breaking news
Nandyal District Latest News
-
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
● బిషప్ సంతోష్ ప్రసన్నరావునంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతులు, ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు(బిషప్) అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ క్రీడా మైదానంలో సీడబ్ల్యూఎస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. బిషప్తో పాటు డీఈఓ జనార్ధన్రెడ్డి అతిథులుగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరంగా భావించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాల్లో నిర్వహించే వైద్య సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి జగన్మోహన్రెడ్డి, ఎంఈఓలు శివరాంప్రసాద్, ప్రసన్నకుమార్, మాధవి, పీడీలు విశ్వనాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం
స్థానిక సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరు అయిన ఈ నిధులను జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు తోడు స్టాంప్ డ్యూటీ నిధులు వస్తే గ్రామాలకు ఊపిరి అందుతుంది. – బి.రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ, కోడుమూరు ఎలాంటి ఇతర ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్కు ప్రధాన ఆదాయ వనరు అయిన స్టాంప్ డ్యూటీ నిధులు జమ కాకుంటే ఎలా? రాష్ట్రంలోని ఇతర జిల్లా పరిషత్లతో పోలిస్తే మన జిల్లా పరిషత్కు ఎలాంటి అదనపు ఆదాయాలు లేవు. స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయితే జెడ్పీటీసీలుగా మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థలకు మరింత ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు జమ అయ్యేలా చూడాలి. – షేక్ కరీమున్నీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరు ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల స్థానిక సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి. – వి.రామకృష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ -
సమయానికి చికిత్స.. సురక్షిత జీవనశైలి
● హెచ్ఐవీతో జీవిస్తున్నవారు అధైర్యపడవద్దు ● జిల్లా కలెక్టర్ రాజకుమారిగోస్పాడు: హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మందులతో జీవితకాలం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ‘సమయానికి పరీక్ష , సమయానికి చికిత్స, సురక్షిత జీవనశైలి, ఎయిడ్స్ నివారణకు ప్రధాన ఆయుధాలు’ అని పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే – 2025 సందర్భంగా సోమవారం ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులపై ఏ విధమైన వివక్ష, అపోహలు సమాజంలో ఉండకూడదన్నారు. హెచ్ఐవి ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అనంతరం హెచ్ఐవీ బాధితులతో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జేసీబీలను విక్రయించే మోసగాళ్ల అరెస్టు
● రూ. 63.10లక్షల మోసం ● ఎనిమిది జేసీబీలు స్వాధీనం పెద్దకడబూరు: ఒకరి జేసీబీలను మరొకరికి విక్రయించే ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్.భార్గవి మర్రివాడ తెలిపారు. ఎనిమిది జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెద్దకడబూరు పోలీస్స్టేషన్ ఆవరణలో సోమవారం డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరుకు చెందిన నీలయ్య, జింక నాగరాజు, తుగ్గలి మండలం, రాతన గ్రామానికి చెందిన భార్గవరాముడు ఫైనాన్స్ కింద హిందూపురం పట్టణానికి చెందిన నిర్మలబాయ్ నుంచి జేసీబీని తీసుకున్నారు. కంతులు చెల్లించకుండా, జేసీబీని తిరిగి ఇవ్వకుండా వేరేవారికి అమ్ముకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐలు ఆనంద్, శివరాములు, హెడ్కానిస్టేబుల్ లక్ష్మన్న, కానిస్టేబుల్ మల్లికార్జున, హనుమంతు, బాస్కర్లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఎల్లెల్సీ సమీపంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా జేసీబీలు ఫైనాన్స్ కింద తీసుకొని కంతులు కట్టకపోవడమే కాక తక్కువ ధరలకు ఇతరులకు అమ్ముతూ రూ.63.10లక్షలు మోసం చేసినట్లు గుర్తించామన్నారు. మొత్తం ఎనిమిది జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా పంపిస్తామన్నారు. ఇంకా వేరే ఎవ్వరినైనా మోసం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. -
డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ● కొత్త వ్యక్తులను నమ్మొద్దు.. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు ● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య (65) హత్యకేసును పోలీసులు ఛేదించారు. నమ్మకంగా మెలిగిన వ్యక్తే మరో ముగ్గురితో కలిసి డబ్బు కోసం దారుణంగా హత్య చేసి కుందూలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీలో రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈయనకు పట్టణంలోని దేవనగర్లో ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఏడాదిన్నర క్రితం నంద్యాల వైఎస్సార్నగర్కు చెందిన బి.ధనుంజయ ఇతరులకు అమ్మించారు. ఈ క్రమంలో పుల్లయ్యతో ఏర్పడిన పరిచయాన్ని కొనసాగిస్తూ ఆయన వ్యక్తిగత విషయాలు, ఆస్తుల వివరాలు తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉంటున్న అతడిని మట్టుబెట్టి ఆస్తులు కాజేయాలని ధనుంజయ భావించాడు. ప్లాన్ ప్రకారం గత నెల 14వ తేది గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన గంగాధర రాఘవ, గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన బెస్త శ్రీకాంత్, గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన కె. సంతోష్తో కలిసి పుల్లయ్యను ఆటోనగర్కు పిలిపించుకొని బొలెరో వాహనంలో ఎక్కించుకొని గడివేముల మండలం భోగేశ్వరం దారి వైపు వెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి రూ.25 లక్షలు డిమాండ్ చేయగా పుల్లయ్య ఇవ్వకపోవడంతో మెడకు తాడు బిగించి కత్తితో నుదిటి పైభాగంలో బలంగా గుద్ది హత్య చేశారు. అనంతరం శవాన్ని అనుమానం రాకుండా మద్దూరు గ్రామ సమీంలోని కుందూనదిలో వేశారు. మృతుడి సెల్ఫోన్, హెల్మెట్, కత్తి కూడా అందులోనే వేసి పుల్లయ్య ఇంటికి వెళ్లి డీవీఆర్ బాక్స్, డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ తీసుకెళ్లారు. గతనెల 19వ తేదీన పుల్లయ్య కుమారుడు ఆదిత్య ప్రసాద్ తన తండ్రి కనిపించడం లేదని నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అదే నెల 29వ తేదీన గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామం వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ధనుంజయ, బెస్త శ్రీకాంత్,గంగాధర రాఘవ, కె. సంతోష్ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేసి వారి నుంచి కత్తి, రెండు డీవీఆర్లు, ల్యాప్టాప్, దస్తావేజు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలని, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోరాదని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మందాజావళి పాల్గొన్నారు. -
ఈ పురుగు కుడితే అంతే!
ఈ వ్యాధి పేరు పలకడానికి ఇబ్బంది ఉంటుంది. సోకితే మాత్రం మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకూ తెస్తుంది. వివిధ రకాల విష జ్వరాల మాదిరిగా ఇది కూడా ఓ రకం జ్వరం. పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధినే వైద్య పరిభాషలో ‘స్క్రబ్టైఫస్’ అంటారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాధి కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లార్వల్ మైట్స్ పురుగు కుట్టడంతో ఏర్పడిన దద్దుర్లు కర్నూలు(హాస్పిటల్): కొంత కాలంగా కోస్తా ప్రాంతానికే పరిమితమైన స్క్రబ్టైఫస్ వ్యాధి గత కొన్ని రోజులుగా జిల్లాలో వ్యాపిస్తోంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు ఉండే ప్రాంతాల్లో నివసించే వారిని ఈ వ్యాధి లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్ విభాగంలో 203 మంది చేరారు. వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో ఎలీసా విధానంలో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించగా 38 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ మేరకు అందరికీ అవసరమైన యాంటిబయాటిక్స్, మందులు ఇచ్చి వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటివరకు అందరూ కోలుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్క్రబ్టైఫస్ ఇలా వ్యాపిస్తుంది... లార్వల్ మైట్స్ అనే పురుగు వల్ల స్క్రబ్టైఫస్ వ్యాధి వస్తుంది. ఈ పురుగు స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివాసం ఉండేవారికి, ఆయా వ్యవసాయ పనుల్లో ఎక్కువసేపు ఉండేవారికి ఇది సోకుతుంది. చెట్లు, పొలాల్లో సంచరించే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంత మందికి దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూమోనిటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతారు. కొన్నిసార్లు కిడ్నీలు విఫలం కావడం, హృదయకండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్లరక్తకణాలు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంత మందిలో కాలేయం, మూత్రపిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వీరు జాగ్రత్తగా ఉండాలి మధుమేహం, బీపీ, హెచ్ఐవీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి స్క్రబ్టైఫస్ సోకితే ఇబ్బందులు మరింత పెరుగుతాయి. చిన్నపిల్లలు, వ్యాధినిరోధికశక్తి తక్కువగా ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చాలా అరుదైన స్క్రబ్టైఫస్ వ్యాధి కేసులు ఇటీవల కాలంలో వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటి వరకు 203 మంది రాగా వారికి మైక్రోబయాలజి ల్యాబ్లో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించాము. అందులో 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరందరికీ జనరల్ మెడిసిన్ విభాగంలో ఉంచి వైద్యం అందించాము. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్టైఫస్ కేసులు పెద్దాసుపత్రిలో 203 మందికి లక్షణాలు 38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యం చెట్లు, పొలాల్లో పనిచేసే వారికి ప్రమాదం -
పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 45 పిర్యాదులు వచ్చాయని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. జావలిన్త్రో పోటీల్లో ప్రథమం కొలిమిగుండ్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి మధు హేమంత్ జావలిన్త్రో పోటీల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచాడు. పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల ఎస్పీజీ మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొనగా మధు మేహంత్ మొదటి స్థానాన్ని పొందాడు. ఈ విద్యార్థికి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఐఈకో ఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. కాగా.. గతేడాది ఏలూరులో జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలోనూ మధు హేమంత్ విజేతగా నిలిచాడు. కార్తీకమాస శివదీక్ష విరమణ శ్రీశైలంటెంపుల్: పంచాక్షరీ నామస్మరణతో జ్యోతిర్ముడిని సమర్పించి సోమవారం భక్తులు కార్తీకమాస శివదీక్షను విరమించారు. దేవస్థానంలోని ప్రత్యేక శిబిరాల్లో ఐదు రోజుల పాటు శివదీక్షను విమరించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వామివారి ఆలయ దక్షిణద్వారం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో రథవీధిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్షా శిబిరాల్లో కొలువుంచారు. స్వామిఅమ్మవార్లకు షోడశోపచారలతో పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ పి.రమేష్నాయుడు, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు పాల్గొన్నారు. శివదీక్షా విరమణ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు శిబిరాల్లోని దేవతామూర్తులకు ఉభయ సంధ్యలలో శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపిస్తారు. టీడీపీ నేత భూ కబ్జా ● కలెక్టరేట్ ఎదుట మాజీ సైనికుల ధర్నా కర్నూలు(సెంట్రల్): కర్నూలు రూరల్ మండలం నందనపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు టీడీపీ నేత రవిగౌడ్ కబ్జా చేశాడని బాధిత మాజీ సైనికులు రవి, జాన్, విజయ్, రాజు,శీను, రాముడు, బుజ్జి, సంజన్న, చిన్న మద్దిలేటి, థామస్, రంగన్న, గురునాథ్ ఆరోపించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 72 మందికి నందనపల్లెలో కుటుంబానికి 6.5 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అయితే నందికొట్కూరు నుంచి వలస వచ్చిన టీడీపీ నేత రవిగౌడ్ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరైనా ఏమైనా ఉంటే తనకు మంత్రి తెలుసు.. ఎమ్మెలే తెలుసూ అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. అంతకముందు రవిగౌడ్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. -
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
● కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్ఈలకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశంకర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులు నుంచి వస్తున్న వివిధ సమస్యల పరిష్కారానికి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన రెండు జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమానికి 62 మంది వినియోగదారులు పోన్ ద్వారా తమ సమస్యలను వివరించారని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాఫ్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని సూచించారు. -
శ్రీగిరిలో వసతి పేరుతో ‘సైబర్’ దోపిడీ
● కర్ణాటకకు చెందిన హిందీ భక్తుడు అన్లైన్లో మల్లికార్జున సదన్లో వసతిగదిని పొంది డబ్బులు కూడా చెల్లించాడు. శ్రీశైలం వచ్చి చూపించగా నకిలీ వైబ్సైట్తో మోసం చేసినట్లు తేలింది. ● బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ అన్లైన్ ద్వారా శ్రీశైలంలో వసతి గదిని బుక్ చేసుకున్నా డు. ఏపీ టూరిజం హరిత రిసార్ట్కు వచ్చి బుకింగ్ పేపర్ చూపించగా అది నకిలీ అని తేలింది. .. వీరిద్దరే కాదు శ్రీశైలం వచ్చే చాలా మంది భక్తులు సైబర్ నేరగాళ్ల మాయలోపడి మోసపోతున్నా రు. దేవస్థాన వసతి గృహాల పేరుతో నకిలీ వెబ్సైట్లను తయారు చేసి భక్తులను నిలువున దోపిడీ చేస్తున్నారు. శ్రీశైలంటెంపుల్: దేవస్థాన వసతి గృహ సముదాయాల పేరుతో సైబర్ నేరగాళ్లు పలు నకిలీ వెబ్సైట్లను సృష్టించారు. మల్లికార్జున సదన్, గంగా సదన్, గౌరీసదన్, పాతాళేశ్వరసదన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. వసతి గదులు బుక్ చేశామని, తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేసుకుంటూ భక్తులను మోసగిస్తున్నారు. అలాగే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరితా రిసార్ట్ పేరుతో సైతం నకిలీ వెబ్సైట్లను తయారు చేశారు. సైబర్ నేరగాళ్ల ఐపీ అడ్రస్ ఒకసారి ఒకచోట, మరికొన్ని నిమిషాలకు మరోచోట చూపిస్తోంది. వసతి లేక.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. సాధారణ రోజుల్లో 10వేల నుంచి 30వేల మంది, శని, ఆది, సోమవారాల్లో, రద్దీ రోజుల్లో 30 వేల నుంచి 50వేల మంది స్వామిని దర్శించుకుంటారు. భక్తులకు వసతి సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో వీఐపీ కాటేజీలు, మల్లికార్జునసదన్, గణేశసదన్, గంగా–గౌరీ సదన్, పాతాళేశ్వరసదన్ ఉన్నాయి. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరితా రిసార్ట్ పేరుతో హోటల్, లాడ్జి ఉంది. ఇంకా పలు ప్రైవేట్ సత్రాలు సైతం ఉన్నాయి. అయితే భక్తులకు సరిపడనంత వసతి శ్రీగిరి క్షేత్రంలో లేదు. దీంతో భక్తులు ఆన్లైన్లో నకిలీ వైబ్సైట్లకు వెళ్లి మోసపోతున్నారు. శ్రీశైలం పీఎస్లో ఫిర్యాదు ఇటీవల బెంగళూరుకు చెందిన భక్తుడు ఏపీ టూరిజం హరితా రిసార్ట్ పేరుతో వసతి గదిని బుక్ చేసుకుని మోసపోయిన ఘటనపై స్పంధించిన టూరిజం శాఖ, టూరిజం శాఖ శ్రీశైలం మేనేజర్తో శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నకిలీ వెబ్సైట్ల ముఠా దొరుకుతారో లేదో వేచిచూడాలి? అందుబాటులోకి ఫోన్ నంబర్లు నకిలీ వెబ్సైట్లను నమ్మి శ్రీశైల దేవస్థానంలో వసతి, ఆర్జితసేవా, దర్శనం టికెట్లను పొందవద్దని శ్రీశైల దేవస్థాన అధికారులు ప్రకటనలు చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసేసమయంలో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదును వ్యక్తి ఖాతాలోకి జమ చేయమని ఎవరూ అడగబోరని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి దేవస్థాన సమాచార కేంద్రం ఫోన్ నెంబర్లు 8333901351, 52, 53లను సంప్రదించవచ్చునని దేవస్థాన అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్సైట్www.srisailadevasthanam.org భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఏపీ టూరిజం పేరుతో నకిలీ వెబ్సైట్ శ్రీశైలం ఒకటో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు -
బతికున్న రైతును రికార్డుల్లో చంపేశారు!
● ‘అన్నదాత సుఖీభవ’లో వింత డోన్: కొత్తబురుజు గ్రామ రెవెన్యూ పరిధిలోని నక్కలవాగు పల్లె గ్రామానికి చెందిన రైతు తవిశెల రంగనాథరెడ్డి మృతి చెందినట్లు వ్యవసాయ అధికారులు తప్పుగా ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తున్న రూ. 5000 ఆర్థిక సహాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. విచిత్రం ఏందంటే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అందించే పీఎం కిసాన్ పథకం క్రింద మంజూరు అయిన రూ. 2000 తవిశెల రంగనాథరెడ్డి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది. అన్నదాత సుఖీభవ కింద మంజూరు కావలిసిన రూ.5000 బ్యాంక్ ఖాతాలో జమ కాక పోవడంతో వ్యవసాయ అధికారులను రైతు సంప్రదించాడు. వారు బెనివిషరీ స్టేటస్లో చూడగా తవిశెల రంగనాథరెడ్డి మృతి చెందినట్లు ఉండడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ సైట్ ఓపెన్ కాకవడంతో తాము చేయగలిగిందేమీలేదని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో ఆందోళన చెందిన రైతు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సైట్ ప్రారంభం కాగానే దొర్లిన తప్పును సరిచేస్తామని వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని రుద్రవరం గ్రామ సమీపాన ట్రాలీ బొలెరో వాహనం బోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయ శ్రీకాంత్ (29) యంబాయి గ్రామం నుంచి చామంతి పూల లోడుతో ఒక తోట నుంచి మరో తోటకు వెళ్తున్నాడు. రుద్రవరం గ్రామంలో కుక్క ఎదురు రావడంతో దానిని తప్పించబోయి బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో బోయ శ్రీకాంత్, మంటి సురేష్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బోయ శ్రీకాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. యువకుడి ఆత్మహత్య కర్నూలు(సెంట్రల్): కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న మస్తాన్రావు కుమారుడు సాయి రోహన్ (20) ఇంటర్ పాసయ్యాడు. బీఎస్సీ నరింగ్స్ కోర్సులో చేసేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. అతనికి మొదటి ఫేజ్లో నంద్యాల శాంతిరామ్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే కర్నూలులో సీటు కోసం రెండో ఫేజ్లో మళ్లీ కౌన్సెలింగ్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫలితాలు సోమవారం రావడం.. కర్నూలులో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లోని బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయాడు. తండ్రి మస్తాన్రావు ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామ క్రాస్ సమీపంలో కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా మహానంది మండలం అబిపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు కారులో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో జరిగే బంధువుల ఫంక్షన్కు వెళ్తున్నారు. సిరాలదొడ్డి క్రాస్ సమీపంలో రోడ్డు మధ్య గోతిపడటం, కుక్క అడ్డుగా రావటంతో తప్పించబోయి కారు బోల్తా పడింది. సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.తర్వాత వారు కారు రిపేర్ చేయించుకొని సిరుగుప్పకు వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ నాయకుడి కారు ధ్వంసం గడివేముల: వైఎస్సార్సీపీ గడివేముల మండల కన్వీనర్ బొంతల మధుసూదన్ స్కార్పియో కారును రాళ్లతో ఆదివారం ఆర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. సోమవారం తన వాహనాన్ని మధుసూదన్ చూసి.. గతంలో కూడా తన కారుపై దాడికి ప్రయత్నించారన్నారు. రెండోవసారి ఇలా చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్స్టేషన్లో అనుమానితులపై ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖరరెడ్డి, ఎంపీటీసీ వంగాల మహేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దేశం నాగేశ్వరరెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుకున్నారు. ఉచ్చులు వేస్తే జైలుకే ఆత్మకూరురూరల్: నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం లోపల కానీ బయట పొలాల్లో కానీ వన్యప్రాణుల కోసం ఎవరైనా ఉచ్చులు వేస్తే జైలుకు పంపిస్తామని ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో కొందరు మోటార్ సైకిల్ క్లచ్ వైర్లతో తయారు చేసిన ఉచ్చులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల పులుల అభయారణ్యం రక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎవరైనా ఉచ్చులు వేస్తూ కనిపిస్తే 8 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు అధికారులకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. -
హాస్టల్ విద్యార్థి అదృశ్యం
కృష్ణగిరి: మండల పరిధిలోని కంబాలపాడు ఎస్సీ హాస్టల్లో ఉంటూ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జండా అంజి (15) ఆదివారం అదృశ్యమైనట్లు వార్డెన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తోటి పిల్లలతో భోజనం చేశాడని అనంతరం ఆడుకోవడానికి గ్రౌండ్కు వె వెళ్లడం జరిగిందన్నారు. సాయంత్రం స్నాక్స్ టైంలో హాజరు పరిశీలించగా ఈ విద్యార్థి కనపడలేదన్నారు. సమీపంలో అన్ని చోట్ల గాలించామని, ఈ విద్యార్థి స్వగ్రామైన డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. అక్కడకు కూడా రాలేదని తెలియడంతో సోమవారం పత్తికొండ ఏఎస్డబ్లూఓ బాబుతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జరిగిన సంఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఈ అబ్బాయి ఆచూకీ తెలిసిన వారు కృష్ణగిరి ఎస్ఐ 9121101117, వెల్దుర్తి సీఐ 9121101114 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
మంత్రి బీసీ బంధువుల దౌర్జన్యం
● కుమారుడిని చూడటానికి వెళ్లిన వ్యక్తిని బంధించిన వైనం నంద్యాల: కోర్టు ఉత్తర్వుల మేరకు సొంత కుమారుడిని చూసుకోవడానికి వెళ్లిన వ్యక్తిని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువులు కొట్టి బంధించారు. ఈ విషయం ఎస్పీకి తెలిపినా మంత్రితో షటిల్ చేసుకోమని చెబుతున్నారని తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బేతంచెర్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అల్లుడి అక్క కూతురు మల్లీశ్వరితో కర్నూలుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు తేజారెడ్డితో వివాహం జరిగింది. కొన్ని నెలలుగా కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల విషయం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి ఆదివారం కుమారుడిని చూడటానికి తేజారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తేజారెడ్డి న్యాయవాదితో కలిసి కుమారుడిని చూడటానికి ఆదివారం కనకాద్రిపల్లె గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి బంధువులు తేజారెడ్డిని కొట్టి ఇంట్లో బంధించారు. డబ్బులు ఇవ్వనిది ఇక్కడి నుంచి బయటకు పంపబోమని బెదిరించి నిర్బంధిచారు. విషయం తెలుసుకున్న తేజారెడ్డి తండ్రి తిరుమలేశ్వరరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం కూడా బయటకు రాకపోవడంతో ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తిరుమశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అల్లుడి అక్క కూతురును తన కుమారుడు వివాహం చేసుకున్నాడన్నారు. కోర్టు తీర్పు ప్రకారం చూడటానికి న్యాయవాదితో కలిసి పోతే కొట్టి ఇంట్లో బంధించారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా బయటకు రాలేదన్నారు. ఎస్పీకి విషయం తెలియజేస్తే మంత్రి వద్దకు వెళ్లి ప్రాపర్టీ విషయాలు షటిల్ చేసుకోవాలని, పెళ్లి చేసుకునేటప్పుడు తమ దగ్గరికి వచ్చి చేసుకున్నారా అని ఎస్పీ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని మంత్రి బంధువుల చెర నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
పోతిరెడ్డిపాడు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
జూపాడుబంగ్లా: నెల రోజుల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను మూసివేసి ఎన్సీఎల్ ద్వారా కేవలం 2వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిగువన ఉన్న రిజర్వాయర్లలో గరిష్టస్థాయి నీటిమట్టం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు గేట్లను మూసి ఎన్సీఎల్ నుంచి నీటిసరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికేంద్రంలో మూడు జన్రేటర్లను రన్నింగ్ చేయటం ద్వారా 2.5 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తిచేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటిని బానకచర్ల నుంచి తెలుగుగంగ కాల్వకు 1,500 క్యూసెక్కులు, కేసీఎస్కేప్ కాల్వకు 300 క్యూసెక్కులు, గాలేరునగరి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని సరఫ రా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
గంజాయి పట్టివేత
నందికొట్కూరు: పలువురి నుంచి 2.25 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి వినియోగదారుల అరెస్ట్ చూపించారు. సీఐ మాట్లాడుతూ..ఆత్మకూరు పట్టణానికి చెందిన చాకలి వంశీ సూచనల మేరకు నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన వాకటి శ్యామ్ ప్రసాద్ గత నెల 26న రాత్రి ఒడిశా రాష్ట్రానికి రైలులో వెళ్లారు. బరంపూర్కు చెందిన నీలాంచల్ పట్నాయక్కు రూ.16 వేలు చాకలి వంశీ పంపించాడు. అతను ఇచ్చిన గంజాయితో 10 బొల్ల వరం చేరుకున్నాడు. నందికొట్కూరుకు చెందిన దూదేకుల మహమ్మద్ రఫితో కలిసి దామగట్ల గ్రామ సమీపంలోని వెంచర్లో గంజాయి సేవించేందుకు సిద్ధమ వుతుండగా స్థానికుల సమాచారం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సమావేశంలో బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు పాల్గొన్నారు. -
14 నెలలకే.. నూరేళ్లు!
● ట్రాక్టర్ కింద పడి చిన్నారి దుర్మరణం పగిడ్యాల: బుడి బుడి అడుగుల చప్పుళ్లు ఆగిపోయాయి.. బోసి నవ్వులు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం జరిగిన మొదటి పుట్టిన రోజు వేడుకల సందడిని కుటుంబీకులు ఇంకా మరువక ముందే విధి ఆ చిన్నారిని వారికి దూరం చేసింది. ఊహించని ఘటన ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకు కుటుంబీకుల మధ్య ఆడుకుంటున్న చిన్నారిని క్షణాల్లో మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. నెహ్రూనగర్లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. 14 నెలల వయస్సున్న బాలుడు ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొడుగు శంకరయ్య, లావణ్యకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమారుడు గొడుగు చేతన్ (14 నెలలు) ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే మొదటి పుట్టిన రోజు వేడుకలను బంధువుల మధ్య ఆర్భాటంగా నిర్వహించారు. శంకరయ్య ఇంటి సమీపంలోనే గొడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గృహ నిర్మాణం చేపట్టాడు. సిమెంట్ ఇటుకలను ఆదివారం ఉదయం కర్నూలు నుంచి ట్రాక్టర్లో తెప్పించాడు. అన్లోడ్ అనంతరం ట్రాక్టర్.. శంకరయ్య ఇంటి మీదుగా వెళ్తుండగా ఇంట్లో నుంచి చిన్నారి చేతన్ హఠాత్తుగా రోడ్డుపైకి పరుగెడుతూ వచ్చి ట్రాక్టర్ ట్రాలీ టైరు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో నెహ్రూనగర్ చేరు కుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన బాలుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ బాషాపై కేసు నమోదు చేశారు. ‘14 నెలలకే నూరేళ్లు నిండాయా.. నాయనా’.. అంటూ కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు బంధువులు, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
శిథిల ‘బడి’
ఈ దృశ్యాలు గడివేముల ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంపీపీ స్కూల్లో కనిపించాయి. ఈ పాఠశాలలో చదివి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే పాఠశాల తరగతి గదులు పూర్తిగా దెబ్బతిన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్ని గదులు పాడుబడి శిఽథిలావస్థకు చేరాయి. దీంతో వాటిని వినియోగించడం లేదు. అందులో ముళ్లపొదలు పెరిగి విషపురుగులు తిరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శిథిలమైన తరగతి గదులు తొలగించి విద్యార్థులను సురక్షితంగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – గడివేముల -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరరెడ్డి. వెల్దుర్తి మండలం మల్లెపల్లె గ్రామానికి చెందిన ఈయన 20 గేదెలతో డెయిరీ నిర్వహిస్తున్నారు. ఇంతవరకు లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టే విధంగా కృత్రిమ గర్భధారణనే వినియోగించుకోలేదు. దీంతో డెయిరీ అభివృద్ధి చెందలేదు. పాల ఉత్పత్తి తగ్గింది. 2024లో ఇదే సమయానికి రోజకు 70 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. నేడు 45 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. మద్దిలేటి స్వామి క్షేత్రంలో వాట్సాప్ సేవలు బేతంచెర్ల: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో భక్తులకు వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. వాట్సాప్ ద్వారా భక్తులకు దర్శనం, ప్రసాదం, రూముల బుకింగ్ సేవలను పొందవచ్చన్నారు. ఈ సేవలను వినియోగించుకోవడానికి భక్తులు 9552300009 సంప్రదించాలని సూచించారు. నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 2,14,496 మంది పింఛన్దారులకు రూ.92.47 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు సోవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. 100 శాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాగులతో పాటు అంగవైకల్యం ఉన్న వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. అరకొర ఆర్టీసీ బస్సులుపాణ్యం: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్టాండ్ల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రావడం లేదు. పాణ్యం ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ప్రయాణికులు రద్దీ కనిపించింది. ఆర్టీనరీ, ఎక్స్ప్రెస్లు వచ్చినా కాలు పెట్టేందుకు వీలు లేనంతగా నిండిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు కోరారు. కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిసెంబరు 1వ తేదీన డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. వినియోగదారు లు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూ లు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 89777 16661కు ఫోన్ చేసి సమస్యల గురించి చెప్పవచ్చని తెలిపారు. అప్రమత్తంగా ఉండండి... దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎండీ శివవంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఉచిత లడ్డూ ప్రసాదం
స్పర్శ, అతిశీఘ్ర దర్శన భక్తులకు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అతిశీఘ్ర దర్శనం టికెట్టుదారులకు (రూ.300) ఉచితంగా ఒక లడ్డూ, స్వామివారి స్పర్శదర్శనం టికెట్టుదారులకు ఉచితంగా రెండు లడ్డూ ప్రసాదాలు అందజేస్తారు. అలాగే పలు కార్యక్రమాలను ప్రారభించనున్నారు. సోమవా రం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం అధునికీకరణ పనులకు భూమిపూజ, 10.40 గంటలకు గంగాధర మండపం వద్ద నూతనంగా నిర్మించబడిన విరాళాల సేకరణ కేంద్రం ప్రారంభించనున్నారు. అలాగే దేవస్థాన పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుల ఛాంబర్ ప్రాంరభిస్తారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుకభాగంలో కై లాస కంకణాల విక్రయకేంద్రం ప్రారంభించనున్నారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తులు శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. -
దిత్వా తరుముకొస్తోంది!
