్ వద్ద సెక్యూరిటీ సూసర్వైజర్ శ్రీనివాస యాదవ్పై రాజగోపాల్ దాడి చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విండ్ పవర్ సంస్థకు యాక్ట్వ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సంస్థ 84 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. అయితే ఏజెన్సీ నుంచి వచ్చే వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా మధ్యవర్తులు కోత విధిస్తున్నారంటూ వైఎస్సార్ కడప జిల్లా వద్దిరాలకు చెందిన సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసయాదవ్ సంస్థలోని ప్రతినిధులను ప్రశ్నిస్తూ వచ్చాడు. గార్డులు సైతం ఈ విషయంలో మద్దతు పలికారు. అందరూ సంతకాలు చేయడంతో కొద్ది రోజుల క్రితం జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దాడి చేసి.. వేటు వేసి! వేతనాల విషయంలో గార్డుల కడుపుకొడుతున్నారని శ్రీనివాస యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే తరచూ ప్రశ్నిస్తునందుకు అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో ఏజెన్సీకి చెందిన కొంత మంది ప్రతినిధులు శ్రీనివాస యాదవ్ను తెలంగాణ రాష్ట్రం నల్గొండకు బదిలీ చేయడంతో వెళ్లేదిలేదని భీష్మించాడు. అయితే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం అతను సైట్లోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు రాజగోపాల్ సంబంధం లేక పోయినా ఐదారుగురిని వెంట తీసుకెళ్లి శ్రీనివాస యాదవ్ను దుర్బాషలాడి దాడికి దిగాడు. గార్డులు అడ్డుపడి కాపాడారు. చివరకు గార్డుల వేతనాల వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. ఏజెన్సీ ప్రతినిధులు, సెక్యూరిటీ సూపర్వైజర్తో మంతనాలు చేపట్టారు. చివరకు అతనికి చెందిన బకాయిలన్నీ ఇచ్చి, నల్గొండకు వెళ్లేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
బోరుకు తాళం తొలగింపు
పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంప్నకు ఓ వ్యక్తి వేసిన తాళాన్ని పోలీసులు తొలగించారు. ‘చేతి పంప్ బోర్కు తాళం’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర స్పందించారు. శుక్రవారం సిబ్బందితో ఎస్ఐ వెళ్లి వివరాలు తెలుసుకుని తాళాన్ని తొలగించారు. కాగా బోరు వద్ద బండలు పగిలిపోవడం వలన తాళం వేసినట్లు సమీపంలో నివాసముంటున్న వేణు భార్య రాజమ్మ పోలీసుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇదే బోరుకు ప్రత్యేక మోటార్ అమర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయగా ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకున్నారు. దళితుల ఆత్మ గౌరవంపై దాడి కోవెలకుంట్ల: నర్సీపట్నంలో డప్పుకొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం వారి ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్ విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార దర్పంతో దళితులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో దళిత భాస్కర్రావును స్పీకర్ దుర్భాషలాడి దాడి చేసిన తీరు మరింత ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయన్నారు. అధికార మదంతో ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల గౌరవాన్ని కించపరిచేలా చోటు చేసుకున్న ఘటనకు బాధ్యత వహించి స్పీకర్ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత సమాజం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడతామని హెచ్చరించారు. మూడు గడివాములు దగ్ధం కల్లూరు: దొడ్డిపాడు గ్రామంలో శుక్రవారం మూడు గడివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చిన్న చాంద్ బాషా పశువుల మేత కోసం రెండు వేరుశనగ, ఒక సొప్ప వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తూ గడివాములకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. హమాలీల కూలి రేట్లు పెంచాలి కర్నూలు(సెంట్రల్): సివిల్ సప్లై హమాలీల కూలి రేట్లను పెంచాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాలని కోరుతూ రెండో రోజు కర్నూలు ఎంఎల్ఎస్ పాయింట్లో హమాలీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ హాజరై మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త కూలి రేట్లను పెంచకుండా కాలయాపన చేస్తోందన్నారు. జీతాలను పాత పద్ధతిలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ఒక వ్యక్తి అకౌంట్లో వేసి ఇవ్వడం సరికాదన్నారు. అంతేకాక ఫేషియల్ యాప్ నుంచి హమాలీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని కోరారు. రిటైర్ అయిన హమాలీకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి సోలోమన్ రాజు, బజారి, శివ, బాలరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, రాజేష్ పాల్గొన్నారు. -
సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంక్షేమ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరు తగిన స్థాయిలో ఉన్నప్పటికీ, బీసీ వెల్ఫేర్ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నా రు. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్ర కారం నాణ్యమైన ఆహారం అందుతుందో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి హాస్టల్లో మెనూ వివరాలతో పెద్ద హోర్డింగ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పేద విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, తాగునీరు, పారిశుద్ధం, ఆహార నాణ్య త, వార్డెన్ అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయా లన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ అధి కారి చింతామణి, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
పడిపోయిన టమాట ధర
పెద్దకడబూరు: టమాట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో మూడుకిలలో ధర రూ.4 పలుకుతోంది. దీంతో పెద్దకడబూరులోని సోమన్నాచారి అనే రైతు తన రెండు ఎకరాల్లో టమాట కాయలను తెంపకుండా అలాగే వదిలేశారు. రెండు ఎకరాల్లో టమాటాను రూ.1.50లక్షల ఖర్చుపెట్టి సాగు చేశానని, మొక్కలకు పందిరి వేసినా దిగుబడికి ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కిలోకు రూ. 2 ధర కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. రహదారులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి కృష్ణగిరి: రహదారులు బాగుండి, రవాణా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమారి అన్నారు. వెల్దుర్తి క్రాస్ నుంచి టి.గోకులపాడు, తొగర్చేడు గ్రామాలకు ఇటీవల నాబార్డు నిధులతో వేసిన బీటీ రహదారులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. టి.గోకులపాడు గ్రామ సమీపాన హంద్రీపై బ్రిడ్జి, కటారుకొండ క్రాస్ రహదారి నుంచి పులిచెర్లకు బీటీ రహదారికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఈమె వెంట పీఆర్ ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈ శేషయ్య, క్వాలిటీ కంట్రోల్ డీఈఽ దనిబాబు, మండల పీఆర్ ఏఈ జాకీర్హుసేన్ ఉన్నారు. తుంగభద్ర నుంచిఎల్లెల్సీకి నీటి విడుదల హొళగుంద: వేసవిలో ప్రజల గొంతులు తడిపేందుకు తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. డ్యాం నుంచి పవర్ కెనాల్కు విడుదలైన 1,500 క్యూసెక్కులు నీరు గుండ్లకెరె (చెరువు)కు చేరి అక్కడ నుంచి ఎల్లెల్సీకి విడుదలవుతున్నాయి. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో ఆంధ్ర (250 కి.మీ)కు చేరనున్నాయి. దాదాపు 15 రోజుల పాటు నీటిని వదిలి మళ్లీ ఈ నెల 18 లేదంటే 20వ తేదీకి నిలిపివేయనున్నారు. టీబీ డ్యాం పూర్తి స్థామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.121 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయి. రానున్న 4 రోజులు భానుడి భగభగలే! కర్నూలు(అగ్రికల్చర్): రానున్న నాలుగు రోజులు జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ వరకు పొడి వాతావరణం( డ్రై వెదర్) ఉంటుందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా రుద్రవరంలో 40.4 డిగ్రీలు, ఉయ్యాలవాడలో 40.3, కోవెలకుంట్లలో 40.3 డిగ్రీలు, కౌతాళంలో 40 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
టీడీపీ కార్యాలయానికి మార్కెట్ యార్డు భూమినా?
నంద్యాల: పట్టణ నడిబొడ్డున ఉన్న రూ. కోట్ల విలువ చేసే రెండెకరాల మార్కెట్ యార్డు భూమిని టీడీపీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి 33 ఏళ్ల పాటు తక్కువ ధరకు లీజుకు కేటాయించి రైతుల పొట్టకొడుతున్నారన్నారు. రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డ్ భూమిని తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి ఇవ్వడం దారుణమన్నారు. ఎకరాకు కేవలం ఏడాదికి రూ. వెయ్యికే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని 33 ఏళ్ల పాటు అప్పనంగా అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నంద్యాలలో టీడీపీ నేతల భూదాహంతో మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా వదలడం లేదన్నారు. ఎకరాకు వెయ్యి రూపాయల లీజు అంటే అది ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడం కాదా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై రైతుల తరుఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వివాదా స్పద నిర్ణయాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రెండేళ్లు గడిచినా నంద్యాలలో అభివృద్ధి శూన్యమని, కేవలం సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. పట్టణ నడిబోడ్డున ఉన్న రెండెకరాలకు ఏడాదికి రూ.2 వేలకే లీజుకిస్తారా అధికార దాహానికి అడ్డూ అదుపు లేదా? మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డి -
నిబంధనలకు పాతర.. మందు జాతర!
