breaking news
Nandyal District Latest News
-
గుడ్ల ఉత్పత్తి లేకనే..
గుడ్ల ధర వింటే కనుగుడ్లు తేలేసే పరిస్థితి. గుడ్ల దిగుమతికి తెలంగాణ ప్రధాన ఆధారం. గత వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు భారీగా మరణించాయి. గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ల పెంపకం తగ్గిపోవడంతో మార్కెట్లో సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.96 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. రీటైల్గా ఒక గుడ్డు రూ.10 ప్రకారం విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 50 శాతం కుటుంబాలు రోజు గుడ్లు తింటారని అంచనా. ఒక్కో కుటుంబం సగటున రోజుకు 4 గుడ్లు తిన్నా 30 లక్షల గుడ్లు అవసరం. నేడు ఆ స్థాయిలో గుడ్ల ఉత్పత్తి లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నంద్యాల: ప్రజా పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ప్రతి అర్జీని నిర్లక్ష్యం లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే నాణ్యతతో బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 5,367 అర్జీలు రీఓపెన్ అయ్యాయని, వాటిలో 5,328 పరిష్కారం కాగా ఇంకా 39 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 198 అర్జీలు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామునాయక్, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
227 మంది విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు
నంద్యాల(అర్బన్): జిల్లాలో పదో తరగతిలో 183 మందికి, ఇంటర్మీడియట్లో 44 మందికి.. మొత్తం 227 మందికి షైనింగ్ స్టార్స్ అవార్డులు సోమవారం అందజేశారు. మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.20వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసా పత్రం, గోల్డ్ మెడల్లను అందజేసి ఘనంగా సత్కరించారు. నంద్యాల మండలం చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ... విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా వారి అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్న త విద్యను ఎంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. పరీక్షలకు ముందు తాను ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థినికి మూడు గ్రాముల బంగారు కమ్మలు మంత్రి ఫరూక్ అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, డిప్యూటీ డీఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్గా హనుమంతు బొమ్మలసత్రం: రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్గా హనుమంతు సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షోరాణ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హోంగార్డ్స్ దర్బార్లో సిబ్బంది ఆరోగ్యం, ప్రమాద బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించామన్నారు. పోలీస్ వ్యవస్థలో హోమ్గార్డుల పాత్ర కీలకమైందన్నారు. పీజీఆర్ఎస్కు 157 ఫిర్యాదులు బొమ్మలసత్రం: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 157 ఫిర్యాదులు అందాయి. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సునీల్ షోరాణ్ సూచించారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి భాధితులకు న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో గత 2023లో ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహించారు. ఏడీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో అభ్యర్థులను పిలిచి వారి సర్టిఫికెట్లు పరిశీలించారు. మొత్తం 8 పోస్టులకు అభ్యర్థులను పిలవగా ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, మోల్డ్ టెక్నీషియన్, ప్రోస్టేటిస్ట్, ప్రోస్టోటిక్ టెక్నీషియన్ పోస్టులకు మాత్రం అభ్యర్థులు రావడంతో వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి పంపించారు. మిగిలిన పోస్టులకు, అభ్యర్థులకు మంగళవారం(21వతేది) కూడా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. క్వింటా వేరుశనగ రూ.7,970 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.7,970 పలికింది. మార్కెట్కు 754 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,369, మధ్యస్థ ధర రూ.7,120 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. హొళగుంద: తుంగభద్ర జలాశయం నుంచి ఈ నెల 16న దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు విడుదల చేసిన నీరు సోమవారం మధ్యాహ్నానికి హొళగుంద సెక్షన్ 184 కి.మీ దాటి ముందుకెళ్లాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బళ్లారి, రాయచూరు, కర్నూలు తదితర ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం డ్యాం నుంచి రోజుకు 3,500 క్యూసెక్కుల(ఎల్బీఎంసీ, పవర్ కెనాల్ కాలువలకు) నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలాఉంటే టీబీ డ్యాంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో ఖరీఫ్కు సాగునీటిని విడుదల చేయకుండా తాగునీటి వరకే పరిమితం చేశారు. ప్రస్తుతం డ్యాంలో 26 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది 33 పాత క్రస్టుగేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటుకు ఒక పంట (ఖరీఫ్)కు మాత్రమే నీరిచ్చి రబీకి చేతులెత్తేశారు. ఈ సారి ఖరీఫ్కు కూడా నీరందే పరిస్థితి లేకపోవడంతో ఆయా రాష్ట్రాల రైతులు దిక్కతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం ఎల్లెల్సీకి 1100 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకుండా ప్రణాళికలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ఎల్నినో ప్రభావం కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకుండా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, ప్రణాళిక, బ్యాంకింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక నీటి అవసరం ఉన్న వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుపై సమీక్షించాలాన్నరు. తక్కువ నీటితో సాగయ్యే మినుములు, కందులు, శనగలు వంటి పప్పుధాన్యాలను ప్రోత్సహించాలన్నారు. బహుళ పంటల సాగు, నీటి పొదుపుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పంటలపై ప్రభావం పడితే పశుగ్రాసం కొరత ఏర్పడి పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశముందని దీనిపై పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో నీటి ఎద్దడి ఎదురయ్యే గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భూమిని ఏడాది పొడవునా సాగులో ఉంచే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు రుణాల పునర్వ్యవస్థీకరణ, పంటల బీమా, నష్టపరిహారం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. -
త్వరలో మరో మూత‘బడి’
● మూత దిశగా పులిమద్ది ప్రాథమిక పాఠశాలనంద్యాల(అర్బన్): నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఇలాకాలో మరో ప్రభుత్వ పాఠశాల మూత పడనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసింది. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా అనేక చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల బాగోగుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా నంద్యాల మండలంలో బ్రాహ్మణపల్లె, సుబ్బారెడ్డిపాలెం పాఠశాలలు మూతపడ్డాయి. ఇదే కోవలో పులిమద్ది గ్రామ మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాల చేరనుంది. ఇది సంగతి.. పులిమద్ది గ్రామంలోని మండల ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో 2024–25 విద్యాసంవత్సరంలో 14 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది 13 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు పాఠశాల హెచ్ఎం కృష్ణారావు సెలవులపై వెళ్లడంతో అదే గ్రామంలో ఉన్న మోడల్ ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీగా పని చేస్తున్న విజయభాస్కరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈనెల 2న 14 మంది విద్యార్థుల్లో నిహారిక అనే విద్యార్థికి మాత్రమే హాజరు వేశారు. రికార్డుల్లో ఉన్న 13మంది గైర్హాజరు వేశారు. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ హెచ్ఎం కృష్ణారావు హాజరు శాతాన్ని విచారించకుండా మిడ్డేమిల్స్ యాప్లో 14మంది హాజరైనట్లు నమోదు చేశారు. ఈ విషయం ఎంఈఓ బ్రహ్మంనాయక్ దృష్టికి వెళ్లడంతో ఈనెల 3న పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు కృష్ణారావు, డిప్యూటేషన్పై వచ్చిన విజయభాస్కరరెడ్డిలను సస్పెండ్ చేశారు. అనంతరం మిట్నాల ఎంపీయూపీ పాఠశాల ఉపాధ్యాయుడు అరవింద్కుమార్ను డిప్యూటేషన్పై నియమించారు. విద్యార్థులు ఎవరూ లేకపోయినా ఆయన ఈనెల 6 నుంచి పాఠశాలకు వస్తూ వెళ్తున్నారు. విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయకుండా తమ ఊరిలో పాఠశాలను మూసి వేస్తారేమోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊళ్లకు ఊళ్లు ‘కన్నీళ్లు’
● తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద 30 గ్రామాల ప్రజల నిరసనకర్నూలు(సెంట్రల్): పక్కనే హంద్రీ ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కులు తాగునీటి కోసం విడుదల చేయాలని 30 గ్రామాల ప్రజలు నినదించారు. కల్లూరు, కోడుమూరు మండలాల్లోని వందలాది ప్రజలు తమ గోడు అధికారులకు వినిపించేందుకు సోమవారం ఖాళీ బిందెలతో కలెక్టరేట్కు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు హంద్రీ పరీవాహక పరిరక్షణ కమిటీ కన్వీనర్ శ్రీనివాసగౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్లోని దూసుకెళ్లారు. అయితే వారిని పీజీఆర్ఎస్ వేదిక వైపు వెళ్లకుండా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. అయితే చివరికి బాధిత గ్రామాలకు చెందిన 5 మందిని అధికారులతో కల్పించేందుకు అధికారులు అంగీకరించడంతో ధర్నాను విరమించారు. నిరసనకు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు రత్నం ఏసేపు, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ సూర్యప్రకాష్రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. -
ఇక ‘సాలు’.. ఆపండి!
శ్రీశైలం టెంపుల్: గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు రాతి నిర్మాణంతో సాలు మండపాలు నిర్మించాలనే ప్రతిపాదన వివాదాస్పదమైంది. దేవస్థాన ఈఓ ఆదేశాలతో రూ.19కోట్లతో సాలు మండపాలు నిర్మించాలని ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశంగా ఉంచగా తిరస్కరించారు. దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో మరోసారి ఇదే అంశాన్ని అజెండాగా ఈఓ చేర్చడంతో రెండో సారి కూడా ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. కమిషనర్ విచక్షణాధికారాలతో టెండర్ తాను చెప్పిన విషయం ఈఓతో కావడం లేదని దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నేరుగా రంగంలోకి దిగారు. శ్రీశైలం ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడికి ఫోన్చేసి సాలు మండపాల అజెండాను అమోదించాలని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ధర్మకర్తల తీర్మానాన్ని సైతం లెక్కచేయకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ ధర్మదాయ యాక్ట్ 30/1987 ప్రకారం కమిషనర్ విచక్షణాధికారాలతో ఉత్తర్వులు పంపారు. శ్రీశైల దేవస్థాన ఈఓ సుమారు రూ.19కోట్లతో సాలు మండపాల నిర్మాణానికి టెండర్ పిలిచారు. టెండర్కు మంగళవారం చివరి తేది. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ దేవదాయ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దేవస్థానానికి ట్రస్ట్బోర్డు ఎందుకని సీఎం చంద్రబాబుకు ధర్మకర్తల మండి చైర్మన్ బహిరంగలేఖ రాశారు. నూతన క్యూకాంప్లెక్స్, భక్తుల సౌకర్యాల కాంప్లెక్స్, టాయిలెట్స్ మొదట నిర్మించాలని, ఆ తర్వాత సాలు మండపాలను నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. మల్లన్న సొమ్మును వృథా చేయకూడదనే ఉద్దేశంతో సాలు మండపాలను తిరస్కరించామని లేఖలో పేర్కొన్నారు. సాలు మండపాల నిర్మాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలన్నారు. తెలంగాణకు చెందిన పది మంది అర్చకులు శ్రీశైల దేవస్థానంలోనే విధులు నిర్వహిస్తున్నారని, వారిని తిరిగి తెలంగాణకు పంపాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలోని 10 మందిని ఉద్యోగులగా తిరిగి నియమించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవీ విమర్శలు..సాలు మండపాల నిర్మాణంపై దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావుకు ఉన్న అసక్తి ఏంటనే విషయాలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సాలు మండపాల నిర్మాణ కాంట్రాక్టర్తో ముందే బేరం కుదర్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆమ్యామ్యాలు పుచ్చుకుని అతనికే కాంట్రాక్ట్ వచ్చేలా, సదరు కాంట్రాక్టర్కు ఉన్న అర్హతలతో టెండర్ నిబంధనలు సైతం మార్పులు చేసినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్తో కుదిరిన ఒప్పందంతోనే ఒకసారి ధర్మకర్తల మండలి ఒకసారి తిరస్కరిస్తే, రెండోసారి కూడా అజెండా అంశంగా చేర్చారనే విమర్శలు ఉన్నాయి. కాగా.. కమిషనర్ రామచంద్రమోహన్ను సమర్దిస్తారా లేదంటే చైర్మన్ను గౌరవిస్తారా.. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రూ.19 కోట్లతో సాలు మండపాలు నిర్మించాలని ప్రతిపాదన రెండుసార్లు తిరస్కరించిన ధర్మకర్తల మండలి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన చైర్మన్ టెండర్ల నిర్వహణపై కమిషనర్, ఈఓ ఆసక్తిపై విమర్శలు -
ముగ్గురు పిల్లల్లో ఎవ్వరికీ రాలేదు
మాకు ముగ్గురు పిల్లలు, 2025–26 విద్యా సంవత్సరంలో నఖియా 8వ తరగతి, తెహసీన్ 9వ తరగతి, అయాజ్ అలీ 10వ తరగతి చదివారు. వీరిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం కింద నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం డబ్బులు పడ్డాయి. 300 యూనిట్ల కరెంట్ బిల్లు నింబంధన పేరుతో గతేడాది అనర్హులుగా చూపించారు. మాది ఉమ్మడి కుటుంబానికి చెందినదిగా అధికారులతో ధ్రువీకరించి మళ్లీ దరఖాస్తు చేసుకున్నా పడలేదు. ఈ సంవత్సరమైనా పడతాయో లేదో చూడాలి. – సయ్యద్ ముర్తుజాబీ, పాములపాడు -
కంకులు చెప్పిన సంప్రదాయం
సంస్కృతి, సంప్రదాయాలు.. తరతరాలుగా పెద్దలు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జీవన విధానం. వాటని పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో కొలువైన మూలపెద్ద ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి మొక్కుగా, పక్షులకు ఆహారంగా ఉంటాయని నేటికి రైతులు జొన్నకంకులను కడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ప్రతి ఇంటి ముంగిట ఇలా కంకులను కట్టేవారు. దీంతో రామచిలుకలు, పిట్టలు వచ్చి వాటిని తింటుంటే అందరూ ఆసక్తిగా తిలకించేవారు. ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలు కనిపించడం లేదు. – దొర్నిపాడు -
ముందస్తు ఏర్పాట్లు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్ప టి వరకు ఒక్క కోవిడ్ కేసు నమోదు కాలేదు. ఎవ్వరికై నా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటే ఆసుపత్రిలోని ఓపీ నెం.99లో చికిత్స చేయించుకోవాలి. అవసరమైన వారికి అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి కోవిడ్ను నిర్ధారిస్తారు. ఒకవేళ ఎవ్వరికై నా కోవిడ్ నిర్ధారణ అయితే పరిస్థితి దృష్ట్యా వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడమా లేదా ఇంటి వద్దే ఐసోలేషన్లో ఉంచడమా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. కోవిడ్ కేసులు వచ్చినా అందుకు అవసరమైన ఆక్సిజన్, మందులు, సర్జికల్స్, కిట్లు సిద్ధంగా ఉంచాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
పెళ్లి చేసుకుని మోసం
మద్దికెర: మండల పరిధిలోని బొమ్మనపల్లి సచివాలయం కార్యదర్శి మంజునాథ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని పరారయ్యాడని మండల కేంద్రంలోని సచివాలయం–2లో మహిళా పోలీసుగా పనిచేస్తున్న రాజేశ్వరి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది స్థానిక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలోనే తాము పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. దాదాపు 8 నెలలుగా ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతూ చివరకు పరారయ్యాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించి న్యాయం చేయాలని కోరారు. కామేశ్వరీదేవికి ఆషాఢమాసం సారె మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా చీర, సారె సమర్పించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఏఈఓ ఎరమల మధు, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, పండితులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ మేరకు వారు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో గవర్నర్స్ జిల్లా ఆఫీసర్స్ లింగం నాగశైలజ, మునగనూరు శ్రీలక్ష్మీతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు పాల్గొన్నారు. -
ఏడాది గడిచినా రాలేదు..
నాకు ఇంటర్ మీడియెట్ చదివే ఒక కుమారుడు, ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కానీ గత సంవత్సరం ఇద్దరు కూతుర్లకు మాత్రమే తల్లికి వందనం కింద డబ్బులు జమ అయ్యాయి. కుమారుడు హరీష్కు మాత్రం డబ్బులు పడలేదు. సచివాలయ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. ‘అర్హతలు ఉన్నాయి.. అందుకే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉంది.. ఈ రోజు.. రేపు పడుతుంది’లే అంటూ వచ్చారు. సంవత్సరం గడిచినా పడలేదు. ఈ ఏడాదైనా పడుతాయో లేదోనని ఆందోళనగా ఉంది. – లక్కబోయిన సుజాత, సోమయాజుల పల్లి గ్రామం, బండిఆత్మకూరు మండలం -
మల్లన్న భద్రత గాలిలో దీపం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో వీడియో చిత్రీకరణ ఘటన మరువక ముందే శ్రీశైల ఆలయంలో యథేచ్ఛగా వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో అప్లోడ్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో ముఖ్య భద్రతాధికారి, సుమారు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద భక్తులు ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, నిషేధిత పదార్థాలు, బ్యాగులు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తారు. అయితే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడంతో యథేచ్ఛగా అందరూ ఆలయంలోకి మొబైళ్ల తీసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి తన ఇన్స్ట్రాగ్రామ్ ఆలయంలో చేసిన వీడియోను రెండు రోజుల క్రితం అప్లోడ్ చేయడంతో మరోసారి మల్లన్న క్షేత్రంలో భద్రతా వైఫల్యం బయటపడింది. అలాగే శ్రీశైల ఆలయంలోనే తీసిన మరొక వీడియోను వారం క్రితం ఆమె పోస్టు చేసినట్లు వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ రీల్ స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైల ఆలయం మొత్తం కలియ తిరుగుతూ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అసలే క్షేత్రంపై ఉగ్రవాదుల నిఘా ఉందని పలుమార్లు అక్టోపస్ బృందం పరిశీలించి క్షేత్రంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చినా బేఖాతర్ చేస్తున్నారు. ఉగాది ఉత్సవాల్లో సైతం ఓ వ్యక్తి ఏకంగా గర్భగుడిలోకి మొబైల్ తీసుకెళ్లి గర్భగుడి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన ఉన్నతాధికారి పర్యవేక్షణాలోపం వలనే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లికార్జున స్వామి ఆలయంలో యథేచ్ఛగా వీడియో చిత్రీకరణ గత రెండు రోజల క్రితం ఇన్స్ట్రాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేసిన యువతి ప్రత్యేక అధికారి, సిబ్బంది తనిఖీలు చేస్తున్నా.. మొబైళ్లతో భక్తుల ఆలయ ప్రవేశం -
జిల్లా సరిహద్దుకు చేరిన తుంగభద్ర జలాలు
హాలహర్వి: తుంగభద్ర జలాలు ఎట్టకేలకు హాలహర్వి మండల సరిహద్దుకు చేరుకున్నాయి. ఈనెల 16న తుంగభద్ర డ్యాం నంచి ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆదివారం చింతకుంట 135వ కి.మీ. వద్దకు చేరుకున్నాయి. ఈ జలాలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఎవరూ పొలాలకు వినియోగించరాదని డ్యాం అధికారులు తెలిపారు. నేడు షైనింగ్ అవార్డుల ప్రదానం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్, పది పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు(సోమవారం)నగర శివారులోని పెద్దపాడు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్హాలులో షైనింగ్స్టార్ పేరుతో అవార్డులను ఇవ్వనున్నారు. పది పరీక్షల్లో ప్రతిభ చూపిన పిల్లలకు 159 మంది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పిల్లలకు 44 మందికి అవార్డులు ఇవ్వనున్నారు. రూ.20 వేల నగదుతో పాటు, మెమోంటో, మెడల్ ఇవ్వనున్నారు. -
సంగమేశ్వరుడి సేవలో..
కొత్తపల్లి: జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ దంపతులు ఆదివారం సాయంత్రం సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీ కుటుంబానికి పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా కృష్ణాపరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గర్భాలయంలోని వేపధారు శివలింగానికి విశేష పూజకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు ఎస్పీ కుటుంబ సభ్యులకు ఆలయ చరిత్రను వివరించారు. జిల్లాలో మోస్తరు వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గోస్పాడు మండలంలో అత్యధికంగా 27.0 మి.మీ, పాములపాడు, అళ్లగడ్డ, శ్రీశైలం మండలాల్లో అత్యల్పంగా 1.4 మి.మీ వర్షం కురిసింది. మహానందిలో 22.8, నందికొట్కూరులో 20.4, బండిఆత్మకూరులో 19.8, శిరివెళ్లలో 13.4, రుద్రవరం 12.8, మిడుతూరు 10.6, నంద్యాల రూరల్ 6.4, ప్యాపిలి, గడివేముల 5.8, కొలిమిగుండ్ల 4.8, వెలుగోడు, 3.4, సంజామల, ఉయ్యాలవాడ, నంద్యాల అర్బన్లలో 3.2, చాగలమర్రి 2.6మి.మీ వర్షం కురిసింది. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నేటి నుంచి దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె కర్నూలు(సెంట్రల్): ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిరసిస్తూ జూలై 20 నుంచి 31వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ఏ రెహమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టే నిరవధిక సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ను ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటైతే ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న తమ జీవన భృతిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటన తమ విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎమ్మిగనూరుటౌన్: వేరుశనగ దిగుబడులు ఆదివారం కురిసిన వర్షానికి తడిచి పోయాయి. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో షెడ్లు లేకపోవడంతో పంట ఉత్పత్తులకు రక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి 15,757 బస్తాల్లో 4,727 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను ఆదివారం విక్రయానికి తీసుకొచ్చారు. క్వింటా గరిష్టంగా రూ.8,540 ప్రకారం కొనుగోలు చేశారు. వర్షం కురవడంతో రైతులు ఆరబోసుకున్న పంట దిగుబడులు పూర్తిగా తడిసిపోయాయి.వర్షం వచ్చి డ్రైన్ నీరు వెనక్కు వచ్చి నీటిలో తన 12 సంచులకు పైగా నీట మునిగి కొట్టుకొనిపోయాయని రైతు కర్ణ కన్నీటి పర్యంతమయ్యాడు. -
రూ. 8 వేలు మాత్రమే ఇచ్చారు
మా కుమారుడు కార్తీక్ గతేడాది స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివాడు. మాకు ఎటువంటి పొలాలు లేవు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గతేడాది మొదట తల్లికి వందనం డబ్బులు పడలేదు. అప్పట్లో సచివాలయం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాం. చాలా రోజులకు రూ. 8 వేలు వేశారు. మిగతా డబ్బులు మళ్లీ పడతాయని సెల్ ఫోన్లో మేసేజ్లు చూసుకుంటూ ఉన్నాం. చదువు పూర్తయినా ఇంత వరకు పడలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి డబ్బులు పడ్డాయి. ఈఏడాదైనా మాలాంటి పేదలకు పూర్తిగా న్యాయం చేయాలి. – సునీత, గడివేముల ఎన్నికల సమయంలో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం డబ్బులు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మొదటి ఏడాది పూర్తిగా వదిలేశారు. గత ఏడాది ఎంతో మంది పేదలు తల్లికి వందన కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకానికి అర్హులైన విద్యార్థుల కుటుంబాల విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు. – శివశంకర్రెడ్డి, విద్యార్థుల తండ్రి, సాంబవరం, గోస్పాడు మండలం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి నేతలు ఎలాంటి షరతులు లేకుండా ఈ ఏడాదైనా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించాలి. నిబంధనలతో అనర్హులుగా ప్రకటించడం తగదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందించాలి. రూ.13 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సహించేది లేదు. స్కూళ్లు తెరిచిన నెలలో ఇస్తే బాగుండేది. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే ఆందోళనలు చేస్తాం. –ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ మా కుమారుడు సగినేల కార్తీక్ గతేడాది పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుకున్నాడు. తల్లికి వందనం 9వ తరగతికి సంబంధించిన డబ్బులు అరకొరగా రూ.10, 500 ఇచ్చింది. మిగతా డబ్బులు 10వ తరగతి పూర్తయినా రాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎటువంటి కోతలు లేకుండా ప్రతి సంవత్సరం అమ్మఒడి రూ.13 వేలు బ్యాంకు ఖాతాలో వేసింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం కింద అరకొర వేసి చేతులు దులుపుకుంది. – సగినేల నాగరాజు, వనములపాడు, పగిడ్యాల మండలం -
కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తోంది!
● రాష్ట్రంలో 12 కేసులు, 4 మరణాలు ● కంగారెత్తిస్తున్న మహమ్మారి ● పీహెచ్సీల్లో కానరాని ఏర్పాట్లు ● కర్నూలు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు కర్నూలు(హాస్పిటల్):జిల్లా వ్యాప్తంగానే గాక దేశంలో 2020, 2021లో వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుందా... అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తోంది. గతంలో ఈ మహ మ్మారి సోకి వేలమంది ప్రాణాలు కోల్పోగా లక్షలా ది మంది అనారోగ్యంతో బాధపడటమే గాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. చాలా కుటుంబాలు ఈ వైరస్ దెబ్బకు రోడ్డున పడ్డాయి. వందేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి మహమ్మారిని తలచుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటి కోవిడ్ ప్రతి రెండేళ్లకు ఒకసారి తన రూపం మార్చుకుని జనంలోకి వస్తూ ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు పలు వేరియంట్ల రూపంలో ఇది ప్రజలను కంపితులను చేసింది. తాజాగా రాష్ట్రంలో మళ్లీ కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం తూతూ మంత్రంగా ఏర్పాట్లు పక్క రాష్ట్రాల్లో, పక్క జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేవు. లక్షణాలతో వచ్చిన వారికి కనీస పరీక్షలు చేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోలేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం ప్రత్యేకంగా పూర్వ ఐడీ వార్డులో పది పడకలతో వార్డును ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలతో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు 450 ఆర్టీ పీసీఆర్ కిట్లతో 350 ఆర్ఎన్ఏ ఎక్ట్రాక్షన్ కిట్లు, 450 వీటీఎం కిట్లను సిద్దంగా ఉంచారు. ప్రత్యేకంగా నోడల్ అధికారులను, వైద్యబృందాలను ఏర్పాటు చేయలేదు. కోవిడ్కు సంబంధించి ముందస్తు చర్య లు తీసుకునేందుకు అవసరమైన సమావేశం కూడా నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్వీయ జాగ్రత్తలే మేలు కోవిడ్ కేసులు పక్క రాష్ట్రాలు, జిల్లాల్లో నమోదువుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండటం, బహిరంగ ప్రదేశాలకు, జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనరిసరిగా ధరించాలి. దీనివల్ల వైరస్ను సాధ్యమైనంత వరకు అరికట్టడమే గాక ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో పాటు గతంలో మాదిరిగానే శానిటైజేషన్, భౌతికదూరం పాటించాలి. ఎవ్వరికి వారు స్వీయజాగ్రత్తలు పాటిస్తే గతంలో మాదిరిగా వైరస్ వ్యాపించినా ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తున్నారు -
సంక్షేమాన్ని గాలికొదిలేశారు!
బేతంచెర్ల: రెండేళ్ల టీడీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆదివారం బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామా ల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు, విత్తనాలు అందించలేక పోయిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఏటా పెట్టుబడి సాయం, ఆర్బీకేల ద్వారా సకాలంలో ఎరువుల సరఫరా, ఉచిత పంటల బీమా, దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో పంటల బీమా ప్రీమియాన్ని కూడా రైతులే భరించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు తోపాటు మహిళను సైతం మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన మహిళలు మాజీ మంత్రి బుగ్గనను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, బాబురెడ్డి, లక్ష్మీరెడ్డి, రామచంద్రుడు, మురళీకృష్ణ, మునేశ్వర్రెడ్డి, తిరుమలేశ్వర్రెడ్డి, పిట్టల జాకీర్, దస్తగిరి, మల్లికార్జున, గోపాల్రెడ్డి సలీమ్, వలిబాషా పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం పంటల బీమా ప్రీమియం భారం మోపడం తగదు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
● అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ● మృతుడి కుటుంబీకులు, బంధువుల ధర్నా మంత్రాలయం రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ చిలకలడోణ గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు మంత్రాలయం రహదారిపై ధర్నాకు దిగారు. శనివారం ఉదయం 5 గంటలకు జాతీయ రహదారిపై కారు ఢీకొని గ్రామానికి చెందిన పుట్టక వెంకటేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 9 గంటలకు మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున బస్టాండ్కు చేరుకున్నారు. చిలకలడోణ – మంత్రాలయం జాతీయ రహదారిపై అడ్డంగా ఎద్దుల బండ్లను ఉంచి దాదాపు గంటన్నర పాటు రాస్తోరోకో, ధర్నా చేపట్టారు. ఎమ్మిగనూరు–మంత్రాలయం ఇరువైపుల రెండు కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మంత్రాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ మల్లికార్జున పోలీసు సిబ్బందితో చేరుకున్నారు. నిత్యం చిలకలడోన పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జాతీయ రహదారి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టోల్ వసూలు చేస్తున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రెండు, మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఎస్ మల్లికార్జున పోలీసు సిబ్బందితో కలసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
శివ..శివా..అపచారం..!
