breaking news
Nandyal District Latest News
-
ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన
● ప్రారంభించిన ఆర్యూ వీసీ ● ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ ఐటీడీఎం)లో ‘ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్’ అనే పేరుతో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయంతో ప్రపంచంలోని దేశాలన్నీ భారతదేశం వైపు చూశాయన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ప్రజలకు విద్యార్థులకు తెలియజేసేందుకు స్పేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ట్రిబుల్ ఐటీడీఎంలో ఏర్పాటు చేశామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అవగహన పెరుగుతుందన్నారు. అంతరిక్షం గురించి తెలియజేసేందుకు ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. రూ.10 కోట్ల ఖర్చు ఇస్రో ప్రత్యేకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో 50 ఏళ్ల నుంచి ఇస్రో సాధించిన విజయాల నుంచి చంద్రయాన్ వరకు సాధించిన విజయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 33 స్కూల్స్, కాలేజీలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు ఉపయోగపడనుంది. బస్సుల్లోని రాకెట్ల నమూనాలు, చంద్రయాన్ల గురించి ట్రిబుల్ఐటీ విద్యార్థులు, ఇస్రో ప్రతినిధులు వివరించారు. స్కూల్, కాలేజీల విద్యార్థులు ఎంతో ఆసక్తితో రాకెట్లను స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. నేడు(మంగళవారం)ఇస్రో బస్సు కేవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో ప్రదర్శన ఉన్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. ట్రిబుల్ ఐటీ రిజిస్ట్రార్ రాజ్కుమార్, ఆర్యూ రిజిస్ట్రార్ బి.విజయ్కుమార్, ఆచార్యులు డీన్స్ నరేష్, సత్యబాబు, ఆర్డినేటర్ డా.వినయ్ తీవారీ, ఇస్రో రిటెర్డ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
శివయ్యా.. నీవే దిక్కు!
పెద్దసత్రంలో నిరసన తెలుపుతున్న మహిళలుపెద్దసత్రంలో నివాసగృహాలుశ్రీశైలంటెంపుల్: మల్లన్న చెంత నివాసముంటున్న దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులకు గూడు కరువై రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దేవస్థానం పరిధిలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా భవనాల తొలగింపునకు దేవస్థానం చర్యలు చేపట్టింది. దీంతో అందులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా పంపిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం శ్రీశైల ఆలయ సిబ్బంది వసతి గృహాల కోసం దేవస్థానం పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. ఈ మూడింటిలో 223 నివాసాలు ఉన్నాయి. కాలక్రమేణ దేవస్థాన అధికారులు, సిబ్బందికి మరొక గృహ సముదాయాలను నిర్మించడం, ఆయా వసతి గృహాలకు ఉద్యోగులు తరలివెళ్లారు. దీంతో పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు నివాసం ఉంటున్నారు. అయితే ఆయా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని నివాసితులు అడపాదడపా మరమ్మతులు చేయించుకుని అలాగే నివసిస్తున్నారు. ఈ భవనాల నిర్ధిష్ట ఆయుర్థాయ కాలపరిమితి (బిల్డింగ్ లైఫ్ స్పాన్) ముగింపు దశకు చేరుకుందని రహదారులు–భవనాలు (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్ శాఖల సాంకేతిక నిపుణులు పరిశీలించి, దేవస్థానానికి నివేదిక సమర్పించారు. నివాసితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి, భవనాలను తొలగించాలని దేవస్థానం నిర్ణయించింది. నివాసితులకు నోటీసులు.. పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో నివసిస్తున్న దేవస్థాన ఉద్యోగులకు, ఇతర నివాసితులకు దేవస్థానం నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు అందిన ఒక నెలలో వారి నివాసాలను ఖాళీ చేయాలని లిఖితపూర్వకమైన నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయమై నివాసితులందరు కూడా దేవస్థానానికి సహకరించాలని తెలియజేస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పెద్దసత్రం నివాసితులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు, ముగ్గురికి నోటీసులు ఇచ్చిన అధికారులు నిరసనతో వెనుదిరిగి వెళ్లారు. పెద్దసత్రం, శివసదనం, పోన్నూరు సత్రంలో గృహాలు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నిర్మించినవి. తక్షణమే ఖాళీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆయా గృహ సముదాయంలో ఉన్న దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపేందుకు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీ వేశాం. వారిని ఖాళీ చేస్తే వారికి మంచిగా ఏమి చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఆయా గృహా సముదాయాల్లో ప్రైవేట్ వ్యక్తులు సైతం ఉన్నారు. అందరికి నోటీసులు ఇచ్చి, అందరిని ఖాళీ చేయిస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీశైలంలో శిథిలావస్థకు చేరిన పలు గృహా సముదాయాలు పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల్లో సుమారు 223 గృహాలు గృహాలను ఖాళీ చేయాలని సూచించిన సాంకేతిక నిపుణులు నివాసితులకు దేవస్థానం నోటీసులు ప్రత్యామ్నాయం చూపాలంటున్న బాధితులు -
నంద్యాల ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేసినట్లు సూపరింటెండెంట్ మల్లేశ్వరి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నంద్యాల పట్టణానికి చెందిన 30 ఏళ్ల మీనా జోషి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉంటుండటంతో చికిత్స కోసం కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఈమేరకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మహిళకు వైద్య పరీక్షల అనంతరం అండాశంలో భారీ గడ్డ (25ఇంటు28సెం.మీ) సుమారుగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యలు గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం గత నెల 20వ తేదీన గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, డాక్టర్ సుధారాణి, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి అండాశంలో భారీ గడ్డను తొలగించారు. అనంతరం ఆమె సురక్షితంగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. -
నేత్రదానం పుణ్యకార్యక్రమం
నేత్రదానం చేయడం పుణ్యకార్యక్రమంతో సమానం. ప్రపంచంలో 4 నుంచి 6 శాతం మంది కార్నియా జబ్బుతో బాధపడుతున్నారు. ఇందులో 0.36శాతం భారతీయులే ఉన్నారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి 0.25శాతానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. దేశంలో ఏటా 47,676 మంది నుంచి కార్నియా సేకరిస్తున్నారు. వాటిలో 29,057 వినియోగిస్తున్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల నిరుపయోగమవుతున్నాయి. నేత్రదానం సమయంలో మొత్తం కన్ను గాకుండా నల్లగుడ్డు (కార్నియా) మాత్రమే తీస్తారు. దాని స్థానంలో కృత్రిమ కళ్లను మరణించిన వారికి అవయవలోపం కనిపించదు. దాతలు ఇచ్చిన నేత్రాలను విక్రయించడం, కొనడం జరగదు. ఇతరులకు ఉచితంగా అమరుస్తారు. – డాక్టర్ పి. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కర్నూలు -
మీరూ కోర్టుకు వెళ్లండి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంబన నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ అనివార్యమైంది. ఈనేపథ్యంలో కోర్టుకు వెళ్లిన వారు మినహా మిగిలిన వీఏఏలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరిపోయారు. బదిలీల్లో చాలా మంది వీఏఏలు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకమైన స్థానాలు దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే విషయంపైనే దృష్టి సారిస్తూ.. విధి నిర్వహణ గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. రీ కౌన్సెలింగ్ విషయమై వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు వీఏఏల బదిలీలు అనివార్యమైతే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీఏఏల బదిలీల వ్యవహారంలో జిల్లా పరువు గంగలో కలవడం పట్ల వ్యవసాయ శాఖపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరోసారి విమర్శలకు తావు లేకుండా జేసీకి వీఏఏల బదిలీల బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మండల వ్యవసాయాధికారులుగా నియమితులైన వారిలో 90 శాతం మంది కూటమి పార్టీల నేతలకు ముడుపులు ఇచ్చుకొనే వచ్చారనే చర్చ ఉంది. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని స్థానాలు పొందిన వారందరూ ఇప్పుడు ఆ మొత్తాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుకు సాగని ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ సీజన్ మరో 40 రోజుల్లో ముగియనున్నా ఈ–క్రాప్ బుకింగ్ ముందుకు సాగని పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో 3.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మామూలుగా అయితే ఇప్పటికే 50–60 శాతం వరకు ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే 3.6 శాతం మాత్రమే చేయడం గమనార్హం. సగం మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్ ఊసే కరువైంది. బదిలీలు మళ్లీ మొదటికి రావడంతో పోస్టింగ్ ఎక్కడికి పడుతుందోనన్న ఆందోళన వీఏఏల్లో వ్యక్తమవుతోంది. అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ తీసుకునేదెవరు? అన్నదాత సుఖీభవ కింద వేలాది మందికి అన్ని అర్హతలున్నా సాయం అందలేదు. బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ కాని ఖాతాలు వేలల్లో ఉన్నాయి. ఈ లిస్ట్లను గ్రామ రైతు సేవా కేంద్రాలకు పంపారు. వివరాలు రైతులకు చెప్పేందుకు వీఏఏలు అందుబాటులో లేని పరిస్ధితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతుల నుంచి అన్నదాత సుఖీభవకు సంబంధించి గ్రీవెన్స్ తీసుకునే వారు కరువయ్యారు. తీసుకున్న గ్రీవెన్స్ను పరిశీలించి పరిష్కరించే దిక్కు లేకుండా పోయింది. నిర్వీర్యమైన రైతు సేవా కేంద్రాలు అన్నదాతలకు విశేష సేవలందించిన రైతుభరోసా కేంద్రాలు నేడు ఉండీ లేనట్లుగా తయారయ్యాయి. గతంలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. కూటమి ప్రభుత్వం 689కి తగ్గించింది. రేషనలైజేషన్ పేరిట 188 రైతు సేవా కేంద్రాలను మూసివేసింది. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ పూర్తయి పాలన గాడిన పడుతోందని భావిస్తున్న తరుణంలో హైకోర్టు వీఏఏల బదిలీలను రద్దు చేసింది. మళ్లీ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ సారి పత్తి, కంది తదితర పంటలు సాగు చేశాం. గతంలో ఆగస్టు 15లోపే ఈ–క్రాప్లో పంటలను నమోదు చేసేవాళ్లు. ఈ సారి ఆగస్టు నెల గడుస్తున్నా ఆ ఊసే కరువైంది. ఇక్కడ పనిచేసే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ను బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. 2023–24 వరకు రైతులకు అన్ని రకాల సేవలు ఆర్బీకే ద్వారా అందాయి. ఇప్పుడు ఎలాంటి సేవలు అందించడం లేదు. ఈ–క్రాప్ నమోదు చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. – ఉమేష్, జి.హొసల్లి, ఆదోని మండలం కోర్టుకు వెళ్లిన 40 మంది కోసం అందరినీ బదిలీ చేయాలా.. మీరూ కోర్టుకు వెల్లండి.. అని కొంతమంది అధికారులు వీఏఏలను రెచ్చగొడుతున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు రీకౌన్సెలింగ్ అనివార్యం కావడంతో ముడుపులు, సిఫారసులతో అనుకూలమైన స్థానాలు దక్కించుకున్న వీఏఏలు తమ పరిస్థితి ఏంటని నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 100 మందికిపైగా వీఏఏలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు ఇచ్చుకొని స్థానాలు పొందారు. ఒక వీఏఏ కోరుకున్న స్థానం కోసం రూ.2 లక్షలు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. స్థానాలు మారితే ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 40 మంది కోసం అందరినీ బదిలీ చేయడం ఏంటి, మీరు కూడా కోర్టుకు వెళ్లండని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్ వల్ల నంద్యాల నుంచి 40 మంది వీఏఏలు కర్నూలు జిల్లాకు రావడం తప్పనిసరి. కోర్టుకు వెళ్లిన 40 మందికి వేరే పోస్టింగ్ ఇచ్చినా.. మరో 40 మంది పశ్చిమ ప్రాంతంలోని సరిహద్దు మండలాలకు వెళ్లడం తప్పనిసరి. విధి నిర్వహణలో అంటీముట్టనట్లుగా వీఏఏలు -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
● డీజే శబ్దానికి కూలిన మట్టిమిద్దె ● తప్పిన ప్రాణపాయం కోవెలకుంట్ల: మేజర్ గ్రామ పంచాయతీ కోవెలకుంట్లలో వినాయక నిమజ్జనంలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. పట్టణంలోని ఆయా కాలనీల్లో కొలువుంచిన గణనాథులను పట్టణ శివారులోని కుందూనదిలో నిమజ్జనం చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే, డ్రమ్స్ మధ్య ఊరేగింపు నిర్వహించారు. సంతమార్కెట్ సమీపంలో ఊరేగింపు వెళుతున్న సమయంలో డీజే శబ్దానికి బుగ్గరపు లక్ష్మయ్యకు చెందిన పాత ఇల్లు కూలింది. ఇంటి ముందు వారపాకతో పాటు మరో గది నేలకూలింది. ఆ సమయంలో లక్ష్మయ్యతోపాటు ఆయన భార్య వెంకటరత్నమ్మ లోపలి గదిలో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు నేలకూలడంతో స్థానికులు హుటాహుటినా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వృద్ధ దంపతులు -
కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుబ శశికళ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు కర్నూలు ఎస్వీ కాన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ పదవులు పొందిన వారు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
సర్టిఫికెట్లు రీ వెరిఫికేషన్
కర్నూలు(హాస్పిటల్): డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రీ వెరిఫికేషన్ చేశారు. రీ వెరిఫికేషన్కు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈఎన్టీ విభాగానికి 13 దరఖాస్తులు రాగా అందులో ఐదుగురు గైర్హాజరయ్యారు. అనంతపురం నుంచి ఆరుగురు హాజరు కాగా, కర్నూలు జిల్లా నుంచి 20 మందిలో ఇద్దరు గైర్హాజరయ్యారు. అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు. సైకియాట్రి విభాగంలో కర్నూలు నుంచి ఒకరు, అనంతపురం జిల్లా నుంచి నలుగురు హాజరయ్యారు. కంటి ఆసుపత్రిలోనూ పలువురు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో భాగంగా వైద్యులు పరీక్షించారు. ఈ ప్రక్రియను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. -
ప్రజా సమస్యలు మాకొద్దు.. పార్టీ కార్యాలయమే ముద్దు!
● మున్సిపల్ చైర్పర్సన్తో టీడీపీ కౌన్సిలర్ల వాగ్వాదంబొమ్మలసత్రం: ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాల్సిన టీడీపీ కార్పొరేటర్లు పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. మున్సిపల్ చైర్పర్సన్తో వాగ్వాదం దిగారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసి ప్రజాసమస్యలపై ప్రస్థావన రాకుండా పోయింది. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన కౌన్సిల్హాల్లో శనివారం సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ శేషన్న 14 రకాల అంశాలతో పొందుపరిచిన ఆగస్టు నెలకు సంబంధించిన అజెండాను సభలో ప్రస్తావించారు. అందులో 11వ అంశంగా టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. విలువైన భూమిపై కన్ను మున్సిపల్ కార్యాలయం దగ్గరలో మూలసాగరం సర్వే నంబర్ 415/12, 415/13 లో ఉన్న 1.57 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని కౌన్సిల్లో అనుమతి కోసం ఉంచారు. ప్రస్తుతం అక్కడ సెంటు విలువ రూ.10 లక్షలకు పైగా ఉంది. అంత విలువైన భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించటంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నివ్వెరపోయారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇంత వరకు పేదలకు ఒక సెంటు భూమి కూడా ఎక్కడా కేటాయించలేదు. కేవలం పార్టీ కార్యాలయం కోసం అంత విలువైన భూమిని కట్టబెట్టడంపై సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ కౌన్సిలర్ల గగ్గోలు వర్షాలు కురవడంతో కొన్ని రోజులుగా నంద్యాల పట్టణంలో కాలనీలన్నీ నీటి కుంటలుగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దోమలు విస్తరించుకుపోయాయి. దోమల కారణంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధులు బారినపడి అల్లాడిపోతున్నారు. దీనిపై చర్చ జరపకుండా తమ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపు విషయంపై టీడీపీ కౌన్సిలర్లు గగ్గోలు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. చైర్పర్సన్ మాబున్నిసా కూర్చున్న పోడియం వద్దకు టీడీపీ కౌన్సిలర్లు వెళ్లి భూమి కేటాయింపు ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ కేకలు వేశారు. మాబున్నిసా ఎంత నచ్చజెప్పినా టీడీపీ కౌన్సిలర్లు వినలేదు. స్థలం కేటాయింపునకు అధిక సంఖ్యలో సభ్యులు నిరాకరించటంతో ఆ ఒక్క అంశాన్ని పెండింగ్లో ఉంచారు. కౌన్సిల్ సభ్యుల గందగోళం మధ్య అర్ధాంతరంగా సభను ముగించి ఆమె వెళ్తుండగా టీడీపీ కౌన్సిలర్లు చుట్టుముట్టారు. సభను కొనసాగించి తమకు అనుకూలంగా స్థలం కేటాయింపు చర్చను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సభను జరపకుండా అనవసరమైన విషయలపై సభ్యులు పట్టుబడుతుండగా ఆమె సమావేశ భవనం నుంచి వెళ్లిపోయారు. వర్షాల కారణంగా దోమలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇవే కాకుండా పట్టణంలో వికలాంగుల పింఛన్లు నిలిచిపోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగతున్నారు. ప్రజా సమస్యలను సమావేశంలో వివరించాలని వస్తే టీడీపీ కౌన్సిలర్లు సభను అడ్డుకున్నారు. అలాంటి సమస్యలపై చర్చలు జరపకుండా కేవలం పార్టీ కార్యాలయం స్థలం కోసం సమావేశాన్ని అడ్డుకోవటం దారుణం. –దేశం సులోచన (18వ వార్డు కౌన్సిలర్)మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణానికి దూరంగా ప్రజా జీవనానికి అనుకూలంగా లేని ప్రాంతంలో పార్టీ కార్యాలయనిర్మాయానికి ఒక ఎకరా భూమిని కేటాయించేందుకు 2023 మేనెలలో కౌన్సిల్ తీర్మానం చేసింది. కార్యాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు కొంత జాప్యం జరిగింది. తర్వాత ఎన్నికలు రావటం, టీడీపీ అధికారం చేపట్టింది. ఈనేపథ్యంలోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమిలో మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేశారు. కార్యాలయ నిర్మాణానికి అధికారులు అడ్డుచెప్పడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి మున్సిపల్ అధికారులు టీడీపీ కార్యాలయం కోసం ప్రజా జీవనానికి అనువుగా ఉండే ప్రాంతంలో 1.57 ఎకరాల ప్రభుత్వ భూమి అనుమతి కోసం అజెండాలో చేర్చటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ కార్యాలయ స్థలానికి వీఎల్టీని కూడా అనుమతించని అధికారుల టీడీపీ కార్యాలయానికి విలువైన భూమి కేటాయింపుపై సభలో చర్చకు తీసుకురావటంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కదలరు.. వదలరు!
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థాన గృహాలను పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, దేవస్థానం నుంచి ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన వారు వదలడం లేదు. దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు వసతి గృహాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దేవస్థాన అభివృద్ధికి సైతం అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా గృహాలను ఖాళీ చేయడం లేదు. దీంతో రిటైర్డ్, బదిలీ ఉద్యోగులను ఖాళీ చేయించడం దేవస్థానానికి తలనొప్పిగా మారింది.550 గృహాలుశ్రీశైల దేవస్థానంలో 300 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1,600 మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల కోసం దేవస్థానం వసతి గదులను నిర్మించింది. దేవస్థాన పరిధిలో సుమారు 550 గృహాలు ఉంటాయి. ఏ–టైప్, ఎంఐజీ, ఎల్ఐజీ పేరుతో ఆయా గృహాలను నిర్మించారు. అధికారి, సిబ్బంది హోదా మేరకు దేవస్థానం రెవెన్యూ విభాగం గృహాలను కేటాయించింది. అయితే కొంతమంది ఉద్యోగులు రిటైర్డ్ అయినప్పటికీ వారికి కేటాయించిన ఆయా గృహాలను ఖాళీ చేయడం లేదు. అంతేకాకుండా పలువురు ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఉద్యోగులు సైతం ఆయా గృహాలను ఖాళీ చేయకుండా ఉన్నారు. ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన వారిలో సుమారు 15 మందికి పైగా ఉంటారు. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వసతి గృహాలు లేక గంగాసదన్, గౌరీ సదన్లో భక్తులకు ఇచ్చే గృహాలను ఉద్యోగులకు కేటాయిస్తున్నారు. దేవస్థాన అధికారులు ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు స్పందించడం లేదు. గృహాలను ఖాళీ చేయడం లేదు.క్వార్టర్స్లో తిష్ట వేసి..శ్రీశైల దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహించిన సీ.మధుసూదన్రెడ్డి అనే వ్యక్తి గత సంవత్సరం పదవీ విరమణ పొందాడు. గతంలో దేవస్థానంలో విధులు నిర్వహించేటప్పుడు ఆయనకు దేవస్థానం ఎల్ఐజీ నం–5 గృహాన్ని కేటాయించింది. అయన రిటైర్డ్ అయిన తరువాత దేవస్థాన గృహాన్ని ఖాళీ చేయాలి. కానీ ఇంతవరకు ఖాళీ చేయలేదు. దేవస్థానం పలుమార్లు నోటీసులు సైతం ఇచ్చింది. అలాగే ఆయన ఉంటున్న గృహాన్ని ఆయన రిటైర్డ్ అయిన తరువాత దేవస్థాన అంబులెన్స్ డ్రైవర్ రాఘవరెడ్డికి కేటాయించారు. కానీ ఆ గృహాన్ని అతను ఖాళీ చేయకుండా తిష్ట వేశాడు. ఇది ఒక రిటైర్డ్ ఉద్యోగి విషయం కాదు..ఇలా చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఉద్యోగులు, దేవస్థాన క్వార్టర్స్లో తిష్ట వేసి ఖాళీ చేయడం లేదు.బదిలీ, రిటైర్డ్ అయిన ఉద్యోగులు దేవస్థాన అవసరాల దృష్యా గృహాలు ఖాళీ చేయాలి. ఒకరు ఇద్దరు ఖాళీ చేయాల్సి ఉంది. వారికి నోటీసులు పంపాం. ఖాళీ చేయని వారి గృహాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలుపుదల చేస్తాం.– ఎం. శ్రీనివాసరావు,శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
శాస్త్రోక్తంగా స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను అమృతవల్లీ అమ్మవార్లను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
చాలా ఆనందంగా
అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన భవనంలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహించడం డోన్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. గత రెండేళ్లుగా కలలు కన్న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఇప్పుడు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. డోన్ ప్రజలు గర్వకారణంగా భావించే ఈ విద్యాలయం ఏర్పాటుకు విశేష కృషిచేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నటికీ మరిచిపోరు. – ఖాజా, సౌత్సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు, డోన్ కేంద్ర ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో మాజీ మంత్రి బుగ్గన డోన్కు కేంద్రీయ విద్యాలయాన్ని సాధించిపెట్టారు. జిల్లా కేంద్రానికి తప్ప అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి మంజూరు కాదనుకున్న విద్యాలయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో సాధించి చూపిన అనితర సాధ్యుడు మాజీ మంత్రి బుగ్గన. ఆయన కృషిని నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. – రేగటి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ, డోన్ -
శ్రీశైలానికి స్థిరంగా వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలానికి వరద స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం తొమ్మిది రేడియల్ క్రస్ట్గేట్లను తెరచి 2,38,626 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం సమయానికి జలాశయంలో 197.0114 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 881.60 అడుగులకు చేరుకుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 2,83,105 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 3,41,558 క్యూసెక్కుల నీటిని వదిలారు. నాగార్జునసాగర్కు స్పిల్వే ద్వారా 2,40,850 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 68,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్వాటర్ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,430 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసరప్రాంతాలలో 15.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 14.480 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.725 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. -
వచ్చే నెల 22 నుంచి దసరా ఉత్సవాలు
మహానంది: వచ్చే నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో శుక్రవారం పండితులు, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. గత ఏడాది కంటే దసరా నవరాత్రి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించాలన్నారు. దాతల సహకారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రతి రోజూ అలంకరణలతో పాటు విశేష పూజలు ఉంటాయన్నారు. ఏఈఓ మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, పి.సుబ్బారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కంట్రోల్ రూమ్లో పీజీఆర్ఎస్ అర్జీలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 41,247 అర్జీలు రాగా 38,862 పరిష్కారాలు జరిగాయన్నారు. ప్రజా వినతులకు సరైన స మాధానాలు ఇవ్వని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న 230 మంది అధికారులకు మె మోలు జారీ చేసి 13,403 వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. గిడుగు రామ్మూర్తి సేవలు ఎనలేనివి కర్నూలు(అర్బన్): తెలుగు వైభవం కోసం పోరాటం నిర్వహించిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని, ఆయన సేవలు ఎనలేనివని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా స్థానిక మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ.. గిడుగు రామ్మూర్తి 1863 ఆగస్టు 29వ తేదిన జన్మించారన్నారు. తెలుగు వాడుక భాష పితామహుడుగా, గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సీ మురళీమోహన్రెడ్డి, బసవశేఖర్, రాంగోపాల్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఎంబీబీఎస్ మొదటి విడత అడ్మిషన్లు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో మొదటి విడత స్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్లు శుక్రవారం ముగిశాయి. ఇందులో భాగంగా మంగళవారం 16 మంది, బుధవారం 10 మంది, గురువారం అధికంగా 110 మంది, చివరి రోజైన శుక్రవారం 15 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికే నేషనల్ కోటాలో 37 సీట్లకు గాను 28 మంది అడ్మిషన్ తీసుకున్నారు. రాష్ట్ర కోటా, నేషనల్ కోటాలో మిగిలిన సీట్లకు తర్వాతి విడత కౌన్సెలింగ్లలో భర్తీ చేయనున్నారు. సహకార శాఖలో 27 మందికి పదోన్నతులు కర్నూలు(అగ్రికల్చర్): సహకార శాఖలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 27 మందికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి డిప్యూటీ రిజిస్ట్రార్ గా పదోన్నతి లభించింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయిన శివరామకృష్ణను ఆత్మకూరు నుంచి నంద్యాల సహకార ఆడిట్ అధికారిగా, రుక్సానా బేగంను కర్నూలు డీసీఓ ఆఫీస్ నుంచి నంద్యాల డీఎల్సీఓగా నియమించారు. -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘రాజ’బాట
డోన్: అత్యున్నత విద్యను బోధిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వచ్చింది. డోన్ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి అప్పటి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సహకారంతో డోన్కు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు. ఐటీఐ విద్యార్థుల వసతి గృహం కేంద్రంగా.. కేంద్రీయ విద్యాలయాన్ని డోన్లో రెండేళ్ల క్రితమే ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఐటీఐలో రూ.3కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతిగృహాన్ని విద్యాలయం నిర్వహణకు ఎంపిక చేశారు. బాత్రూం, సైన్స్ల్యాబ్, గ్రంథాలయం, వెంటిలేటర్స్, కిచెన్, హాస్టల్ వసతి తదితర ఫీజుబులిటీ సర్టిఫికెట్లను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పించారు. ఈ విద్యాలయాన్ని ప్రారంభించకుండా టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి విఫలయత్నం చేశారు. అడ్మిషన్లు ప్రారంభం కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయివరకు చదవొచ్చు. ప్రస్తుత ఏడాదికి కేవలం ఒకటి నుంచి ఐదో తరగతి వరకే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఐటీఐలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు తమ దరఖాస్తు ఫారాలను స్థానిక కార్యాలయంలో అందజేసే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 11వ తేదీన లాటరీ పద్ధతిలో డ్రా తీసి 12వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ప్రవేశాలు కల్పిస్తారు. గత ప్రభుత్వ హయాంలో నంద్యాల జిల్లాలోనే డోన్ విద్యారంగంలో అగ్రస్థానం పొందింది. వెటర్నటీ పాలిటెక్నిక్, గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం, పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐటీఐ, ఎస్సీ, బీసీ బాల, బాలికల గురుకుల పాఠశాల, ఉర్దూ పాఠశాలలను మంజూరు చేయించడమే కాక అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించడం చరిత్రలో నిలిచిపోతోంది. కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుతో విద్యారంగంలో డోన్ అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. – మాణిక్యం శెట్టి, ఉపాధ్యాయ సంఘం నేత డోన్ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ నంద్యాల జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు -
ఆస్పరి మార్కెట్ @ కోటి
ఆస్పరి: మేజర్ గ్రామ పంచాయతీ ఆస్పరి దినసరి కూరగాయల మార్కెట్ వేలం రికార్డు స్థాయిలో రూ. కోటి పలికింది. శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి సంబంధించి దినసరి కూరగాయల మార్కెట్ వే లాన్ని పంచాయతీ కార్యదర్శి విజయరాజు నిర్వహించారు. ఇందులో 9 మంది పాట దారులు రూ. 5 లక్షలు సాల్వె న్సీ, రూ. 2 లక్షలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. వేలం పోటాపోటీగా సాగింది. చివరకు ముల్లా మెహబూబ్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఎక్కువ ధర పాడి మార్కెట్ హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 65 లక్షలు పలకగా ఈసారి కోటి రూపా యలు పలకడంతో పంచాయతీకి రూ.35 లక్షల ఆదాయం పెరిగింది. ఆస్పరి మార్కెట్ చరిత్రలోనే ఎక్కువ పాడిన మొత్తంగా నిలిచింది. వేలంలో ఎంపీడీఓ గీతావాణి, ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్పరి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.బార్ల అనుమతులకు నేడు లక్కీ డిప్కర్నూలు: జిల్లాలో మద్యం బార్ల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్కు ఆశావహుల నుంచి స్పందన అంతంత మాత్రమే వచ్చింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మూడేళ్ల కాల పరిమితితో కర్నూలులో ఓపెన్ కేటగిరీ కింద 16, గౌడ కులాలకు 2, ఆదోనిలో ఓపెన్ కేటగిరీ కింద 4, గౌడ కులాలకు 1, ఎమ్మిగనూరులో 2, గూడూరులో ఒకటి చొప్పున మొత్తం 26 బార్లకు లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. కనీసం 4 దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తామని ఎౖక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ లెక్కన గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీ కింద ఉన్న 23 బార్లకు గాను 15 బార్లకు 60 దరఖాస్తులు, గౌడ కులాలకు రిజర్వు చేసిన 3 బార్లకు 17 దర ఖాస్తులు వచ్చాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మరో 5 బార్లకు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరులో ఒకటి బార్ ఏర్పాటుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జెడ్పీ సమావేశ భవనంలో లక్కీడిప్ నిర్వహణకు ఎక్సై జ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మద్యం బార్ల ఏర్పాటుకు లైసెన్సుల జారీకి శనివారం ఉదయం 8 గంటలకు లక్కీ డిప్ నిర్వహించను న్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్బాషాతో పాటు ఎక్సైజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్ బాబు సమక్షంలో లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు లైసెన్స్లు జారీ చేయనున్నారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం
● బైక్ను ఢీకొన్న బొలెరో వాహనం కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడుకు చెందిన భీమన్న, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వీరేంద్ర(29) కోవెలకుంట్ల పట్టణంలోని స్టార్విన్ టైలర్ షాపులో టైలర్గా పనిచేస్తున్నాడు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన నాగమణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. శుక్రవారం ఉదయం బైక్పై స్వగ్రామం నుంచి కోవెల కుంట్లకు బయలుదేరాడు. మార్గమధ్యలో భీమునిపాడు గ్రామం ఎస్సీ కాలనీ మలుపు వద్ద కోవెలకుంట్ల వైపు నుంచి మేకలను తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. యువకుడి మృతితో క్రిష్టిపాడులో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టైరు ఊడి తుఫాన్ బోల్తా
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీ య రహదారిపై బలపనూరు గ్రామం వద్ద టైరు ఊడిపోయి తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం కర్నూలు నుంచి తుఫాన్ వాహనంలో డ్రైవర్ కేశవతో పాటు మరో 11 మంది నంద్యాలకు బయలుదేరారు. మార్గమధ్యలో బలపనూరు దాటిన తర్వాత తిరుమల గిరి వద్ద వాహనం వెనుక వైపు టైరు ఊడిపోవడంతో అవతల రోడ్డు పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కర్నూలు విద్యా నగర్కు చెందిన ఉపాధ్యాయుడు రాంబాబు, విజయవాడకు చెందిన రహిమాన్, ఉపా ధ్యాయుడు నాగరాజు, పుట్టపర్తికి చెందిన సాయికృష్ణ, డ్రైవర్ కేశవకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహ నాన్ని తొలగించారు. -
అలా వెళ్లి.. ఇలా రావడమే!