మొక్కజొన్న దిగుబడులపై పట్టలు కప్పిన దృశ్యంకోవెలకుంట్ల సమీపంలో కోత దశలో ఉన్న వరికోవెలకుంట్ల: దిత్వా తుపాన్ అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాన్తో వాటిల్లిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే మరో తుపాన్ ముంచుకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వివిధ పంటలు కోత, నూర్పి డి, పూత, పిందె దశల్లో ఉండగా తుపాన్ రైతులను భయపెడుతోంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 73,038 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా రకాలకు చెందిన వరి, 27,540 హెక్టార్లలో కంది, 55,408 హెక్టార్లలో మొక్కజొన్న, 5,419 హెక్టార్లలో పత్తి పంటలు సాగయ్యాయి. వరి పంట లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందు లు, కలుపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల వరకు పెట్టుబడులు వెచ్చించారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో పైరు కోత, నూర్పిడి దశలో ఉంది. అలాగే మొక్కజొన్న దిగుబడులను కల్లాలు, పొలాలు, రోడ్లపై ఆరబోసుకున్నారు. ఈ ఏడాది విస్తారంగా సాగైన కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. ఆయా పంటల్లో పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలకు పైగా వెచ్చించారు. సీడు, హైబ్రిడ్ పత్తి పంటలు వివిధ దశల్లో ఉండగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీల రూపంలో ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు ఖర్చు చేశారు. ఇలాంటి తరుణంలో తుపాన్ కారణంగా మోస్తరు వర్షం కురియడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోత, నూర్పిడి చేసిన దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఆయా పంటలు దెబ్బతిని తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. తుపాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కోత, నూర్పిడి దశలో వరి పూత, పిందె దశల్లో కంది, పత్తి పంటలు ఆందోళనలో అన్నదాతలు -
మంత్రి ఇలాఖాలోనే అధ్వానంగా రోడ్ల నిర్మాణం
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): సాక్షాత్తు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలో రోడ్ల నిర్మా ణ పనులు చాలా అధ్వానంగా సాగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల నుంచి పెట్ని కోట వరకు (5 కిలోమీటర్లు) రూ.2 కోట్ల వ్యయంతో వేసిన రోడ్డు నెల రోజులకే పాడై పోయిందని, తిరిగి వెంటనే ఈ రోడ్డుపై ప్యాచ్ వర్కులు చేశారంటే, ఎంత నాణ్యతతో ఈ రోడ్డు వేశారో అర్థమవుతోందన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆర్అండ్బీ శాఖపై జరిగిన సమీక్షలో జిల్లాలోని పలు రోడ్ల పరిస్థితిపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నందికొట్కూరు–పగిడ్యాల, గార్గేయపురం–మిడ్తూరు రోడ్లు చాలా అధ్వానంగా తయ్యారయ్యాయని జూపాడుబంగ్లా, మిడ్తూరు జెడ్పీటీసీలు పి.జగదీశ్వరరెడ్డి, పి.యుగంధర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు పెరిగిపోయాయయని, కనీసం ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదన్నారు. జిల్లా పరిషత్కు బకాయిపడిన స్టాంప్ డ్యూటీని వెంటనే వసూలు చేస్తే జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి సీఈఓను ఆదేశించారు. టీడీపీ కార్యాలయంగా మారుతున్న టీబీపీ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం కోడుమూరులోని తుంగభద్ర ప్రాజెక్టు సబ్ డివిజన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని కోడుమూరు జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి టీబీపీ కార్యాలయాన్ని లీజుకు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ కార్యాలయానికి పచ్చ రంగులు వేస్తున్నారన్నారు. అయితే సమాధానం ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడం పట్ల జెడ్పీటీసీ అసహనం వ్యక్తం చేశారు. అక్రమంగా తరలుతున్న మట్టి నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల పరిధిలోని కుందూ నది విస్తరణ పనుల్లో తీసివేసిన మట్టిని కొందరు అక్రమంగా 167కే జాతీయ రహదారి (జమ్మలమడుగు – నంద్యాల ) పనులకు తరలిస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. నదిలో తీసిన మట్టిని జాతీయ రహదారులకు వినియోగిస్తే ఆయా రహదారులు ఎంత మాత్రం నాణ్యతగా ఉంటాయో అధికారులే సమాధానం చెప్పాలన్నారు. ఎవరు తరలిస్తున్నారు ? ఎంత తరలించారనే సమాచారం మీ వద్ద ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు జలమార్గంపై ఆలోచించండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు జలమార్గం ఏర్పాటు చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు ఆలోచించాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కోరారు. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఒక్కో సందర్భంలో తీవ్ర ట్రాఫిక్ వల్ల దోర్నాల నుంచి శ్రీశైలం చేరేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంన్నారు. ఈ నేపథ్యంలో జలమార్గాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలన్నారు. సమావేశాల్లో ఎవరేమన్నారంటే.. ● వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చారు కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి బీమా సౌకర్యం కల్పించారు. – ఎస్.సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ కొత్తపల్లి ● కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారో చెప్పండి, అలాగే వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపరచండి. – డి.సుంకన్న జెడ్పీటీసీ, వెల్దుర్తి ● కుంకనూరు గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. సోలార్ కనెక్షన్లు తీసుకునేందుకు బ్యాంకర్ల సహకారం లేదు. – వి.రామక్రిష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ ● హోమియోపతి ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. – షేక్ కరీమున్పీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరుప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు తీర్మానం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా వైద్య సేవలు అందాలని, అలాగే ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా, ప్రైవేటు పరం చేయాలని చూడడం దారుణమని జల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
● మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఆధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఆధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లె గ్రామంలో నష్టపోయిన మొక్కజొన్న రైతులను శనివారం ఆయన పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు ఒక్కసారి బ్రాహ్మణపల్లె గ్రామానికి వచ్చి చూడాలన్నారు. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు ఏ విధంగా నష్టపోయారో తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించామన్నారు. జొన్నలు అమ్ముడుపోకపోతే తానే ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇంత వరకు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించలేదన్నారు. అన్నదాతలను టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిహారం ఎప్పుడు ఇస్తారు? చంద్రాబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు కష్టాలు మొదలయ్యాయని కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు చేయాల్సి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వంలో ఏ సీజన్లో పంటనష్టం జరిగితే ఆ సీజన్లోనే పరిహారం అందించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదన్నారు. కార్పొరేటర్ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు నాగతిరుపాలు, వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, రవి, బలరాం, దేవరాజు, మహేశ్వరరెడ్డి, రైతులు ప్రభుదాస్, రమణయ్య, బాలస్వామి పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు?
● డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డిని నిలదీసిన మహిళలుప్యాపిలి: చెరువులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్తో కలసి వచ్చిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఎమ్మెల్యే గారూ.. మా కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు?’ అని ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామ ప్రజలు నిలదీశారు. శనివారం జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారితో కలసి డోన్ ఎమ్మెల్యే గుడిపాడు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఒక్కసారిగా ఎమ్మెల్యేను చుట్టుముట్టి తాగునీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీశారు. గత కొద్ది నెలలుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మీరైనా మా సమస్యను పరిష్కరించాలని వారు పట్టుబట్టారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కోట్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. త్వరలోనే నీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పిన సమాధానంపై మహిళలు సంతృప్తి చెందలేదు. ఎమ్మెల్యేకు తాగునీటి సమస్య గురించి చెప్పుకోవడానికి వస్తే స్థానిక నాయకులు అడ్డుపడటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యే మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా సమస్యలు చెప్పుకునే వీలు లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కాగా.. నీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి మత్తుపదార్థాల నియంత్రణపై శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి నేరుగా సమాచారం సేకరించేందుకు ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ గవర్నర్స్ నంబరు (9552300009) వంటి పద్ధతులను అమలు చేస్తుందన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైల్వే స్టేషన్లు, రవాణా వాహనాలు, ప్రజా ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,781 కేసులు నమోదు చేసి, నిందితుల నుంచి రూ.4,95,830 వసూలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్సీ/ఎస్టీ కోర్టు – కర్నూలు) వై.శ్రీహరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల, డోన్ ఆర్డీఓలు పాల్గొన్నారు. -
శివస్వాముల పాదయాత్రకు అడ్డంకి!
ఆత్మకూరు: వెంకటాపురం గ్రామం నుంచి నల్లమల అడవిలో శివస్వాములు పాదయాత్రను అటవీశాఖ సిబ్బంది శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో వంద మంది శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్టు అధికారుల తీరుకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఏమిటన్నారు. తమ పాదయాత్రను ఆపితే ఇక్కడే కూర్చొంటామని హెచ్చరించారు. వెంకటాపురం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆత్మకూరు సీఐ రాము అక్కడికి చేరుకుని శివభక్తులతో మాట్లాడారు. అలాగే ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. శనివారం ఉదయం 5 గంటలకు శివభక్తులు అటవీ ప్రాంతం గుండా శ్రీశైలానికి వెళ్లడానికి అనుమతినిచ్చారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు మండిపడుతునన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మరో మూడు నెలల కాలం ఉందని, విద్యార్థులను సిద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులతో క్రీడా పోటీలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తు కంటే చంద్రబాబు సర్కారుకు ప్రచారం ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 1,199 ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో 568 పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1,33,325 మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 1,60,445 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 3,244 మంది టీచర్లు విధులు నిర్వహిస్తుండగా అందరికీ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వింత పోకడ చంద్రబాబు సర్కార్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడలేదు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగి బాగుపడతారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి నమ్మకాన్ని చంద్రబాబు సర్కారు నీరుగారుస్తోంది. ప్రచారం కోసం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లలో 90 శాతం మందికి క్రీడలపై ఆసక్తి లేదని తెలుస్తోంది. ప్రశాంతంగా విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటున్నామని, ఈ సమయంలో క్రీడా పోటీలు ఏమిటని కొంత మంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. మండల, జిల్లా స్థాయి క్రీడలకు లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేసి, వీటిని ఖర్చు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర విద్యాశాఖ వింత పోకడలను అమలు చేస్తోందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో క్రీడా పోటీల షెడ్యూల్ జారీ చేయడం విడ్డూరంగా ఉందని మండి పడుతున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే వేళ ఉపాధ్యాయులకు క్రీడలు విస్మయం కలిగిస్తున్న క్రీడా పోటీల షెడ్యూల్ రాష్ట్ర విద్యాశాఖ వింత నిర్ణయం -
ఇవీ కష్టాలు..
● మండలంగా ఏర్పాటు కాని జలదుర్గం ● హామీని మరిచిన సీఎం చంద్రబాబు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు డోన్: నంద్యాల జిల్లాలో అతిపెద్ద మండలమైన ప్యాపిలిని విభజించి జలదుర్గం కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తానని ప్రజలకు గత ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర్ర అయినా ఇప్పటి వరకు జలదుర్గాన్ని మండలంగా ప్రకటించలేదు. ఇటీవల కొన్ని ప్రాంతాలను మండలాలుగా ప్రకటించారు. సుమారు 10వేల జనాభా, 6 వేలకు పైగా ఓటర్లు ఉన్న జలదుర్గం మేజర్ పంచాయతీని మండల కేంద్రం అవుతుందని ప్రజలు ఆశించారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్దహరివణాన్ని ఆదోని నుండి విడదీస్తూ ప్రత్యేక మండలంగా ప్రకటించి జలదుర్గంను పట్టించుకోలేదు. టీడీపీ కుట్ర జలదర్గంను మండల కేంద్రంగా చేసేందుకు అనువైన ప్రదేశమా కాదా, జనాభా, పరిసర గ్రామాల నుంచి ఎంత దూరంలో మండల కేంద్రం ఉంటుంది అనే అంశాలపై తగిన ప్రతిపాదనలు తయారు చేసి ఆర్డిడీఓ నరసింహులు నేతృత్వంలో ప్రభుత్వానికి పంపారు. ఇందుకోసం జలదుర్గంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు, భవనాలను కూడా పరిశీలించారు. సర్వే పంపి మూడు నెలలు అవుతోంది. అయితే జలదుర్గం మండల కేంద్రం కాకూడదని టీడీపీలోని ఒక వర్గం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. డబుల్ లైన్ రోడ్లతో పాటు హుసేనాపురాన్ని మండల కేంద్రంగా చేస్తే పరిసర గ్రామాలన్నీ పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని టీడీపీ నేతల్లో కొందరు అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. టీడీపీలోని ఒక బలమైనవర్గం జలదుర్గం మండల కేంద్రం కాకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి జలదుర్గాన్ని మండల కేంద్రంగా చేయాలని టీడీపీ నేతలు చెప్పలేదు. జలదుర్గం 25 గ్రామాలకు అనుకూలంగా ఉంది. ప్రజలు 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న ప్యాపిలికి వెళ్లాల్సి వస్తోంది. కొండమీది గ్రామాలైన బూరుగల, బోంచెరువుపల్లె, సీతమ్మతండా, రాచెర్ల, అలేబాద్తండా, మునిమడుగు, బోంచెరువుపల్లె తండా, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, గార్లదిన్నె, ఊటకొండ, హుసేనాపురం, యజ్ఞరామాపురం, కౌలపల్లె గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
అల్లుడి వేధింపులే కారణం
● అనంతరంపురం ఘటనలో అమూల్య తల్లిదండ్రుల ఆవేదన వెల్దుర్తి: తమ కుమార్తె మరణానికి అల్లుడి వేధింపులే కారణమని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతపురం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తూ గురువారం ఇంట్లోనే మూడేళ్ల కుమారుడిని గొంతుకోసి, మహిళ ఉరేసుకున్న ఘటన తెలిసిందే. కలకలం రేపిన ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన అమూల్య(30) తండ్రి రామలక్ష్మయ్య నంద్యాల జిల్లా డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి కర్నూలు జిల్లా వెల్దుర్తి వాసి కాగా.. రిటైర్ట్ టీచర్ కేశన్న కుమార్తె. అమూల్య తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కర్నూలులో నివాసముంటూ వెల్దుర్తిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దీంతో అమూల్య, ఆమె మూడున్నరేళ్ల కుమారుడు సహర్స్ల మృతదేహాలను అనంతపురంలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం రాత్రి వెల్దుర్తి పట్టణంలోని బోయ వీధికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమూల్య తల్లిదండ్రులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారానికి చెందిన బండమీది రవితో ఐదేళ్ల క్రితం కర్నూలు పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసుకున్న తమ కుమార్తె అమూల్యను ఇచ్చి వివాహం చేశామన్నారు. అల్లుడు సత్యసాయి జిల్లా రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్ కాగా.. ప్రస్తుతం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. తమ కుమార్తె ఆత్మహత్య పట్ల అల్లుడు వరకట్నం తేవాలంటూ, ఇతరత్రా వేధింపులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయం అనంతపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. తమ కుమారుడు, అమూల్య సోదరుడు ప్రశాంత్ యూఎస్ చికాగోలో ఉంటున్నాడని, విషయం తెలిసి బయలుదేరాడన్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. -
అప్రెంటిషిప్కు 4న ధ్రువపత్రాల పరిశీలన
నంద్యాల(న్యూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 4న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్హత, కుల, ఆధార్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు కర్నూలులోని ట్రైనింగ్ కాలేజీలో హాజరు కావాలని తెలిపారు. జనవరి 29, 30 తేదీల్లో జాతీయ సదస్సు శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 29, 30వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హుస్సేన్బాషా తెలిపారు. కళాశాలలో బుధవారం బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల వాణిజ్య విభాగం, న్యూఢిల్లీకి చెందిన ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర– గ్రామీణ భారత సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పత్రాల సమర్పణను జనవరి 10వ తేదీలోగా ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): యూపీపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం కార్యాలయంలో బయోడేటాతో పాటు రెండు ఫొటోలు, కుల, ఆదాయం, ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, పాన్కార్డు, జిరాక్స్ కాపీలను ఈనెల 29లోగా ఇవ్వాలని తెలిపారు. స్పోర్ట్స్ కోటాను వినియోగించుకోవాలి ఆళ్ళగడ్డ: విద్యార్థులు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందవచ్చని నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రెడ్డి తెలిపారు. అహోబిలంలో ఎస్జీఎఫ్–69 క్రీడా పోటీలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం వస్తుందని, స్నేహ సంబంధాలు మెరుగుపడతాయన్నారు క్రీడా పోటీలకు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ కార్యదర్శులు విశ్వనాథ్, ఆశాజ్యోతి, ఏపీఎస్ఏపీ గౌరవ అధ్యక్షులు ఏపీ రెడ్డి, నాగరాజు, బేస్బాల్ సౌత్జోన్ చైర్మన్ నాగరాజు పాల్గొన్నారు. -
మదిని దోచి ‘పట్టా’రు..
మంచు కాదది.. నల్లమలను తాకిన శ్వేతవర్ణపు మేఘాలుపచ్చటి నల్లమల అందాల మధ్య అందమైన రైలు ప్రయాణంఅర్జునుడి విల్లు నుంచి సంధించిన బాణమా.. ప్రకృతి మాత నెత్తిన ధరించిన పసిడి ఆభరణమా.. అన్నట్లుగా కను చూపు మేర కనిపించే రైలు మార్గం ఓ వైపు. మేఘాలతో కప్పేసి హిమగిరులను తలపించే ఎత్తైన కొండల అందాలు మరో వైపు.. పుడమి తల్లి పచ్చని కోక కట్టుకుందా అన్నట్లుగా పచ్చని సోయగాలు ఇంకో వైపు.. ఇలా అడుగడుగునా అపురూప దృశ్యాలకు నెలవు నల్లమల. నంద్యాల–గిద్దలూరు నల్లమల మార్గంలో రైలులో ప్రయాణం ప్రయాణికులకు ఓ అద్భుతమైన యాత్రగా గుర్తుండిపోతుంది. నల్లమల పచ్చటి అందాలు, పక్షుల కిలకిలారావాలు, ఆకాశం, నల్లమల కొండలు ఒక్కటిగా కలిసి పోయాయా అన్నట్లు అగుపించే దృశ్యాలు మనసును దోచేస్తాయి. నల్లమలను వీక్షిస్తూ ఎందరో కవుల హృదయాలు స్పందించి అపురూప గేయాలను ఆలపించారు. – మహానంది -
క్రీడా పోటీల్లో ‘విభిన్న’ ప్రతిభ
మారిన జీవన శైలితో పట్టణాల్లో ప్రజలు ఒక కిలోమీటరు కూడా నడవని దుస్థితి నెలకొంది. ఆటోల్లో, వాహనాల్లో వెళ్లేవారు ఎక్కువ అయ్యాయి. వీరి ధీటుగా విభిన్న ప్రతిభావంతులు రన్నింగ్ రేస్లో, వీల్చైర్ పోటీల్లో ప్రతిభను చూపి ఆశ్చర్యానికి గురిచేశారు. నంద్యాల పట్టణంలోని నవజీవన్ క్రీడా మైదానంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్, షాట్పుట్, షటిల్ బ్యాడ్మింటన్, పరుగు పందెం, షాట్పుట్ వంటి పోటీల్లో విభిన్న ప్రతిభా వంతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు డిసెంబర్ 3న నంద్యాల పట్టణంలోని టౌన్హాల్లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు, మాజీ ఐఎంఏ అధ్యక్షుడు రవికృష్ణ తెలిపారు. జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య, కరస్పాండెంట్ సిస్టర్ జాన్మేరి, ఫాదర్ మర్రెడ్డి, పద్మా, పీఈటీలు సుంకన్న, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. – నంద్యాల(న్యూటౌన్) -
కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఆళ్ళగడ్డ: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పేరాయిపల్లె మెట్ట వద్ద కారు ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గోపులాపురం గ్రామానికి చెందిన పుల్లమ్మ(55) చెనక్కాయలను గ్రామ పరిసరాల్లో అమ్ముతూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో గురువారం పేరాయిపల్లె మెట్ట సమీపంలోని పాఠశాలలో చెనక్కాయలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఢీ కొట్టిన కారు అదే వేగంలో వెళ్లిపోయింది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, కారు ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. -
నలుగురు విద్యార్థుల డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో చూచిరాతలకు పాల్పడ్డ నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా గురువారం బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 3,709 మందికి 3,483 మంది, బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 142 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 104 మందికి 95 మంది హాజరయ్యారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, కోవెలకుంట్ల ఎస్వీబీ డిగ్రీ కళాశాలలో ఒకరు చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో.. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పింఛన్లకు నిధులు విడుదల కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు రూ.196.71 కోట్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.104.32 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.92.39 కోట్లు మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు ఈ నెల 29న బ్యాంకులకు విడుదలవుతాయి. అదే రోజున వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్పేర్ అసిస్టెంట్లు డ్రా చేస్తారు. డిసెంబర్ 1న పంపిణీ చేయనున్నారు. పంప్మోడ్తో 6,031 క్యూసెక్కుల నీటి మళ్లింపు శ్రీశైలం ప్రాజెక్ట్: ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం పంప్మోడ్ ఆపరేషన్తో 6,031 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయంలోకి మళ్లించారు. మిగులు విద్యుత్ను వినియోగించుకుని రివర్స్బుల్ సిస్టంతో డ్యాం ముందు భాగంలో ఉన్న నీటిని జలాశంలోకి తరలించారు. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయానికి 9,738 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 14,946 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.909 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 8,514 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,832 క్యూసెక్కులు విడుదల చేశారు. గురువారం సాయంత్రం సమయానికి జలాశయంలో 202.0439 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మాజీ సీజేఐ శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురువారం రాత్రి ధూళి దర్శనం చేసుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన సీజేఐకి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లికార్జున స్వామి వారిని, భ్రమరాంబా దేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారని అధికారులు తెలిపారు. -
పొలాల్లో దొంగలు పడ్డారు!
● మాయమవుతున్న బోరు మోటర్లు, విద్యుత్ తీగలు ● వారంలో 35 మోటర్లు అపహరణ ● లబోదిబోమంటున్న రైతులు రుద్రవరం: ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు చీడపీడలు వీటి నుంచి పంటను కాపాడుకోలేక సతమవుతున్న రైతులకు కొత్తగా దొంగల బెడద వేధిస్తోంది. రాత్రికి రాత్రి పొలాల్లో విద్యుత్ బోరు మోటర్లు, తీగలు అపహరణకు గురవుతున్నాయి. కోటకొండ గ్రామ చుట్టు పక్కల పలువురు రైతులకు చెందిన మోటార్లు చోరీకి గురయ్యాయి. తెలుగుగంగ ఆయకట్టు రైతులు అధిక శాతం బోర్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే రబీకి పొలాలు సిద్ధం చేశారు. రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పొలాల్లోకి వెళ్లి కనిపించిన వ్యవసాయ బోరుమోటర్ల వద్దకు వెళ్లి కేబుల్ తీగలను దొంగలిస్తున్నారు. అలాగే భూమి అంతర్భాగంలో కాకుండా భూమిపైనే ఉన్న బోరు మోటర్లను తస్కరిస్తున్నారు. ఉదయాన్నే పంటకు నీరు పారించుకునేందుకై పొలాల వద్దకు వెళ్లిన రైతులు అక్కడ కేబుల్ తీగలు, బోరు మోటర్ల మాయం అవ్వడంతో అవాక్కవుతున్నారు. వారం రోజుల నుంచికోటకొండ గ్రామంలో ఈ దొంగతనాలు అధికమయ్యాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన పులువురు రైతులు రుద్రవరం ఎస్ఐ మహ్మద్రఫికి ఫిర్యాదు చేశారు. ఖరీఫ్లో మొక్కజొన్న వేయగా, భారీ వర్షాలకు పంట మొత్తం దెబ్బతిని నష్టపోయామని, ఈ క్రమంలో రబీకి సిద్ధమవుతుంగా బోర్ల మోటార్లు చోరీ కంటి మీద నిద్ర కరువు చేస్తున్నాయని వాపోతున్నారు. వారం రోజుల్లోనే తమ గ్రామ పరిధిలో 35 బోరు మోటర్ల విద్యుత్ కేబుల్ తీగలు, రెండు బోరు మోటర్లు దొంగతనానికి గురయ్యాయన్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగల ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు. -
మూటా ముల్లె సర్దుకుని..
అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు మూట కట్టుకున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. పత్తి, ఉల్లి, మిరప, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు, రైతు కూలీలు మూటా ముల్లె సర్దుకుని వలస బాట పట్టారు. గురువారం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతులు, రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రం వద్ద అచ్చం పేటకు వెళ్లారు. దాదాపు 20 కుటుంబాలు పిల్లపాలపతో వలస వెళ్లారు. వలస నివారణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – నందవరం ఇబ్రహీంపురం నుంచి చిన్నారులతో వలస వెళ్తున్న కూలీలు -
జిల్లాలో 5న మెగా పీటీఎం
నంద్యాల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో డిసెంబర్ 5న మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం)ను నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మెగా పీటీఎం ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ చాంబర్ నుంచి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొనసాగుతుందన్నారు. విద్యార్థుల అభివృద్ధిపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడుతారన్నారు. సమావేశం అనంతరం హెచ్పీసీని విద్యార్థులకు అందజేస్తారన్నారు. పదో తరగతి సిలబస్ డిసెంబర్ 5 నాటికి పూర్తికాబోతోందని, అక్కడి నుంచి 100 రోజుల ప్రణాళికతో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మెగా పీటీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారన్నారు. -
భరత్ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా!