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల చిత్రపటాలు కనిపిస్తేనే రెండు చేతులతో నమస్కరిస్తాం. శ్రీశైల దేవస్థాన అధికారిక లోగోకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. కానీ దేవస్థాన అధికారులు మాత్రం లోగోను మొక్కల కుండీలకు చిత్రీకరించి అపవిత్రం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీశైల దేవస్థాన పరిపాలనా భవనంలోని అన్ని విభాగాల చాంబర్ల ముందు సుందరీకరణ కోసం మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ మొక్కలను ప్లాస్టిక్ పూల కుండీల్లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పూలకుండీలకు దేవస్థానం గోపురం, త్రిశూలం, మూడు అడ్డ నామాలతో కూడిన లోగోను చిత్రీకరించారు. దేవస్థాన ఉన్నతాధికారి సూచన మేరకు ఈ లోగో అతికించినట్టు సమాచారం. ఆయా పనుల కోసం చాంబర్ల వద్దకు వచ్చిన పలువురు చెప్పులను ఆ కుండీల వద్దే వదిలి వెళ్తున్నారు. ఆదివారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాంబర్ ముందు చెప్పులు విడిచి వెళ్లారు. గమనించిన పలువురు భక్తులు దేవస్థానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దేవస్థాన లోగోను తొలగించి పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ -
కుందూలో భగీరథ ప్రయత్నం
నదిలో జేసీబీతో గుంతను తవ్వుతున్న దృశ్యం ఉయ్యాలవాడ: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది కుందూనదిలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. నది పూర్తిగా అడుగంటడంతో తాగునీటి కోసం మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో ప్రత్యామ్నాయ మార్గం తప్పడం లేదు. మండలంలోని ఆర్.జంబులదిన్నె గ్రామంలో కుందూనదిలో ఊట నీరు లభ్యం కోసం జేసీబీ సహాయంతో గుంతను తవ్వారు. దీంతో కొద్ది మేరకు మంచినీటి సమస్యతో పాటు పశువులకు అవసరాలకు నీరు సమకూరుతుందని గ్రామానికి చెందిన చిట్టెపు రాజగోపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ప్రజలు పేర్కొన్నారు. -
శ్రీశైల ఆలయాన్ని సందర్శించండి
● ప్రముఖులకు ఆలయ చైర్మన్ ఆహ్వానం శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్న ట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం దేవస్థాన పరిపాలన భవనంలోని చైర్మన్ చాంబర్లో ఆయన మాట్లాడుతూ.. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను క్షేత్రానికి విచ్చేసి స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని కోరుతూ ధర్మకర్తల మండలి తరఫున ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో ని పలువురు ప్రజా ప్రతినిధు లు, ప్రముఖులు, సంఘసేవకులను ఆహ్వానించడం జరగుతుందన్నారు. దాతలను ఆహ్వానించడంలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కొత్తూరులో గుంటూరు జిల్లా జడ్జి పూజలు పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గుంటూరు జిల్లా జడ్జి కోళ్లపూడి కిషోర్ పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జడ్జి స్వామికి అభిషేకాలు, అర్చనలు, తదితర విశిష్ట పూజలు చేశారు. తర్వాత అర్చకులు జడ్జికి శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. హొళగుంద: మండలకేంద్రం హొళగుందలోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న చెరువు వద్ద కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాసు నూతన విగ్రహ, కలశ ప్రతి ష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. దమ్మూరు గోవర్ధననందపురి స్వామి, మదిరే యల్లా లింగామఠం నాగరాజు స్వామి చేతుల మీదుగా సాగిన ఈ కార్యక్రమాని తిలకించేందుకు కురువలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, టీడీపీ ఆలూరు ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కనకదాసు విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ జాతి పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న అజ్ఞానాన్ని తన కీర్తనలు, పాటలతో తొలగించిన మహనీయుడు భక్త కనకదాసు అని కొనియాడారు. విగ్రహ ప్రతిష్ఠోత్సవంలో భాగంగా గ్రామంలో గజ్జెళ్లి చిన్నారుల కోలాటం, భజన బృందం మధ్య కనకదాసు చిత్రపట ఊరేగింపు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కురువ సంఘం జిల్లా అసోషియేషన్ అధ్యక్షుడు ఎల్లార్తి దర్గన్న, కుల పెద్దలు డీసీ బజ్జన్న, శేషన్న, ఎం.డీ హళ్లి నాగరాజు, నందీశ, శేషగిరి, గర్జప్ప, చాగప్ప, లింగన్న, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు.వృద్ధురాలి శవం లభ్యం హొళగుంద: స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆదివారం స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో హెడ్ కానిస్టేబుల్ రామ్నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. మృతురాలికి 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. అనారోగ్య సమస్యలతో చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో నాపరాళ్ల ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసే సుధాకర్ (40) సొంతూరు బనగానపల్లె మండలం కై ప గ్రామం. వారం క్రితం అతని భార్య, పిల్లలు పని మీద కై పకు వెళ్లారు. అతను మిద్దైపె నిద్రించగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఫోన్ వినియోగించక పోవడంతో పాటు ఎప్పుడైనా పనులకు వెళ్తే నాలుగైదు రోజులకు ఇంటికి తిరిగొచ్చేవాడు. ఈ క్రమంలో అతని గురించి కుటుంబీకులు వాకబు చేయలేదు. అయితే ఆదివారం చుట్టు పక్కల ఇళ్ల వారికి సుధాకర్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పరిశీలించగా.. మిద్దైపె శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లీలావతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని తండ్రి కైప రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఈవీఎం గోదాముల తనిఖీ
నంద్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అమలవుతున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాముల వద్ద అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, డోర్ లాక్ సీళ్ల పరిస్థితి, సీసీ టీవీ నిఘా వ్యవస్థ పనితీరు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, భద్రతా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమైన అంశమన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని భద్రతా చర్యలను నిరంతరం అప్రమత్తంగా కొనసాగించాలన్నారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు లాగ్బుక్ను పరిశీలించి విధుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా వ్యవస్థలో భాగమైన సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ 2.0 సూపర్ యాప్ శక్తివంతమైన వేదిక
● వైఎస్సార్సీపీ కార్యకర్తకు డిజిటల్ ఆయుధం ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: జగన్ 2.0 సూపర్ యాప్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు శక్తివంతమైన వేదిక అని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం కల్లూరులోని కాటసాని స్వగృహం దగ్గర ‘జగన్ 2.0 సూపర్ యాప్’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకాష్రెడ్డి, మాజీ మేయర్ రామయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా చేరవేయడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త చేతిలో ఉండాల్సిన డిజిటల్ ఆయుధమన్నారు. కార్యకర్తలు, నాయకులకు అనుసంధానంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం సమష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాట సాని రాంభూపాల్రెడ్డి స్వయంగా తన మొబైల్లో ‘జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసి, దాని వినియోగ విధానాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ప్రతి కార్యకర్త తమ మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ప్రజలతో అనుసంధానమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కోసమే – బీవై రామయ్య జగన్ 2.0 సూపర్ యాప్ కార్యకర్తల కోసమే అని మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. కార్యకర్తలు నష్టపోకుండా, బాధపడకూడదనే యాప్ తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల అభివృద్ధి పనుల పేరుతో ఈవెంట్లు చేస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు హడావుడిగా గుండ్రేవులు, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చిన సీనియర్ నాయకులు అని ఎద్దేవా చేశారు. కూటమి నాయకుల అబద్ధాలు, మోసాలను రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా రావడం కూటమి పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ గుండం సూర్య ప్రకాష్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నాగలక్ష్మీరెడ్డి, సుదర్శన్రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, వెంకటేశ్వర్లు, సాన శ్రీనివాసులు, నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, శివశంకర్రెడ్డి, శివారెడ్డి, యూనస్, తిరుపాల్, గోపాల్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
నమో అహోబిలేశా..
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామి వారమైన శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించా రు. దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాముల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 50 రోజులకు రూ. 52 లక్షలు ● మహానందీశ్వరుడి హుండీ కానుకల లెక్కింపు మహానంది: మహానందిలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 52,50,131 లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సామూహిక అభిషేక మండపంలో శనివారం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండరామాలయం, ఆంజనేయస్వామి, వినాయకనంది, అన్నప్రసాదం, గో సంరక్షణ విభాగాల్లోని భక్తులకు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఆలయాల ద్వారా రూ. 51,70,417, అన్నప్రసాదం ద్వారా రూ. 55,670, గోసంరక్షణ ద్వారా రూ. 24,044 వచ్చిందన్నారు. 50 రోజులకు ఈ మేరకు ఆదాయం లభించిందని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. గ్రూప్–2 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు కర్నూలు(అర్బన్): ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన తెలిపారు. డిగ్రీలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వచ్చి కర్నూలులోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందించాలని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికై న వంద మంది అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ ఇస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు స్టయిఫండ్ మంజూరవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 08518–236076, 9652093661 నంబర్లను సంప్రదించాలన్నారు. -
వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరు గుతున్న కారణంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో మార్పులు చేసినట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతు గుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. శనివారం ‘సాక్షి’లో ‘అంతా మా ఇష్టం’ శీర్షికన ముందస్తు సమాచారం లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో భక్తుల ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన చైర్మన్, ఈఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం వేళల్లో మనమిత్ర వాట్సప్, ఆన్లైన్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లను ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే ప్రముఖులు స్వయంగా వచ్చేనప్పుడు మాత్రమే ఉదయం వేళల్లో ప్రాధాన్యతను బట్టి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. ప్రముఖులు అందజేసే సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు అవకాశాన్ని బట్టి రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శదర్శనానికి వీలు కల్పిస్తామన్నారు. -
కర్నూలు జిల్లాలో...
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఉదారంగా ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఉచితల పంటల బీమాకు స్వస్తి చెప్పి ప్రీమియం చెల్లించాలని అధికారులతో విస్తృతంగా ప్రచారం చేయింది. పంటలు కోల్పోయామని పరిహారం వస్తుందని అప్పు చేసి డబ్బులు చెల్లించిన రైతులకు శోకమే మిగిలింది. పంట రుణం తీసుకుంటే బీమా వర్తించదని తీరిగ్గా చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సాధారణంగా పంటల బీమా అమలులో బ్యాంకులదే కీలక పాత్ర. నోటిఫై చేసిన పంటలకు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతులందరికీ బీమా వర్తింప చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇచ్చే పంట రుణంలో ప్రీమియం డబ్బు తీసుకుని నిర్దిష్ట గడువులోపు ప్రీమియాన్ని బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఏ బ్యాంకు కూడా ఇలా చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతులు మీసేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు తదితర వాటిల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 95 శాతం మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ప్రీమియం చెల్లించిన తర్వాత బ్యాంకుల్లో పంట రుణం తీసుకొని ఉంటే నాన్లోన్ కింద ప్రీమియం చెల్లించిన వారికి బీమా వర్తించదనే విషయం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తున్న కంపెనీలు, అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం వ్యవసాయ యంత్రాంగం కూడా రైతులకు అవగాహన కల్పించలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులకు రూ.5000 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశారు. పంటల బీమా కింద నోటిఫై చేసిన వాటిపైనే రుణాలన్నీ తీసుకున్నారు. వీరంతా ప్రీమియం చెల్లించడంతో బీమా కంపెనీలకు రూ.120 కోట్లు సమకూరాయి. అయితే వారికి పంటల బీమా దక్కని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు రుణాలు తీసుకున్న వారికీ పంటల బీమా అమలు చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. రైతుల కష్టాలను, కరువును పట్టించుకోకుండా బ్యాంకులు చేతులెత్తేయడంతో రైతులు నాన్లోన్ కింద ప్రీమియం చెల్లిస్తున్నారు. బ్యాంకుల్లో పంట రుణం ఉందనే సాకుతో వాతావరణ బీమా, పీఎంఎఫ్బీవై అమలు చేస్తున్న కంపెనీలు పరిహారాన్ని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కాసుల పంట పంటల బీమా కారణంగా మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్లకు కాసుల పంట పండుతోంది. ఒక్కో రైతు రెండు, మూడు దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.300 వసూలు చేస్తున్నారు. ఆరు రోజుల్లోనే మీ సేవా సెంటర్ల, కామన్ సర్వీస్ సెంటర్లకు రూ.4.33 కోట్లు సమకూరాయి. నంద్యాల జిల్లాలో.. పంటల బీమాలో లోపాలు పంట రుణం తీసుకుంటే బీమా వర్తించదు ధ్రువీకరించిన బీమా కంపెనీలు, వ్యవసాయ యంత్రాంగం పంట మార్పు సర్టిఫికెట్ పొందాలంటే ఎకరాకు రూ.లక్ష చెల్లించాల్సిందే సర్టిఫికెట్ సమర్పించకపోతే బీమా కోల్పోయినట్లే!ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం నాటికి కర్నూలు జిల్లాలో 87,974 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. వాతావరణ బీమా కింద లోన్ ఫార్మర్స్ నుంచి 8,042, నాన్లోన్ ఫార్మర్స్ నుంచి 87,820 దరఖాస్తుల ద్వారా ప్రీమియం వచ్చింది. పీఎంఎఫ్బీవై కింద 30,556 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో లోన్ ఫార్మర్స్ కింద 1,225, నాన్లోన్ కింద 49,143 దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లించారు. నంద్యాల జిల్లాలో 7,163 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. వాతావరణ బీమా కింద 4,745 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. లోన్ ఫార్మర్స్ 30, నాన్లోన్ ఫార్మర్స్ 3,452 దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లించారు. పీఎంఎఫ్బీవై కింద 2418 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో లోన్ ఫార్మర్స్ 17, నాన్ లోన్ ఫార్మర్స్ 9,199 దరఖాస్తులు ఉన్నాయి. ప్రీమియం చెల్లించిన దరఖాస్తులను పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో నాన్లోన్ ఫార్మర్స్కు సంబంధించినవి 90 శాతం పైగా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 99 శాతం వరకు ఉన్నాయి. నాన్లోన్ కింద ఉన్న దరఖాస్తుల్లో 90 శాతం రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న వారే. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని..
● భార్యను హత్య చేసిన భర్త ● అనాథలుగా మారిన ఇద్దరు కుమార్తెలు డోన్ టౌన్: తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డొస్తుందని భర్త అంతమొందించాడు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన డోన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. స్థానిక అర్జున్రెడ్డి కాలనీలో నివాసముంటున్న ఇంతియాజ్ బాషా, సోంపురం గ్రామానికి చెందిన బలిజ ఈశ్వరి (35) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వరి దుస్తుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా ఇంతియాజ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో భార్య ఈశ్వరి తరచూ నిలదీస్తోంది. దీంతో కొంత కాలంగా వారి మధ్య కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున ఈశ్వరి తలపై ఇనుప రాడ్తో పలుమార్లు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అయితే నిందితుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జారి పడటంతో తలకు గాయాలయ్యాయని సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్య చేసినట్లు అనుమానించి మృతురాలి అక్క సాలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని, దర్యాప్తునకు సహకరించాలని పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
త్వరితగతిన నష్టపరిహారం అందించాలి
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం త్వరగా అందేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై శుక్రవారం డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారులు కర్నూలు, నంద్యాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, జైలు సూపరింటెండెంట్లు, జిల్లాస్థాయి జైలు అధికారులతో హైబ్రిడ్ మోడ్లో మానిటరింగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల వేగవంతమైన ప్రక్రియకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. బాధితులకు లేదా వారిపై ఆధారపడిన వారికి అర్హత ప్రకారం పరిహారం చెల్లింపు జరిగేలా చూడాలన్నారు. 8వ తరగతి, ఆపై చదువుతున్న పేద గిరిజన విద్యార్థులు, వికలాంగ విద్యార్థినులు, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల కేటగిరీల నుంచి సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా వారి ‘ప్రగ్య’ స్కాలర్షిప్లను పొందడానికి జిల్లాకు ఒకరి పేరు చొప్పున ఈనెల 21 లోపు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, రవాణా శాఖ అధికారులు, డీటీఆర్బీ అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, సంబంధిత శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ అర్జీలను పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆగ స్టు 1వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారాల పురోగతిని సమీక్షించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం మండలాల్లో ప్రధానంగా రెవెన్యూ దరఖాస్తులు అధికంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నా రు. అలాగే వెలుగోడు, మహానంది మండలాల్లో పెండింగ్లో ఉన్న అర్జీలను కూడా ఆగస్టు 1వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. శుక్రవారం వెలుగోడులో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో 550 కొత్త అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ , సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తి అరెస్టు జూపాడుబంగ్లా: ఫేస్బుక్లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టు చేసిన జూపాడుబంగ్లాకు చెందిన డీలర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ సలాంను అరెస్టు చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేస్బుక్లో అబ్దుల్ సలాం పోస్టు చేశాడని నందికొట్కూరు పట్టణానికి చెందిన సాలివేరి వెంకటేష్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి డీలర్ సలాంను అదుపులోకి తీసుకున్నామన్నారు. తన తప్పును నందికొట్కూరు సర్కిల్ పోలీసుస్టేషన్లో ఒప్పుకొని క్షమాపణలు కోరుతూ అదే ఫేస్బుక్ ఖాతాలో పో స్టు చేశాడన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి బనగానపల్లె రూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పాతపాడు గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఘన వ్యర్థ పదార్థాల సేకరణ (ఎస్డబ్యూపీసీ) షెడ్డును పరిశీలించి, షెడ్డులో తడి, పొడి చెత్త సేకరణ ద్వారా వర్మికంపోస్టు ఎరువులను ఎలా తయారీ చేయాలి తదితర అంశాలను గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. అలాగే గ్రామ సచివాయాలన్ని తనిఖీ చేసి అక్కడి సిబ్బంది వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓలు సురేంద్రనాథ్యాదవ్, తిరుమలేష్ రెడ్డి, ఏవో అబ్దుల్ హమ్మిద్, పంచాయతీ కార్యదర్శి శకుంతల గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి శిరివెళ్ల: మోత్కులపల్లె గ్రామ పొలాల్లో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మహానంది మండలం మసీదుపురానికి చెందిన రైతు డమాల్ నాగన్న (60) మోత్కులపల్లె సమీపంలోని తన పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ను ఆన్ చేయటానికి వెళ్తూ మోటార్ నుంచి బోరుకున్న వైర్కు జాయింట్ ఉన్న చోట గమనించకుండా తొక్కాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు అంకాలు పోలీసుల కు సమాచారం ఇవ్వగా ఎస్ఐ మధుసూదన్ ఘట న స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డోన్ ప్రభుత్వాసుపత్రిలో తల్లీబిడ్డ మృతి
● ఆలస్యంగా వెలుగులోకి ● వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆందోళన డోన్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరి మండలం పెనమాడ గ్రామా నికి చెందిన అనురాధా(20)కు అదే మండలం ఎరుక ల చెరువు గ్రామానికి చెందిన మహేష్తో గత ఏడాది వివాహమైంది. నెలలు నిండిన అనురాధ కాన్పు కోసం ఈ నెల 13వ తేదీ ఉదయం డోన్ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సు కాన్పు చేసిందని మృతురాలు బంధువులు తెలిపారు. కాన్పులో మృత శిశువును తమకు అప్పగించి, అనురాధకు తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉంది కర్నూలుకు తీసుకెళ్లాలని పురమాయించిందన్నారు. ఆ మేరకు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని అనురాధ భర్త మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గైనిక్ వార్డులో మహిళా డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. డోన్ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హానీఫ్ను వివరణ కోరగా.. 13వ తేదీ రాత్రి గైనిక్ వార్డులో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో హెడ్ నర్స్ హేమలత కాన్పు చేసిందనడంలో వాస్తవం లేదన్నారు. అనురాధ కా న్పు అయిన వెంటనే మృత శిశువుకు జన్మనివ్వడం, ఆమెకు అధిక రక్త స్రావమై, ఫిట్స్ రావడం లాంటి కారణాలతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందినట్లు సమాచారం ఉందన్నారు. తల్లీబిడ్డ మృతికి ఆసుపత్రి వైద్యసిబ్బంది కారణమని ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
ఎల్నినో ప్రభావం అంచనా
● పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందండోన్ రూరల్: జిల్లాలో ఎల్నినో ప్రభావం అంచనా వేయడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు రామచంద్రరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండలాల్లోని రంగాపురం, ఆర్ కొత్తపల్లె, ఎద్దుపెంట, చనుగొండ్ల, పెద్దపొదిళ్ల, చిన్నపొదిళ్ల గ్రామాల్లో పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానిక రైతులు, వ్యవసాయ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు గంగాధర్, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జయలక్ష్మి, శాస్త్రవేత్తలు మల్లేశ్వరరెడ్డి, అశోక్కుమార్, రామకృష్ణ, నజరుద్దీన్, ధనలక్ష్మి, బాలరాజు, సుధాకర్, డోన్ ఏడీఏ సునీత, మండలాల వ్యవసాయ అధికారులు ఉన్నారు. -
గ్రామీణ అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించాలి
● జెడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డిపాణ్యం: గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలని, ప్రజా అవసరాలకు సంబధించి అజెండాను తయారు చేసుకోవాలని జెడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డి గ్రామీణ కార్యదర్శులకు సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ కార్యదర్శలకు జీపీడీపీపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల మౌళిక సదుపాయాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామ కార్యదర్శి ఒక అజెండాను తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే ప్రజా సమస్యల్లో ప్రాధాన్యత వాటిని పరిష్కరించాలని, ప్రధానంగా వైద్యం, తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం తదితర వాటిపై దృష్టి సారించాలన్నారు. ప్రతి గ్రామంలో వర్మీ యూనిట్ నిర్వహణ మెరుగుపరిచి సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. అనంతరం పాణ్యం పంచాయతీ పరిధిలో ఉన్న వర్మియూనిట్ను పరిశీలించి తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ ఉసేన్బీ, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, గ్రామాల కార్యదర్శులు ఉన్నారు. -
సర్ వేగవంతం చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. అమరావతి వెలగపూడిలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం సర్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన ప్రతి సూచనను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్ఓల వద్ద పెండింగ్లో ఉన్న (బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ), ఇతర పెండింగ్ అంశాలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఓటర్ల ఫొటోలు స్పష్టంగా లేకపోయినా, పాత ఫొటోలు ఉన్నా వాటి స్థానంలో తాజా కలర్ ఫొటోలను అప్డేట్ చేయాలన్నారు. వచ్చే శనివారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోపు గణనీయమైన పురోగతి సాధించాలన్నారు. ఎన్నికల జాబితాల కచ్చితత్వం, పారదర్శకతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
● రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల అధికార దుర్వినియోగం ● ఎమ్మెల్సీ ఇసాక్బాషా నంద్యాల(అర్బన్): రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తూ కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా పోలీసు కస్టడీ మరణాలు, వేధింపులతో యువకుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయన్నారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు గాదె సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం తీసుకెళ్లి అనంతరం అతను కనిపించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. అదే ప్రాంతంలో సీఐ నాగరాజు, పోలీసు సిబ్బంది వేధింపులను భరించలేక క్రాంతికుమార్ అనే యువకుడు మే 21న సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మైనార్టీ యువకుడు దరియా హుసేన్ పుట్టిన రోజు నాడే లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవ డం విచారకరమన్నారు. కోర్టుల్లో సివిల్ వివాదం పెండింగ్లో ఉన్నప్పటికీ పిడుగురాళ్ల సీఐ వెంకటరావు, పోలీసు సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లతో హుసేన్ ను ఇల్లు ఖాళీ చేయాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రతిరోజు పోలీసు స్టేషన్కు పిలి పించి గంటల తరబడి విచారణ చేపట్టడం వల్ల మానసిక వేదనకు గురయ్యాడన్నారు. ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసులు నమోదు చేస్తామని పోలీసుల బెదిరించడంతోనే హుసేన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనై అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందోన్నారు. ప్రజల ప్రాణాలు, హక్కులను కాపాడాల్సిన వ్యవస్థే భయాందోళనలకు గురి చేయడం ఆందోళన కరమని విమర్శించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఇందు కోసం కృష్ణలంక ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మృతుడు గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. -
చెరువు మట్టి తరలుతోంది
మహానంది: అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా మట్టి దందాకు పాల్పడుతున్నారు. బొల్లవరం చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్నారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన నాయకులు సిండికేట్గా మారి బొల్లవరం చెరువులో జేసీబీలతో తవ్వి, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి నియోజకవర్గ స్థాయి నేత ఒకరు అండగా ఉన్నట్లు అధికారపార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రైతుల పొలాల కోసం అంటూనే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు ఇళ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ. 1000 నుంచి రూ. 1200 వరకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి మట్టి దందాపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రెవెన్యూ శాఖలో పదోన్నతులు
నంద్యాల(అర్బన్): జిల్లా రెవెన్యూ శాఖలో వివిధ కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు పదోన్నతులు పొందిన అధికారులకు గురువారం స్థానాలు కేటాయిస్తూ డీఆర్ఓ రామునాయక్ జీవో విడుదల చేశారు. సంగమేశ్వర క్షేత్రానికి మరో బస్సు సర్వీసు ఆత్మకూరు: సంగమేశ్వర క్షేత్రానికి భక్తుల రద్దీ దృష్ట్యా మరో బస్సు సర్వీసు పెంచుతున్నట్లు ఆత్మకూరు ఆర్టీసీ డీఎం వినయ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆత్మకూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 8.15 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బస్సు సర్వీసులు ఉన్నాయన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా సంగమేశ్వర క్షేత్రానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మరో బస్సు సర్వీసును నడుపుతామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్టీసీ సీఐ బి.కె.నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహానందీశ్వరుడిసన్నిధిలో హంపి పీఠాధిపతి మహానంది: హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామిజీ గురువారం మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, హనుమంతశర్మ, అర్చకులు రాఘవశర్మలు పీఠాధిపతికి మహానందీశుడి పట్టువస్త్రం, ప్రసాదాలు అందించారు. ఆలయ విశేషాలను పీఠాధిపతికి వివరించారు. తుది దశకు డిజిటైజేషన్ కర్నూలు(సెంట్రల్): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ తుది దశకు చేరుకుంది. జిల్లాలో కేవలం 356 ఫారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాణ్యంలో 189, మంత్రాలయంలో 167 ఫారాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఈనెల 24వ తేదీలోపు డిజిటైజేషన్ చేయడానికి సమయం ఉంది. వీఆర్లోని 14 మంది ఏఎస్ఐలకు పోస్టింగులు కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో వీఆర్లో ఉన్న 14 మంది ఏఎస్ఐలకు పోస్టింగులు దక్కాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరిపోవాలని అందులో పేర్కొన్నారు. పూజ్యాయ.. రాఘవేంద్రాయ! మంత్రాలయం: పూజ్యాయ.. రాఘవేంద్రాయ శ్లోకంతో గురువారం భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ప్రత్యేకవారం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేశారు. అనంతరం మూల బృందవనంను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం ప్రాంగణంలో ఊంజల మండపం నుంచి మంగళవాయిద్యాలతో బంగారు పల్లకీలో మూలబృందవనం మూర్తిని ఊరేగించారు. మధ్వకారిడార్, కల్పతర క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో భక్తుల కోలాహలం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తుల రాకతో మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. -
దేవుడా.. ఒక్క వాన!
కుందూనదిలో తాబేలు పుర్రె కరువు పరిస్థితులకు సాక్ష్యం ఈ దశ్యం. జీవనదిలా ప్రవహించే కుందూనది ఒట్టిపోయి రాళ్లు, రప్పలు దర్శనమిస్తున్నాయి. నీరు అడుగంటి పోవడంతో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నదిలో ఎక్కడ చూసినా చేపలు, పీతలు చనిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కాకులు, కొంగలకు ఆహారంగా మారుతున్నాయి. ఓ తాబేలు పుర్రెను చూస్తే.. అయ్యో అనిపించేలా చలింపజేస్తుంది. ఉన్న ఫలంగా నీరు ఎండిపోవడంతో ఓ తాబేలు మృత్యువాత పడటం, కళేబరాన్ని కొంగలు తినేయడంతో పుర్రె మాత్రం మిగిలి కరువు ప్రమాద ఘంటికలను హెచ్చరిస్తూ కనిపిస్తోంది. – దొర్నిపాడు -
హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించం
● డీలర్ను కఠినంగా శిక్షించాలిజూపాడుబంగ్లా: హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని భజరంగ్దల్, విశ్వహిందూపరిషత్, భారతీయ జనతా యువమోర్చా, తదితర హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై పత్రికల్లో రాయలేని విధంగా అసభ్యకర పదాలతో దూషిస్తూ జూపాడుబంగ్లాకు చెందిన ఓ డీలర్ అతని ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ పోస్టును గమనించిన వివిధ ప్రాంతాల హిందూ సంఘాల నాయకులు గురువారం ఉదయం జూపాడుబంగ్లాకు చేరుకొని డీలర్ను నిలదీశారు. ఆయన వారికి ఎదురు తిరగడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అప్పటికే హిందూ సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్, సీఐ సుబ్రమణ్యం జూపాడుబంగ్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా డీలర్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ లిఖితపూర్వకంగా ఆయా సంఘాల నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆ వ్యక్తిని డీలర్గా తొలగించాలని తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ వినతి పత్రం అందజేశారు. విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు హిందూసంఘాల నాయకులు మాట్లాడుతూ.. హిందువులను, హిందూ దేవుళ్లను దూషించినా, కించపరిచినా ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి సంఘటనలుపునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నంది కొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం అధ్వర్యంలో పాములపాడు, ముచ్చుమర్రి, బ్రాహ్మణకొట్కూరు, మిడ్తూరు ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి?