● శ్రీశైలాన్ని వదలని ఉద్యోగులు ● అపహాస్యం అవుతున్న బదిలీలు ● రెండు నెలల్లోనే తిరిగి వస్తున్న వైనంశ్రీశైలంటెంపుల్: దేవదాయ శాఖలో బదిలీలు అపహాస్యం అవుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం బదిలీ అయిన వారు తిరిగి యథాస్థానికి వస్తున్నారు. ఇందుకు వీరికి అనారోగ్యకారణాలు, 888 జీఓ సహకరిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో శ్రీశైల దేవస్థానం నుంచి 22 మందిని, 2025లో రెండు నెలల క్రితం పది మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేసింది. వీరిలో ఇద్దరు, ముగ్గురు తప్ప చాలా మంది తిరిగి వచ్చారు. దీంతో ప్రభుత్వం బదిలీలు చేయడం ఎందుకు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల నిబంధనలు ఇవీ.. ఐదేళ్లు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా బదిలీ చేస్తుంది. ఇందులో భాగంగా శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే పలువురు రెగ్యులర్ ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ అవుతుంటారు. దేవస్థానంలో ఆలయం, అన్నదానం, వసతి, పారిశుద్ధ్యం, గోసంరక్షణశాల, రెవెన్యూ, పరిపాలన, అకౌంట్స్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో 300 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే 1,600 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తిరిగి వచ్చారు ఇలా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024లో మొదటిసారి సాధారణ బదిలీలలో భాగంగా శ్రీశైల దేవస్థానం నుంచి 22 మంది ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు బదిలీ చేశారు. మూడు నాలుగు నెలలు తిరగకముందే వివిధ కారణాలతో వీరిలో 13మంది ఉద్యోగులు తిరిగి శ్రీశైల దేవస్థానానికి వచ్చారు. అలాగే ఈ ఏడాది శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పది మంది రెగ్యులర్ ఉద్యోగులను ఇతర దేవస్థానాలకు సాధారణ బదిలీ చేశారు. వీరిలో బి.వి.శివారెడ్డి (అసిస్టెంట్ ఇంజనీర్), కె.గిరిజామణి, సదాశివరావు, గణపతి శ్రీశైల దేవస్థానానికి తిరిగి వచ్చారు. ఇలా చేస్తే మేలు.. ● రాష్ట్ర ప్రభుత్వం జీఓ 888 ద్వారా దేవస్థాన ఉద్యోగులను బదిలీలు చేస్తుంది. ఈ జీఓ 2000లో ఇచ్చారని, అంతకు ముందు విధుల్లో చేరిన ఉద్యోగులు ఈ జీఓ తమకు వర్తించదని కోర్టు మొట్లు ఎక్కుతున్నారు. ● ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ ఉన్నతాధికారులు 888 జీఓను సవరించాలి. ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఇతర దేవస్థానాల్లో కనీసం మూడు సంవత్సరాలైన విధులు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలి. 2024సంవత్సరంలో ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన శ్రీశైలం ఉద్యోగులను సత్కరిస్తున్న అప్పటి ఈఓ శ్రీశైల దేవస్థాన పరిపాలనా భవనం సిఫార్సులతో... శ్రీశైల దేవస్థానంలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీ అయితే వెళ్లి రెండు, మూడు నెలలు విధులు నిర్వహించి సెలవుపై వస్తారు. అటు తరువాత తమకు పరిచయం ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించుకుని డిప్యూటేషన్ పై శ్రీశైల దేవస్థానానికి వస్తారు. నాలుగేళ్లే డిప్యూటేషన్పై ఉండి సాధారణ బదిలీలలో తిరిగి శ్రీశైల దేవస్థానానికి బదిలీ చేయించుకుంటారు. అంటే ఏ దేవస్థానానికి బదిలీ చేసినా తిరిగి శ్రీశైల దేవస్థానానికి రావడం పరిపాటిగా మారింది. -
పాల ఉత్పత్తిదారుల అభ్యున్నతికి కృషి
● విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): పాల ఉత్పత్తిదారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి( విజయ డెయిరీ) చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి అన్నారు. 2024–25లో వార్షిక టర్నోవర్ రూ.319 కోట్లు ఉందని, దీనిని 2025–26లో రూ.393 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. విజయ డెయిరీ 38వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ పక్కన ఉన్న కర్నూలు డెయిరీ ప్రాంగణంలో చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎండీ ప్రదీప్కుమార్ వార్షిక నివేదికను చదవి వినిపించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ... ఈ ఏడాది 467 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు పాల ఉత్పత్తి పెంచడానికి తగి న చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఐదేళ్లుగా పాడిరైతులకు క్రమం తప్పకుండా బోనస్ చెల్లిస్తున్నామని, పాల సేకరణలో గిట్టుబాటు ధర లు కల్పిస్తున్నామని వివరించారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడిపశువుల కొనుగోలుకు సబ్సిడీ కూడా ఇస్తున్నామని వివరించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
● కుమార్తెను విమానం ఎక్కించి వస్తుండగా ప్రమాదం ● తెలంగాణ రాష్ట్రం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో కంటైనర్ను ఢీ కొట్టిన ఇన్నోవా ● ఎమ్మిగనూరు వాసి దుర్మరణం ● మృతుడి భార్య, డ్రైవర్కు గాయాలు ఎమ్మిగనూరురూరల్: లండన్ వెళ్తున్న కుమార్తెను శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కించి తిరిగి వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన చిలుకూరి విజయకుమార్శెట్టి(66) మృతి చెందగా, అతని భార్య, వాహన డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయం సమీపంలో నివాసముండే వ్యాపారి చిలుకూరి విజయకుమార్శెట్టి(66), మాధవి దపంతులకు కుమారుడు నైనికాంత్, కుమార్తె నందిత ఉన్నారు. పదేళ్ల క్రితం కుమార్తె నందిత వివాహం కాగా అప్పటి నుంచి ఆమె లండన్లో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆమె తిరిగి లండన్ వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఈ మేరకు ఇన్నోవాను అద్దెకు తీసుకొని గురువారం రాత్రి 10 గంటలకు కుమార్తెతో తల్లిదండ్రులు హైదరాబాద్కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్లో కుమార్తె నందితను విమానం ఎక్కించారు. అనంతరం ఎమ్మిగనూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ముందు వెళ్తున్న కంటైనర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీ కొట్టడంతో ఇన్నోవా పల్టీలు కొట్టింది. కాగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా విజయకుమార్శెట్టి మృతి చెందగా, అతని భార్య మాధవి, డ్రైవర్ వెంకటేష్కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందంచారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుమార్తె తిరిగి వస్తున్నట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ లడ్డూ వేలంలో పాల్గొనాలని.. శుక్రవారం తెల్లవారుజామున కుమార్తెను విమానం ఎక్కించిన తర్వాత ఎమ్మిగనూరుకు బయలుదేరు ముందు ఒక గంట విశ్రాంతి తీసుకోమని విజయకుమార్శెట్టి డ్రైవర్ వెంకటేష్కు సూచించారని అతని భార్య మాధవి చెబుతోంది. అయితే ఎమ్మిగనూరులో ఈ రోజు నిమజ్జనం ఉందని, లడ్డూ వేలంలో పాల్గొనాలని, ఏమి కాదంటూ చెబుతూ డ్రైవర్ బయలుదేరాడని తెలిపింది. రాత్రంతా విశ్రాంతి లేకపోవడం, లడ్డూ వేలంలో పాల్గొనేందుకు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆమె వాపోతోంది. -
శ్రీశైలంలో మద్యం సీసాలు స్వాధీనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం టోల్గేట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి వద్ద నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తన సిబ్బందితో కలిసి టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో శ్రీశైలం వడ్డెర కాలనీకి చెందిన దండుగల మల్లికార్జున 32 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు రాజేంద్రకుమార్, రఘునాథుడు, బాలకృష్ణ, అమర్నాథరెడ్డి, వెంకటనారాయణ, నానునాయక్, లాల్సా పాల్గొన్నారు. -
డీఎస్సీలో సాంకేతికమక
కర్నూలు సిటీ: డీఎస్సీలో ర్యాంకులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు వెబ్సైట్ పనిచేయలేదు. సాంకేతిక సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ)లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు. అధికారుల సమన్వయలోపంతో ఇంటర్నెట్ పని చేయలేదు. అన్ని కేంద్రాల్లో సెల్ఫోన్లోని హాట్స్పాట్ను ఓపెన్ చేసుకొని వెరిఫికేషన్ను ప్రారంభించినా వెబ్సైట్ అప్అండ్ డౌన్ అయ్యింది. దీంతో రెండున్నర గంటల పాటు సర్టిఫికెట్ల పరిశీలన నిలిచిపోయింది. తర్వాత తాత్కాలిక ఇంటర్నెట్ సదుపాయాన్ని వాడుకున్నా వెబ్సైట్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక్కొక్కరికి అర గంటకుపైగా సమయం పట్టింది. రాత్రి 8 గంటలైనా కూడా వెరిఫికేషన్ పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థులు రాత్రి వేళల్లో శ్రీలక్ష్మీ శ్రీనివాస బీఈడీ కాలేజీలోని కేంద్రంలో ఇబ్బందులు పడ్డారు.క్యాటగిరీ కటాఫ్ జాబితాపై స్పష్టత ఏదీ?డీఎీస్సీ ప్రకటన జారీ చేసిన సమయంలో అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ పరీక్షల షెడ్యూల్ నుంచి కీ, ఫైనల్ కీ, మెరిట్ జాబితా విడుదల అన్నింటిలోనూ అభ్యర్థులకు అనుమానాలు..ఆందోళనలే! ఉమ్మడి జిల్లాలో 2,645 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తులు చేసుకున్న వారెందరనే విషయమే ఇంత వరకు ప్రకటించలేదు. ఫైనల్ సెలక్షన్ జాబితా లేకుండా ఎంపికై న అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి వెరిఫికేషన్ చేస్తున్నారు. గురువారం 2,307 మందికి కాల్ లెటర్లు ఇవ్వగా..రాత్రి 8 గంటల వరకు 1,639 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన చేశారు. శుక్రవారం 211 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను శ్రీలక్ష్మీ శ్రీనివాస బీఈడీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా 127 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు రాలేదని విద్యాశాఖ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా ఇంత వరకు ఏ క్యాటగిరీలో ఎంత కటాఫ్ అనే జాబితాలు విడుదల చేయలేదు. ఆ జాబితాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.‘ప్రథమ’ వేదనఏ డీఎస్సీలో లేని విధంగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో ప్రథమ నిబంధన అమలు చేసింది. ప్రథమ పోస్టులో ర్యాంకు వస్తే అదే తీసుకోవాలి. మిగతా పోస్టుల్లో ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వరు. రాష్ట్ర ఫ్రభుత్వ నిబంధనతో జోనల్ స్థాయి పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది పొందలేని పరిస్థితి నెలకొంది. ఎస్జీటీగా పని చేస్తూ స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాలంటే 15 ఏళ్లకుపైగా సమయం పడుతుంది. కానీ టీజీటీ సాధించిన వారు ఐదేళ్లలోనే పీజీటీగా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.లోపాలు ఇవీ...● మే 15వ తేదీ 2025 లోపు పోస్టు నిర్దేశించే విద్యార్హతలు పూర్తి చేసిన వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. దీని ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మే 15, 2025న బీఈడీ ఫలితాలు ప్రకటించారు. అదే నెల 21న సర్టిఫికెట్లు జారీ చేశారు. మే 15న ఫలితాలు వచ్చాయని, వెరిఫికేషన్కు అనుమతించాలని కోరినా.. విద్యాశాఖ కమిషనర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.● అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో 2022–24 విద్యా సంవత్సరంలో బీఈడీ చేశారు. అయితే వర్సిటీ అకడమిక్ ఇయర్లో పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఓ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్టును పొందేలేకపోయారు.● ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో 1, 3వ ర్యాంకు వచ్చిన వారికి కాల్ లెటర్ వచ్చింది. అయితే 2వ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి కాల్ లెటర్ రాలేదు.వెరిఫికేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జేసీడీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ , శ్రీలక్ష్మీశ్రీనివాస బీఈడీ కాలేజీ, రాఘవేంద్ర బీఈడీ కాలేజీల్లోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ బి.నవ్య, జిల్లా పరిశీలకులు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ అబ్రహం, వయోజన విద్య అడిషనల్ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై వారు డీఈఓ శ్యామూల్ పాల్కు పలు సూచనలు చేశారు. -
‘సప్త’ శోభితం
జిల్లా ప్రజలు వినాయక చవితి పండుగను వైభవంగా నిర్వహించారు. నంద్యాలలో సప్త గవ్వలతో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. – నంద్యాల(వ్యవసాయం) కర్నూలు(అగ్రికల్చర్): అనర్హత పేరిట దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టడంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో కూటమి ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి కోత లేకుండానే నిధులు విడుదల చేసింది. ఆగస్టు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,55,168 పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,54,653 పింఛన్లకు రూ.196.01 కోట్లు విడుదల చేసింది. నిధుల మంజూరును పరిశీలిస్తే 515 పింఛన్లకు కోత పడ్డాయి. అయితే ఈనెల 31న కచ్చితంగా ఎన్ని పింఛన్లు సెప్టెంబర్ 1న పంపిణీ చేస్తారనే విషయమై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 8,400 దివ్యాంగుల పింఛన్లకు అనర్హత పేరుతో నోటీసులు ఇచ్చారు. వందలాది దివ్యాంగుల పింఛన్లను వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. వీటి భవితవ్యం ఈ నెల 31 లేదా సెప్టెంబర్ 1వ తేదీన తెలియనుంది. -
పెట్టుబడి వేలల్లో.. ధర వందల్లో!
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. దిగుబడులను కర్నూలు మార్కెట్కు తీసుకెళితే న్యాయం జరుగుతుందని ఆశించిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రోజుల తరబడి మార్కెట్లో ఉండలేక, కుళ్లిపోతుంటే చూడలేక దళారీలకు బొట్లకు అమ్ముకొని మార్కెట్ నుంచి కన్నీళ్లతో బయటపడుతున్నారు. ఎకరాకు సగటున రూ.80 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. దిగుబడులు కనిష్టంగా 25 క్వింటాళ్లు, గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు వస్తోంది. క్వింటాకు కనీసం రూ.2వేల ధర లభిస్తేనే పెట్టుబడి దక్కుతుంది. కానీ మార్కెట్లో లభిస్తున్న ధరలు రైతులకు కంటతడి పెట్టిస్తున్నాయి. గురువారం ధరలు మరింత పతనమయ్యాయి. క్వింటాకు కనిష్ట ధర రూ.520, గరిష్ట ధర రూ.1,149 మాత్రమే లభించింది. ఈ గరిష్ట ధర కేవలం ఒకటి, రెండు లాట్లకు మాత్రమే. సగటు ధర రూ.739 నమోదైందంటే ఎక్కువ మంది రైతులు తెచ్చిన ఉల్లికి కేవలం రూ.500 నుంచి రూ.800 వరకు మాత్రమే ధర లభించినట్లు తెలుస్తోంది. రూ.100–రూ.150 ధరతోకొంటున్న దళారీలు మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్లు పొందిన వ్యాపారులు కొనుగోలులో చేతులెత్తేయడంతో దళారీలు కారుచౌకగా కొంటున్నారు. క్వింటా ఉల్లి గడ్డలను రూ.100 నుంచి రూ.150తో కొంటున్నారు. ఈ పరిస్థితి ఒకరిద్దరిది కాదు.. మార్కెట్కు ఉల్లిగడ్డలు తెచ్చిన రైతుల్లో 50 శాతం మంది దళారీలకే అప్పగించి పోతున్నారు. ఈ చిత్రంలోని రైతు పేరు నడిపి మద్దిలేటి. కర్నూలు మండలం ఆర్కే దుద్యాల గ్రామానికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. దాదాపు రూ.80 వేలు పెట్టుబడి పెట్టగా.. దిగుబడి 36 క్వింటాళ్లు(78 ప్యాకెట్లు) వచ్చింది. ఈ నెల 25న రాత్రి మార్కెట్కు తీసుకురాగా, 26న టెండర్కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ కొనుగోలు చేయలేదు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా వ్యాపారులు ఈ రైతు తెచ్చిన ఉల్లిని పట్టించుకోలేదు. ఇక దళారీలు బేరం చేయడంతో 36 క్వింటాళ్లను రూ.5వేలకు తెగనమ్ముకున్నాడు. తూకం అయ్యాక దళారీలు రూ.500 కోత పెట్టి రైతు చేతిలో రూ.4,500 మాత్రమే పెట్టడం గమనార్హం. ఉల్లి రైతు కంట కన్నీరు -
‘బీ’ ట్యాక్స్కు విద్యుత్ అధికారి బలి!