నగరానికి గుండెకాయ తరహా స్థలంపై చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. శివారు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములున్నా స్వార్థంతో ఉన్న ఉద్యోగులపై కక్షకట్టింది. ఇప్పటికిప్పుడు అదే ప్రాంతంలో కట్టాలని భీష్మిస్తున్న తీరు చూస్తే ఆ స్థలంతో తమ పబ్బం గడుపుకోవాలనే ఆశ స్పష్టంగా కనిపిస్తోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఉద్యోగులు.. పిల్లల చదువులు మధ్య ఉండటం.. కొందరు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటం.. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి టీజీ భరత్ ‘కర్ర’పెత్తనం చేస్తుండటం.. అందుకు జిల్లా అధికారయంత్రాంగం వత్తాసు పలుకుతుండటం ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తోంది.కర్నూలు(సెంట్రల్): కర్నూలు రాజధానిగా ఏర్పాటైన 1953 ప్రాంతంలో ఉన్నతాధికారుల కోసం ఏ, బీ, సీ విభాగాల్లో 1,009 క్వార్టర్స్ను నిర్మించారు. అయితే కాలంతోపాటు కట్టిన భవనాల ఆయుష్షు కూడా తగ్గిపోవడంతో కొన్ని భవనాలు బాగున్నా, మరికొన్ని పాడుబడ్డాయి. ఈ క్రమంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా అక్కడ మినీ స్టేడియం కట్టే పేరిట స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే నగరం నడిబొడ్డున స్టేడియం కడితే ట్రాఫిక్ సమస్య వస్తుందనే విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ మంత్రి టీజీ భరత్ మరో ప్రతిపాదనగా హైకోర్టు బెంచ్ తెరపైకి వచ్చింది. ఈ సారి అధికారిక, అనధికారికంగా నివాసం ఉంటున్న అందరూ ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే కర్రలు పట్టుకునైనా బలవంతంగా బయటకు పంపాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటైనా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా అన్న ప్రశ్నలు ఉద్యోగులు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్నా మంత్రి పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. జగన్నాథ గట్టులో దాదాపు 1000 ఎకరాల భూమి హైకోర్టు బెంచ్ ఏర్పాటులో భాగంగా రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేయాలని ఉద్యోగులను వేధిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కనీసం 2026 ఏప్రిల్ వరకు సమయం కావాలని కోరుతున్న పట్టించుకోని పరిస్థితి. అప్పటి వరకు సమయమిస్తే తమ పిల్లల చదువులు, ఉద్యోగ ప్రదేశాలకు అనువుగా ఇళ్లు చూసుకుంటామని చెబుతున్నా మంత్రి టీజీ భరత్, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గత ప్రభుత్వ హయాంలో జగన్నాథగట్టులో దాదాపు 1000 ఎకరాల భూమిని లా యూనివర్సిటీ, హైకోర్టు భవనాల కోసం కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మంత్రి మొండి పట్టు వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే నగరం మరింత విస్తరించి అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంత్రి మాటే జీవోనా.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ఏ, బీ, సీ క్వార్టర్లు ఖాళీ చేయకపోతే కర్ర తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడంపై అక్కడ నివాసం ఉంటున్న ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన చెబితే తమను ఎలా ఖాళీ చేయించేందుకు సిద్ధమవుతున్నారని ఉద్యోగులు ఉన్నతాధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు టీజీ భరత్ చెబితే క్వార్టర్లను ఖాళీ చేయిస్తున్నారా? లేదంటే ప్రభుత్వం నిర్ణయించిందా? అనే విషయం స్పష్టం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయమైతే అందుకు సంబంధించిన జీఓ, సర్క్యులర్ ఏమైనా ఇచ్చారా? ఉంటే ప్రతిని అందజేయాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ఓ లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ వేతనాల్లో హెచ్ఆర్ఏ కట్ అవుతోందని, అలాంటప్పుడు ఇప్పటికప్పుడు ఖాళీ చేయమంటే ఎలాగని కన్నీరుమున్నీరవుతున్నారు. బలవంతంగా తమ ఇళ్లకు కరెంట్, వాటర్ కనెక్షన్లు తొలగిస్తున్నారని, ఇలా చేయడం జీవించే హక్కును కాలరాయడమేనంటున్నారు. ఏ, బీ, సీ క్వార్టర్స్లోనే హైకోర్టు బెంచ్ ఎందుకు.. అధికారిక ఉత్తర్వులు వస్తే ప్రజల ముందుంచండి రాత్రికి రాత్రి ఖాళీ చేయమనడం అన్యాయం ప్రతినెలా హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నా వేధింపులు తగవు జగన్నాథగట్టులో కట్టుకోవడంలో అభ్యంతరమేంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న నివాసిత ఉద్యోగులుకర్నూలులో ఏ, బీ, సీ క్వార్టర్ల నివాసితులు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే. లేకుంటే కర్రతో సమాధానం చెబుతాం. రెండు వారాల వ్యవధిలోనే కర్నూలు హైకోర్టు బెంచీకి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ప్రతిపక్ష పార్టీని కలిస్తే మీకే వేళ్లు, చేతులు కాలుతాయి. రచ్చ చేయాలని చూస్తే కుదరదు. ఇక్కడ ఉండేది టీడీపీ ప్రభుత్వం, కర్రతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. – ఈనెల 24న మంత్రి టీజీ భరత్ హెచ్చరిక -
ఎస్సీల ఇంటి బేస్మెట్లు నేలమట్టం
● అర్ధరాత్రి జేసీబీతో ధ్వంసంకొలిమిగుండ్ల: మండల కేంద్రంలో స్థానిక కస్తూర్బా పాఠశాలకు ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ చెంతనే ఎస్సీలు ఇళ్ల నిర్మాణాల కోసం నిర్మించుకున్న బేస్మెట్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి జేసీబీ సాయంతో నేల మట్టం చేశారు. ఇటిక్యాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 112/ఏలోని భూమిని 763/1గా సబ్ డివిజన్ చేసి ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేశారు. 70 మంది లబ్ధిదారులకు ఎండార్స్మెంట్ ఇవ్వడంతో 2024లో బేస్మెట్లు నిర్మించుకున్నారు. ఈ స్థలంలో ఒక్కొక్కరు రూ.70 వేలు నుంచి లక్ష రూపాయలకు పైగానే బేస్మెట్ల నిర్మాణం కోసం ఖర్చు చేసుకున్నారు. కూలీ పనులకు వెళ్లి దాచుకున్న సొమ్ముతో కట్టించుకున్నామని రాత్రికి రాత్రే పడగొట్టారని లబ్ధిదారులు వాపోయారు. అధికారికంగా పట్టాలు ఇవ్వక పోయినా పలు సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎండార్స్మెంట్ ఇవ్వడంతో నిర్మాణాలు చేసుకున్నామన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. తమ స్థలాలను లాక్కునేందుకు ఈకుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేస్మెట్ల కోసం పెట్టిన ఖర్చు నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. నిర్మాణాలు తొలగించడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తహసీల్దార్ శ్రీనివాసులును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. -
రైతులకు చేసిన మేలేందో చెప్పుసార్
జూపాడుబంగ్లా: రైతులకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతుంటే ఆ పంటలేసుకో.. ఈ పంటలేసుకోమని భలే చెబుతున్నావులే సార్ అంటూ రైతులు శివన్న, చిన్నలక్ష్మయ్యలు ఏఓ కృష్ణారెడ్డిని నిలదీయటంతో ఆయన వారికి సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. బుధవారం జూపాడుబంగ్లాలో ఏఓ కృష్ణారెడ్డి, రైతుసేవాకేంద్రం సిబ్బంది గ్రామంలోని రైతుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం అలవర్చుకోండి, ఉద్యానవనపంటలు వేసుకోండి, 90శాతంతో డ్రిప్పైపులు ఇస్తామంటూ చెప్పసాగారు. ఇంతలో తెలుగు శివన్న, చిన్నలక్ష్మయ్య అనే రైతులు కల్పించుకొని ముందు పండించిన మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించు, కొనుగోలు కేంద్రాలు పెట్టించి రూ.2,400 చొప్పున కొనేలా చెయ్యి.. వర్షాలు పడి పంటనష్టమైతే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడొచ్చి అవిస్తాం, ఇవిస్తామంటూ భలే చెబుతున్నావంటూ మండిపడ్డారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఏఓ కృష్ణారెడ్డి సమాధానం చెప్పలేక వెనుదిరిగి వెళ్లారు. ఓట్లేసి గెలిపించుకొన్న పాపానికి మాకు తగిన శాస్తి చేశాడంటూ రైతులు చంద్రబాబు సర్కార్పై తీవ్రవిమర్శలు గుప్పించారు. -
అన్నదానం.. వెల్లివిరిసిన సామరస్యం
అయ్యప్పస్వామి భక్తులకు అన్నదానం చేస్తున్న ముస్లింలు ముత్యాలపాడు గ్రామంలోని అంకాళమ్మ గుడి వద్ద బుధవారం వైఎస్సార్సీపీ నాయకుడు డాబుగాళ్ళ పెద్ద మాబు, అతని సోదరుడు ఉపాధ్యాయుడు మహబుబ్బాషాలు.. అయ్యప్ప మాల ధరించిన 50 మంది భక్తులకు భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ.. ముత్యాలపాడు గ్రామంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి సఖ్యతగా జీవిస్తున్నామన్నారు. గురుస్వామి బోయిని శ్రీనివాసులు మాట్లాడతూ.. ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులకు ముస్లింలు భిక్ష ఇస్తున్నారన్నారు. ఈ ఏడాది కూడా భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు శేషురమేష్, అంకాల్రెడ్డి, సుబ్బారాయుడు, రజమ్మగారి చాంద్బాషా, ఎంపీటీసీ సభ్యుడు నాగ వెంకట రాముడు పాల్గొన్నారు. – చాగలమర్రి -
ప్రజాస్వామ్య విలువలపైవిద్యార్థులకు అవగాహన
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టర్ చాంబర్లో విద్యార్థులతో బుధవారం జిల్లా కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారికి పురస్కారాలు అందజేిశామన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి మొత్తం ముగ్గురు విద్యార్థులను ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి నంద్యాల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఎస్పీ సునీల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రాజ్యంగ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ సునీల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. ఫలితంగా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాయన్నారు. నవ సమాజం, సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. డీఎస్పీలు కె.ప్రమోద్, రామంజి నాయక్ , పోలీస్ అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం శ్రీశైలం టెంపుల్: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం దేవస్థానం మల్లికార్జున కల్యాణ మండపంలో సమీక్షా సమావేశ మందిరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. గతంలోనూ ప్లాస్టిక్ నిషేధంపై పలుమార్లు అవగాహన సమావేశాలు నిర్వహించామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయాలను సూచించామన్నారు. సత్రాలు, దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు విడివిడిగా రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకుని తడి చెత్త, పొడిచెత్తను వేరువేరు కుండీలలో వేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి దేవస్థానం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. దేవస్థానం రెవెన్యూ, భద్రతా అధికారులు విస్త్రత తనిఖీలు చేపడతారని, నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం కూడా విధిస్తామన్నారు. రుద్రవరం: తెలుగుగంగ 22వ బ్లాక్ ఉప ప్రధా న కాల్వకు మళ్లీ గండి పడటంతో వరిపొలాలు నీట మునిగాయి. ఈ కాలువకు కొద్ది రోజుల క్రితం గండి పడటంతో రైతులు విషయాన్ని తెలుగుగంగ అధికారులకు తెలియజేశారు. వారు వెళ్లి గండిని పరిశీలించి మట్టి సంచులతో పూడ్పించారు. ఆ పనులు చేయించి వారు వెళ్లగానే ఆ మట్టి సంచులు కొట్టుకు పోయి తిరిగి గండి ఏర్పడింది. నీరంతా కోత దశలో ఉన్న వరి పొలాలను ముంచెత్తింది. దీంతో వరి పంట దెబ్బతిని పొలాల్లోనే కుళ్లి పోతోంది. -
రోడ్డు గుంతలమయం
జూపాడుబంగ్లా: తాము అధికారంలోకి వస్తే గుంతల్లేని రోడ్లను వేయిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా గుంతలమయమైన రోడ్లవైపు కన్నెత్తి చూడకపోవటంతో ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారుమంచాల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారటంతో ద్విచక్రవాహనాలదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తంగడంచ చెక్పోస్టు 340సీ రోడ్డు నుంచి పారుమంచాలకు 7కిలోమీటర్ల మేర బీటీరోడ్డు ఉంది. మూడేళ్ల క్రితం సుమారు రూ.1.50కోట్ల వ్యయంతో బీటీరోడ్డు ఆర్అండ్బీ అధికారులు వేయించారు. ఇప్పుడు రోడ్డు గుంతలమయంగా మారింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కనీసం గుంతలనైనా పూడ్పిస్తుందా అంటే అదీలేదు. దీంతో పారుమంచాల గ్రామానికి వెళ్లే ప్రయాణికులు గుంతలమయమైన రోడ్డులో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని గుంతలను పూడ్పించి ప్రయాణం సవ్యంగా సాగేలా చేయాలని ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు కోరుతున్నారు. -
విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం
కర్నూలు (టౌన్) : విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా విద్యాశాఖా ధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. పిల్లలకు త్రోబాల్, రన్నింగ్, షాట్పుట్ వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయన్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు క్రీడలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. కర్నూలు మండల విద్యాధికారి అబ్దుల్ రెహెమాన్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పిల్లల పోటీలను డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు. -
జూనియర్ వెటర్నరీ ఆఫీసర్కు జాతీయస్థాయి పురస్కారం
కర్నూలు(అగ్రికల్చర్): లింగనిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం ద్వారా పెయ్య దూడలను అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ అనురాధకు జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డు లభించింది. 2023లో లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టి పాడిని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. కర్నూలులోని పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. మహానంది మండలం గోపవరం గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్న అనురాధ 2023, 2024, 2025లో లింగనిర్ధారిత వీర్యంతో 800 ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేశారు. దీని వల్ల చూలు కట్టి పుట్టిన దూడల్లో 95 శాతం అంటే 340 పెయ్యదూడలే ఉన్నాయి. అలాగే పాల ఉత్పత్తి పెరిగింది. పాల ఉత్పత్తిలో అద్భుతంగా రాణిస్తున్న రైతులు, డెయిరీ ఫాంలు నిర్వహించే వారికి, కృత్రిమ గర్భధారణ ద్వారా పెయ్యదూడలు అభివృద్ధి చేసే పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు దేశం మొత్తం మీద 2000 మంది దరఖాస్తు చేసుకోగా 20 మంది ఎంపికయ్యారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత జాతీయ స్థాయిలో చివరకు ముగ్గురు మాత్రమే అవార్డులకు అర్హులుగా నిలిచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అనురాధ ఒకరు. బుధవారం జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వశాఖ మంత్రి ఆమెకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన జేవీఓను ఉమ్మడి జిల్లా పశుసంరవ్ధక శాఖ అధికారులు అభినందించారు. -
తండ్రి మందలించాడని..
● ఇంటినుంచి పారిపోయిన విద్యార్థి గోనెగండ్ల: పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. ఇన్చార్జ్ సీఐ చిరంజీవి తెలిపిన వివ రాల మేరకు.. కులుమాల గ్రామానికి చెందిన అరెకంటి రాజు కుమారుడు ఏబేల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఐదారు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో అలిగిన ఏబేల్ ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ సీఐ తెలిపారు. ఎవరికై నా ఆ బాలుడు కనిపిస్తే 9963766379 లేదా గోనెగండ్ల పోలీస్ స్టేషన్ 9121101074కు సమాచారం ఇవ్వాలని కోరారు. తూకాల్లో తేడాలు వస్తే చర్యలు చాగలమర్రి: తూకాల్లో తేడలు వస్తే జిల్లా తునికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎం.జిలానీ భాషా తెలిపారు. చాగలమర్రిలోని మెయిన్ బజార్లో ఉన్న బంగారు దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు దుకాణాదారులు ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్ర వేయించుకోకుండా ఉపయోగిస్తుండటంతో రూ.30,000 జరిమానా వేశారు. తూనికల శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో గ్రామంలోని అన్ని దుకాణాలు మూసి వేశారు. డోన్, నంద్యాల ఇన్స్పెక్టర్లు నాగరాజు, అనిత, సిబ్బంది హనుమాన్ సింగ్, మధు, శ్రీశాంత్ పాల్గొన్నారు. -
రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామస్థాయిలో ఒకవైపు మూగజీవులకు వైద్య సేవలు అందిస్తూ... మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ను కించపరిచే విధంగా ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పీవీ లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ పెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అనే పదం వాడే అర్హత నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్కు లేదని అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. బుధవారం కలెక్టరేట్లోని గోకులం సమావేశ మందిరంలో జీవీవో, వీఎల్వో, ఎల్ఎస్ఏ కార్యావర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పశుసంవర్ధక శాఖలో ఏహెచ్ఏ పోస్టుల భర్తీ పారదర్శకంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరిగిందని, ఎంపికై న వారికి డిపార్టుమెంటు అధికారులే డివార్మింగ్, వాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చారన్నారు. అయితే, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని కించపరచడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో అధికారులు, నాన్ గెజిటెడ్ కేడర్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కౌన్సిల్ చైర్మన్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ హేమంత్కుమార్కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో వివిద సంఘాల నాయకులు జనార్ధన్రెడ్డి, గంగన్న,ఆయేశ్వరీ, హనుమంతు, సులోచన, సుమలత తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ముత్తలూరు నుంచి చాగలమర్రికి వెళ్తున్న ట్రాక్టర్ను వెనుకవైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ యజమాని మహేశ్వరరెడ్డి, డ్రైవర్ వెంకటయ్య గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్లోరోసిస్పై అవగాహన కల్లూరు: ఫ్లోరోసిస్పై అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక జిల్లా సంచార కార్యక్రమ అధికారి డాక్టర్ రఘు సూచించారు. బుధవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని బొల్లవరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఏర్పాటు చేసిన సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. హై ఫ్లోరైడ్ టూత్పేస్ట్, నిల్వ ఉండే చిరుతిళ్లు, శీతల పానీయాలు, రెడీమేడ్ చిప్స్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధికంగా ఫ్లోరైడ్ ఉంటుందన్నారు. వైద్యులు మోతిలాల్నాయక్, హెచ్ఎం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లారీ బోల్తా రుద్రవరం: వడ్ల బస్తాల లోడ్తో వెళ్తున్న డీసీఎం లారీ మండల కేంద్రమైన రుద్రవరానికి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే..గుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైపు నుంచి సుమారు 150 బస్తాల వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలు దేరింది. మార్గ మధ్యంలో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయ పడగా స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు దేవనకొండ: చదువుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మైమూన్ మొదట విడతలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీటు సాధించింది. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకె రవికృష్ణ ఈ విషయం తెలుసుకొని ఆ విద్యార్థినిని బుధవారం విజయవాడలోని తన కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నాలుగేళ్లు చదివేందుకు అయ్యే ఖర్చును బొమ్మిడాలా ట్రస్ట్ సమకూర్చుతుందని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి లభించేది
90 రోజులు శిక్షణ పూర్తి చేసుకుంటే ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నా. అయితే నేటికీ కుట్టు మిషన్ ఇవ్వలేదు. చెప్పిన విధంగా కుట్టు మిషన్ అందిస్తే ఇంట్లోనే జాకెట్లు, ఇతరత్రా వాటిని కుట్టి రోజుకు రూ.300 వరకు సంపాదించుకునేదాన్ని. శిక్షణ పూర్తి చేసుకున్న మాలాంటి పేద, మధ్య తరగతి వర్గాల మహిళలకు ప్రభుత్వం వెంటనే కుట్టు మిషన్లు అందించాలి. – సుహాసిని, హాలహర్వి ● -
శుభకార్యాలకు విరామం!
● ఫిబ్రవరి 17 వరకు మౌఢ్యమి ● 83 రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ కొలిమిగుండ్ల: శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. నేటి నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు దాదాపు 83 రోజులు శుక్రమూఢం కొనసాగనుంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు,కొత్త వ్యాపారాల ప్రారంభం తదితర పనులు చేయకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. మౌఢ్యమి సమయంలో ఈరెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి. అందుకే శుభకార్యాలు జరుపుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. బోసిపోనున్న ఫంక్షన్ హాళ్లు శుక్ర మౌఢ్యమి కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బోసిపోనున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, సప్లయి సామగ్రి నిర్వాహకులు, వంట మాస్టర్లు, బాజా భజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది. -
వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన కమ్మలదిన్నె లక్ష్మన్న(42) అనే వలస కూలీ బుధవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాల్లో పనులు లేక బతుకు తెరువు కోసం లక్ష్మన్న భార్య భీమక్క , 9వ తరగతి చదువుతన్న కుమార్తె గోవిందమ్మతో కలిసి రాయచూరు జిల్లా హోస్పేట్ మండలం జిగుకల్లు గ్రామంలో పత్తి వేరుట కోసం నెల రోజుల క్రితం వలస వెళ్లారు. ఉదయం పొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలి కిందకు పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ప్రైవేట్ వైద్య శాలకు తరలించే లోగా మృతి చెందాడు. ఆయనకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. వలస వెళ్లి కుటుంబాన్ని పోిషించుకునేవాడు. ఒక కుమారుడికి వివాహం చేయగా, రెండో కుమారుడు రామాంజినేయులు గ్రామంలో 10వ తరగతి చదువుతున్నా డు. ఆకస్మికంగా కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. -
నష్టాన్ని దిగమింగుతూ.. కష్టాన్ని దున్నేస్తూ
సి.బెళగల్: ఉల్లి రైతుల గోడు వర్ణనాతీతం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కోతకు వచ్చిన పంటను కొందరు మూగజీవాలకు వదిలేస్తుండగా.. మరికొందరు పొలంలోనే దున్నేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉల్లి రైతులు ఈ దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నా చంద్రబాబు సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోంది. సి. బెళగల్ మండల పరిధిలోని మారందొడ్డిదొడ్డి గ్రామానికి చెందిన మహబూబ్బాష అనే రైతు ఖరీఫ్ సీజన్లో రెండెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కింద దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చుచేశాడు. ధర లేకపోవడంతో కోతకోసి విక్రయిస్తే కూలీల ఖర్చులు కూడా రావని బుధవారం పొలంలోనే పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. -
● పెట్రోల్ బంకుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
మండల పరిధిలోని నర్సాపురం వద్ద బుధవారం ఓ ట్రాక్టర్ పెట్రోల్ బంకు మీదకు దూసుకెళ్లింది.అయితే ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. నర్సాపురం నుంచి అహోబిలం వెళ్లే దారిలో ఓ పెట్రోల్ బంకు ఉంది. డ్రైవర్ తన ట్రాక్టరుకు డీజల్ పట్టించుకునేందుకై వెళ్లాడు. డీజల్ పట్టించాక ట్రాక్టరును ముందుకు కదిలించే సమయంలో హఠాత్తుగా డ్రైవర్కు బీపీ తగ్గడంతో ట్రాక్టర్ నడపడంలో పట్టు తప్పింది. దీంతో ఒక్క సారిగా ఆ ట్రాక్టరు ముందుకు దూసుకెళ్లి డీజల్ పట్టే బంకును ఢీ కొట్టింది. పెట్రోల్ బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురై హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. – రుద్రవరం -
● ముళ్ల ఏదును తప్పించబోయి..
రోడ్డుపై అడ్డుగా వచ్చిన ముళ్ల ఏదు (ముళ్లపంది) తప్పించే క్రమంలో ఓ ఏజెన్సీ ఉద్యోగి కింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మహానంది సమీపంలో చోటు చేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన కుమార్ రాయల్ మహానంది దేవస్థానంలో ఏజెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై వెళ్తుండగా జినశంకర తపోవనంలో నల్లమల అడవి నుంచి రోడ్డుపైకి ముళ్ల ఏదు రావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో కుమార్ చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. – మహానంది -
డిసెంబర్ 1 నుంచి పులుల గణన
మహానంది: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) పరిధిలో డిసెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పులుల గణన కార్యక్రమం ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ అధికారులు తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వన్యప్రాణుల గణన జరగనున్నట్లు చెప్పారు. భారతదేశం అంతా ఒకేసారి జరిగే గణనలో ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఫేజ్–1 ప్రక్రియలో భాగంగా మూడు రోజుల పాటు మాంసాహార, మరో మూడు రోజుల పాటు శాఖాహార జంతువుల గణన ఉంటుందన్నారు. రెండు భాగాలుగా జరిగే ట్రెయిల్ పాత్, ట్రాంజాక్ట్ పద్దతుల్లో వన్యప్రాణుల గణన ఉంటుందన్నారు. ట్రయిల్ పాత్(మాంసాహార జంతువులు), ట్రాంజాక్ట్(శాఖాహార) పద్దతుల్లో వన్యప్రాణి జంతువులను లెక్కిస్తారన్నారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలో జరిగే గణనకు సంబంధించి ఇప్పటికే అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులతో పాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అఽథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ వన్యప్రాణుల గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్ఎస్టీఆర్ పరిధిలో 87 పెద్ద పులులు ఉన్నట్లు సమాచారం. -
రూ.50 లక్షల గోల్మాల్!