● కలెక్టరేట్ ఎదుట ఎంపీహెచ్ఓల నిరసనకర్నూలు(సెంట్రల్): అరకొర జీతాలతో పనిచేస్తున్నామని, అవి కూడా నాలుగు నెలలుగా ఇవ్వకపోతే ఎలా బతకాలని వ్యవసాయశాఖలో పనిచేస్తున్న మల్టీ పర్సన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఎంపీహెచ్ఓలు) ప్రశ్నించారు. కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బసవరాజు మాట్లాడుతూ.. 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కింద ఎంపీహెచ్ఓలకు రూ.35 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగభద్రత కల్పించాలని, హెల్త్కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోతే ఎక్స్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు. -
గుండ్రేవులను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డికర్నూలు(సెంట్రల్): గుండ్రేవుల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలతో కూడుకున్నది కావడంతో దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పనులు చేపట్టాలని దిశా మీటింగ్ తీర్మానం చేయాలని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నీటి సమస్యకు రిజర్వాయర్ల నిర్మాణమే శాశ్వత పరిష్కారమన్నారు. గత ఏడాది ఆశించిన వర్షపాతం, వరదలు వచ్చినప్పటికీ తగినన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో ఆ నీటిని నిల్వ చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన దిశాకమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, పాణ్యం, ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, డాక్టర్ పి.పార్థసారథి, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నాయని, ఈ సంవత్సరం ఖరీఫ్పై ఆశలు వదులుకునే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. రాబోయే రబీకి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలసలు పెరిగే అవకాశం ఉండడంతో ఉపాధి పనులను కల్పించాలని సూచించారు. -
రైతులను ‘రోడ్డున పడేశారు’!
కర్నూలు(అగ్రికల్చర్): వాతావరణ ఆధారిత బీమా పథకంలో భాగంగా పత్తి, వేరుశనగకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుండటంతో మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు రైతులతో కిక్కిరిశాయి. ప్రీమియం చెల్లింపునకు 3 రోజులే అవకాశం ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వస్ సమస్యలు, రైతుల తాకిడి ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా అమలుచేసి పరిహారం కూడా విడుదల చేసింది. ఎల్నినో వంటిి కష్టకాలం ఏర్పడినప్పడు రైతులకు ఉచిత పంటల బీమా అవసరమైనప్పటికీ చంద్రబాబు మాత్రం పత్తికి ఎకరాకు రూ.2వేలు, వేరుశనగకు రూ.560 చెల్లించే విధంగా బీమాను అమలు చేస్తుండటం గమనార్హం. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతులకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల చివరి వరకు పొడిగించిన ప్రభుత్వం.. నాన్లోనీ ఫార్మర్స్ను మాత్రం విస్మరించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో లోనీ ఫార్మర్స్కు సైతం కొన్ని బ్యాంకులు పంటల బీమా అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పంట రుణాలు పొందిన రైతులు సైతం నాన్ లోనీ కింద ప్రీమియం చెల్లిస్తున్నారు. అందువల్లే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు కిక్కిరిసినట్లు సమాచారం. వాతావరణ బీమా కింద 21,941 రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతుల దరఖాస్తులు 1,445 ఉండగా.. 36,596 బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందని రైతుల దరఖాస్తులు ఉన్నాయి. అంటే పంటల బీమా పట్ల బ్యాంకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 4,390 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. సర్వర్ సమస్యలతో కిక్కిరిసిన మీసేవ కేంద్రాలు గంటల తరబడి నిరీక్షించిన రైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అన్నదాతల ఆగ్రహం -
నందవరంలో జిల్లా కలెక్టర్
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారిగణియా బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీకుమార్రెడ్డి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జిల్లా కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాన్ని అందజేశారు. ఎస్పీని కలిసిన ఏఎస్పీ బొమ్మలసత్రం: ఎస్పీ సునీల్ షెరాన్ను ఏఎస్పీగా బదిలీపై వచ్చిన ఐపీఎస్ అధికారి సుస్మిత బుధవారం స్థానిక కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నంద్యాల సబ్డివిజన్కు సంబంధించి నేరాల కట్టడిపై చర్చంచుకున్నారు. ఈమె ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం నుంచి సాధారణ బదిలీపై నంద్యాలకు వచ్చారు. అవుకులో 0.7 టీఎంసీల నీరు కొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.7 టీఎంసీలకు పడిపోయాయి. రిజర్వాయర్ బండ్ కింద లీకేజీ కారణంగా నీళ్లు వృథా అవుతున్నాయి. అధికారులు లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టిన 30 శాతం మాత్రమే లీకేజిని అరికట్టగలిగారు. ఇంకొన్ని రోజులుపోతే రిజర్వాయర్ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది రెండు సార్లు రివిట్మెంట్ కుంగిపోయిన కారణంగా 4 టీఎంసీలు ఉండగా గాలేరి –నగరి వరద కాల్వ ద్వారా రెండు టీఎంసీలకు పైగానే వైఎస్సార్ కడప జిల్లాకు వదిలారు. ఈఏడాది జలసంక్షోభం కారణంగా వరి సాగు చేసే రైతుల్లో ప్రశ్నార్థకంగా మారింది. కనీసం నారుమళ్లు పోసుకునేందుకు కూడా నీళ్లు లేక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓ కొత్తపల్లి: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం డీఈఓ జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం, నీటి సమస్య ఉండటాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇచ్చే స్నాక్స్లో పురుగులు రావడం నిజమేనని తేలింది. భోజనంలో సాంబారు, రసం, మజ్జిగ తగినంతగా వడ్డించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేయడంతో సిబ్బందిలో ఒకరిని తొలగించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి.. మెనూ, నాణ్యత పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాలను జిల్లా ఫుడ్సెఫ్టీ అధికారి వెంకటరమణ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వీరి వెంట తహసీల్దార్ ఉమారాణి, జీసీడీఓ జ్యోతి, మండల విద్యాధికారి నాగరాజు ఉన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2025 నవంబర్లో జరిగిన బీఎడ్ మూడవ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 654 మంది రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 189 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. -
టీడీపీ నాయకుల ఎర్రమట్టి దందా!
నందికొట్కూరు: టీడీపీ నాయకులు బరితెగించారు. కుంటలను, చెరువులను కూడా వదలకుండా ఎర్రమట్టి తవ్వి అమ్మేస్తున్నారు. నందికొట్కూరు మండం అల్లూరు గ్రామ సమీపంలో జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు ఆరు ట్రాక్టర్ల ద్వారా 70 ట్రిప్పులు తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ రూ. 1000 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా మైనింగ్ అధికారులు స్పందించడం లేదు. కొనుగోలు చేసిన ఎర్రమట్టిని రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సొంత ఊరిలోనే టీడీపీ నాయకులు జోరుగా అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఈ ఊర్లకుంటలో పడి ముగ్గురు పిల్లలు మృతిచెందిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కుంటలోని మట్టి తవ్వకుండా చుట్టూ కంచె వేయిస్తామని టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ కుంటను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. మరి ఎంతమంది పిల్లల ప్రాణాలను బలి చేయాలని చూస్తున్నారో అని ప్రజలు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండా.. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలించడమే కాకుండా బెదరింపులకు పాల్పడటమేమిటని అల్లూరు గ్రామ ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఊర్లకుంట నుంచి రహదారి నిర్మాణాలకు సారవంతమైన ఎర్ర మట్టిని తరలించి అమ్ముకుంటున్నారని తెలిపారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే ట్రాక్టర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఊరి సమీపంలో అక్రమ తవ్వకాలు ఒక ట్రాక్టర్ ఎర్ర మట్టి రూ.1000 చొప్పున విక్రయం చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు -
వ్యవసాయానికి పగలు 9 గంటలు విద్యుత్ ఇవ్వాలి
ఆత్మకూరు: వ్యవసాయానికి పగలే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఏడీ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెలలో కురిసిన వర్షాల వల్ల ముందస్తు వ్యవసాయం చేసి మొక్కజొన్న, పత్తి, వరి, మిర్చి కూరగాయల పంటలు సాగు చేశారని, జూన్, జులై నెలల్లో వర్షాలు కురవకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయన్నారు. బోరుబావుల ద్వారా పంటలను కాపాడుకుందామనుకుంటే విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటం లేదన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పగటిపూటే 9 గంటల విద్యుత్ను అందించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యం.వీరన్న, పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడు ఎం.మహబూబ్బాషా, బాలయేసు, అంబయ్య, జమాల్ఖాన్, రాజమ్మద్, రబ్బాని, బి.హిదయతుల్లా, ఏసన్న, రంగస్వామి, దేవకుమార్ పాల్గొన్నారు. -
శ్రీరాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3,71,35,259 కోట్లు సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. జూన్ 23 నుంచి జూలై 14 తేది వరకు సంబంధించి 22 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపేణా రూ 3,60,37,959.. నాణేలా రూపంలో రూ.10,97,300 వచ్చినట్లు వివరించారు. అలాగే 23 గ్రాముల బంగారం, 1085 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు. -
రూ.10 లక్షల ఎరువుల అమ్మకాలు నిలిపివేత
చాగలమర్రి: ముత్యాలపాడు గ్రామంలో రెండు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో రూ.10 లక్షల ఎరువుల అమ్మకాలను నిలిపివేసినట్లు స్థానిక ఏఓ రంగనేతాజీ మంగళవారం తెలిపారు. స్థానిక శ్రీలక్ష్మీ ఆగ్రో టెక్లో రూ. 8.50 లక్షల విలువైన ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మీ నరసింహ పెస్టిసైడ్స్ దుకాణంలో రూ. 2.50 లక్షల విలువైన పెస్టిసైడ్స్కు సరైన రికార్డులు లేనట్లు గుర్తించారు. అలాగే యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నార ని తెలుసుకుని అమ్మకాలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. జాతీయ స్థాయి అవార్డు దరఖాస్తుకు గడువు పెంపు నంద్యాల(న్యూటౌన్): జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, ఉన్నత పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్, సైనిక పాఠశాల, ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుల్లో 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారు దరఖాస్తులనుhttp:// nationala wardstoteachers. education. gov. in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యా యుల స్వీయ నామినేషన్లు ఈనెల 20లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు జిరాక్స్కాపీలో సమర్పించాలని డీఈఓ జనార్ధన్రెడ్డి తెలిపారు. -
ఎల్నినో మానిటరింగ్ బృందం ఏర్పాటు
నంద్యాల(అర్బన్): జిల్లాలో సాగు అయ్యే పంట లపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జిల్లా స్థాయిలో ఎల్నినో మానిటరింగ్ బృందాన్ని ఏర్పా టు చేశారు. బృందంలో ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు అశోక్కుమార్, మల్లేశ్వరరెడ్డి, నజీరుద్దీన్, వ్యవసా య ఉప సంచాలకులు గంగాధర్రావు, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఉన్నారు. మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వారు నంద్యాల మండలం మునగాల, రాయమాల్పురం గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సకాలంలో సాంకేతిక సూచనలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్ష్షపాత పరిస్థితులు, పంటల స్థితి గతులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, రైతులకు వ్యవసాయ సలహాలు అధికారుల ద్వారా అందించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూలై నెలలో జిల్లాలో 116 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 6.మి.మీ మాత్రమే నమోదు కావడంతో 30 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. -
కాటేజీలో ‘ప్రైవేట్ వ్యాపారం’..
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్ర పరిధిలో దాతలు నిర్మించిన కాటేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. కొందరు అధికారులు, అర్చకులు, పరిచారకులు కాటేజీలను సొంతం చేసుకుని కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. దాతలు నిర్మించిన కాటేజీలను కొందరు నివాసంగా మార్చుకుని అటు దేవస్థానం ఆదాయానికి గండి కొడుతుండగా.. ఓ పరిచారకుడు తనకున్న పలుకుబడితో కాటేజీ పొంది అక్రమంగా ప్రైవేట్ వ్యాపారం నిర్వహిస్తుండటం గమనార్హం. సామాన్య భక్తులతో పాటు క్షేత్ర సందర్శనకు వచ్చే వీవీఐపీల కోసం దాతల సహకారంతో దేవస్థానం కాటేజీలను నిర్మించింది. నిర్మాణానికి ముందుకొచ్చే దాతలతో దేవస్థానం కొంత డబ్బును అడ్వాన్స్గా డిపాజిట్ కట్టించుకుని స్థలాన్ని కేటాయిస్తుంది. దేవస్థానం నియమ నిబంధనల మేరకు దాతలు నిర్మాణం పూర్తిచేసి దేవస్థానానికి అప్పగిస్తారు. ఈ కాటేజీలను దేవస్థానం భక్తులకు రోజు వారి అద్దె ప్రాతిపదికన అందిస్తుంది. కాటేజీ దాతలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా, దాతలు సిఫార్సు చేసిన వారికి సగం అద్దె తీసుకుంటారు. దాతలకు సంవత్సరంలో 30 రోజులు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తారు. కాగా దాతలు నిర్మించిన కాటేజీలను కొందరు నివాసంగా మార్చేసుకున్నారు. ఈఓ భవనం పూర్తయినా ప్రారంభించరు.. శ్రీశైలాలయం కార్యనిర్వహణాధికారి భవనం, క్యాంప్ కార్యాలయానికి దేవస్థానం రూ.1.50 కోట్లతో అధునాతన హంగులతో భవనం నిర్మించారు. గణేశ సదనం పక్కన విశాలమైన ప్రదేశంలో ఈఓ భవనంతో పాటు, క్యాంప్ కార్యాలయం రూపుదిద్దుకుంది. నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. అయితే గత ఈఓలు కొద్దిపాటి మరమ్మతులు చేయాలని జాప్యం చేస్తూ ఇంత వరకు భవనాన్ని ప్రారంభించలేదు. భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. ఈఓకు గృహం ఉండాలి కాబట్టి దాతలు కట్టించిన ఓ ప్రైవేట్ కాటేజీలో నివాసం ఉంటున్నారు. గత ఈఓ ఉన్న కాటేజీకి వాస్తు బాగాలేదని, ప్రస్తుత ఈఓ తూర్పు ముఖద్వారం ఉన్న ఓ కాటేజీలో నివాసం ఉంటున్నారు. మల్లన్న ఆదాయానికి రూ.కోట్లలో నష్టం దేవస్థానంలో విధులు నిర్వహించే ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మరో ఇద్దరు అర్చకులు, ఓ సహాయ వంట మనిషి సైతం కాటేజీలలో తిష్ట వేశారు. అసలే కాటేజీలు తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువ ఉండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. కల్యాణకట్టకు ఎదురుగా ఉండే పాత కాటేజీల్లో అయితే చాలా మంది అధికారులు, సిబ్బంది పలువురు కాటేజీలలో నివాసం ఉంటున్నారు. గతంలో ఈఓలుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు సైతం కల్యాణకట్టకు ఎదురుగా ఉన్న పాత కాటేజీలకు మరమ్మతులు చేయించుకుని నివాసం ఉండేవారు. ప్రస్తుతం దేవస్థాన ఉన్నతాధికారి నివాసం ఉండే కాటేజీకి రోజు వారీ అద్దె సుమారు రూ.10 వేలు ఉంటుంది. నెలకు రూ.3 లక్షలు, సంవత్సరానికి రూ.36 లక్షలు కేవలం ఉన్నతాధికారి కాటేజీ ద్వారా దేవస్థానానికి నష్టం చేకూరుతుంది. అలాగే ఈఈ కాటేజీ రూ.4వేలు, అర్చకులు ఉండే కాటేజీలకు రూ.2వేలు, సహాయ వంట మనిషి ఉండే కాటేజీకి రూ.2 వేలు రోజు వారీ అద్దె ఉంటుంది. ఇలా మల్లన్న ఆదాయానికి ఏటా ఎంత నష్టం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభానికి నోచుకోని ఈఓ నూతన భవనం తాంత్రిక పూజల కలకలం ఆలయంలో పని చేస్తున్న ఓ అర్చకుడు తాంత్రిక పూజలు చేయడం కలకలం రేపుతోంది. ఓ ఉన్నతాధికారితో సఖ్యతగా మెలుగుతున్న ఈయన అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆలయ ముఖ్యుల్లో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇటీవల ఆయన మరొకరితో కలిసి తాంత్రిక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అర్చకుడు ఆలయంలో తన హవా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈయన తీరుతో మిగిలిన అర్చకులు సైతం మండిపడుతుండగా.. అధికారి ఆశీస్సులు ఉండటంతో ఏమీ చేయలేక లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో సొంతానికి కాటేజీలు కాటేజీ పాతబడిందనే కారణం చూపి, తనకున్న పలుకుబడితో దేవస్థానంలో సహాయ వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్న ఓ రెగ్యులర్ ఉద్యోగి కాటేజీ పొందాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ప్రైవేట్ వ్యాపారులకు తన కాటేజీని రెంట్కు ఇచ్చారు. తాను ఉంటూనే వ్యాపారులకు చెందిన వస్తువులు తన కాటేజీలో స్టోర్ చేసుకునేలా ఒప్పందం చేసుకొని నెలకు సుమారు రూ.50 వేలు అద్దె రూపంలో తీసుకుంటున్నట్లు తెలిసింది. నిత్యం వీవీఐపీలు బస చేసే కాటేజీలకు సమీపంలోనే సహాయ వంట మనిషి కాటేజీ ఉన్నప్పటికీ ఎవరికీ భయపడకుండా, దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యాపారం నిర్వహిస్తుండటం గమనార్హం. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోసం నిర్మించిన భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. చిన్నపాటి మరమ్మతు పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి ఈఓలుగా పనిచేసిన వారు కాటేజీలనే క్యాంప్ కార్యాలయాలుగా చేసుకుని పరిపాలన సాగించారు. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగుతోంది. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
తరుముకొస్తోంది మంచినీటి ముప్పు
గతేడాది కుందూనదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతున్న నది దొర్నిపాడు: వర్షాలు ముఖం చాటేశాయి. ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో జలాశయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహించాల్సిన నదులు అడుగంటాయి. జూన్ నెల నుంచే జలకళను సంతరించుకునే కుందూనదిలో ప్రస్తుతం చుక్కనీరు లేకుండా పోయింది. నది అంతా రాళ్లు తేలి వెలవెలబోతుంది. నది పరివాహక ప్రాంతాల్లో మంచినీటి ముప్పు తరుముకొస్తోంది. మంచినీటి పథకాలకు నీరు సరఫరా చేసే పరిస్థితి రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రస్తుతం గుంతల్లో ఊటనీటితో నీటిని అందిస్తున్నారు. కుందూ ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. కనీసం నారుమళ్లు కూడా కనిపించడం లేదు. గతేడాది ఇదే నెలలో క్రిష్టిపాడు గ్రామ వంతెన మీద నీరు పారుతుండగా ప్రస్తుతం బోసిపోయి కనిపస్తోంది. -
యాగంటీశ్వరుడి హుండీ ఆదాయం రూ. 33.28 లక్షలు
బనగానపల్లె రూరల్: యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.33.28 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం హుండీ కానుకలు లెక్కించగా.. రూ. 33,28,573 నగదు, 68 గ్రాముల వెండి, గ్రాము బంగారం వచ్చిందన్నారు. ఈ ఆదాయం 109 రోజులకు సంబంధించిందన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ పర్యవేక్షణాధికారి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్వామి సేవకులు పాల్గొన్నారు. ఏఎస్పీ సుస్మిత బాధ్యతల స్వీకరణ బొమ్మలసత్రం: నంద్యాల డివిజన్ ఏఎస్పీగా ఐపీఎస్ అధి కారిణి సుస్మిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కార్యాల యం వద్దకు చేరుకు న్న ఆమెకు డీఎస్పీ రామాంజినాయక్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆమెను ఆశీర్వదించి తీర్థ్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. విధినిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టండి కొత్తపల్లి: నాటు సారా తయారీ, మద్యం అక్రమ విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల రైతులు, ప్రజలు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శాంతిభద్రభతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో స్నేహపూర్వంగా మెలగాలని సూచించారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ జయశేఖర్ గౌడ్ ఉన్నారు. రైతు ఉత్పత్తి దారులసంఘాలకు ఆర్థ్ధిక సహకారం నంద్యాల(అర్బన్): రైతు ఉత్పత్తి దారుల సంఘా ల ఆర్థ్ధిక సహకారం అవసరమని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ అనిల్కుమార్, ఆర్బీఐ ఎల్డీఓ రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) డిస్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్యాంకుల రుణాల పంపిణీ, వార్షిక రుణ ప్రణాళిక అమలు, ప్రభుత్వ పథకాల పురో గతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ, ఇతర రంగాల్లో 136.32 శాతం రుణాల సాధన నమోదు అయినా ఇంధన రంగంలో 527 శాతం సాధన వల్లే పురోగతి పెరిగిందన్నారు. ఈ రంగంలో రూ.937 కోట్ల లక్ష్యానికి గాను రూ.49 కోట్ల మేర రుణాలు మంజూరైనట్లు తెలిపారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు బ్యాంకు రుణాల అనుసంధానం ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి సంఘాలకు తగిన ఆర్థిక సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తిక్, ఎల్డీఎం అయ్యపురెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరూ ఓటు హక్కును కాపాడుకోండి
కల్లూరు: ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ గడువును మరో పది రోజులు పొడిగించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ పరిధిలోని 19, 20, 21, 32, 35, 37, 41వ వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కాటసాని రాంభూపాల్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పెంచిన సర్ గడువును అర్హులైన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎంత మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు? ఎంతమంది ఫారాలను పూర్తి చేశారని తదితర వివరాలను బీఎల్ఓలను, సూపర్వైజర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించిన ఓటర్ల వివరాలను డిజిటైజేషన్ చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట ఆయా వార్డుల మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి -
24 వరకు సర్ గడువు పొడిగింపు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను విచారించి పరిష్కరించే ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించి సవరించిన షెడ్యూల్ను సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రజలకు ఈ షెడ్యూల్పై పూర్తి అవగాహన కల్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సవరించిన షెడ్యూల్ను లిఖితపూర్వకంగా తెలియజేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. -
డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తాం
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఫ్యాప్టో చైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల శ్రీనివాససెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయరాజు, సురేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సిన 11వ పీఆర్సీ, అరియర్స్, 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్, ఎన్క్యాష్మెంట్ 30 శాతం, ఐఆర్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు డీఏలు, పాత బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎంఈఓ బదిలీలు, హెచ్ఎంల పరస్పర బదిలీలు, ఎంఈఓ–1, 2 జాబ్ చార్ట్లో అసమ్మతులను తొలగించాలని, ఎస్ఎస్ఏలో సెక్టోరల్ అధికారులు డీఐఈటీ సీనియర్ లెక్చరర్లుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలన్నారు. పంచాయతీ రాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు వరప్రసాద్, చంద్రశేఖర్, నగరి శ్రీనివాసులు, కిరణ్కుమార్రెడ్డి, స్వామిశేఖర్, కేవీ శివయ్య, లక్ష్మణ్నాయక్, రవికుమార్, అజాంబేగ్, సైఫుల్లా, సుధాకర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చనేతల ఎర్రమట్టి దందా
బనగానపల్లె: కూటమి నేతలు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. ఇసుక, మట్టి, మొరుసు కనిపించినా వదలడం లేదు. బనగానపల్లె కేంద్రంగా ఎర్రమట్ట దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలోని రామతీర్థం సమీపంలోని జంగమయ్య మొలమీది ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎర్రమట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా కొండలను కరిగించేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 40 నుంచి 50 టిప్పర్ల వరకు ఎర్రమట్టిని నంద్యాల, మద్దూరు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులకు టిప్పర్కు రూ.600 నుంచి రూ. 700 చెల్లిస్తుండగా.. ప్రొక్లెయిన ర్ యజమానికి టిప్పర్కు రూ.300 నుంచి 400 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ లేక పోయినప్పటికీ, మైనింగ్ అధికారులకు రాయల్టీ చెల్లించకున్నా దర్జాగా దందా సాగిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లతో దాడులు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఎటువంటి అక్రమ రవాణా జరగలేదని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఎర్రమట్టి దందాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రూ. 500 మేర కమీషన్ -
నిలిచిపోయిన ఏఎన్ఎంల పదోన్నతులు
● ఇతర జిల్లాల్లో అమలు.. కర్నూలులో నిరీక్షణకర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎన్ఎంఎంలకు పదోన్నతుల ప్రక్రియ ఇతర జిల్లాల్లో కొనసాగుతున్నా కర్నూలు జిల్లాలో చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో హెల్త్ కార్యదర్శులు(ఏఎన్ఎం)లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. అయితే పదోన్నతుల విషయంలో మాత్రం వీరికి అన్యాయం జరుగుతోంది. జిల్లాలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 1,008 మందికి హెల్త్ కార్యదర్శులుగా ఉద్యోగాలు కల్పించారు. వీరి సీనియారిటీ మేరకు గత సంవత్సరం 175 మందికి పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం 833 మంది సచివాలయ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో అమలుకాని ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత అనేక జిల్లాల్లో అర్హులైన హెల్త్ కార్యదర్శులు(ఏఎన్ఎం)లకు పదోన్నతులు కల్పించారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఫైళ్లు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో తమతో పాటు పనిచేసిన సహొద్యోగులు పదోన్నతులు పొంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తుంటే తాము మాత్రం అదే స్థాయిలో కొనసాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం ఈ అంశంపై ఇప్పటికే ఏఎన్ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పదోన్నతుల ప్రక్రియ ఎందుకు నిలిచిపోయిందని ఆ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆ శాఖలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 14తో అన్ని రకాల పదోన్నతులు ఫ్రీజ్ అవుతున్నాయని, ఏఎన్ఎంల పదోన్నతుల ప్రక్రియకు గడువు పొడిగించి పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తమ ఆవేదన వినిపిస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఏఎన్ఎంల పదోన్నతుల ప్రక్రియ చేస్తున్నారని, ఇక్కడ కూడా చేయాలంటే కుదరదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. సచివాలయ ఏఎన్ఎంలకు నవంబర్, డిసెంబర్లలో పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు కాదు, ఇప్పుడే చేయాలంటే ఎలా?. –డాక్టర్ ఎల్.భాస్కర్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ, కర్నూలు -
భర్తను కడతేర్చిన భార్య
● కుమార్తెలు, అల్లుడితో కలిసి దాడిచేసి హత్య పత్తికొండ రూరల్: కుటుంబ కలహాల కారణంగా భర్తను తన కుమార్తెలు, అల్లుడితో కలిసి భార్య కడతేర్చారు. ఈ ఘటన సోమవారం హోసూరు గ్రామంలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్(51)కు భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు నీలావతి, సుజాత, అల్లుడు రాజశేఖర్ ఉన్నారు. కుటుంబ విభేదాలతో భార్యాభర్తలు వేర్వేరు ఇళ్లలో నివశిస్తున్నారు. సునీతతో కలిసి కుమార్తెలు ఉంటున్నారు. శ్రీనివాస్ తన సొంతింట్లో ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆస్తి పంపకాలు, గొడవలకు సంబంధించి వివాదం ముదిరిపోయింది. దీంతో భార్య సునీత, కుమార్తె, అల్లుడి సాయంతో హత్యకు పథకం వేశారు. రాత్రి సమయంలో మేకల శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. రాడ్లు, కట్టెలు, కర్రలతో దాడి చేసి చంపేశారు. కాళ్లు, చేతులు విరిగి రక్తస్రావమై మేకల శ్రీనివాస్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ జయన్న గ్రామానికి చేరుకుని హత్యపై విచారణ చేపట్టారు. నలుగురిపైన హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ జయన్న తెలిపారు. -
ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధిస్తున్నారు!