ఆళ్లగడ్డ: అహోబిలంలోని ‘బీ’ ట్యాక్స్ వ్యవహారం ఒక అధికారిపై వేటు పడేలా చేసింది. టీడీపీ నేత తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్శాఖ అధికారిపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అహోబిలంలోని లాడ్జీల యజమానులతో ఒక్కక్కరితో రూ. 50 లక్షలు ‘బీ’ ట్యాక్స్ వసూలు చేయాలని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమైన టీడీపీ నేత నిర్ణయించారు. కొందరు లాడ్జీల యజమానులు ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో వారి లాడ్జీలకు విద్యుత్ కట్ చేయించారు. దీంతో బాధితులు విద్యుత్ శాఖ మంత్రికి, సీఎండీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి టీడీపీ నేతను ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆళ్లగడ్డ విద్యుత్ ఏఈ వెంకట కృష్ణయ్యను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ టీడీపీ నేత చెప్పారని రూ. లక్షలు విలువ చేసే ఇసుకను రాత్రికి రాత్రి అదే పార్టీకి చెందిన వారికి ఎత్తిచ్చిన కేసులో అప్పటి హౌసింగ్ ఏఈని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేత చెప్పిందే శాసనం అన్న విధంగా అధికారులు జీ హుజూర్ అంటూ వస్తున్నారు. అహోబిలంలోని లాడ్జీల యజమానుల్లో ఒక్కొక్కరి నుంచి రూ. 50 లక్షలు ‘బీ’ ట్యాక్స్ వసూలు చేయాలని గుంటూరు శీనుకు అప్పగించారు. లాడ్జీల యజమానులు ఎవరూ స్పందించక పోవడంతో అధికారులపై చిందులు తొక్కారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను రంగంలోకి దించి నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించక పోవడంతో విద్యుత్ అధికారులతో లాడ్జీలకు విద్యుత్ కట్ చేయిస్తూ వేధించడం మొదలు పెట్టారు. దీంతో కొందరు ట్యాక్స్ కట్టారు. బీ ట్యాక్స్ కట్టిన వారిని వదిలిపెట్టి మిగత లాడ్జీల కరెంట్ కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. విత్యుత్ సరఫరా కట్ చేయడంతో దిక్కుతోచని కొందరు లాడ్జీల యజమానులు విద్యుత్ శాఖ మంత్రికి, సీఎండీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఎండీ నేరుగా జిల్లా అధికారులతో మాట్లాడి ఏఈతో పాటు కట్ చేసేందుకు వెళ్లిన ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే ఏఈని సస్పెండ్ చేసి ఇందులో ఎవరెవరి పాత్ర ఉందని అన్ని శాఖల అధికారులపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. లాడ్జీలకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చిన పంచాయతీ, ప్రభుత్వ స్థలం ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులు, కాలువలు కబ్జా చేశారని ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారని ఏఈ తెలిపారు. విద్యుత్ కట్ చేయమంటేనే తాము వెళ్లామని ఇప్పుడు తమపై మాత్రమే చర్యలు తీసుకుంటే ఎలా? అని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అన్న చెప్పాడు.. మేడం చెప్పారు’ అని ఆలోచించకుండా సంతకాలు చేసి నోటీసులు ఇచ్చిన అధి కారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.రాష్ట్రస్థాయిలో మాట్లాడుకోవాలి.. సస్పెండ్ చేసిన వెంటనే విద్యుత్ ఏఈ తోపాటు సిబ్బంది అందరూ ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేత దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ‘మీరు చెబితేనే చేశాం కదా మా పరిస్థితి ఏంటి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేత జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయగా.. ‘ఇందులో మేమేమి చేయలేం. ఏదన్నా ఉంటే రాష్ట్రస్థాయిలో మాట్లాడుకోవాలి’ అని తెలిపినట్లు సమాచారం. -
విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్ట్: కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గురువారం డ్యాంకు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపైనే కొండ చరియలు పడినా ఆ సమయంలో ఎలాంటి రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలాఉంటే గత కొద్ది వారాలుగా శ్రీశైలండ్యాం గేట్లు తెరచి నీటిని విడుదల చేస్తుండడంతో నీటి తాకిడికి డ్యాం పరిసర ప్రాంతాల్లోని కొండచరియలు బలహీన పడటం ఆందోళన కలిగిస్తోంది. అహొబిలంలో ..... ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దేవాలయం వెళ్లే మెట్లమార్గంలో కొండపై నుంచి భారీ బండరాయి విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో పెద్ద చెట్టు, కరెంట్ స్తంభం నేలమట్టమయ్యాయి. విద్యుత్ తీగలు తెగి దారికి అడ్డంగా పడ్డాయి. తెల్లవారు జామున భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
శ్రీశైలంలో మృత్తికా గణపతికి విశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: లోకకల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు, దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యహవచనం, కంకణాలకు శాస్త్త్రోకంగా పూజాదికాలు జరిపించి కంకణధారణ జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధివినాయకస్వామి (మృత్తికాగణపతి స్వామి)కి విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిపిస్తారు. యాగశాలలో అధిష్టింపజేసిన కాంస్య గణపతిమూర్తికి కూడా విశేష పూజలు చేస్తారు. సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు నిర్వహిస్తారు. తలనీలాలతో రూ. 51లక్షల ఆదాయం పాణ్యం: తలనీలాల వేలంపాటతో కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి రూ. 51.77 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు గురువారం ఆలయ ప్రాంణగణంలో తల నీలాలు ఏడాది పాటు పోగు చేసుకునేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించామన్నారు. మొత్తం13మంది పాల్గొనగా బనగానపల్లె పట్టణానికి చెందిన బాలాంజినేయులు హెచ్చు పా ట పాడి దక్కించుకున్నట్లు తెలిపారు. గతేడాది రూ. 42లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): వయోజన విద్యశాఖలో పర్యవేక్షకులుగా పని చేసేందుకు ఉపాధ్యాయులు, భాషా పండితులు, పీఈటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి వయోజన విద్య చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ నవ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5 పర్యవేక్షక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 45 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వారు డిప్యూటేషన్ అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9849909213, 8008843200 నంబర్లను సంప్రదించాలన్నారు. మాతాశిశు సంరక్షణకు కృషి గోస్పాడు: మాతాశిశు సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న యూపీహెచ్సీలో వైద్య సిబ్బందికి పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం 2.0 కొత్త వర్షన్పై గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పోర్టల్లో గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అందిస్తున్న సేవలు నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించి మాతాశిశు మరణాలు అరికట్టాలన్నారు. జిల్లా అధికారులు డాక్టర్ సుదర్శన్బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డీపీఓ నాజ్నీన్, ఎస్ఓ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రియ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు డోన్ టౌన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో డోన్కు కేంద్రియ విద్యాలయం మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ గురువారం విలేకరులకు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. డోన్ ప్రభుత్వ ఐటీఐలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. సెప్టెంబర్ 11న లాటరీ పద్ధ్దతిలో డ్రా తీసి 12వ తేదీ తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 15.09.2025 నుంచి 20.09.2025 వరకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. -
భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు
ఆత్మకూరురూరల్/ఆత్మకూరు: నల్లమల అడవుల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆత్మకూరు మండలంలో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటమునిగి వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే ఆత్మకూరు నుంచి కొత్తపల్లె మండలానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఆత్మకూరు మండలంలో భవనాశి కొండవాగు ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మునిమడుగులేరుకు నీటి ప్రవాహం పెరిగింది. ఈ వాగుపై నిర్మించిన శివ భాష్యం సాగర్ క్రస్ట్ గేట్లలో రెండింటిని ఎత్తివేశారు. ప్రాజెక్ట్ నుంచి విడుదలైన వరద జలాలు నేరుగా భవనాశి వాగులోకి రావడంతో ఆ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఈ వాగుపై కట్టిన అన్ని కల్వర్టులు, బ్రిడ్జిల పైన వాగు ప్రవహించడంతో కురుకుంద, కొట్టాల చెర్వు, వడ్లరామాపురం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూరు సమీపంలో భవనాశి వాగుపై ఉన్న బ్రిడ్జిపై కూడా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మొత్తం కొత్తపల్లె మండలానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొత్తపల్లి మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారులపై వరద నీరు ఎక్కి పారుతున్న చోట్ల ఆత్మకూరు అర్బన్ సీఐ రాము నేతృత్వంలో పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలో వర్షపాతం వివరాలు.. నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురసింది. శ్రీశైలంలో అత్యధికంగా 78.4మి.మీ వర్షం కురియగా కోవెలకుంట్ల, గోస్పాడు మండలాల్లో అత్యల్పంగా 1.0 మి.మీ వర్షం కురిసింది. నందికొట్కూరులో 41.8, పగిడ్యాల 36.8, మిడుతూరు 34.2, వెలుగోడు 33.6, జూపాడుబంగ్లా 28.8, ఆత్మకూరు, పాములపాడు 26.8, కొత్తపల్లి 22.8, గడివేముల 20.4, రుద్రవరం 5.4, దొర్నిపాడు 3.8, మహానంది 3.6, బండిఆత్మకూరు 2.2, చాగలమర్రి 1.4, శిరివెళ్ల 1.2 మి.మీ వర్షం కురిసింది. -
దోపిడీ ముఠా గుట్టు రట్టు!
● ముగ్గురి దొంగల అరెస్ట్కర్నూలు: కర్నూలు శివారులోని జగన్నాథ గట్టు పైకి వెళ్లే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు రట్టు చేశారు. ముజఫర్ నగర్కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, టీవీ9 కాలనీలో నివాసముంటున్న కురువ రమేష్, దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన దూదేకుల మాలిక్ బాషా ముఠాగా ఏర్పడి జగన్నాథగట్టు పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రేమికుల ఫొటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు లేదా విలువైన వస్తువులను తీసుకోవడం, ఇవ్వని వారిని చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒక అమ్మాయి తనకు తెలిసిన అబ్బాయితో ఆటోలో కర్నూలు–బెంగుళూరు జాతీయ రహదారి మీదుగా రాయలసీమ యూనివర్సిటీకి వెళ్తుండగా ముఠా సభ్యులు గుర్తించారు. మార్గమధ్యలో హ్యాంగౌట్ హోటల్ దాటిన తర్వాత ఆటోను ఆపి అందులో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఫొటో తీసి ‘మీ తల్లిదండ్రులకు పంపుతాం’ అంటూ కత్తితో బెదిరించారు. అమ్మాయి నుంచి బంగారు గొలుసు, అబ్బాయి నుంచి ఫోన్పే ద్వారా రూ.2 వేలు, జేబులో రూ.వెయ్యి లాక్కుని ఉడాయించారు. తిరిగి రెండు రోజుల తర్వాత అమ్మాయికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దోపిడీ ముఠా నుంచి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులు స్థానిక కై రా కేఫ్ వద్ద ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,500 నగదు, బంగారు చైన్, మూడు మొబైల్ ఫోన్లు, ఒక కారు, స్కూటీ, కత్తితో పాటు 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. పట్టణ శివారులో ప్రేమ జంటలు, సీ్త్ర పురుషులు కాని ఏకాంతంగా గడపటం కోసం వెళ్లి ఇలాంటి వారి బారిన పడి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. ఎవరైనా అలా బెదిరింపులకు పాల్పడితే డయల్ 112 లేదా 9121101062కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ తెలిపారు. -
వేర్వేరు చోట్ల పాముకాటుతో ముగ్గురు మృత్యువాత
ఆలూరు రూరల్/ నందవరం: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల పాముకాటుతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటుకు బలయ్యారు. ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామానికి చెందిన మంగమ్మ (45) బుధవారం ఉదయం పత్తి పొలంలో ఎరువులు చల్లేందుకు వెళ్లింది. ఎరువుల చల్లుతుండగా కాలుకు పాము కాటు వేసింది. బంధువులు గమనించి చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త మహానంది, ఇద్దరు సంతానం ఉన్నారు. గడ్డి కోస్తుండగా.. మండల కేంద్రం నందవరంలో పాము కాటుకు గురై రైతు రాజోలి శ్రీఆంజనేయులు(37) బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ కేశవ తెలిపిన వివరాలు మేరకు..గ్రామంలో సోమవారం రైతు తన పొలంలో పశువులకు గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దింటి చిన్న తిమ్మప్ప ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతిడికి భార్య శివమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. డోన్ టౌన్: వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన సతీష్కుమార్ (28)పాము కాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదఛాయలు అములుకున్నాయి. -
‘టోలు’తీస్తా జాగ్రత్త!
సాక్షి, టాస్క్ఫోర్స్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారు ఎవరైనా దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఓ స్థాయి నేతలే కాదు, వాళ్ల కుటుంబ సభ్యులు సైతం దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. రూ.30 టోల్గేట్ కూడా చెల్లించలేని స్థితిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసు రెడ్డి ఏకంగా టోల్గేట్ ఉద్యోగిపై దాడికి పాల్పడటం గమనార్హం. నందవరం మండల పరిధిలోని 167వ జాతీయ రహదారిలోని ధర్మపురం టోల్గేట్ వద్ద శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరులు గురువారం మధ్యాహ్నం మంత్రాలయం వైపు జీపులో వెళ్లారు. అయితే టోల్గేట్ వద్ద ఆటోమెటిక్గా ఫాస్టాగ్లో రూ.30 డెబిట్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ అసిస్టెంట్ మేనేజర్ కుల్దీప్ యాదవ్పై దాడికి పాల్పడ్డారు.శ్రీనివాసరెడ్డితో పాటు జీపు డ్రైవర్, తన అనుచరుడు కలిసి కుల్దీప్ యాదవ్పై చేయి చేసుకున్నారు. అయితే టోల్గేట్ సిబ్బంది అక్కడ గుమికూడటంతో శ్రీనివాసరెడ్డి మంత్రాలయం వైపునకు వెళ్లిపోయాడు. ఈ విషయమై ఎస్ఐ కేశవను ‘సాక్షి’ వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో పలువురికి పదవులు దక్కాయి. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మోతే చిన్న వీరేష్ (రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి) వంగాల మేఘనాథ్ రెడ్డి (రాష్ట్ర వలంటీర్ల విభాగం కార్యదర్శి) గడ్డం కేశవ రెడ్డి (రాష్ట్ర బూత్ కమిటీ విభాగం సంయుక్త కార్యదర్శి)లను నియమించింది.పంచాయతీరాజ్ ఎస్ఈగా వేణుగోపాల్కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీరు(ఎస్ఈ)గా ఐ.వేణుగోపాల్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈఈలుగా పనిచేస్తున్న 15 మందికి ఎస్ఈలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టులో ప్రకాశం జిల్లా ఈఈగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ను నియమించింది. అలాగే కర్నూలులో ఈఈగా పనిచేస్తున్న ఎస్.సి.ఈ.మద్దన్నను కడప ఎస్ఈగా, మరో ఈఈ ఎం.రామ్మెహన్ను సీఆర్డీఏకు, వై.చిన్నసుబ్బరాయుడును అనంతపురం ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.విద్యుదాఘాతంతో రైతు మృతివెల్దుర్తి: రామళ్లకోట గ్రామానికి చెందిన రైతు కొట్టం రామా నాయుడు (33) బుధవారం విద్యుదా ఘాతంతో మృతి చెందాడు. ఉదయం తన భార్య పద్మావతితో కలిసి గ్రామానికి దూరంగా ఉన్న కొండ పొలానికి వెళ్లాడు. సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు బోరు మోటార్ ఆన్ చేశాడు. సాయంత్రం ముందుగానే భార్య ఇంటికి వెళ్లగా, నీళ్లు కట్టడం పూర్తయిన తర్వాత వస్తానని చెప్పిన భర్త పొద్దుపోయినా రాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. కుటుంబీకులతో కలసి పొలం వద్దకు వెళ్లి చూడగా రామానాయుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. బోర్ మోటార్ ఆఫ్ చేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి కు మారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.నేటి నుంచి తెలుగు భాషా దినోత్సవ వేడుకలుకర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. గురువారం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నాటక రంగం చరిత్రంలో ఇలాంటి కార్యక్రమం జరగలేదని అందుకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కార్యక్రమాన్ని తమ రికార్డ్స్లో నమోదు చేయనుండటం జిల్లాకు జిల్లా కళాకారులకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాను రచించిన పదవి మూలం ఇదం జగత్ అధి‘కారము’ పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. సాయంత్రం 6.30 గంటలకు వ్యాసరచన పోటీల విజేతలు, ఏకపాత్రాభినయం పోటీల విజేతలు ఇతర కళాకారులు మొత్తం 150 మందికి సన్మానం ఉంటుందన్నారు. -
జెడ్పీలో గణనాథునికి చైర్మన్ పాపిరెడ్డి పూజలు
కర్నూలు(అర్బన్): వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథునికి బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, చైర్మన్ సీసీ అశ్వినీకుమార్, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వినాయకచవితి పర్వదినం సందర్భంగా అందరికి శుభాలు కలగాలని, చేపట్టిన కార్యక్రమాలన్ని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరున్ని ప్రార్థించడం జరిగిందన్నారు. -
అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
నంద్యాల: ఎనిమిదేళ్లుగా దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. మంగళవారం ఎస్సీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. బండిఆత్మకూరు మండలం నెమళ్ల కుంట గ్రామానికి చెందిన చెంచు దాసరి అంకన్న, పాణ్యం మండలం చెంచు కాలనీకి చెందిన బాపట్ల సత్యహరిశ్చంద్రుడు, పాణ్యం చెంచు కాలనీకి చెందిన బాపట్ల చిన్న హుసేని, గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన చెంచు దాసరి జమ్ములు ముఠాగా ఏర్పడి నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారు, వెండి వస్తువులు, నగదును పాణ్యం మండలం పిన్నాపురం కొండల వద్ద దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో గుడారాలు వేసుకొని అందులో దాచి పెట్టేవారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా నిఘా ఉంచి గుడారాల్లో ఉన్న దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో రాత్రి సమయాల్లో రోడ్డు పక్కన దారిదోపిడీలు చేసినట్లు, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. వీరి వద్ద నుంచి రూ.10.85 లక్షలు విలువ చేసే 11 తులాల బంగారం, 21 తులాల వెండి, రూ.10 వేల నగదు, రెండు బైక్లు, నాలుగు పిడిబాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించి, నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ పాల్గొన్నారు. -
బార్లకు అరకొర దరఖాస్తులు
● మరో మూడు రోజుల గడువు పెంపు ● ఈనెల 30న లక్కీ డిప్ కర్నూలు: బార్ల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్కు స్పందన కొరవడటంతో దరఖాస్తుల స్వీకరణకు మరో మూడు రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 47 మద్యం బార్లకు లైసెన్సుల కేటాయింపునకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. దరఖాస్తు దాఖలుకు 26వ తేదీ చివరి రోజు. అయితే కర్నూలు జిల్లాలో 8 బార్లకు కేవలం 31 దరఖాస్తులు, నంద్యాల జిల్లాలో 7 బార్లకు 24 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కనీసం 4 దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తామని ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ లెక్కన కర్నూలులో 4, ఆదోనిలో 3 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి. అలాగే నంద్యాల జిల్లాలో కూడా 5 బార్లకు మాత్రమే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. నందికొట్కూరు, బేతంచెర్ల బార్లకు రెండేసి చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలులో గౌడ కులాలకు రిజర్వు చేసిన దుకాణాలకు రెండు దరఖాస్తులు దాఖలయ్యాయి. మంగళవారం పొద్దుపోయే దాకా ఉమ్మడి జిల్లాలో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. పర్మిట్ రూమ్లు మంజూరు చేయడమే కారణమంటున్న వ్యాపారులు మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్లు మంజూరు చేయడంతో బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మంది వ్యాపారులు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. దుకాణాలకు ఇచ్చినట్లుగా కమీషన్ లేకపోవడం, ఒక్క బార్కు నాలుగు దరఖాస్తులు వేస్తేనే డ్రా తీయడం వంటి నిబంధనలు వ్యాపారులు భారంగా భావిస్తున్నారు. ఆ నిబంధనల వల్ల నష్టాల బారిన పడటం ఖాయమనే భావనతో చాలామంది వ్యాపారులు దరఖాస్తుకు తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటేవ్యాపారుల నుంచి స్పందన కొరవడటంతో బార్ల దరఖాస్తుకు మరో మూడు రోజుల గడువు పెంచుతూ సవరణ షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30న లక్కీ డిప్ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుంది. -
ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రెండో రోజు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం డీపీఓ గ్రౌండ్లో మొత్తం 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ డీపీఓ సిబ్బంది సమగ్రంగా పరిశీలించారు. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికెట్లతో పాటు ఇతర కేటగిరీలకు సంబంధించిన ధ్రువపత్రాలను సక్రమంగా పరిశీలించారు. సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికై న 643 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావలసి ఉండగా 617 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు రోజులుగా పరేడ్ మైదానం కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులతో కోలాహలంగా మారింది. సివిల్ విభాగంలో 309 మందికి గాను 298 మంది, ఏపీఎస్పీ విభాగంలో 334 మందికి గాను 319 మంది హాజరయ్యారు. రెండు విభాగాలకు కలిపి 26 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీపీఓ ఏఓ విజయలక్ష్మి, ఆర్ఐలు జావేద్, సోమశేఖర్ నాయక్, డీపీఓ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. పళ్ల బాస్కెట్లో పాము కలకలం పత్తికొండ: విక్రయానికి తీసుకొచ్చిన దానిమ్మ పండ్లు బాస్కెట్లో మంగళవారం పాము కలకలం రేపింది. పత్తికొండకు చెందిన భానుప్రకాష్ రోడ్డు పక్కన తోపుడుబండి మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్ల బాస్కెట్లను సర్దుకుంటుండగా దానిమ్మ పండ్ల బాస్కెట్లో అడుగున పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. అనంతరం తోటి వ్యాపారుల సహకారంతో పామును సంచిలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. సుదూర ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతి చేసుకుంటామని, బాస్కెట్లోకి పాము అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని వ్యాపారి అనుమానం వ్యక్తం చేశాడు. టౌన్ ప్లానింగ్లో ఇద్దరికి మెమోలు కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలను ఖాతరు చేయని పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు మంగళవారం మెమోలు జారీ చేశారు. కమిషనర్ ఇంటి సమీపంలో 2వ సచివాలయం పరిధిలోని నరసింగరావు పేటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు. బిల్డింగ్కు సంబంధించి నిర్మాణాల్లో డివియేషన్తోపాటు సెట్బ్యాక్స్ వదలక పోవడాన్ని గమనించిన కమిషనర్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శికి చెప్పి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఆయినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కమిషనర్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పి.ఖాశీం, ప్లానింగ్ కార్యదర్శి సుహేయిల్ జిక్రాఖాన్లకు మెమోలు జారీ చేశారు. రెండు రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
స్వామిత్వ వేగవంతానికి చర్యలు
కర్నూలు(అర్బన్): గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు హక్కు పత్రాల జారీకి సంబంధించిన స్వామిత్వ (సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం పీఆర్అండ్ఆర్డీ కమిషనర్ క్రిష్ణతేజ నిర్వహించిన గూగుల్ మీట్లో డీపీఓ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి జిల్లాలోని 73 రెవెన్యూ గ్రామాల్లో స్వామిత్వ కార్యక్రమాలను వేగవంతం చేశామన్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలను నిర్వహించామని, 44 గ్రామాల్లో గ్రామ కంఠం మ్యాపింగ్ కూడా పూర్తయిందన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ కూడా జరుగుతోందని వివరించారు. పంచాయతీలపై అధనపు భారం జిల్లాలో చేపట్టిన స్వామిత్వ సర్వేకు సంబంధించిన ఆర్థిక భారం ఇక నుంచి గ్రామ పంచాయతీలపై పడనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారాన్ని మోపకుండా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే కూటమి ప్రభుత్వం స్వామిత్వకు సంబంధించి గ్రామాల్లో చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని గ్రామ పంచాయతీలే భరించాలని ఇటీవలే పీఆర్అండ్ఆర్డీ కమిషనర్ క్రిష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారుల ఆదేశాలను కాదనలేక, చేతి నుంచి డబ్బు వెచ్చించలేక ఇబ్బంది పడుతున్నారు. -
హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
కర్నూలు: తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలోని నన్నూరు గ్రామంలో ఆటో డ్రైవర్ అజాం ఖాన్ సలాంబాషా హత్య కేసు నిందితుడు బోయతోట శివ (35)కు జీవిత ఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు.. నన్నూరుకు చెందిన బోయతోట శివ రౌడీ షీటర్. ఇతనిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. 2017 నవంబర్ 19న గ్రామంలోని అయూబ్ టీ హోటల్ వద్ద ఉన్న అజాం ఖాన్ సలాంబాషాపై బోయతోట శివ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అజాంఖాన్ సలాంబాషాను అక్కడే ఉన్న అతని సోదరుడు అజాం షాలీఖాన్, మరికొందరు కలిసి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి కర్నూలు రూరల్ పోలీస్స్టేషన్ సీఐ నాగరాజు యాదవ్ నిందితుడిని అరెస్టు చేసి 20 మంది సాక్షులను విచారణ చేసి చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. నిందితుడు బోయ తోట శివపై హత్య నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరామిరెడ్డి ప్రాసిక్యూషన్ తరపున వాదించారు. నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
మద్దికెర: మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో మంగళవారం ముగతి వెంకటేశ్వర్లు (55)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ విజయ్కుమార్నాయక్ తెలిపిన వివరాలు.. రామలింగమ్మ, నాయుడుకు ఐదుగురు కూతు ళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకటేశ్వర్లుకు 23 ఏళ్ల క్రితం సరస్వ తిని ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక కూతురు వుంది. భార్య భర్తల మధ్య కొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండేవి. సరస్వతి పలుమార్లు బహిరంగంగానే భర్తపై దాడి చేసేంది. విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తులను, సర్దిచెప్పేందుకు వెళ్లిన గ్రామ పెద్దలను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉండటంతో పట్టించుకోవడం మానేశారు. ఈక్రమంలో నాలుగైదు రోజులుగా చిత్రహింసలకు గురిచేసి ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన భర్త చనిపోయాడని బంధువులకు ఫోన్ చేసి తెలపడంతో వారు అక్కడికి వెళ్లి చూడగా బోర్లాపడి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా తన కుమారుడి మృతి పట్ల కోడలు సరస్వతిపై అనుమానం ఉందని మృతుని తల్లి రామలింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బస్సు రాలేదని పోలీస్ స్టేషన్కు చేరిన విద్యార్థులు
హొళగుంద: బస్సు రాలేదంటూ విద్యార్థులు పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఘటన హొళగుందలో మంగళవారం చోటుచేసుకుంది. ముద్దటమాగి గ్రామానికి చెందిన విద్యార్థులు హొళగుంద హైస్కూల్లో చదువుతున్నారు. రోజూ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత హొళగుంద బస్టాండులో బస్సు కోసం దాదాపు 20 మంది విద్యార్థులు వేచి ఉన్నారు. ఎంతకూ బస్సు రాకపోవడంతో విద్యార్థులు సమీపంలోని పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. లోపుల ఉన్న ఎస్ఐ దిలీప్కుమార్ సీసీ కెమెరాలో విద్యార్థులను గమనించి సమస్యను ఆరా తీశారు. బస్సు రాలేదని చెప్పడంతో ఆయన ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫోన్ చేసి విచారించారు. రోడ్డు బాగోలేకపోవడంతో బస్సు ఆలస్యమైనట్లు తెలుసుకుని ఎస్ఐ తన జీపులో విద్యార్థులను ముద్దటమాగికి చేర్చారు. పంపించిన ఎస్ఐ -
కూటమి ప్రభుత్వం ‘సూపర్ ఫెయిల్యూర్’
● వెరిఫికేషన్ పేరుతో పింఛన్దారుల వైకల్య శాతం తగ్గించడం దారుణం ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: కూటమి ప్రభుత్వం హామీల అమలులో సూపర్గా ఫెయిల్యూర్ అయ్యిందని వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్య విరూపాక్షి విమర్శించారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అథితి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు తీసేస్తుండటం సిగ్గుచేటన్నారు. 90 శాతం వైకల్యం ఉన్నా వెరిఫికేషన్ పేరుతో 40 శాతం లోపే ఉందంటూ పింఛన్లు నిలిపేయడం సమంజసం కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా నిలిపేసిన 8,300 వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. నకిలీ పింఛన్ల ఏరివేత పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించేందుకు కుట్ర పన్నితో భవిష్యత్లో బాధితుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి వైకల్యం ఉన్న వారిని గుర్తించి ధ్రువపత్రాలు జారీ చేసి, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో వైలక్య శాతం తగ్గించి పింఛన్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, ఎంపీటీసీ దేవరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
చిత్రం.. భళా!
పెన్ను క్యాప్పై వేసిన వినాయక చిత్రాలు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం కర్పూరం బిళ్లపై గీసిన వినాయకుడి సూక్ష్మ చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రకారుడు మాట్లాడుతూ భగవంతునికి చేసే షోడశోపచారాలలో ఆనంద కర్పూర నీరాజనం విశిష్టమైనదన్నారు. ప్రజలందరికీ గణేశుని అనుగ్రహం కలగాలనీ, విఘ్నాలు తొలగాలని కోరుకుంటూ కర్పూరం బిళ్లపై వరసిద్ధి వినాయకుని సూక్ష్మ చిత్రాన్ని వేశానన్నారు. – నంద్యాల(వ్యవసాయం) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ పెన్ను క్యాప్పై 60 వినాయకుల చిత్రాలు గీచి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్లు, ఓంకారంలో గణపతులు, శంకు ఆకారంలో గణేషుడు, కానిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య భంగిమ గణపతి ఇలా పలు రూపాల్లో ఒకే క్యాప్పై 60 చిత్రాలు గీశానన్నారు. స్వామి వారి వాహనమైన ఎలుక స్వామిని భక్తితో మొక్కుతున్నట్లు చిత్రించానన్నారు. – నంద్యాల(అర్బన్) -
గతంలో ఈ పరిస్థితి లేదు
జగనన్న పాలనలో ఐదేళ్లు యూరియా కోసం ఏ రోజు కూడా పడిగాపులు కాయలేదు. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సరిపడ యూరియా సరఫరా చేయాలనే ఆలోచన అధికారులు, కూటమి నాయకులకు లేదు. పది ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను. ఇంత వరకు బస్తా ఎరువు కూడా ఇవ్వలేదు. – సలీంబాషా, శాతనకోట గ్రామ రైతు నందికొట్కూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలల పూర్తి కావస్తున్నా ఎరువుల కొరత వేధిస్తోండటంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. సకాలంలో ఎరువులు సరఫరా చేసి ఆదుకోవాల్సిన కూటమి ప్రభు త్వం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అరకొరగా వచ్చిన వాటిని కూటమి నేతలు మార్గమధ్యలోనే పక్కాదారి పట్టిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. మంగళవారం మండల పరిధిలోని అల్లూ రు రైతు సేవా కేంద్రం, నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు లు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. నెల రోజుల క్రితం వ్యవసాయ అధికారులు యూరియా కోసం టోకెన్లు ఇచ్చినా ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఈ క్రమంలో నందికొట్కూరు వ్యవసాయ అధికారి షెక్షావలి రైతులను దుర్భాషలాడడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ రైతులను చలకనగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కూటమి నేతలు, వ్యవసాయ అధికారులు కుమ్మకై బ్లాక్లో యూరియా విక్రయిస్తుంటే పోలీసులు పట్టుకోవడం వాస్తవం కాదా.. అంటూ మండిపడ్డారు.నందికొట్కూరులో ఏఓ షెక్షావలిని నిలదీస్తున్న రైతులు అల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న అన్నదాతలు15 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. పిరికెడు యూ రియా వేయకపోతే దిగుబడి ఎలా వస్తుంది. ఇప్పడు, అప్పుడు అంటూ రోజు రైతు సేవా కేంద్రం, సహకార సొసైటి కేంద్రాల వద్దకు తిప్పుతున్నారు. నెల రోజుల క్రితం రెండు బస్తాలకు స్లిప్లు ఇచ్చారు. ఇంత వరకు ఒక బస్తా ఇవ్వలేదు. యూరియా రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. – సురేష్, శాతనకోట గ్రామం -
బిడ్డను ఎట్లా పోషించేది..