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో మద్యం విక్ర యాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎకై ్సజ్ పోలీసుల జాడ లేదు. జాతరలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఒకరి పేరున లైసెన్స్ పొంది.. మరొకరు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోవటం లేదు. తర్తూరు గ్రామానికి చెందిన కమాల్బాషా పేరున జాతరలో ఈనెల 2 నుంచి 5 వరకు మద్యం విక్రయించేందుకు ఎకై ్సజ్, ప్రొహిబిషన్ జిల్లా అధికారులు ఈవెంట్ పర్మిషన్ ఇచ్చారు. సదరులైసెన్స్ దారుడు కర్నూల్లోని ఐఎంఎఫ్ఎల్ పాయింట్ వద్ద 12 శాతం రుసుం అధికంగా చెల్లించి మద్యం కొనుగోలు చేసి జాతరలో విక్రయించుకోవాలని ఎక్సైజ్శాఖ అధికారులు ఆదేశించారు. ఈ రుసుం చెల్లించకుండా జూపాడుబంగ్లాలోని మద్యం దుకా ణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వార్టర్ మద్యం సీసాపై రూ.20లు అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నా సివిల్ పోసులు సైతం కన్నెత్తిచూడటం లేదనే విమర్శలున్నాయి. కేసులు నమోదు చేస్తాం తర్తూరు జాతరలో నిర్వహిస్తున్న ఈవెంట్ మద్యం దుకాణంలో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన మద్యం కాకుండా అక్రమ మద్యం విక్రయిస్తే దుకాణం సీజ్చేసి లైసెన్స్దారునిపై కేసు నమోదు చేస్తామని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ స్క్వాడ్ సీఐ సుభాషిణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె తర్తూరు జాతరలోని మద్యం దుకాణాన్ని తనిఖీ చేశారు. -
మాస్టర్స్ క్రీడల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు
కర్నూలు: మాస్టర్స్ క్రీడల్లో జిల్లా పోలీసు శాఖకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత నెల 30, 31వ తేదీల్లో 35 – 45 సంవత్సరాల వయస్సు విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాప్(ఎస్ఏపీ) లీగ్ మాస్టర్స్ క్రీడలలో జిల్లా పోలీసు శాఖకు చెందిన ఆర్ఎస్ఐ మహేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్లు పాల్గొని పథకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన వీరు గురువారం జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ మెడల్స్, శాలువాతో సన్మానించి అభినందించారు. ఆర్ఎస్ఐ మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం సాధించారు. అలాగే ట్రాఫిక్ పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ లాంగ్జంప్లో కాంస్య పతకం సాధించారు. కార్యక్రమంలో ఆర్ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ బంద్ కొనసాగింపు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవల బంద్ కొనసాగుతోంది. బకాయిల వసూలుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నెల ఒకటో తేది నుంచి సమ్మె చేస్తున్నాయి. గురువారం సైతం మెజారిటీ ఆసుపత్రులు బంద్ పాటించాయి. జిల్లా మొత్తం 60 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా గురువారం సైతం సగానికి పైగా ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని బోర్డు ఏర్పాటు చేశారు. వైద్యసేవ సేవలు కొనసాగిస్తున్న ఆసుపత్రుల్లోనూ కొన్నింటిలో అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్న ఆసుపత్రులకు రోగులు వెళ్లాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో హైకోర్టు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆర్ఆర్బీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు కర్నూలు(అర్బన్): ఆర్ఆర్బీ గ్రూపు–డీ పోస్టుల ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేది వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్ఎస్సీలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా వచ్చి అందించాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణ 60 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ అందిస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన వారికి స్టైఫండ్ మంజూరవుతుందన్నారు. వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. వేరుశనగ ధర పతనం కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్ వర్షన్ మారడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ–నామ్ సెకండ్ వర్షన్తో అనేక సమస్యలు ఏర్పడటంతో వ్యవసాయ ఉత్పత్తులను గతంలో ఉన్న పాత పద్ధతి ద్వారా(మాన్యువల్) క్రయవిక్రయాలు చేపట్టారు. వ్యాపారులు సిండికేట్గా మారి వేరుశనగ ధరను అడ్డంగా కోసేశారు. ఇటీవల క్వింటా ధర రూ.12,500 వరకు వెళ్లిన వేరుశనగ ధర నేడు నేల ను తాకింది. మార్కెట్కు 2260 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. కనిష్ట ధర రూ.3,412, గరిష్ట ధర రూ.7909 లభించగా.. సగటు ధర రూ.6,077 నమోదైంది. ● కందులకు కనిష్ట ధర రూ.2,690, గరిష్ట ధర రూ.7,709 లభించగా.. సగటు ధర రూ.7,070 మాత్రమే పలికింది. ● శనగలకు కనిష్ట ధర రూ.3,069 లభించగా.. గరిష్ట ధర రూ.5290 పలికింది. సగటు ధర రూ.4759 నమోదైంది. -
దేవుడి భూమిని తవ్వేస్తున్నారు!
● ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మకం ● టీడీపీ నాయకుల బరి తెగింపు నంద్యాల: టీడీపీ నాయకుల బరితెగింపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధనార్జనేధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. డబ్బుల కోసం దేవుడి భూములను కూడా వదలడం లేదు. గోస్పాడు మండలం జూనేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన భూమిలో యథేచ్ఛగా మట్టి తవ్వి అమ్మేస్తున్నారు. ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు పెట్టి భూమిని తవ్వి ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు. ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తూ.. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు 23 ఎకరాలు ఇచ్చారు. అనాదిగా ఈ భూములకు వేలం పాటలు వేస్తూ వచ్చిన డబ్బులతో ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 23 ఎకరాల్లోని 7.50 ఎకరాల్లో ఉన్న మట్టిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఈ భూమిలోనే మట్టిని అమ్మేస్తే రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చని ఆలోచించారు. దేవుడి మాన్యం అని కూడా చూడకుండా వెంటనే పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లు ఎక్కి ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు. గ్రామస్తులు అడిగితే గ్రామ, దేవాలయ అభివృద్ధి కోసం మట్టిని అమ్ముతున్నామని చెబుతున్నారు. దేవస్థానం అధికారులు మట్టిని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పి మరీ మట్టిని తవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాతలు శివాలయం అభివృద్ధి చెందాలని ఆలయ నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భూమి ఇస్తే ఆ భూమిని తవ్వి డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన టీడీపీ నాయకులకు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలేపల్లె గ్రామంలో మట్టిని తవ్వుతున్నారన్న విషయం మాకు తెలియదు. ఓ ట్రాక్టర్ మట్టి అమ్మినా చర్యలు తీసుకుంటామని అక్కడ అర్చకుడికి తెలియజేశాం. దేవస్థానం భూమిని తవ్వి మట్టిని అమ్ముకోవడానికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దేవస్థానం అధికారుల పేరు చెప్పి మట్టిని అమ్ముకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – మోహన్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, నంద్యాల -
ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గత నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై గురువారం ముగిశాయి. చివరి రోజు జిల్లాలో మొత్తం 2,4701 మంది విద్యార్థులకు గాను 24,412 మంది పరీక్షలకు హాజరు కాగా 289 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది అంతా కష్టపడి చదివి తొలి సారి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష ముగియగానే విద్యార్థులు సంతోషంగా వారి స్వగ్రామాలకు బయల్దేరి వెళ్లారు. చేతి పంపునకు తాళం పగిడ్యాల: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన చేతి పంపునకు తాళం వేసిన ఉదంతం తూర్పుప్రాతకోట గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంపు నీటిని పట్టుకోవడానికి స్థానికులు వస్తుండేవారు. అయితే బోరుకు తాళం వేయడంతో ప్రజలు నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి పడమర ప్రాతకోటలోని వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి క్యాన్ రూ.50కు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి చేతి పంప్కు వేసిన తాళాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమిత్రమ్మను అడుగగా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలిసెట్ దరఖాస్తుకు 9 వరకు గడువు నంద్యాల(న్యూటౌన్): పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 9వ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. 4వ తేదీ వరకు గడువు ఇచ్చిన అధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 9 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా జీవీ రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈఓగా విధులు నిర్వహించిన జి.నాసరరెడ్డిని అనంతపురం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమించారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని సీఈఓగా నియమిస్తూ పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఈఓని డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులవాణి, కర్నూలు డీఎల్పీఓ టి.లక్ష్మి, జెడ్పీ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రథమ స్థానం కర్నూలు(అర్బన్): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవా లు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాలు లక్ష్యం కాగా 7,982 ప్రసవాలను నిర్వహించారన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5,881 కాగా, సిజేరియన్ 2,101 కాన్పులు ఉన్నాయన్నారు. 30 శాతానికి మించి సిజేరియన్ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్ కాన్పులు చేసి, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేశారన్నారు. ఎంసీహెచ్ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్ సీహెచ్సీల్లో ఈ ప్రసవాలు జరిగాయన్నారు. -
సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్గోస్పాడు: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని డాక్టర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం నంద్యాల పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తుంటారని, వారికి సరైన చికిత్సను సకాలంలో అందించాలన్నారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్పేషెంట్ (ఓపీ), రిజిస్ట్రేషన్ బ్లాక్, మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న చికిత్స, వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందే విధంగా చూడాలన్నారు. ఆసుపత్రులలోని వార్డులలో ఆయా విభాగాల అధిపతులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. -
ప్రయాణం.. ‘పది’ంతల నరకం
పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. ఆనందంగా ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోగా అక్కడి పరిస్థితిని చూసి నివ్వెరపోయారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు, మరోవైపు పల్లెల్లో బంధువుల వివాహాలకు వెళ్లే ప్రయాణికులు, ఇంకోవైపు ఊర్లలో జాతర్లకు వెళ్లే బంధువులతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోతుండటంతో రెండు మూడు గంటలపాటు వేచి చూసిన ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఇలాగైతే ఇళ్లకు చేరుకోలేమనుకొని వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతూ కిటికీల్లోంచి దూరడం, వస్తువులను సీట్లలో పెట్టడం చేస్తూ పలు అగచాట్లు పడ్డారు. ఎలాగోలా సీట్లు పట్టుకున్న వారు కూర్చొని ప్రయాణించగా మిగతావారు కిక్కిరిసిన బస్సులో ఉక్కపోతతో అల్లాడుతూ అలాగే ప్రయాణించారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కర్నూలు బస్టాండు నుంచి పదో తరగతి పరీక్షలు ముగిసిన వేళ అదనపు బస్సులు కల్పించలేరా? అంటూ ప్రయాణికులు నిట్టూర్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుపాపను కీటికీ నుంచి సీట్లోకి తోసేద్దాం.. -
జీసస్ అక్షరాలతో యేసు చిత్రం
నంద్యాల(వ్యవసాయం): పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు గుడ్ఫ్రైడే పురస్కరించుకొని జీసెస్ అక్షరాలతో మైక్రో ఆర్ట్ చిత్రాన్ని గురువారం చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. జీసెస్ పేరులోని అక్షరాలతో చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. వైద్యుడికి చార్జ్ మెమో చాగలమర్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఇమ్రాన్కు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చార్జి మెమో జారీ అయినట్లు వైద్యాధికారిణి అంజలి తెలిపారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆరోగ్యశ్రీ, జేఎస్ఎస్కే తదితర పథకాల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తోటి వైద్యులు, సిబ్బందితో పాలనాపరమైన సమన్వయం పాటించడంలో విఫలమయ్యారని అభియోగాలు నమోదయ్యాయి. దీనివల్ల పీహెచ్సీ పనితీరుకు ఆటంకం కలిగిందని మెమోలో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించినట్లు డాక్టర్ అంజలి వివరించారు. -
ఏకపక్షంగా మున్సిపల్ వేలం పాటలు
● ఇతరులు పాల్గొనకుండా టీడీపీ నేతల బెదిరింపులు ● మున్సిపల్ ఆదాయానికి గండిడోన్: అధికార టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల లోపాయకారి ఒప్పందం వల్ల గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు కాస్తా నాలుగు గోడల మధ్య జరగడంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొని అతి తక్కువ ధరకే హక్కులను దక్కించుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ ఎడాది వారపు సంత రూ.3,38,000, దినసరి మార్కెట్ రూ.8,25,000, మాంసం దుకాణాలు రూ.2,28,000, బస్టాండ్ రూ.7,65,000లకు అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. అంతకు ముందు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన కొండపేటకు చెందిన వ్యక్తులను అధికార పార్టీ నేతలను బెదిరించడంతో వారు వేలం పాటలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. కేవలం నలుగురు టీడీపీ నేతలు వేలంలో పాల్గొని గతేడాది కంటే రూ.2,56,000 హెచ్చు పాడి హక్కులు దక్కించుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా రూ.19 లక్షలు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.21,56,000 పలికినట్లు అధికారులు వెల్లడించారు. సరైన ప్రచారం చేసి ఉంటే వేలం పాటలో పాల్గొనేందుకు అధిక మంది వచ్చి ఉండేవారని ఇలా గుట్టుచప్పుడు గాకుండా వేలం నిర్వహించడంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
దొంగ మస్టర్లతో నిధుల మేత!