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడుకర్నూలు: ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కల్లూరుకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా ఆయన వేడుకున్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో మరికొన్ని ఫిర్యాదులు... ● తన కుమారుడు షణ్ముఖ మృతిపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెరుమాళ్ల విజయ్ అనే వ్యక్తి రూ.34 వేలు తీసుకుని మోసం చేశాడని కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన హుసేన్ ఫిర్యాదు చేశారు. ● కల్లూరుకు చెందిన నాయకంటి మహేశ్వరి ఉద్యోగాల పేరుతో తన తమ్ముళ్లు, మామ, అత్తల నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన పార్వతమ్మ ఫిర్యాదు చేశారు. ● తండ్రి ఉద్యోగం తనకు రాకుండా తమ్ముడు ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్ సృష్టించి ఉద్యోగం తనకు రాకుండా మోసం చేశాడని కర్నూలు ఎర్రబురుజుకు చెందిన అరుణ జ్యోతయ్య ఫిర్యాదు చేశారు. ● సెలూన్, బ్యూటీపార్లర్, టాటూ స్టూడియోలకు ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి అగ్రిమెంట్ చేసుకుని, మెటీరియల్ పేరుతో రూ.60 లక్షలు తీసుకుని హైదరాబాదుకు చెందిన మార్కెటింగ్ మేనేజర్ బృహస్పతి రావు, నరసరావుపేటకు చెందిన అష్రఫ్ వలి మోసం చేశారని కర్నూలుకు చెందిన చకిత ఫిర్యాదు చేశారు. -
‘మార్కెట్’ పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లా పాణ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలాన్ని మొదటి దఫా ఆరు నెలలు పొడిగిస్తూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. శతాధిక వృద్ధురాలి మృతి ఎమ్మిగనూరుసెంట్రల్: ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామంలో శతాధిక వృద్ధురాలు కురువ హనుమంతమ్మ(106) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల క్రితం వరకు తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న ఈమెకు ఇటీవల వృద్ధాప్య సమస్యలు వెంటాడాయి. బీపీ, షుగర్ వంటి లక్షణాలు లేవని, అందరినీ ఎంతో ఆప్యాయంగా పలికించరేవారని గ్రామస్తులు తెలిపారు. వైద్యులు డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఇతర రాజకీయ ప్రముఖులు హనుమంతమ్మ మృతదేహానాకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లేగు సంభవించడం, తుంగభద్ర దిగువ కాలువ పనుల ప్రారంభం వంటివి హనుమంతమ్మకు గుర్తు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. అప్పుల బాధతో అస్వస్థతకు గురై.. బండిఆత్మకూరు: అప్పుల భారం ఓ రైతు ప్రాణం తీసింది. పరమటూరు గ్రామానికి చెందిన పిక్కిలి శివరాజు (43) గతేడాది తనకున్న ఏడెకరాల పొలంతో పాటు, మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, పొగాకు పంటలు సాగు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పుల భారంతో మనోవేదనకు గురై పది రోజుల క్రితం అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అస్వస్థతకు గురై గుండె పోటు రావడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. శివరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య పద్మావతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. సార్.. వ్యవసాయమే ఆధారం ● ఉయ్యాలవాడలో ఎస్పీ పర్యటన ● గ్రామస్తులతో కాసేపు మాటామంతి ఉయ్యాలవాడ: ‘సార్ మా మండలంలో ఎలాంటి పరిశ్రమలు లేవు. ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది ఇంత వరకు పంటలు సాగు చేసేందుకు వానలు కురవలేదు’ అంటూ ఉయ్యాలవాడ ప్రజలు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో అన్నారు. సోమవారం ఉయ్యాలవాడను ఎస్పీ సందర్శించారు. గ్రామస్తులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం సమీపంలో వున్న రచ్చబండపై కాలాక్షేపానికి గ్రామస్తులు ఆడుతున్న పులిగీతం ఆటను చూసి.. ఆటను ఎలా ఆడాలంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి వంశీయులు బుడ్డా విశ్వనాథరెడ్డి స్వగృహానికి వెళ్లారు. వెంగళరెడ్డి జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఆయనకు విక్టోరియా మహారాణి అందజేసిన బంగారు పతకాన్ని సందర్శించి, ఆ పతకం ఇవ్వడానికి కారణాలను తెలుసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పై కప్పు నుంచి ఇనుప చువ్వలు బయట పడివుడడంపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామస్తులు కక్షలకు దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, రామిరెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జొన్నల కొనుగోళ్లు చేపట్టండి
● కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళననంద్యాల(అర్బన్): జిల్లాలో మిగులు జొన్నలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట గడివేముల మండలం బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాల రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జొన్నల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయంటూ సివిల్సప్లయ్ అధికారులు, అనుమతులు రాలేదంటూ కలెక్టర్ కార్యాలయ అధికారులు చెబుతుండటంతో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. జొన్నలు కొనుగోలు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ.. జిల్లాలో 54వేల ఎకరాల్లో జొన్నపంట సాగు అయి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయన్నారు. ప్రభుత్వం కేవలం 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి టార్గెట్ అయిపోయిందని చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్రం తన వాటాగా జొన్నలు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఉన్న కలెక్టర్కు సమస్యను వివరించగా.. కేంద్ర ప్రభు త్వం నుంచి జొన్నల కొనుగోళ్లకు అనుమతులు వచ్చినట్లు మెసేజ్ వచ్చిందని కలెక్టర్ రాజకుమారి తెలిపారని రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి మంగళ, బుధవారాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. -
కొండ నిండా భక్తజనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4గంటలు, అతిశీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. -
చదవాలంటే నడవాల్సిందే
రుద్రవరం: మండలంలోని పలు గ్రామాల విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. చదువుకోవాలంటే కి.మీ.ల దూరం నడవాల్సి వస్తోంది. ముత్తలూరు, చిత్రేనిపల్లె, పెద్దకంబలూరు గ్రామాల్లోని విద్యార్థులకు ఈ దుస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు మాత్రమే చదివే అవకాశం ఉండటంతో ఆ తర్వాత 6వ తరగతి నుంచి చదివేందుకు 1 కి.మీ నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోజూ విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కాగా ఈ ఏడాది పాఠశాలలు తెరిచి నెల గడిచినా ఇప్పటి వరకు విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయకపోవడంతో ఒట్టి కాళ్లతో నడక సాగిస్తున్నారు. ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మిని వివరణ కోరగా.. బూట్లు మండల కేంద్రం రుద్రవరానికి వచ్చాయని, సైజుల వారీగా వేరు చేసి పాఠశాలలకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
వర్షం కోసం ఎదురుచూపు
వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా గత ఏడాది కంది, మొక్కజొన్న పంటల సాగుతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్సీజన్పై వర్షాభావ పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ ఏడాది 20 ఎకరాల సొంతం పొలంలో వరి, బెండ, మినుము పంటల సాగుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. అదునుకు పదునయ్యే వర్షాల కోసం ఎదురు చూస్తున్నా. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది నాకున్న నాలుగు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 50 వేలు వెచ్చించాను. బోరునీటి ఆధారంగా పైరు సాగుచేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరులో నీటి ప్రవాహం తగ్గింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దిగుబడులు చేతికందే పరిస్థితి కన్పించడం లేదు. – నాగరాజు, రైతు, పాలసాగరం, ఆళ్లగడ్డ మండలం -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకులు జరిపించారు. స్వర్ణరథంలో కొలువైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు జి.లక్ష్మీదేవి, ఆలయ ఏఈవో జి.స్వాములు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారు లు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
29న శాకాంభరీ ఉత్సవం
శ్రీశైలంటెంపుల్: అషాఢపౌర్ణమి సందర్భంగా ఈ నెల 29న భ్రమరాంబాదేవికి శాకంభరీ ఉత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థాన పరినాలన భవనంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు(అధ్యాపక), డీఈఓ, అన్ని శాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులతో శాకంభరీ ఉత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ లోకకల్యాణం కోసం జరిపే ఉత్సవంలో ఆయా కై ంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. ఉత్సవానికి కనీసం నలబై రకాల అకుకూరలు, కూరగాయలను, పండ్లను తెప్పించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. భ్రమరాంబాదేవితో పాటు ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి అమ్మవారిని, గ్రామదేవత అంకాళమ్మను కూడా శాకంభరీ అలంకరణలో విశేష పూజలు నిర్వహించాలరు. ఈ నెల 29న అమ్మవారి ఆర్జిత కుంకుమార్చనలను పూర్తిగా నిలుపుదల చేయాలని అదేశించారు. జిల్లా ట్రెజరీ అధికారిణిగా సరస్వతి నంద్యాల(అర్బన్): జిల్లా ఖజానా, గణాంక శాఖ అధికారిణిగా సరస్వతి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో సహాయ ఖజానా అధికారిణిగా పని చేస్తూ పదోన్నతిపై నంద్యాల జిల్లాకు వచ్చారు. జిల్లా ట్రెజరీ అధికారిణిగా పని చేస్తున్న లక్ష్మీదేవి నెల్లూరు జిల్లా ఉపసంచాలకులుగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సంఘం నాయకులు సునీల్, శేఖర్ తదితరులు గణాంక అధికారి సరస్వతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జెడ్పీ సీఈఓగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా ఆర్.సుధాకర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెగ్యులర్ సీఈఓగా విధులు నిర్వహించిన జీవీ రమణారెడ్డి గత జూన్ 30న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న సెర్ఫ్లో విధులు నిర్వహిస్తున్న ఆర్.సుధాకర్ రెడ్డిని జెడ్పీ సీఈఓగా నియమిస్తూ పీఆర్ అండ్ ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కాంతిలాల్ దండె ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని గౌరవపూర్వకంగా కలసి బాధ్యతలు స్వీకరించారు. చెక్బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 18న చెక్బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై 18న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ చెక్బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎల్డీ ప్రవేశాలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్ కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్డీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి (మంగళవారం) నుంచి 18వ తేదీలోపు వెబ్ ఆధారిత అప్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వ డీఎల్డీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆయూబ్ హుసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్–ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో అర్హత సాధించిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సీట్ల కేటాయింపు చేస్తారని తెలిపారు. వీరంతా 24 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ డైట్ కాలేజీలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొన్నారు. -
పొలాల్లో కన్నీళ్లు!
కరువు సీమ ఎండుతోంది. వరుణుడు ముఖం చాటేయడంతో పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కళ్ల ముందే వాడుతుండటం అన్నదాతను కలవరపెడుతోంది. ఈరోజు, రేపు అనే ఎదురుచూపులతో రోజులు గడుస్తున్నాయే కానీ వర్షం కురుస్తుందన్న నమ్మకం లేకుండాపోతోంది. ఆశ చావక కొందరు మళ్లీ వేలాది రూపాయలు పోసి ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కరువు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముందస్తు సాగు చేసిన రైతులు చినుకు జాడలేక పెట్టుబడులు నేలపాలై కన్నీరుమున్నీరవుతున్నారు. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుపంటను కాపాడుకునేందుకు మొక్కలకు నీళ్లు స్ప్రే చేస్తున్న రైతు రామాంజినేయులు -
పాఠశాల స్థలాన్ని సర్వే చేయండి
ఆళ్లగడ్డ: ఎర్రగుంట్ల ఎంపీపీ స్కూల్కు సంబంధించిన మొత్తం స్థలాన్ని సర్వే చేసి హద్దు చూపించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈఓ శంకరప్రసాద్ తెలిపారు. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల ఎంపీపీ స్కూల్ స్థలం కబ్జాపై ఈ నెల 11న సాక్షిలో ‘తెగబడిన పచ్చ నేత’ శీర్షిక కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం డిప్యూటీ డీఈఓ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థలం కబ్జాకు గురైందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ద్వారా సర్వే చేసి కొలతలు కొలిచి పాఠశాల హద్దులు చూపించాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయించామన్నారు. సర్వే అనంతరం పాఠశాల స్థలం ఆక్రమణకు గురైతే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పాఠశాలకు రెండే గదులు ఉన్నాయని, మూడు అదనపు గదులు కూడా మంజూర య్యాయని, సర్వే చేసిన అనంతరం గదుల నిర్మాణం చేపడుతామన్నారు. ● కాగా విచారణకు వచ్చిన అధికారులు కబ్జా చేసిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మంతనాలు జరిపి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చేత సర్వేకు అర్జీ ఇవ్వమని చెప్పడం అధికారుల చిత్తశుద్ధిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
● ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల విషయంలో అధికారులు కేవలం నివేదికలు సమర్పించడమే కాకుండా, అర్జీదారులను వ్యక్తిగతంగా కలసి సమస్యను వివరించి పరిష్కరించే విధంగా వ్యవహరించాలన్నారు. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ పరిధిలో ఇనాం భూమిని పట్టా భూమిగా మార్చి అర్జీదారుడి సమస్యను పరిష్కరించడం ప్రశంసనీయమన్నారు. మరోవైపు జూపాడుబంగ్లా మండలంలో ఒక అర్జీకి సంబంధించి తప్పు సమాచారం అందించిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్లో మొత్తం 193 అర్జీలు స్వీకరించామని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ప్రతికూల వాతావ‘రణం’..
ఎల్నినో అనేది కొత్తది కాకున్నా ఈ సారి శక్తివంతమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలకు జీవనాడిగా భావించే సోమాలియా జెట్, మెడెన్– జూలియన్ అస్సిలేషన్ (ఎంజేవో) కూడా ప్రతికూలంగా ఉండటంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దక్షిణ హిందూ మహా సముద్రం నుంచి భూమధ్యరేఖను దాటి సోమాలియా తీరప్రాంతం వెంట అరేబియా సముద్రం మీదుగా భారతదేశం వైపు వీచే బలమైన తక్కువ ఎత్తు గాలుల ప్రవాహాన్ని జెట్గా పిలుస్తారు. అరేబియా సముద్రం నుంచి భారీగా తేమను భారత దేశానికి తీసుకరావడం వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం చూపిస్తాయి. సోమాలి యా జెట్ బలంగా ఉంటే సాధారణం మించి వర్షపాతం నమోదవుతుందని వాతావావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సోమాలియా జెట్ బలహీనంగా మారడంతో నైరుతి మందగించినట్లు అంచనా వేస్తున్నారు. ఎంజేవో అనేది హిందూ మహా సముద్రంలో 30 నుంచి 60 రోజుల వ్యవధిలో తూర్పుకు కదిలే విశాలస్థాయి మేఘాలు, వర్షాపాతం, గాలుల డోలనం వల్ల మంచి వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఎంజేవో అనేది కనిపించని వాతావరణ తరంగం లాంటిదని , తూర్పుకు చురుగ్గా కదిలితే రుతుపవనాల శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎంజేవో భారత్కు దగ్గరగా ఉన్నప్పుడు రుతుపవనాలు ప్రభావం చూపిస్తాయని, ప్రస్తుత తరుణంలో ఎంజేవో భారత్కు దూరంగా ఉన్నందున నైరుతి బలహీన పడే అవకాశం కన్పిస్తోందని అంచనా వేస్తున్నారు. -
జోలె పట్టి.. భిక్షమెత్తి!
చినుకు రాలడం లేదు.. పొలంలో వేసిన విత్తనం మొలకెత్తలేదు.. గుక్కెడు నీరు కూడా కరువయ్యాయి...దుస్థితిని తొలగించాలని వరుణ దేవుడు కరుణించాలని హొళగుంద ప్రజలు శనివారం రాత్రి జోలె పట్టి భిక్షాటన చేశారు. తమలో ఎలాంటి అహంకారం లేదని వర్షం కురువాలని ఈ కార్యక్రమం చేపట్టిననట్లు పెద్దమ్మవ్వ ఆలయ పరిసర ప్రజలు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ బృందాలుగా వీడి పరిసర వీధుల్లో కలియ తిరిగారు. ఇంటింటికి వెళ్లి జోలె పట్టి పాటపాడుతూ అడుక్కున్నారు. ఇలా తిరిగి సేకరించి డబ్బును, ధాన్యాన్ని దైవ కార్యానికి వాడుకుంటామని తెలిపారు. అందరూ కలిసి భిక్షమేసిన వంటలను భోజనం చేశారు. – హొళగుందజోలె వేసుకున్న మహిళ, భిక్షమెత్తుతున్న మహిళలు -
శ్రీశైలంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన న్యాయమూర్తి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ దంపతులు మల్లికార్జున స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఏఈఓ స్వాములు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. -
ఆరేళ్లుగా అసంపూర్తిగా!
● సాగుతున్న మోడల్ పాఠశాల గదుల నిర్మాణం ● అద్దె గదుల్లో విద్యాబోధన ● విద్యార్థులకు తప్పని తిప్పలునంద్యాల(అర్బన్): దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించడు.. అన్న చందంగా మారింది నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో మోడల్ స్కూల్ నిర్మాణ పనులు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో ఆరేళ్లు గడుస్తున్నా పాఠశాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. బిల్లుల పెండింగ్ కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేయలేకపోవడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించి నిధులు మంజూరు చేసినా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందుల మధ్య చదువుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మిట్నాల గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. 2021లో దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కాంట్రాక్టర్ల చేతి వాటాలతో నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందుల చదువులు చదవాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రత్యేక నిధులు కేటాయింపుతోనైనా పాఠశాల గదులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా గదుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఏళ్ల తరబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రస్తుతం పాఠశాలకు సొంత భవనాలు లేకపోవడంతో నంద్యాల పట్టణ సమీపంలోని పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించిన పాత భవనాల్లో విద్యార్థులకు విద్యను అందించడం ప్రారంభిచారు. భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో బండిఆత్మకూరు మండలం పార్నపల్లె వద్ద ఉన్న ప్రభాత్ జూనియర్ కళాశాలకు విద్యార్థులను తరలించి తరగతులను నిర్వహించారు. దూరభారం కావడంతో అధికారులు స్థానికంగా ఉన్న ఎస్పీవైరెడ్డి జూనియర్ కళాశాల గదులకు అద్దెలు చెల్లిస్తూ బోధన సాగిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే మూడు ప్రాంతాలకు విద్యార్థులను మార్చి ఇబ్బందులకు గురి చేశారు. 2026– 27 విద్యాసంవత్సరానికి అయినా మోడల్పాఠశాల గదులు పూర్తవుతాయని భావించిన విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. -
శ్రీగిరిపై భక్తుల రద్దీ
● రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తులుశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మల్లన్న ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. భక్తులకు క్యూకంపార్ట్మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. కాగా వారాంతపు సెలవు రోజులు కావడంతో శ్రీశైలంలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ కారణంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్, సిఫార్స్ల లేఖలతో వచ్చే వారికి మల్లన్న స్పర్శదర్శనం రద్దు చేసి, మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని దేవస్థాన అధికారులు ప్రకటన విడుదల చేశారు. -
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
● తేదీ, స్థలం ఎక్కడో మంత్రి బీసీనే నిర్ణయించాలి ● మంత్రి బీసీ సవాల్ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె: నియోజకవర్గంలో మంత్రి బీసీ రెండేళ్ల పాలనతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై తాను చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు. చర్చ జరిగే స్థలం, తేదీని మంత్రినే పోలీసులతో చర్చించి ప్రకటించాలన్నారు. ఆదివారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి బీసీ శనివారం విలేకరుల సమావేశంలో విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న బనగానపల్లెలో రైతు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ‘నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్లో వాయిస్ బాగా వినిపిస్తుందని, మంత్రిగా నీవు ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. మీ పని తీరు బాగా మెరుగు పరచుకోవాలని’ బీసీ ఉద్దేశించిన విషయాన్నే తాను ప్రస్తావిస్తే మంత్రి ఉలికి పడటం ఎంత వరకు సమంజసమన్నారు. సీఎం మాటలతో ఫ్రస్టేషన్కు గురైన మంత్రి తనపై నోరు పారేసుకోవడం అవివేకమన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వంలో మొదటి పేజీ మాత్రమే మార్పు చేసి అదే బుక్ను చంద్రబాబు పంపిణీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కమీషన్ల బీసీ.. బనగానపల్లె నియోజకవర్గంలో ప్రతి పనికి కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనని, కమీషన్ల మంత్రిగా బీసీ గుర్తింపు పొందారని కాటసాని రామిరెడ్డి విమర్శించారు. బనగానపల్లె మండల కేంద్రంలో రూ.22 కోట్లతో వందపడకల ఆసుపత్రిని నిర్మించి అక్కడ అప్పటి సీఎంగా జగన్మోహన్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి ఫొటోలు తొలగించడం సరైనదేనా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం అరకొర రోడ్లు వేసి పది అడుగుల ఎత్తైన శిలాఫలకాలు వేయించుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశించారు. వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడే మంత్రి ముందుగా టీడీపీ సీనియర్ నాయకులు బెలుం వెంకటసుబ్బారెడ్డి, కోడి నాగరాజు, పీఎల్ఎన్ కుమార్లకు ఎలాంటి న్యాయం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. చివరకు పీఎల్ఎన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు మంత్రి పేరు మీద ఉత్తరం రాసిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో రాష్ట్ర నాయకుడుగా ఉన్న అత్తార్జాహెద్ హుస్సేన్ గతంలో టీడీపీలో ఎంతో సేవ చేసినా ఆయనకు జరిగిన అన్యాయంతో తమ పార్టీలో చేరారన్నారు. పట్టణంలోని జీఎం టాకీసు నుంచి కొత్తబస్టాండ్ వరకు డబుల్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్తో పాటు విద్యుత్ స్తంభాలకు జాతీయ జెండా రంగుల్లో వేసిన ఎల్ఈడీ బల్బులు నేడు లేవన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు అత్తార్ జాహెద్ హుస్సేన్, సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, అంబటి రవికుమార్రెడ్డి అబ్దుల్ఫైజ్, సత్యంరెడ్డి మురళీ మోహన్రెడ్డి, ఖానిక్, కలాం, మారం ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర ఎకరాల్లో మిరప సాగు
గత ఏడాది ఒకటిన్నర ఎకరా సొంత పొలంతోపాటు ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగున్నర ఎకరాల్లో మిరప సాగు చేసి నష్టపోయాను. వాతావరణం అనుకూలించకగా ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి దిగబడులు రాలేదు. ఈ ఏడాదైనా నష్టాలు పూడ్చుకోవచ్చని ఆశతో రెండున్నర ఎకరాల సొంత పొలంలో సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నాను. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం గత ఏడాది ఏడు ఎకరాల్లో మిరప సాగు చేసి రూ. 2.50 లక్షల నష్టం వచ్చింది. మార్కెట్ గిట్టుబాటు ధర లేకపోవడంతో గుంటూరు కోల్డ్ స్టోరేజీలో భద్రపరుచుకున్నాను. ఈ ఏడాది ఎకరాకు రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడు ఎకరాలు, సొంతపొలం మరో మూడు ఎకరాల్లో కలిపి ఆరు ఎకరాల్లో మిరప సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నాను. – రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం -
ఆహార భద్రత చట్టానికి తూట్లు
కర్నూలు(సెంట్రల్): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్న అంత్యోదయ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని 35 కేజీల నుంచి 15 కేజీలకు కుదించే యోచనను విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైన నరేంద్రమోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం సుందరయ్య సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంత్యోదయ కార్డులకు 35 కేజీల నుంచి 15 కేజీలకు బియ్యాన్ని తగ్గిస్తే ఆహార భద్రతా చట్టానికి తూట్లు పొడిచినట్లు అవుతుందన్నారు. గతంలో యూపీఏ హయాంలో అప్పటి ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తే కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలతో వెనక్కి తగ్గాయన్నారు. ఈ క్రమంలో పేదల తరఫున మరోసారి కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలకు దిగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కోశాధికారి ఆంజనేయులు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న పాల్గొన్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం
రుద్రవరం: మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసి రాలేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటసాగు చేస్తే వాతావరణం అనుకూలించక పోవడంతో తొలగించాల్సి వస్తోంది. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, నర్సాపురం, అప్పనపల్లె, పెద్దకంబలూరు ఆలమూరు తదితర గ్రామాల పరిధిలోని రైతులు బోరు మోటర్ల కింద ఈ ఏడాది మే నెలలో మిర్చి సాగుచేశారు. పంట సాగు చేసి 60 రోజులైనా పూత, పిందె రాలేదు. తెగుళ్లు సోకి పూత పిందె రావండం లేదు. దీంతో రైతులు ఇక దిగుబడులు రావన్న ఆశలు వదులుకుని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే అందరి పరిస్థితి ఇలాగే ఉంది. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 13వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వైఎస్సార్ హయాంలో భజంత్రీల నియామకం మహానంది: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వేలాది మంది భజంత్రీలను ఆలయాల్లో నియమించారని టీటీడీ ఆస్థాన విద్వాంసకులు, పద్మశ్రీ డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మోరక్షిత రక్షితః అంటూ ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మమే రక్షిస్తుందన్నారు. కళాకారులు సౌభాగ్యంగా ఉంటే రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుందన్నారు. దేవాయాలను అభివృద్ధి చేయడంతో పాటు యువతను సంగీతం, సాహిత్యం వైపు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు, రేపు దస్తావేజులేఖరుల పెన్డౌన్ కర్నూలు(సెంట్రల్): ప్రైవేట్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో దస్తావేజుల పెన్డౌన్ ఉంటుందని దస్తావేజుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్ఏ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టే పెన్డౌన్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. స్టాంప్స్అండ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ను ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమన్నారు. అదే జరిగితే ఏళ్లుగా దస్తావేజు లేఖరులుగా పని చేస్తున్న వారు జీవన భృతిని కోల్పోతారన్నారు. ప్రభుత్వం వెంటనే తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు. సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు పత్తికొండ విద్యార్థిని పత్తికొండ రూరల్: వైజాగ్లో జూలై 15 వతేదీ నుంచి ప్రారంభం కానున్న సౌత్జోన్ పోటీలకు పత్తికొండ విద్యార్థిని ఎస్.ముబీనా ఎంపికయ్యారు. ఈనెల 5 నుంచి 11వరకు చిత్తూరు జిల్లాలో వాయల్పాడులో అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా జట్టుకు ముబీనా ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లోనే ఆల్రౌండర్గానే కాకుండా, బౌలింగ్లో ఉత్తమ ప్రతిభతో 4 వికెట్లు తీశారు. గుంటూరులోని గొరవయ్య కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతూ అక్కడే శుభం అసోసియేషన్ తరఫున క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. పత్తికొండలో తోపుడుబండి వ్యాపారం చేసుకుంటున్న తల్లి ఎం.ఖాజాబీ చిన్నతనం నుంచి తన కూతురుకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి విద్యార్థినిని ప్రోత్సహించారు. తమ కూతురు ముబీనా వైజాగ్లో జరిగే సౌత్జోన్ క్రికెట్ పోటీల్లో ఆడనుండటంపై తల్లి ఆనందం వ్యక్తం చేశారు. రేపు ‘ఫ్యాప్టో’ ధర్నా కర్నూలు(సెంట్రల్): ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 14న చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ ప్రకాశరావు, కర్నూలు జిల్లా చైర్మన్ ఎం.మధుసూధన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని ఉంటుందన్నారు. కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తామని తెలిపారు. ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
జయ జయ నారసింహా
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామి వారమైన శనివారం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రం తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదేమి ‘సర్’!డోన్ రూరల్: అత్యంత పారదర్శకంగా చేపట్టాల్సిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం దేవరబండ సచివాలయంలో శనివారం జరిగిన సంఘటనే ఉదాహరణ. గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) తన బాధ్యతను విస్మరించారు. టీడీపీ నాయకులు ఈడిగ రాము గౌడ్, తుపాకుల లక్ష్మీ నారాయణ రెడ్డి, గ్రామ తలారీతో కలసి బీఎల్ఓ ఓటర్ల వివరాలను ఐటీడీపీ యాప్లో అప్లోడ్ చేసేందుకు సహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం పరమేశ్వరుడు దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీమద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రం జ్యేష్ట మాసం శనివారం సందర్భంగా భక్త జన సంద్రమైంది. రెండవ శనివారం సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తులకు ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మెరుగైన ఏర్పాట్లు చేశారు. -
ప్రైవేట్కు రిజిస్ట్రేషన్ సేవలు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్కు దారాదత్తం చేయడానికి సిద్ధమైంది. సులభరీతిలో రిజిస్ట్రేషన్ సేవల పేరిట పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటిలో ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ సేవలు అందించనున్నారు. మొదటి దశలో జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆర్ఎస్కేల పరిధిలోకి తీసుకొస్తారు. ఆ తరువాత మునిసిపాలిటీలు, నగర, మేజర్ పంచాయతీల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను ప్రైవేట్కు అప్పగించేందుకు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో చేపడతారు. ఈ విధానంతో సేవలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం చెబుతుండగా.. తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్న ప్రజలకు ఈ విధానం అదనపు భారం కానుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి దస్తావేజుకు ఇప్పటికే రూ.500 చొప్పున ఎమినిటీస్ ఫండ్ పేరిట వసూలు చేస్తున్నారు. ఆర్ఎస్కేల పనితీరు ఇలా.. ● పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలో సింగిల్ విండో విధానంలో పౌరులకు సేవలు అందించనున్నారు. ● దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ, అడ్వాన్స్డ్ స్లాట్ బుకింగ్, స్టాంపు డ్యూటీ చెల్లింపులు, పత్రాల పరిశీలన తదితర సేవలను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. ● తుది రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆమోదం మాత్రం సబ్ రిజిస్ట్రార్ చేతుల్లోనే ఉంటుంది. ● ప్రతి దస్తావేజుపై రూ.2 వేల వరకు సేవా రుసుం వసూలు చేయనున్నారు. ఆస్తి వివాదాలకు ఆస్కారం దస్తావేజు రాయడం అనేది కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. స్థానక చరిత్ర, పాత లింక్ దస్తావేజులు, సరిహద్దులు, హక్కులు వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖర్లు ఇప్పటి వరకు వివాదాలకు తావులేకుండా పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే భవిష్యత్లో ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ఎస్కేల్లో తెల్లకాగితాలపైనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ సేవలకు స్టాంపులు వా డుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ స్టాంపులను ప్రవేశపెడితే ఎల్లో మీడియా నానా యాగీ చేసింది. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు డిజిటల్ స్టాంపుల స్థానంలో నాసిక్లో తయారయ్యే స్టాంపులనే అందుబాటులోకి తెస్తానని నమ్మబలికారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా డిజిటల్ స్టాంపులే నేటికీ దిక్కయ్యాయి. కా గా, గత ప్రభుత్వ హయాంలో అమలు చేయని తెల్లకాగితాలపై రిజిస్ట్రేషన్ సేవల విధానాన్ని ఎల్లో మీడి యా, చంద్రబాబు తెగ ప్రచారం చేసి ప్రజల్లో విషాన్ని నింపారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు కాబోయే ఆర్ఎస్కేల్లో తెల్లకాగితాలపైనే రిజిస్ట్రేషన్ సేవలు అందేలా సంస్కరణల పేరుతో స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. తెల్ల కాగితాలపైనే సేవలు అందించే అవకాశం గత ప్రభుత్వ హయాంలో అమలు చేయకపోయినా గగ్గోలు ఇప్పుడు తిరిగి అదే విధానం వైపు మొగ్గు ఉపాధి కోల్పోతామంటున్న దస్తావేజు లేఖరులు మా పొట్ట కొట్టొద్దు.. బాబూ! ఇప్పటి వరకు దస్తావేజుల తయారీ, స్లాట్ బుకింగ్, స్టాంపు డ్యూటీ చెల్లింపు, ఆన్లైన్ డేటా అప్లోడ్ వంటి సేవలను దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే ఆర్ఎస్కేల్లో ఆ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుండడంతో తాము జీవనోపాధి కోల్పోతామని దస్తావేజుల లేఖర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధికర్నూలు: గడిచిన పక్షం రోజులు న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో ప్రీ లోక్ అదాలత్ క్యాంపులు నిర్వహించి విజయవంతం చేసి అధిక కేసులు పరిష్కార దిశగా సహకరించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శనివారం ఉదయం జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయా కోర్టులలో 31 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు ముందుకొచ్చి కేసుల పరిష్కారానికి తోడ్పాటునందించాయన్నారు. శ్రీశైలం ముంపు రైతులకు పెండింగ్ కేసుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంపు రైతులకు రూ.2.50 కోట్ల విలువైన చెక్కులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి పి.వాసు, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, మహిళా కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎల్వీ శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జిలు సరోజనమ్మ, అనిల్, అనూష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారమైన కేసులు ఇలా.. కర్నూలు : 16570 ఆదోని : 14891 ఆళ్లగడ్డ : 3479 ఆలూరు : 6005 ఆత్మకూరు : 727 బనగానపల్లె : 849 డోన్ : 6429 కోవెలకుంట్ల : 702 నందికొట్కూరు : 916 నంద్యాల : 1352 పత్తికొండ : 6403 ఎమ్మిగనూరు : 4228 62,225 కేసులు పరిష్కారం జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 62,225(సివిల్ 548, క్రిమినల్ 61,551, బ్యాంకు 289) కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. 200 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.15,11,43,507 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 96 మంది రైతుల వారసులకు రూ.42 లక్షలు నష్టపరిహారం కింద ఇప్పించారు. -
మూడు లక్షల వరకూ నష్టపోయా
ఏప్రిల్ నెలలో ఆరు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా. ఎకరాకు రూ.13వేలు పెట్టి విత్తనాలు తీసుకువచ్చి విత్తా. మొదట్లో పంట ఏపుగా రావడంతో ఖర్చు పెట్టి పంటను కాపాడుకున్నా. మే నెల చివర్లోనే నీరు పూర్తిగా ఇంకిపోయింది. పంట కాపాడుకునేందుకు బోర్లు వేయించినా నీరు పడలేదు. వర్షాలు రాకపోవడంతో పంట ఎండిపోతుంది. పశువుల మేతకై నా వస్తుందని తొలగిస్తున్నా. ఆరు ఎకరాల్లో రూ. 3 లక్షల వరకు నష్టపోయా. – గోంగళ్ల నాగమద్దయ్య, రైతు చుంచుఎర్రగుడి మూడు ఎకరాల్లో ముందస్తు సాగు కింద వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీలు, సేద్యపు ఖర్చుల కింద రూ.1.30 లక్షల ఖర్చు చేశా. జూన్ నెల పడకపోయినా జూలై పడుతుందేమోనని చూశా. కానీ వర్షం కురువకపోగా వేడిగాలులు వీస్తుండటంతో పశువుల మేతకై నా వస్తుందని పంటను తొలగిస్తున్నా. – బేతాల జనార్దన్, రైతు చుంచుఎర్రగుడి -
పంటలు ఎండి.. గుండెలు మండి!