● టీడీపీ కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్బొమ్మలసత్రం: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లర ఖర్చుల పేరుతో ఆ పార్టీకి చెందిన కొందరు కాంట్రాక్టర్లు రూ.50 లక్షలు గోల్మాల్కు పాల్పడటం కౌన్సిల్ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కౌన్సిలర్లు , చైర్పర్సన్ మాబున్నిసా తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీ అధికారులు తీరు మార్చుకోవాలని ౖచైర్పర్సన్ దృష్టికి సీ బిల్లుల విషయాన్ని కౌన్సిలర్ ఆరిఫ్నాయక్ తీసుకెళ్లారు. ఇదే విషయంపై ఎంఈ గుర్రప్పయాదవ్ను కౌన్సిలర్లు నిలదీశారు. చిన్నాచితక పనులకు రూ. 50 లక్షల బిల్లులు ఎలా మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చైర్పర్సన్ మాబున్నిసా మాట్లాడుతూ.. అంత సొమ్ము ఖర్చుచేస్తే మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా ఉండటం నిర్లక్ష్యమేనన్నారు. సీ బిల్లుల చెల్లింపుల్లో ఇంత వరకు జరిగిన లెక్కల వివరాలు తమకు తెలియజేయాలని సూచించారు. రూ. 20 లక్షల పనులకు ఒకే ఒక్క టెండర్! మున్సిపల్ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పొందుపరిచిన 34, 35 అంశాలను కౌన్సిలర్ కృష్ణమోహన్తో పాటు మరి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. షాదిక్ నగర్లో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ అధికారులు టెండర్లకు పిలవగా టీడీపీ నాయకుడు సుధాకర్ అనే కాంట్రాక్టర్ మాత్రమే 0.60 శాతం తక్కువ మొత్తంతో టెండర్ దాఖలు చేయడంపై కౌన్సిలర్లు అభ్యంతరకరం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇదే కాంట్రాక్టర్ మున్సిపాల్టీలో కౌన్సిల్ దృష్టకి రాని చిన్నాచితక పనులకు రూ. 15 లక్షల దాకా సీ బిల్లులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక పార్క్లో కేవలం చెత్త బుట్టలు ఏర్పాటు చేసేందుకు రూ. 1.74 లక్షలు ఖర్చు చేయటం చూస్తే ప్రజల సొమ్ము ఇంత ఈజీగా దోచుకుంటున్నారా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ రాకమానదు. దళిత సంఘం నేతల ఆందోళన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో అధికారులు విఫలమయ్యారని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కౌన్సిల్హాల్లో సమావేశం జరుగుతుండగా దళిత సంఘం నేతలు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోలా కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈఏడాది ఏప్రిల్ నెలలో అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన పనులకు మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ శంకుస్థాపన చేశారన్నారు. సాక్షాత్తు మంత్రి శంకుస్థాపన చేసినా పనులను అధికారులు నిర్లక్ష్యం చేయటం దారుణమన్నారు. చైర్పర్సన్ మాబున్నిసా స్పందిస్తూ .. అధికారులు తక్షణమే అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని ఆదేశించారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
జూపాడుబంగ్లా: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పనిచేస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి, రీజనల్ మేనేజర్ పీవీ రమణ అన్నారు. బుధవారం మండలంలోని పారుమంచాల గ్రామంలో ఏపీబీజీ శాఖ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకుల బలోపేతం కోసం రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, సప్తగిరి, చైత న్య, వికాశ్ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,351శాఖలు కలిగిన తమ బ్యాంక్ 1.30 కోట్ల మంది ఖాతాదారులతో రూ.1,28,000 కోట్ల టర్నోవర్తో దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంక్గా కొనసాగుతుందన్నారు. బ్యాంకుల విలీనం ద్వారా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారుడు ఎన్ని బ్యాంకు నెంబర్లు కలిగి ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఓ సెల్నెంబర్ ఉండాలన్నారు. ప్రస్తుతం తమ బ్యాంకు ద్వారా డ్వాక్రా, పంట, గోల్డ్, విద్యారుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలు ఇస్తున్నామన్నారు. పారుమంచాల బ్యాంకు ప్రస్తుతం రూ.60 కోట్ల టర్నోవర్తో రైతులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మొండి బకాయిదారులు ఎవ్వరైనా ఉంటే డిసెంబర్ నెలాఖరులోగా వన్టైం సెటిల్మెంటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీజనల్ ఆఫీసర్లు ఎస్ఎం సాయికిరణ్, రహీం, మేనేజర్లు కిషోర్బాబు, చిరంజీవిశ్రేష్టి, సునీల్కృష్ణ, మల్లిఖార్జునరెడ్డి, రియాజ్బాషా, రైతులు కరుణాకర్రెడ్డి, వెంకటరమణారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో 94 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు బుధవారం 3,718 మందికి గాను 3,499 మంది (94శాతం) విద్యార్థు లు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 145 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 102 మందికి 94 మంది హాజరైనట్లు తెలిపారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు ఆదోని అర్బన్: పట్టణంలో రెండు రోజుల క్రితం కంచిగారి వీధిలో బిల్డింగ్ను బతికున్న వ్యక్తిని మరణించినట్లుగా సృష్టించి చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ను బుధవారం రద్దు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై ‘బతికున్న వ్యక్తి మరణించినట్లుగా సృష్టించి’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఆదోని సబ్రిజిస్ట్రార్ సునంద అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున వారిని పిలిపించి వారితో రుద్ద చేయించారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఆదోనిలో ఇప్పటివరకు మూడు జరిగాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం తప్ప సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు ఏవీ అని ఆదోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేలు కొరికిన ఆటోడ్రైవర్ డోన్ టౌన్: తన ఇంటి వద్ద ఆటోను పార్క్ చెయ్యవద్దని హుస్సేన్ అనడంతో కోపంతో ఆటో డ్రైవర్ వేలు కొరికాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డోన్ పాతపేటకు చెందిన హుస్సేన్ ఇంటి వద్ద అదే కాలనీకి చెందిన షేక్షావలి ప్రతి రోజు రాత్రి ఆటో పార్కింగ్ చేస్తున్నారు. ఆటోను పార్కు చెయ్యవద్దు అని మంగళవారం రాత్రి ఆటకాయించడంతో ఆటో డ్రైవర్ షేక్షావలి ఆగ్రహంతో గొడవకు దిగాడు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ తండ్రి, భార్య తోడై హుస్సేన్పై దాడి చేశారు. అదే సమయంలో హుస్సేన్ చేతి వేలు షేక్షావలి కొరికాడు. గమనించిన కాలనీ వాసులు వారించి బాధితున్ని చికిత్సల నిమ్మిత్తం వైద్యశాలకు తరలించారు. -
ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలి
● జాతీయ రాజ్యాంగ దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకట శేషాద్రి కర్నూలు సిటీ: దేశానికి దిక్సూచి అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రాజనీతి విభాగం ఆధ్వర్యంలో ప్రజాపరిరక్షణ ఐక్యవేదిక, కాలేజీ ఎన్ఎస్ఎస్–2 యూనిట్లు సంయుక్తంగా బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకొని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది వై.జయరాజు మాట్లాడుతూ రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగ రూపకల్పనలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఆ తరువాత ఈగల్ టీం ఎస్ఐ సృజన్కుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహూమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపల్స్ హేమంత్, సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు డా.రాయపాటి శ్రీనివాస్, ప్రజాస్వామ్య పరిరక్షణ జిల్లా కార్యదర్శి అడ్వకేట్ రవికుమార్, మాజీ సైనికాధికారి కె.డి.జె. బాలు, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా.ఆర్ రోషన్న, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న ఇళ్లకు పన్నులు!
● వసూలుకు అధికారుల ఏర్పాట్లు ● మౌలిక సదుపాయాలు లేక ప్రజల అవస్థలుపాణ్యంలో జగనన్న కాలనీ ఏరియల్ వ్యూపాణ్యం: పేదల ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. జగనన్న కాలనీలను నిర్మించింది. పలు సౌకర్యాలు కల్పించింది. పేదలు ఇళ్లు కట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీలను నిర్లక్ష్యం చేసింది. కనీస సౌకర్యాలు కల్పించే విషయంలోనూ కక్ష సాధింపు ధోరణి అవలంబించింది. ప్రజల వినతులతో అధికారులు ఎట్టకేలకు పన్ను వసూలుకు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియ ప్రారంభమైతే కనీస సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరుగా మారిన జగనన్న కాలనీ.. మండల కేంద్రమైన పాణ్యంలోని మేకల బండి(జగనన్న కాలనీ)లో 2019–22 మధ్య కాలంలో 439 మంది పాణ్యం ప్రజలకు, 20 మంది బలపనూరు పంచాయతీ వారికి కలిపి మొత్తం 459 మందికి బీఎల్సీ బేనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్చన్ (యూడిఏ)కింద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీరు ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని రకాల మూడి సరుకు(ఇసుక, కడ్డీలు, సిమెంట్, ఎలక్ట్రిక్ వస్తులు, మరుగుదొడ్డి కావాల్సిన పరికరాలు, కిటికీల వస్తువులు)రాయితీపై అందించింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగాయి. ప్రస్తుతం హౌసింగ్ అధికారుల లెక్కల ప్రకారం 111 మంది ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా, 264 వివిధ దశలో ఉన్నాయి. మొత్తం 64 మంది ఇంకా నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం జగనన్న కాలనీ కొత్త ఊరులా తయారైంది. ఇవీ ఇబ్బందులు.. జగనన్న కాలనీ రూపుదిద్దుకుంటున్న సమయంలోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నివాసితులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన ప్రజలు సైతం చుక్కలు చూస్తున్నారు. గతంలోనే రోడ్డు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించగా.. ఇప్పుడు వీధిలైట్లు, ప్రధానరోడ్ల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వర్షాకాలం, రాత్రి సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు పలు సార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేకలబండలో ఇళ్లు నిర్మించుకున్న వారికీ పంచాయతీ తరఫున పన్ను వసూలు చేస్తాం. ఈ విష యం ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి నుంచి పన్ను వసూలు చేయాలని సూచించడంతో త్వరలోనే ప్రక్రియ మొదలు పెడతాం. ఇంటి నంబర్లు కేటాయించే పని ప్రారంభిస్తాం. పంచాయతీ తరఫున కాలనీ ప్రజలకు అందాల్సిన సేవలను అందిస్తాం. – ఆనందరావు, ఈఓ, పాణ్యం పంచాయతీ -
శ్రీశైలం ఈఓ కొనసాగింపు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాసరావును మరో ఏడాది పాటు ఈఓగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డా.ఎం.హరిజవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబరు 5వ తేదీన శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం పూర్తి కావస్తుండడంతో ఆయనను మరో ఏడాది (2026 డిసెంబరు 4 వరకు) పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 27న విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నంద్యాల(న్యూటౌన్): స్థానిక నవజీవన్ స్పెషల్ స్కూల్ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు ఈనెల 27వ తేదీన క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్ 100, 400 మీటర్లు, లాంగ్ జంప్, షాట్పుట్, బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8712622576ను సంప్రదించాలన్నారు. శ్రీశైలంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు శ్రీశైలం: దేవస్థానం పరిధిలోని టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. వన్టౌన్ సీఐ ప్రసాద్రావు తన సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ గార్డ్లతో కలిసి మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ నాయక్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్లు సీఐ తెలిపారు. దేవదాయ చట్టం నిబంధనల మేరకు క్షేత్రంలోకి మద్యం, మాంసం, సిగిరెట్, గుట్కాలు తదితర నిషేధిత పదార్థాలు రాకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే అన్యమత స్టిక్కర్లు కలిగి ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేసి వాటిని తొలగించి క్షేత్రంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాజీ అయ్యేలా అవగాహన కల్పించండి నంద్యాల (వ్యవసాయం): రాజీ కాగల కేసులను గుర్తించి, ఆ మేరకు కక్షిదారుల్లో అవగాహన కల్పించాలని మూడవ అదనపు కోర్టు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్నరాజా పోలీసు అధికారులకు సూచించారు. 3వ అదనపు కోర్టు ఆవరణలో మంగళవారం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మీ, డీఎస్పీ మందా జావలితో పాటు పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో ఆయన లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మనరాజా మాట్లాడుతూ.. డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే మెగా జాతీయ లోక్అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారానికి అందరూ చొరవ తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో రాజీ అయ్యే వాటిని గుర్తించి పరిష్కరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పీపీ శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేడు సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని బుధవారం సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. లోక కల్యాణం కోసం జరిపే ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి (కుమారస్వామి) ఉదయం 7 గంటలకు విశేష అభిషేకం, అర్చనలు జరిపిస్తారు. 9 గంటల నుంచి సుబ్రహ్మణ్య హోమం, పూర్ణాహుతి చేస్తారని వివరించారు. -
సమగ్ర చర్యలతో రోడ్డు ప్రమాదాల నివారణ
● జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ నంద్యాల: రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రహదారి భద్రతపై జేసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శాంతిరాం ఆసుపత్రి సమీపంలో రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, అవసరమైన లైటింగ్ పెంచాలని ఆదేశించారు. ఎన్హెచ్–44 మార్గంలో డోన్ మండలం, దొరపల్లి గ్రామం వద్ద మెరుగైన విద్యుత్ సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. బ్రాహ్మణకొట్కూరు ప్రాంతంలో ఎన్హెచ్–340సి రహదారి నిర్మాణంలో సాగు భూములకు వెళ్లడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యపై బాధి తులు అర్జీలు ఇస్తున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. రహదారులపైకి పాడిపశువులు అడ్డుకునేందుకు పోలీసు శాఖ సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న సర్వీస్ రోడ్లను పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ ప్రమోద్కుమార్, జిల్లా రవాణా శాఖ అధికా రి శివారెడ్డి, ఎన్హెచ్ అధికారులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయిలో మల్లన్న హుండీ ఆదాయం
● గతేడాది కంటే రూ.1.31కోట్లు అధికం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లన్నకు కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మంగ ళవారం చంద్రవతి కల్యాణ మండపంలో ఉభయ దేవాలయాలలో భక్తు లు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.7,27,26,400 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసంలో ఇంత అధిక మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషమన్నారు. ఈ రాబడిని భక్తులు గత 33 రోజుల్లో సమర్పించారన్నారు. గతేడాది కార్తీకమాసంలో రూ.5,96,92,376 నగదు లభించిందన్నారు. గత సంవతర్సరం కార్తీక మాసం కంటే ఈ సంవత్సరం రూ.1,30,34,024 అధిక రాబడి వచ్చిందన్నారు. అలాగే హుండీలో 117.800 బంగారం, 7.230 కేజీల వెండి, మరికొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహ ణాధికారి ఆర్.రమణమ్మ, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివ..శివా.. చూచితివా!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు వసతి సౌకర్యార్థం దాతల సహకారంతో కాటేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో వాటికి దేవుని పేర్లు ఉండాల్సిన చోట వ్యక్తులు, సంస్థల పేర్లు ఉండడంతో ఆధ్యాత్మిక వాతావరణం సన్నగిల్లుతుందనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కుటీర నిర్మాణ పథకం ద్వారా దాతల సహకారంతో కాటేజీలను నిర్మిస్తోంది. ఇందుకోసం దాతలు దేవస్థానంలో కాటేజీ నిర్మించలతలపెడితే ముందుగా దేవస్థానానికి దరఖాస్తు చేసుకుంటారు. సుమారు రూ.15 లక్షల నగదు, లేదా డీడీని అందించాలి. దేవస్థానం 10 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తోంది. ఆ స్థలంలో దాతకు ఇష్టం వచ్చినట్లు కాటేజీ నిర్మాణం చేపడతారు. నిర్మాణం పూర్తయిన తరువాత దాత కాటేజీని దేవస్థానానికి అప్పగించాలి. ఏడాదిలో దాతకు 45 రోజులు ఉచితంగా వసతి కల్పిస్తారు. దాత సిఫార్సు లేఖతో ఎవరైనా వస్తే సగం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా శ్రీశైల దేవస్థానంలో దాతల సహకారంతో సుమారు 35 వరకు కాటేజీలు ఉన్నాయి. ఇంకా నిర్మాణంలో పలు కాటేజీలు ఉన్నా యి. అయితే ఇప్పటి వరకు నిర్మించిన కాటేజీలకు దాతకు సంబంధించిన పేరు లేక వారి బంధువులకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఏరాసు కాటేజీ, గొట్టిపాటి కాటేజీ, జేసీ దివాకర్రెడ్డి కాటేజీ, విజయ, ఇంద్ర నిలయం, అపరాజిత, దేవినేని, ఏ.ఎం.ఆర్, శాంతి, సాహితి, చంద్రశేఖర, రుద్ర, బట్టా సదన్ ఇలా పలు వ్యక్తుల పేర్లతో కాటేజీలు దర్శనమిస్తు న్నాయి. అలాగే క్షేత్రంలో టెండర్ దక్కించుకుని నిర్వహించే ప్రైవేట్ హోటళ్లకు సైతం అపూర్వ, ఐలాపురం, నాయుడు, సహస్ర తదితర పేర్లతో పలు హోటళ్లు సైతం దర్శనమిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో దేవుళ్ల పేర్లు ఉండకుండా వ్యక్తులు పేర్లు ఉండడంపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో తొలగింపు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కాటేజీలకు వ్యక్తుల పేర్లు ఉండగా ఇటీవల తొలగించి దేవుళ్ల పేర్లు ఏర్పాటు చేశారు. టీటీడీని ఆదర్శంగా తీసుకుని శ్రీశైల మహాక్షేత్రంలో కూడా మార్పులు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీగిరిలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంచేందుకు ఈ అంశం దోహదపడనుందని సూచిస్తున్నారు. -
బనగానపల్లె రెవెన్యూ డివిజన్కు పచ్చజెండా
బనగానపల్లె/కోవెలకుంట్ల: రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా ఏర్పాటు కానున్న రెవెన్యూ డివిజన్లలో బనగానపల్లెకు చోటు దక్కింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఇందులో నంద్యాల కొత్త జిల్లాగా అవతరించింది. కొత్త జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, డోన్ రెవెన్యూ డివిజన్లుగా కొనసాగుతున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండ గా ఇప్పటి వరకు సంజామల, కొలిమిగుండ్ల మండలా లు నంద్యాల రెవెన్యూ డివిజన్లో మిగిలిన కోవెలకుంట్ల, అవుకు, బనగానపల్లె మండలాలు డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభు త్వం బనగానపల్లెను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లో బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాలతోపాటు మరికొన్ని మండలాలు చేరుస్తారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేస్తే రెవెన్యూ డివిజన్ పరిధిలోని వచ్చే మండలాల వివరాలు అధికారికంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సరిహద్దులో సంజామల మండలంలోని నొస్సం, అనంతపురం జిల్లా తాడిపత్రి సరిహద్దులో కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామాలు హద్దులుగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 3,12,416 మంది జనా భా ఉండగా ఆయా మండలాల పరిధిలో 2,41,179 మంది ఓటర్లు ఉన్నారు. -
దెబ్బ మీద దెబ్బ
● ఫొటోలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు పబ్బతి జగన్బాబు. గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామానికి చెందిన కౌలు రైతు. ఎకరా రూ.40 వేల కౌలుతో ఐదు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. మరో 5 ఎకరాల్లో ఎకరాకు రూ.20 వేలు కౌలు చెల్లించి జొన్నపంట సాగు చేశాడు. అయితే మిరప పంట సాగు అయిన నెలలోనే భారీ వర్షాలతో పది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మొక్కజొన్న అరకొర దిగుబడి రావడంతో తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని కౌలు రైతులకు అందకపోవడంతో మరింత నష్టపోయాడు. -
అంతన్నారు.. ఇంతన్నారు..
● చిత్రంలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు గడ్డం నరసింహుడు. బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం. 15 ఏళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది భూ యజమానికి ఎకరాకు 18 బస్తాలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే తుపాన్తో పంట దెబ్బతినడం, దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించ లేదు. గత జగనన్న ప్రభుత్వంలో రెండు సార్లు రూ.13,500 రైతు భరోసా కింద సహాయం అందజేసింది. రెండు విడతలుగా పంట నష్ట పరిహారం సైతం రూ.35 వేలు తన ఖాతాలో జమ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో నయాపైసా పడలేదు. ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ద్వారా అందిస్తామన్న చంద్రబాబు హామీ నీటి మూటగా మారింది. -
‘విజయ’ దరహాసం
ఆళ్లగడ్డ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం పులివెందులలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి, విజయసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంహకార సంఘం ఎన్నికల్లో పాల సొసైటీల అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ మద్దతుదారులు ఎస్వీ జగన్మోహన్రెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారిని అభినందించారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజవర్గ పరిస్థితులపై చర్చించారు. -
వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఏకగ్రీవ ఎన్నిక
నంద్యాల(అర్బన్): రుద్రవరం మండలం మాచినేనిపల్లి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార సమితి డైరెక్టర్ల ఎన్నికలో వైఎస్సార్సీపీ మద్దతు దారులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈనెల 24వ తేదీన మాచినేనిపల్లి సహకార సమితి డైరెక్టర్ల పదవులకు నిర్వహించిన ఎన్నికకు ఎస్వీ జగన్మోహన్రెడ్డి, జల్లయ్య మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్లలో ఎటువంటి తప్పిదా లు లేకపోవడం, ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో డైరెక్టర్లుగా ఎస్వీ జగన్మోహన్రెడ్డి, జల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఫారం–7 డిక్లరేషన్ను ప్రతిని సమితి కార్యాలయానికి సిబ్బంది అతికించారు. ఇద్దరు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల పాల ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేశారు. -
ఇస్తామన్నది ఎంత.. ఇచ్చిందెంత..?
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10వేలతోనే సరిపెట్టింది. పంట నష్టపరిహారంలో రైతులను నట్టేట ముంచింది. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. చంద్రబాబు సర్కారు కౌలు రైతులను పూర్తిగా విస్మరించింది. – వంగాల భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కౌలు రైతుల పట్ల కనికరం లేకుండా చంద్రబా బు సర్కార్ ఎన్నికల అవసరాలు తీరాక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తోంది. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి. మోంథా తుపాన్ నష్టపరిహారం కూడా కౌలు రైతులందరికీ వర్తింపజేయాలి. మిగిలిపోయిన కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందించి పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – రామచంద్రుడు, ఏపీ రైతు సంఘం, జిల్లా కార్యదర్శి -
పీజీఆర్ఎస్కు 82 ఫిర్యాదులు
నంద్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఎస్పీ సునీల్షెరాన్ ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 30 లోగా ‘పది’ పరీక్ష ఫీజు చెల్లించాలి నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 30లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్రెడ్డి సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థులు నామినల్ రోల్, సంబంధిత పాఠశాలలో యూడైస్ పరిశీలించాలని సూచించారు. వివరాలకు 9885979920, 9948063324 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. 25 నుంచి ఆర్యూ బీఈడీ సెమిస్టర్ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బీఈడీ రెగ్యులర్ 3,474, సప్లిమెంటరీ 471 మంది, బీపీఈడీ రెగ్యులర్ 145, సప్టిమెంటరీ 21 మంది, ఎంపీఈడీ రెగ్యులర్ 86, సప్టిమెంటరీ 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని విజ్ఙప్తి చేశారు. మంత్రాలయం రూరల్: రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయల్లో భక్తుల భద్రతే తమ లక్ష్యమని ఆక్టోపస్ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఉగ్రవాదులు చొరబడితే వారి నుంచి భక్తులను, ప్రజలను కాపాడుతామన్నారు. శ్రీమఠం ప్రాంగణంలో ఆక్టోపస్ కమాండోలు సోమవారం మాక్డ్రిల్ చేశారు. అనంతరం శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ మట్లాడుతూ.. అత్యవసర ప్రమాదాలు ఏర్పడితే ఆక్టోపస్ బలగాలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు జరగకుండా ఏం చేయాలో వీడియో ద్వారా అధికారులకు చూపించారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ రామాంజులు, కమాండో ఇన్స్పెక్టర్లు ఎంఆర్సీ నాయక్, వరప్రసాద్, రాంమోహన్ , శ్రీమఠం అధికారులు మాదవశెట్టి, వెంకటేష్ జోషి, సురేష్ కోనాపూర్, అనంతపురాణిక్ తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులకు, బధిరులకు, అంధులకు, మానసిక దివ్యాంగులకు ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27న ఉదయం 8 గంటలకు కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించవచ్చన్నారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, వికలత్వ ధృవీకరణ పత్రం(సదరం) తీసుకురావాలన్నారు. వివరాలకు 08518–277864 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
పాలకేంద్రం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం
● టీడీపీకి తప్పని పరాభవం ● భగ్నమైన అధికార పార్టీ నేతల కుట్రలు ● వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవ విజయం ఆళ్లగడ్డ: టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలు పటాపంచలు అయ్యాయి. పాలకేంద్రం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో వైస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తిదారుల పరస్పర సహయక సహకార సంఘ ఎన్నిలక్లో టీడీపీకి భంగపాటు ఎదురయ్యింది. పాల సొసైటీలు అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్వీ జగన్మోహనరెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవంగా విజయం సాధించారు. సోమవారం మాచినేనిపల్లె పాలకేంద్రం ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించేందుకు విజయా డెయిరీ ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. టీడీపీ అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లను ఆపాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులందరినీ మాచినేనిపల్లె చుట్టుపక్కల మోహరింపజేశారు. నామినేషన్ వే సేందుకు వస్తే అడ్డుకోవాలని, అవసరమైతే దాడులు చేసేందుకు కూడా వెనుకా డవద్దని టీడీపీ నేతలు ఆదేశాలు ఇచ్చారు. భారీ ఎత్తున పోలీస్బలగాలు మోహరించడం, పైన డ్రోన్లు తిరిగడంతో టీడీపీ నేతలు కుట్రలు పటాపంచలు అయ్యాయి. పాల సొసైటీలు అధ్యక్షులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్వీ జగన్మోహనరెడ్డి, జెల్లయ్య ఏకగ్రీవం అయ్యారు. మాచినేనిపల్లెతో పాటు జిల్లాలోని 21 సంఘాల అధ్యక్షుల నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా ఇందులో డబ్ల్యు గోవిందిన్నె, డబ్యు కొత్తపల్లె, గుండుపాపల, బోయలకుంట్లమెట్ట, గాంధీనగర్ అనే ఐదు సంఘాల నామినేషన్లు వాయిదా పడ్డాయి. -
17 క్వింటాళ్లు అమ్ముకోలేని పరిస్థితి
గత ఏడాది 3 ఎకరాల సొంత పొలంలో శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేల వరకు వెచ్చించాను. వాతావరణం అనుకూలించక మూడు ఎకరాలకు సంబంధించి 17 క్వింటాళ్ల దిగబడులు వచ్చాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక దిగుబడులను గోదాములో భధ్రపరుచుకుని ధర కోసం ఎదురు చూస్తున్నాను. – లక్ష్మినారాయణ, రైతు, కలుగొట్ల, కోవెలకుంట్ల మండలం గత ఏడాది మూడు ఎకరాల సొంత పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ సాగు చేశాను. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు నాలుగు బస్తాల దిగబడులే వచ్చాయి. మార్కెట్లో ధర లేకపోవడంతో ఇప్పటి వరకు దిగుబడులు గోదాములోనే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో శనగ సాగు చేయగా మోంథా తుఫాన్ ప్రభావంతో విత్తనం కొట్టుకపోయింది. ఆ స్థానంలో ఇటీవల రెండవసారి విత్తనం వేయాల్సి వచ్చింది. శనగకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. – వెంకటేశ్వర్లు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారిఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. రీఓపెన్ అయిన 479 అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, నాణ్యంగా ఉండాలన్నారు. పీజీఆర్ఎస్ 220 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల్లో కొన్ని. ● తనకు ప్రస్తుతం రూ.6వేలు పెన్షన్ వస్తోందని, తాను దివ్యాంగుడనని, మంచానికే పరిమితమై ఉన్నానని, రూ.15వేల పింఛన్ ఇవ్వాలని బేతంచెర్ల మండలానికి చెందిన రమేష్ వినతి పత్రం అందజేశారు. ● తన పొలం ఆక్రమణకు గురైందని, సర్వే చేసి న్యాయం చేయాలని ప్యాపిలి మండలం కలచర్ల గ్రామానికి చెందిన చిరంజీవి అర్జీ ఇచ్చారు. ● తనకున్న ఐదు ఎకరాల భూమిని ఆన్న్లైన్న్లో నమోదు చేయాలని పాములపాడు మండలం గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి కోరారు. -
మహానందిలో వసతిగృహాల నిర్మాణానికి రూ.1.25కోట్లు
● ఒప్పంద పత్రం ఇచ్చిన ప్రవాస భారతీయురాలు మహానంది: మహానంది దేవస్థానం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించనున్న వసతి గహాల నిర్మాణానికి హైదరాబాద్లో ఉంటున్న ప్రవాస భారతీయురాలు వడ్లమూడి సరోజిని రూ.1.25 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని వారి స్వగహంలో కలిసి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. సరోజిని భర్త కీర్తిశేషులు వడ్లమూడి రమేష్ బాబు పేరుతో విరాళం అందించేందుకు ఒప్పంద పత్రాన్ని ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ఆలయ ఏఈఓ ఎరమల మధు, జగదీశ్వర రెడ్డి, వేద పండితులు హనుమంత శర్మ, అర్చకులు రఘు శర్మ పాల్గొన్నారు. తెలుగు వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ( చరిత్ర, పురావస్తు శాస్త్రం) ప్రథమ సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పీఠాధిపతి ముసుగు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి చరిత్ర పురావస్తు శాఖలో ఐదు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 29లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు జతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరై ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9441370591 ద్వారా తెలుసుకోవాలన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించండి
● ‘రైతన్నా..మీకోసం’లో ఏఓను నిలదీసిన రైతులుజూపాడుబంగ్లా: మీరేమి చెప్పినా ప్రయోజనం లేదు సార్.. తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని రైతులు ఏఓ కృష్ణారెడ్డిని నిలదీశారు. చంద్రబాబు సర్కార్ సోమవారం నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏఓ కృష్ణారెడ్డి మండలంలోని తర్తూరు, మండ్లెం, తంగడంచ, తాటిపాడు, 80బన్నూరు గ్రామాల్లో ఆయా గ్రామసచివాలయాల సిబ్బందితో రైతులను కలిశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకొని చంద్రబాబు సర్కార్ వచ్చాక రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఖరీఫ్ పంటలు వేసినప్పటి నుంచి అధికవర్షాలు కురిసి పంటలు నష్టపోయినా పైసా నష్టపరిహారం మంజూరుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాల్లేవన్నారు. వ్యాపారులు కుమ్మకై ్క క్వింటాకు కేవలం రూ.1,700 చొప్పున కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. అధికవర్షాలతో దిగుబడులు తగ్గగా గిట్టుబాటు ధరలేక పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు అధికారులను నిలదీశారు. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అధికారులు పాంప్లెట్లు పంపిణీ చేసి వెనుతిరగడం గమనార్హం. అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది. -
గౌరవం లేదు.. వేతనం రాదు!