చిత్రంలో కుమారుడు ఇర్ఫాన్తో ఉన్న మహిళ పేరు కరీమూన్. సొంతూరు రుద్రవరం. బెంచీపై ఉన్న తన 15 ఏళ్ల కుమారుడికి పుట్టుక నుంచి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. నడవలేడు, కూర్చోలేడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.15వేలు పింఛన్ వచ్చేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల వెరిఫికేషన్ అంటూ వికలత్వం శాతం తగ్గించి రూ.15 వేలు వస్తున్న పింఛన్ రూ.6వేలకు తగ్గించారు. ‘ఇన్ని రోజులు పింఛన్ వస్తుండటంతో కుమారుడిని చూపెట్టుకుంటూ ఇంటి వద్దనే ఉంటూ సేవలు చేస్తుంటిని ఇప్పుడు పరిస్థితి అర్థం కావడం లేదు. న్యాయం కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని కరీమూన్ కన్నీటి పర్యంతమైంది. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీజీఆర్ఎస్లో 334 సమస్యలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎండార్స్ చేశాం. సమస్యలు పదేపదే పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వినతుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. –రాజకుమారి, జిల్లా కలెక్టర్, నంద్యాల -
భయపడొద్దు.. అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: టీడీపీ వర్గీయులు అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని, ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ధైర్యం చెప్పా రు. ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పాల మధుమోహన్రెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు ముకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు. ఇల్లు పాక్షికంగా దెబ్బతినింది. విషయం తెలిసి బాధి తుని ఇంటికి సోమవారం కాటసాని వెళ్లారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మధుమోహన్రెడ్డి కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ వర్గీ యులు అకారణంగా దాడులకు బరితెగించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ హోదా, బాధ్యతలను విస్మరించారని ఆరోపించారు. చట్టాలను టీడీపీ నాయకులకు చుట్టాలుగా మారుస్తున్నారని విమర్శించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, పోలీసుల బలాన్ని అడ్డు పెట్టుకొని దుశ్చర్యలకు పాల్పడుతుంటే సహించేది లేదన్నారు. హుసేనాపురం ఘటనలో ఎస్ఐ సునీల్ కుమార్ తమ పోలీసు సిబ్బందితో వెంటనే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాటసాని వెంట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగతిరుపాలు, పార్టీ నాయకులు మధుమోహన్రెడ్డి, గోపా వెంకటరమణారెడ్డి, గోపా రామ్మోహన్రెడ్డి, రామేశ్వరరెడ్డి, గుండాల చెన్నారెడ్డి ఉన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
కర్నూలు: సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ పెరేడ్ మైదానంలో సోమవారం ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టారు. మొత్తం 309 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 297 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అభ్యర్థులు సమర్పించిన ధృవీకరణ పత్రాలన్నిటినీ సమగ్రంగా కౌంటర్ల వారీగా పరిశీలించారు. అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించిన వారిని తదుపరి నియామక దశకు ఎంపిక చేస్తారని తెలిపారు. నేడు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పత్రాల పరిశీలన 334 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళవారం పత్రాల పరిశీలన ఉంటుంది. మొదటి రోజు హాజరు కాని సివిల్ కానిస్టేబుళ్లు 12 మందికి ఏపీఎస్పీ అభ్యర్థులతో పాటు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ భాస్కర్ రావు, డీపీఓ ఏఓ విజయలక్ష్మి, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు, డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాలు కర్నూలు(అర్బన్): నగరంలోని వేంకటాచలపతి నగర్లోని మైనారిటీ (బాలురు) విద్యార్థుల పోస్టు మెట్రిక్ ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ప్రవే శం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9440822219, 9848864449ను సంప్రదించాల న్నారు. -
యూరియా పంపిణీలో ఉద్రిక్తత
కొత్తపల్లి: వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో పలు చోట్ల యూరియా పంపిణీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. సోమవారం మండలంలోని గువ్వలకుంట్ల, కొత్తపల్లి, కొక్కెరంచ, పెద్ద గుమ్మడాపురం గ్రామ ఆర్ఎస్కేలకు ఒక్కో లారీ యూరియా లోడు చొప్పున చేరుకున్నాయి. గువ్వలకుంట్ల, కొక్కెరంచ గ్రామాల్లో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేయగా, పెద్ద గుమ్మడాపురం గ్రామంలో ఘర్షణ తలెత్తగా పంపిణీ నిలిపివేశారు. గువ్వలకుంట్ల గ్రామ రైతుల పొలాలు అన్ని ఆత్మకూరు మండలం కురుకుంద పొలిమేరలో ఉన్నాయి. అయితే ఏళ్ల తరబడి రైతులు గువ్వలకుంట్ల గ్రామంలో ఎరువులు పొందుతున్నారు. వ్యవసాయ అధికారులు అవగాహన లోపంతో పొలిమేరలో పంచాయితీ పెట్టి రైతులకు మధ్య ఘర్షణలు రేకెత్తించారు. అందులో భాగంగా బండినాయిని పాలెం, గువ్వలకుంట్ల రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ సిబ్బందిని జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి నిలదీశారు. ఈక్రమంలో ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్కుమార్ రెడ్డి, సుధాకర్రెడ్డి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది, రైతులు నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. అంతకు ముందు గువ్వలకుంట్ల సచివాలయానికి వస్తున్న యూరియా లారీని వీరాపురం గ్రామ రైతులు కొంతమంది అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లారీని కొత్తపల్లి పోలీసు స్టేషన్ తరలించి అనంతరం సీఐతో పాటు గువ్వలకుంట్ల సచివాలయానికి తీసుకువచ్చారు. అక్కడ పొలం పాసుపుస్తకానికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. బ్లాక్లో తరలిస్తున్న ఎరువులు స్వాధీనం నందికొట్కూరు: ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం అలంపూర్కు బ్లాక్లో తరలిస్తున్న ఎరువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణంలోని శ్రీలక్ష్మినరసింహ ఎరువుల దుకాణం నుంచి బొలెరో వాహనంలో డీఏపీ 58 బస్తాలు, ట్రాక్టర్లో 28.28.0 ఎరువులను తెలంగాణలోని అలంపూర్కు తరలిస్తునట్లు సమాచారం వచ్చిందని రూరల్ సీఐ సుబ్రమణ్యం, బ్రాహ్మణకొ ట్కూరు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. సోమవారం బ్రాహ్మణకొట్కూరులో వాహనాలను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్లో తరలిస్తునట్లు గుర్తించారు. వాహనాలను తనిఖీ చేసి ఎరువుల ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న లింగనవాయికి చెందిన చాకలి పరశురాము డు, శ్రీలక్ష్మినరసింహ ఎరువుల దుకాణదారుడు నందకుమార్, కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామానికి వేణుగోపాల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గువ్వలకుంట్లలో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ ఆత్మకూరు రూరల్ సీఐ, కొత్తపల్లి జెడ్పీటీసీ మధ్య వాగ్వాదం పెద్ద గుమ్మడాపురంలో పంపిణీ నిలిపివేత -
అనుమతి.. అవిఘ్నమస్తు!
నంద్యాల(వ్యవసాయం): గణపతి నవరాత్రోత్సవాలు సమీపిస్తుండటంతో అంతటా సందడి మొదలైంది. ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు వాడవాడలా మండపాల నిర్వాహకులు ఆయా పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్వాహక కమిటీలు భారీ వినాయక విగ్రహాలకు, లైటింగ్, డెకరేషన్, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్డర్లు ఇచ్చారు. జిల్లా పరిధిలో సుమారు 1,200కు పైగా వినాయక మండపాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా. నంద్యాలలో 500, ఆళ్లగడ్డ 120, బనగానపల్లెలో 100, కోవెలకుంట్ల 110, డోన్ 100, ఆత్మకూరు 120, నందికొట్కూరు 150కి పైగానే ఏర్పాటు కానున్నాయి. నంద్యాల పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోనే అత్యంత ప్రతిష్టత్మకంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా ఉత్సవాల్లో ముందస్తు జాగ్రత్తగా పోలీసు శాఖ https://ganeshutsav.net ప్రత్యేక పోర్టల్ను అందు బాటులోకి తెచ్చింది. వినాయక మండపాలను ఆన్ లైన్లో నమోదు చేయడంతో నవరాత్రుల ప్రారంభోత్సవం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం వరకు తదితర అంశాలను చాలా సులువుగా చేపట్టవచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్ ఇవ్వనుంది. పోలీస్ శాఖ అనుమతుతో పాటు పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల అనుమతుల వివరాలు పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుంది. 27 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం జిల్లాలో దాదాపు 1200 విగ్రహాలు ఏర్పాటుకు సన్నాహాలు మండపాలకు సింగిల్ విండో అనుమతులు మండపాల వద్ద డీజే సౌండ్లు వినియోగిస్తే చర్యలు ఇప్పటికే వినాయక ఉత్సవ నిర్వాహకులతో ఏరియా వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం. పోలీసు మార్గదర్శకాలు, అనుమతు లు గురించి వివరిస్తాం. వినాయక విగ్రహాల ఏర్పాటుకుగా గణేష్ ఉత్సవ్.నెట్లో నమోదు చేసుకోవడం ద్వారా సింగిల్ విండో అనుమతులు ఇవ్వనున్నాం. పెద్ద డీజేల ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కమిటీ సభ్యులపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వహణ కమిటీ సభ్యులే బాధ్యత. – అధిరాజ్సింగ్ రాణా, జిల్లా ఎస్పీ, నంద్యాల -
డీఎస్సీలో అంతా హైడ్రామా!
● 90 రోజుల సమయం లేకుండానే పరీక్షల నిర్వహణ ● తుది కీలోనూ అనేక తప్పులు ● ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థి ఎంపిక అని మెలిక ● ఇప్పటి వరకు రాని ఉద్యోగాలకు ఎంపికై న వారి వివరాలు ● సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా కర్నూలు సిటీ: ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో డీఎస్సీల నోటిఫికేషన్ల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మోగా పేరుతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి హైడ్రామా నడిచింది. డీఎస్సీ పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించిన తరువాత నార్మలైజేషన్ చేయడంతో చాలా తప్పులు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తప్పులు సరిదిద్దేందుకు సమయం పడుతుండడంతోనే తుది సెలక్షన్ జాబితాల విడుదలలో జాప్యం జరగుతోందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న వారి వివరాలు ఇవ్వలేదు. ఎంపికై న వారికి లెటర్లు కూడా పంపించలేదు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిౖకైన వారికి సోమవా రం సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని తొలుత చెప్పి తరువాత వాయిదా వేశారు. అంతా హైడ్రామా నడుస్తుడటంతో డీఎస్సీలో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇవీ అనుమానాలు... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఆనాడు టీడీపీ పెద్దలు ఒక మాట అన్నారు. డీఎస్సీ ప్రిపరేషన్కు కనీసం 90 రోజులు ఉండాలని చెప్పారు. అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రిపరేషన్కు 90 రోజుల సమయం లేకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ● పరీక్షలు ముగిసిన తరువాత విడుదల చేసిన కీ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అభ్యంతరాలను తీసుకొని తుది కీ ఇచ్చారు. ఇందులోనూ అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఆందోళనలు వచ్చాయి. దీంతో అభ్యంతరాలను స్వీకరించారు కానీ పరిష్కరించారో లేదో అర్థం కానీ పరిస్థితులు ఉన్నాయి. ● పాఠశాల విద్య శాఖ కమిషనర్ విజయరామరాజు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ పరీక్షలు రాసిన వారందరి మార్కులను, ర్యాంకులను ఇవ్వకుండానే ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని హడావుడిగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. జడ్జి ఆదేశాల మేరకు మెరిట్ లిస్టులు జారీ చేశారు. ● ఉద్యోగాలకు ఎంపికై న వారిని ఖరారు చేసి జాబితాలు ఇవ్వడంతో అదిగో...ఇదిగో అంటూ రెండు రోజులు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు ఎలాంటి జాబితాలు ఇవ్వక పోవడంతో అభ్యర్థులు మరింత ఆందోళన చెందతున్నారు. స్పష్టత కరువు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, మాన్యం, పార్వతీపురం, విజయనగరం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన వారు నాన్లోకల్లో దరఖాస్తు చేశారు. వారు అత్యధిక మార్కులు సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంత మంది దరఖాస్తు చేశారు? ఏఏ క్యాటగిరీకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా ఇంత వరకు విద్యాశాఖ దగ్గర వివరాలు లేవు. ఇదేంటని అడిగిన వారికి రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు వివరాలను ప్రకటించకపోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ–డీ, బీసీ–ఈ క్యాటగిరీలకు, అన్ని క్యాటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు, చేసిన దరఖాస్తులకు, పరీక్షల తరువాత ప్రకటించిన మెరిట్ జాబితాల్లోని సంఖ్యకు తేడాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకపోగా..అలాంటిదేమి లేదని, పబ్లిసిటీ కోసమే అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
శ్రీశైలం.. భక్తజన సంద్రం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా మల్లన్న స్పర్శదర్శనాన్ని నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
నాడు 85.. నేడు 40లోపు శాతం
ఈమె పేరు పద్మావతి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారపేటలో నివాసం. జనవరి 1, 2011న సదరం క్యాంపునకు హాజరైంది. అప్పటి ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించి 85 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఏడాది మార్చి 6న రీ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే వికలత్వం 40 శాతంలోపే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తే ఈ ప్రక్రియ ఎంత గందరగోళంగా సాగుతుందో అర్థమవుతోంది. పోలియోతో ఒక కాలు పనిచేయని ఈమె వైకల్యం ఎలా తగ్గుతుందో వైద్యులకే తెలియాలి. -
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
● వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభంనంద్యాల(న్యూటౌన్): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఎంఎంఏసీ) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆయా కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లాలో 39 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీలో అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు వారి పరిశీలనకు హెల్పలైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29వ తేదీ అవకాశం ఉంటుంది. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకొనే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలలో తరగతి విద్యాబోధన అన్ని కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్లు ఉన్నాయి. –డాక్టర్ శశికళ, ప్రిన్సిపాల్, నంద్యాల -
శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్డ్రిల్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ బృందం మాక్డ్రిల్ నిర్వహించింది. ముందుగా డ్యాం పరిసర ప్రాంతాలను, తర్వాత కుడి, ఎడమగట్టు ప్రధాన ద్వారాలు, గ్యాలరీ, క్రస్ట్గేట్ల బ్రిడ్జి తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం డ్యాం వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి, డ్యాం ఈఈ వేణుగోపాల్రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్పీఎఫ్ ఆర్ఐ రాజేష్, హెల్త్ విభాగం, ఫైర్ విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం డ్యాం గురించిన విషయాలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఆక్టోపస్ బృందం డ్యాం, వ్యూ పాయింట్, డ్యాం పరిసర ప్రాంతాల వద్ద ఉగ్రవాదులు అనుకోని విధంగా దాడులకు ప్రయత్నిస్తే ఏవిధంగా దాడులను తిప్పికొట్టాలనే విషయాలపై మాక్డ్రిల్ నిర్వహించింది. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
నంద్యాల: గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలపవచ్చన్నారు. విధినిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి గోస్పాడు: ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి అన్నారు. నంద్యాల పట్టణంలోని తేజస్వి హోటల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు హనుమ న్న, జయరాముడు ఆధ్వర్యంలో నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకే విక్రయించాలన్నారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొనుగోలు, అమ్మకాలపై దుకాణ యజమానులు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, మెడికల్ ఏజెన్సీల సంఘం నాయకులు బొబ్బిటి దామోదర్ రెడ్డి, మెడికల్ షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల ● 24 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ మెరిట్ జాబితాలను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 53,733 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజులపాటు నిర్వహించడంతో అభ్యర్థులకు అనేక అనుమానాలు తలెత్తి ఆందోళనతో నెల రోజులుగా తృతీయ ఫలితాలకు మెరిట్ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానాలు కల్పించుకొని డీఎస్సీ మెరిట్ జాబితాలపై ఇచ్చిన ఆదేశాల మేరకు మెరిట్ జాబితాలను విడుదల చేసింది. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు ఒక్కో పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసి మొదటగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అభ్యర్థులు మెరిట్ జాబితా విడుదల చేయకుండా సర్టిఫికెట్ల పరిచశీన ఎలా చేస్తారో అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల కోర్టు తీర్పుతో ఎట్టకేలకు మెరిట్ జాబితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 24 నుంచి టీచర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు జిల్లాలో మూడు కేంద్రాలను ఎంపిక చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బీఈడి కాలేజీ, రాఘవేంద్ర బీఈడి కాలేజీల్లో సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు 60 కమిటీలను ఏర్పాటు చేశారు. -
సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అండతో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి బరితెగించి అధికారులు, ప్రజలను వేధిస్తున్నాడని మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా పాల్గొన్నారు. సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి విధుల్లో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని కిడ్నాప్ చేసి దాడి చేయటం దారుణమన్నారు. అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి తప్ప తాగి శ్రీశైల శిఖరం చెక్పోస్ట్లో విధుల్లో ఉన్న చెంచు కులానికి చెందిన గురువయ్య, గిరిజన కులానికి చెందిన రాములు నాయక్, మైనార్టీ వర్గానికి చెందిన కరిముల్లాను దుర్భాషలాడరన్నారు. అటవీ ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకుని రాత్రంతా శ్రీశైలం మొత్తం కారులో తిప్పి కులం పేరుతో దుర్భాషలాడి మంత్రి గొట్టిపాటి రవికి చెందిన గెస్ట్హౌస్లో బంధించి దాడి చేయడం ఆటవిక చర్యఅన్నారు. ఇంత జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికల్లో ఎమ్మెల్యే తీరుపై సీరియస్.. ప్రచారం చేసుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంత సీరియస్గా సీఎం చర్యలు తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్యేపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయ త్నం కేసులు నమోదు చేయించాలి కానీ అన్నీ చిన్నపాటి సెక్షన్లు మాత్రమే నమోదు చేయించడం దేనికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ధర్మాన్ని కాపాడాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులు హత్యకు గురయ్యారన్నారు. ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యేను బూతు రాజా, వసూల్ రాజాగా పిలుస్తున్నారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. శ్రీశైలం ఆలయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రెడ్బుక్ పాలనకు ఇదే నిదర్శనం.. రెడ్బుక్ పాలనలో టీడీపీ నేతల మాట వినని అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే బుడ్డా చేసిన దాడినే నిదర్శనమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సోదరుడు ఒక ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారని గుర్తు చేశారు. కనీసం మంత్రి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడుతున్నారంటే ఇది ఎటువంటి ప్రభుత్వమో ప్రజలే తేల్చాలన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఫారెస్ట్ అధికారులను కిడ్నాప్ చేసి దుర్భాషలాడినా ఆయనపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించి జైలుకు పంపి వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారు రాష్ట్రంలో టీడీపీ నేతలు సుపరిపాలన అంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాట వినని వారిని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్యెల్యే అర్ధరాత్రి అటవీ సిబ్బందిని కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేయడం దారుణమన్నారు. అటవీ సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన ఎమ్మెల్యేనే కిడ్నాప్ చేసి వేధించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీడీపీ నేతల అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారన్నారు. అధికారులకే రక్షణ లేదు..కూటమి ప్రభుత్వంలో ప్రజలతో పాటు అధికారులు, పోలీసులకు కూడా రక్షణ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నాయకులు చెప్పిన మాట వినని వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్నా నలుగురు అటవీ ఉద్యోగులను తన కారులో కిడ్నాప్ చేసి కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఎమ్మెల్యేనే వారిని కారులో తీసుకెళ్లి గెస్ట్హౌస్లో బంధించటం సరైంది కాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ ద షిప్ అంటూ డైలాగ్లు చెప్పడం కాదని, రేషన్ దందా నడుపుతున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు పుష్కలంగా ఎరువులు సరఫరా చేశారని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కనీసం రైతుకు యూరియా బస్తా దొరకని పరిస్థతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అందిస్తామని నమ్మించిన చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోరా? గెస్ట్హౌస్లో బంధించి, కులం పేరుతో దూషిస్తే తూతూ మంత్రంగా కేసు నమోదా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని వైభవంగా ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించింది. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించిన వ్రతాలకు చెంచు ముత్తైదువులను ప్రత్యేకంగా ఆహ్వనించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని దాదాపు 90గూడేలకు చెందిన సుమారు 650మంది చెంచు ముత్తైదువులు, 950 మందికి పైగా ఇతర భక్తులు వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.వెంకట శివప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఆలయ సహా య కార్యనిర్వహణాధికారి హరిదాసు పర్యవేక్షించారు. వత్రంలో పాల్గొన్న భక్తులకు వస్త్రం, పూలు, గాజులు, కై లాస కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, శ్రీశైలప్రభ మాసపత్రిక అందజేశారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో చివరి సోమ, గురువారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలకు శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,08,04,708 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. వెండి 22.500 కేజీలు, బంగారం 1.950 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. మద్యం మత్తులో అర్చకుల గొడవ మహానంది: మద్యం మత్తులో మహానంది దేవస్థానానికి చెందిన ఇద్దరు అర్చకులు గొడవకు పాల్పడిన సంఘటన సోషల్ మీడియాలో రావడంతో చర్చనీయాంశమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అర్చకుల మధ్య గొడవ చోటు చేసుకోగా ఓ అర్చకుడు మరో అర్చకుడిని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. -
సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో, ఆదే విధంగా దిగువ ప్రాజెక్ట్లకు నీటిని విడుదల చేస్తున్నారు. తెరచి ఉంచిన 10 రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి 4,20,370 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుండి శ్రీశైలంకు 4,68,273 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 4,99,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రస్ట్గేట్ల ద్వారా 3,97,962 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 68,831 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. -
సాగు భూముల్లో సోలార్ పనులు ఎలా చేస్తారు
నందికొట్కూరు: సాగు భూముల్లో సోలార్ పనులు అడ్డుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామ పొలిమేరలో జరుగుతున్న సోలార్ పనులపై రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. తమ పంట పొలాలను కాపాడాలని తహసీల్దార్ కాళ్లపై పడి రైతన్నలు వేడుకున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రహదారులు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేసినా ఎందుకు స్పందించడం లేదని తహసీల్దార్ను రైతులు నాగేశ్వరరావు, జగన్మోహన్రెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, స్వామన్న, శివమూర్తి, మాలిక్బాషా ప్రశ్నించారు. సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే గ్రామాన్నే వదిలేస్తామన్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్ఐ ఓబులేసు, మండల సర్వేయర్ కృష్ణుడు, తదితరులు ఉన్నారు. -
యూరియా అక్రమ రవాణా చేస్తే చర్యలు
● రెతులకు ఇచ్చే రాయితీ యూరియా పరిశ్రమలకు వాడరాదు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల: జిల్లాకు మంజూరైన రాయి తీ యూరియా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో యూరియా అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, పోలీస్, సివిల్ సప్లై, ఇండస్ట్రీస్, విజిలెనన్స్, పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీ యూరియా జిల్లాకే మంజూరవుతుందన్నారు. జిల్లాలో రైతులకిచ్చే రాయితీ యూరియాను కొందరు దారి మళ్లించి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని యూరియా అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. పట్టణంలో రాయితీ యూరియాను వివిధ రకాల పరిశ్రమలైన పౌల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్, ఆల్కహాల్, ఫ్లై వుడ్ ఇండస్ట్రీస్, ప్లేట్, వస్త్ర పరిశ్రమ, సోప్స్ తయారీ వంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైతులకు ఇచ్చే రాయితీ యూరియా పంట పొలాలకు మాత్రమే వాడాలని, ఇతర అవసరాలకు ఉపయోగించడం నేరమన్నారు. యూరియా అక్రమ రవాణా నివారణకు సంబంధించి మండల స్థాయిలో ఒక టీం వేసి తనిఖీ చేసి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా యూరియా కొరత తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. -
రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
నీటి కుంటలో మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వా లని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి బుధవారం రాత్రి చిగిళి గ్రామానికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించా రు. విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే గ్రామానికి చెందిన, ఒకే తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే చోటకు చేరి మృతిచెందడం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు ము న్ముందు జరగరాదన్నారు. బాధిత కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఒక్కో విద్యార్థి కుంటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. -
నాలుగో విడత 508 సెల్ఫోన్ల రికవరీ
నంద్యాల: జిల్లాలో నాలుగో విడత మొబైల్ రికవరీలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత 2023 ఏప్రిల్లో రూ.1.52 కోట్ల విలువ చేసే 847 సెల్ ఫోన్లు, రెండో విడత 2023 అక్టోబర్లో రూ. 86.57 లక్షల విలువ చేసే 510, మూడవ విడత 2024లో రూ.2.43 కోట్ల విలువ చేసే 1,066 సెల్ ఫోన్లు, నాలుగో విడతలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్ఫోన్లు రికవరీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వరూ 5.68 కోట్లు విలువ చేసే 2,934 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల నుంచి రికవరీ చేశామన్నారు. -
చిన్నారులకు కన్నీటి వీడ్కోలు
● చిగిళిలో మిన్నంటిన రోదనలు ● ముగిసిన విద్యార్థుల అంత్యక్రియలు ● ఆలూరు రూరల్/ఆస్పరి: ఆడుతూ పాడుతూ అందరినీ నవ్వించే విద్యార్థులు ఆకస్మికంగా మృతి చెందడం.. వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో చిగిళి గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతోనే చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంత్యక్రియల్లో అందరూ పాల్గొన్నారు. విద్యార్థుల మృతదేహాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మౌనం పాటించారు. విషాద ఛాయలు చిగిళి గ్రామ చరిత్రలో ఎన్నుడూ లేని విధంగా బుధవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వినయ్, గొల్ల భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం ఎర్రకొండ వద్ద ఉన్న గరుసు కుంటకు వెళ్లారు. దుర్గా ప్రసాద్ తప్ప మిగతా అందరూ ఈతకు కుంటలో దిగి నీటిలో మునిగి మృతిచెందారు. దుర్గా ప్రసాద్ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెండంతో గ్రామం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. గురువారం రోజు గ్రామస్తులంతా తమ పనులకు సెలవు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి దహన సంస్కారాలకు హాజరయ్యారు. మహిళలు రోదనలతో గ్రామం దద్దరిల్లింది. విద్యార్థుల మృతితో గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ గ్రామానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. పత్తికొండ డీఎస్పీ వెంటకరామయ్య రాత్రి గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్, తిరుమల రావు, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం రంగప్ప.. పాఠశాలలో ఐదు నిమిషాలు మౌనం పాటించి విద్యార్థులకు సంతాపాన్ని తెలియజేశారు. కుంటలో విద్యార్థులు మృతిచెందడంపై అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. -
ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేదు
మేం రాయలసీమ విత్తన సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి చిరుధాన్యాల సాగును ప్రత్యేకంగా చేపట్టాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. 2023–24 వరకు చిరుధాన్యాలను విదేశాలకు ఎగుమతులకు అవకాశం ఉండేది. మేం ప్రతి నెలా 2–4 క్వింటాళ్ల వరకు విదేశాలకు ఎగుమతి చేశాం. అయితే 2024–25 నుంచి విదేశాలకు ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేవు. ఇప్పటికై న రాయితీలు ఇవ్వాలి. – వేణుబాబు, మిల్లెట్ రైతు, కర్నూలుఈ ఏడాది కొర్రసాగుపై రైతులు ఆసక్తి చూపలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొర్ర సాగు తగ్గింది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కొర్ర విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టినప్పటికీ తీసుకునేందుకు ముందుకు రాలేదు. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
సార్.. మా పింఛన్లు పునరుద్ధరించండి
కొలిమిగుండ్ల: ప్రభుత్వం తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. గురువారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వరగౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నామని, కూటమి ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా తమ పేర్లను తొలగించిందని మండిపడ్డారు. పర్మినెంట్ సదరం సర్టిఫికెట్లు ఉన్నా రీవెరిఫికేషన్కు అంటూ వైకల్య శాతం తక్కువ చూపడం పేదలను మోసం చేయడమే నన్నారు. యథావిధిగా వచ్చే నెల 1వ తేదీ పింఛన్ సొమ్ము అందించాలని డిమాండ్ చేశారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి శిరివెళ్ల: విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈఓ జనార్దనరెడ్డి అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, వంట గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నా కొందరు విద్యార్థులు ఎందుకు తినడం లేదని, వారి జాబితా తయారు చేసి తల్లిదండ్రులతో మాట్లాడాలని హెచ్ఎం గోవిందరాజును ఆదేశించారు. స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ప్రతి పాదనలు పంపాలని హెచ్ఎం తేజోవతమ్మను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ శంకరప్రసాదు, సీఆర్పీ అన్సర్ ఉన్నారు. ఆత్మకూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆత్మకూరు ఏడీఏ హేమలత అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నిపుణులు అశోక్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త పుల్లీబాయ్, సీనియర్ శాస్త్రవేత్త నజీరుద్దీన్తో కలసి గురువారం ఆమె నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలకు మొక్కజొన్న, పత్తి, మెట్ట వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటలలో నిలిచిన నీటిని తొలగించిన అనంతరం హెక్టారుకు పది కిలోల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ఐదు కేజీల చొప్పున లేదా 19.19.19 స్పేర్ రూపంలో నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల పంటను తేమ, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీల గ్రామాల వివరాలు సేకరించి అక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించి దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు, డీవీఎంసీ సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం
ఆస్పరి/ఆలూరు రూరల్: రోజు మాదిరిగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి యూనిఫాం తొడిగించి పాఠశాలకు పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆ చిన్నారులు సరదాగా ఈత కోసం గ్రామ సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు. ఈత రాక మునిగి ప్రాణాలు వదిలారు. పొలం పనులకు వెళ్లి తిరిగిగొచ్చిన ఆ తల్లిదండ్రులు.. విగతజీవులైన పిల్లలను చూసి గుండెపగిలేలా రోదించారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వినయ్, భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్లు కలిసి బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. పక్కనే ఇటీవల నిర్మించి ఆగస్టు 15న ప్రారంభించిన ఉన్నత పాఠశాల గురించి చర్చించుకున్నారు. ‘మనం ఏడో తరగతికి ఇక్కడికే రావాలి’ అనుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటి కుంటలో దిగారు. దుర్గా ప్రసాద్ ఒడ్డున ఉండగా మిగిలిన ఆరుగురు విద్యార్థులు ఈత రాక నీటి కుంటలో మునిగి పోయారు. గమనించిన దుర్గాప్రసాద్ అక్కడి నుంచి పరుగుపెడతూ గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామ యువకులు కుంట వద్దకు చేరి విద్యార్థులను వెలికి తీశారు. ఇందులో కిన్నెర సాయి కొన ఊరితో ఉండగా ఆదోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మిగిలిన ఐదుగురు విద్యార్థులు కుంటలోనే ప్రాణాలు వదిలారు.పేదింటికి మరింత కష్టంగడ్ల పెద్ద ఈరన్న, మల్లమ్మలు ప్రతి రోజూ కొండకు వెళ్లి రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె గాయత్రి, రెండో కుమారుడు వినయ్ (10), మూడో కుమారుడు అభి ఉన్నారు. ఇద్దరు కుమారులను బాగా చదివించి ప్రయోజకులని చేస్తే తమకు కష్టాలు తీరుతాయనుకున్నారు. బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ పాఠశాలకు పంపించేవారు. పదేళ్ల వయస్సులోనే వినయ్ ప్రాణం పోవటంతో వారి రోదనలు స్థానికులకు కంట తడిపెట్టించాయి.ఎవరి కోసం జీవించాలో..రాముడు, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి మూడు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె మహాదేవి ఆస్పరిలో పదవ తరగతి చదువుతోంది. రెండో కూతురు రేష్మా చిగిలిలో 8వ తరగతి చదువుతోంది. ఏకై క కుమారుడు భీమేష్ (11)పై ఆశలు పెట్టుకున్నారు. అయితే నీటి కుంటలో పడి భీమేష్ మృతిచెందడంతో ‘ఎవరి కోసం జీవించాలో’ అని వారి రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది.ఆరిపోయిన కలల దీపంపీరావలి, జిలేఖా బీ దంపతుల కూతురు పర్విన్ కూలీ పనికి వెళ్తోంది. పీరా వలి ఆదోనిలో గౌండపనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకు ఉన్న ఏకై క కుమారుడు మహబూబ్ బాషా (10)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. అయితే కుమారుడు నీటి కుంటలో పడి మృతిచెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.విషాదమే మిగిలిందినాగవేణి, కిష్టప్ప దంపతులకు ముగ్గురు కుమారులు. కిష్టప్ప ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కిరణ్ కుమార్ పదో తరగతి, రెండవ నితీష్ కుమార్ 9వ తరగతి చదువుతున్నారు. చివరి కుమారుడు శశి కుమార్ మృతిచెందడంతో వారింట్లో విషాదమే మిగిలింది. -
ఇంకెప్పుడు న్యాయం చేస్తారు?