కొత్తపల్లి/దొర్నిపాడు: ఖరీఫ్ సీజన్ మొదలై 40 రోజులు గడిచినా వాన జాడ కనిపించడం లేదు. అక్కడక్కడా సాగు చేసిన పంటలు ఎండకు వాడుపడుతున్నాయి. జూన్లో కురిసిన అరకొర వర్షాలకు మొక్కజొన్న, పత్తి, మిరప, ఇతర పంటలు వేశారు. అయితే జూన్ నెల పూర్తయి జూలై కూడా సగం కాలం గడిచింది. వరుణుడు మాత్రం రైతన్నలపై కాస్త కూడా దయచూపడం లేదు. చుక్క వర్షం కూడా కురవకపోవడంతో కొత్తపల్లి మండలంలో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. వాడుతున్న పంటను కాపాడుకునేందుకు రైతన్నలు పాట్లు పడుతున్నారు. కొంత మంది రైతులు బావులు, బోర్లనుంచి పైపులతో పంటలను తడుపుతున్నారు. మరికొంత మంది స్పింకర్ల ద్వారా పంట పొలాలను తడుపుతూ కాపాడుకొనే ప్రయత్నంలో నానా తిప్పలు పడుతున్నారు. మరోవైపు అన్నదాతలు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్న ఆశతో ఎదురుచుస్తున్నారు. అలాగే దొర్నిపాడు మండలంలో మినుము సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందు పంట ఎండుతుండటంతో ఎలా కాపాడుకోవాలో తెలియక ఆకాశం వైపు చూస్తున్నారు. -
తమిళనాడు మహిళా దొంగలు అరెస్టు
● 6.5 తులాల బంగారు గొలుసులు స్వాధీనంకర్నూలు: కర్నూలు కొత్తబస్టాండ్ (ఆర్టీసీ బస్టాండ్)లో ఇద్దరు మహిళల మెడలో గొలుసు చోరీలకు పాల్పడిన తమిళనాడు మహిళా దొంగలను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గిద్దలూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వరమ్మ కర్నూలు ఎ.క్యాంప్లో నివాసముంటున్న తన కుమారుడు వెంకటేశ్వర్లును చూసేందుకు కర్నూలుకు వచ్చి తిరిగి గిద్దలూరు వెళ్లేందుకు గత నెల 11న బస్టాండ్లో బస్సు కోసం వేచిఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని మహిళలు అపహరించారు. అలాగే పెద్దపాడుకు చెందిన బ్యాంకు మహిళా ఉద్యోగి కూడా అదే రోజు విధులకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాండ్లో వేచి ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును కూడా చోరీ చేశారు. బాధితులిరువురూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బస్టాండ్ పరిసరాల్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా తమిళనాడు రాష్ట్రం జోలార్పేటకు చెందిన భాగ్య, హన్నమ్మలుగా గుర్తించారు. బెంగళూరు శివారులోని కుప్పం ప్రాంతంలో వారు సంచరిస్తున్నట్లు గుర్తించి సీఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ శరత్ కుమార్, క్రైం పార్టీ సిబ్బంది సుబ్బరాయుడు, మురళి ప్రత్యేక బృందంగా కుప్పం వెళ్లి ప్యాలెస్ రోడ్డులో ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 6.5 తులాల రెండు గోల్డ్ చైన్లను స్వాధీనం చేసుకుని మహిళా దొంగలను జడ్జి ఎదుట హాజరుపర్చగా రి మాండ్కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. -
14లోపు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: అర్హత కలిగిన ఓటరు తన ఎన్యుమరేషన్ ఫారమ్ను తప్పనిసరిగా ఈనెల 14లోగా సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. జూలై 14తో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగియనున్నందున ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. శనివారం వీడియో సందేశం ద్వారా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 14,05,443 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,90,722 ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల నుంచి తిరిగి అందగా వాటిని విజయవంతంగా డిజిటలైజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో మరణించిన వారు, డూప్లికేట్ నమోదులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి, అలాంటి 55,449 ఫారాలను కూడా డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా 2,59,272 ఎన్యూమరేషన్ ఫారంలు ఓటర్ల నుంచి అందాల్సి ఉందన్నారు. మిగిలిన ఫారమ్ల సేకరణను వేగవంతం చేసేందుకు శనివారం, ఆదివారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. జూలై 14 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు బాధ్యతగా స్పందించి తమ ఎన్యూమరేషన్ ఫారమ్ను వెంటనే సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అందజేయాలన్నారు. -
ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
● న్యాయం చేయాలంటున్న మాజీ జవాన్ డోన్ రూరల్: కొందరు వ్యక్తులు తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మాజీ సైనికుడు చండీశ్వర్ గౌడ్ వాపోయారు. పట్టణానికి చెందిన చండీశ్వర్ గౌడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో పని చేశారు. స్థానిక కంబాలపాడు రోడ్డులోని ఉలిగమ్మగుడి వద్ద సర్వే నెంబర్ 385–1ఏలో ప్లాట్ నెంబర్ 94 (రెండు సెంట్లు)ను దాదాపు 30 ఏళ్ల క్రితం తన భార్య పద్మావతి పేరుపై కొనుగోలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం గత ఏప్రిల్ నెల 26వ తేదీ ఈ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్థానికుడైన మల్లికార్జున గౌడ్, అతని సోదరులు తన గృహ నిర్మాణానికి అనేక అడ్డుంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు మరో ఏడుగురిని కూడా ఈ ప్రాంతంలో గృహాలు నిర్మించుకోకుండా దౌర్జ్యనానికి పాల్పపడుతున్నారని వాపోయారు. వారితో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు. -
చాలా సంతోషంగా ఉంది
సీఎస్ఈ బ్రాంచ్లో ఇక్కడ మొదటి పీహెచ్డీ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రోబస్ట్ అండ్ ఎక్స్ఫ్లెయినబుల్ మస్క్యులోస్కెలిటల్ రేడియోగ్రాఫ్ క్లాసిఫికేషన్–యాన్ అగ్రిగేటేడ్–ఫ్లెక్సినట్ ఫ్రేమ్వర్క్ అనే అంశంపై చేసిన పరిశోధనతోనే పీహెచ్డీ వచ్చింది. ఈ పరిశోధన ఎముకలు, కండరాలకు సంబంధించిన ఎక్స్రే చిత్రాలను ఆటోమేటిక్గా విశ్లేషించేందుకు వివరణాత్మక కృతిమ మేధ ఫ్రేమ్ వర్క్ను రూపొందిస్తుంది. రేడియాలిస్టులు, ఆర్థోపెడిక్ డాక్టర్లకు ఈ టెక్నాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. – తోట గోకారమయ్య, చిన్నటేకూరు, కల్లూరు మండలం -
సంబరంగా స్నాతకోత్సవం
కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్చాక్చరింగ్(ట్రిపుల్ఐటీడీఎం) స్నాతకోత్సవం శనివారం సంబరంగా సాగింది. జగన్నాథగట్టులోని ఆ సంస్థ క్యాంపస్లోని కృష్ణ సెమినార్ హాల్లో మొత్తం 249 మంది విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ, డాక్టరేట్లను అందజేశారు. ట్రిపుల్ఐటీడీఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ఆచార్య ఎన్.వి రమణారావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ప్రముఖ భారతీయ శాసీ్త్రయ సంగీత విద్యాంసుడు, మృదంగ విద్యాంసుడు, పద్మశ్రీ డాక్టర్ యోల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. పట్టాలను అందజేసిన తరువాత ప్రసంగించారు. క్రమ శిక్షణ, అంకిత భావం, పట్టుదలతో ఉన్నతస్థాయిని సాధించాలన్నారు. పట్టభద్రులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలన్నారు. డిసిప్లినరీ మైనర్ ప్రోగామ్లు.. 77 శాతం మందికి ఉద్యోగాలు ట్రిపుల్ఐటీడీఎం 2025–26 విద్యా సంవత్సరంలో సాధించిన విజయాలను డైరెక్టర్ ఆచార్య బి.ఎస్ మూర్తి వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాలలో ఇంటర్ డిసిప్లినరీ మైనర్ ప్రోగ్రామ్లను ప్రవేశ పెట్టడం ద్వారా ట్రిపుల్ఐటీడీఎం తన విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుందన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 93 రిక్రూటర్లు 101 క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించగా మొత్తం 77 శాతం మందికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారన్నారు. అత్యధికంగా వార్షిక ప్యాకేజీ రూ.65 లక్షలు, సగటు ప్యాకేజీ రూ.11.68 లక్షలు అందుకోనున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్, అమోజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎం, డెలాయిట్, టీసీఎస్ వంటి కంపెనీలకు తమ సంస్థ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. క్యాంపస్లోని హాస్టల్స్ విస్తరించి 500 కిలోవాట్ల సోలార్ రూప్టాప్ పవర్ ప్లాంట్ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మణిపూర్ నీట్ డైరెక్టర్ సోమయాజులు, రిజిస్ట్రార్, ఆచార్యలు, తదితరులు పాల్గొన్నారు. పతకాలు పొందిన వారుట్రిబుల్ఐటీడీఎం 2022–26 బ్యాచ్కి చెందిన 250 మందికి పట్టాలను అందజేశారు. ఇందులో 211 మంది బీటెక్, 29 మంది ఎంటెక్, ఒకరు డ్యూయల్ డిగ్రీ–ఎంటెక్, పీహెచ్డీ, తొమ్మిది మంది పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. క్యాంపస్ ఓవరాల్ గోల్డ్మెడల్ సీఎస్ఈకి చెందిన సోహైబ్ అఫ్తాబ్ అందుకున్నారు. బీటెక్ సీఎస్ఈలో బాలికల్లో అత్యధిక సీజీపీఏ సాధించినందుకు యంగోటి సాయి భవ్య దుర్వాసుల మాణిక్యాంబ ఎండోమెంట్ గోల్డ్మెడల్ అందుకున్నారు. సీఈసీలో సోహైబ్ అఫ్తాబ్ (సీఎస్ఈలో అత్యధిక సీజీపీఏ సాధించినందుకు), యంగోటి సాయి భవ్య(అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్)సిల్వర్ మెడల్ అందుకున్నారు. యాశ్ కుష్మాహా(ఈసీఈ), సోహమ్శర్మ(మెకానికల్ ఇంజినీరింగ్) సిల్వర్ మెడల్ అందుకున్నారు. ట్రిబుల్ఐటీడీఎంలో ఘనంగా ‘పట్టా’భిషేకం 249 మంది విద్యార్థులకు పట్టాలు అందజేత సాంకేతికత, పరిశోధన విద్యలో ట్రిపుల్ఐటీడీఎం కర్నూలుకు ప్రత్యేక గుర్తింపు ఇద్దరికి బంగారు పతకాలు, ఆరుగురికి సిల్వర్ మెడల్స్ -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
● రాష్ట్ర ఎంపీఈవోల సంఘం అధ్యక్షుడు బసవరాజు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈవోలకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆ సంఘం అధ్యక్షుడు బసవరాజు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్జీవో హోమ్లో జిల్లా ఎంపీఈవోల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీఈవోలు గత 12 ఏళ్లుగా రూ.12,000 వేతనంతోనే పని చేస్తున్నారన్నారు. మార్చి నుంచి జూన్ వరకు వేతనాలు అందలేదన్నారు. ఉద్యోగభద్రత లేదని, అనారోగ్య పరిస్థితులు ఉత్పన్నమైనా ఎటువంటి భీమా సదుపాయం లేదని పేర్కొన్నారు. జిల్లా ఎన్జీజీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంసీ కాశన్న మాట్లాడుతూ ఎంపీఈవోలకు ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, మధుగౌడు, మల్లేష్, జిల్లా ఎన్జీవో అసోసియేషన్ నేతలు తిరుమలరెడ్డి, శ్రీరాములు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాలకు చెందిన ఎంపీఇవోలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై కాల్వబుగ్గ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నన్నూరు గ్రామానికి చెందిన రాజన్న కొడుకు నాగరాజు (ఆటో డ్రైవర్) శనివారం బేతంచెర్లకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కాల్వబుగ్గ కాకతీయ స్కూల్ ఎదురుగా నంద్యాల వైపు నుంచి వస్తున్న కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఆటోలో ఉన్న దుర్గాపేటకు చెందిన లక్ష్మీదేవి (50) దుర్మరణం చెందగా, నన్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు, మణెమ్మతో పాటు కారు డ్రైవర్ జైపాల్కు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. వ్యభిచార గృహ నిర్వాహకులు అరెస్టు కర్నూలు: కర్నూలు శివారులోని ఉల్చాల రోడ్డులో ఉన్న ఆదిత్య నగర్లో కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతున్న కర్నూలుకు చెందిన ఆర్గనైజర్స్ వంశీకృష్ణ, రామకృష్ణతో పాటు ఆదోని పట్టణానికి చెందిన విటుడు భరత్ను నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నగర్లోని ఓ అద్దె ఇంట్లో జోరుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో రెండు రోజుల క్రితం సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన సంగతి తెలిసిందే. నిర్వాహకులతో పాటు మరో విటుడు తప్పించుకుని పారిపోవడంతో శనివారం వారిని కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. వెదురు కర్రల వాహనం స్వాధీనం రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి వెదురు కర్రలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని శనివారం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం రేంజి అధికారి ముర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అడవి నుంచి వెదురు కర్రలు తరలిపోతున్నట్లు సమాచారం అందడంతో ఎఫ్ఎస్ఓలు, మాబుఖాన్, విజయవర్ధన్, మద్దిలేటిస్వామి, ఎఫ్బీఓలు సురేంద్రగౌడ్, నాగేష్ నిఘా ఉంచారు. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మీదుగా డబ్ల్యూ కొత్తపల్లె వైపు వెళ్లే దారిలో మాటు వేయగా వెదురు కర్రలను అక్రమంగా తరలించే బొలెరో వాహనం పట్టుబడిందన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడు గాజులపల్లెకు చెందిన షేక్ నందిపల్లి మదార్ సాహెబ్ను అరెస్టు చేశామన్నారు. నిందితుడిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు రేంజర్ తెలిపారు. మహానందిలో వీకెండ్ సందడి మహానంది: మహానందిలో వీకెండ్ సందడి నెలకొంది. రెండో శనివారం, సెలవురోజు కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం అనంతరం నంది సర్కిల్, పెద్ద నంది ప్రాంతాలను తిలకించి భక్తులు సేదతీరారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు నిర్విరామ దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం కల్యాణ మండపంలో శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులకు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవారికి యాగశాలలో ఏకాంత సేవ పూజలు జరిగాయి. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ
కర్నూలు: కర్నూలులో రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. సంతోష్ నగర్ శివారు విష్ణు టౌన్షిప్ వాటర్ ట్యాంకు వద్ద గూడూరు గోపాల్, ఉమాదేవి దంపతులు నివాసముంటున్నారు. గోపాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. రెండు రోజుల క్రితం ఆయన వ్యక్తిగత పని మీద హైదరాబాదుకు వెళ్లారు. ఆయన భార్య ఉమాదేవి శనివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బెడ్రూమ్లోని అల్మారాలో దాచివుంచిన 12 తులాల బంగారు నగలు, అరకిలో వెండి ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. ఉమాదేవి 2 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. గదిలోకి వెళ్లి చూడగా అల్మారాలోని సామాన్లన్నీ చిందరవందరగా పడివుండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గో పట్టణ ఎస్ఐ గోపీనాథ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రెండో శనివారం కరెంటు లేకపోవడంతో ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. క్లూస్టీమ్ను, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి ఆధారాలను సేకరించారు. ఇంటి యజమానితో పాటు ఇరుగుపొరుగు వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని వ్యాపార సముదాయాల ఎదుట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా సేకరిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతి ఓటును కాపాడుకోవాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డికర్నూలు (టౌన్): ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు తమ ఓటును కాపాడుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఓటరుగా గుర్తింపు పొందాలన్నారు. శని, ఆదివారం రెండు రోజులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ఐఆర్పై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ శిబిరాల్లో ప్రతి బీఎల్ఏ పాల్గొనాలన్నారు. బీఎల్ఏలు ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు పూరించడం వంటి ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరాలు పనిచేస్తాయన్నారు. బీఎల్ఓలు, బీఎల్ఏలు ఉంటారని, ప్రతి పౌరుడు శిబిరాల్లో తమ ఓటును ధ్రువీకరించుకోవాలన్నారు. 2024 ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేశారో అక్కడ అధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని బీఎల్ఓలను కలవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎల్ఏల సహకారం తీసుకొని ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఏ పార్టీకి ఓటు వేయాలన్న ముందుగా ఓటును కలిగి ఉండటం ప్రధానమన్నారు. -
కేసుల రాజీపై అవగాహన కల్పించండి
డోన్ టౌన్: లోక్ అదాలత్లో కేసులు రాజీ అయ్యే విధంగా కక్షిదారుల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధ్ద్ది అన్నారు. శుక్రవారం ఆయన కోర్టు ఆవరణలో ఫోర్త్ కోర్ట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతగా నిర్మించాలని కాంట్రాక్టర్లను ఆదేశిస్తూ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూనియర్ సివిల్ జడ్జి కోర్టును వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు, పోలీసు అధికారులతో శనివారం జరిగే లోక్ అదాలత్పై సమీక్ష నిర్వహించారు. కక్షిదారుల లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోనే విధంగా వారిలో అవగాహన కల్పించాలన్నారు. జడ్జి వెంట సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య, ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి వినోద్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జ్యోతి, న్యాయవాదులు ఉన్నారు. 99.97 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియలో భాగంగా 99.97 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, 74.18 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ)పై రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 1200 ఓటర్లకు మించి ఉండకూడదనే నిబంధనలో భాగంగా కొత్తగా 134 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 1,629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆళ్లగడ్డలో 14, శ్రీశైలంలో 13, నందికొట్కూరులో 25, నంద్యాలలో 48, బనగానపల్లెలో 29, డోన్లో 5 కొత్త పోలింగ్ కేంద్రాలకు (స్థల మార్పిడి, పేరు మార్పిడి) ప్రతిపాదనలు పంపినట్లు రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. అదే విధంగా ఏ ఒక్క పోలింగ్ కేంద్రాలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రామునాయక్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు వైఎస్సార్సీపీ నాయకుడు సాయిరాంరెడ్డి, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు రామ్మోహన్, ఆమ్ ఆద్మీ నాయకుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ● బాలికను గర్భిణి చేసిన యువకుడు కోవెలకుంట్ల: ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు ఆరేళ్లుగా ఓ బాలిక వెంటపడి మాయమాటలతో నమ్మించి గర్భిణిని చేసిన దారుణ ఘటన కోవెలకుంట్లలో చోటు చేసుకుంది. శుక్రవారం బాధితురాలు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. శారీరకంగా లోబరుచుకుని మూ డు నెలల గర్భిణిని చేశాడు. ఇటీవల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దా ల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలిక గోవర్ధన్ ఇంటి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి వివాహం చేసుకుందామనడంతో ముఖం చాటేసి తప్పించుక తిరుగుతున్నాడు. తక్కువ కులానికి చెందిన బాలిక వంటూ దూషిస్తూ ప్రెగ్నెన్సీ పోవడానికి మాత్రలు ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. రూ.2 లక్షల డబ్బులు ఇస్తామని రాజీకి రావా లని ఆ యువకుడి బంధువులు బేరసారాలకు దిగినట్లు ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన విషయాన్ని స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించగా రెండు వారాలు గడువు కావాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని గోవర్ధన్ను, అతని కుటుంబ సభ్యులను అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను కాకుండా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయం చేసుకున్నాడని వాపోయింది. సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక మీడియాను ఆశ్రయించింది. -
విద్యాలయాల స్థలాలను రక్షించుకోవాలి
పేద విద్యార్థుల విద్య కోసం దాతలు దానంగా ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకుంటూ పోతే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామస్తులు, అధికారులు, దాత రామకృష్ణమూర్తి శర్మ కుటుంబీకులు స్పందించి ఆక్రమణల నుంచి పాఠశాల స్థలాన్ని కాపాడాలి. దాత లక్ష్యాన్ని నెరవేర్చాలి. – ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వేసవి సెలవులు అనంతరం పాఠశాల పునఃప్రారంభం రోజు వచ్చి చూసేసరికి మా పాఠశాల స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో ఎంఈఓకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చా. ఆయన ఆదేశాల మేరకు నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లగా.. ఆక్రమణదారులు అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని.. ఏవేవో బూతులు మాట్లాడారు. ఈ విషయం కూడా సార్కు చెప్పాం. అయితే రిటర్న్గా ఫిర్యాదు రాసి ఇవ్వమని అధికారులు ఎవరూ అడగలేదు. – స్మితమాధురి, హెచ్ఎం, ఎంపీపీఎస్ ఎర్రగుంట్ల -
తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు
ఆళ్లగడ్డ: చర్చకు రమ్మంటే రాకుండా భయపడి పారిపోయారని ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యానించడం సరికాదని, ఇక్కడ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి సాయంత్రం ఆధారాలతో వస్తా నని చెప్పగా.. రావద్దని, అవసరమైతే కబురు పెడతామని చెప్పడంతో చట్టం, ఎస్సీపై గౌరవంతో బయటకు వెళ్లడం జరిగిందని, భయపడి కాదన్నారు. అహోబిలం సీఏఓనో, మఠం వారినో వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దోపిడీపై మాత్రమే మాట్లాడుతున్నామన్నారు. అహోబిలం తలనీలాలు, టోల్గేట్ వేల పాటల గురించే కాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి, చికెన్, బియ్యంతో పాటు చివరకు శిల్ప కళాకారులను సైతం దోచుకున్న విషయాలపై ప్రతి రోజు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అహోబిలంలో తలనీలాల విక్రయ అగ్రిమెంట్ ఫేక్ అయితే మఠం వారు చర్యలు తీసుకునే వారు కదా.. అని మండి పడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకు సీఏఓను సస్పెండ్ చేశారని గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రెండు రోజలుగా తలనీలాల సేకరణ విషయంలో చైన్నెకి చెందిన కాంట్రాక్టర్ను, దేవస్థానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే మనుషులమని బెదిరించిన రెండు ఆడియో రికార్డింగ్లు బయటకు వచ్చాయా.. లేదా అని ప్రశ్నించారు. వాటితో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే ఫోన్లో బెదిరించిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. ఎస్పీని కలిసినప్పుడు ఆడియో రికార్డులతో తనకు సంబంధం లేదని, విచారణ చేయాలని ఎందుకు కోరలేదన్నారు. అహోబిలంలో జరుగుతున్న దోపిడీపై సీఐడీ విచారణకు సిద్ధమైతే ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తాం అహోబిలంలో దోపిడీపై సీఐడీ విచారణకు సిద్ధమా? మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
జగన్ ఇచ్చిన పాసు పుస్తకాలే బాబు పంపిణీ
● సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు ● మంత్రి బీసీ అడిగిన రెండు వినతులపై కూడా స్పందించ లేదు ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాలనే సీఎం చంద్రబాబు మొదటి పేజీ మార్చి పంపిణీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బనగానపల్లెలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అసత్యాలు వల్లించి ప్రజలను మభ్యపెట్టారన్నారు. బురదచల్లడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేపై అభూత కల్పనతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని పంపిణీ చేస్తుండం విడ్డూరంగా ఉందన్నారు. ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల రీసర్వేను చేపట్టింది వైఎస్ జగన్ పాలనలోనేనని గుర్తు చేశారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ పని తీరుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సభలో బీసీ హాస్టల్తో పాటు ఎస్సార్బీసీ కాల్వ ల అభివృద్ధి గురించి మంత్రి బీసీ చంద్ర బాబుకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని కాటసాని విమర్శించారు. అభివృద్ధి నిరోధకుడు మంత్రి బీసీ.. మంత్రి బీసీ జనార్దన్రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధికి నిరోధకుడని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. మంత్రి బీసీ పని తీరు సరిగా లేదని బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడం చూస్తే బీసీ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు అడ్డుకోవడం, సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణకు ఆటంకాలు సృష్టించడం, కమీషన్ల కోసం కొలిమిగుండ్ల మండలంలోని పవర్గ్రిడ్ పనులకు ఇబ్బందులు పెట్టడం వెనుక బీసీ ఉన్నారని విమర్శించారు. మంత్రి స్వగ్రామం యనకండ్లలో 70 ఏళ్ల దళిత మహిళ అత్యాచారానికి గురై అవమానంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. రవ్వలకొండ సమీపంలో అక్రమ మైనింగ్తో ఏపీ మోడల్ స్కూల్, బాలికల వసతి గృహం, బీసీ బాలుర వసతి గృహాల విద్యార్థులు భయాందోళన చెందుతున్నారన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి చెందిన భూములు కోల్పోయిన బత్తులూరుపాడు రైతులకు పరిహారం ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనేననే విషయం రైతులందరికీ తెలిసిందే నన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బీవీ నాగార్జునరెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి అంబటి రవికుమార్రెడ్డి అబ్దుల్ఫైజ్, సురేష్, ఖానిక్ పాల్గొన్నారు. -
బాబు.. బురిడీ ప్రసంగం
కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: బహిరంగ సభలో చంద్రబాబు సూపర్ సిక్స్పై మళ్లీ ప్రజలను మభ్యపెట్టేలా ప్రసంగించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక కుటుంబానికి రూ.15వేలు చొప్పున ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే అందించారు. అదే పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో అధికారంలోకి వచ్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో ఏడాది ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి పలు ఆంక్షలు పేరుతో కోతలు విధించి ఒక్కొక్కరికి రూ.13 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం జమ కాక పోగా ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ రూ.15 వేలు జమచేస్తామని బహిరంగ సభలో వ్యాఖ్యనించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అలాగే గతేడాది ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం సీ్త్రశక్తి పథకాన్ని అమలు చేశారు. ఎన్నికలు ముందు మాత్రం అన్ని రకాల బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఊదరగొట్టి తీరా పథకం అమల్లోకి వచ్చాక ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేయడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సులో దర్జాగా ఇష్టమైన చోటికి తిరిగి రావచ్చని మహిళలు ఇది నిజమే కదా.. మీరు చప్పట్లు కొడితే కదా మాకు హుషారుగా ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నా మహిళల నుంచి స్పందన లభించలేదు. మాట్లాడుతుండగానే జనం బయటకు.. చంద్రబాబు బహిరంగ సభలోకి వచ్చాక కూడా చాలా మంది ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలతో పాటు యాగంటి రోడ్డులో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పరుగులు పెట్టారు. చంద్రబాబు ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసం మొదలు పెట్టడంతో ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ నుంచి బయటకు వెళ్లిపోతూ కనిపించారు. రీసర్వేలో గతంలో తప్పులు జరిగాయి. రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని.. అవునా కాదా.. అని చెప్పండని కోరినా సభికుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత ప్రభుత్వలో రాష్ట్రం విధ్వంసమైపోతుందని నేనొచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వరాలు నిల్ నియోజవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో వెనుకబడిన కొలిమిగుండ్ల, సంజామల మండలాల కు వరాలు కురిపిస్తారని ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. చివరకు నియోజకవర్గ అభివృద్ధిపై మాట మాత్రం కూడా చెప్పకపోవడంతో నిరాశకు లోనయ్యారు. సభ ప్రారంభంలోనే 1992లో ఏర్పా టు చేసిన ఎస్సార్బీసీ పంట కాల్వలు సరిగా లేవని మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రస్తావించారు. అలాగే పట్టణంలో విద్యార్థులు అధికంగా ఉన్నారని బీసీ హాస్టల్ మంజూరు చేయాలని సభలో కోరినా వాటిపై ఎలాంటి హామీ రాలేకపోవడం గమనార్హం. -
నంద్యాల జిల్లాలో సాగైన ప్రధాన పంటలు
పంట సాధారణ సాగైంది మొక్కజొన్న 61,615 16,689 కంది 38,192 15,408 మినుము 10,188 7,303 సోయాబీన్ 5,450 5,419 పత్తి 15,163 5,050 వేరుశనగ 8,694 2,342 సజ్జ 4,254 1,616 ఆముదం 3,034 848 -
కాల్వ గట్టును ఆక్రమించి.. పొలముగా మార్చి!