నందికొట్కూరు: ప్రజల ఓట్లతో గెలిచిన మండల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించడం లేదు. గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై వారికి సమాచారం ఇవ్వకుండా టీ డీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 815 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మరో రెండు, మూడు నెల్లో వారి కాలపరిమితి పూర్తి అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలకు రూ. 3 వేలు గౌరవ వేతనం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో రూ, 41,56,5000 వేతనం రావాల్సి ఉంది. ఇదీ దుస్థితి.. ● ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి మందగించింది. ● గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం జిల్లా పరిషత్కు కేటాయించేవారు. వీటితోనే గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపీటీసీ సభ్యులు చేసేవారు. ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ● చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రెండుసార్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎంపీటీసీల గౌరవవేతనాల బిల్లులు పెడుతున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప, వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మండల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎంపీటీసీ సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ప్రతి నెలా గౌరవం వేతనం ఇవ్వడం లేదు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదు. – బాలరాజు, నందికుంట ఎంపీటీసీ చంద్రబాబు ప్రభుత్వం ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ఇప్పటి వరకు ఒక పైసా నిధులు ఇవ్వలేదు. వేతనాలు రావడం లేదు. పేరుకే ఎంపీటీసీలుగా ఉన్నాం. – వై. నాగేశ్వరరెడ్డి, చింతపల్లి ఎంపీటీసీ గత ప్రభుత్వంలో ఎంపీటీసీలకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇంత వరకు రాలేదు. ప్రతి నెలా ఎంపీటీసీల వేతనాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. – దశరథరామయ్య, మిడుతూరు ఎంపీడీఓ ఎంపీటీసీల సభ్యులకు గుర్తింపు కరువు ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నేతలకే ప్రాధాన్యత చంద్రబాబు ప్రభుత్వంలో అందని గౌరవ వేతనాలు -
కేసీ కింద రబీ లేనట్టే!
● కాల్వలో తగ్గిన నీటి సరఫరా జూపాడుబంగ్లా: కేసీ కాల్వ కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కాలువకు సాగునీటి సరఫరా తగ్గింది. సుంకేసుల జలాశయం నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. లాకిన్స్లా వరకు 864 క్యూసెక్కుల నీరు వస్తోంది.అందులో నిప్పులవాగుకు 578, తూడిచెర్ల సబ్చానల్కాల్వకు 256, ఏబీఆర్ కాల్వకు 30 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. కేసీ కాల్వ కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేస్తామని ఇప్పటి వరకు అధికారులు ప్రకటించలేదు. ఈ విషయంపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా కేసీ కాల్వ ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీరు సరఫరా చేసే అవకాశాల్లేవనే సంకేతాలు కనిపిస్తున్నారు. ఈ విషయమై రైతులు అప్రమత్తం కాకపోతే రబీపంటలు సాగుచేసి తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. -
వెండి కిరీటం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలోని బయలు వీరభద్రస్వామివారికి అలంకరింప జేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను శ్రీశైలంకు చెందిన ఎం.సుబ్రమణ్యం విరాళంగా సమర్పించారు. ఇవి 1.230 కేజీల బరువు ఉన్నట్లు దాత తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, పర్యవేక్షకులు రవి, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం దాతను స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించారు. -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పా హారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. నేరాలకు స్వస్తి పలకండి ● ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ఎక్కడ రాజీ పడేది లేదని, నేరాలకు స్వస్తి పలకకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్పీ సూచనల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. కుటుంబాల భవిష్యత్తు, సమాజంలో మంచిపేరు తెచ్చుకొని మార్పు చెందాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 24న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీలో విజిలెన్స్ అధికారుల దాడులు నంద్యాల(వ్యవసాయం): నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆదివారం విజయవాడ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు అకౌంట్స్ సెక్షన్లో తనిఖీలు నిర్వహించారు. వివరాల మేరకు అకౌంట్స్ సెక్షన్లో పని చేసే సిబ్బంది ఆర్టీసీ ఆదాయాన్ని తన అకౌంట్లోకి మార్చుకొని తిరిగి పది రోజుల్లో అకౌంట్లో జమ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ నివేదికను విజిలెన్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కర్నూలు(అర్బన్): శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం విషయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు తీర్మానం గిరిజనులను విడదీసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు తీర్మానం చెంచులకు న్యాయం చేస్తూనే, గిరిజన లంబాడీలకు తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. ఆది వారం స్థానిక ఎల్హెచ్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు నెలలో ఒక సారి శివ లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. అయితే కేవలం చెంచులకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తూ లంబాడీలను విస్మరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బోర్డు కమిటీ సభ్యులు మరో సారి సమావేశం నిర్వహించి నెలలో ఒక సారి గిరిజన లంబాడీలు కూడా స్పర్శ దర్శనం చేసుకునే విధంగా తీర్మాణం చేయాలని కోరారు. -
సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఆదివారం స్థానిక సంజీవనగర్లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు హాజరై భగవాన్ సత్యసాయికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. బాబా బోధనలు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలకు చేరాయంటే, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్య, వైద్యం రంగాల్లో సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సత్యసాయి సీపీడబ్ల్యూ పథకాలు అమలు చేయడం ద్వారా బాబా సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. సేవా తత్పరత ప్రజలందరిలో పెరిగి సమాజం పట్ల బాధ్యతతో సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి శత జయంతి సందర్భంగా ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లు, ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. -
ఆడబిడ్డల కోసం మహాశక్తి పథకాన్ని తీసుకువస్తాం. వారి జీవితాలను మార్చేందుకు ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేస్తాం. ఇది వరకు జనాభా నియంత్రణ కోసం ఒకరిద్దరితో సరిపుచ్చుకోమని చెప్పా. ఇప్పుడు చెబుతున్నా. మీకు ఓపిక ఉంటే ముగ్గురు, నలుగురు ఆడబిడ్డలను కనండి. ఒక్కొక్కరికి నెలక
కర్నూలు(అగ్రికల్చర్): మహిళా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 ప్రకారం ఐదేళ్లు చెల్లించింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్నే ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నెలకు రూ.1,500 ప్రకారం ఏడాదికి రూ.18,000 చెల్లిస్తామని ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఆరు లక్షల కుటుంబాలను మినహాయించినా తొమ్మిది లక్షల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన మహిళలు ఇద్దరు వరకు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 18 లక్షల మంది మహిళలు ఆడబిడ్డనిధి పథకానికి అర్హులవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర్ర అయినప్పటికీ ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మహిళల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అప్పల ఊబిలో పొదుపు మహిళలు స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని పక్కన పెట్టడంతో పొదుపు మహిళలపై వడ్డీభారం పడుతోంది. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం వల్లనే మహిళలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందారు. 2024–25 సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 35 వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2500 కోట్ల వరకు లింకేజీ రుణాలు ఇచ్చారు. 2025–26లో ఇప్పటికే రూ.1500 కోట్ల వరకు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు పొందారు. సంఘాలకు బ్యాంకులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణాలు పొందుతున్నారు. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది. లింకేజీ రుణాలపై మహిళలు 15 శాతం వరకు వడ్డీ భరిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి.... ఆచరణలో జరుగుతున్నది మరొకటి కావడంతో మహిళల ఆందోళన అంతా ఇంతా కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు వంటి కార్యక్రమాలను ఐదేళ్లు నిర్విగ్నంగా చేపట్టింది. ప్రస్తుతం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడం, వడ్డీ భారం పడుతుండటంతో పొదుపు సంఘాల నుంచి బయటికి వచ్చేందుకు మహిళలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి ..అధోగతి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమన్లెడ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కేవలం కాగితాల మీదనే కనిపిస్తోంది. 2024–25లో 5750 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. మహిళలు 2024–25 ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకున్న యూనిట్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రౌండింగ్ చేశారు. మహిళల అభ్యున్నతికి ఇతోధికంగా తోడ్పడే సోలార్ డ్రైయర్లకు మంగళం పలికారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుదేలయ్యాయి. మహిళల కోసం కేంద్రం లక్పతి దీదీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదు.మహిళా సంక్షేమానికి ‘చంద్ర’ గ్రహణం అమలుకాని ‘ఆడబిడ్డ నిధి’ దిక్కేలేని సున్నా వడ్డీ రుణాలు చంద్రన్న బీమాకు మంగళం కాగితాలపైనే ‘లక్పతీ దీదీ’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు -
మహిళలు మోసపోయారు
చంద్రబాబు ప్రభుత్వంలో సున్నా వడ్డీ జాడలేదు. పొదుపు మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న తోడు, కళ్యాణమస్తు వంటి పథకాలు అమలు అయ్యాయి. నేడు మహిళలకు ఒక్క పథకం అమలు కావడం లేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వస్తే పొదుపు మహిళలే అవసరం అవుతున్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయామని మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. – పి లక్ష్మీదేవి, మాజీ అధ్యక్షురాలు, ఉమ్మడి జిల్లా మహిళా సమాఖ్య -
బతికున్న వ్యక్తి చనిపోయినట్లు సృష్టించి..
● ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ఆదోని అర్బన్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, ఫోర్జరీ సంతకంతో రూ.కోటిన్నర విలువ చేసే బిల్డింగ్ను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు విఠల్రావు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని కంచగారి వీధిలో తన జేజినాయన హనుమంతరావు ఉండేవారని చెప్పారు. తన తమ్ముడు శ్రీనాథ్ మృతి చెందరాని, అయితే బతికి ఉన్న తన పేరు మీద డెత్ సర్టిఫికెట్ను తీసుకున్నారన్నారు. అంతేగాకుండా తన భార్య సునీతభాయి ఆధార్కార్డులో వేరే మహిళ ఫొటో వచ్చేటట్లు చేసుకున్నారన్నారు. అక్టోబర్ 22న అదే మహిళతో ఫోర్జరీ సంతకాలు చేయించి అక్రమంగాభవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. అక్టోబర్ నెలలో 31న బైచిగేరి గ్రామానికి చెందిన నీలాసింగ్కు అమ్మేశారన్నారు. ఆ బిల్డింగ్లో అద్దెకు ఉన్న వ్యక్తి చూసి సమాచారం అందించడంతో హైదరాబాద్ నుంచి తాను వచ్చానన్నారు. మున్సిపల్, త్రీటౌన్ పోలీస్స్టేషన్, రిజిస్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలించకపోవడంతో ఈనెల 3న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇప్పటికై నా ఆస్తిని కాపాడాలని కోరారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తుపాన్తో పంటలకు నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించారు. పాణ్యంలో ఆదివారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తుపాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే తప్పుడు లెక్కలు చూపారని విమర్శించారు. ఖరీఫ్లో పండించిన వరికి గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. బస్తా ధర రూ.1400 మాత్రమే ఉందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదన్నారు. అరటి గెలలను రోడ్డున పడేస్తున్న దుస్థితి చూస్తున్నామన్నారు. యురియా మొదలుకొని ఇప్పటి వరకు అన్నదాతలకు పెట్టిన కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో త్వరలో తెలిసివస్తుందన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, వడ్డుగండ్ల రాముడు, బొజ్జన్న, జిల్లా వైఎస్సార్సీపీ ట్రేడ్ అధ్యక్షుడు చాంద్బాషా, బాబి, రైతులు పాల్గొన్నారు. -
సాక్షి స్పెల్బీ, మ్యాథ్స్బీకి విశేష స్పందన
నేను మ్యాథ్స్బీ పరీక్షకు హాజరయ్యాను. గణితమంటే నాలో చాలా భయం ఉండేది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు. ఇది నా భవిష్యత్తుకు మంచి పునాది. – ప్రతీక్, 8వ తరగతి,కర్నూలు స్పెల్బీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంగ్లిష్లో కష్టమైన పదాలకు అర్థాలు తెలిశాయి. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇలాంటి పరీక్షలు రాయించడం ద్వారా వారిలోని భయాన్ని తొలగించవచ్చు. – జయకృష్ణ, టీచర్ నాకు స్పెల్లింగులు రాయడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. వాటిని పలికే విధానంపై గందరగోళం ఉండేది. నేను స్పెల్బీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లిషు అంటే భయం పోయింది. –జె.అనిసపర్హిన్, ఏడో తరగతి బనగానపల్లె నేను ఇంగ్లిషులో మంచి పట్టు సాధించేందుకు స్పెల్బీ ఉపయుక్తంగా ఉంది. ఎన్నో నేర్చుకున్నా. భవిష్యత్తులో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత పెరిగింది. – సమన్విత, ఏడో తరగతి, కర్నూలు నేను ముందుగా సాక్షికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను మ్యాథ్స్ బీ పరీక్షకు హాజరయ్యాను. మూడో దశకు వెళ్తానన్న నమ్మకం ఉంది. – యశస్వి, 8వ తరగతి, కర్నూలు కర్నూలు(సెంట్రల్): సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ, మ్యాథ్స్బీ పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు నగరంలోని రవీంద్ర విద్యానికేతన్లో ఆదివారం నిర్వహించిన సెమీఫైనల్ పరీక్షలకు 121 మంది విద్యార్థులు హాజరయ్యారు. మ్యాథ్స్బీతో కష్టమైన సమస్యలను సులభంగా..వేగంగా..కచ్చితత్వంతో సాధించేందుకు ఎంతో ఉపయుక్తమైనట్లు విద్యార్థులు తెలిపారు. స్పెల్బీతో ఇంగ్లిషులో కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు నేర్చుకున్నారు. ఈ పరీక్షలు తమ భవిష్యత్కు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఉన్నత తరగతుల్లో రాణించేందుకు ఉపయోగ పడతాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు విభాగాలుగా నైపుణ్య పరీక్షలు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్బీ, మ్యాథ్స్బీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలకు వందలాదిగా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ నేపథ్యాలు ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని నైపుణ్యాలను బట్టి రెండో దశకు ఎంపిక చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిషులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మ్యాథ్స్లో పట్టు సాధించాలని సాక్షి స్పెల్బీ, మ్యాథ్స్బీ పరీక్షలను నిర్వహిస్తోంది. 1,2 తరగతుల విద్యార్థులను ఒక్క గ్రూపుగా, 3, 4, 5 తరగతులను విద్యార్థులను రెండో గ్రూపుగా, 6,7 తరగతుల విద్యార్థులను మూడో గ్రూపుగా, 8, 9, 10వ తరగతుల విద్యార్థులను నాలుగో గ్రూపు వర్గీకరించి పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశలో ఎంపికై న విద్యార్థులకు రీజినల్ స్థాయిలో, అందులో ఎంపికై న విద్యార్థులకు ఫైనల్ స్థాయిలో పోటీ పరీక్షలు ఉంటాయి. ఆదివారం జరిగిన రెండో దశ పరీక్షలకు స్పెల్బీ నుంచి 87, మ్యాథ్స్బీ నుంచి 34 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండో దశ పోటీలకు 121 మంది విద్యార్థుల హాజరు నాలుగు విభాగాలుగా విద్యార్థులను వర్గీకరించి పరీక్షలు ఎంతో ఉపయోగమని సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు -
నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల నిశ్చితార్థం
ఆస్పరి: రాష్ట్రంలో పిడకల (నుగ్గులాట) సమరం అంటేనే టక్కన గుర్తుకొచ్చేది ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామం. ఆ నుగ్గుల సమరానికి కారణమైన (భక్తులు ప్రేమికులుగా భావిస్తున్న) వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లికి పెద్దల సమక్షంలో సోమవారం నిశ్చితార్థం జరుగనుంది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. పెద్దలు అంగీకారం మేరకు ఏటా కార్తీక మాసం ముగిసిన తరువాత మొదటగా వచ్చే సోమవారం స్వామి, అమ్మవార్ల నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం దాదాపు నాలుగు ఐదు నెలల తర్వాత ఉగాది పర్వదినం రోజు పిడకల సమరం తరువాత స్వామి అమ్మవార్ల పెళ్లిని ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో సోమవారం జరిగే కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి హాజరు కానున్నన్నారు. -
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల బహూకరణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శనివారం శ్రీశైం, కొత్తపేటకు చెందిన సుద్దాల మహేష్ ఒక వెండి పళ్లెం, వెండి గిన్నె విరాళంగా సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగాణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. రెండు వెండి వస్తువుల బరువు 727 గ్రాములు ఉంటుందని దాత తెలిపారు. అనంతరం దాతకు రసీదును అందజేసి, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. భక్తుల రద్దీ బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారు వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మార్గశిర మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. విద్యార్థి ఫెయిల్ అయితే ఉపాధ్యాయులదే బాధ్యత కొత్తపల్లి: పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులదే బాధ్యత అని జిల్లా విద్యాధికారి పి.జనార్దన్ రెడ్డి అన్నారు. సులభ రీతిలో విద్యను బోధించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. శివపురం గూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి, వ్యక్తిగత శుభ్రత లేకపోవడంతో ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేసి చిన్నారులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు. తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా నంద్యాల: తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు సంబంధించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎం మిషీన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేసేలా చూడాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు సాయిరాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
డెయిరీని అభివృద్ధి చేయడమే తప్పా
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘నేను చైర్మన్ అయ్యే నాటికి డెయిరీ రూ.50లక్షల లాభాల్లో మాత్రమే. ఆ తర్వాత ఏడాదికి రూ.15కోట్ల లాభాలను తీసుకొచ్చాం. పాల ఉత్పత్తిదారులకు రూ.18 కోట్లు, ఉద్యోగులకు రూ.3 కోట్ల ప్రకారం రూ.21 కోట్లు బోనస్లు ఇచ్చాం. టర్నోవర్ రూ.180 కోట్ల నుంచి రూ.360 కోట్లకు తీసుకెళ్లాం. డెయిరీని అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా..’’ అని కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నించారు. శనివారం ఆయన కర్నూలులోని విజయ డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను చైర్మన్ అయ్యాక అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కరి నుంచైన డబ్బు తీసుకున్నట్లు చేతనైతే నిరూపించాలన్నారు. కర్నూలు మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) ఆస్తుల్లో ఒక్క సెంటు భూమి/స్థలాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు నిరూపిస్తే తన యావదాస్తి భూమా అఖిలప్రియ కుటుంబానికి స్వాధీనం చేస్తానన్నారు. మంత్రి లోకేష్కు తప్పుడు ఫిర్యాదులు చేసి.. శాసనసభలో తనపైన, డెయిరీపైనా అసత్యాలు చెప్పి పరువు పోగొట్టుకున్నారన్నారు. 2015లో జగత్ డెయిరీని ఏర్పాటు చేసి నడుపలేక 2020లోనే మూతవేశారన్నారు. అలాంటి మీరు కర్నూలు మిల్క్ యూనియన్ను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తమ్ముడు జగత్ విఖ్యాత్రెడ్డి చైర్మన్ పదవికే అనర్హుడని ఎస్వీ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన, ఎమ్మెల్యే కర్నూలు మిల్క్ యూనియన్కు రూ.1.30 కోట్ల బకాయి పడ్డారని, 2020 నుంచి ఈ బకాయి ఎంత మొత్తానికి చేరుకొని ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని నేరాలు, ఘోరాలు, అవినీతి మయం చేశారని.. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా అఖిలప్రియ పరిస్థితి ఉందన్నారు. నా మీద ఇప్పటికే పలు కేసులు పెట్టించారని.. కానీ ఉద్యోగులను కేసుల పేరిట వేధించడం మంచిది కాదన్నారు. మీ స్వార్థం కోసం డెయిరీని దెబ్బతీయవద్దని హితవు చెప్పారు. డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫెడరేషన్ ద్వారా ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నా ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ఇంకా ఎన్ని దర్యాప్తులకై నా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. యావదాస్తి మీకు స్వాధీనం చేస్తా లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? ముందు డెయిరీకి బకాయి పడిన రూ.1.30 కోట్లు చెల్లించండి ఎమ్మెల్యే అఖిలప్రియపై కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ధ్వజం -
పెండింగ్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు
ఆలూరు: కరువు, కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు అనేక హమీలను ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు వాటి జోలికే వెళ్లడం లేదన్నారు. ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు కాగా కేవలం రూ.30 వేల కోట్లతో గురురాఘవేంద్ర, ఆర్డీఎస్, వేదావతి, గుండ్రేవులు సహా అనేక ప్రాజెక్టు పనుల్లో కదలిక వస్తుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో రైతులు పండించిన ఉల్లి, పత్తి, మామిడి పంటలకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరను కూడా కల్పించలేకపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. కృష్ణా బేసిన్లోని నీటిని దిగువ రాష్ట్రాలకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాంను నింపుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికై నా భావి తరాలకు ఉపయోగపడేలా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే సీమ ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ క్షమించరన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
నంద్యాల: అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, సీడీపీఓ, సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు తాజా కాయగూరలతో పాటు వారి వయస్సును బట్టి విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. టీనేజ్ గర్భాలకు సంబంధించి బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డలో ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు అనే వివరాలను సోమవారం అందజేయాలని, ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గుండెల్లో ‘పైపులైన్’ గుబులు
ఓర్వకల్లు: పచ్చని పంటపొలాల మధ్య నిర్మించతలపెట్టిన పైపులైన్ నిర్మాణం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పూడిచెర్ల నాగుల చెరువు వద్ద పైపులైన్ నిర్మాణాన్ని రైతులు అడ్డుకున్నారు. ఓర్వకల్లు ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. ఈ పైప్లైన్ నుంచి వచ్చే రెండు టీఎంసీల నీటిని మీదివేముల సమీపాన జలాశయం నిర్మించనున్నారు. పైపులైన్ నిర్మాణం కోసం 54.74 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం గార్గేయపురం భూములకు ఎకరా రూ.12.50 లక్షలు, కేతవరం భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, పూడిచెర్ల భూములకు ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున ధరలు నిర్ణయించారు. గార్గేయపురం–కేతవరం మధ్య ఉన్న హంద్రీ–నీవా కాలువ నుంచి నీటిని కేతవరం, పూడిచెర్ల మీదుగా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు వద్ద నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ వరకు పైపులైన్ ద్వారా ప్రవహించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆమేరకు పైపులైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు సజావుగా జరిగాయి. వివాదం ఇలా.. పైపులైన్ నిర్మాణం పూడిచెర్ల వద్దకు రాగానే వివాదాస్పదం అయ్యింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా కేతవరం దగ్గర 1.30 ఎకరాలు, పూడిచెర్ల వద్ద 22 సెంట్లు, గార్గేయపురం వద్ద 1.50 ఎకరాల చొప్పున ప్రైవేట్ భూములు తీసుకున్నారు. ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బాధిత రైతులకు పరిహారం చెల్లించారు. అయితే పూడిచెర్ల వద్ద గల నాగుల చెరువు కట్ట మలుపు నుంచి ఊరుబయట పొలాల మధ్య పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించడం వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి పూడిచెర్ల గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండ పైభాగం నుంచి పైపులైన్ తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించివున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు 3.50 ఎకరాల మేర పొలాల భూములు ఇవ్వాల్సిందిగా రైతులను కోరారు. అయితే స్థానిక రైతుల్లో ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో అధికారులు చేసేదేమీలేక వెనుతిరిగి వెళ్లారు. పట్టా భూముల్లో పైపులైన్ నిర్మించేందుకు ససేమిరా పూడిచెర్ల పంట పొలాల్లో వివాదాస్పద నిర్మాణం కాంట్రాక్టర్కు ప్రయోజనమంటూ అడ్డగించిన రైతులు -
ఈ బస్సులకు ఏమైంది?