కోవెలకుంట్ల: ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న సుగాలి ప్రీతి కుంటుంబానికి ఇంకెప్పుడు న్యాయం చేస్తారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూటమి సర్కారును ప్రశ్నించారు. 2017లో ఒక ప్రైవేట్ రెసిడెన్సియల్ పాఠశాలలో హత్యకు గురైన సుగాలి ప్రీతి కేసులోని దోషుల్ని శిక్షించాలని ఆ బాలిక తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘14 ఏళ్ల బిడ్డ ప్రీతి స్కూల్కెళితే 10 మంది కలిసి నాశనం చేస్తే ఎవరూ పట్టించుకోలేదని, సగటు మనిషికి కష్టమొస్తే తనకు ఏడుపొస్తోంది’ అని అప్పట్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ ఏవేవో మాటలు చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసును స్వీకరిస్తామని పవన్ గొప్పలు చెప్పారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా ఆ కేసు విషయం అతీగతి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ప్రీతి తల్లి పార్వతీదేవి విజయవాడకు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కలిసిందన్నారు. హోమంత్రి అనితను కలవాలని ఉచిత సలహా ఇవ్వగా హోమంత్రితోపాటు మరో మంత్రి నాదేండ్ల మనోహర్ను కలిసినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మరోవైపు ప్రీతి తల్లి అంగవైకల్యంతో బాధపడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు సుగాలి ప్రీతి కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా సుగాలి ప్రీతి కుటుంబం పోరాటం వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వెలుగోడు: యూరియా కోసం రైతులు రోడ్డెక్కా రు. వెలుగోడు మండల కేంద్రంలో ఆత్మకూరు– నంద్యాల ప్రధాన రహదారిలో రైతులు బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆకలి దప్పులు మానుకొని రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదన్నారు. వరినాట్లు వేసి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా యూరియా వేయలేదని, ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నా ..యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని పలువురు హెచ్చరించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ ఆలయాల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణ రూ.4,51,62,522 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం చంద్రవతి కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. బంగారం 164.500 గ్రాములు, వెండి 5.840 కిలోలు లభించాయి. అలాగే యూఎస్ఏ డాలర్లు 598, న్యూజిలాండ్ డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 100, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, ఈరోస్ 100, ఓమన్ బైసా 300, కెనడా డాలర్లు 20, కువైట్ దినార్ 1, సౌదీ అరేబియా రియాల్ 115, కత్తార్ రియాల్స్ 102 మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించినట్లు ఈఓ పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
ఆశలు గల్లంతు
రాజు, మారుతమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. రాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కుమారుడు సంపత్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు కారుణ్య కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. కిన్నెర సాయి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడిపై తండ్రి రాజు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే కిన్నెర సాయి మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మాకు ఎవరు దిక్కు? మమత, మహారాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయి కిరణ్ (10) ఐదో తరగతి, కుమార్తె అశ్రిత ఒకటో తరగతి చదువుతోంది. మమత, మహారాజు బెల్దారు కూలీగా పనిచేస్తూ బిడ్డలను చదివించుకుంటున్నారు. అయితే సాయి కిరణ్ నీటి కుంటలో మునిగి మృతిచెందాడు. ‘ఉన్న ఒక్క కొడుకును బాగా చదివించాలని కలలుగన్నాం. మాకు ఎవరు దిక్కు’ అంటూ వారు రోదించారు. -
నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలి
నంద్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వారి వారి పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేర పరిశోధన, న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. రాబో యే వినాయక చవితి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నిఘా పెంచాలన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పాత నేరస్తులను బైండోవర్ చేయాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీ, పీస్ కమిటీతో సమావేశాలు నిర్వహించి శాంతియుత వాతావరణం కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల సమాచారం తప్పక ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పా టు చేయాలన్నారు. అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు ప్రమోద్ కుమార్, రామంజి నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులకు గ్రహణం
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతి ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో రెండు జిల్లాల పరిధిలో 469 మంది గ్రేడు–2 వీఆర్వోలను నియమించారు. వీరికి 2023 ఆఖరిలోనే గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని అప్పటి ప్రభుత్వం యోచించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2023 ఏప్రిల్ 3వ తేదీన పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 2024 ఆక్టోబర్ 10వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చాయి. మే 9న తుది జాబితా పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు రెండు నెలలు, తుది జాబితా తయారీకి మరో నెల సమయం పట్టింది. మొత్తంగా 2025 జనవరి ఏడో తేదీ నాటికి పదోన్నతులకు అర్హత ఉన్న జాబితాను తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం 150 ఖాళీలకు రోస్టర్ రూపొందించడానికి మార్చి 25వ తేదీ వరకు సమయం పట్టగా...దానిపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు విధించారు. అయితే తరువాత ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆలస్యం చేయడంతో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు రావడంతో దాని ప్రకారం రోస్టర్ తయారు చేయడానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం తీసుకుని మే 9వ తే దీన పూర్తి స్థాయి తుది జాబితాను రూపొందించారు. అధికారుల అలసత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అలసత్వంతోనే గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆశావాహక ఉద్యోగులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ఆగస్టులో ఆదేశాలు ఇచ్చినా రోస్టర్తో కూడిన అర్హుల జాబితాను తయారు చేయడానికి 8 నెలలు తీసుకోవడం..అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ రావడంతో ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 19వ తేదన విడుదలైంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతులను పూర్తి చేశారు. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యంతో తుది అర్హత జాబితాను రూపొందించకపోవడమే ఈపరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఏడాదిగా ముందుకు సాగని ప్రక్రియ ఎదురు చూస్తున్న 150 మంది గ్రేడు–2 వీఆర్వోలు కొందరు డబ్బులు వసూలు చేసిన వైనం! పదోన్నతుల పేరిట వసూళ్లు 2024 ఆగస్టు నుంచి గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ మొదలు కావడంతో అప్పట్లో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ఆశావాహుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జాబితాలో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్లో పని చేసే కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చినా పదోన్నతి రాకపోవడం..ఇటు డబ్బులు వసూలు చేసిన అధికారులు బదిలీపై వెళ్లడంతో వారికి దిక్కుతోచడంలేదు. తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నా వసూలు చేసిన అధికారులు ఇవ్వడంలేదనే వాదన ఉంది. -
గుంతలు ఉన్నాయ్ జాగ్రత్త!
గుంతల్లేని రహదారులను అందుబాటులోకి తెస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు కనీసం శిథిల రోడ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ చిత్రాల్లో కనిపించే గుంతలు ఎక్కడివో కాదు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారుల పరిస్థితి ఇది. అడుగడుగున గుంతలు ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. నూనెపల్లె, నందమూరినగర్ రోడ్డు, ఎన్కేరోడ్డు తదితర ప్రధాన రహదారుల్లో గుంతలు పడ్డాయి. అదే విధంగా ఎన్జీఓస్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్బోర్డు, హనీఫ్నగర్, ఎంఎస్నగర్, సలీంనగర్, బైటిపేట తదితర ప్రాంతాల్లో అధిక రహదారులు గుంతల మయంగా మారాయి. నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్ వద్ద లోతైన గుంతలు పడటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నందమూరినగర్కు వెళ్లే రహదారిలోని కుందూ పాత వంతెనపై ఉన్న గుంతలను తప్పించేందుకు వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రోడ్లు ఈ వర్షాలకు మరింత శిథిలమవుతున్నాయి. అధికారులు యుద్ధ ప్రాతి పదికన రహదారుల అభివృద్ధి చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – నంద్యాల(అర్బన్) కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రహదారిలో భారీ గుంతలు ఆళ్లగడ్డ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఏర్పడిన నీటి మడుగు -
నేత్ర పర్వం..
స్వర్ణ రథోత్సవం స్వర్ణరథోత్సవ పూజల్లో పాల్గొన్న దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు భక్తజనం మధ్య స్వర్ణరథోత్సవ దృశ్యం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. స్వర్ణ రథోత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఏఈవో హరిదాసు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మిగిలిన స్థానాలకే ఆప్షన్లు
కూటమి ప్రభుత్వంలో చేయి తడపనిదే ఏ పనీ జరగని పరిస్థితి. సామాన్య ప్రజలే కాదు, అధికారులు సైతం తమ పని కావాలంటే నేతల వద్ద చేతులు కట్టుకోవాల్సిందే. ఇక బదిలీల విషయానికొస్తే సిఫారసు లేఖలు లేనిదే ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులనుపరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ లేఖల కోసం నాయకుల చుట్టూ పనులు వదలుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కొందరైనా లేఖల కోసం పోస్టును బట్టి డబ్బు వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అంతోఇంతో ఇచ్చి కోరుకున్న పోస్టులు దక్కించుకున్న అధికారుల్లో నిజాయితీ ఎంతమాత్రం ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో అర్హతలను అనుసరించి గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వీరు తాము కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకులు ఇచ్చే సిఫారసు లేఖలకే బదిలీలు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పచ్చ నేతల సిఫారసు లేఖలు ఉంటే కోరుకున్న చోటుకు, లేదంటే జిల్లా సరిహద్దులకు బదిలీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి రాజకీయ పరిచయాలు లేని వారు, సిఫారసు లేఖలు తెచ్చుకోని వారిని నంద్యాల జిల్లా నల్లమల సరిహద్దు ప్రాంతాలకు, కర్నూలు జిల్లాలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పోస్టింగ్స్ ఇస్తున్నట్లు పదోన్నతి పొందిన సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో చేపట్టిన పదోన్నతుల పోస్టింగ్స్కు రెండు జిల్లాల నుంచి వందల సంఖ్యలో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 403 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 120 గ్రేడ్ –4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు 120 మంది గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. గతంలో వారికి వచ్చిన మార్కులు (ర్యాంకింగ్), రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్స్ విషయంలో ర్యాంకింగ్, రిజర్వేషన్ ఉన్నా.. పచ్చనేతల సిఫారసు లేని కారణంగా వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు జారీ చేసి న సిఫారసు లేఖల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసి, మిగిలిన ఖాళీల్లో ఎక్కడికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండని పదోన్నతి పొందిన వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఫారసు లేఖలతో కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్స్ ఇప్పించుకున్న వారు సంతోషంగా ఉండగా, ఎలాంటి రాజకీయ సిఫారసు లేకపోవడ ంతో సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు పోస్టింగ్స్ అందుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన కార్యక్రమాలకు అసోసియేషన్ నేతలను ఆహ్వానించే వారని, ప్రస్తుతం ఆ సంప్రదాయం కొనసాగడం లేదనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సిఫారసులకే పెద్దపీట -
రూ. 15 వేల పింఛన్ రూ.6 వేలు చేశారు
●చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాధవరెడ్డి. పదేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబసభ్యుల సహాయం లేకపోతే కూర్చోలేడు.. పడుకోలేడు. ఇతనికి గతంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. 90 శాతం వికలత్వం ఉన్నట్లు గతంలో డాక్టర్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రీ రెఫికేషన్ పేరుతో 70 శాతానికి తగ్గించి ఈ నెల నుంచి రూ.6 వేల పింఛన్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఇంట్లో వాళ్లు ఆఫీసు చుట్టూ తిరిగినా తమకేమి తెలియదు అని జవాబు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. -
ప్రభుత్వానికి కనికరమేదీ?
● ఈ చిత్రంలో మంచంపై పిల్లాడిలా కనిపిస్తున్న దివ్యాంగుడు పేరు సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె. వయస్సు 34 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగుడు. మూడు పదుల వయసున్నా చిన్న పిల్లాడి తరహాలో చూసుకోవాల్సి వస్తుంది. రెండు కాళ్లు పూర్తిగా సహకరించవు. గతంలో సదరం క్యాంపుకు వెళ్లినపుడు 90 శాతం ఉన్నట్లు గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహించింది. ఇటీవల గ్రామ సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికెట్లో 74 శాతం ఉన్నట్లు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసమని రమణారెడ్డి ప్రశ్నిస్తున్నాడు. 90 శాతం వైకల్యం ఉంటే రూ.15వేల పింఛన్ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆదిశగా లేకుండా ఏకంగా దివ్యాంగుల వైకల్యంలోనూ మార్పులు చేయడం గమనార్హం -
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ.. 15 వేలు’, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు అంటూ ఊరించారు. ఏరివేతలో భాగంగా వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. వచ్చే నెల నుంచి పింఛన్ రాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. – సాక్షి, నెట్వర్క్ మాటలకందని ఆవేదన.. ● గతంలో అధికారులు ఇచ్చిన 98 శాతం వికలత్వం సర్టిఫికెట్ చూపుతున్న ఈ మహిళ పేరు గొల్ల అరుణ. కోసిగి మండలం వందగల్లు సొంతూరు. పుట్టుకపోతోనే చెవిటి, మూగ. తన బాధ, సంతోషాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యం లేదు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసు ఇవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలే తప్ప.. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అంటూ గొల్ల అరుణ మూగ సైగలతో వాపోతోంది. -
90 శాతాన్ని 50కి తగ్గించారు
● మంచానికి పరిమితమైన 88 ఏళ్ల షేక్ అబ్దుల్గఫార్ పక్షవాతం బాధితుడు. బనగానపల్లె పట్టణం ఈద్గా నగర్లో నివాసముంటున్నాడు. 2014 నుంచి పక్షవాతంతో ఇతను మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడాలేదు. నంద్యాల సదరన్ క్యాంప్లో 2014 ఫిబ్రవరి 14న 90 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ పొందారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది రూ.15వేల పింఛన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంపులో వికలాంగుడిగా 50 శాతం మాత్రమే ఉన్నట్లు సచివాలయ అధికారులు అతనికి రెండు రోజుల క్రితం నోటీసు ఇచ్చారు. ఇక నుంచి రూ.6వేలు మాత్రమే పింఛన్ వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి 50 శాతం మాత్రమే వికలత్వ సర్టిఫికెట్ ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
25 ఏళ్ల చంటి బిడ్డ.. అయినా అనర్హుడే
● మంచంపై కూర్చున్న యువకుడికి 25 ఏళ్లు. పేరు షమీవుల్లా. అతడికి అన్నం తినిపిస్తున్నది తల్లి జమాల్బీ. పాతికేళ్ల వయస్సులో కూడా చంటి బిడ్డలా తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు, కుడి చేయి, కుడి కాలు పని చేయవు, ప్రతి క్షణం వెంట ఓ మనిషి ఉండాల్సిందే. స్వతహాగా ఏ పని చేసుకోలేడు. 2011లో వంద శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చారు. రూ.200 నుంచి ఇప్పటి వరకు పింఛన్ తీసుకుంటున్నాడు. అన్నం కూడా వేరే వారే తినిపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటి పింఛన్దారుడికి ఇటీవల నంద్యాలలో నిర్వహించిన సదరం క్యాంపులో 40 శాతం కంటే తక్కువ వికలత్వం ఉందని, ఇక నుంచి పింఛన్ తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసు అందజేశారు. చూసిన వారంతా ‘ఇతనికి పింఛన్ తొలగించడమేమిటీ’ అని చర్చించుకుంటున్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. మహానందిలో అత్యధికంగా 20.4మి.మీ, డోన్లో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 17.2, నంద్యాల అర్బన్లో 15.8, రూరల్లో 15.6, బండిఆత్మకూరులో 15.2, రుద్రవరం 14.6, పగిడ్యాల 14.4, వెలుగోడు 14.0, గడివేముల 12.2, ఆత్మకూరు 11.2, ఆళ్లగడ్డ, గోస్పాడులలో 11.0, కొత్తపల్లి 10.8, నందికొట్కూరు, పాణ్యంలలో 9.8, జూపాడుబంగ్లా, దొర్నిపాడు 9.2, కోవెలకుంట్ల 8.4, శిరివెళ్ల 8.2, మిడుతూరు 8.0, పాములపాడు 6.4, చాగలమర్రి 5.2, సంజామల 4.2, కొలిమిగుండ్ల, అవుకులలో 3.6, బనగానపల్లె 3.4, ఉయ్యాలవాడ 3.0, బేతంచెర్ల 2.2 మి.మీ వర్షం కురిసింది. -
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
కర్నూలు: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి భారీగా జరిమానాలు విధించారు. దాదాపు 150 మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పు న రూ.1.50 లక్షల అపరాధ రుసుం విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయమిచ్చి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వారికి రోజా పుష్పం ఇచ్చి వాహనాలను అప్పగించారు. ఇకపై హెల్మెట్ లేకుండా నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు. -
పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య
తుగ్గలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న దివ్యాంగులుఈ బాలిక పేరు ఎస్.మెహతాజ్. కర్నూలు నగరంలోని చిత్తారివీధి. పుట్టుకతోనే చెవిటి, మూగ. 2011లో సదరం క్యాంపునకు హాజరు కాగా వైద్యులు పరీక్షలు నిర్వహించి 100 శాతం వైకల్యం ఉన్నట్లు సరిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత బాలికకు మెదడులోనూ సమస్య మొదలైంది. ఇటీవల సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాగా.. 40శాతం లోపే సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా తాత్కాలికమేనంటూ పింఛనుకు అనర్హురాలిగా తేల్చారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు శివరామ్ మధు. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామం. కొన్నేళ్ల కిత్రమే పక్షవాతంతో ఎడమ చేయి, కాలు పడిపోయాయి. 2010లో సదరం క్యాంపునకు హాజరు కాగా 94 శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇప్పటికీ ఒకరి సహాయం లేనిదే కదల్లేని పరిస్థితి. ఇటీవల నిర్వహించిన రీవెరిఫికేషన్లో అసలు వికలత్వమే లేనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పింఛనుకు అనర్హుడిగా నోటీసు అందించారు. ఈమె పేరు ఉప్పరి వెంకటలక్ష్మి. తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామం. చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. దీనికి తోడు కింద పడటంతో కాలు విరిగి రాడ్ వేయించుకుంది. సొంతంగా కూర్చోలేదు, నిలబడలేదు. గతంలో 72 శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల రీవెరిఫికేషన్కు హాజరు కాగా అసలు వికలత్వమే లేనట్లు పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగా ఆమె పింఛను కోల్పోయింది. కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వీధిన పడేసింది. ఉన్న కాస్త ఆసరాను కూడా దూరం చేసి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఊహించినట్లుగానే అనర్హత పేరిట పెద్ద ఎత్తున పింఛన్లను తొలగించడంతో దివ్యాంగులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా వేలాది పింఛన్లను అనర్హత ముసుగులో అడ్డంగా తొలగించడం విమర్శలకు తావిస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో మొదలైంది. అప్పట్లో 100 శాతం వికలత్వం ఉంటే నేడు రీ వెరిఫికేషన్లో 40 శాతంలోపునకు తగ్గిపోయి పింఛను లేకుండా పోతోంది. సదరం క్యాంపుల్లో బేరసారాలు, రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం జరిగిన గ్రీవెన్స్కు పింఛన్లు పోయిన దివ్యాంగులు క్యూ కట్టారు. గతంలో వెరిఫై చేసి సర్టిఫికెట్లు ఇచ్చింది డాక్టర్లే.. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే ఇప్పుడు 40 లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తొలగింపులు దివ్యాంగుల పింఛను తొలగింపులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సచివాలయాలు తెరుచుకోలేదు. సోమవారం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ సదరం సర్టిఫికెట్, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్కు, మండలాల్లో ఎంపీడీఓల వద్దకు చేరుకొని తమ గోడు వినిపిస్తున్నారు. అనధికార సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో 10,050 పింఛన్లను తొలగించారు. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. రోజురోజుకు పింఛన్లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు. సిఫారసులకు పెద్దపీట సరదం రీవెరిఫికేషన్లో రాజకీయాలు, సిపారసులు జోరుగా సాగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సిపారసులు ఉన్న వారికి రూ.15వేల పింఛను వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం సమోదు చేయడం గమనార్హం. సదరం రీ వెరిఫికేషన్ జరిగే చోటుకు ఇతరులను అనుమతించడం లేదనేది ఉత్తుత్తిదేనని స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే తొలగింపులు తుగ్గలి: ఎన్నికల ముందు సంక్షేమ పథకాలతో ఊరించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత కోతలు మొదలుపెట్టారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా అనర్హుల పేరిట ఎడాపెడా తొలగింపులకు పాల్పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత దివ్యాంగులు ప్రసన్న, రామాంజినేయులు, గోవిందరాజులు, వీరాంజినేయులు సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములుతో కలిసి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా వస్తున్న తమ పింఛన్లను తొలగించడం అన్యాయమని వాపోయారు. కాళ్లు లేని వారు, మాటలు రాని వారు, కళ్లులేని వారు సర్కారుకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరిఫికేషన్లో 70 శాతం వికలత్వం ఉన్నా పింఛన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కోడుమూరులోని 5వ సచివాలయం పరిధిలో ఓ వ్యక్తికి అన్ని అవయవాలు సవ్యంగానే ఉన్నాయి. అయితే రెండు వేళ్లు దెబ్బతిన్నాయి. ఇది వరకు ఈయనకు 50 శాతం వరకే వికలత్వం ఉంది. రూ.6వేల పింఛను తీసుకుంటున్నాడు. కాళ్లు, చేతులు బాగున్న ఇతను అన్ని పనులు సొంతంగానే చేసుకుంటున్నాడు. ఈయనకు సదరం రీ వెరిఫికేషన్లో ఏకంగా 90 శాతం వికలత్వం నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీ వెరిఫికేషన్ ‘లోప’భూయిష్టం! -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. పలు సమస్యలపై బాధితులు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్లో కొన్ని దరఖాస్తులు ● తనకు ఇల్లు లేదని, ఇంటి స్థలం మంజూరు చేయా లని కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామా నికి చెందిన ఎస్.పెద్దశేఖర్ వినతి పత్రం ఇచ్చారు. ● తన పేరు మీద ఎకరా భూమి ఉండగా రీ సర్వేలో తక్కువగా చూపిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పి.మద్దయ్య అర్జీ సమర్పించారు. ● తనకు వస్తున్న వికలాంగుల పింఛన్ తొలగించారని, పునరుద్ధరించాలని గడివేముల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసులు అర్జీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్టులు పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నంద్యాలకు చెందిన ఎస్హెచ్జీ మహిళలకు ఎగ్ కార్టులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్టులను ఇస్తోందన్నారు. ఇవి జిల్లాకు 100 రాగా.. మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన 40 మందికి ఉచి తంగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 10 ఎగ్ కార్టులు వచ్చాయని చెప్పారు. ఒక్కొక్క ఎగ్ కార్టు రూ.50వేలు విలువ చేస్తుందని తెలిపారు. -
కళ్లుంటే ఈమెకేసి చూడండి..