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26లో దొంగ మస్టర్లలో లక్ష్యాన్ని సాధించామనిపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలే నియమితులయ్యారు. టీడీపీ నేతలకు భారీగా ముడుపులు ఇచ్చుకొని ఏపీఓలు, ఈసీలు ఆదాయం బాగా ఉన్న మండలాలకు పోస్టింగ్లు తెచ్చుకున్నారు. వెరసి 2025–26లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పనులకు 10 మంది వస్తే వంద మంది హాజరైనట్లు మస్టర్లు వేసి నిధులు కొల్లగొట్టారు. 2025–26లో కర్నూలు జిల్లాలో 58 లక్షలు, నంద్యాల జిల్లాలో 58 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 64,87,635, నంద్యాల జిల్లాలో 61,37,869 పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దొంగ మస్టర్లు వేసి ఫీల్డ్ అసిస్టెంటు మొదలుకొని ఏపీఓల వరకు నిధులు కొల్లగొట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,26,25,504 పనిదినాలు కల్పించినట్లు లెక్కలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. నిజంగా ఈ పనిదినాలు కల్పించి ఉంటే వంద రోజుల పని దినాలను వినియోగించుకున్న కుటుంబాలు భారీగా ఉండాలి. కర్నూలు జిల్లాలో 3702 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 4550 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. అలాగే పల్లె పండుగ కింద చేపట్టిన షెడ్లకు స్పందన కరువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1400 చొప్పున పశువుల షెడ్లు నిర్మించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 561, నంద్యాల జిల్లాలో 257 పశువుల షెడ్లు మాత్రమే నిర్మించారు. కర్నూలు జిల్లాలో ఫాంఫాండ్స్ 4 వేలు నిర్మించాలనేది లక్ష్యం కాగా 488, నంద్యాల జిల్లాలో 2 వేలు లక్ష్యం కాగా కేవలం ఐదు మాత్రమే నిర్మించడం గమనార్హం. తుగ్గలి మండలంలో ఉపాధి పనులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మండలంలో సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఏపీఓ టీడీపీ నేతలకు పెద్దఎత్తున ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్ పొందారనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు దొంగ మస్టర్లు ఎన్నైనా వేసుకోండి మాకు మాత్రం వారం.. వారం ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని రేటు పెట్టినట్లు తెలుస్తోంది. తుగ్గలి, కౌతాళం, ఆదోని, కొసిగి, సి.బెళగల్, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల తదితర మండలాల్లో దొంగ మస్టర్లదే పైచేయి కావడం గమనార్హం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసి కొత్తగా వీబీ జీ రామ్జీ అమల్లోకి వస్తుండటంతో నిధుల స్వాహాపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. ఉపాధిలో 2025–26లో సాధించిన ప్రగతి ఇదే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించినట్లు లెక్కలు -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుండంపాడుకు చెందిన గాలి ప్రవీణ్కుమార్ (25) మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాలు.. ప్రవీణ్కుమార్ నంద్యాలలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి యర్రగుంట్లకు చెందిన అనుష్కతో గతేడాది వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఈ నెల 1వ తేదీన రాత్రి ప్రవీణ్కుమార్ నంద్యాల నుంచి బైక్పై బయలుదేరాడు. నంద్యాల డిపోకు చెందిన బస్సు మరమ్మతులు చేయించుకొని సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో బైక్పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జోజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 9న రైతు సంబరాలు శిరివెళ్ల: కాలేషా మస్తాన్ వలి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన యర్రగుంట్లలో రాష్ట్రస్థాయి రైతు సంబరాలు (ఎద్దుల పందేలు) నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకుడు శంకర్ గురువారం తెలిపారు. ఒంగోలు జాతి సీనియర్ విభాగంలో రాతి