హొళగుంద: ఏ సమయంలో ఎక్కడ నిలబడి పోతాయో తెలియని డొక్కు బస్సులను ఆర్టీసీ అధికారులు హొళగుంద మండలానికి తిప్పుతున్నారు. శనివారం మార్లమడికి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్టీసి బస్సు స్థానిక ఎల్లెల్సీ(తుంగభద్ర దిగువ కాలువ) వద్ద ఏయిర్ లాక్ కావడంతో నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ బస్సును ముందుకు నడిపేందుకు తీవ్రంగా ప్రయత్నించి వీలు కాక హొళగుందలోనే నిలిపేశాడు. అసలే మండలానికి అరకొరగా తిరిగే బస్సుల్లో ఆదోని డిపో అధికారులు పూర్తి కండిషన్ లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. బస్సులు కాలం చెల్లి, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతూ గ్రామాలకు కచ్చితంగా చేరుతామనే నమ్మకం కూడా లేదు. ఇటీవల కాలంలో బస్సులు మరమ్మతులకు గురై ఎక్కడబడితే ఆగిపోతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు గంటల పాటు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక విద్యార్థులు పాఠశాల నుంచి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. తరచూ ఈ సమస్యలు తలెత్తినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి మండలానికి కండిషన్లో ఉన్న బస్సులను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. -
తక్కువ పెట్టుబడితో ఉత్పాదకత పెంచుకోవాలి
● జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మికర్నూలు(అగ్రికల్చర్): తక్కువ పెట్టుబడితో ఉత్పాదకత పెంచుకుని అధిక నికరాదాయం పొందుతూ వ్యవసాయంలో రాణించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీల్ వరలక్ష్మి అన్నారు. శనివారం కర్నూలులోని ఉద్యానభవన్లో కర్నూలు డివిజన్ లోని రైతులు, వ్యవసాయ అధికారులు, వీఏఏలు, ఏఈవోలతో శాస్త్రవేత్తలకు కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. రసాయన ఎరువులు అడ్డుగోలుగా వాడవద్దని, భూసార పరీక్ష ఫలితాలకు లోబడి మాత్రమే వినియోగించాలని సూచించారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, శనగ, జొన్న, ఖరీఫ్ సీజన్కు సంబంధించి కంది తదితర పంటల్లో చీడపీడల నియంత్రణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను వివరించారు. ఆత్మ పీడీ శ్రీలత మాట్లాడుతూ... ఆత్మ కార్యక్రమం ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమన్వయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, నంద్యాల ఆర్ఏఆర్ఎస్, బనవాసి కేవీకే శాస్త్రవేత్తలు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు, గూడూ రు, ఓర్వకల్, సీ.బెళగల్ మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
చాగలమర్రి: మండలంలోని మూడురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 10 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.అంబాపురం శ్రీఅభయాంజనేయస్వామి విగ్రహ ప్రథమ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆర్గనైజర్ పూలి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో మద్దిరాళ్ల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి వృషభాలు నిలువగా రూ.50 వేలు బహుమతి, రెండవ స్థానంలో రాయవరం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి వృషభాలు నిలువగా రూ.40వేలు బహుమతి, మూడవ స్థానంలో చర్లోపల్లె గ్రామానికి చెందిన చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు నిలువగా రూ.30 వేలు, నాలుగో స్థానంలో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన విజయకుమార్రెడ్డి ఎడ్లు నిలువగా రూ.20వేలు, ఐదవ స్థానంలో రాచమల్లు అనిల్ కుమార్రెడ్డి ఎడ్లు నిలువగా రూ.10 వేలు అందజేశారు. అలాగే 6, 7, 8, 9 స్థానా ల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 5 వేలు, రూ. 4 వేలు అందజేశారు. వ్యాఖ్యాతగా సదా శివారెడ్డి వ్యవహరించారు. -
జిల్లాలో వరి సాగు వివరాలు
వరి రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగిలాయి. గత ఏడాది ఖరీఫ్సీజన్లో చవి చూసిన నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు వరిసాగు చేస్తే తీవ్ర నిరాశే మిగిలింది. పంట చేతికి వచ్చిన సమయంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా రైతన్నలు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. కోవెలకుంట్ల: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విస్తారంగా వరిసాగైంది. 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా 65,255 హెక్టార్లలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 73,038 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల, షుగర్లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేశారు. ఇందులో బండి ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,588 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 6,868, శిరివెళ్ల మండలంలో 6,215, నంద్యాల మండలంలో 5,602, గోస్పాడు మండలంలో 4,950, అవుకు మండలంలో 4,447, పాణ్యం మండలంలో 4,320, వెలుగోడు మండలంలో 4,234 బనగానపల్లె మండలంలో 3,676, మహానంది మండలంలో 3,444 హెక్టార్లలో వరి సాగైంది. పైరు వివిధ దశలతోపాటు గత నెలలో కురిసిన భారీ వర్షాలు, మోంథా తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు ఈ ఏడాది జిల్లాలో వరి సాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. గతేడాది నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు కర్నూలు, నంద్యాల సోనా రకాలకు చెందిన వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. నార, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, వరి కోత, నూర్పిడితో కలిపి ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో భారీ వర్షాలకు తోడు మోంథా తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజతాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి నేలవాలడంతో కోత, నూర్పిడి ఆలస్యమవుతుంది. యంత్రాలకు బాడుగ రూపంలో అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు దిగుబడులు తగ్గగా మరోవైపు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా 2,200 వరకు ధర పలికింది. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరకు విక్రయిస్తే కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.నియోజకవర్గం సాధారణ సాగు విస్తీర్ణం విస్తీర్ణం (హెక్టార్లలో) శ్రీశైలం 19,126 20,849 ఆళ్లగడ్డ 17,512 19,210 బనగానపల్లె 11,021 12,194 నంద్యాల 8,898 10,552 నందికొట్కూరు 3,068 4,158 డోన్ 427 255 పాణ్యం, గడివేముల 5,203 5,820 జిల్లాలో 73 వేల హెక్టార్లలో సాగైన వరి ఎకరాకు రూ. 35 వేలు పెట్టుబడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు గతేడాదీ ఇదే పరిస్థితి మార్కెట్లో మద్దతు ధర అంతంత మాత్రమే నష్టాల ఊబిలో అన్నదాతలు -
వచ్చేనెల 13న మెగా జాతీయ లోక్ అదాలత్
నంద్యాల(వ్యవసాయం): మెగా లోక్ అదాలత్ను డిసెంబర్ 13న నిర్వహించనున్నారని, విజయవంతం చేయాలని న్యాయవాదులకు మూడో అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, కంపెనీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులు లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
రూ. 20 లక్షలతో ఉడాయించిన రికవరీ ఏజెంట్లు
● న్యాయం చేయాలని కోటక్ బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన నంద్యాల: రుణాల రికవరీ ఏజెంట్లు పని చేసే ముగ్గురు వ్యక్తులు రైతులను నట్టేట ముంచేశాడు. రైతులు బ్యాంక్కు చెల్లించిన కంతులను వసూలు చేసుకుని ఉడాయించారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం మహానంది, నంద్యాల, ఆళ్లగడ్డ, గోస్పాడు, బండిఆత్మకూరు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది రైతులు పట్టణంలోని శ్రీనివాసనగర్లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు నుంచి దాదాపు రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కో కంతుకు రూ.75 వేల చొప్పున ఆరు కంతుల్లో చెల్లించేలా బ్యాంకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంకు అధికారులు ఉదయ్కుమార్, అస్లాం, అనిల్లను రికవరీ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు రైతుల నుంచి కంతులు వసూళ్లు చేసి దాదాపు రూ. 20 లక్షలు బ్యాంకులో జమ చేయకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కంతులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపారు. లోన్లు చెల్లిస్తున్నా నోటీసు లు ఎందుకు పంపారంటూ రైతులు శుక్రవారం బ్యాంకు మేనేజర్ను సంప్రదించారు. తీవ్ర ఒత్తిడిలు తెస్తూ తమవద్ద నుంచి రికవరీ ఏజెంట్లు లోన్ డబ్బులు కట్టించుకున్నారంటూ రైతులు మేనేజర్కు వివరించారు. అంతకు మునుపు సంబంధిత రికవరీ ఏజెంట్లను రైతులు ఫోన్ల ద్వారా సంప్రదించగా స్పందన లేకుండా పోయింది. రికవరీ ఏజెంట్లు థర్డ్ పార్టీ కాబట్టి వారితో సంబంధం లేదన్నారు. తీసుకున్నా లోన్ మొత్తాన్ని రైతులే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకు షెట్టర్ మూసి నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పల్లెలు తూలుతున్నాయ్ !
బేతంచెర్ల/పాములపాడు: చంద్రబాబు సర్కారు మద్యం బాబులకు తాగినోళ్ల తాగినంత.. అన్నట్లుగా మద్యాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతోంది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అర్ధరాత్రి తర్వాత మద్యం విక్రయాలు కనిపించకపోయినా పక్కనే ఉన్న పల్లెల్లో మాత్రం గ్లాసులు గలగలమంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలకు అధికారుల గ్రీన్ సిగ్నల్తో పగలు, రాత్రి తేడా లేకుండా దర్జాగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో యువత మత్తుకు బానిసై చిత్తువుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలకు సైతం మద్యం దుకాణాలు రావడంతో మందు బాబులు పట్టపగలే పీకలదాగా తాగి రహదారులపై పడిపోతున్నారు. బేతంచెర్ల మండలంలో గతంలో పట్టణంలో నాలుగు, ఒక బార్, ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో రెండు మద్యం దుకాణాలు ఉండేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నూతనంగా సీతారామాపురం, సిమెంట్ నగర్ గ్రామాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. గతంలో పట్టణాలకే పరిమితమైన మద్యం దుకాణాలు గ్రామాలకు సైతం అందుబాటులోకి రావడం, మరో వైపు యథేచ్ఛగా బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో తాగినోళ్లకు తాగినంత అన్నట్లుగా నిత్యం మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. సీతారామాపురం గ్రామంలో మద్యం దుకా ణం ఏర్పాటు చేసిన రహదారిలో నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలో రైల్వే గేటు సమీపాన ఉన్న ఓ మద్యం దుకాణ దారుడు వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను చెత్త డస్ట్ బిన్లో వేయకుండా మద్యం దుకాణం వెనకాల ఉన్న శ్మశానం స్థలంలో వేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అలాగే మండల కేంద్రం పాములపాడులో మద్యం విక్రయాల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మందుబాబులు ఫూట్గా మద్యం సేవించి రోడ్లపై పడిపోతున్నారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ హోటల్ ముందు పడిపోయాడు. అలాగే మరో వ్యక్తి లింగమయ్య స్వామి అరుగుపై పొర్లుతూ కనిపించారు. వీరిని చూసిన జనం మద్యాన్ని విచ్చలవిడి విక్రయిస్తుండటంతో ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. -
దొంగ దొరికాడు
వెలుగోడు: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సురేష్ కథ నం మేరకు.. గాంధీనగర్కు చెందిన కుప్పల రమణయ్య పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో పానీపూరి బండి పెట్టుకొని జీవ నం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రమణయ్య, అతని భార్య ఇంటి నుంచి సెంటర్కు వెళ్లి పానీపూరి బండి ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి, బీరు వాను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.60 వేల నగదు, 24 గ్రాముల బంగారు నెక్లెస్ (విలువరూ.1,35,000), రూ. 3000 విలువైన సెల్ ఫోన్ ఇలా మొత్తం రూ. 1,98,000 విలువ గల సొత్తు అపహరించారు. బాధితు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టగా శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో వెలుగోడు గ్రామ శివారులోని ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించా డు.అతని వద్ద నుంచి నగదు, నక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆత్మకూ రు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినుల ఎంపిక
పగిడ్యాల/పాణ్యం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యా రు. పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పదవ తరగతి చదువుతున్న అమృత బోస్, పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంచె వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యార్థిని ఆర్. సుగుణ ఎంపికయ్యారు. వీరు నియోజకవర్గస్థాయి పోటీల్లో ప్రతిభ చూపార ని ప్రిన్సిపాళ్లు దినేష్బాబు, రమణమ్మ తెలిపారు. ఆర్. సుగుణ, అమృత్ బోస్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు. నారాయణ, రమణమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడోవ కుమారుడు వెంకటేశ్వర్లు(34) కార్తీక మాసం చివరి రోజు కావడంతో శుక్రవారం మహానంది పుణ్య క్షేత్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి వెళ్లిన అరగంటలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మార్గమధ్యలో మిడుతూరు మండలం తలముడిపి గ్రామ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి అన్న శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు నిత్యం వేగంగా , అధిక లోడుతో వెళ్లడంతో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
● ధాన్యం సంచుల కింద పడి ఒకరు మృతి ● ఆరుగురికి తీవ్ర గాయాలు
మొక్కజొన్నల లారీ బోల్తా జూపాడుబంగ్లా: అతివేగానికి ఓ ప్రాణం బలైంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కర్నూలు – ఆత్మకూరు జాతీయ రహదారిపై శుక్రవారం తంగడంచ క్రాస్రోడ్డు వద్ద మొక్కజొన్నల బస్తాల లోడ్తో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. తూడిచెర్ల గ్రామానికి చెందిన దొంతుల నరసింహులు గ్రామంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఐచర్ వాహనంలో నందికొట్కూరు సమీపంలోని గోదాముకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహ నం డ్రైవర్ షేక్బాషాతో పాటు బస్తాలను గోదాములో దింపేందుకు గ్రామానికి చెందిన హమాలీలు భరత్, యుగంధర్, శివరాజు, వెంకటేశ్వర్లు, నారాయణ, వెంకటరమణ, పుల్లయ్య వాహనంలో బయలుదేరారు. కాగా తంగడంచ క్రాస్రోడ్డు వద్ద డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉంచిన డ్రమ్ములను ఢీకొన్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంపైన ఉన్న వారిపై బస్తాలు పడటంతో భరత్(32)కు తీవ్రగాయాలై అక్కక్కడికే మృతిచెందాడు. వాహనం డ్రైవర్ షేక్బాషా పరారీ అయ్యా డు. క్షతగాత్రులను 108లో నందికొట్కూ రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భరత్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమణమ్మ, భార్య కళ్యాణి సంఘటనా ప్రాంతానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
రైతులను ఆదుకోవడంలో బాబు సర్కారు విఫలం
కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు సర్కారు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వంగాల భరత్కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి కన్నా రెండింతలు రైతు సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశారన్నారు. ముమ్మాటికీ ఆయన రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైందన్నారు. ఏడాదిన్నరగా రైతులు అన్ని విధాలా నష్టపోతున్నా ఆదు కోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. పొగాకు, మిర్చి రైతుల ఇబ్బందులు తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాతనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా..? రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా... అని భరత్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 11.50 లక్షల క్వింటాళ్ల పత్తిని పండిస్తే అందులో 5.50 లక్షల క్వింటాళ్లు కర్నూలు జిల్లా దిగుబడేనన్నారు. మోంథా తుపాన్తో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినా పాలకులు పలకరించడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో సీసీఏ కేంద్రాలు పనిచేస్తున్నాయా..అని ప్రశ్నించారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఎంత మంది రైతులకు ఇచ్చారో.. ప్రకటించాలన్నారు. శనగ దిగుబడులు గోడౌన్లలో మగ్గు తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అరటి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. రూపాయికి కిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు నాయుడుకు అమరావతి భవనాల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రైతులు తిరగబడే రోజలు దగ్గర్లోనే ఉన్నా యని హెచ్చరించారు.. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున, మైనార్టీ నాయకులు పత్తా బాషా, ఆర్టీఐ నాయకులు గద్ద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి బలవన్మరణం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి శుక్రవారం తెలిపారు. గౌరినాఽథ్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన భవానీప్రసాద్(23)కు గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాకపోవంతో మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్ పాణ్యం: పాణ్యంలోని స్టీల్ప్లాంట్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి విలేకరులకు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చాగలమర్రిలోని చిన్న మకన్మన్ వీధికి చెందిన ముల్లా వసీం ఆక్రమ్, ఆళ్లగడ్డలోని గడ్డంవీధికి చెందిన లంక అలెగ్జాండర్, కుమ్మరిదొడ్డి వీధి అవుకు పట్టణం(ప్రస్తుతం బనగానాపల్లెలో ఉంటున్నారు)కు చెందిన బురుగుల మనోహర్ ఉన్నట్లు చెప్పారు. మొత్తం రెండు కేజీల గంజాయి, ఒక పల్సర్ బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి, ట్రైనీ ఎస్ఐ ధనుజంయ, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య డోన్ టౌన్: వ్యాపారం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన శ్రీనివాసులు (30) అనే వ్యక్తి గ్యాస్ స్టౌవ్లు రిపేరి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక బైకుపై డోన్ ప్రాంతానికి వచ్చి డోన్ – చిన్న మల్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య బైకును ట్రాక్ పక్కన నిలిపి గూడ్స్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడ్సు లోకో ఫైలెట్ సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. -
సీనియర్ సహాయకులుగా ఆరుగురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, సీఈఓ జి.నాసరరెడ్డి నియామక ఉత్తర్వులను, పదోన్నతి ఉత్తర్వులను అందించారు. పేరు హోదా పదోన్నతిపై కేటాయించిన కార్యాలయం టి.కోటేశ్వరమ్మ టైపిస్ట్, పీఆర్ పీఐయు సబ్ డివిజన్, పత్తికొండ జడ్పీపీ, కర్నూలు వై.మద్దిలేటి టైపిస్ట్, కర్నూలు జడ్పీపీ, కర్నూలు ఎస్.జమీరుద్దిన్ జూనియర్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్, నన్నూరు ఆర్డబ్ల్యూఎస్, ఎస్ (పీ), సబ్ డివిజన్, బనగానపల్లి ఎ.నాగరాజు టైపిస్ట్, ఎంపీపీ, ఎమ్మిగనూరు పీఆర్ (పీఐయు), సబ్ డివిజన్, ఆలూరు నూర్ మహమ్మద్ టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, బనగానపల్లి టి.శ్రీదేవి టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, గడివేముల పదోన్నతి పొందిన వారిలో... -
కక్ష ఎవరిది.. శిక్ష ఎవరికి?
రాతనలో అసంపూర్తిగా ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల భవనంతుగ్గలి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నాడు – నేడు పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీ కావు. పేద విద్యార్థుల కోసం చేపట్టిన భవనాలు చంద్రబాబు కక్షకు నిరుపయోగంగా మారాయి. ఇందుకు రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనమే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న నాడు –నేడు మన బడి పథకం కింద రూపురేఖలు మార్చేశారు. చదువులే పేదల ఆస్తి.. అంటూ విద్యా రంగాన్ని పరుగులు పెట్టించారు. చదువులమ్మ గుడిలో అభివృద్ధి దీపం వెలిగించారు. విప్లవాత్మక మార్పులతో సర్కారు బడులు కొత్త రూపుదిద్దుకున్నాయి. అదనపు గదులు, ప్రహరీలు, నూతన భవనాలు, మౌలికవసతులు పూర్తి చేసుకుని .. ఇవి ప్రభుత్వ పాఠశాలలా.. అన్నట్లుగా మార్పు చెందాయి. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం ఒకటి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు – నేడు కింద గ్రామ శివారులో నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేసింది. ఈ లోగా ప్రభుత్వం మారడంతో నాడు–నేడు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలు స్కూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక కక్ష గట్టి పనులు నిలిపివేసింది. ఉన్న నిధులను వాడుకునే వీలు లేకుండా ఫ్రీజ్ చేసింది. దీంతో పాత పాఠశాల భవనంలోనే విద్యార్థులు అవస్థల మధ్య విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 238 మంది విద్యార్థులు ఉండగా.. మూడు ఇరుకైన గదుల్లో మూడు తరగతుల కు బోధన సాగుతోంది. మిగిలిన రెండు తరగతులు వరండా, చెట్ల కింద నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 238 మంది విద్యార్థులు, 13 మంది ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఉన్న ఒక మూత్రశాల, ఒక మరుగుదొడ్డితో చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు. దీంతో ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక క్రీడా మైదానం లేక క్రీడలకు నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పాలకులు స్పందించి అసంపూర్తి పాఠశాలల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రుణం తిరిగి చెల్లించేంత వరకు విఖ్యాత్ డీ ఫాల్టరే
విఖ్యాత్ రెడ్డి డెయిరీకి డీ ఫాల్టర్గా ఉన్న విషయాన్ని మరువ వద్దు. అప్పటి డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నుంచి జగత్ డెయిరీ పాల నాణ్యత చూపి రూ.1.20 కోట్లు రుణం తీసుకొని జగత్ విఖ్యాత్రెడ్డి డీ ఫాల్టర్ అయ్యాడు. రుణం తిరిగి చెల్లించేంత వరకు డైరెక్టర్ కాలేడు. 25 ఏళ్లు చైర్మన్గా మీ కుటుంబానికి చెందిన వ్యక్తులే పదవిలో ఉన్నారు. ప్రభుత్వం పోలీసుల చేతుల్లో ఉండటంతో నాపై మూడు కేసులు నమోదు చేయించారు. డెయిరీలో అవినీతి జరిగితే ఏ విచారణకు అయినా సిద్ధం. నాలుగున్నరేళ్లలో రూ.45కోట్లు డెయిరీకి ఆదాయాన్ని ఇచ్చాను. పాడిరైతులు, ఉద్యోగులకు డెయిరీ ఏర్పాటు నుంచి తొలిసారిగా బోనస్ అందజేశాం. డెయిరీకి అభివృద్ధికి కృషి చేయాలే తప్ప కుటిల రాజకీయం చేయవద్దు. – ఎస్వీ జగన్మోహన్రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్, నంద్యాల -
తెలుగుగంగ ఉప కాల్వకు గండి
రుద్రవరం: మండల పరిధిలోని టీ.లింగదిన్నె పొలిమేరలోని 23వ బ్లాక్ తెలుగు గంగ ఉప కాల్వకు గండి పడి సాగు నీరంతా వృథాగా పోతోంది. అయినప్పటికీ ఆ గండి పూడ్చేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి గండిని పరిశీలించి వెళ్లారే తప్ప పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు. మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా? ● ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం నంద్యాల(న్యూటౌన్): ‘మీ ఇంటిని కూడా ఇలాగే ఉంచుతారా’ అంటూ ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, బహిర్భూమికి బయటికి వెళ్తున్నామని విద్యార్థులు తెలిపారు. మూడు రోజుల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎంకు, ఎంఈఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. శిక్షణలో ఉచిత వసతి, ఆహారం, ప్రింటెడ్ స్టడీ మెటీరీయల్ అందిస్తామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో శిక్షణకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆవిష్కరించారన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా రెగ్యులర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు https://apstudycircle.apcfss.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27వ తేది నుంచి హాల్టిక్కెట్స్ పొందవచ్చని, ఈ నెల 30న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు డిసెంబర్ 10వ తేది నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 9493343866 నెంబర్ను సంప్రదించవచ్చన్నారు. ప్రిన్సిపాల్ సస్పెన్షన్ కర్నూలు(అర్బన్): నగరంలోని గిరిజన బాలికల గురుకులంలో ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి వెళ్లిన ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ సలోమిని సస్పెండ్ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణ జరిపి నివేదికను రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శికి పంపించగా ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు. -
ఆక్రమణకు ‘పచ్చ’జెండా!