బండి ఆత్మకూరు: ఈమె పేరు అంబటి చాముండేశ్వరి. బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం గ్రామం. 8 సంవత్సరాల క్రితం చిగురు కోసమని చింత చెట్టెక్కడంతో కాలుజారి కిందపడటంతో వెన్నుపూస విరిగింది. రెండు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. వైద్యులు .... వైకల్యం ఉన్నట్లు నిర్ధారించడంతో పింఛను అందుతోంది. అలనాపాలన చూసుకుంటున్న భర్త గోపాల్రెడ్డి(55) రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రీవెరిఫికేషన్ పేరిట ఈమె కు వికలత్వం 40శాతం లోపు ఉన్నట్లుగా నిర్ధా రించి పింఛను తొలగించారు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఈమె ప్రభుత్వ నిర్ణయం పట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం
ఆదాయాన్ని కోల్పోతూ..శ్రీశైలంటెంపుల్: సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, విద్యుత్ బిల్లులు తగ్గించుకుని, శ్రీశైలంలో భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దేవవస్థాన గత ట్రస్ట్బోర్డు సైతం ఆమోదం తెలిపింది. అయితే 14 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ఒక నెల విద్యుత్ బిల్లు రూ.70లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అలాగే సంవత్సరానికి రూ.8.40 కోట్లు విద్యుత్ ఖర్చు వస్తోంది. విద్యుత్ బిల్లు భారం తగ్గిస్తే, ఆ ఆదాయంతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయవచ్చని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యుత్ ఖర్చు ఇలా.. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో వీఐపీ కాటేజీలు, వసతి విభాగాలు, అన్నదాన భవనం, క్యూకాంప్లెక్స్, పరిపాలనా భవనం, దేవస్థాన స్టాఫ్ క్వాటర్స్, దేవస్థాన పరిపాలనా కార్యాలయాల్లో నిరంతరం విద్యుత్ వినియోగం ఉంటుంది. ఎల్టీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. అలాగే ఫిల్టర్హౌస్కు నీటి సరఫరా, ఉభయ దేవాలయాలు, గణేశ సదనం ఇలా పలు వాటికి హెచ్టీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. ఎల్టీ లైన్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్కు ప్రతి నెలా దేవస్థానం బిల్లుల రూపంలో ఏపీఎస్పీడీసీఎల్కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు చెల్లిస్తోంది. అలాగే హెచ్టీ లైన్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్కు సుమారు రూ.30 నుంచి రూ.40లక్షలు బిల్లుల రూపంలో చెలిస్తోంది. హెచ్టీ, ఎల్టీ విద్యుత్ బిల్లుల రూపంలో దేవస్థానం సరాసరి నెలకు రూ.70లక్షలు చెల్లింపులు చేస్తోంది. అంటే ఈ లెక్కన ఒక సంవత్సరానికి రూ.8.40లక్షలు కేవలం విద్యుత్ బిల్లులకు మాత్రమే చెల్లిస్తోంది. రూ.40 కోట్లతో ప్రతిపాదనలు విద్యుత్ బిల్లులకు ఇంత సొమ్ము చెల్లించకుండా, ఆ సొమ్ము భక్తులకు ఉపయోగపడేలా చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సాధారణ రోజుల్లో దేవస్థానం మూడు మెగావాట్లు, మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో నాలుగు మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తుంది. ఈ క్రమంలో 7 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ట్రస్ట్బోర్డు భావించింది. అయితే విద్యుత్ శాఖ నియమ, నిబంధనల మేరకు 500 కేవీ ప్లాంట్కు మాత్రమే అనుమతులిస్తుంది. ఈ క్రమంలో దేవస్థానంలో 500 కేవీ సోలార్ ప్లాంట్లు రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక మెగావాట్ ప్లాంట్ కోసం దేవస్థాన డంప్యార్డ్ సమీపంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శ్రీశైల దేవస్థానంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నెడ్ క్యాప్ సంస్థకు లేఖ రాయడంతో సర్వే చేశారు. డంప్యార్డ్ సమీపంలో సోలార్ ప్లాంట్ను నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. టెక్నికల్ టీం పరిశీలించి నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక అందగానే టెండర్ పిలిచి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. దేవదాయశాఖ కమిషనర్కు సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అలాగే విండ్ ఎనర్జీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందా అని సర్వే చేయించాలని కూడా భావిస్తున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిశ్రీశైల దేవస్థానం విద్యుత్ బిల్లుల రూపంలో ఏటా రూ.8.40కోట్లు నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14నెలలు గడుస్తున్నా ఇంత వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టలేదు. తద్వారా దేవస్థానం ఆదాయాన్ని కోల్పోతోంది. కూటమి ప్రభుత్వం స్పందించి సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించి దేవస్థానం ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేధించడం నిరంకుశత్వం
కర్నూలు (టౌన్): స్కూల్స్, హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కర్నూలు పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జీవో ప్రతులను ద హనం చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా జీవోను రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నా రు.స్కూళ్లు, హాస్టళ్లు సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు బబ్లు,చిన్నరాజు, మహేష్,వేణు,రాజుతదితరులు పాల్గొన్నారు. -
పంటలు వర్షార్పణం
● వరుస వర్షాలతో నీటమునిగిన పంట పొలాలు ● మినుము, మొక్కజొన్న పంటలు కుళ్లిపోతాయని రైతుల ఆందోళన ● ఉరకలేస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు నీటమునిగిన వరిపైరునంద్యాల(అర్బన్): రేయింబవళ్లు కష్టించిన సాగు చేసిన పంటలు వర్షార్పణం అవుతుండటంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మినుము, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మిరప, సాలు వరి, బెండ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల మినుము పూత, పిందె దశలో ఉండటంతో పంట నేలకొరిగి కుళ్లిపోయే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల మొక్కజొన్నకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. మిరప, వరి లేత దశలో ఉండటంతో నీట మునిగి కుళ్లు దశకు చేరే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వీధులు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులు సైతం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు ప్రశ్నార్థకంగా మారాయి. ఉద్ధృతంగా కుందూ, మద్దిలేరు వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కుందూనది, మద్దిలేరువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు, ప్రజలు అయోమయాలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పనులకు వెళ్లలేని కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నందికొట్కూరులో అత్యధికంగా.. జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం వరకు వర్షం కురిసింది. నందికొట్కూరు మండలంలో అత్యధికంగా 54మి.మీ. వర్షం కురియగా ప్యాపిలి మండలంలో అత్యల్పంగా 5.4 మి.మీ. నమోదైంది. కొత్తపల్లి 50.8, ఆత్మకూరు 47.8, మిడుతూరు 43.4, బండిఆత్మకూరు 38.0, వెలుగోడు 37.6, జూపాడుబంగ్లా, పగిడ్యాలలో 36.8, పాములపాడు 34.8, గడివేము ల, శ్రీశైలంలలో 31.4, మహానంది 29.4, రుద్రవర ం 27.2, నంద్యాల అర్బన్ 25.0, నంద్యాల రూరల్ 23.6, శిరివెళ్ల 20.2, సంజామల 19.8, చాగలమర్రి 19.2, పాణ్యం, ఉయ్యాలవాడ 18.0, ఆళ్లగడ్డ 17.6, దొర్నిపాడు 16.8, గోస్పాడు 16.2, కోవెలకుంట్ల 15.4, బనగానపల్లె, బేతంచెర్లలో 12.6, డోన్ 10.2, కొలిమిగుండ్లలో 8.6 మి.మీ. వర్షం కురిసింది. -
రూ.10 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తుడు రూ.10లక్షల విరాళాన్ని అందించారు. సోమ వారం కర్నూలుకు చెందిన పి.చిన్నశంకరప్ప శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అన్నప్రసాద వితరణకు రూ.5,00,116, గోసంరక్షణనిధి పథకానికి రూ.5,00,116.. మొత్తం రూ.10లక్షల విరాళ చెక్కును దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. విరాళాలను అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. పీజీఆర్ఎస్కు 66 ఫిర్యాదులు నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 66 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి సమస్యలు ఫిర్యాదుల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎస్పీ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యా దులపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్క రించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులలో కొన్ని.... ● బండిఆత్మకూరు మండలం చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి శాఖమూరి సుబ్బారెడ్డి రూ. 60 లక్షల విలువ చేసే 4000 వరి ధాన్యం బస్తాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నారాయణపురం గ్రామానికి చెందిన చిన్న మద్దిలేటి, రైతులు ఫిర్యాదు చేశారు. ● ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్పే ద్వారా రూ.99వేలు తీసుకుని లక్క హరిప్రసాద్ మోసం చేశారని పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన వినోద్ ఫిర్యాదు చేశారు. ఈనెల 20, 21 తేదీల్లో రీవెరిఫికేషన్కు మరో అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగుల పింఛను తీసుకుంటూ రీ వెరిఫికేషన్కు హాజరుకాని వారికి డీఆర్డీఏ మరో అవకాశం కల్పించింది. సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంలో జిల్లాలో 461 మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. వీరికి ఆగస్టు నెల పింఛను పంపిణీ చేయలేదు. రీ వెరిఫికేషన్కు హాజరు కాని 461 మందికి ఈ నెల 20, 21 తేదీల్లో సంబంధిత ఆసుపత్రుల్లో డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపి రమణారెడ్డి తెలిపారు. ఈ నెల 20న 370 మందికి, 21న 91 మంది దివ్యాంగులకు సంబందిత డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారన్నారు. -
47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్
కర్నూలు: మూడేళ్ల కాల పరిమితితో నూతన మద్యం బార్ పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు నూతన పాలసీ అమలులో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 47 నూతన మద్యం బార్లకు కలెక్టర్ల అనుమతితో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు సుధీర్ బాబు, రవికుమార్ సోమవారం గజిట్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. ● ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా నూతన మద్యం బార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ● ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా కొనుగోలు చేయవచ్చు. ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. ● అందిన దరఖాస్తుల్లో ఒక్కొక్క బార్ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు గౌడ కులాలకు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 2, ఆదోని మున్సిపాలిటీలో 1, నంద్యాల మున్సిపాలిటీలో 1, డోన్ మున్సిపాలిటీ పరిధిలో 1 చొప్పున రిజర్వేషన్ ప్రాతిపదికన బార్లను కేటాయించనున్నారు. ● ఇందుకోసం గౌడ్, ఈడిగ కులాలకు సంబంధించిన వారు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పొడిగించిన వ్యాపార సమయాలు... బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు (14 గంటలు) అనుమతించబడతాయి. గతంలో 11 గంటల వరకే అనుమతి ఉండేది. అయితే ఒక గంట సమయాన్ని పెంచుతూ మందుబాబులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్ రుసుం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్కు సరిపడ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన విధించారు. బార్లకు కూడా ఏ4 దుకాణాల మాదిరిగానే ఏపీఎస్డీసీఎల్ నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్స్ పొందినవారు 15 రోజుల లోపు రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, కార్పొరేషన్ పరిధిలో 10 కిలోమీటర్లు నిడివిలో, మున్సిపల్ ఏరియాలో మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా బార్లు ఏర్పాటు చేసుకోవాలి. కర్నూలు జిల్లాలో బార్ల ఏర్పాటు ప్రాంతాలు... కర్నూలు కార్పొరేషన్లో 16 జనరల్ కేటగిరీ 2 గీత కులాలకు, ఆదోని మున్సిపాలిటీలో 4 జనరల్ కేటగిరీ 1 గీత కార్మికులకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరు నగర పంచాయతీలో 1 బార్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. జిల్లాలో బార్లకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల: జిల్లాలో 19 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవికుమార్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల 14, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు 1, డోన్ 1, బేతంచెర్ల 1 చొప్పున బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని కేటాయించిన బార్లకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చని, లైసెన్స్ కలిగి ఉండటంపై ఎటువంటి పరిమితి లేదన్నారు. 50 వేల జనాబా ఉంటే రూ.35 లక్షలు, 55 వేల నుంచి 5లక్షల జనాబా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో, నంద్యాల ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈనెల 26వతేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు ఉందన్నారు. 28వ తేదీ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బార్లను లాటరీ పద్ధతి ఎంపిక చేస్తామన్నారు. -
దంపతులను రక్షించిన పోలీసులు
బనగానపల్లె రూరల్: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన దంపతులను పోలీసులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరిని కాపాడారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ది లేటి ఆయన భార్య శశికళ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే వారికి రూ.3 లక్షల అప్పులు ఉండడంతో, అప్పును తీర్చలేక మానసికంగా కుంగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బనగానపల్లెకు వచ్చారు. కుటుంబీకులు అనుమానంతో బనగానపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా రవ్వలకొండ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాల్వ వద్ద ఆత్మహత్య కు యత్నించేందుకు సిద్ధంగా ఉన్న దంపతులను ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది గుర్తించారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకునే ఆలోచన నుంచి విరమింపచేసినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జీవితం చాలా అమూల్యమైందని, చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోరాదని సీఐ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. దంపతులను రక్షించిన ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు. -
‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం!
గోస్పాడు: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇళ్లకు చేర్చే వాహనాలకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. వివిధ సమస్యలతో వాహనాలు షెడ్లకు పరిమితమైనా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. అరకొర జీతాలు సరిపోక డ్రైవర్ల ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నంద్యాల జిల్లాలో 19 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి మాతా, శిశు విభాగానికి 6, డోన్కు 3, ఆళ్లగడ్డకు 2, శిరివెళ్ల, ఆత్మకూరు, బనగానపల్లె, వెలుగోడు, నందికొట్కూరు, బేతంచెర్ల, కోవెలకుంట్ల, శ్రీశైలం ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఇవీ ఇబ్బందులు.. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ (మెయిన్ంటెనెన్స్) సక్రమంగా లేదు. ఇంజిన్ ఆయిల్, బ్యాటరీలు తరచూ మార్చకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. టైర్లు అరిగిపోవడంతో పంక్చర్ అవుతూ ఎక్కడ నిలిచి పోతాయో తెలయక డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. వాహనంలో వైఫర్లు, బ్యాటరీలు, లైట్లు కూడా సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. సేవలు కుదింపు ● గతంలో ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు కూడా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల సేవలు అందించేవారు. రెండు నెలలుగా ఈ సేవలను ఆపేశారు. ● గతంలో 50 కిలోమీటర్ల నుంచి 100, 150 కిలోమీటర్ల వరకు తల్లీబిడ్డ వాహనం వెళ్లేది. ఇటీవల 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు కుదించారు. ● ఒక తల్లి, బిడ్డ, వారి సాయంగా ఉన్న ఒకరిని మాత్రమే గమ్య స్థానానికి తీసుకెళ్లాలి. ఫలితంగా తల్లులు అవస్థలు పడుతున్నారు. ● తల్లికి ఒక చోట, పుట్టిన బిడ్డకు మరో చోట చికిత్స అందించాల్సి ఉంటుంది. అత్యవసర చికిత్స అందించేందుకు దూరప్రాంతాల ఆసుపత్రులకు రెఫర్ చేస్తే అక్కడ కోలుకున్నాక డిశ్చార్జ్ చేసిని వారిని తిరిగి ఇళ్లకు చేర్చడం లేదు. దీంతో చేసేది లేక తల్లీబిడ్డలు వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్ వాహనదారులను, ఆటోలను ఆశ్రయిస్తూ ఇళ్లకు చేరుతున్నారు. డ్రైవర్ల వేతనాల చెల్లింపులో అలసత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న 21 మంది డ్రైవర్లకు నెలకు రూ.7,870 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కూడా నెలనెలా చెల్లించడం లేదు. వాటి చెల్లింపులోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నాలుగు నెలలకు గాను రెండు రోజుల క్రితం రెండునెలల వేతనాన్ని చెల్లించారు. బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే వారు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వేతనాలు రాని కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు. వాహనాలకు బాగాలేని టైర్ల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తల్లీబిడ్డల సేవలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. –నవీన్కుమార్, జిల్లా మేనేజర్ జిల్లాలో 19 వాహనాలతో సేవలు టైర్లు అంతంత మాత్రమే ఎక్కడ నిలిచిపోతాయో తెలియని దుస్థితి డ్రైవర్లకు సకాలంలో అందని వేతనాలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మెరాయింపు ఇలా.. జిల్లాలోని 19 వాహనాల్లో వైఫర్ బ్లేడ్లు లేవు. వర్షాకాలం కావడంతో వాహనాలు బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్లుండి వర్షం వస్తే వాహనం ముందుకు కదల్లేదు. పది వాహనాలకు టైర్లు దెబ్బతిన్నాయి. స్టెప్నీ టైర్లు కూడా లేదు. గత రెండు రోజులుగా బనగానపల్లె వాహనం నిలిపోయింది. గత 20 రోజుల క్రితం నంద్యాల, వెలుగోడులలో వాహనాలు నిలిచిపోయాయి. టైర్లు వచ్చేవరకు తిరగలేని పరిస్థితి. కోవెలకుంట్లలోని వాహనానికి బ్యాటరీ లేక దాదాపుగా తొమ్మిది నెలలు గడుస్తోంది. గతంలో వాహనాలకు డీజిల్ కొరత ఉండేది కా దు. ప్రస్తుతం నెలకు రెండు ఫుల్ ట్యాంకులు దా టితే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి. -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో శనివాం నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 34.4 మి.మీ, ఆత్మకూరు మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. అదే విధంగా ఆళ్లగడ్డలో 22.2, శిరివెళ్ల, గోస్పాడులో 21.6, డోన్, పాములపాడులలో 18.8, బనగానపల్లెలో 18.6, నంద్యాల అర్బన్ 18.4, నంద్యాల రూరల్ 17.6, వెలుగోడు, జూపాడుబంగ్లాలో 13.8, అవుకు 13.2, సంజామల 11.0, మిడుతూరు, మహా నంది 10.2, కోవెలకుంట్ల, బేతంచెర్ల 9.2, రుద్రవరం 8.8, కొలిమిగుండ్ల 8.4, ఉయ్యాలవాడ 7.6, పగిడ్యాల 6.8, దొర్నిపాడు 6.4, బండిఆత్మకూరు 6.2, గడివేముల 5.8, ప్యాపిలి 4.6, నందికొట్కూరు 4.2, శ్రీశైలం 2.4మి.మీ వర్షం కురిసింది. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చ న్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉద యం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు గేట్ల నుంచి నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుండడంతో తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మూడు రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు 79,269 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలంకు 1,83,263 క్యూసె క్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాజెక్ట్లకు జలాశయం నుంచి 2,25,017 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 1,23,396 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,862 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 29,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 4.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.251 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.868 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 881.40 అడుగులకు చేరుకుంది. ఉప్పొంగిన వేదావతి నది హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామం వద్ద వేదావతి నది ఉప్పొంగింది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వేదావతి నదికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. అతి కష్టంపై నదిలో పుట్టి ప్రయాణం చేస్తూ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోని గూళ్యం గ్రామానికి చేరుకుంటున్నారు. నదిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బడ్జెట్ ల్యాప్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాం
ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులను ఈ నెలాఖరుకు పూ ర్తి చేయకుంటే కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ అయ్యే ప్రమా దం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ శాఖలను హెచ్చరించాం. ఇదే విషయాన్ని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా సమీక్షించారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాం. – జి.నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన డీఈఈలతో మాట్లాడి ఆయా పనులను పూర్తి చేయాలని కోరాం. నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదాన్ని వారికి గుర్తు చేసి పనులను పూర్తి చేయాలని చెబుతున్నాం. బిల్లుల జాప్యం కారణంగా ముందుకు రాని కాంట్రాక్టర్లతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. – ఎస్ఈసీ మద్దన్న, పీఆర్ ఇన్చార్జి ఎస్ఈ -
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా పరిషత్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.15.51 కోట్లతో 348 పనులను మంజూరు చేసింది. ఇందులో ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు కూడా వాటా మేరకు నిధులను కేటాయించి పనులను అప్పగించారు. అయితే ఈ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 10 శాతం కాంట్రిబ్యూషన్/సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరిగినా, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ ఏడాది సెప్టెంబర్ 5లోగా సబ్మిట్ చేయాల్సి ఉంది. అలాగే పురోగతిలో ఉన్న పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. లేని పక్షంలో మంజూరు చేసిన పనులు కాస్తా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులు ● షెడ్యూల్డు కులాల సంక్షేమానికి(15 శాతం నిధులు) రూ.2,18,95,000 నిధులతో 52 పనులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ మరమ్మతులు తదితరాలను చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ పనుల్లో ఇప్పటి వరకు 8 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 44 పనులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 16 పనులు, నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పరిధిలో 12 పనులు పెండింగ్లో ఉన్నాయి. ● షెడ్యూల్డు తెగల సంక్షేమానికి(6 శాతం నిధులు) రూ.78 లక్షలతో 17 పనులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 3 పనులు పూర్తి కాగా, 14 పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులతో ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పెండింగ్లో ఉన్న పనుల్లో అత్యధికంగా కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 4, ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 4 పనులు ఉన్నాయి. ● మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు, శిశు గృహల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు(15 శాతం నిధులు) రూ.2.94 కోట్లతో 58 పనులను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 2 పనులు మాత్రమే పూర్తి కాగా, 56 పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ పనుల్లో అత్యధికంగా నంద్యాల పీఐయూ ఈఈ పరిధిలో 22, కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 11 పనులు పెండింగ్లో ఉన్నాయి. నత్తనడకన మిగిలిన గ్రాంట్ల పనులు ● జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ● జెడ్పీ సాధారణ నిధులు(23 శాతం) రూ.5.64 కోట్లతో 119 పనులను మంజూరు చేశారు. ● ఇప్పటి వరకు 78 పనులు మాత్రమే పూర్తి కాగా.. మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ● గ్రామీణ నీటి సరఫరా విభాగానికి(12 శాతం నిధులు) రూ.1.89 కోట్లతో 51 పనులను మంజూరు చేయశారు. ● కేవలం 14 పనులను మాత్రమే పూర్తి చేశారు. ● వేసవిలో ఈ పనులను పూర్తి చేయాలని జెడ్పీ పాలకవర్గం ఎంత ఒత్తిడి చేసినా, నేటికి పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ● సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద (10 శాతం నిధులు) రూ.1.85 కోట్లతో 51 పనులకు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 8 పనులు పూర్తి కాగా, 43 పనులు పెండింగ్లో ఉన్నాయి. మంత్రాలయంలో జిల్లా న్యాయమూర్తులు మంత్రాలయం రూరల్/కౌతాళం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండవ ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయ ణ దర్శించుకున్నారు. వీరికి ఆల య అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ లు చేయించారు. న్యాయమూర్తులకు పూలమాల, శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే ఉరుకుంద ఈరన్నస్వామిని కూడా వారు దర్శించుకున్నారు. శ్రావణమాస ఉత్సవాలపై ఈఓ వాణిని అడిగి జిల్లా న్యాయమూర్తులు తెలుసుకున్నారు. వీరి వెంట ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకుడు వెంకటేష్, కౌతాళం సీఐ అశోక్కుమార్ ఉన్నారు. నంద్యాల: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమి త్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ (నెంబరు 08514–293903) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నదులు, వంకలు పరివాహక ప్రాంతాల్లో ప్రజ లను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సచివాలయమే రక్ష -
ఆటోలపై ‘కూటమి పిడుగు’