రుద్రవరం: మట్టి మాఫియా అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ భూములే కాదు.. కాల్వ గట్లనూ వదలడం లేదు. ఎక్కడ బడితే అక్కడ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా తెలుగుగంగ కాల్వ కట్టపై కన్నేశారు. రుద్రవరం మండలం కే.కొత్తూరు గ్రామ సమీపంలో తెలుగుగంగ 16వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వ కట్టను ఆక్రమించారు. జేసీబీతో గట్టు మట్టిని తవ్వి ఒక్కో ట్రాక్టర్ దాదాపు రూ.800 ప్రకారం విక్రయించారు. కట్ట పొడవునా మట్టిని తవ్వి తరలించడం చదునైనా భూమిని ఆక్రమించి పొలముగా మార్చి విత్తు విత్తేందుకు సిద్ధం చేశారు. ఇంత జరుగుతున్నా తెలుగుగంగ అధికారులు ఏమీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గట్టు వెంబడి పొలాలకు వెళ్లే రస్తాను ఆక్రమించారని రైతులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదుదారులను ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని కాల్వ కట్టను మరింత బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు. -
మిగిలింది ఐదు రోజులే!
నంద్యాల(అర్బన్): తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. గత నెల 15న ప్రారంభమైన ఎస్ఐఆర్ క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ఎన్యుమరేషన్ ఫామ్స్ను ఇంటింటికి తిరిగి అందజేశారు. అందజేసిన ఫామ్స్ను కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో నింపి ఓటర్లు బీఎల్ఓలకు అందజేశారు. వాటిని బీఎల్ఓలు ఆన్లైన్లో నమోదు చేస్తూ వస్తున్నారు. అయితే 2002లో వివరాలు యాప్ మ్యాపింగ్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 14 వరకు గడువు ఉంది. అయితే నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మొత్తం 2,76,813 మంది ఓటర్లు ఉండగా మరో నాలుగు రోజుల్లో డిజిటలైజేషన్ గడువు ముగుస్తుండగా. ఇప్పటి వరకు 65.8శాతంతో ఇప్పటి వరకు 1,82,133 మంది డిజిటలైజేషన్ పూర్తి చేసుకోగా ఇంకా 94,680 మంది డిజిటలైజేషన్ చేసుకోవాల్సి ఉంది. కొన్ని చోట్ల అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బీఎల్ఓలు ఎన్యుమరేషన్ పత్రాలు ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నట్లు సమాచారం. అధికారులు చొరవ తీసుకుని సర్ ప్రక్రియ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేకపోతే గడువు పెంచాలని ప్రజా సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శిక్షణ ఇవ్వకుండా ఫీల్డ్లోకి.. ● బీఎల్ఓలకు తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చి నేరుగా ఫీల్డ్లోకి పంపడంతో వారి అనుభవ రాహిత్యంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ● చదువుకున్న వారు సైతం ఎన్యుమరేషన్ పత్రాలు నింపలేక, నిబంధనలు అర్థంకాక తికమక పడుతున్నారు. ● నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 శాతం డిజిటలైజేషన్ కూడా పూర్తి చేయలేక బీఎల్ఓలు మల్లగుల్లాలు పడుతున్నారు. ● మున్సిపల్ శేషన్న ప్రత్యేక ఓటరు సవరణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ సర్ కార్యక్రమం ముందుకు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● యాప్లో సర్వర్ లోపం, సాంకేతిక సమస్యలు ఏర్పడి మ్యాపింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ● ఇన్ని సమస్యల మధ్య రోజుకు 30 ఎన్యుమరేషన్ ఫారాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయలేక సతమతమవుతున్నారు. ఇవేకాకుండా బీఎల్ఎలకు సర్ డ్యూటీతో పాటు రెవెన్యూకు సంబంధించి పాస్ పుస్తకాలు, రీసర్వే పెన్షన్లు తదితర అదనపు పనులతో ఫీల్డ్కు వెళ్తున్నామని ఎగనామం పెట్టడం కొసమెరుపు. ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసిన వారు చివరి తేదీ వరకు వేచి చూడకుండా తక్షణమే ఈఎఫ్ను బీఎల్ఓలకు సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలి. ఈనెల 14లోపు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందిస్తేనే ఓటుకు భద్రత ఉంటుంది. – శివప్రసాదరెడ్డి, ఈఆర్ఓ నంద్యాల నియోజకవర్గం ప్రజాస్వామ్యంలో ఓటు ప్రముఖమైంది. దాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ ప్రక్రియ గడువు పెంచాలి. ప్రజలకు ఇన్యుమరేషన్ ఫారంలు నింపడంపై అవగాహన లేకపోవడం, బీఎల్ఓలకు పని ఒత్తిడి కావడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. – సాయిరాంరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, నంద్యాల డిజిటలైజేషన్కు ఐదు రోజులు మాత్రమే గడువు నంద్యాల నియోజకవర్గంలో 65.8 శాతం మాత్రమే పూర్తి బీఎల్ఓలకు అవగాహన లేక సమస్యలు -
ప్రభుత్వం ఆదుకోవాలి
మాది ఉమ్మడి కుటుంబం. మాకు 10 ఎకరాల భూమి ఉంది. నల్లరేగడి నేలలు కావడంతో జూన్ రెండో వారం తర్వాత పత్తి సాగు చేశాం. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి వచ్చింది. బస్తా ఎరువు రూ.2500 వరకు ఉంటోంది. వర్షాలు లేక కళ్లెదుటనే పత్తి పంట ఎండిపోయింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – లక్ష్మన్న, మూగలదొడ్డి, కోసిగి మండలం మాకు 15 ఎకరాల పొలం ఉంది. మామూలుగా అయితే పత్తి సాగు చేస్తాం. ఈ సారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పడంతో ఎనిమిది ఎకరాల్లో కంది వేశాం. విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఒక్క వాన కూడా పడలేదు. పంట మొత్తం ఎండిపోయింది. మరో ఏడు ఎకరాల్లో విత్తనం వేయలేదు. గతంలో ఎపుడూ లేని విధంగా కరువు వచ్చింది. – డి.మధుసూదన్రెడ్డి, ఆస్పరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్ దెబ్బతినింది. వేరుశనగ, ఆముదం సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నాం. నేను 4.50 ఎకరాల్లో వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో ఆముదం సాగు చేశా. నెల రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. మొత్తంగా రూ.లక్షకు పైగా నష్టం వచ్చింది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినప్పటికీ పంటలు కోలుకునే అవకాశం లేకుండా పోయింది. – నాగలాపురం రాముడు, చుంచుఎర్రగుడి గ్రామం, కృష్ణగిరి మండలం -
శ్రీశైల దేవస్థానానికి రూ.4 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గురువారం విజయవాడకు చెందిన హరినాథబాబు పోలినేడి వెంకట సుబ్బయ్య పేరుతో రూ.1,00,170 విరాళాన్ని, అలాగే పోలినేడి నాగమణి పేరుతో రూ.1,00,070 విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు టి .హిమబిందుకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన కె.శంకర్ రూ.1,00,016, హైదరాబాద్ చెందిన టి. వెంకటరావు రూ. 1,00,016 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామి వారి శేష వస్త్రా న్ని, లడ్డు ప్రసాదాలను, జ్ఞాపికను, రసీదును అందజేసి సత్కరించారు. ఆదోని, నంద్యాల మార్కెట్ కమిటీలకు కొత్త సెక్రటరీలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని ఆదోని, నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన సెక్రటరీలు నియమితులయ్యారు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కమిటీల్లో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీలుగా పనిచేస్తున్న 10 మందికి ఎంపిక శ్రేణి (సెలక్షన్ గ్రేడ్)సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ జీవో 623 జారీ చేశారు. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పనిచేస్తున్న జి.చంద్రమౌళికి స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించి కొత్తపేట మార్కెట్ కమిటీ సెక్రటరీగా నియమించారు. మాచర్ల మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పని చేస్తున్న ఎస్.సీతారామయ్యకు పదోన్నతి కల్పించి ఆదోని మార్కెట్ సెక్రటరీగా నియమించారు. వినుకొండ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పనిచేస్తున్న బీవీఆర్ కృష్ణనాయక్కు పదోన్నతి కల్పించి ఇచ్చాపురం మార్కెట్ కమిటీ సెక్రటరీగా నియమించి.. అక్కడి నుంచి డిప్యుటేషన్పై నంద్యాల మార్కెట్ కమిటీ సెక్రటరీగా బదిలీ చేశారు. కోవిడ్కు ముందస్తు ఏర్పాట్లు కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ కేసులు వస్తే అవసరమైన ఏర్పాట్లను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో కోవిడ్తో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, మైక్రోబయాలజీ విభాగాల వైద్యుల సహకారంతో కమిటీని నియ మించారు. ఆసుపత్రికి కోవిడ్ లక్షణాలతో ఎవ్వరైనా వస్తే వెంటనే వారిని వైద్యపరీక్షల నిమిత్తం మైక్రోబయాలజీకి పంపించాలని సూచించారు. -
బాబ్బాబు.. చప్పట్లు కొట్టండి
సాక్షిటాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభకు టీడీపీ నాయకులు కష్టపడి వాహనాల్లో ప్రజలను తరలించినా స్పందన కరువైంది. గురువారం బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ (మీ భూమి .. మీ హక్కు) కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు పొదుపు మహిళలు, ఉపాధి కూలీలను బస్సుల్లో తరలించారు. అలాగే ఉపాధి కూలీలు ఉదయం పని చేసే ప్రాంతానికి తీసుకెళ్లి ఫొటోలు దిగి హాజరు వేయించుకొని పని చేయకుండానే సంబంధింత అధికారులు వారిని సీఎం సభకు తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో సభలో ప్రజల నుంచి సరైన స్పందన లేక పోవడంతో ప్రజలను అడిగి.. అడిగి చప్పట్లు కొట్టించుకోవడం కనిపించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తుండగా ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. తాను ప్రజల కోసం ఇంతగా తపన పడుతుండగా ‘మీ నుంచి ఆదే స్థాయిలో ప్రభుత్వానికి ఆదరణ లభించాలి’ అని చంద్రబాబు కోరినా ప్రజలు మౌనంగానే ఉన్నారు. కాగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ మహిళా తన సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించగా సీఎం చంద్రబాబు ఆవేశానికి గురై ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. జిల్లాలో పని చేసే పలు శాఖల అధికారుల పని తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను స్టేజీ వద్దకు పిలిపించి ర్యాంకులు వివరాల వెల్లడిస్తూ కొందరి అధికారుల పని తీరు మార్చుకోవాలని పేర్కొనడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. సభకు బస్సులు.. బస్టాండ్లో ప్రయాణికులు సీఎం పర్యటన కోసం గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు సుమారు 6 గంటల పాటు ఆర్టీసీ బస్సులు బనగానపల్లె బస్టాండ్కు రాకుండా నిర్దేశించిన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియక కొందరు ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు సభకు స్పందన కరువు అడిగి మరీ చప్పట్లు కొట్టించిన సీఎం సమస్య వివరిస్తున్న మహిళను సభ నుంచి గెంటేసిన పోలీసులు సీఎం పర్యటనలో నియోజకవర్గానికి వరాలు శూన్యం మందుబాబులకు పండగ.. సీఎం సభ మందుబాబులకు పండగగా మారింది. బనగానపల్లె పట్టణంలో వైన్షాపులు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మందు సేవించడం పలువురుకి ఇబ్బంది కలిగించింది. సీఎం పర్యటనకు వెళ్లే సమయంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు ఇచ్చే మందు చాలక బస్సు దిగిన తరువాత మళ్లీ మందు ఇవ్వడంతో కిక్కు ఎక్కువై చాలా మంది కిందపడిపోయారు. -
నేటి నుంచి న్యాయవాదులు విధుల బహిష్కరణ
నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మూడు రోజులపాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకు నిరసనగా ఈనెల 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడుతామని నాయకులు తెలిపారు. కేజీబీవీలో మరో బాలికకు గొంతు వ్యాధి రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం కేజీబీవీలో కొద్ది రోజుల నుంచి బాలికలు గొంతు వ్యాధి బారిన పడుతున్నారు. శ్వాస ఆడక మాటలు సరిగా రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సోమవారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టి .. కాఫ్, కోల్డ్ (దగ్గు, జలుబు) కారణమంటూ వెళ్లిపోయారు. వారు వెళ్లిన మరుసటి రోజు మంగళవారం 9వ తరగతి విద్యార్థిని సుస్మితకు గొంతు వ్యాధి సోకింది. స్థానిక పీహెచ్సీ వైద్యులు పరిశీలించి నంద్యాలకు రెఫర్ చేయగా నంద్యాలలోని ఓ వైద్యశాలలో చికిత్సలు చేయించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇలా వరుసగా బాలికలు అస్వస్థతకు గురి కావడతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేజీబీవీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి డోన్ టౌన్: జైల్లో ఉన్న ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆయన మంగళవారం డోన్ పట్టణంలోని సబ్ జైల్ను తనిఖీ చేసి ఖైదీలతో సమావేశమయ్యారు. ఆర్ధిక పరిస్థితులతో న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 11వ తేదీ జరిగే జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూసించారు. కార్యక్రమంలో డోన్ న్యాయమూర్తులు వినోద్, జ్యోతి, న్యాయవాది మాధవస్వామి, సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
‘జల’హో రాజన్న
కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగు నీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401 కోట్లతో 12 కిలోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను నిర్మించి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞం పనులను నిర్లక్ష్యం చేయడంతో పదిశాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. శ్రీశైల జలాశయం నుంచి వరద జలాలను మళ్లించేందుకు వీలుగా రెండు సొరంగ మార్గాలు ఉండగా మూడో సొరంగ నిర్మాణ పనులు చేపట్టింది. రూ. 300 కోట్లతో 5.9 కి.మీ పొడవునా నిర్మాణ పనులకు నిధులు కేటాయించింది. అలాగే పాణ్యం మండలం గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు లైనింగ్ పనులకు రూ. 950 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయా ప్రాంతాల్లో లైనింగ్ పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్ కల సాకారమై అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. అవుకు రిజర్వాయర్ -
మహానేతకు చిత్రాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి పురస్కరించుకొని పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ 8 పొట్రెయిట్ చిత్రాలను గీశారు. ప్రజలు వైఎస్సార్ను స్మరించుకుంటున్నట్లు చిత్రంలో చూపించారు. బాల్యంలో, ఎన్సీసీ విద్యార్థిగా, వైద్య విద్యార్థిగా, డాక్టర్గా, రాజకీయ ప్రవేశం, రాజసమైన చిరునవ్వు, ప్రజలకు నమస్కారం చేస్తున్న చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కోటేష్ కొనియాడారు. -
ఐడియా అదుర్స్ !
వ్యవసాయంలో యాంత్రీకరణలో భాగంగా రైతాంగం పొలం పనులను సులభంగా, వేగంగా పూర్తి చేసుకుంటున్నారు. మండల కేంద్రం సి.బెళగల్కు చెందిన తెలుగు వీరేష్ పొలంలో మంగళవారం కూలీలు ట్రాక్టర్ ద్వారా పత్తి పంటలో దెంతలు పట్టారు. కాడెద్దులతో ఐదు ఎకరాలలో దెంత పట్టేందుకు రోజంతా సమయం పడుతుండగా, ట్రాక్టర్ ద్వారా మధ్యాహ్నానికి పూర్తవుతుందని, పైగా మొక్కలను ఎద్దులు తొక్కడంతో నలిగేవని, వ్యవసాయ ట్రాక్టర్తో అలాంటి సమస్యలు లేవని రైతులు అంటున్నారు. గతంలో వ్యక్తులను అనుసరించడంలో గొర్రు వెంట గుంటిక అనే నానుడి గ్రామాల్లో ప్రాచూర్యంలో ఉంది. అయితే ఇప్పుడు అలా కాకుండ ట్రాక్టర్ వెంట దెంతలుగా మారనుందా అని పల్లె జనం చమత్కారించుకుంటున్నారు. – సి.బెళగల్ -
మహానేత పచ్చని అడుగులు
ఆత్మకూరు: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జలసిరి ప్రదాతగా రైతన్నల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. జలయజ్ఞంలో భాగంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో లింగాల, ఇస్కాల, చెలిమిల్ల, సిద్ధ్దాపురం, శివపురం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి రైతుల మోములో చిరునవ్వులు చిగురింపజేశారు. ఒకప్పుడు కరువుతో బీటలు బారిన బీళ్లు ఎత్తిపోతల పథకాలతో ఆయకట్టుగా మారాయి. దాదాపు 30 వేల ఎకరాలు ఆయకట్టుగా మారి రైతుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వైఎస్సార్ మరణించినా ఆయన పచ్చని అడుగు జాడలు ఇప్పటికీ బంగారు భూముల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడి రైతులు మహానేత చేసిన మేలును నిత్యం తలుచుకుంటూ స్మరించుకుంటున్నారు. ఎత్తిపోతలతో సస్యశ్యామలం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయకపోతే మా ప్రాంతం నిత్యం కరువుతో అలమటించేది. ఏటా వలసలు వె ళ్లి జీవించాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చొరవతో రైతుల పరిస్థితి మారింది. పొలా లకు సాగునీరు అందుతుండటంతో నీటి కష్టాలు తొలగిపోయాయి. మహానేత రైతుల కోసం ఎంతో కృషి చేశారు. – విష్ణువర్ధన్రెడ్డి, సిద్ధాపురం -
● ధర్మ విజయ యాత్రలో పాల్గొన్న పలువురు రాజకీయ నేతలు ● భక్తులను ఆశీర్వదించిన విధుశేఖర భారతీ మహాస్వామి
వేద పాఠశాలకు భూమిపూజ ఓర్వకల్లు: మండల కేంద్రానికి సమీపాన వేద పాఠశాల నిర్మాణానికి శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి భూమిపూజ నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి శిష్యులు, విద్యాభారతి వేద పీఠం వ్యవస్థాపకులు, గ్రామానికి చెందిన విరివింటి ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విధుశేఖర భారతీ మహాస్వామితో పాటు, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి, జిల్లా న్యాయమూర్తి కబర్ది దంపతులు హాజరయ్యారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా విధుశేఖర భారతీ మహాస్వామి మంగళవారం ఉదయం స్థానిక జీవేశ్వ ర స్వాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలభారతి పాఠశాల సమీపంలో విద్యాభారతి వేద పీఠం పేరుతో నూతనంగా నిర్మించనున్న వేద పాఠశాలకు శాస్త్రోక్తంగా విశిష్ట పూజలు జరిపి, భూమిపూజ నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య స్వా ముల వారి ధర్మవిజయ యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. అనంతరం బాలభారతి పాఠశాలలో జగద్గురువుల దర్శనం, పాదుకా పూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, తీర్థప్రసాదాల వితరణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాధ్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్రెడ్డి, స్థానిక నాయకులు శంకర్రెడ్డి, రాజేంద్రారెడ్డి, జికె.వెంగన్న తదితరులు స్వాముల వారి ఆశీస్సులు పొందారు. స్థానిక ఎస్ఐ సునీల్కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
● బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం ● భార్య గర్భంలోని శిశువు కూడా మృతి ● అనాథగా మిగిలిన బాలుడు
పచ్చని కుటుంబంపై మృత్యుపంజా పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. జీవితాంతం కలిసి ఉండాలని కలలుగన్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో భార్య గర్భిణి కాగా ఇంకా లోకాన్ని చూడని ప్రసి ప్రాణం కూడా వారితోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బెంగళూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. పెద్దకడబూరుకు చెందిన గుమ్మల చార్లెస్, మేరమ్మ దంపతులకు నలుగురు సంతానం. మొదటి కుమారుడు గుమ్మల వినోద్ (32) దాదాపు పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం కడప పట్టణానికి వలస వెళ్లాడు. అక్కడ పని ప్రదేశంలో జుబేద (ముస్లిం యువతి)ని నాలుగున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత భార్యను తీసుకొని బెంగళూరుకు వలస వెళ్లాడు. వారికి కుమారుడు గుమ్మల ఇషాక్ (3) ఉన్నాడు. ఈ క్రమంలో పెద్దకడబూరులో నూతన చర్చ్ ప్రారంభోత్సవంలో భాగంగా రెండు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చారు. 15 రోజుల క్రితం ఇషాక్ను తన తల్లిదండ్రుల వద్ద తిరిగి బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం భార్య 6 నెలల గర్భిణి. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం బైక్పై ఇద్దరు బయలుదేరారు. కేజీ నేలగులి (హోసపాడు వద్ద) ట్రక్ ఢీకొని వినోద్ అక్కడికక్కడే చనిపోగా జుబేదాను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గర్భంలోని శిశువుతో సహా ఆమె చనిపోయింది. దీంతో చిన్నారి ఇషాక్ అనాథగా మిగిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వై.బాలనాగిరెడి రోడ్డు ప్రమాదంలో వినోద్ దంపతుల దుర్మరణం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి అండగ ఉంటామని భరోసా ఇచ్చారు. బెంగళూరు నుంచి మృతదేహాలను తీసుకొనిరావడం, ఇతర ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. తక్షణమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. -
కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకుంటారా?
డోన్: టీడీపీ నేతలు కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రూ. 50 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన కొట్రాయి గ్రామం నుంచి లక్ష్మీ చెన్న కేశవ స్వామి కొలువైన ఎస్. గుండాల గ్రామం వరకు 3 కి.మీ పాదయాత్ర చేపట్టారు. కొత్తకోట, తిరునాంపల్లి, నక్కలవాగుపల్లి, కొట్రాయి, గుండాల, చను గొండ్ల గ్రామాల ప్రజలు అడుగడునా బుగ్గనకు ఘన స్వాగతం పలికారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్న కేశవ స్వామి గర్భగుడిని ఆయన నిశితంగా పరిశీలించారు. గత వైభవం ప్రాచీన శిల్పకళా సంపద దెబ్బతినకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర చేసిన అనంతరం చెన్న కేశవ స్వామి ఆలయం వద్ద పాత్రికేయులతో మాట్లాడారు. టీడీపీ నేతలు.. అభివృద్ధి నిరోధకులు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని తిరిగి ప్రారంభించాలంటే టీడీపీ నాయకులకు కాంట్రాక్టర్లు కప్పం ముట్టజెప్పాల్సిందేనని విమర్శించారు. రూ.400 కోట్లతో ప్రారంభించిన గోరుకల్లు వాటర్ గ్రిడ్ పథకం, రూ.220 కోట్లతో హంద్రీ నీవా కాలువ నుంచి చెరువులను నింపే పథకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేశారన్నారు. రూ.50 కోట్లతో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లో వాటా కావాలని అధికార పార్టీ నేతలు వేధించడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపేసి ఆజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. వీటితో పాటు ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే డ్రైవర్ల శిక్షణా కేంద్రం, పలు కళాశాలలు, వసతి గృహాలు, పాఠశాలల నూతన భవనాలు నిర్మించే కాంట్రాక్టర్లను సైతం కమీషన్ల కోసం వేధించడంతో పనులన్నీ మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల ఆగ్రహం రూ.5 కోట్లతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని మాజీ మంత్రి బుగ్గన తమ పర్యటనలో భాగంగా పరిశీలిస్తారని ముందుగానే పసిగట్టిన అధికార పార్టీ నేతలు ప్రధాన గేటుకు తాళం వేయాలని ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రజలు అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కల్యాణ మండపంలోనే సీఎం కొత్త బురుజు గ్రామ పర్యటన సందర్భంగా అధికారులు బస చేసిన సంగతిని మాజీ మంత్రి గుర్తు చేశారు. మారుమూల ప్రాంతం అయిన గుండాల గుడి జీర్ణోద్ధరణ పనులు, కల్యాణ మండపం, అందమైన రహదారులు, కనీస సౌకర్యాలు గత ప్రభుత్వ హయాంలో కల్పించడంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని బుగ్గన అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు డోన్: ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడడమే కాక హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో టీడీపీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో టీడీపీ, కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ప్రజల నోట్లో మట్టి కొట్టారని బుగ్గన ఎదేవా చేశారు. ఆకర్షణీయమైన అబద్ధ్దాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. అమాయకులపై రౌడీషీటర్ల ముద్ర వేసి స్టేషన్లోనే దారుణంగా హత్య చేసి అనవాళ్లు లేకుండా చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, కూటమి నేతల ముసుగులోని అరాచక నేతలకు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. -
బల్లలున్నా.. కిందనే చదువులు!