‘లక్కీ’ భూదందాఅధికార పార్టీ నేతల భూ దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలమైనా సరే ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అడిగిందే తడవుగా అధికారులు సైతం తల ఊపేస్తున్నారు. ఎలాంటి స్థలమైనా అప్పనంగా కట్టబెడుతున్నారు. ఆ తర్వాత స్థలాలను అమాయక ప్రజలకు విక్రయించి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ స్థలాలను అమ్మినా, కొన్నా నేరమే కావడంతో.. ఎప్పటికై నా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు కూలీనాలీ చేసుకొని కూడబెట్టుకున్న డబ్బును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.సాక్షి టాస్క్ఫోర్స్: గత కొంత కాలంగా బనగానపల్లె పరిసర ప్రాంతాల్లోని ఎస్సార్బీసీ స్థలాలు ఆక్రమణకు లోనవుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. తాజాగా అధికార పార్టీ నేతల కన్ను కూడా ఆ స్థలాలపై పడింది. ఓ మంత్రి అండదండలు ఉండటంతో అధికారులు సైతం ‘పచ్చ’జెండా ఊపేశారు. ఉమ్మడి ఆదివుశేన్రెడ్డి కుమారుడు ఉమ్మడి హుస్సేన్రెడ్డి అవుకు రోడ్డు నుంచి రవ్వలకొండ వేళ్లే దారిలో జలాల్బాబా దర్గా ఎదుట ఎస్ఆర్బీసీకి చెందిన 151/2 పైకి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 14 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు పథకం రచ్చించారు. లక్కీ డ్రాలను ప్రభుత్వం నిషేధించినా అడిగేవారు ఎవరని ‘అన్నపూర్ణ లక్కీ డ్రా’తో అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు. ‘పట్టా’గా రిజిస్ట్రేషన్ భానుముక్కలలోని సర్వే నంబర్ 151లో 13.45 ఎకరాలు ఉండగా మొత్తం విస్తీర్ణం ఎస్ఆర్బీసీ కాల్వ నిర్మాణానికి భూసేకరణ చేశారు. ఇందులో కాల్వ నిర్మాణం పూర్తయ్యాక మిగులు భూమి ఆక్రమణకు గురవుతోంది. రిజిస్ట్రేషన్కు 151 సర్వే నంబర్ను మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల డిప్యూటీ సర్వేయర్ 151/1,151/2గా సబ్ డివిజన్ చేయడం గమనార్హం. ఇందులో 151/1ను ఎస్ఆర్బీసీ కెనాల్ భూసేకరణకు 151/2 పట్టాగా మార్పు చేశారు. ఆ తరువాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 151/2 పైకి పేరిట 14 సెంట్లను టీడీపీ నేత ఉమ్మడి హుస్సేన్రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. వంత పాడిన అధికారులు నిబంధనల ప్రకారం ఎస్ఆర్బీసీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చడం రిజిస్టేషన్ చేయించడం నిబంధనలకు విరుద్ధం. మండల తహసీల్దార్ కార్యాలయంలో సబ్ డివిజన్ చేయడం కూడా నేరమే. కానీ మండల డిప్యూటీ సర్వేయర్ సబ్ డివిజన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ నిబంధనలను తొక్కిపెట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్సార్బీసీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు మాట మాత్రమైనా అడ్డుచెప్పకపోవడం గమనార్హం. లక్కీడ్రాతో ప్లాట్ల విక్రయం అన్నపూర్ణ లక్కీ డ్రా పేరిట ఎస్సార్బీసీ స్థలం విక్రయానికి బనగానపల్లె ప్రాంతంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. బ్రోచర్లు ముద్రించి సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు. ప్రథమ బహుమతిగా 2.5 సెంట్లు, రెండు నుంచి 5వ బహుమతి వరకు 2 సెంట్ల ఓపెన్ ప్లాట్.. 6వ బహుమతి 1.26 సెంట్లుగా నిర్ణయించారు. కూపన్ ధర రూ.999లుగా నిర్ణయించి 3,600 మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. కూపన్లు మొత్తం విక్రయించిన తర్వాతనే లక్కీ డ్రా తీస్తామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అప్రూవల్కు పంచాయతీ అనుమతి తప్పనిసరి. కానీ పంచాయతీ అప్రూవల్ ఉందని, వాటర్ సప్లయ్ కూడా ఉందంటూ బురిడీ కొట్టిస్తున్నారు.ఎస్సార్బీసీ స్థలాన్ని ఆక్రమించుకున్న విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయంలో వాస్తవాలను పరిశీలిస్తాం. ఆక్రమణకు గురైనట్లు తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున ఈఈ ఎస్ఆర్బీసీ భానుముక్కలకు చెందిన సర్వే నంబర్ 151 పూర్తి విస్తీర్ణం ప్రభుత్వ భూమి. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాదు. రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ఈ వ్యవహారం గతంలోనే జరిగింది. అందువల్ల నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు. – విజయకుమార్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, బనగానపల్లె అడ్డదారుల్లో అధికార పార్టీ నేత దురాక్రమణ ఓ మంత్రి అండదండలతో ఇష్టారాజ్యం అడ్డుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ అడ్డంగా సంతకాలు రూ.50లక్షలకు పైగా విలువైన స్థలం లక్కీడ్రా పేరిట అమాయక ప్రజలకు కట్టబెడుతున్న వైనం అధికారులకు తెలిసినా మౌనం -
అడ్డగోలుగా జాబ్కార్డుల తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు సర్కారు రాజకీయ కక్షతో ఉపాధి కూలీల నోటికాడి ముద్దను లాగేస్తోంది. జిల్లాలో 3 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వీటిల్లో 5,56,672 మంది కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారని, ఉపాధి పనుల పట్ల ఆసక్తి లేదని, జాబ్కార్డు హోల్డర్లు మరణించారని తదితర కారణాలతో 44,501 జాబ్కార్డుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈ కారణంగా 1,23,997 మంది కూలీలు ఉపాధి పనులను దూరం కానున్నారు. తొలగించిన జాబ్కార్డుల వివరాలను పరిశీలిస్తే 80 శాతం మంది ప్రతి ఏటా ఉపాధి పనులకు వస్తున్నవారే. మాకు ఈ–కేవైసీ విషయమే తెలియదని.. మేట్/ఫీల్డ్ అసిస్టెంట్ ఆ విషయమే చెప్పలేదని కూలీలువాపోతున్నారు. జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంటు ఉంటారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత 300 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ–కేవైసీ జరుగుతుండటంతో పచ్చపాతం చోటు చేసుకుంటోంది. ఫలితంగా 1.23 లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోనున్నారు. నేడు గ్రామసభల్లో తొలగింపులకు ఆమోదం ఈ–కేవైసీ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో గ్రామసభలు నిర్వహించి జాబ్కార్డుల తొలగింపులకు ఆమోదముద్ర వేయనున్నారు. జిల్లాలో ఈ నెల 22న గ్రామసభలు నిర్వహించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. గోనెగండ్ల మండలంలో 4,788, వెల్దుర్తి మండలంలో 2,762, కోసిగి మండలంలో 3,148, కోడుమూరు మండలంలో 2,423, ఆలూరులో 2,261, దేవనకొండలో 2,963, నందవరంలో 2,306, ఆదోనిలో 2,093, సీ.బెళగల్ మండలంలో 2,147 చొప్పున ప్రకారం జాబ్కార్డులు తొలగించినట్లు స్పష్టమవుతోంది. మాకు ఉపాధి పనులే అధారం. ఎలాంటి వ్యవసాయ భూములు లేవు. ఉపాధి పనులు పెట్టని సమయంలో వలసపోతుంటాం. నాట్ విల్లింగ్ కారణం చూపి నా భార్య కోమలిక(ఏపీ –13–002–017–027/10703) ను ఉపాధి పనులకు దూరం చేశారు. ఈ–కేవైసీ విషయం మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఇలా ఏకపక్షంగా తొలగించడం అన్యాయం. – నరసప్ప, జమ్ములదిన్నె, కోసిగి మండలం 40,401 జాబ్కార్డుల తొలగింపుతో 1.23 లక్షల మంది కూలీలకు ఉపాధి దూరం మైగ్రేషన్, ఉపాధి పనుల పట్ల ఆసక్తి లేదనే కారణాలతో తొలగింపులు నేడు గ్రామసభలలో ఆమోదముద్ర -
బీఈడీ కాలేజీలకు నోటీసులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలోని మూడు బీఈడీ కాలేజీలకు గురువారం నోటీసులు ఇచ్చారు. సాక్షి దినపత్రికలో ‘ఉన్నట్టు...కనికట్టు’ అనే శీర్షికన గురువారం కథనం ప్రచురితం కావడంతో వర్సిటీ అధికారులు ఈ మేరకు స్పందించారు. డోన్లోని శ్రీసుధా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, గాయత్రి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పంచలింగాల గ్రామం చిరునామాతో ఉన్న బాలాజీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. ఆ కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆర్యూ పరిధిలో కర్నూలు జిల్లాలో 10, నంద్యాల జిల్లాలో మరికొన్ని కాలేజీలకు భవనాలు లేకపోయినా అనుమతులు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ కాలేజీలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ బి.విజయకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, ఫిర్యాదులు వచ్చిన మిగిలిన కాలేజీలకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్ లైంగిక దాడులను ఎదుర్కొందాం
కర్నూలు: పిల్లల ఆన్లైన్ భద్రత విధానాలు, సైబర్ క్రైమ్స్ తదితరాలపై చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా (సీఐఎఫ్) సౌజన్యంతో స్థానిక న్యాయ సేవాసదన్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆన్లైన్లో పిల్లలపై అనేక రకాలుగా లైంగిక దోపిడీలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎదుర్కొని పిల్లలను రక్షించాలన్నది సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. సైబర్ క్రైం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆన్లైన్లో జరిగే మోసాలను వివరిస్తూ వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయమై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శుభ్రత్ కుమార్ మాట్లాడుతూ పిల్లలపై ఆన్లైన్లో జరిగే లైంగిక దోపిడీని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, జ్యువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్స్, చిల్డ్రన్స్ వెల్ఫేర్, రెవెన్యూ, పోలీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, కోఆర్డినేటర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ కేవీ కొండప్ప పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
బనగానపల్లె: మండలంలోని యాగంటిపల్లె గ్రా మంలో గురువారం సాయంత్రం సోమన్నగారి రామకృష్ణారెడ్డికి చెందిన మొక్కజొన్న పంట నూ ర్పిడి దశలో ఉండగా ప్రమాదవశాత్తూ మూడు ఎకరాల్లోని పంట దగ్ధమైందని రైతు వాపోయాడు. పంట పొలాని కి కొంత దూరంలో ఎగిసిన మంటలు సుడిగాలి వల్ల మొక్కజొన్న పంటపై నిప్పులుపడ్డాయి. దీంతో మంటలు పంట మొత్తం వ్యాపించాగా బనగానపల్లెలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా.. నాలుగు ఎకరాల్లో పంట సాగు చేయగా.. మూడు ఎకరాల్లోని పంట కాలిపోయింది. -
తిమ్మాపురంలో మహిళ ఆత్మహత్య
నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం గడివేముల మండలం బూజనూరు గ్రామానికి కరిష్మాకు(20) మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మొల్ల షఫివుల్లాతో వివాహమైంది. ఓపెన్ డిగ్రీ మూడోవ సంవత్సరం చదువుతున్న కరిష్మా ఈ నెల 21వ తేదీన పరీక్షలు ఉండటంతో నందికొట్కూరులో హాల్టికెట్ తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సున్నిపెంటలో సీసీ కెమెరాల మెకానిక్ పని చేస్తున్న భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. రేపు వెళ్దామని చెప్పంతో ఆమె మనస్తాపానికి గురైంది. వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నా.. నా కూతుర్ని బాగా చూసుకో’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అతను తిరిగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే సమీపంలోని బంధువులకు విషయం చెప్పాడు. వారు వెళ్లి చూసేపోలే కరిష్మా ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా కరిష్మా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిరాలికి 14 నెలల పాప ఉంది. మృతురాలి తల్లి రమిజాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కౌతాళం: కౌతాళం పోలీస్టేషన్ పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన వడ్డే కోటేశ్వరి గురువారం తుంగభద్ర దిగువ కాలువలో శవమై తేలింది. సీఐ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కామవరం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు, ఈరమ్మల దంపతుల కుమారుడు వడ్డే వీరేష్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పులకల్ గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి కూతురు వడ్డే కోటేశ్వరి (21)తో వివాహమౌంది. ఏమి జరిగిందో తెలియదుకానీ తమ కూతురు కనిపించడం లేదని బుధవారం మద్దిలేటి కౌతాళం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా గురువారం పెద్దతుంబళం గ్రామం వద్ద తుంగభద్ర కాలువలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు బయటకు తీశారు. మృతి చెందిన మహిళ కోటేశ్వరిగా తండ్రి మద్దిలేటి గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 23 నుంచి రగ్బీ పోటీలు కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 23, 24 తేదీల్లో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రగ్బీ అండర్– 19 చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 కార్యదర్శి రాఘవేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం జీపు జాతా కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 23, 24 తేదీల్లో జీపు జాతా చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రామకృష్ణ తెలిపారు. గురువారం కార్మిక, కర్షక భవన్లో సీపీఎం మండల కమిటీ సమావేశం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు మండలం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నా సమస్యలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయన్నారు. రైల్వే వ్యాగన్ వర్కుషాపు పూర్తి చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. నాయకులు బాలపీర, శ్రీరాములు, నరసింహులు, బీసన్న పాల్గొన్నారు. తలసీమియా బాధితుల కోసం రక్తదానం కర్నూలు(హాస్పిటల్): సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ కర్నూలు ఆధ్వర్యంలో తలసీమియా బాధిత చిన్నారుల కోసం గురువారం కర్నూలులోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ ప్రారంభించి ఆయన కూడా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసీమియా బాధిత చిన్నారుల కోసం చేసే ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాగే యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. రక్తదానం ఆవశ్యకత, తలసీమియా వ్యాధి గురించి రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి వివరించారు. -
పాత తూకం.. కొత్త మోసం
ఆదోని అర్బన్: అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులు గద్దల్లా వాలి రైతు కష్టాన్ని దర్జాగా దోచుకుంటున్నారు. అధిక ధర ఆశచూపి తూకాల్లో మోసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆదోని వ్యవసాయ మార్కెట్లోనే నాణ్యత పత్తికి రూ.7,330 ధర పలుకుతోంది. అటువంటిది ఇతర రాష్ట్రం నుంచి వచ్చి పత్తి క్వింటాకు ఎలాగున్నా సరే రూ.7,300 ఇస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు పాత తక్కెడ తూకాలతో కోసిగి, కౌతాళం, హాల్వి మండలాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పెద్ద పెద్ద లారీలను తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కేవలం కుడివైపు 50 కేజీల రాళ్లను తాడుతో వేలాడదీడయం, ఎడమవైపు ఒక పెద్ద సంచిని వేలాడదీసి తూకం వేస్తు న్నారు. దీంతో 50 కేజీల పత్తికి గానూ 8 నుంచి 10 కేజీల వరకు తూకంలో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక క్వింటానికి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతు క్వింటాకు రూ.7300 ప్రకారం చెల్లించినా రూ.1466 చొప్పున నష్టపోవాల్సిందే. రోజుకు ఎనిమిది లారీల్లో తరలింపు.. మహారాష్ట్రకు చెందిన పత్తి వ్యాపారస్తులు 15 రోజుల నుంచి ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకు 8 లారీలు పత్తి దిగుబడులను కొనుగోలు చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒక లారీ వంద క్వింటాళ్లకు పైగానే ఉంటుంది. దీని ప్రకారం 800 క్వింటాళ్లు రోజూ లారీల్లో తరలిస్తున్నారు. 15 రోజుల్లో ఇప్పటి వరకు 120 లారీల్లో 96 టన్నుల పత్తిని మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి దిగుబడులను తక్కెడ తూకాల్లో వేయకూడదు. కేవలం ఎలక్ట్రానిక్ మిషన్లోనే తూకాలు వేయాలి. తక్కెడ తూకాల్లో మోసం ఉంది. అధిక ధర ఇస్తామంటే రైతులు మోసపోవద్దు. ముందుగా రాళ్లు, ముళ్లును సరి చూసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు అనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – శంకర్, తూనికల కొలతల శాఖ ఆదోని ఇన్చార్జి అధికారి పత్తి కొనుగోళ్లకు మహారాష్ట్ర వ్యాపారులు ఎక్కువ ధర ప్రకటించి పాత తూకాలతో మోసగిస్తున్న వైనం క్వింటానికి 15 కేజీలకు పైగా దోపిడీ ఎక్కడా కనిపించని ఎలక్ట్రానిక్ కాటాలు పట్టించుకోని తూనికల శాఖ అధికారులు -
శివ.. శివా.. నీవే మాకు రక్ష!
శ్రీశైలంటెంపుల్: కార్తీకం.. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం. ఈ నెలలో ఈశ్వరుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసిన దేవస్థాన అధికారులు ఆచరణలో మాత్రం విఫలం అయ్యారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘శివ.. శివా.. నీవే మాకు రక్ష’ అని కంపార్టుమెంట్లలో స్వామిని చేతులెత్తి వేడుకున్నారు. గంటల తరబడి నిరీక్షణ శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 22 నుంచి శుక్రవారం వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించారు. క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రేకులషెడ్డు కంపార్ట్మెంట్లలో పరిమితికి మించి భక్తులు కనిపించారు. చాలా మంది ఊపిరి అడక అవస్థలు పడ్డారు. చిన్నారులు, బాలింతలు, వృద్ధుల అవస్థలు వర్ణానాతీతం. కష్టాలను ఎదు ర్కొని కంపార్ట్మెంట్లు దాటుకుని వచ్చిన భక్తులు ఆలయ ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు చేరుకునేందుకు మళ్లీ గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, షుగర్ రోగులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే నిరసన తెలిపారు. ‘ఇదేం పాలన’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. పాలన అస్తవ్యస్తం ● కార్తీకమాసమంతా శని, ఆది, సోమ, రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శదర్శనాన్ని రద్దు చేశారు. అయితే వీఐపీల పేరుతో కొందరు దేవస్థాన ఉన్నతాధికారులే స్వయంగా ఆలయానికి వచ్చి దగ్గరుండి అన్ని క్యూలైన్లను మూసివేయించి స్పర్శ దర్శనం చేయించారు. ● సిఫార్సుల లేఖలకు ఇష్టం వచ్చినట్లు స్పర్శదర్శనం టికెట్లు ఇచ్చారనే అరోపణలు వచ్చాయి. ● సామాన్య భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం అవకాశం కలగలేదు. ● కొందరు దేవస్థాన అధికారులు అర్హత లేని వారితో ప్రధాన గేటు ద్వారానే ఆలయ ప్రవేశం చేయించారు. ప్రధాన గేటుకు ఉన్న ప్రతిష్టతను మంట కలిపారనే విమర్శ లు వచ్చాయి. ● ఆలయంలో దీపారాధన చేయడం లేదని చెప్పిన కొందరు అధికారు లు కుటుంబ సభ్యులతో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. శ్రీశైలంలో మోగిన అవస్థల గంట! కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులకు తప్పని తిప్పలు అధికారుల పర్యవేక్షణ కరువు ముగిసిన కార్తీక మాసం -
మాయలూరులో పిచ్చి కుక్క దాడి
● ఆరుగురు ఆసుపత్రిపాలుఉయ్యాలవాడ: మాయలూరు బస్టాండు సమీపంలోని చికెన్ సెంటర్ వద్ద గురువారం ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అల్లూరు గ్రామానికి చెందిన లక్ష్మి హర్షవర్ధన్ ఆచారి 9వ తరగతి విద్యార్థి, మాయలూరు గ్రామానికి చెందిన వెంకటేష్ 10వ తరగతి విద్యార్థి వీరివురు పాఠశాలకు వెళ్తుండగా అక్కడ తిరుగుతున్న పిచ్చి కుక్క దాడి చేసి చేయడంతో కాలు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మాయలూరు గ్రామానికి చెందిన పెద్ద తిరుపాలు, పుల్లన్న అనే ఇద్దరు వ్యక్తులు రైతు పొలంలో కూలి పనికి వెళ్తుండగా వారి మీద కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ నలుగురికి అక్కడే వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సలు వైద్యాధికారి రాబర్డ్ కెనడి వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మధ్యాహ్నం అదే కుక్క గ్రామానికి చెందిన రామలింగారెడ్డి, రామసుబ్బయ్య అనే వ్యక్తులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, చుట్టు పక్కల వారు చుట్టుముట్టి పిచ్చి కుక్కను చంపేశారు. ఈఎన్టీ మురళీక్రిష్ణ, ఫైలట్ రాజారెడ్డిలు వీరిని 108లో ప్రథమ చికిత్స చేసి కోవెలకుంట్లకు తీసుకెళ్లారు. -
జవాన్కు కన్నీటి వీడ్కోలు
మద్దికెర: చత్తీస్ఘడ్లో ఐటీబీపీ జవానుగా పని చేస్తూ అనారోగ్యంతో మృత్యువాత పడిన మద్దికెరకు చెందిన కసాపురం నాగార్జునకు (32) గురువారం గ్రామస్తులు, ఆర్మీ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో సెలవుపై వచ్చి నాగార్జున బళ్లారిలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజులుగా అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, నాలుగేళ్ల కూతురు వున్నారు. గురువారం స్వగ్రామం మద్దికెరలో అంత్యక్రియలు నిర్వహించా రు. ఆర్మీ అధికారులు జవాను మృతదేహంపై జాతీ య పతాకం వుంచి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఐటీబీపీ ఆర్మీ అధికారులు ఎస్ఐ హరీష్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు లు, బాలాజీ, మద్దికెర పంచాయతీ సలహాదారు బండారు ఆంజనేయులు పాల్గొన్నారు. -
యువకుడి బలవన్మరణం
కోవెలకుంట్ల: స్థానిక ఎల్ఎం కాంపౌండ్కు చెందిన ఓ యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన రామారావు కుమారుడు రంగస్వామి(21) పట్టణంలో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఉదయం తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన యువకుడు ఉరి వేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భవనాశి వాగులో పడి రైతు మృతి చాగలమర్రి: కలుగొట్లపల్లె పంచాయతీకి మజరా గ్రామమైన నగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన పాడి రైతు మురబోయిన రామ సుబ్బరాయుడు(60), అతని భార్య లక్ష్మీదేవితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో భవనాశి వాగు వద్ద పశువులు మేపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత గేదెలు కనిపించకపోవడంతో వాగు అవతల చూసేందుకు నీటిలో దిగగా.. గుంతల్లో గల్లంతయ్యాడు. భార్య గమనించి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో గాలించగా రామ సుబ్బరాయుడు విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రారంభానికి మోక్షమెన్నడో!
● నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని సచివాలయం ● పంచాయతీ భవనంలోనే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులుకోవెలకుంట్ల: గ్రామస్థాయిలో పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్క్లినిక్లకు రాజభవనాల తరహాలో అన్ని హంగులతో భవనాలు నిర్మించింది. కోవెలకుంట్ల మండలం రేవనూరులో రూ. 38.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. అనివార్య కారాణాలతో గత ప్రభుత్వం భవనాన్ని ప్రారంభించలేకపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోలేదు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భవనంలో అరకొర వసతులు ఉండటంతో ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. కొత్త భవనం చుట్టూ ముళ్లపొదలు పేరుకపోయి భవన ప్రాంతంలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రీశైలంలో టెండ‘రింగ్’
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు వచ్చాయి. తమకు నచ్చిన కాంట్రాక్టర్కే పనులు దక్కేలా నిబంధనలు తయారు చేశారనే ఆరోపణలు వినిపించాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల టెండర్లలో వివరాలు గందరగోళంగా ఉండటం విమర్శలకు, ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిబంధనల్లో మార్పులు ఇలా.. శ్రీశైలంలో ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 11రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు చలువ పందిళ్లు, అదనపు క్యూలైన్లు, తాత్కాలిక విద్యుద్దీకరణ తదితర 84 పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.13కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే వాటిలో వివరాలు, నిబంధనలు సక్రమంగా లేవని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్తో చేసే పనులకు సివిల్ క్లాస్ టెండర్ల నిబంధన, క్లాస్–5, క్లాస్–4, క్లాస్–3 ఉండాల్సిన పనులకు ఫర్మ్ రిజిస్ట్రేషన్లు.. ఇలా పలు పనుల్లో నిబంధనలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హర్డ్వేర్ మెటీరియల్, శానిటరీ మెటీరియల్ తదితర పనులకు సంబంధించిన టెండర్లలో సరైన వివరాలు కూడా పొందుపర్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు అయోమయానికి గురై టెండర్లు కూడా వేయలేదని తెలుస్తోంది. నయా ట్రెండ్కు శ్రీకారం శ్రీశైల దేవస్థానంలో కొందరు ఇంజినీర్లు నయా ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. గతంలో ఏదేని పని పూర్తి చేసిన తరువాత బిల్లు చెల్లించేటప్పుడు పర్సెంటేజీ ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ఇంజినీర్లు డబ్బులు తీసుకునే వారని సమాచారం. అయితే ఇకపై పర్సెంటీజీలకు హితవు పలికి కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మకై పనుల్లో పాట్నర్షిప్ అడుగుతూ ‘నీ కెంత..నా కెంత’ అని బేరసారాలు కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బేరం కుదిరితే ఏ పని చేయాలి, ఆ పనికి టెండర్ ఎంత కోట్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత వరకు పని చేయాలి, పనిని ఎలా పెంచుకోవాలని ఇంజినీర్లే కాంట్రాక్టర్లకు దగ్గరుండి సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రస్ట్బోర్డు దృష్టి ఏది? ఏ పనులు ఎంత మేరకు ఎలా చేయాలో దేవస్థాన ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్య ఇంజినీరు టెక్నికల్ అనుమతులు ఇస్తారు. దేవస్థాన ఈఓ పరిపాలన అనుమతులు ఇస్తారు. అనంతరం ఆయా పనులకు టెండర్లు పిలుస్తారు. భక్తులకు అవసరమైన పనులకే టెండర్లు పిలిచారా.. అనవసరమైన పనులకు పిలిచారా ? అని ఆయా టెండర్లను ట్రస్ట్బోర్డు దృష్టిసారించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా ట్రస్ట్బోర్డు దృష్టి సారించలేదని సమాచారం. ఇవీ ఆరోపణలు.. నిర్మాణంలో ఉపయోగించే ఇత్తడి, ఇనుముతో చేసిన సామగ్రి సరఫరా చేసేందుకు టెండర్ వేశారు. ఒకే సామగ్రికి రెండు, మూడు సార్లు టెండర్ పిలిచారు. టెండర్లోని నంబర్ 85లో ట్యూబ్ లెవల్ పైప్ సరఫరా ధర రూ.495, నంబర్ 97లో లెవల్ పైప్ సరఫరా ధర రూ. 455గా పొందుపర్చారు. ఎస్.నెం.2 టెండర్లో మూడు ఇంచుల బాబే నెయిల్స్ ధర రూ.346.96గా, హార్ట్వేర్ మెటీరియల్ సరఫరాలో అదే మూడు ఇంచుల బాంబే నెయిల్స్ ధర ఎస్.నెం.4లో రూ.210గా, ఎస్.నెం.42లో రూ.350గా కోట్ చేశారు. ఎస్.నెం.147 టెండర్లో బైండింగ్ వైర్ కట్టర్ 500గా నిర్ణయించారు. అది 500 బైండింగ్ వైర్ కట్టర్లా లేక 500 కేజీల బైండింగ్ వైర్ అని అర్థం కాలేదు. ధర రూ.400 కోట్ చేశారు. ఎస్.నెం.15లో కేజీ బైండింగ్ వైర్ ధర రూ.195గా కోట్ చేశారు. అలాగే చలువ పందిళ్లకు అనుభవం, ఫర్మ్ రిజిస్ట్రేషన్ పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఫ్లైవుడ్ సరఫరా టెండర్లోను ధర ఎక్కువగా ఉంది. క్వాలిటీ పొందుపర్చలేదు. చైన్ లింక్ మెష్ టెండర్లో ఇన్ని వేల చదరపు అడుగుల పని చేసిన అనుభవం పొందుపర్చారు. పేరుకు మాత్రం అన్లైన్ టెండర్లు అని దేవస్థాన ఇంజినీర్లు చెబుతున్నారు. ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లతో కొందరు ఇంజినీర్ల కుమ్మక్కు మల్లన్న ఆదాయానికి గండికొట్టే యత్నం తమ కాంట్రాక్టర్కే పనులు వచ్చేలా నిబంధనలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల టెండర్లలో వివరాలు లేని వైనం టెండర్లపై దృష్టిసారించని దేవస్థాన ట్రస్ట్బోర్డు -
చెంచులకు నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం స్థానిక చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం ఉచితంగా కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పి.రమేష్నాయుడు తెలిపారు. బుధవారం దేవస్థానం అన్నదాన భవన సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ధర్మకర్తల చైర్మన్ పి.రమేష్ నాయుడు అధ్యక్షతన మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. సమావేశంలో 14 అంశాలు చర్చించగా, 11అంశాలు ఆమోదించారు. 2అంశాలను వాయిదా, ఒక అంశాన్ని తిరస్కరించారు. సమావేశం అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కొత్తపల్లి మండలం శివపురంలోని కొలనుభారతి సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయంగా నిర్వహింపజేయాలని దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన భూములు, బంగారం, వెండి, ఎఫ్డిఆర్లు, నగదును దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారుల బృందం, ధర్మకర్తల మండలి సమక్షంలో త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. డిసెంబర్ 1వ తేది నుంచి మల్లన్న స్పర్శదర్శనం, అతిశీఘ్ర దర్శనం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందజేస్తామన్నారు. భక్తులు సూచనలు, సలహాలు స్వీకరించేందుకు పలుచోట్ల ఫిర్యాదులు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. -
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్
బేతంచెర్ల: చిన్నారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాఠాలు బోధించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. యంబాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తినేలా చూడాలని, వారికి ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని రిజిష్టర్ను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చామంతి పూలను, ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను చూసి రైతులను అభినందించారు. రైతు సంక్షేమమే లక్ష్యం బేతంచెర్ల: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. యంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఏం కిసాన్ డో విడత జిల్లా స్థాయి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లాలోని 2,06,052 మంది రైతులకు మెగా చెక్కును అందజేశారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రైతులకు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. రైతులు మిశ్రమ, అంతర పంటల మీద దృష్టి సారించాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నరసింహులు, డోన్ ఏడీ సునీత, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, ఏఓ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు కర్నూలు సిటీ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామంలో ఆమె మాట్లాడారు. అత్యధిక శాతం రైతులు లోకల్ విత్తనాలు వాడుతుండడం, ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు డివిజన్ కేంద్రాల్లో డివిజినల్ డెవలప్మెంట్ కార్యాలయాలను అన్ని హంగులతో త్వరలో ప్రారంభించనున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాల్లోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారులకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలకు అనుగుణంగా ఆయా భవనాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ నిధులు రూ.95.70 లక్షలను కేటాయించారు. ఫర్నీచర్ ఇతరత్రాలకు అదనంగా మరో రూ.10 లక్షలను వెచ్చిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ప్రతి డీడీఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్పై నియమిస్తామన్నారు. ప్రతి డివిజన్కు ప్రత్యేకంగా నియమితులైన డీడీఓ ఆయా డివిజన్లలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు గ్రా మ పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు. -
మేలైన వంగడాలతో అధిక దిగుబడులు
డోన్ టౌన్: రైతులు మేలైన వంగడాలను ఎంచుకోవడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో ఉల్లి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ టీం సభ్యులు అన్నారు. కామగానికుంట్ల గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను బుధవారం వారు పరిశీలించారు. రైతులతో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.జే బ్రహ్మ, సెక్రటరీ మనోజ్, డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హేమంగ్ భార్గవ్, గుంటూరు డీడీహెచ్ జమదగ్ని మాట్లాడారు. ఉల్లి సాగు చేసే విధానాలు, పెట్టుబడి ఖర్చులు, ఉత్పత్తి, దిగుబడుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతులు పాటించాలని, నారుమళ్లను ఎత్తయిన మడుల్లో పెంచాలని సూచించారు. నీటి తడుల కోసం డ్రిప్ వాడాలని, సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వీరి వెంట కర్నూలు ఎన్హెచ్ఆర్డీఎఫ్ ఛీప్ శర్వానంద్, మహానంది ప్రిన్స్పల్ సెక్రటరీ ఠాగూర్నాయక్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నాగరాజు, డోన్ ఉద్యానవనశాఖ అధికారి కళ్యాణి ఉన్నారు. -
ఎమ్మెల్యే అఖిల వ్యాఖ్యలు హాస్యాస్పదం
● ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు ● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఆసుపత్రిని తానే నిర్మించానని, డిసెంబర్లో ప్రారంభిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచడానికి వీలుకాదని 2017లో టీడీపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి 2023 డిసెంబర్లో తామే ప్రారంభించామని, ఇందుకు సాక్ష్యంగా శిలాఫలాకాలు అక్కడే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వార్డుల కోసం నిర్మాణం జరుగుతున్న గదులకు కూడా 2023లోనే భూమిపూజ చేశామన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసని, ఇప్పుడు అబద్ధాలు చెబితే ఎవరూ నమ్మబోరన్నారు. అబద్ధాల ప్రకటనలు మానుకుని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతుల కోసం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకనట చేసి ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. -
పత్తి రైతుల ‘యాప్’సోపాలు!