దూళం లాగే పందెంలో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు మొదటి బహుమతి రూ.70 వేలు తరువాతి స్థానాలకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే 8వ తేదీన గాడిదల పందేలు జరుగుతాయన్నారు. గెలుపొందిన గాడిదల యజమానులకు మొదటి బహుమతి రూ.10 వేలు, తరువాతి స్థానాలకు రూ.6 వేలు, రూ.3 వేలు అందించనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి: స్థానిక రాణితోటకు చెందిన ఎరుకల జయంత్ (9) కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతూ కొలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేశ్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు,కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు జయంత్ స్థానిక శర్మాస్ యూపీ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 31న జ్వరం, వాంతులతో స్థానిక సీహెచ్సీలో చేరాడు. ఈ నెల 1న కడుపునొప్పి, ముఖం వాపు తీవ్రం కావడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బస్సు దిగుతూ మృత్యువాత దొర్నిపాడు: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగుతూ దొర్నిపాడుకు చెందిన సాలయ్య (60) గురువారం మృతి చెందాడు. ఆయన ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఆళ్లగడ్డ చేరుకున్నారు.బస్టాండులో బస్సు దిగుతూ కిందపడిపోయారు. అక్కడున్న వారు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తండ్రీకుమారుడి అరెస్ట్ ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని కోటేకల్ పంచాయతీ పరిధిలోని నాగలాపురంలో భారతి (29) ఆత్మహత్య కేసులో భర్త నాగరాజు, మామ చిన్నబసప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. భారతిని భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండటంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. -
వంకాయ రైతు విలవిల
● 30 కిలోల బస్తా రూ.50 కూడా పలకని వైనం ● రోడ్డుపక్కన పారబోస్తున్న రైతులు దేవనకొండ: ఘుమఘుమలాడే గుత్తి వంకాయను చూస్తే ఎవరికై నా నోరూరుతుంది. అయితే అదే వంకాయ ఇప్పుడు రైతులకు గుదిబండగా మారింది. సరైన గిట్టుబాటు లేక, మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు రాకపోవడంతో వంకాయ సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను అలాగే వదిలేస్తే పాడవుతుందని మున్ముందు అయినా రేటు పెరగకపోతుందా? అనే ఆశతో కూలీలచే వంకాయలు తెంపి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. వంకాయకు ధర లేకపోవడంతో సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో 30 కిలోల బస్తా రూ.40 నుంచి రూ.50 కూడా పలకడం లేదు. అయితే వ్యాపారులు మాత్రం ప్రజలకు కిలో రూ.30 నుంచి రూ.40కు అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద 30 కిలోల బస్తాను రూ.50కి కూడా వ్యాపారులు కొనడం లేదు. దీంతో చాలామంది రైతులు వంకాయలను గొర్రెలకు వదిలేస్తున్నారు. కొద్ది మంది రైతులు మున్ముందు రేటు పెరుగుతుందన్న ఆశతో తోటను కాపాడుకునేందుకు వంకాయలు తెంపి రోడ్డున పారపోస్తున్నారు. -
శ్రీశైలం డ్యాం పరిశీలన
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంను బుధవారం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. డ్యాం వ్యూ పాయింట్ సమావేశ మందిరంలో శ్రీశైలం డ్యాం ఇంజినీర్లతో సేఫ్టీ బృందం సమావేశమైంది. శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజినీర్ కబీర్బాషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీశైలం డ్యాం స్థితి గతులను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో డ్యాం పటిష్టతపై పరిశీలన చేట్టారు. రెండు రోజులపాటు జరిగే పరిశీలనలో డ్యాం పునాదులు, బ్లాక్లు, రేడియల్, స్లూయిస్ గేట్లు, పునాది భాగం ముందున్న సిలిండర్లు, ఫ్ల్లంజ్పూల్ ప్రాంతాల పటిష్టతపై పరిశీలన చేస్తారు. డ్యాంకు ఇరువైపులా ఉన్న కొండగట్ల పటిష్టతకు షార్ట్ క్రీటింగ్ ప్రక్రియలపై తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ధిక రుణం అందజేసే ప్రపంచబ్యాంక్కు అందజేస్తారు. డ్యాంను పరిశీలించిన సేఫ్టీ బృందంలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలవనరుల శాఖ, ఎన్డీఎస్ఏలకు చెందిన నిపుణులు, చైర్మన్ డీకే శర్మ, హైడ్రో మెకానికల్ నిపుణులు గుల్షన్రాజ్, డ్యాం ఎక్స్పర్ట్ టీకే శివరాజన్, భూగర్భ నిపుణులు జేఎం గౌతంతో పాటు డ్యాం ఎస్ఈ బాలచంద్రారెడ్డి, ఇంజినీర్లు ఉన్నారు. -