కొలిమిగుండ్ల: డ్రైవింగ్ వచ్చి ఆటో చేతిలో ఉంటే చాలు కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ధీమాతో ఉన్న వారు ఇప్పుడు డీలా పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్రశక్తి పేరిట ఉచిత బస్సు పథకం సాఫీగా సాగిపోతున్న ఆటోవాలా జీవన ప్రయాణంపై పిడుగులా పడింది. ఇప్పటికే ఇంటికో బైక్, కారు ఉండటంతో ఆటోలు ఎక్కే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఫ్రీ బస్సు ఏర్పాటుతో ఆటో డ్రైవర్లు మరింత కష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్ల మండలంలో 150కి పైగానే మూడు, నాలుగు చక్రాల ఆటోలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ రోజుకురూ. 500 నుంచి రూ. 700 మేర సంపాదిస్తుండేవారు. ఆటోల్లో ఎక్కువ భాగం మహిళలే ప్రయాణించే వారు. రెండు రోజుల నుంచి ఆటోలు ఎక్కే వాళ్లు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉచిత బస్సు పథకంతో తమ బతుకు బండి నడిచేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సర్వీసులు లేని గ్రామాల్లో మాత్రమే కొంత వరకు మహిళలు ఆటోల్లో వెళుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు అకౌంట్లలో జమ కావడతో కొంత వరకు ఊరట కలిగించిందన్నారు. ఆ డబ్బుతో వాహనాల ఆటోల ఫిటెనెస్, బీమా ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో వాలాలకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, 14 నెలలు అవుతున్నా ఆ ఊసేత్తడం లేదన్నారు. కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందని, ఆటోవాలాలకు చేయూత ఇవ్వాలని కోరుతున్నారు. ఉచిత బస్సుతో ఆటోవాలా జీవనోపాధిపై ప్రభావం రూ. 15 వేల హామీ అమలు చేయాలని డిమాండ్ -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో 8 బెటాలియన్లకు సంబంధించిన సిబ్బంది పరేడ్లో పాల్గొనగా కర్నూలు రెండవ బెటాలియన్కు సంబంధించి ఆర్ఐ అనిల్ కుమార్, ఆర్ఎస్ఐలు సర్దార్, మునాఫ్ల ఆధ్వర్యంలో చక్కటి కవాతు ప్రదర్శన(పెరేడ్) నిర్వహించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కంటింజెంట్ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో బెటాలియన్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్లో చక్కటి నైపుణ్యత ప్రదర్శించి కంటింజెంట్ అవార్డును అందుకున్నందుకు పటాలం సిబ్బందిని కమాండెంట్ దీపిక పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్రవరం రేంజర్గా ముర్తుజావలి రుద్రవరం: రుద్రవరం రేంజ్ అధికారిగా ముర్తుజావలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023లో రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డీఆర్వోగా విధుల్లో చేరాడు. ఇటీవలె రేంజి అధికారిగా ఉన్న శ్రీపతినాయుడు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఆర్వోగా ఉన్న ముర్తుజా వలికి రేంజర్గా పదోన్నతి కల్పించి రుద్రవరానికి నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు గ్రామం పెండేకంటినగర్లో నివాసముంటున్న సుబ్బరాయుడు కొడు కు భానుప్రకాష్కు, అదే గ్రామానికి చెందిన రెడ్డిపోగు మాదన్న కూతురు భారతి(31)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప,బాబు సంతానం. అయితే ఆటో నడిపే భాను ప్రకాష్ మద్యానికి అలవాటుపడి సంపాదనంతా మందుకే ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో భార్య భారతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి మాద న్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ పేర్కొన్నారు. అప్పులబాధతో.. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కై ప గ్రామానికి చెందిన రైతు వెంకటరమణరెడ్డి(37) అనే వ్యక్తి అప్పుల బాధతో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతేడాది రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే, పంట పండక తీవ్రనష్టం వచ్చింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె సంతానం. జీవితంపై విరక్తి చెంది.. మిడుతూరు మండలం అలగనూర్ గ్రామానికి చెందిన షేక్ జుబేదాబేగం (20) అనే యువతి గురువారం రాత్రి బలవన్మరణం చేసుకుంది. అనారోగ్యంతో పాటు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ మేరకు తండ్రి ఉసేన్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలు దొర్నిపాడు: తొలిపంటగా సాగుచేసిన నల్లబంగారం చేతికిరాని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పూర్తిగా దెబ్బతినింది. కేవలం 90 రోజుల్లో చేతికి వస్తుందని రైతులు విస్తారంగా మినుము పంట వేశారు. ఒక్క దొర్నిపాడు మండలంలోనే దాదాపు 700 హెక్టార్లకు పైగా ఈ పంట సాగైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా కోత సమయంలో రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు మినుము పంటంతా నీటిలోనే ఉంది. దీంతో కోత పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోతమిషన్లు పనులు లేక గ్రామంలో నిలబడిపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో కోతకు నేల అనుకూలించక రైతులు దిగాలు చెందుతున్నారు. కాసిన అరకొర గింజలు సైత నేల రాలుతున్నాయని వాపోతున్నారు. -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు(టౌన్): కార్పొరేషన్ పదవుల పేరుతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడుతుందని వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇటీవల 31 కార్పొరేషన్ పదవులను ప్రకటించిందన్నారు. అయితే, నిజమైన కులాలకు కాకుండా బెస్తయేతర వారికి ఆ పదవులు కట్టబెట్టి చిచ్చురాజేసిందన్నారు. బెస్త సంక్షేమ, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా పట్టపు సామాజిక వర్గానికి చెందిన బొమ్మన శ్రీధర్ను ప్రకటించి నిజమైన బెస్త సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పట్టపు రాజు లేదా పట్టపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయ నకు బెస్త కార్పొరేషన్ చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీమలో ఫ్యాక్షన్కు బలి అవుతున్న బెస్తలకు కనీసం కుల కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కూడా న్యాయం జరగలేదన్నారు. అలాగే గత జులై నెల 7 వ తేదీ న జీవో 81 ప్రకారం కొల్లు పెద్దిరాజును మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారన్నారు. పదవుల విషయంలోనే కాకుండా మత్స్య కార సమస్యలు పరిష్కారంలోనూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బెస్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేకపోతే భవిష్యత్తులో వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కల్లూరు మండలం తడకపల్లె గ్రామంలో జరుగుతున్న మొహర్రం 40 రోజుల జార్తాలకు భార్య దుర్గ, మరో ఇద్దరితో కలిసి బైక్పై రాజు గురువారం వెళ్లాడు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరాడు. తడకనపల్లె క్రాస్ రోడ్డులో మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైలింగ్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నూర్ అహమ్మద్, పోలీసులు వారిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్ దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మై హోమ్ గ్రానైట్ దుకాణంలోకి శుక్రవారం నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బెంగళూరు సర్వీస్ దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి వస్తున్న ఈ బస్సులో డ్రైవర్ కలిముల్లాకు బీపీ డౌన్ అయింది. దీంతో స్టీరింగ్ పట్టు తప్పడంతో బస్సు గ్రానైట్ దుకాణంలోకి వెళ్లి బండలను ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయలు కాలేదని వెల్లడించారు. కాగా బస్సు ఢీకొనంతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే గ్రానైట్ బండలు పగిలిపోయినట్లు గ్రానైట్ యజమాని సద్దాం తెలిపారు. కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి కర్నూలు(రూరల్): కుక్కల దాడి లో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బైరి పెద్ద మద్దిలేటి జీవాలు పెంచుతుంటాడు. శుక్రవారం గ్రామ సమీపాన కేసీ కెనాల్ వంతెన దగ్గర ఉన్న దొడ్డిలో గొర్రె పిల్లలను ఉంచి మందను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 6 కుక్కలు దొడ్డిలొకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డా యి. ఈ ఘటనలో 15 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత దొడ్డికి వచ్చి చూడగా గొర్రె పిల్లలు చనిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో రూ.90 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బైక్ అదుపు తప్పి.. ఆళ్లగడ్డ: అహోబిలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతియాజ్ బాషా (24) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. నంద్యాల రూరల్ మండలం కానాల గ్రామానికి చెందిన ఇంతియాస్ బాషా ఓ శుభకార్యానికి అహోబిలం వచ్చాడు. మధ్యాహ్న సమయంలో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్తుండగా మార్గమధ్యంలో మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈఘటనలో ఇంతియాజ్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న వెంకట సునీల్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
ఆకట్టుకున్న శకటాలు...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ, శక్తి టీం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, డ్వామా, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయం, వైద్య, 108, 104, ఉద్యానవన, డీఆర్డీఏ, సహకార బ్యాంక్, గృహ నిర్మాణ, రవాణా, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ సూర్యఘర్ ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉద్యాన సూక్ష్మ నీటి సాగు శాఖకు ప్రథమ, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకు ద్వితీయ, పోలీసు శాఖ శక్తిటీమ్కు తృతీయ స్థానంలో నిలువగా, ఆ శాఖ అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు. -
బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్ఆర్ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ (వీబీఆర్)కు 11,000, జీఎన్ఎస్ఎస్కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు. శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్ గోస్పాడు: విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం తెలిపారు. ఇటీవల సీఎం శ్రీశైలం పర్యటన సందర్భంగా డాక్టర్ షహనాజ్ విధులకు గైర్హాజరు కావడంతో పాటు తరచూ విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ రోగులకు అందు బాటులో ఉండటం లేదన్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్ను సస్పెండ్ చేశామన్నారు. మహానందిలో మహాలక్ష్మీ హోమాలు మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదాలు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధులయ్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి. ముగిసిన మొహర్రం సంతాప దినాలు బనగానపల్లె: మొహర్రం సంతాప దినాలు శుక్రవారంతో ముగిశాయి. మొహర్రం వేడుకలు గత నెల 6వ తేదీ పీర్ల నిమజ్జనంతో ముగిసింది. అప్పటి నుంచి షియా మతస్తులు 40 రోజుల పాటు సంతాప దినాలుగా భావిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన మొహర్రాన్ని బనగానపల్లెలో షియా మతస్తు లు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శుక్రవారం మొహర్రం సంతాప దినాలు ముగియడంతో కొండపేటలోని పీర్లచావిడి నుంచి బయల్దేరిన ఇమాంహసన్, ఇమాంహుస్సేన్ పీర్లతో భక్తిగీతాలు అలపిస్తూ మాతం నిర్వహిస్తూ రక్తాన్ని చిందించారు. ఈ మాతం కార్యక్రమం పాత సిండికెట్ బ్యాంకు వరకు సాగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజల్ అలీఖాన్తో పాటు షియా మతస్తులు పాల్గొని మాతం చేసుకుంటూ నవాబు కోట వరకు వెళ్లారు. కార్యక్రమంలో పలువురు షియా మత పెద్దలతో షీయా మతస్తులు పాల్గొన్నారు. మాతం చూసేందుకు అధిక సంఖ్యలో హిందూ, ముస్లింలు తరలివచ్చారు. -
జెడ్పీలో 34 మందికి పదోన్నతులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు జెడ్పీ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 34 మందికి పదోన్నతులు కల్పించారు. శుక్రవారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి ఉత్తర్వులను అందించారు. పదోన్నతులు పొందిన వారిలో సీనియర్ అసిస్టెంట్ నుంచి పరిపాలనాధికారిగా ఒకరు, రికార్డు అసిస్టెంట్ నుంచి జూని యర్ అసిస్టెంట్లుగా ఐదుగురు పదోన్నతులు పొందారు. అలాగే ఆయా కార్యాలయాల్లో ఆఫీసు సబార్డినేట్, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలను అనుసరించి రికార్డు అసిస్టెంట్లుగా 21, లైబ్రరీ అసిస్టెంట్గా 1, ల్యాబ్ అసిస్టెంట్లుగా 6గురికి పదో న్నతి కల్పించారు. ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకాల కింద ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పిస్తు వివిధ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. -
వడ్లరామాపురంలో నేడు చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: మహారాష్ట్ర – ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ భవనాశి శంక ర్ అంత్యక్రియలు శనివారం ఆయ న స్వగ్రామం వడ్లరామాపురంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర రాజ్నంద్ గావ్ జిల్లాలోని మొహాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం తెల్లవా రే సరికి చిన్నన్న మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న వ్యక్తి విగతజీవిగా గ్రామానికి చేరుకోనుండడంతో గ్రామస్తులు ఆఖరి చూపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం!
● మండలానికి రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశాలు ● గతంలో రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ఇదే తంతు ● దళారులుగా వ్యవహరిస్తున్న ఏపీఓలు ● హడలెత్తిస్తున్న ఏపీడీలు ● బెంబేలెత్తిపోతున్న డ్వామా క్షేత్ర సిబ్బంది ఆళ్లగడ్డ: జాతీయ పర్వదినాలైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ పేరుతో కొందరు అధికారులు వసూళ్ల పర్వానికి తెరలేపడం విమర్శలకు తావిస్తోంది. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఓ అధికారి ఎవరు ఎంత ఇవ్వాలన్న దానిపై నిర్ణయిస్తున్నారు. అనేక సార్లు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి నిరసనలు వ్యక్తమైనా వసూళ్ల బాగోతాన్ని వీడలేదు. సందట్లో సడేమియాలా కొందరు మండల స్థాయి ఉద్యోగులు సైతం ఇదే దారిలో పయనిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు షరా మామూలే అన్న చందంగా తాయరైంది. జిల్లా అధికారి నుంచి మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది (ఫీల్డ్ అసిస్టెంట్లు) నుంచి రకరకాలుగా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా జిల్లా కేంద్రం నంద్యాలలో శుక్రవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధి పథకం తరఫున శకటం ఏర్పాటు చేసేందుకు ఒక్కో మండలం నుంచి రూ. 10 నుంచి రూ. 15 వేలు వసూలు చేయాలని అనధికారకంగా ఉత్తర్వులు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.3 లక్షల వసూలు జిల్లాలో ఏ శాఖ ఏర్పాటు చేయని విధంగా ఉపాధి హామీ పథకం శకటం ఉండాలని అధికారి ఆదేశం. ఇందు కోసం 32 టైర్ల లారీ తీసుకుని దానిపై చెరువు మట్టి నింపి ఫాంపాండ్ ఏర్పాటు చేసి దాని చుట్టూ పెద్దపెద్ద చెట్లు పెట్టించాలని ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందో అంతా క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏపీడీలు, ఏపీఓలు కలిసి చర్చించి పెద్ద మండలం అయితే రూ.15 వేలు, చిన్న మండలం అయితే రూ.10 వేలు తగ్గకుండా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని 28 మండలాల పరిధిలో కనీసం రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీఓలు, టీసీలు గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లతో వసూళ్లు సాగించినట్లు చర్చ జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం డబ్బులు వసూలు చేయలేదు. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు. – సూర్యనారాయణ, పీడీ, డ్వామా రిపబ్లిక్ డే వేడుకలకు రూ. 2 లక్షలు ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సైతం ఇలాగే అందరికంటే ‘ఉపాధి’ శకటమే బాగుండాలని గోకులం (పశువుల షెడ్డు) ఏర్పాటు చేసేందుకు రూ. 2 లక్షలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో మండలం నుంచి రూ. 8 వేలు వసూలు చేసి ఇచ్చామని ఇలా మాటిమాటికీ వేలకు వేలు ఇవ్వాలంటే ఎలా అని క్షేత్ర, మండల స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి. -
అంగట్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు
● పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూళ్లు ● కర్నూలు పెద్దాసుపత్రిలో దందా కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆశావహుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను ఈగల్ హంటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ గత జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో 40 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 60 మంది సెక్యూరిటీ గార్డులతో సేవలందించేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు టోకుగా రూ.16 వేలకు పైగా జీతం వస్తుందని అధికారులకు చెప్పారు. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పోస్టుకు అభ్యర్థి కనీసం టెన్త్ చదివి ఉండాలని, 45 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, శారీరక ధృడత్వం ఉండాలని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తమకు సబ్లీజుకు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్దన్రెడ్డి అనుచరులు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు పంతం పట్టారు. ఈ మేరకు ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విష్ణువర్దన్రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వారు ఈ సంస్థను సబ్లీజుకు తీసుకున్నట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరు ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 25 మందికి పైగానే భర్తీ చేశారు. ఇందులో ఒక్కో పోస్టుకు రూ.లక్షకు పైగా చేతుల మారినట్లు చర్చ నడుస్తోంది. కొందరు దళారులు రంగప్రవేశం చేసి మనం చెప్పినట్లే నడుస్తుందని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకూ పోస్టులు కావాలని మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు వచ్చి గొడవ చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంకా ఖాళీగా ఉన్న వందకు పైగా సెక్యూరిటీ గార్డు పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి మధ్యలో దళారులు సైతం చక్రం తిప్పుతున్నారు. తాము చెప్పిన వారికి పోస్టులు ఇవ్వాలని మరోవైపు కొందరు ప్రజాప్రతినిదులు సైతం ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోస్టుల అమ్మకాలు ఆసుపత్రిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జీతంలోనూ భారీ కోత ఎంఓయూ ప్రకారం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.16 వేలకు పైగా జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ నెలలో సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే ఇచ్చారు. కొత్త ఏజెన్సీ వచ్చినా పాత జీతాలేనా అని సెక్యూరిటీ గార్డులు నిట్టూరుస్తున్నారు. పెంచిన మేరకు తమకు జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. -
27 నుంచి గణేశ్ ఉత్సవాలు
● వచ్చే నెల 4న కర్నూలులో నిమజ్జనోత్సవం కర్నూలు కల్చరల్: గణేశ్ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణాల్లో 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 4వ తేదీ నిమజ్జనోత్సవం ఉంటుందన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ మాట్లాడుతూ.. మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తులో కాకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాల నిర్వహణకు పోటీ పడాలన్నారు. మండపాల నిర్వాహకులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. క్రెడో స్కూల్లో విద్యార్థులకు 24న వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నగర కార్యదర్శి గురిరాజవర్మ, సభ్యులు కొట్టే చెన్నయ్య, భాను ప్రకాష్, అక్కెం విశ్వనాథ్ పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం కారిడార్లో సందడి నెలకొంది. శనివారం ప్రత్యేక పర్వదినం, గోకులాష్టామి సెలవు దినం కావడంతో భక్తుల కోలాహలం కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాధిగా భక్తులు తరలివచ్చి రాఘవేంద్రులు మూలబృందవాన్ని దర్శించుకున్నారు. కర్నూలు: గ్రామీణ ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చే సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించేది లేదని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు తమ ఆటోలను కర్నూలు నగర శివారులోనే నిలుపుకోవాలని సూచించారు. నంద్యాల చెక్పోస్టు, గుత్తి పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తా, సెయింట్జోసెఫ్ కాలేజీ వరకు మాత్రమే ఆటోలకు అనుమతి ఉంటుందని, పోలీసు ఆదేశాలను ఖాతరు చేయకుండా నగరంలోకి ప్రవేశిస్తే కేసులతో పాటు భారీగా చలానాలు విధిస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని పాతబస్తీలో రాధాకృష్ణ టాకీస్ నుంచి నెహ్రూ రోడ్డు మీదుగా (బొంగుల బజార్), మించిన్ బజార్ రూట్లలో ఒకవైపు ప్రయాణం మాత్రమే (వన్వే) అనుమతిస్తామన్నారు. -
నేత్రదానంపై అపోహలు తొలగిపోవాలి
కర్నూలు(హాస్పిటల్): నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పెద్దమార్కెట్ ప్రాంతంలో జయలక్ష్మి(77) అనే మహిళ గుండెపోటుతో మరణించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి వెళ్లి నేత్రదానానికి ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. వారి సమాచారంతో స్థానిక బుధవారపేటలోని సుశీల నేత్రాలయ సిబ్బంది వెళ్లి ఆమె నేత్రాలను సేకరించారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. సుశీల నేత్రాలయ కంటి వైద్యులు డాక్టర్ పి.సుధాకర్రావు మాట్లాడుతూ ఒకరి నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని, అందుకే తమ ఆసుపత్రిలో నేత్ర సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రెండేళ్ల కాలంలో 110కి పైగా కార్నియా ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించినట్లు తెలిపారు. నేత్రదానం చేయదలచిన వారు 8886306308ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ సావిత్రి, కంటి వైద్యులు డాక్టర్ నేహ సుధాకర్, డాక్టర్ రాఘవప్రీతమ్ పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్రకు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(28)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా మహేశ్వరి అనారోగ్యానికి మానసికంగా కుంగిపోయింది. మనస్తాపంతో చెందిన ఆమె శనివారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుట్టుగా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం
జూపాడుబంగ్లా: తంగడంచ గ్రామరెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తంగడంచ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 358, 359, 368లో ఆద్యా అగ్రిక్రాప్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ఇప్పటిదాకా తంగడంచ గ్రామస్తులకెవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు గ్రామస్తుల అభిప్రాయసేకరణ, మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్తుల అభిప్రాయసేకరణ తీసుకోకుండానే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చూసేందుకు కూడా అక్కడున్న వారు లోపలికి వెళ్లనివ్వటం లేదంటే ఎంత పకడ్బందీగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మండల, జిల్లా స్థాయి అధికారులు తంగడంచ వద్ద జరుగుతున్న ఫ్యాక్టరీలో భవిష్యత్లో ఎలాంటి ఉత్పత్తుల్తు చేస్తారో, స్థానిక నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివ రణ కోరగా తంగడంచ భూములు ఏపీఐఐసీ వారికి అప్పగించినందున ఫ్యాక్టరీలకు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం ఉండదని, ఏపీఐఐసీ అధికారులే కంపెనీల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన అన్ని అనుమతులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. -
విప్లవ జోహార్లతో చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: విప్లవ జోహార్లతో సుగులూరి చిన్నన్న అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. నాలుగురోజుల కిందట మహారాష్ట్ర –ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ సుగులూరి చిన్నన్న మృతిచెందారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి శనివారం ఉదయం 10 గంటలకు మృతదేహం వచ్చింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల రెండింటి నుంచి పలువురు వడ్ల రామాపురం చేరుకున్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిన్నన్న అలియాస్ శంకర్, అలియాస్ విజయ్ అంత్యక్రియలు విప్లవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించారు. చిన్నన్న పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి ‘అమర వీరుల ఆశయాలను సాధిద్దాం ... కామ్రేడ్ చిన్నన్న అమర్ రహే’ అని నినదించారు. చిన్నన్న మృతదేహాన్ని ట్రాక్ట పై ఉంచి గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీతో ఆయన కుటుంబ పొలంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన మృతదేహాన్ని విప్లవ సంప్రదాయాలతో ఖననం చేశారు. అమరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన పద్మ, భవాని, శోభ, అంజమ్మ, విరసం సభ్యులు పినాకపాణి, ఏపి పౌరహక్కుల సంఘం నాయకులు అల్లాబకాష్, కరీంబాషా, తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు ఆర్.రాజానందం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నర్సింహయ్య, సీపీఐ ఎంఎల్ జనశక్తికి చెందిన సుంకన్న, వైద్యులు డాక్టర్ నాగన్న, డాక్టర్ గౌరీనాఽథ్, వివిధ దళిత సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం అసాధ్యం మావోయిస్టు పార్టీ సభ్యులను కాల్చి చంపడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ రచయితల సంఘం పూర్వ కార్యదర్శి పాణి అన్నారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురంలో శనివారం కామ్రేడ్ చిన్నన్న అంత్యక్రియలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో అత్యంత పాశవికంగా ‘కగార్ ఆపరేషన్’ జరుపుతోందన్నారు. అక్కడ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు గిరిజనులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను హతం చేస్తున్నారని ఆరోపించారు. కామ్రేడ్ చిన్నన్న మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదన్నారు. -
నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది
నేను టైర్ల పనిచేస్తూ జీవనం సాగిస్తుంటా. ఈ నెల 10న పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క వెంటపడి మరీ కరిచింది. దీంతో భయమేసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. టౌన్లో ఏ వీధి చూసినా కుక్కల భయమే. కొత్తవాళ్లను చూస్తే వెంటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోంది. – పవన్కుమార్, పాతబస్టాండ్, కర్నూలు మా కుమారుడు దేవాన్స్కు ఐదేళ్లు. ఈనెల 8న వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత రెండో డోసు కూడా వేయించాం. మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తేనే గుండె జారుతోంది. పిల్లలు కనిపిస్తే చాలు మీదకొస్తున్నాయి. – దేవరాజు, ఎన్టీఆర్ కాలనీ, కర్నూలు -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శాస్త్రోక్తంగా గోపూజ శ్రీశైలంటెంపుల్: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, పండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గోపూజ జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. యూరియా పక్కదారి! మహానంది: రైతు సేవాకేంద్రానికి వచ్చిన యూరియా పక్కదారి పడుతోంది. టీడీపీ నేతల సహకారంతో ప్రైవేటు గోడౌన్లకు తరలుతోంది. మసీదుపురం గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్కు రెండు లారీల యూరియా వెళ్లడం చర్చనీయాంశమైంది. రైతులకు యూరియా అందించకుండా పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మసీదుపురం గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జునరెడ్డి కోరారు. ఈ విషయంపై ఏఓ నాగేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. గ్రామ సమీపంలో వంతెన మరమ్మతులు జరుగుతుండటంతో యూరియా నిల్వలు అక్కడే ఉంచి రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 26వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను 0.05 అడుగు మేర ఎత్తి నీటినిఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 12వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్ఎస్ఎస్)కాల్వకు 10వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విద్యుదాఘాతంతో చిరుతపులికి గాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: విద్యుదాఘాతంతో శనివారం రాత్రి లింగాలగట్టు గ్రామం వద్ద చిరుతపులికి గాయాలు అయ్యాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం దిగువన, లింగాలగట్టు గ్రామం పొలిమేరలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పులి కొండ చరియలను దాటుకొనే ప్రయత్నంలో జారి పడింది. ఆ ప్రాంతంలో లింగాలగట్టు వాసుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడి విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. గాయాలతోనే అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. -
రమణీయం.. ఉట్లోత్సవం
● శ్రీమఠంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల స్వయంగా ఉట్టి కొట్టి అందరిలో భక్తిభావాన్ని నింపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుడి మూలవిరాట్కు పీఠాధిపతి విశిష్ట పూజలు చేశారు. సాయంత్రం శ్రీ మఠం మధ్వ కారిడార్లో ఉట్లోత్సవం కార్యక్రమం చేపట్టారు. రంగు నీళ్లు చల్లుకుంటూ ఉట్లోత్సవం వైభవంగా కొనసాగింది. ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి ఉత్సవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
శ్రీశైలండ్యాం నీటిమట్టం 882.10 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి శనివారం సాయంత్రం నాటికి 5 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు 1,33,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలానికి 2,05,212 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాంతాలకు జలాశయం నుంచి 1,89,111 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 91,270 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 70,082 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 25,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.357 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 199.7354 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది. -
ఉచితం.. అగమ్యగోచరం