● చుక్కలు చూపిస్తున్నకిసాన్ కపాస్ యాప్ ● పనులు వదులుకొని స్లాట్ బుకింగ్కు ప్రయత్నిస్తున్న రైతులు ● వారం రోజులుగా స్లాట్ బుకింగ్లో ఇబ్బందులు ● చోద్యం చూస్తున్నసీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ వారం రోజులుగా అష్టకష్టాలు.. కర్నూలు(అగ్రికల్చర్): నాలుగైదు నెలల పాటు రేయింబవళ్లు కష్టించి పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతులకు తలప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతోంది. పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్న తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖ అధికారులు, అటు వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్లాట్ బుకింగ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి రోజు ఉదయ 10 గంటలకు స్లాట్ బుకింగ్కు అవకాశం ఉంటంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. అయితే ఓటీపీ నెంబరు ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు కనిపిస్తోంది. ఇదేమీ సీసీఐ మాయనో రైతులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యాప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులోని 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేయాలి. సామర్థ్యంలో కనీసం 50 శాతం కూడా కొనడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారం, పది రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. వందలాది మంది రైతులు అన్ని పనులు వదిలి పెట్టి పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోయింది. కొంతమందికి మాత్రం రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబరకు ఫోన్ చేయవచ్చని యాప్లోనే ఉంది. ఇంతవరకు టోల్ఫ్రీ నెంబరు పనిచేసిన దాఖలాలు లేవు. స్లాట్ బుకింగ్కే ఇంత సమయం పడుతుంటే సీసీఐ కేంద్రం వద్ద తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ సూచనలు, ఆదేశాలను సీసీఐ పట్టించుకోవడం లేదని, అందువల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. -
తల్లిదండ్రులకు భరణం హక్కు
● పిల్లల నుంచి నిరాదరణకు గురైన వారు పొందవచ్చు ● జిల్లా జడ్జి కబర్ధి నందికొట్కూరు: పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు చట్ట ప్రకారం భరణం పొందే హక్కు ఉందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి అన్నారు. నందికొట్కూరు సమీపంలోని ఆశ్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి పి. మోహన్రావు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి, కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు భరణం పొందవచ్చన్నారు. న్యాయ సహాయం కోసం హెల్ప్లైన్ 15100కు ఫోన్ చేయవచ్చన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య, ఆత్మకూరు ఈఆర్డీఓ నాగజ్యోతి, మున్సిపల్ కమిషనర్ బేబి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. కాగితాల ఎంఓయూలు వద్దు
ఆదోని రూరల్: ‘సీఎం చంద్రబాబూ.. ప్రభుత్వం కాగితాల ఎంఓయూలు కాదు... కాసులు కురిపించే ఎంఓయూలు చేపట్టండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం ఆదోనిలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైజాగ్లో జరిగిన సీఐఐ సమ్మిట్లో ఎంఓయూలు, ఉద్యోగాల కల్పనపై ప్రజలకు నమ్మకం కలగడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగానే మారుతోందన్నారు. విశాఖ వేదికగా ఆర్భాటంగా సీఐఐ పేరుతో సీఎం చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. సీఐఐ పేరుతో ఆర్భాటంగా చేసిన ఎంఈఓయూల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఏమి మేలు జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. 2014–19 మధ్యలో 1,761 ఎంఓయూలు చేసుకుంటే ఎన్ని ఎంఓయూలలో గ్రౌండ్ అయ్యాయో చంద్రబాబు చెప్పాలన్నారు. ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు ఇలా ఎంఓయూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేపట్టాలని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేవీపీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు జగన్నాథం, సీపీఐ నాయుకలు సుదర్శన్, వీరేష్, కల్లుబావి రాజు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా గాజులదిన్నె
గోనెగండ్ల: జిల్లాలో ఏకై క మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అయిన గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు ప డుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఏపీ టూరి జం శాఖ ఏఈ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సాజీత్, సుధారాణిలు జీడీపీలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఎకరా స్థలంలో చిన్న పిల్లలకు పార్కు, రెస్టారెంట్, అలాగే పర్యాటకులు, వికలాంగుల కోసం బాత్రుమ్లు ఏర్పాటుకు సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వే చేసిన ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
వేసవిలో మంచినీటి సమస్య తలెత్తరాదు
కర్నూలు (అర్బన్): రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ ఆదేశించారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఈఈ, డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు మెజార్టీ గ్రామాలకు నీటిని సరఫరా చేసే తుంగభద్ర దిగువ కాలువకు జనవరి నెలలో నీటి ప్రవా హం ఆగిపోయే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఎల్సీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపుకోవాలని సూచించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న వారి జాబితాలను ఈనెల 30 లోగా తయారు చేయాలని సూచించారు. సకాలంలో జాబితాలను రూపొందిస్తే వచ్చే నెల మొదటి వారంలో జరిగే సమావేశంలో వాటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటి సరఫరా పైప్లైన్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లోని నీటి ట్యాంకులను నిర్ణీత సమయంలోగా క్లోరినేషన్ చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని ఈఈలు అబ్దుల్ ఖాదర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
పుడమి తల్లి ‘ఉల్లి’కిపాటు
ట్రాక్టర్తో ఉల్లి పంటను దున్నుతున్న రైతు రైతు కష్టం నేలపాలు కావడంతో పుడమి తల్లి ఉలికిపాటుకు గురైంది. నాట్లు వేసి.. ఎరువు చల్లి.. నీరు కట్టిన చేతులతోనే పచ్చని పంటను దున్నేస్తుంటే మౌనంగా రోదించింది. నల్లటి నేలలో కలసిపోతున్న ఎర్రటి ఉల్లిని చూసి తల్లడిల్లింది. వరుసగా తన బిడ్డ నష్టాలు మూటగట్టుకుంటుంటే చలించిపోయింది. పెట్టుబడిని కోల్పోయి అప్పుల్లో దిగబడుతున్న రైతు ను ఆదుకునేదెవరంటూ ప్రశ్నించింది. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన రైతు పీవై. సురేంద్ర ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన తరు ణంలో మార్కెట్లో ధర లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కనీసం కూలీల ఖర్చు కూడా చేతికందే పరిస్థితులు లేకపోవడంతో బుధవారం పంటను తొలగించాడు. ట్రాక్టర్తో టిల్లర్ కొట్టించి దున్నేశాడు. చూసినా వారంతా అయ్యో అంటూ నిట్టూర్చారు. – పాణ్యం -
మహిళ అనుమానాస్పద మృతి
● పరారీలో భర్త ● అనాథగా మూడేళ్ల చిన్నారి డోన్: డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన వివాహిత తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి మృతి చెంది, తండ్రి పరారీలో ఉండగా వారి కుమార్తె అనాథగా మిగిలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన పెయింటర్ కుమ్మలపాటి విజయ్కుమార్ పెద్దకుమార్తె మణి (25)ని ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని బసవనపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ధనరాజ్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షల కట్నంతో పాటు 8 తులాల బంగారు, గృహోపకరణాలు పెళ్లి కానుకగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా పర్వతాపురంలో నివాసం ఉండే వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ధనరాజ్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. భార్య మణిపై అనుమానం పెంచుకున్న ధనరాజ్ వేధిస్తూ రెండు రోజుల క్రితం ఆమె పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని రిజిస్ట్రర్ చేసి ఇవ్వాలని విజయ్కుమార్పై ఒత్తిడి చేశాడు. మరుసటిరోజే మణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు ధనరాజ్ ఆమె కుటుంబీకులకు విషయం తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోలుకోలేక మృతి చెందింది. బుధవారం మృతురాలి మృతదేహానికి డోన్ పట్టణంలోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పో యి, తండ్రి దూరమై రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని విజయ్కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ధన్రాజ్పై హత్యకేసు నమోదు చేసినట్లు తెలిసింది. మణి (ఫైల్),అనాథగా మిగిలిన మూడేళ్ల చిన్నారి -
బ్యాంకింగ్ దిగ్గజానికి నివాళి
కర్నూలు(అగ్రికల్చర్): కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు అమ్మెంబల సుబ్బారావు పాయి 173వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో కెనరా బ్యాంకుకు 53 బ్రాంచీలు ఉన్నాయి. అన్ని బ్రాంచీల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. 1852 నవంబర్ 19న జన్మించిన ఆయన 1906 జూలై 1న కెనరా బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుతం కెనరా బ్యాంకు 10 వేల శాఖలతో సేవలందిస్తోందని అధికారులు వెల్లడించారు. కర్నూలు శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకొని శిక్షణ పొందుతున్న వారికి జీరో ఖాతాలు ప్రారంభించి సురక్ష బీమా యోజన అమలుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించారు. -
పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం
పత్తికొండ: వైద్య సేవలను దూరం చేస్తూ చంద్రబాబు సర్కారు పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని తేరుబజార్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదల ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యనభ్యసించేలా గత ప్రభుత్వంలో జగనన్న 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 కాలేజీలను ప్రారంభించడంతో, మరికొన్ని కాలేజీలు దాదాపు 50 నుంచి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటి నిర్మాణాలు పూర్తి చేయకుండా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణకు యత్నించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తున్నా చంద్రబాబు సర్కారకు చీమకుట్టినట్లుగాల లేదని విమర్శించారు. 18 నెలల కాలంలో రూ.2.50 లక్షలు కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు పేదలకు ఏమి చేశారని మండిపడ్డారు. అప్పుల్లో కనీసం 5వేలు కోట్లు కేటాయిస్తే చాలు 11 మెడికల్ కాలేజీలు పూర్తయి పేదలకు అందుబాటులోకి వచ్చేవన్నారు. ఇప్పటికే పేదవాడి సంజీవినిగా పేరుగాంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రస్టుపట్టించారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్దాస్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, జిల్లా ఎస్టీ సెల్ సంఘం అధ్యక్షుడు భాస్కర్నాయక్, మండల కన్వీనర్ కారం నాగరాజు, నాయకులు టీఎండీ హుశేన్, లలితా రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు ● బంధువులను రైలు ఎక్కించి వస్తుండగా ప్రమాదం మహానంది: బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైలు ఎక్కించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన సీతారామాపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఎం.వెంకట కృష్ణ (22), అతని బంధువు నందవరం గ్రామానికి చెందిన తిమ్మయ్య బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి తిరిగి గోపవరం వస్తున్నారు. బైక్పై వస్తుండగా సీతారామాపురం సమీపంలో వడ్ల ట్రాక్టర్ రివర్స్లో వస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో లైట్ల వెలుతురులో సరిగా కనిపించలేదు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. వెంకటకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా తిమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో ఏదీ?
● అధికారుల తీరుపై బీజేపీ నేతల ఫైర్ వెలుగోడు: కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ మండల నాయకులు మరోసారి మండిపడ్డారు. ఇటీవల వెలుగోడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజకు బీజేపీ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేయగా, తాజాగా మంగళవారం వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించకపోవడాన్ని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నూలు నాగేశ్వరరావు తప్పుపట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 10న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ప్రారంభించారన్నారు. చేపల పెంపకం, ఉత్పత్తిని పెంచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోదీని జిల్లా, మండల అధికారులు విస్మరించడం సరికాదన్నారు. ప్రధానిని, బీజేపీ పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్కు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని ఫొటో లేని కార్యక్రమాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆకతాయికి దేహశుద్ధి
కోవెలకుంట్ల: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో మంగళవా రం ఓ చిన్నారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆకతాయికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పట్టణానికి చెందిన ఓ మహిళ తన పిల్లలతో కిరాణా వస్తువులు కొనుక్కునేందుకు వచ్చింది. మహిళ షాపు వద్ద ఉండగా ఎనిమిది ఏళ్ల వయసున్న కుమార్తె అక్కడే రోడ్డుపై నిలుచుని ఉంది. అదే ప్రాంతంలో ఉన్న కోవెలకుంట్లకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బొంగు చిన్నారిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన తల్లి వెంటనే అక్కడికి చేరుకుని నిలదీసింది. ఈ క్రమంలో ఆమెతోపాటు స్థానికులు ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీశైలం ఘాట్లో ఆర్టీసీ బస్సు –బైక్ ఢీ మరో యువకుడికి తీవ్ర గాయాలు శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్లో మంగళవారం ఆర్టీసీ బస్సు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దోర్నాల పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజావలి (35), స్నేహితుడు ముండ్లమూడి పాలకొండ స్వామి శ్రీశైలం నుంచి బైక్పై దోర్నాల వస్తుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో బస్సు ఢీకొంది. బైక్ నడుపుతున్న ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీశైలం ప్రాజెక్టు హాస్పిటల్కు తరలించారు. కాగా స్వామి శివమాలను శ్రీశైలం విరమణ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దోర్నాల పోలీసులు తెలిపారు. -
ఓవర్లోడ్ ఆటోలపై ఎంవీఐ కొరడా
వెల్దుర్తి: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఆటోలపై ఎంవీఐ రవీంద్రకుమార్ కొరడా ఝళిపించారు. పెద్దల్లారా..పిల్లలు జాగ్రత్త శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం కర్నూలు ఎంవీఐ రవీంద్రకుమార్ 44వ జాతీయ రహదారి చెరుకులపాడు, వెల్దుర్తి క్రాస్లు, వెల్దుర్తి ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో స్థానిక, హైవే పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పరిమితికి మించి బడి పిల్లల్ని తీసుకెళ్తూ, ప్రమాదకరంగా టాప్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న రెండు ఆటోల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించి ఓవర్లోడ్తో పాటు సరైన పత్రాలు లేని కారణంగా రూ.20,220(రూ.14,410, రూ.5,710) జరిమానా విధించారు. ప్రమాదాలు, శిక్షలపై పలువురు ఆటో డైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సమయాల్లో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని గ్రామాలకు బస్సులు నడపాల్సిందిగా డోన్ ఆర్టీసీ డీఎం శశిభూషణ్ను కోరామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
● అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు ● తమ్ముళ్ల అండతో కాంట్రాక్టర్ నిర్వాకం ● పట్టించుకోని అధికారులు
అడిగేదెవరు! ప్యాపిలి: ఎక్కడైనా గ్రావెల్ తవ్వాలంటే అనుమతులు ఉండాలి. అయితే, తనకు ఇవేవి పట్టవని ఓ కాంట్రాక్టర్ తమ్ముళ్ల అండతో ఏకంగా అటవీ ప్రాంతంలో మట్టి తవ్వి తరలిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మామిల్లపల్లి నుంచి నల్లమేకలపల్లి వరకు కొత్తగా రోడ్డు మంజూరైంది. ఇటీవలే ఆ రోడ్డు పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేస్తున్నారు. ఈ గ్రావెల్ను మామిల్లపల్లి గ్రామ శివారు ప్రాంతమైన అటవీప్రాంతం నుంచి గత రెండు రోజులుగా యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా రోడ్డు వద్దకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో గ్రావెల్ తీయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, స్థానిక టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కదా అని కాంట్రాక్టర్కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ ప్రాంతం నుంచి జేసీబీ ద్వారా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కర్నూలు : రాజీ పూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశమున్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి పోలీసు అధికారులకు సూచించారు. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్పై ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో జి.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువగా క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని వారి కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రబాబు, మేజిస్ట్రేట్ అనిల్ కుమార్, అపర్ణ, అనూష, డీఎస్పీ వెంకటరామయ్య, ప్రమోద్ కుమార్, కర్నూలు దిశ పీఎస్ సీఐ రామయ్య నాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు
● కర్నూలు నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీలో కొన్ని నెలల క్రితం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఓ ఇంటి రెండో అంతస్తులో తనిఖీ చేసి అక్కడ జూదం ఆడుతున్న బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ అండ ఉన్న ఒకరు ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలంగా జూదం సాగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ● తాజాగా ఉల్చాల రోడ్డు ఆదిత్య నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డోన్కు చెందిన హరి యాదవ్ ఇల్లు అద్దెకు తీసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార తతంగాన్ని నడిపించాడు. గతంలోనూ అతడు వేరే చోట అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహించడంతో యజమాని వెళ్లగొట్టినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ● కర్నూలు–గుత్తి రోడ్డులోని రామచంద్ర నగర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంటిని చుట్టుముట్టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు విటులు, ఐదుగురు సెక్స్ వర్కర్లతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. దీన్ని నిర్వహిస్తోంది మహిళ కావడం గమనార్హం. నివాసముండేది వేరే కాలనీలో అయినా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొన్ని నెలలుగా తతంగం నడిపించినట్లు విచారణలో బయటపడింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని జూదం, వ్యభిచారం, మద్యంపానం వంటి వాటిని నిర్వహిస్తున్నారు. జన సంచారం అంతగా ఉండని ప్రాంతాలు, కాలనీలు, యజమానులు లేకుండా ఉన్న ఇళ్లను ఇందుకోసం ఎంచుకుంటున్నారు. దీనివల్ల వేళాపాలాతో సంబంధం లేకుండా వచ్చి వెళ్లే వారిని అక్కడ జరిగే వ్యవహారాలను పట్టించుకునేవారు ఉండరు. నిర్వాహకులకు సంబంధించిన వారు లేదా సమాచారం అందుకున్న వారు మాత్రమే అక్కడికి వచ్చే వీలుంటుంది. ఫలితంగా అక్రమ తతంగానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదన్న ధీమా వారిని మరింత ప్రోత్సహిస్తోంది. పోలీసులనే బెదిరించే స్థాయిలో నిర్వాహకులు.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారికి ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో కొందరు తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరించే స్థాయిలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కర్నూలులో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంత్రి అండతో డెన్ నిర్వాహకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి విముక్తి పొందాడు. అలాగే కర్నూలు విష్ణు టౌన్షిప్ శివారులో భారీగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు ఓ రాజకీయ పార్టీ మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని దాడికి వెళ్లిన పోలీసు అధికారినే బెదిరించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఇలా మట్కా, పేకాట, వ్యభిచార నిర్వాహకులు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులనే బెదిరించే స్థాయిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. యజమాని దృష్టి సారిస్తేనే... ఇంటి కోసం వచ్చిన వారికి అద్దె, ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఠంచన్గా అద్దె చెల్లించాలని చెప్పడమే గాకుండా వచ్చిందెవరో పూర్తిస్థాయిలో ఆరా తీయాలి. అవసరమైతే వారి సంబంధీకుల వివరాలు తెలుసుకోవాలి. అన్నీ నిర్ధారించుకుని ఇంటిని అప్పగించాలి. యజమాని హోదాలో తరచూ ఇంటికి వెళ్తుండటం, తరచూ పరిశీలిస్తూ ఉండటం, నిర్వాహకులను పరిశీలించడం, వారు చేసే కార్యకలాపాలపై దృష్టి సారించడం తప్పనిసరి. ఇల్లు ఖాళీగా ఉందని.. ఎవరో ఒకరు వచ్చారని.. అడిగినంత అద్దె ఇస్తారని ఆశ పడే ఓనర్లు కొందరు.. నెలనెలా ఎంతో కొంత ఆదాయం వస్తుందని ముక్కూమొహం తెలియని వాళ్లకు ఇల్లు అద్దెకు ఇస్తున్న వారు ఇంకెందరు.. అయితే అద్దెకు అడిగే వారి స్వభావం తెలుసుకోకుండా, కనీస వివరాలను కూడా ఆరా తీయకుండా అద్దెకు ఇస్తే లేనిపోని తలనొప్పులు తప్పవంటున్నారు పోలీసులు. పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కల్పించిన వారవుతారని, ఒక్కోసారి కేసుల్లో కూడా ఇరుక్కునే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. – కర్నూలుచుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినా, వ్యక్తుల సంచారం కనిపించినా డయల్ 112, 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలి. మన చుట్టుపక్కల నివాసాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ -
భారీగా కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు: గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడింది. వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన బోయ మహేష్ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. బోయ మహేష్ తన ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ భూమిలో 21 బాక్సుల్లో 2014 మద్యం బాటిళ్లను నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా ఈఎస్టీఎఫ్ ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె మండలం కై ప గ్రామానికి చెందిన తలారి కృష్ణ కర్ణాటక నుంచి మహేష్కు మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. ఇరువురిపై కేసు నమోదు చేశారు. మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరఫరాదారుడు తలారి కృష్ణ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రామచంద్ర, శాంతిరాజ్, అయ్యన్న పాల్గొన్నారు. -
4 క్వింటాళ్లే కొంటాం
ఇప్పటి వరకు కొనుగోళ్లే మొదలు కాక రైతులు కన్నీరు కారుస్తుంటే మురారీ పవన్ ఆగ్రోటెక్ యాజమాన్యం ఎకరాకు 4 క్వింటాళ్లే కొంటామని చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సీసీఐ అధికారులు ప్రకటించినట్లుగా రైతులు ఎకరాలకు 7 క్వింటాళ్లు కొంటారనే ఆశతో ఆ మేరకు సరుకును తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక యాజమాన్యం చేతులెత్తేయడంతో మిగిలిన సరుకును ఏమి చేయాలని లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయల బాడుగలు చెల్లించి భారీ వాహనాలతో పత్తిని తీసుకొస్తే ఇక్కడ నిలువునా మోసం చేస్తున్నారని వాపోతున్నారు. అయితే 4 క్వింటాళ్ల మెలికతో కొనుగోలు కేంద్రం యాజమాన్యం మిగిలిన సరుకు అరకొర ధరతో కొనుగోలుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. వీరికి సీసీఐ కూడా వంత పాడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తి కొనుగోలు చేయనప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రారంభించారని, ఇక్కడికి వచ్చాక సాకులు చెబితే లారీల బాడుగలు, కూలీ ఖర్చులకు ఎక్కడి నుంచి తెచ్చేదని ప్రశ్నిస్తున్నారు. -
ఎస్డబ్ల్యూపీసీలను వినియోగంలోకి తేవాలి
● జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సి.బెళగల్: గ్రామాల్లో చెత్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను (ఎస్డబ్ల్యూపీసీ) వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈఓ నసరరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పలుకుదొడ్డి గ్రామ పంచాయతీలో పర్యటించారు. వీధులను, మురుగు కాలనువలను, నీటి సరఫరా పథకాలను పరిశీలించి రెగ్యులర్గా శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి అజహర్ మహ్మద్ను ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులోని ఎస్డబ్ల్యూపీసీను తనిఖీ చేసి తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ అంశాలను పీఎస్ను అడిగి తెలుసుకున్నారు. వానపాము ఎరువుల తయారీ, విక్రయాలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమై పలు అంశాలపై సూచనలిచ్చారు. సచివాలయం – 2ను తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, రికార్డులను తనిఖీచేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ మహేశ్వరి, కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసు, పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఉన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఒడిశా యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శివ సర్కిల్లోని ఎస్బీఐ ఏటీఎం సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన టికెలాల్ ఒరియా(36) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన టికెలాల్ ఒరియా మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని సాయంత్రం ఎమ్మిగనూరుకు వెళ్లివస్తానని తోటి కూలీలతో చెప్పి బయలుదేరాడు. మంగళవారం ఉదయం ఏటీఎం ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడు ఉన్నాడు. గమనించిన కాలనీ వాసులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా చెన్నాపురం బట్టి వద్ద ఉన్న తోటి కూలీలను రప్పించి వివరాలు ఆరా తీశారు. కొన్ని రోజులుగా మృతుడు మూర్చవ్యాధితో బాధపడేవాడని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు
మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు వచ్చింది. మంగళవారం స్థానిక రాజ్యంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 34 రోజులకు హుండీల్లో వచ్చిన నగదు లెక్కించగా రూ.5,26,89,128 వచ్చింది. నాణేల రూపంలో రూ.14,58,100 సమకూరింది. అంతేగాక 80 గ్రాముల బంగారం, వెండి 1,610 గ్రాములు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకట్ష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి, ఏఈ కోనాపూర్ సురేష్ తెలిపారు. -
● 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం
దొంగ దొరికాడు కర్నూలు: ఇళ్ల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగను సి.బెళగల్ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. అతని వద్ద 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపర్చగా కోడుమూరు సీఐ తబ్రేజ్, బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్ రాజుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో డీఎస్పీ.. వివరాలు వెల్లడించారు. సి.బెళగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్నరెడ్డి ఇంట్లో సెప్టెంబర్ 25న చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులపై నిఘా ఉంచి విచారణ చేశారు. నేరం జరిగిన రోజు సీసీ ఫుటేజీల ఆధారంగా తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన గిర్నీ వెంకటేష్ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. బెళగల్ నుంచి చింతమానుపల్లె గ్రామానికి వెళ్లే దారిలో గుట్టల నాగమ్మ గుడి వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.9.25 లక్షల విలువచేసే 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనతి కాలంలోనే కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్ఐ వేణుగోపాల్ రాజు, ఏఎస్ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్, సత్యరాజు తదితరులను డీఎస్పీ అభినందించారు. -
చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళ్లెదుటే పత్తి రైతు గగ్గోలు పెడుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి. ఒక మంత్రి ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కానీ, అక్కడ జరుగుతున్న దోపిడీని ప్రశ్నించకపో
కొనుగోలు కేంద్రం ఏర్పాటైన మురారీ పవన్ ఆగ్రోటెక్ సముదాయం నంద్యాల(అర్బన్): పత్తి రైతు కష్టాన్ని కొనుగోలు కేంద్రాలు నిలువునా దోచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 15రోజులుగా 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోలు చేస్తుండగా.. నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని గత సోమవారం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. మంత్రి అండదండలు ఉన్నాయనో, లేక అడిగేవారు ఎవరనో కానీ మురారీ పవన్ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం యాజమాన్యం రైతులకు చుక్కలు చూపుతోంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 23,516 హెక్టార్లు కాగా.. తెగుళ్లు, ఇతరత్రా సమస్యలతో ఈ ఏడాది 7,211 హెక్టార్లలోనే సాగయింది. మామూలుగా 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా తుపాను ప్రభావంతో దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. ఇదిలాఉంటే ఎకరాకు 7 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ఘనంగా ప్రకటించారు. ఆ మేరకు రైతులు కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్ల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నంద్యాల మురారీ పవన్ ఆగ్రోటెక్లో ఏర్పాటైన సీసీఐ కొనుగోలు కేంద్రానికి గత రెండు రోజులుగా రైతులు దిగుబడులతో బారులు తీరుతున్నారు. అయితే స్లాట్ బుకింగ్లో ఏర్పడ్డ సమస్యలు పరిష్కారమైతేనే పత్తి కొనుగోలు చేస్తామంటూ యాజమాన్యం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రెండు రోజులుగా తిండీతిప్పలు మాని ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 15 రోజులుగా కొనుగోళ్లు గత 15రోజులుగా కర్నూలు జిల్లాలో 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 60 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. నంద్యాలలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయని పరిస్థితి. స్లాట్ ఓపెన్ కాకున్నా నాలుగు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఉందని నిర్వాహకులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్ని స్తే ఇష్టమైతే అమ్ముకో, లేదంటే నీ సరుకు నువ్వు తీసుకుపో అనే బెదిరింపులకు దిగుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్నా మంత్రులు కానీ, జిల్లా అధికారులు ఎవరూ సమస్యకు పరిష్కారం చూపకపోవడం గమనార్హం.కొనుగోళ్లు ‘తెల్ల’బోయి! స్లాట్ బుకింగ్ సమస్య పత్తి పండించిన రైతులు మొదట కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి సీసీఐ అధికారులు స్లాట్ ఇవ్వాలి. ప్రస్తుతం జిన్నింగ్ సామర్థ్యంలో 50శాతానికి కూడా స్లాట్ బుకింగ్ జరగని పరిస్థితి. ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్న అధికారులు ప్రస్తుతం నాలుగు క్వింటాళ్లేనని మొండికేస్తున్నారు. అది కూడా స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాతే కొనుగోళ్లు మొదలు పెడతామని మెలిక పెట్టడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.రోడ్డునపడ్డ పత్తి రైతన్న స్లాట్ సమస్య కారణంగానే కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య కొలిక్కి వస్తే 4 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తాం. ఏడు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. అనుమతులు వస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. – రహమాన్, మార్కెటింగ్శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్తు
దొర్నిపాడు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఇటీవలే ఎంపీయూపీ నుంచి జెడ్పీహెచ్ఎస్గా అప్గ్రేడ్ కావడంతో వసతులు పరిశీలించేందుకు వచ్చారు. తరగతిగదులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయులు పనితీరు, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అనే దానిపై ఆరా తీశారు. 9వ తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించారు. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతారన్నారు. మొదటి బ్యాచ్ పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్నాభోజం పరిశీలించి విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓలు మనోహర్రెడ్డి, రామచంద్రయ్య, హెచ్ఎం లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. నేడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో బుధవారం దేవస్థాన ట్రస్టు బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఉదయం 10గంటలకు కమాండ్ కంట్రోల్ రూము వద్ద ఉన్న సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, క్షేత్ర అభివృద్ధిపై చర్చించనున్నట్లు వెల్లడించారు. వీబీఆర్లో చేప పిల్లల విడుదల వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మంగళవారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 21.15 లక్షల చేప పిల్లల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నంద్యాల జిల్లా జాయింట్ డైరెక్టర్ హిరా నాయక్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కర్నూలు అబ్జర్వర్ డా.రంగనాథ్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. అనుమానితులపై నిఘా అవసరం నంద్యాల: పాత నేరస్తులు, నేరచరిత్ర గల వారి కదలికలు, అనుమానితులపై నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసులకు సూచించారు.మంగళవారంపట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి నేరచరిత్ర, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని సీఐకు సూచించారు. కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడిన వారికి కిక్కు దిగేలా న్యాయమూర్తి జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్లను విస్తృతం చేసింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మోతాదుకు మించి పట్టుబడిన 23 మందిని మంగళవారం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ అపర్ణ తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ సీఐ తెలిపారు. -
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి
● అధికారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని డ్వామా కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 686 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 652 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారన్నా రు. పరిశీలనలో ఉన్న మిగతా 32 దరఖాస్తులను కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఉత్పాదన సేవా రంగాల్లో 4 యూనిట్లకు మొత్తం రూ. 11.14 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్ మహబూబ్ బాషా, ఎల్డీఎం రవీందర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్రెడ్డి, డీపీఓ లలిత భాయ్, రవా ణా శాఖ అధికారి శివారెడ్డి, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