హత్యకేసు నిందితుల అరెస్ట్ రుద్రవరం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బల్లలున్నా వారి చదువులు నేలపైనే కొనసాగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మన బడి నాడు–నేడు పేరుతో పాఠశాలల రూపు రేఖలు మార్చారు. విద్యార్థులకు అవసరమైన వసతులన్నీ కల్పించారు. అయితే ఆ వసతులను కూడా సరిగా వినియోగించుకోలేక పోతుండటం గమనార్హం. మండల పరిధిలోని కే.కొత్తూరులో ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు హెచ్ఎం, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. హెచ్ఎం వెంకటరెడ్డి వరండాలో అటు ఇటు తిరుగుతుండగా ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకే గదిలో కొందరిని బల్లలపై, కొందరిని కింద కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. దీంతో మిగిలిన గదుల్లో బల్లలు ఖాళీగా ఉంటున్నాయి. మరో గదిలో ఫ్యాన్ కింద బల్లపై పడుకొని ఏజెన్సీ నిర్వాహకురాలు సేదదీరుతోంది. అయినా హెచ్ఎం నిమ్మకుండిపోయారు. అలాగే ఢీ.కొట్టాల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు గాను ఒక్కరే విధుల్లో ఉండటంతో విద్యార్థులను బండలపై కూర్చోబెట్టారు. రెండు పాఠశాలల్లోనూ మెనూ ప్రకారం రాగి జావా ఇవ్వలేదు. ఇదేమని అడగ్గా పొడి అయిపోయిందని చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మిని అడగ్గా.. విచారించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను మందలించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు: కల్లూరు ఎస్టేట్ చింతలముని నగర్కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు హత్య కేసులో మౌలాలి, యువరాజ్ అలియాస్ అభి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మే 13 నుంచి శ్రీనివాసులు అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాల్ డేటా ఆధారంగా విచారించగా శ్రీనివాసులు అదే ప్రాంతంలో మేసీ్త్ర పని చేసే మౌలాలి గతంలో స్నేహితులని తెలిసిందన్నారు. మౌలాలి కొంత డబ్బును శ్రీనివాసులుకు అప్పుగా ఇచ్చాడని, డబ్బు తిరిగివ్వమని అడిగిన సందర్భంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. ఈ విషయంలో శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి రెండు సార్లు మౌలాలిని కొట్టాడన్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న మౌలాలి తనతో పాటు సెంట్రింగ్ పనిచేసే అదే ప్రాంతానికి చెందిన యువరాజ్ అలియాస్ అభి సహాయంతో మే నెల 13న శ్రీనివాసులుకు ఫోన్ చేసి చెన్నమ్మ సర్కిల్లో మద్యం కొనుగోలు చేసి కల్లూరు ఎస్టేట్లోని శ్రీగోడ ఆంజనేయస్వామి ఆలయం శివారులో మద్యం సేవించారు. ఈ సమయంలో మాటామాటా పెరగడంతో మౌలాలి, అభి కలిసి బండరాయితో శ్రీనివాసులు తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. విచారణ జరిపి నిందితులిద్దరినీ ఈనెల 6న అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ముందు చూపు లేకనే నీటి కష్టాలు!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లను నింపుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఏడాది సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయన్నారు. 2025–26లో కురిసిన వర్షాల వల్ల 1651.380 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందన్నారు. వరద నీటిని నింపుకునేందుకు అవసరమైనన్ని రిజర్వాయర్లు లేకపోవడం, అధికారులు ముందుచూపుతో ఆలోచన చేయకపోవడం వల్ల ఈ ఏడాది ప్రజలు సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 9.725 టీఎంసీలు మాత్రమే నీరు ఉందన్నారు. ఖరీఫ్లో ఎల్ఎల్సీ కింద నీటిని ఇవ్వలేమని టీబీ బోర్డు అధికారులు ప్రకటించారన్నారు. అలాగే ముందు నుంచి జెడ్పీ సమావేశాల్లో చెప్పడం వల్ల జీడీపీలో 4.5 టీఎంసీలకుగాను ఇప్పటికీ 2.67 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిగిలిన రిజర్వాయర్లలో నీరు అడుగంటాయన్నారు. సుంకేసులలో 0.881 టీఎంసీలు, క్రిష్ణగిరిలో 0.013, జుర్రేరులో 0.11, అలగనూరులో జీరో, శ్రీశైలంలో 42.21 టీఎంసీలు, వెలుగోడులో 1.857, గోరుకల్లులో 2.605 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్లో 0.788, వీఆర్ఎస్పీలో 0.027, పందికోనలో 0.67, పులికనుమలో 0.14 టీఎంసీలు ఇలా.. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కు చేరుకుందని ఛైర్మన్ పాపిరెడ్డి వివరించారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, మరోవైపు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ‘జలధార ● జల హారతి’ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ● కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం సొసైటీలో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని దీనికి రసీదులు కూడా ఉన్నాయని చైర్మన్ అన్నారు. యూరియా బస్తా రూ.267కు అమ్మాల్సి ఉండగా రూ.290లకు అమ్ముతున్నారని, పైగా నానో డీఏపీ కొంటేనే యూరియా ఇస్తామని షరతు విధించడంతో విధి లేని పరిస్థితుల్లో లీటర్ నానో డీఏపీకి రూ.500 చెల్లించి రైతులు యూరియాను తీసుకువెళ్తున్నారన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ● జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల ప్రాధాన్యతను అధికారులు గుర్తించాలని చైర్మన్ అన్నారు. మొక్కుబడిగా ద్వితీయ శ్రేణి అధికారులు, కార్యాలయ పర్యవేక్షకులను సమావేశాలకు పంపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ● బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పేదలకు సబ్సిడీపై అందాల్సిన అనేక పథకాలు అందడం లేదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. జిల్లాలో 25 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగడంచె చెరువు పునరుద్ధరణ పనులను మైనర్ ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు కేటాయించారని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి లేవనెత్తారు. చెరువు పనులకు అధికారులు రూ.42 లక్షల అంచనాతో టెండర్లు పిలవగా మూడు ఏజెన్సీలు పాల్గొన్నాయన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుభవం లేని సుజిత్రెడ్డి ఏజెన్సీకి పనులు అప్పగించేందుకు ఎల్ఓఏ (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) ఇచ్చారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ● గూడురు మండలంలో గత మూడు దఫాలుగా 286 మంది అర్హులైన రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ కాలేదని జెడ్పీటీసీ మౌలాలి లేవనెత్తారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు. ఆర్అండ్బీ మంత్రి ఉన్నా రోడ్లు అధ్వానం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఉమ్మడి జిల్లాకు చెందిన వారైనా జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కోడుమూరు, జూపాడుబంగ్లా జెడ్పీటీసీలు బీ.రఘునాథరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కోడుమూరు – వెల్దుర్తి రోడ్డు పనులు నెలల తరబడి నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. కోవెలకుంట్ల పట్టణంలో నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డాయన్నారు. ఆలూరులో రోడ్డుపై ప్రమాదకర గుంత ఉందని ఎర్రజెండాను పెట్టారన్నారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
దేవుని సొమ్ము దోచుకుంటున్నారు
భూమా వారసులు నంద్యాల: అహోబిలం దేవుని సొమ్మును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి దోచుకుంటున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమా వారసులు అహోబిలం టోల్గేట్లలో అక్రమ వసూళ్లతో పాటు తలనీలాల కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తలనీలాల కమీషన్లు రావడం లేదని భూమా జగత్ విఖ్యాత్రెడ్డి తలనీలాల వాహనాన్ని అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గత ఏడాది తలనీలాల వేలం రూ.1.50 కోట్లకు పాడుకొని అందులో రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి రూ.కోటి చెల్లించలేదన్నారు. ఈ ఏడాది అహోబిల మఠం వారు టెండర్లు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ఎవరైనా టెండర్లు వేయడానికి వస్తే భయపెడుతున్నారన్నారు. ఇటీవల టెండర్ల కోసం రూ.2 లక్షలు డీడీలు తీసిన వ్యక్తిని అఖిలప్రియ అనుచరులు ప్రాణం మీద ఆశ ఉంటే వచ్చి చేసుకో అంటూ భయపెట్టారని, అందుకు సంబంధించిన వీడియోను విలేకరుల ముందు ప్రదర్శించారు. అహోబిలం తలనీలాలు చైన్నెకి చెందిన కాంట్రాక్టర్కు అహోబిలం మఠం వారు తీసుకొని వెళ్తుంటే అడ్డుకొని హంగామా సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక వేళ తలనీలాలు దొంగతనంగా తీసుకెళితే మఠం అధికారులు కేసు పెడతారు కదా.. మీకేంటి అంత తొందర అంటూ ప్రశ్నించారు. అహోబిలం దేవుని సొమ్ము దోచుకుంటూ మళ్లీ మీరే సిగ్గు లేకుండా దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు మాపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్కల్యాణ్లకు అహో బిలం దోపిడీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి భూమా వారసుల అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. -
ఒక్క ఓటు తొలగిపోకూడదు
నంద్యాల: వైఎస్సార్సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని, సర్ కార్యక్రమం పట్ల బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, నియోజకవర్గ పరిశీలకులతో సర్ సర్వే తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా పార్టీ నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లు తీసివేయడానికి టీడీపీ నాయకులు కుట్రపన్నే అవకాశం ఉందని, ప్రతీది గమనిస్తూ ఉండాలన్నారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 14వ తేదీలోపు ప్రతి ఓటరు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఓటు హక్కు పొందాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో పూర్తి కావడం కష్టమవుతుందని, కావున ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించేందుకు కేటాయించిన గడువును అధికారులు పొడిగించాలన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని కూటమి నాయకులు ధ్వంసం చేశారని, ఈ స్థానంలో కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, భూమా కిశోర్రెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేసిన ఉచిత విద్యుత్
ఉచిత విద్యుత్ రైతుల పాలిట వరంగా మారింది. 2004 ముందు రైతుల పరిస్థితి దయనీయం. అప్పట్లోనే వ్యవసాయ విద్యుత్ రైతులకు పెనుభారంగా మారింది. నాటి పాలకులే వ్యవసాయం దండగని ప్రకటించడంతో రైతులకు చేయూత కరువైంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతులకు ఊపిరి పోశారు. వైఎస్ఆర్ మరణించే నాటికి ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 2018–19 నాటికి 1.64 లక్షల కనెక్షన్లకు చేరాయి. అంటే వైఎస్ఆర్ తర్వాత ఇచ్చిన కనెక్షన్లు 14వేలు మాత్రమే. అప్పట్లోనే వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ విజయవంతంగా అందించి రైతులకు దేవుడయ్యారు. -
వరుణదేవా.. కరుణించవా..
● బోడబండలో వర్షం కోసం 24 గంటల భజన భజన చేస్తున్న భక్తులు మండలంలోని బోడబండ గ్రామంలో వర్షం కోసం 24 గంటల పాటు భజన చేపట్టారు. ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు భక్తి పాటలతో ‘వరుణ దేవా.. కురియరావా’ అంటూ వరణుడిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి, ఈశ్వరస్వామి దేవాలయాల్లో అభిషేకం, అలంకరణ తదితర పూజలు నిర్వహించారు. అలాగే అన్నదానం చేపట్టారు. – ఎమ్మిగనూరుసెంట్రల్ -
నీతి ఆయోగ్ అధికారి పరిశీలన
హొళగుంద: మండలంలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ అధికారి బంగార్రాజు పర్యటించారు. గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువైద్య కేంద్రం, కేజీబీవీతో పాటు పలు శాఖలకు చెందిన కార్యాలయాలు తిరిగి అక్కడ సంపూర్ణ అభియాన్ (నీతి అయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ )–2.0 కార్యక్రమం అమలు, రికార్డులు, కేపీఐ సూచికలను సమీక్షించి ఇతర అంశాల పై ఆరా తీశారు. గ్రామాలలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో టీచర్ల కొరత, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం, పొదుపు మహిళలకు స్వయం ఉపాధి కల్పన ఇలా అనేక అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి, ఎదురవుతున్న సవాళ్లపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ఎంపీడీఓ సయ్యద్ఉమర్, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో రవిశంకర్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): నగరంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునగాలపాడు రోడ్డు, సంపత్ నగర్, సంతోష్ నగర్, బళ్లారి చౌరస్త, కృష్ణా నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా పి.ఆర్ వైన్స్ వద్ద అపరిశుభ్ర వాతవరణం ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన కమిషనర్ రూ.10 వేలు జరిమానా విధించారు. -
వర్షాభావం.. వెల్లివిరిసిన మత సామరస్యం
ఆత్మకూరురూరల్: వర్షకాలం ప్రారంభమై నెల దాటినా చినుకు రాలక రైతులంతా ఆందోళనలతో ఆకాశం వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుణు డు ముఖం చాటేయడంతో రైతులు వరుణాధి దేవతలను ఆదేశించగలిగే దైవాలకు కొలుపులు మొదలు పెడుతున్నారు. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామ రైతులు మతాలకతీతంగా ఏకమై సోమవారం గ్రామ సమీప నల్లమల అడవుల్లో వెలసిన జడలయ్య (శివుడు) స్వామి వద్దకు వెళ్లి పూజల అనంతరం వనభోజనాలు చేశారు. ముందుగా జడలయ్య స్వామి విగ్రహానికి అక్కడి పవిత్ర కోనేరు నీటితో అభిషేకాలు నిర్వహించారు. ఈ కోనేరులో మండు వేసవిలోనూ, నిండు వర్షాకాలంలోనూ భూమి ఉపరితలానికి సమానంగా నీరు ఉండటం గమనార్హం. అనంతరం స్వామి సన్నిధిలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులంతా కలిసి వనభోజనాలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలను పాటించే రైతులంతా ఒక చోట చేరి సమష్టిగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అ‘ధనం’గా దోపిడీ!
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద 69 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నమోదయ్యాయి. వీటితో పాటు ప్రభుత్వ పలు ఆస్పత్రులను సైతం ఇందులో కొనసాగిస్తున్నారు. రోగికి వచ్చిన వ్యాధి, చికిత్సను బట్టి ప్రభుత్వం ప్యాకేజీలను నిర్ణయించింది. మార్కెట్కు అనుగుణంగా ఐదారేళ్లకు ఒకసారి ధరలను సవరిస్తూ వస్తున్నారు. అయితే చిన్న పట్టణా ల్లో ఉండే ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ప్యాకేజీలు సరిపోతాయని, తమ ఆసుపత్రులకు సరిపోవని కర్నూలు లాంటి నగరాల్లో ఉండే ఆసుపత్రుల యాజమాన్యాలు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. రోగి చికిత్స కోసం రాగానే, ఆరోగ్యశ్రీ కింద వచ్చే ప్యాకేజీ సరిపోదని అదనంగా ఇంత ఇస్తేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఇష్టమంటే ఇక్కడ చేయించుకోవాలని, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని మరీ సూచిస్తున్నారు. అలాగే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన విషయం చెప్పకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. దీంతో తనిఖీల సమయంలో రోగులు ఫిర్యాదు చేయడం లేదు. అయితే ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించి పలువురు ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. గత మే, జూన్ నెలల్లో జిల్లాలో 30కి పైగా ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. ఈ అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలంటే అధికారులు డెకాయిట్ ఆపరేషన్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఈహెచ్ఎస్, జర్నలిస్ట్ హెల్త్కార్డులకు నో ట్రీట్మెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ కార్డులపై తాము చికిత్స అందించలేమని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాము చికిత్స చేసినా ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి డబ్బులు రావడం లేదని ఆయా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు వెళ్లి స్కీమ్లు వర్తించక ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అనీల్కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కొందరు దళారులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీతో పాటు అదనంగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పి మరీ వసూలు చేశారు. కర్నూలు మండలం రుద్రవరానికి చెందిన రాముడుకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వారం రోజుల క్రితం కొత్తబస్టాండ్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్యులు పరీక్షించి అపెండిక్స్ పగిలిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా రూ.30 వేలు వసూలు చేశారు. వీరిద్దరూ కాదు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టు కుని ఏ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లినా ఇదే తంతు నడుస్తోంది. ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు బాహాటంగా వసూలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదంటూ దాదాపుగా అన్ని ఆసుపత్రులు రోగుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. -
హమ్మయ్య.. నీటి రాక మొదలైంది
● టీబీ డ్యాంకు చేరుతున్న వరద ● 10 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొళగుంద: ఇన్నాళ్లు ప్రవాహం లేక వెలవెలబోయిన కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఎట్టకేలకు సోమవారం ఇన్ఫ్లో నమోదు కావడంతో రైతుల మోములో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది ఇదేరోజున డ్యాంలో 78 టీఎసీంల నీరుండగా ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన తర్వాత సోమవారం ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో రైతులు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాలో వర్షాలు కురిసినా తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (తుంగ ప్రాజెక్ట్) నిండేంత వరకు దిగువకు నీరు పారలేదు. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ఠ మట్టానికి చేరడంతో అక్కడి ఇంజినీర్లు 22 క్రస్ట్ గేట్లలో దాదాపు 15కు పైగా గేట్లను ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. ఆ నీరు దిగువన హోస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర డ్యాం వైపు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఇన్ఫ్లో జీరో ఉండగా సోమవారం ఉదయం 2 వేల క్యూసెక్కులకు పైగా నమోదైంది. మంగళవారం ఉదయం నాటికి 10 నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరే అవకాశాలున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
జంతువుల నుంచి సోకే వ్యాధులపై అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ సూచించారు. సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని కర్నూలులోని బహుళార్థ పశువైద్యశాల, అన్ని ఏరియా పశు వైద్యశాలల్లో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. బహుళార్థ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రాజశేఖర్ ప్రారంభించారు. శిబిరంలో 600 పెంపుడు కుక్కలు, పిల్లులకు టీకాలు వేశారు. వాటి యజమానులు, పశుపోషకులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రేబిస్కు మందు లేదని నివారణే మార్గమన్నారు. ఒకేరోజు 7500 డోసుల రేబిస్ టీకాలు వేయడం జరిగిందని మంగళవారం కూడా టీకాల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వసంతలక్ష్మి, జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవి, వీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుధాకర్, గిడ్డయ్య, చంద్రలీల, పలువురు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సకు ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా విచారణ చేసి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం. గత రెండేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలకు భారీగా జరిమానా విధిస్తున్నారు. అయినా కూడా కొంత మంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదు లు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్, కర్నూలు -
పాఠశాల స్థలం కబ్జాపై నిరసన గళం
ఆదోని: మండలంలోని దొడ్డనగేరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 11.38 సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కురువ శివప్ప కబ్జా చేసిన నేపథ్యంలో సోమవారం ఉదయం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి పాఠశాలను మూసివేసి నిరసన తెలిపారు. తమ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై గత నెల 27వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘పచ్చ నోట్లకు రిజిస్ట్రేషన్’ శీర్షికతో వార్తా కథనం ప్రచురించి వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి విచారణ కమిటీలు వేయడం జరిగింది. అయితే విచారణల పేరిట కాలయాపన జరుగుతుందే తప్పా తమ పాఠశాల స్థలాన్ని కాపాడటంలో అధికారులకు చిత్తశుద్ధి లేదని పూర్వ విద్యార్థులు ధ్వజమెత్తారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా ముక్త కంఠంతో ‘మా పాఠశాల స్థలాన్ని కాపాడండి.. ఆక్రమణలను అడ్డుకోండి.’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం హెచ్ఎంకు వినతిపత్రం అందజేశారు. స్పందించాలని డిమాండ్ -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
వెల్దుర్తి: మండల పరిధిలోని కసాపురం వద్ద రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెర్లకొత్తూరు గ్రామ యువకుడు చంద్రమోహన్ (25) మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మే రకు.. మోహన్ ఫోటోగ్రాఫర్, పెయింటర్గా జీవిస్తూ ఇటీవల ఓ ప్రైవేట్ సోలార్ కంపెనీలో పనికి కుదిరాడు. సోమవారం బొమ్మిరెడ్డిపల్లె వద్ద కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్పై బయలుదేరా డు. మార్గం మధ్యలో మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా దూసుకొన్చిన గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడికి తల్లి లక్ష్మీదేవి,భార్య రూత్, ఏడాది లోపు వయసున్న కుమారుడు ఉన్నా రు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబసభ్యులు నిరాకరించారు. తమకు న్యా యం జరగాలంటూ భీష్మించారు.రహదారిపై బైఠాయించారు. ఎస్ఐ నరేశ్ ఘటనాస్థలికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
గొర్రెలను కాపాడబోయి యువకుడి మృతి
డోన్ రూరల్(ప్యాపిలి): మండలంలోని నల్లమేకలపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం గ్రామ సమీపంలోని కుంటలో గొర్రె పిల్లలను కాపాడేందుకు వెళ్లి చిన్న నాగన్న (23) నీట మునిగి మృతి చెందారు. జలదుర్గం ఎస్ఐ అనిల్కుమార్, అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో మోటారు సాయంతో నీటిని బయటకి పంపేలా చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతదేహం నీటి కుంటలో చిక్కుకొని ఉండగా గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు జలదుర్గం ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. జలపాతం వద్దకు వెళ్లి మృత్యువాత సి.బెళగల్: మండల కేంద్రానికి చెందిన యువకుడు తాడా జలపాతం (ఉబ్బల మడుగు జలపాతం)లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సి.బెళగల్లో నివాసం ఉంటున్న కేశవులు, జయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు నరేష్ (25) కొన్నేళ్లుగా తిరుపతిలోని ప్రైవేట్ హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. నరేష్ ఆదివారం ఆరుగురు మిత్రులతో కలిసి తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో వరదయ్యపాలెం గ్రామ సమీపంలో ఉన్న తాడా జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడిన నరేష్ను మిత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం తిరుపతిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సి.బెళగల్కు తీసుకవచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఓర్వకల్లు: శృంగేరి జగద్గురువులు విద్యాశంకర భార తీ మహాస్వాముల వారు ఖమ్మం నుంచి బయలు దేరి సోమవారం సాయంత్రం ఓర్వకల్లుకు చేరుకున్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా ముందుగా స్వాముల వారు స్థానిక జీవేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక బాలభారతి వద్ద భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. వేదపండితులు ఫనిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో స్వాముల వారికి పొదుపు మహిళలు, రాజకీయ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మొదటి రోజున పాదపూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, భక్తులతో సమావేశం, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థప్రసాదాల వితరణ నిర్వహించారు. స్వాముల వారి విజయ యాత్ర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండల సమైఖ్య గౌరవ సలహాదారులు విజయభారతి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు: కర్నూలు గణేష్ నగర్ ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్నట్లు మహిళ రాజేశ్వరి ఇచ్చిన సమాచారంతో గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బుధవారపేటకు చెందిన షేక్ ఖాజా, షేక్ ఆలం హుసేన్గా గుర్తించి వారిని మూడో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సమయ స్ఫూర్తితో పోలీసులకు సమాచారం అందించిన మహిళ రాజేశ్వరిని, వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ ధన్రాజ్ను పోలీసు అధికారులు అభినందించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కనిపిస్తే 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
శ్రీగిరిలో ‘కూటమి’ దందా!
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రంలో కూటమి నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా తమ అనుచరులతో అనధికారికంగా వ్యాపారం చేయిస్తున్నారు. శ్రీశైలంలో క్లాక్రూం వద్ద పంచెలు అమ్ము తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఉచిత కంపార్ట్మెంట్లలో టీ, కాఫీ వ్యాపారం చేయిస్తున్నారు. దుకాణాల సముదాయంలో తనకు అనుకూలమైన వారు ఏవిధమైన వ్యాపారం చేసినా అడ్డుచెప్పకుండా అధికారుల నుంచి గ్రీన్సిగ్నల్ ఇప్పించారు. కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేసి.. శ్రీశైలంలో సెల్ఫోన్లు, లగేజీ బ్యాగులు భద్రపర్చుకునే టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేశారు. ఎవరినీ టెండర్లో పాల్గొనకుండా చేసి కూటమి నేతలు తమ అనుంగ అనుచరులకు ఇప్పించుకున్నారు. క్లాక్రూం ఆదాయంతో పాటు ఇతర వ్యాపారం చేస్తే మరింత డబ్బు వస్తుందని భావించి అక్కడ పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. క్లాక్రూం వద్ద ఎటువంటి ఇతర వ్యాపారం చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే దేవస్థాన ఈఓతో అనుమతి తీసుకోవాలి. టెండర్ ద్వారా ఆ దుకాణాన్ని దక్కించు కోవాలి. ఇవేమీ లేకుండానే పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉచిత కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు కూటమి నాయకుల అనుచరులు టీ, కాఫీ విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. దేవస్థానం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు. బేరం కుదరడంతో.. తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఓ వ్యాపారి గతంలో వీడియో రిలీజ్ చేశారు. అయితే కొన్నిరోజులకు కూటమి నాయకులతో బేరం కుదరడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా సదరు వ్యాపారి దుకాణాలు ఉచిత దర్శనానికి వెళ్లే దారికి ఎదురుగా ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. కూటమి పెద్దల ఆశీస్సులతో దుకాణాల వద్ద మరో దుకాణాల మారిదిగా మెట్లు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారనే కోపంతో మరో మహిళా దుకాణం వద్ద దుకాణం కనపడకుండా సమాచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయిన వారికి అకుల్లో..కానీ వారికి కంచాల్లో అన్న చందంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆర్జిత సేవల క్యూలైన్ క్లాక్రూం వద్ద పంచెల విక్రయాలు ఉచిత కంపార్ట్మెంట్లలో టీ, కాఫీ బిజినెస్ మల్లన్న ఆదాయానికి భారీగా గండి చోద్యం చూస్తున్న దేవస్థాన అధికారులు -
జంతు ప్రేమికా..జాగ్రత్త సుమా!
మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది పశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని వృత్తిగా పెట్టుకున్నారు. ప్రతి మనిషి పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు,గుడ్లు, మాంసం తదితర వాటిపై ఆధారపడి ఉన్నాడు. ఇదే సమయంలో ఇంటి రక్షణ కోసం మొదలైన కుక్కల పెంపకం క్రమంగా హాబీగా మారింది. ఇలా మనుషులు, జంతువులు నిరంతరం కలసి పోతుండటం వల్ల తెలియకుండానే వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణే లక్ష్యంగా పరిశోధనలు పెంచడం, పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేయించేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఏడాది జూలై 6న జూనోసిస్ డే నిర్వహిస్తారు. కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు ఇటీవల వ్యాధులు పెరుగుతున్నాయి. పందుల ద్వారా మెదడువాపు, కుక్కకాటు వల్ల రేబిస్, గొర్రెలు, మేకల ద్వారా ఆంత్రాక్స్, ఆవులు, గేదెల నుంచి క్షయ, పాల ద్వారా బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తోంది. ఇవే కాకుండా పక్షుల వల్ల సిటాకోసిస్, ఎలుకలతో ప్లేగు, పిల్లుల ద్వారా పాగ్సోప్లాస్మోక్రాండై, కోళ్ల ద్వారా బ్లడ్ఫ్లూ, కుందేళ్ల నుంచి టాక్సోప్లాస్మోసిన్, కోతుల ద్వారా లెప్రసీ, ఇతరాత్ర జంతువులు, పక్షుల ద్వారా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం, వైద్యపరీక్షలు చేయించడం, పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల సంక్రమణను అడ్డుకోవచ్చు.అయితే ఆ దిశగా వైద్య సేవలు అందించడంలో, ప్రజలను చైతన్య పరచడంలో పాలకులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు రేబిస్, మరోవైపు బ్రూసెల్లోసిస్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీధి కుక్కలను నియంత్రించడంతో ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి కోరలు చాస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీగా శస్త్రచికిత్సలు ( ప్యామిలీ ప్లానింగ్) నిర్వహించడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత శస్త్రచికిత్సలు చేసే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కుక్కల సంతతి పెరిగిపోవడంతో వీధుల్లోకి చిన్నారులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు పశువులు, గొర్రెలు, మేకల నుంచి బ్రూసెల్లోసిస్ సోకుతోంది. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధి సోకిన వారు దాదాపు 100 మందికిపైగా ఉన్నారు. నేడు పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు లూయిస్పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి వ్యాధి రాకుండా వ్యాధినిరోధక టీకా మందు విజయవంతంగా ఇచ్చారు. ఆ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. చికిత్స కన్నా– నివారణే మిన్నగా భావించి పశుసంవర్ధకశాఖ నేడు (సోమవారం) కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీల్లో పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 37,810 డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ వచ్చింది. ఇందులో కర్నూలు జిల్లాకు 13,060 డోసులు, నంద్యాల జిల్లాకు 24,750 డోసుల వాక్సిన్ సరఫరా అయ్యింది. ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు మూగజీవాలతో మనుషులకు అవినాభావ సంబంధం -
టెండర్దారుడికి లబ్ధి చేకూరేలా..
మల్లికార్జున సదన్ వద్ద ఉన్న డార్మెంటరీ టెండర్ కాలపరిమితి పూర్తవడంతో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడి తమ అనుచరులతో టెండర్ వేయించారు. వారికే టెండర్ దక్కేలా గిమ్మిక్కులు చేశారు. గతంలో మల్లికార్జున సదన్లో దిగే భక్తుల వాహనాల డ్రైవర్లు, ఇతర వ్యక్తులు డార్మెంటరీ ద్వారా వసతి పొందేవారు. అయితే మల్లికార్జున సదన్ వద్ద డార్మెంటరీ టెండర్ దక్కించుకున్న కూటమి నాయకులు అంతటితో ఆగకుండా వసతి విభాగాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మల్లికార్జున సదన్లో ఉన్న డార్మెంటరీ మొత్తం క్షేత్రంలో విధులకు వచ్చే పోలీసులకు ఉచితంగా అప్పగించారు. తద్వారా పరోక్షంగా కూటమి నాయకులు దక్కించుకున్న డార్మెంటరీలో వ్యాపారం జరిగేలా అధికారులు లోపాయికారీగా వారికి మేలు జరిగేలా పనిచేసినట్లు తెలుస్తోంది. మల్లికార్జున సదన్ డార్మెంటరీకి వచ్చిన భక్తులు చేసేదేమిలేక ప్రైవేట్ డార్మెంటరీని అశ్రయిస్తున్నారు. అంతటితో ఆగకుండా డార్మెంటరీ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా టీ, కాఫీ, బిస్కెట్లు, టూత్ పేస్టు, బ్రష్లు, షాంపులు, వాటర్బాటిల్స్, కూల్డ్రింక్స్ ఇలా అన్ని సరుకులతో కూడిన ఓ ప్రైవేట్ దుకాణాన్ని సైతం ఏర్పాటు చేశారు. -
సమావేశాలు గోప్యం.. వసూళ్ల బాగోతం!