శ్రీమఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీమఠం ప్రాంగణంలో ఉదయం సంస్కృత విద్యార్థులతో వేద మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతి తైల అభ్యంగణ, కుటుంబ సభ్యులచే హారతి గావించారు. పీఠాధిపతికి శ్రీమఠం సిబ్బంది భక్తిశ్రద్ధలతో గురు వందనం సమర్పించి, పుష్ప వృష్టి, గజమాలతో సన్మానించారు. యాగశాలలో పవిత్ర యజ్ఞహోమాలు చేశారు. శ్రీ మూల రాములకు ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి మహామంగళ హారతి గావించారు. సుజయింద్ర ఆరోగ్య శాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారు. అనంతరం భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేశారు. -
ఈనామ్ కొత్త వెర్షన్తో అవస్థలు
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనామ్ 2.0 కొత్త వెర్షన్ రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులుగా కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త వెర్షన్లో రైతు ఊరు, పేరు, సెల్ నంబర్తో పాటు ఓటీపీ కూడా చెప్పాలనడంతో ఒక్కసారిగా రైతులు, ఏజెంట్లు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఓటీపీ చెప్పవసరం లేదనడంతో వారు వెనుదిరిగారు. కొత్త వెర్షన్లో మంగళవారం సాయంత్రం 5 – 6 గంటల సమయంలో టెండర్ ధర ప్రకటన రావడంతో రైతులు, ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం సాయంత్రం అయినా టెండర్ ధర ప్రకటన రాకపోవడంతో రైతులు యార్డు కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చారని, సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. అయితే రైతులు సాయంత్రం టెండర్ ధర ప్రకటన వస్తే దిగుబడులను కాటా ఎప్పుడు వేసుకోవాలి, తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతి అయినా పెట్టండి లేదా మాన్యువల్గా నిర్వహించాలని కోరారు. పాత పద్ధతి ఈనామ్ డెలీట్ చేసి కొత్త వెర్షన్ తెచ్చినట్లు చెప్పడంతో రైతులు, ఏజెంట్లు మండిపడ్డారు. ఇలాంటి కొత్త వెర్షన్లను అన్ సీజన్లో ప్రయోగం చేయాలే గానీ, సీజన్లో తెచ్చి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఉదయం 8 గంటలకు పల్లెల నుంచి దిగుబడులు వేసుకొస్తే రాత్రి బస్సులు లేక ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్ను వివరణ కోరగా.. కొత్త వెర్షన్ రావడంతో త్వరగా నమోదుకావడం లేదని, ఈనామ్ వారు వచ్చారని, త్వరలో సమస్యను పరిష్కరిస్తారన్నారు. -
హరోం.. హర
ఎమ్మిగనూరురూరల్: పట్ణణంలోని కోసిగి రోడ్డులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. భక్తులు ఉదయాన్నే పాత ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పురుషులు, మహిళలు, బాలికలు పెద్ద ఇనుప కడ్డీలను దవడకు గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. వీపున ఇనుప కొక్కీలను తగిలించుకుని తాడుకట్టి స్వామివారి రథాన్ని లాగారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు తీరుతాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. రథోత్సవం ఆంజనేయస్వామి ఆలయం నుంచి షరాఫ్ బజార్, సోమేశ్వర, శ్రీనివాస సర్కిల్ మీదుగా కోసిగి రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. రథం ముందు భక్తులు నృత్యాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా నీలకంఠప్ప, నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త యూజీ కేశవర్ధన్ చెప్పారు.దవడకు కడ్డీలు గుచ్చుకొని భక్తిభావంకలశాలతో వెళ్తున్న భక్తులు