కర్నూలు కల్చరల్: టీడీపీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) బీఈడీ కళాశాలల యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కో కళాశాల నుంచి ఇంటేక్ సీట్ల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.2లక్షల చొప్పున వసూలుకు రంగం సిద్ధమైంది. ఓ మంత్రి వద్ద అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ రంగంలోకి దిగిందని, వసూలు చేసిన మొత్తాన్ని సదరు మంత్రికి అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర నాయకులు ముగ్గురు యూనివర్సిటీ ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బు వసూ లు బాధ్యతను ప్రతి జిల్లాలో ఒకరికి కట్టబెడుతుండటం గమనార్హం. గత నెల నుంచి రహస్య సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో గత వారంలో సమావేశం పూర్తయింది. రిజిస్ట్రేషన్కు ఆదేశాలు ఎఫ్ఆర్ఎస్ అమలుకు గత నెల 29 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు.. ఈనెల 6 నుంచి డిగ్రీ, 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 20 నుంచి బీఈడీ కళాశాలలు, 27 నుంచి లా, బీపీఈడీ కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా కళాశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం. ఎఫ్ఆర్ఎస్కు సంబంధించి ప్రతి కళాశాల ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. అయితే ఆ ఊసే కరువైంది. కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు కళాశాలల్లో ఉద్యోగులు, సిబ్బందితో పాటు విద్యా ర్థుల ముఖ ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి చేయడంపై కూటమి అనుకూల కళాశాలల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఎఫ్ఆర్ఎస్ను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ వసూళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళాశాలల నుంచి కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు చేసి ముట్టజెప్పేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 శాతం సీట్లు భర్తీ? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీలు ఉన్నా.. ఆర్యూ పరిధిలో మాత్రమే బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 50 కళాశాలల్లో గత విద్యా సంవత్సరంలో 4,773 అడ్మిషన్లు చేపట్టారు. ఇంకా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కొన్ని కళాశాలలు అనుమతులకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించి వెసులుబాటు తీసుకున్నారు. అయితే వాస్తవ వివరాలతో కోర్టుల్లో కౌంటర్ వేయడానికి వర్సిటీలు ముందుకు రాకపోవడం కుమ్మక్కు వ్యవహారానికి బలం చేకూరుస్తోంది. బీఈడీ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా సీట్లను భర్తీ చేసుకోవడం.. ఈ విషయాన్ని ప్రభుత్వం, వర్సిటీలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముడుపులు దండుకోవడమే ఎజెండా ఎఫ్ఆర్ఎస్ వద్దంటున్న బీఎడ్ కళాశాలలు కూటమి ప్రభుత్వం కొత్త విధానాల పేరుతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి భారీగా ముడుపులు దండుకోవడమే ప్రధాన ఎజెండాగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీఈడీ కళాశాలల్లో అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం.. పారదర్శకత పేరిట ఎఫ్ఆర్ఎస్ను తెరపైకి తీసుకొస్తోంది. దీనిని ఎలాగైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తాయని తెలిసి.. వారిని దారికి తెచ్చుకోవడం ద్వారా భారీగా దండుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నాయకులు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ఎఫ్ఆర్ఎస్ నిలుపుదలకు కోర్టుల్లో సైతం కేసులు వేయించడం గమనార్హం. -
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మృతి
కర్నూలు(హాస్పిటల్): అనారోగ్య కారణాలతో ఆహార నియంత్రణ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు ఆదివారం ఉద యం మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన ఈయన ఫుడ్ఇన్స్పెక్టర్గా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా కడప, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో పనిచేశారు. పదోన్నతిపై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా కర్నూలు జిల్లాకు వచ్చారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా చికిత్స తీసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చారు. ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో సెలవుపై వెళ్లి వైద్యచికిత్స తీసుకుంటూ ఆదివారం మృతిచెందా రు. ఆయన మృతి పట్ల ఇన్చార్జ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజ గోపాల్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కార్మికులను రెగ్యులర్ చేయాలి కర్నూలు(సెంట్రల్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జే.దివాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి కనీసం వేతనం రూ.48 వేలు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు నాలుగు డీ ఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పోస్టులను భర్తీ చేయాలని, కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ ఇచ్చి న హామీలను నెరవేర్చాలని కో రుతూ జూలై 15న తిరుపతిలో ఆందోళన చేపట్టనున్న ట్లు చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 10న విజయవాడలో ఆందోళన చేస్తామన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫ్యాప్టో నంద్యాల జిల్లా ఇన్చార్జ్ హృదయరాజు, అధ్యక్షుడు రామచంద్రారెడ్డితో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలు పరిష్కారంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 14వ తేదీన నంద్యాల కలెక్టరేట్ ముట్టడించనున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో 12వ పీఆర్సీని సకాలంలో అమలు చేస్తామని, ఐఆర్ను ప్రకటిస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డీఏ చెల్లిస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని నమ్మంచి మోసం చేశారన్నారు. కూటమి సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు 12వ వేతన సవరణ కమిషన్ నియమించలేదు, పెండింగ్ డీఏలు ఇవ్వలేదన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారుపై నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేయనున్నామన్నారు. కార్యక్రమానికి ఫ్యాప్టో కో చైర్మన్లు, ప్రసాద్, చంద్రశేఖర్, స్వామిశేఖర్, శ్రీనివాసులు, శివయ్య, లక్ష్మీనాయక్, జాకీర్హుసేన్, సైఫుల్లా, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జలకళ ఏదీ!
● పోతిరెడ్డిపాడు వద్ద కానరాని నీటి జాడ ● గతేడాది జులై 6న గేట్లు ఎత్తి నీటివిడుదల నీటిప్రవాహం లేని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ జూపాడుబంగ్లా: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకున్నాయి. అరకొరగా కురిసిన వర్షాలకు సాగు చేసిన ఖరీఫ్ పంటలు వాడుముఖం పట్టాయి. కాలువల నీటితో పంటలను కాపాడుకుందామంటే జలాశయాల్లో నీళ్లు లేవు. గతేడాది జూన్ 15 తేదీ నుంచే శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం ప్రారంభం కాగా 21 తేదీ నాటికి జలాశయంలో 852 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జూలై 6వ తేదీ నాటికి 878.40అడుగుల నీటిమట్టం చేరుకోగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా డ్యాంలోకి వరద నీటిప్రవాహం జీరో. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ అప్రోచ్ కాల్వల్లో కనుచూపుమేరలో కూడా నీటిప్రవాహ జాడ కనిపించటం లేదు. ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో శ్రీశైలం డ్యాంలోకి వరదనీటి నీటిప్రవాహం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీరు విడుదలైతేనే వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, ఎల్లనూరు, పైడిపాలెం తదితర రిజర్వాయర్లలో జలకళ ఉంటుంది. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. -
రాజకీయ చైతన్యంతోనే బలిజల అభ్యున్నతి
నంద్యాల(వ్యవసాయం)/పాణ్యం: రాజకీయ చైతన్యంతోనే బలిజ సమాజం అన్ని విధాలుగా అభ్యున్నతి చెందుతుందని గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, శాంతిరాం మెడికల్ కాలేజ్ అధినేత డాక్టర్ మిద్దె శాంతి రాముడు పేర్కొన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కాలేజీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ రాయలసీమ పరిధిలోని జిల్లాల నుంచి బలిజ నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బలిజ సమాజం ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐక్యత, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, యువత పాత్ర, మహిళల భాగస్వామ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఒకప్పుడు బలిజలకు రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉండేదని, తిరిగి ఆ గుర్తింపు, గౌరవం సాధించుకోవాలన్నారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ ఎం. శాంతిరాముడును వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో బలిజ మహా సంకల్పం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ సోమశేఖర్, పరమేశ్వర రాజశేఖర్, పడకండ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జా రామకృష్ణ, గాజుల విజయభాస్కర్, సమతం రాము, అడ్వకేట్ శివప్రసాద్, జనార్దన్ పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఎమ్మిగనూరురూరల్: నవోదయ కోచింగ్ సెంటర్లో ఉండటం ఇష్టం లేక నిశాంత్ అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో కలక లం లేపింది. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తన కుమారుడి నిశాంత్(12)ను పట్టణంలోని గుడేకల్ రోడ్డులో ఉండే గురు నవోదయ కోచింగ్ సెంటర్లో ఐదు రోజుల క్రితం వదలివెళ్లాడు. ఆదివారం కుమారుడిని చూడటానికి తండ్రి వచ్చాడు. తనకు ఇక్కడ ఉండలేనని కుమారుడు చెప్పడంతో తండ్రి మందలించి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన నిశాంత్ కోచింగ్ సెంటర్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మోటార్బైక్ీసీటుపై పడ్డాడు.అక్కడ ఉన్న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే కింద పడిన విద్యార్థి నిశాంత్ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిందకు దూకినప్పుడు మో టర్ బైక్ సీటుపై పడటంతో ఊపిరితిత్తుల భాగంలో ఒత్తిడికి గురైనట్లు వైద్యులు చెప్పారు. నిశాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడో అంత స్తు నుంచి కింద దూకినప్పుడు రోడ్డుపై పడింటే విద్యార్థి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని ప్ర త్యక్ష సాక్షలు చెప్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సాయంత్రం తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు చేరిన విద్యార్థి
హొళగుంద: ఇంగళదహాళ్ బీసీ హాస్టల్లో 8వ తరగతి చదువుతూ శనివారం సాయంత్రం అదృశ్యమైన హొళగుందకు చెందిన హరివాణం గోవర్ధన్ను హొళగుంద పోలీసులు ఆదివారం తల్లిదండ్రలుకు అప్పగించారు. ఈ విద్యార్థి శనివారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత స్నేహితులతో కలిసి బయటకెళ్లి వస్తానని హాస్టల్ సిబ్బందికి చెప్పి రాత్రయినా తిరిగి రాలేదు. వార్డన్, వాచ్మన్ హొళగుంద పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ దిలీప్కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది రాత్రంతా గాలించారు. అలాగే విషయాన్ని సోషియల్ మీడియాలో వైరల్ చేసి విద్యార్థి ఆచూకీని కనుగొన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర సిరుగుప్ప నియోజకవర్గం కె.బెళగల్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి విద్యార్థి గోవర్ధన్ను హొళగుందకు తీసుకొచ్చి తల్లిదండ్రలుకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం
పాణ్యం/ఆళ్లగడ్డ: కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఏఎస్ఐ చిట్టెపు సురేష్రెడ్డి (56) మృతిచెందా రు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్ఐగా పనిచేస్తున్న చిట్టెపు సురేష్రెడ్డి, అతని భార్య ఉమాదేవి, నంద్యాల టూటౌన్ స్టేషన్లో ఎస్బీ హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రరెడ్డి, ఆయన భార్య జయమ్మ, కోడలు గేయారెడ్డి అనంతపురంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి నంద్యాలకు వస్తున్నారన్నారు. తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలోని ఉన్న ఘాట్రోడ్డు దాటుకొని వస్తుండగా పెద్దమ్మ గుడి వద్ద ఒక్కసారిగా కారు ఎడమ టైర్ పేలి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిట్టెపు సురేష్రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెండాడు. ఎస్టీ హెడ్కానిస్టేబుల్ నాగేంద్రరెడ్డికి కాలుకు తీవ్ర గాయం అయ్యింది. కారులో వెనుక సీట్లో కుర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హైవే, 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన సురేష్రెడ్డి మృతదేహాన్ని గ్యాస్ కట్టర్ సహాయంతో డోర్ను తొలగించి బయటకుతీశారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. దెబ్బతిన్న కారును తొగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. ఇటీవలే కుమార్తె వివాహం.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన చిట్టెపు సురేష్రెడ్డి కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిగింది. ఈయన 1993 నుంచి 1999 వరకు ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు. అనంతరం కర్నూలు, ఆదోని, పాణ్యం స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తూ 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొండారు. సురేష్రెడ్డి మృతి చెందిన వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
తుంగ నిండా బెంగ!
● నిండని తుంగభద్ర డ్యామ్ ● వెలవెలబోతున్న ఎల్లెల్సీ ● ప్రశ్నార్థకంగా మారిన వరి సాగు హొళగుంద: వరి సాగుకు సిద్ధం కావాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నారు మళ్లతో పచ్చగా కళకళలాడాల్సిన ప్రాంతాలు ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. పంట కాల్వలు నీరు లేక వెలవెలబోతున్నా యి. ఎల్లెల్సీ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయిని అయిన తుంగభద్ర జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 27 వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదై 79 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఈ ఏడాది ఒక చుక్క నీరు కూడా ఇన్ఫ్లో లేక 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీ తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే దిగువ కాలువ (ఎల్లెల్సీ)నే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటుతు న్నా, జూలై మొదటి వారంలో అడుగు పెట్టినా నేటికి టీబీ డ్యాంలో చుక్క నీరు చేరకపోవడంతో ఎల్లెల్సీ కింద వరి, ఇతర పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర జలాశయంలో ఆంధ్ర కోటాలో కర్నూలు జిల్లాకు దాదాపు 24 టీఎంసీల నీటిని కేటాయించారు. నీటి లభ్యత తగ్గడంతో 17 లేదా 18 టీఎంసీల వరకు కుదిస్తూ వస్తున్నటు్ల్ సమాచారం. ఆ నీటితో ఖరీఫ్లో 43,413, రబీలో 1.07 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితో పాటు దాదాపు 140 గ్రామాలకు తాగునీరు నీరందించాలి. ఆగస్టు వరకే అవకాశం.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నెలలో వర్షాలు ప్రారంభమై వరద జలాలతో ఆగస్ట్ 15 నాటికి పూర్తిస్థాయిలో నిండిపోతుంది. అయితే ఈ ఏడాది జూలై నెల మొదలైనా చినుక జాడా లేక చుక్క ఇన్ఫ్లో లేదు. దీంతో మూడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి గండం నెలకొంది. తుంగభద్ర జలాశయం 70 ఏళ్ల చరిత్రలో నీటి లభ్యత తగ్గిన దాఖలాలో ఈ ఏడాది కూడా చేరుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తుంగభద్ర జలాశయం పైభాగంలోని ఆగుంబే, వరనాడు, శివమొగ్గ, తీర్థనహళ్లీ, శృంగేరి తదితర ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టులు నిండిన తర్వాతే టీబీ జలాశాయానికి జలాలు చేరుతాయి. వానలు ఆలస్యం అయితే వర్షాకాలం ముగుస్తుంది. ఆగస్ట్ 15లోగా జలాశయం నిండితేనే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఏడాది గత ఏడాది కన్నా భిన్నమైన వాతావరణం కనబడుతుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాగునీటికి ప్రమాద ఘంటికలు.. ప్రస్తుతం డ్యాంలో నిల్వ ఉన్న 9 టీఎంసీలు గత రబీకి విడుదల చేయకుండా నిల్వ చేశారు. అదే నీరు నేడు తాగునీటి అవసరాలకు వస్తున్నాయి. ఒకవేళ రబీలో నీరు వదిలి ఉంటే ఈ ఏడాది జలాశయం పూర్తి డెడ్ స్టోరేజ్లోకి చేరి ప్రమాద ఘంటికలు వినిపించేవి. అయినా వర్షాలు కురువక డ్యాంలో నీరే చేరకపోతే రాబోయే రోజుల్లో భారీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి కర్నూలు జిల్లా ప్రజలతో పాటు వైఎస్సార్ కడప, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. -
ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందాం
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● ప్రతి ఓటరూ సరైన ధ్రువపత్రాలు సమర్పించాలి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి గడివేముల: ఓటరు జాబితా ’ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్)లో ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గడివేములలోని పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియ జాతీయ ఎన్నికల కమిషన్ చేపట్టినా టీడీపీ నాయకుల కుట్రలు ఉంటాయన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఎలు గుర్తించుకోవాలన్నారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘సర్’ ప్రభావంతో సీఎం అభ్యర్థులు సైతం ఓటమి పాలైన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. టీడీపీ నాయకులు కుట్రలు పన్ని వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను సాంకేతిక కారణాలు చూపి తొలగిస్తున్నారనే వాదనలు ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించండి రెండేళ్ల కూటమి పాలనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంక్షేమాన్ని కొనసాగించలేని అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వేసుకున్నారన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లో భూములు కోల్పోయామని న్యాయం జరిగేలా చూడాలని కాటసాని రాంభూపాల్రెడ్డి దృష్టికి కొర్రపోలూరు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తీసుకువచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు చేద్దామని రైతులకు హామీ ఇచ్చారు. సోలార్లో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండంగా ఉంటుందన్నారు. ఏ పేద రైతు నష్టపోకుండా తాము పోరాటానికై నా సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మధుసూదన్, ఎంపీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి, నాయకులు దేశం నాగేశ్వరరెడ్డి, మాజీ మూలపెద్దమ్మ ఆలయ చైర్మన్ చిన్నన్న పాల్గొన్నారు. చంద్రబాబు ఎత్తుగడలు ప్రతి ఓటూ భవితకు మెట్టు అనే సంగతిని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆ తరహా సంకేతాలు గమనించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎత్తుగడలు అప్రజాస్వామికంగా ఉంటాయన్నారు. ఓటరు జాబితా తయారీలో అధికారులను ప్రలోభాలకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకునే కుట్రకు చంద్రబాబు దిగజారుతారన్నారు. అర్హుల ఓట్లను పరిరక్షించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు, పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తాయన్నారు. కూటమి నేతలు, వారికి కొమ్ముకాసే కొందరు ప్రభుత్వ సిబ్బంది పట్ల బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి వద్ద ఓటరు అందుబాటులో లేకపోతే ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 13 రకాల ధ్రువపత్రాలలో ఏదొకటి చూపించి ఓటు హక్కును పరిరక్షించుకోవచ్చన్నారు. ఫారం– 6 ద్వారా అర్హత గల వారికి కొత్తగా ఓటు హక్కును కల్పించాలని, ఫారం– 8 ద్వారా ఓటు హక్కును సవరించుకోవచ్చన్నారు. -
రేబిస్ అత్యంత ప్రమాదకరం
ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. కుక్కల నుంచి ఈ వ్యాధి సోకుతుంది. నేడు జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుక్కలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా యాంటి రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టాం. బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీలలో కుక్కలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తాం. ఈ అవకాశాన్ని కుక్కలు పెంచే వారు వినియోగించుకోవాలి. – డాక్టర్ రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్. జిల్లా పశుసంవర్ధకశాఖ, కర్నూలు -
వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివా రం స్వామి అమ్మవార్లకు పల్లకోత్సవం నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సే వగా) చేపడుతారు. ఇందులో భాగంగా ఆదివా రం ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం జరిపారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 6వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కబడ్డీ సంఘం ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): నంద్యాల జిల్లా కబడ్డీ సంఘం ఎన్నికలకు క్రీడాకారుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సుబ్రమణ్యం, అధ్యక్షుడు మోహన్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ క్రీడా పరిపాలన చట్టం– 2025 ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు, కమిటీలను ఏర్పాటు చేయా లని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కబడ్డీ సంఘాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయాలనుకున్న క్రీడాకారులు సర్టిఫికెట్లు, సహాయ పత్రాలతో ఈనెల 20లోగా కబడ్డీ జిల్లా సంఘం కార్యదర్శికి సమర్పించాలన్నారు. తీవ్ర గాలులు.. నేలతో తేమ ఆవిరికర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో పశ్చి మం దిశగా గాలులు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో వీస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు వేయగా వచ్చిన మొలకలు గాలుల తీవ్రతకు లేచిపోతున్నాయి.గాలుల ప్రభావంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోతోంది. దీంతో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొ న్న, సజ్జ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. గాలుల ప్రభావం ఈ ఏడాది పెరగడానికి ఎల్నినో ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. దాదాపు 25 రోజులుగా అక్కడక్కడ జల్లులు మినహా వర్షాలు లేవు. దీంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు విత్తనం పనులు కూడా నిలిచిపోయాయి. అలరించిన నృత్య ప్రదర్శన శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాడ వీధుల్లోని నిత్య కళా వేదికపై హైదరాబాద్ కు చెందిన శ్రీహరి ఆర్ట్స్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో భో..శంభో, వినాయకకౌత్వం, అయిగిరినందిని, కాలభైరవాష్టకం, శివతాండవం, శివస్తుతి తదితర గీతాలకు విజయమాధవి, అభిన్య, సింధుజ, మేఘన, తేజస్విని, నిత్య శ్రీలక్ష్మి, వైదసంహిత, భవిష్య, నందిని, నిత్యశ్రీ తదితరులు ప్రదర్శించిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది. -
భార్య కాపురానికి రాలేదని..
● యువకుడు ఆత్మహత్య పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేంద్ర, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నెహ్రూనగర్ ఎల్లంబావి సత్రంలో నివసిస్తున్న రామచంద్రుడు కుమారుడైన బోయ మండ్ల స్వాములు అలియాస్ స్వామి అనే వ్యక్తి తెలంగాణలోని క్రిష్ణదొడ్డి గ్రామానికి చెందిన మద్దమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాములు మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం మద్దమ్మ లొద్దిపల్లెలో ఉన్న అక్క వద్దకు వెళ్లింది. తిరిగి రావాలని పలుమార్లు ప్రాధేయపడినా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్వాములు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి పగిడ్యాల– ముచ్చుమర్రి గ్రామాల మధ్య ఎల్లం బొట్లమ్మ గుడి వద్ద చెట్టుకు పంచతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పగిడ్యాల గ్రామ కావలి మనుషులు ఆదివారం మధ్యాహ్నం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముచ్చుమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుడి తండ్రి రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి
కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీ దివిటి సోమన్నకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు ఎసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సోమన్నకు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ అమరావతిలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. 2025 ఏప్రిల్ 30న ఏసీబీ డీఎస్పీగా నియమితులై సుమారు 14 నెలల పాటు సేవలందించారు. కర్నూలు: సదరన్ రీజియన్ కర్నూలు హోంగార్డ్ కమాండెంట్గా అమిటి హనుమంతు నియమితులయ్యారు. రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఒక హోంగార్డు కమాండెంట్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్గా ఉన్న మేకల మహేష్ కుమార్ను తిరుపతిలోని పోలీస్ శిక్షణ కేంద్రం(పీటీసీ)కు బదిలీ చేసి.. గుంటూరు ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హనుమంతును కర్నూలు హోంగార్డ్స్ విభాగానికి బదిలీపై వస్తున్నారు. సోమన్న -
రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారు
కొలిమిగుండ్ల(అవుకు): రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఓర్వలేకనే కుట్రతో అక్రమంగా అరెస్ట్ చేశారని అవుకు పట్టణానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీవింగ్ సెక్రటరీ కునుకుంట్ల రామన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామన్నపై పీడీ యాక్ట్ అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శనివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డితో కలసి అవుకు చేరుకొని రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు అరెస్ట్కు గల కారణాలను కాటసానికి రామన్న కుటుంబ సభ్యులు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతకేసులను తెరపైకి తీసుకొచ్చి ఉద్దేశ పూర్వకంగానే అరెస్ట్ చేశారని తెలిపారు. తెల్లవారు జామునే అందరూ నిద్రించే సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లారని చెప్పారు. ఏం నేరం చేశాడని పదుల సంఖ్యలో పోలీసులొచ్చి తీసుకెళ్లారని ప్రశ్నించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని వారికి కాటసాని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్ట్లపై వైఎస్సార్సీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
సీబీసీఐడీ దర్యాప్తు షురూ!
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీశాఖ డీడీ కార్యాలయంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించిన కేసును సీబీసీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు ఈ మేరకు కేసును బదలాయించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే.. సీబీసీఐడీకి ఈ కేసును బదిలీ చేశారు. ఇంతవరకు అటవీశాఖ అంతర్గత దర్యాప్తు ద్వారా ఈ కేసులో సుమారు రూ.11 కోట్ల ప్రభుత్వం ధనం తప్పుడు మార్గాల ద్వారా ఇతరుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆత్మకూరు పోలీసులు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు ఆత్మకూరు డీడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి అని తెలుస్తోంది. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా డోన్ టౌన్: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో డోన్ పట్టణంలో నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. స్థాని క డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూంను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతు ందన్నారు. డోన్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిందితులను త్వరగా గుర్తించేందుకు 118 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డోన్ లో బందోబస్తు కోసం డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ డ్రోన్ను ఉపయోగించి పెట్రోలింగ్ చేస్తామన్నారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్, డోన్, ప్యాపిలి, బనగానపల్లె సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, వెంకట్రామిరెడ్డి ,ప్రవీణ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డి, నరేంద్రకుమార్, మమత పాల్గొన్నారు. ● జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు చూపిన తెగువ, చేసిన పోరాటం, త్యాగం తెలుగుజాతి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో అల్లూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు స్మరించుకోవాలన్నారు. జెడ్పీ ఇన్చార్జీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించుకున్న అల్లూరి బ్రిటీష్ పాలనకు వ్యతి రేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత జూన్ 27న నిర్వహించిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదవ సెమిస్టర్ బీఏ కోర్సుకు 74, బీబీఏ ఒకరు, బీసీఏ నలుగురు, బీకాం 143 మందికి 139, బీఎస్సీ 174 మందికి 170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. -
వరి సాగును తగ్గించుకోవాలి
నంద్యాల(అర్బన్): ఎల్నినో ప్రభావం జూలై, ఆగస్టు నెలల్లో అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ సూచించారు. నంద్యాలలోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో శనివారం ఎల్నినోపై అవగాహన–ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్నినోపై రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వారం ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను సమీక్షించుకుంటూ తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ సుమతి మాట్లాడుతూ.. తక్కువ వర్షపాత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలన్నారు. శాస్త్రవేత్త సుబ్బారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. సదస్సులో చర్చించిన అంశాలను రైతులకు తప్పక తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు రామచంద్రారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ చంద్రిక, వ్యవసాయ శాఖ తొమ్మిది జిల్లాల అధికారులు, వివిధ పరిశోధన స్థానాల అధిపతులు, కృషి విజ్ఞాన కేంద్రాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
రానున్న రోజుల్లో జల్లులే..
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 20 రోజులకు పైగా వర్షాల జాడ లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 1.60 లక్షలకుపైగా హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 50వేల హెక్టార్లలోని పంటల్లో ఎదుగుదల లోపించింది. మరో 25వేల హెక్టార్లలో అంతంతమాత్రం తేమలో విత్తనాలు విత్తుకోవడంతో మొలకలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతున్నా చినుకుజాడ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు జల్లులకే పరిమితం కానున్నాయి. దీంతో ఖరీఫ్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో పశ్చిమం దిశగా గాలులు గంటకు 15 కిలో మీటర్ల వేగంతో వీస్తుండటం గమనార్హం. ఇదిలాఉంటే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉద యం వరకు ఎమ్మిగనూరులో 3.4 మి.మీ, కర్నూలు రూరల్లో 3.2, మంత్రాలయంలో 3, కర్నూలు అర్బన్లో 2.6, కల్లూరులో 1.2, కౌతాళంలో 0.6 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో కలిపి నమోదైన వర్షపాతం 14 మి.మీ మాత్రమే. 7న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 7న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ఇన్చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు–ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష కొనసాగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశాలకు స్థాయీ సంఘాల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని కోరారు. ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు ఎంపీడీఓలకు డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (డీడీఓ) గా పదో న్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం పీఆర్అండ్ఆర్డీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదించి విడుదల చేసిన జాబితాలో కల్లూరు ఎంపీడీఓ జి.నాగశేషాచలరెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న మంజులావాణి పేర్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఎంపీడీఓలకు డీడీఓలుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు పీఆర్అండ్ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్దండే జీఓ విడుదల చేశారు. -
అనుమతి లేని ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారు
● అధికారులపై మండిపడిన గ్రామస్తులు డోన్ (ప్యాపిలి): గార్లదిన్నె పంచాయతీ పరిధిలోని మాధవరం గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంకర పరిశ్రమను గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామ సభ ప్రారంభం కాగానే ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వే నంబర్ 691, 692 పరిధిలో 4.90 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామసభ అనుమతి లేకుండా ఎవరూ కేటాయించారన్నారు. పర్యావరణ అనుమతి ఉందా? యువతకు ఉపాధిపై లిఖిత పూర్వక హామీలు ఎమైనా ఇచ్చారా? పరిశ్రమ పేరు, ఉత్పత్తి వివరాలు గ్రామస్తులకు తెలపకుండా ఎలా అనుమతులు ఇచ్చారన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుమతులతో పాటు అన్ని చట్లబద్ధమైన అనుమతులు పొందిన తరువాతే పరిశ్రమ ఏర్పాటు చేయాలని అంత వరకు అనుమతి ఇవ్వొద్దని అధికారులను కోరారు. దీంతో అధికారులు గ్రామ సభను వాయిదా వేసి వెనుదిరిగారు. -
విద్యుత్ వినియోగంపై ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి జిల్లాలో ఒక ఫీడర్లో విద్యుత్ వినియోగంపై సమగ్రంగా ఆడిట్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించారని విద్యుత్ శాఖ జిల్లా నోడల్ అధికారి ఆర్.పద్మ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులోని బళ్లారి రోడ్డు సెక్షన్న్లోని ఎస్ఏపీ క్యాంపు సబ్స్టేషన్ నందు 11 కేవీ ఆటోనగర్ ఫీడర్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఫీడర్ను ఆమెతో పాటు కర్నూలు సర్కిల్ ఎస్ఈ ప్రదీప్కుమార్, టౌన్ ఈఈ శేషాద్రి తదితరులు పరిశీలించారు. ఫీడర్ పరిధిలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు, సర్వీసులన్నింటికీ స్మార్ట్ మీటర్లు బిగించి ఆడిట్ చేసేందుకు వీలుగా పకడ్బందీగా మ్యాపింగ్ చేసేలా ఎన్నోవేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఫీడర్లో ఆడిట్ చేసిన తర్వాత జిల్లా అంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు.