● మహిళలకు తప్పని తిప్పలు ● మూలపడిన పల్లెవెలుగు బస్సులు ● శ్రీశైల క్షేత్రానికి కొత్త బస్సు సర్వీసులు నిల్ఆత్మకూరు: మహిళలకు ఉచిత బస్సు అని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. బస్టాండ్కు వెళ్లిన వారు ఉచిత బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సు వస్తుందో.. రాదో తెలియని దుస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాక మూలనపడిన వాటికి మరమ్మతులు సైతం చేయలేదు. దీంతో ఉచిత బస్సు కోసం చూసే మహిళలకు నిరాశే ఎదురవుతోంది.గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేనప్పుడు ఉచిత ప్రయాణం ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి రావాలంటే, పట్టణం నుంచి పల్లెలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయని చెబుతున్నారు. మరమ్మతులు చేసినా? నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ డిపోల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అధికారులు విద్యార్థి బస్సులను వాడుతున్నారు. మరమ్మతులకు గురైన పల్లె వెలుగు బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బస్సులే అదనపు సర్వీసులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి డిపోలో దాదాపు 10 నుంచి 14 బస్సులకు మరమ్మతులు చేసి వాటిని అదనపు సర్వీసుల కింద నడపనున్నారు. కాగా ఈ బస్సులకు మరమ్మతులు చేసినా ఎంత దూరం ప్రయాణిస్తాయి, అసలు ఇవి కండిషన్లో ఉంటాయా? మహిళలను, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయా లేదో వేచి చూడాలి. పాత బస్సులే దిక్కు నంద్యాల, కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లా, వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లడం పరిపాటి. మహిళలకు ఉచిత బస్సు పేరుతో పాతవాటినే నడుపుతున్నారు. మహిళలు అధికంగా ఉంటే ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా 110 కి.మీ. దూరం ఆ బస్సు శ్రీశైలం వెళ్తుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంత దూరం మహిళలు బస్సులో నిలబడి ఎలా ప్రయాణిస్తారు? మహిళలకు కావాల్సిన సీట్లు ఖాళీగా ఉంటాయా? రిజర్వేషన్ సౌకర్యం, ఇతర భక్తులు ఉచితంగా దర్శనానికి వెళ్లే మహిళల పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మహిళలు శ్రీశైల క్షేత్రానికి పోటెత్తే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించి శ్రీశైలం మహాక్షేత్రానికి అదనపు బస్సు సర్వీసులను వేయాల్సి ఉంది. మహిళల కోసం అదనపు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థి బస్సు సర్వీసులతో పాటు షెడ్లో రిపేరీ ఉన్న బస్సులకు కూడా మరమ్మతులు చేస్తున్నాం. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేందుకు బస్సులకు మరమ్మతులు చేయించి ఘాట్ ఎక్కేలా చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం క్షేత్రానికి మంచి ఇంజన్ కలిగిన బస్సులను నడుపుతాం. పల్లె వెలుగు సర్వీసులైనా మంచి బస్సులను ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. – రజియాసుల్తానా, ఆర్టీసీ ఆర్ఎం, నంద్యాల పల్లె వెలుగు సర్వీసులన్నీ తొలగింపు! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వెలుగు బస్సు సర్వీసులు చాలా వరకు తొలగించారు. గతంలో పల్లెలకు ఎన్నో బస్సు సౌకర్యాలు ఉండేవి. కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం, ఎర్రమఠం, పెద్దగుమ్మడాపురం, గువ్వలకుంట్ల గ్రామాలకు తిరిగేవి. అలాగే పాములపాడు మండలంలోని మద్దూరు, వాడాల, వేంపెంట గ్రామాలకు బస్సు వెళ్లేది. కురుకుంద, కొట్టాల చెరువు, వెలుగోడు మండలంలోని రేగడగూడూరు, గుంతకందాలకు ప్రతిరోజూ రెండు బస్సులు తిరిగేవి. ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రతి రోజూ పల్లెలకు 15 బస్సులు సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం ఈ బస్సు సర్వీసులన్నీ తొలగించారు. దీంతో గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బడిపిల్లలకు మాత్రం ఉదయం, సాయంత్రం కేవలం రెండుసార్లు మాత్రమే కొన్ని గ్రామాలకు ఒకే బస్సును కేటాయించారు. దీంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూనే విద్యార్థి బస్సు సర్వీసు పొందుతున్నారు. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. వెరిఫికేషన్ పేరిట వికలత్వం శాతం తగ్గించింది. పింఛన్ల రద్దుకు కుట్ర పన్నింది. వంద నుంచి 80 శాతం వికలత్వం సర్టిపికెట్ ఉన్న వారికి నెలకు రూ.15 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు వికలత్వం 60 నుంచి 70 శాతానికి కుదించి రూ. 6 వేల పింఛన్ ఇవ్వడానికి కుట్ర చేశారు. గతంలో డాక్టర్లు శాశ్వత సర్థిఫికెట్లు జారీ చేశారు. అప్పుడు ఇచ్చిన డాక్టర్, ఇప్పుడు ఇచిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్కు తేడా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం. – మరియదాసు, దివ్యాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు -
‘ నాకు ప్రాణహాని ఉంది’
● వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిర్వాహకుడి సెల్ఫీ వీడియో వైరల్ బనగానపల్లె: తనకు ప్రాణహాని ఉందని పాతపాడు – యాగంటి క్షేత్ర రహదారిలో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం నిర్వాహకుడు వలిస్వామికి చెందిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వలిస్వామి గత 25 ఏళ్లుగా దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే గత రెండు నెలలుగా కొందరు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో బెదిరిస్తున్నారని వీడియోలో ఆరోపించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలం విలువ రూ. కోట్లు చేస్తుందని, ఎలాగైనా ఆలయాన్ని ఆక్రమించుకోవాలని కొందరు కుట్ర పన్నుతున్నట్లు ఆయన వాపోయారు. ఈ విషయాన్ని తాను కొందరి పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
చెరువు గండికి టీడీపీ నాయకులే కారణం
● వేగవంతంగా పనులు చేపట్టాలి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు: మద్దిగుండం చెరువుకు గండి పడటానికి టీడీపీ నాయకులే కారణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. మిడుతూరు మండల పరిధిలోని మద్దిగుండం చెరువుకు పడిన గండిని గురువారం బైరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు కట్టపై చెట్లను తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడిందన్నారు. ఇంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. సొంత జేసీబీలతో ఇష్టానుసారంగా పనులు చేయడంతో గండిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద చెట్లను తొలగించే సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. చెట్లు తొలగించడంతోనే చిన్న రంధ్రం పడి పెద్దగా గండి పడి చెరువులో నీరంతా పంట పొలాల్లోకి వెళ్లి పంట నష్టం జరిగిందన్నారు. చెరువు పని చేసిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న తప్పులు చేస్తేనే కేసులు పెడుతున్నారని, చెరువు పనులు ఎలా పడితే అలా చేసిన కాంట్రాక్టర్లపై ఇరిగేషన్ అధికారులు ఏమైనా కేసులు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. త్వరితగతిన అధికారులు చెరువుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. అవసరం లేని పనులు చేసి నాయకులు జేబులు నింపుకుంటున్నారే తప్ప నాణ్యతగా చేయలేదన్నారు. గండిపడి మూడు రోజుల అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్రెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివనాగిరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, గుండం హరిస్వరోత్తమరెడ్డి, రవికుమార్, స్వామిరెడ్డి, సాంబశివుడు, పుల్లయ్య, లింగారెడ్డి, రాముడు, రాము పాల్గొన్నారు. -
ఉప్పలపాడులో యువకుడి ఆత్మహత్య
ఓర్వకల్లు: ఉప్పలపాడు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కూతురు నందిని బేతంచెర్ల నుంచి వచ్చి ఉప్పలపాడులో నివాసముంటున్న తలారి సునీల్కుమార్ (21)తో ఏడాది క్రితం ప్రేమించి పెళ్లిచేసుకోంది. సునీల్ కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య నందిని కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సునీల్ భార్య వద్దకు వెళ్లగా మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగి శ్రీనివాసులు అల్లుడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సునీల్ గురువారం తన సొంతింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులకు కెనరా విద్యా జ్యోతి
కర్నూలు(అర్బన్): కెనరా విద్యా జ్యోతి పథకం పేరుతో ప్రతి ఏడాది 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ మేనేజర్ సుశాంత్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్లో విద్యాజ్యోతి పథకం కింద ఎంపికై న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల విద్యాభివృద్ది దేశ ప్రాధాన్యత అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెనరా బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి మాట్లాడుతూ.. కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా విద్యార్థినులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించడంతో పాటు అమ్మాయిల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. గతంలో పేద ప్రతిభావంతురాలైన ఎస్సీ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక లాప్టాప్ను కూడా కెనరా బ్యాంకు అందించిందన్నారు. కార్యక్రమంలో డివిజినల్ మేనేజర్ సురేష్కుమార్, బ్రాంచ్ మేనేజర్ శంకర్, చైతన్య శివరాజ్ పాల్గొన్నారు. -
నాల్గోసారి ఉత్తమ స్కూల్గా..
కర్నూలు సిటీ: నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూల్కు ఎంపికై ంది. విజయవాడలో శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ప్రధానోపాధ్యాయుడు కె.శివప్రసాద్ అందుకోనున్నారు. ఈ పాఠశాల 2018లో అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్గా ఎంపికై ంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో (2020లో) భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం పేరుతో స్కూల్ ఏర్పాటుకు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 60 సీట్ల చొప్పున అనుమతులు ఇస్తూ 2021 మార్చి 10న విద్యావాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ ఎం.ఎస్ నంబరు 20ని జారీ చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. తొలుత 2021–22లో , తర్వాత 2022–23లో, 2023–24లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2024–25 విద్యా సంవత్సరంలో 43 మంది పరీక్షలు రాస్తే 43 మంది పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. దీంతో వరుసగా నాల్గోసారి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ స్కూల్గా ఎంపికై ంది. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో భాగంగా ముందుగా విజిలెన్స్ సిబ్బంది రైతుల రూపంలో అన్ని దుకాణాలకు వెళ్లి ధరలను విచారించారు. ఇందులో నాలుగు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఆయా దుకాణాలపై వెంటనే విజిలెన్స్ సీఐ, ఆ శాఖ ఏఓ విశ్వనాథ్, స్థానిక ఏఓ అక్బర్ బాషా దాడులు చేసి ముందుగా లైసెన్స్, రికార్డులు, స్టాకు పరిశీలించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని గుర్తించి నాలుగు దుకాణాలలోని 390 బస్తాల రూ.3,74,407ల విలువైన ఎరువుల అమ్మకాల నిలిపివేస్తూ, నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఓ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 32 వేల నుంచి 22 వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా నీటి విడుదలను తగ్గించామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను కిందికి దించి 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని తెలుగుగంగ క్వాకు 8వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ నుంచి జీఎన్ఎస్ఎస్కి 9వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 5వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
చోరీకి పాల్పడిన కేర్ టేకర్ అరెస్ట్
● రూ. 6.90 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాఽధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని గాంధీనగర్లో ఓ వ్యక్తి ఇంట్లో కేర్ టేకర్గా ఉంటూ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 6.90 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. గాంధీనగర్కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తండ్రి ధనుంజయుడు రిటైర్డ్ ఉద్యోగి. కుమారస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ తండ్రికి కొంత దూరంగా నివాసముంటున్నాడు. తండ్రి బాగోగులు చూసుకోవటానికి హైదరాబాద్లోని ఓ సంస్థ నుంచి అనంతపురం టౌన్కు చెందిన నిమ్మగంటి చరణ్సాయి అనే వ్యక్తిని ఈ ఏడాది జూన్ నెలలో కేర్ టేకర్గా నియమించుకున్నాడు. అయితే ఇంట్లో నగలు భద్ర పరిచిన చోటును పసిగట్టిన చరణ్సాయి పనిలో చేరిన 15 రోజుల్లోనే ఇంటికి కన్నం వేశాడు. అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు పొరల బంగారు చైన్, రెండు ఉంగరాలు, జత కమ్మలతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎంఎన్ భార్గవి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు, హెచ్సీ మద్దిలేటి, క్రైం పార్టీ పోలీసులు ఉసేని, రఘునాథ్, సుధాకర్, గోపాల్ బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి చరణ్ సాయిని అనంతపురం టౌన్ తన ఇంటి సమీపంలోని అన్న క్యాంటీన్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను ఒక గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. దీంతో ఆ సంస్థకు నోటీసు జారీ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టౌన్ సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో కొత్తవారిని పనిలో తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విచారించాలన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఎస్ఐ–2 శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో చివరిరోజు సంబరాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం మండలంలోని అను మంత్రాలయం (తుంగభద్ర)లోని మఠంలో రాఘవేంద్రస్వామి రథోత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సమూర్తి ప్రహ్లాదరాయలకు చామర్ల సేవతో హారతులు పట్టారు. అనంతరం రథంపై కొలువుంచి గ్రామ పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆరాధన ఉత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఉత్సవమూర్తికి పంచ వాహనాలతో రథయాత్ర చేపట్టారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి. -
దేశభక్తి ప్రతిబింబించేలా..
జెండా పండుగకు పిల్లలూ.. పెద్దలూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సన్నద్ధమ వుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమ య్యారు. ఓ వైపు జెండా ప్రదర్శనలు, మరో వైపు మూడు రంగుల జెండాలు, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తదితర వస్తువుల అమ్మకాలతో కర్నూలు నగరంలో సందడి నెలకొంది. – సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలుదుకాణం వద్ద త్రివర్ణ రంగుల వస్తువుల అమ్మకాలుజాతీయ పతకాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యంకలెక్టరేట్ వద్ద మాంటిస్సోరి విద్యార్థుల ప్రదర్శన -
స్కూటీని ఢీకొన్న కారు
● దంపతులు, బాలుడికి తీవ్ర గాయాలు ఎమ్మిగనూరురూరల్: ఆదోని – కర్నూలు రహదారిలో బనవాసి జవహార్ నవోదయ విద్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడికి చెందిన గంగన్న, భార్య భాగ్యలక్ష్మీ కుమారుడు ఉపేంద్రలు ఉదయం స్కూటీపై దేవబెట్ట గ్రామానికి కొత్త బట్టలు పెట్టుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. బట్టలు పెట్టుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తున్నారు. కర్నూలుకు చెందిన దినేష్రెడ్డికి కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య ఆదోనిలో ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. ఆ స్కూల్లో సెలవు పెట్టి తిరిగి కర్నూలుకు బయలు దేరారు. బనవాసి నవోదయ దగ్గర ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న గంగన్న, భాగ్యలక్ష్మీ, బాలుడు ఉపేంద్రలు ఎగిరి పక్కనే కాలువలో పడిపోయారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్ణవశాత్తు విద్యుత్ స్తంబం విరిగి కింద పడకపోవటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో దంపతులతో పాటు కుమారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
వైద్యసేవలు విస్తృత పరచాలి
డోన్: కర్నూలు, నంద్యాల జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలకు అందుబాటులో ఉన్న డోన్ వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలను మరింత విస్తృతపరచాలని వైద్యులను నంద్యాల జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్) డాక్టర్ లలిత ఆదేశించారు. ఆసుపత్రిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి ఇక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సరైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హనీఫ్కు సూచించారు. జిల్లాలో మోస్తరు వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షం కురియగా చాగలమర్రి మండలంలో అత్యల్పంగా 2.2 మి.మీ వర్షం కురిసింది. ప్రజాస్వామ్యం ఖూనీ నంద్యాల: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా పాలిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో జరిగిన ఎన్నికల తీరు చూస్తే, ఆయన పాలన ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ఏజెంట్లను లేకుండా చేసి మోసపూరిత పద్ధతుల్లో గెలిచిందన్నారు. చివరికి పోలీసు అధికారులు సైతం కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి, వారి ఆదేశాలను పాటిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో రాక్షసత్వం, రౌడీయిజం చేసే టీడీపీని అధికారం నుంచి తొలగించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. వీబీఆర్లో 15 టీఎంసీల నీరు వెలుగోడు: బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(వీబీఆర్)కు కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. గురువారం సాయంత్రం సమయానికి వీబీఆర్లో 15.598 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శివనాయక్ తెలిపారు. వీబీఆర్ నుంచి దిగువకు 7365 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నంద్యాలలో నకిలీ టీటీడీ సిఫార్సు లెటర్లు నంద్యాల: టీటీడీ నకిలీ లెటర్లు తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వ్యక్తిని నంద్యాల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నంద్యాల వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల బైర్మల్ వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు తయారు చేశాడు. అంతేకాకుండా ఎంపీ సంతకాన్ని పోర్జరీ చేసి విక్రయించాడు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన జగదీష్ అనేవ్యక్తి వద్ద రూ.1,500 తీసుకొని ఎంపీ పేరుతో పోర్జరీ చేసిన లెటర్ప్యాడ్ను ఇచ్చి తిరుమల దర్శనానికి పంపారు. తిరుమలలో నకిలీ లెటర్ అని, దర్శనం లేదని చెప్పడంతో మోసం బయట పడింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన దినేష్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు. -
జెండా పండుగకు సర్వం సిద్ధం
నంద్యాల: స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ముస్తాబైంది. జెండా పండుగను తిలకించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలను తీర్చిదిద్దారు. విద్యార్థులు, మహిళలు, ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీగా హాజరు కానున్నారు. డీఆర్డీఏ, డ్వామా, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి శకటాలను ప్రదర్శనలకు సిద్ధం చేశారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. -
నీటి సంరక్షణ పనులు చేపట్టాలి
నంద్యాల: జిల్లాలో నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులకు సూచించారు. గురువారం విజయవాడ సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు భూగర్భజలాల సంరక్షణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జేసీ విష్ణు చరణ్, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో కురిసిన వర్షపు నీరు అక్కడే ఇంకిపోయేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. నీటి సంఘాల సభ్యులు నీటి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: నగరంలోని కృష్ణానగర్లో నివాసముంటున్న ఇ.విశ్వనాథ్ గౌడ్ (35) అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ్ గౌడ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్నూలుకు చేరుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 11వ తేదీన దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. 12వ తేదీ తన భర్త కనిపించడం లేదని భార్య నాగమణి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని నీళ్లలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి జేబులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ గట్టుపై విశ్వనాథ్ గౌడ్ ద్విచక్ర వాహనం లభించింది. దీంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్వాడీ కేంద్రాలు: 43 0–6 నెలల శిశువులు: 16,785 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు: 66,824 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులు: 42,104 గర్భిణులు: 17,246బాలింతలు: 18,112
● నత్తనడకన నెట్వర్క్ ● పనిచేయని యాప్లు ● పెరిగిన పని ఒత్తిడి ● సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఆళ్లగడ్డ: పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు తదితర వాటిని అప్లోడ్ చేసేందుకు ఇచ్చిన వివిధ రకాల యాప్లతో అంగన్వాడీ కార్యకర్తలు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో బోధన పక్కదారి పడుతోంది. ‘పనిచేయలేమని ఫోన్లు మాకొద్దు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఫోన్లు, సిమ్లు వెనక్కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ్ ట్రాకర్, రాష్ట్ర యాప్ బాల సంజీవని, కిశోర వికాస్, మిషన్ వాత్సల్య, సఖి వంటి యాప్ల్లో నిత్యం డేటా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పీఎంఎంవీవై యాప్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా కేంద్రాలకు పాలు సరఫరా చేసెందుకు ఏర్పాటు చేసిన మిల్క్ యాప్తో పాటు ప్రతి మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కోసం ఉన్న యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయాలి. ఇంతవరకు ఏఎన్ఎంలు చేసే మాతృవందన పథకానికి సంబంధించిన యాప్ త్వరలో అంగన్వాడీలకు అప్పగించనున్నారు. నెలకు 5 జీబీ డేటా! ఇప్పటికే రాష్ట్ర ప్రభత్వం ఇచ్చిన బాల సంజీవని యాప్తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పోషణ ట్రాకర్ యాప్ లో కూడా నిత్యం అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆన్లైన్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం నెలకు 5 జీబీ డేటాను మాత్రమే ఇస్తోంది. అది అయిపోతే సొంతంగా రీచార్జ్ చేసుకుందామన్నా వీలుండదు. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు ఎందుకు చేయలేదని ఉన్నతాధికారులు వేధింపులు.. సూటిపోటి మాటలతో మానసికంగా కుంగిపోతున్నారు. బాలింతలకు పోషకాహారం ఇచ్చేందుకు ఆధార్ను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అనేక మంది బాలింతల ఫొటో ఆధార్ కార్డులో 12 నుంచి 15 సంవత్సరాల వయసులోది మాత్రమే ఉంటుంది. ఆ ఫొటోలోని ముఖ కవలికలను గుర్తు పట్టేందుకు యాప్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కో సారి ఫోన్లో డాటా చాలక ఆ ప్రక్రియ మధ్యలోనే నిలచిపోతోంది. ‘రికార్డు’ స్థాయిలో అవస్థలు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు 15 రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం, పిల్లలు, బాలింతలు, గర్భిణులు నమోదు, ఫ్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతిరోజు విధిగా నమోదు చేయాలి. మరో వైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్ – ఏ రికార్డులు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శన రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర రికార్డులు నమోదు చేయడంతో సమయం అంతా గడిచి పోతోంది. ఆటంకాలు ఇవీ.. ● గతంలో అంగన్వాడీ కేంద్రాల దగ్గరే పోషకాహారం ఇచ్చేవారు. దీనిని టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్)గా మార్చారు. పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు సార్లు ఇంటి దగ్గరే అందిస్తున్నారు. రెండు సార్లు పోషక్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదుకే ఎక్కువ సమయం పడుతోంది. ● బాల సంజీవనిలోని ఆరు రకాల వస్తువులు కలిపి ఒక కిట్గా లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అవి ఇచ్చే సమయంలో ఫొటో పోషణ ట్రాకర్లో అన్లోడ్ అవుతుంది. అయితే జిల్లాలోని కాంట్రాక్టర్లు అంతా టీడీపీ నేతలే కావడంతో వారు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ఇవీ కష్టాలు.. కొత్త యాప్లను అప్లోడ్ చేసేందుకు 2జి ఫోన్లు పనిచేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న తల్లులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇళ్ల వద్దకే పోషకాహారాన్ని అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత గుర్తింపు) ప్రవేశ పెట్టింది. సెల్ఫోన్లు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా మారింది. బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో నమోదు తర్వాతే సరుకులు అందించాలి. అయితే సెల్ఫోన్లు ఐదేళ్ల క్రితం 2జీ నెట్వర్క్ తో ఇచ్చినవి కావడంతో ఆయా యాప్లు తరుచూ మొరాయిస్తున్నాయి. పోషణ్ ట్రాకర్ యాప్లో ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ తప్పనిసరి. నెట్వర్క్ సరిగా లేకపోయినా, లబ్ధిదారుల మొబైల్స్లకు మెసేజ్ బ్యాలెన్స్ లేక ఓటీపీ రాకపోయినా సరుకులు అందడం లేదు. కొత్త 5జీ ఫోన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ స్పందన లేదు. ఒత్తిడికి గురవుతున్నాం 2 జీబీ ర్యామ్తో ఉన్న 2జీ నెట్వర్క్ సిమ్తో ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన సెల్ఫోన్లతో ఇప్పుడు ఇచ్చిన కొత్త యాప్లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. యాప్ల భారమైనా తగ్గించండి. లేదంటే 5జీ సెల్ఫోన్లు కాని, ట్యాబ్లు కానీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – ఉదయలక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు, దొర్నిపాడు యాప్లు మొరాయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్లు తరుచూ మొరాయిస్తున్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో తంటాలు పడుతున్నాం. ఉన్న యాప్లతోనే ఇబ్బందులు పడుతుంటే మల్లీ ఏఎన్ఎంలు చేసే పీఎంఎంవీవై పని కూడా అప్పగించడం దారుణం. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు పాత ఫోన్లను సీడీపీఓ కార్యాలయంలో అప్పగించాం. – వసుంధర, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు -
ఉపాధిలో అక్రమాలకు ‘ఫొటో’ చెక్!
నంద్యాల(అర్బన్): మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమ హాజరు నమోదుకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉపాధి సిబ్బంది, టీడీపీ నాయకులు కలసికట్టుగా అవినీతి చేయలేరు. కూలీల హాజరు నమోదుపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ను తీసుకురావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. జాబ్కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫొటోలను ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో సదరు ఉపాధి వేతనదారు పనికి వచ్చిన అనంతరం అతని ఫొటో(ఐరిస్) తీస్తారు. ఒకవేళ యాప్లో నమోదు చేసిన వ్యక్తి ఫొటోకు మ్యాచ్ అవ్వకుంటే నగదు చెల్లింపులు చేసేందుకు వీలుండదు. ఈ యాప్ను ఇటీవల క్షేత్రస్థాయిలో ప్రవేశ పెట్టింది. దీంతో మండల స్థాయిలో ఉండే ఉపాధి అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఉపాధి ఏపీవోలు పని జరిగే ప్రాంతాల్లో కూలీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకరు తరఫున మరొకరు హాజరైతే! జిల్లాలో 2,65,737 జాబ్ కార్డులు ఉండగా 5,00,513 మంది కూలీలుగా నమోదయ్యారు. యాక్టివ్ కార్డులు 2,15,195 ఉండగా 3,82,050 మంది పనులకు హాజరయ్యేవారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లును తొలగించి తమ వారిని నియమించుకుంది. ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా కూలీల ఫొటోలను సెల్ఫోన్లలో తీసుకుని జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థకు (ఎన్ఎంఎంఎస్)కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసే కూలీల ఫొటోలను తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒకరు తరఫున మరొకరు హాజరైనట్లు చూపితే ఆన్లైన్లో హాజరు తీసుకోదు. దీంతో అటు ఉపాధి సిబ్బందికి, ఇటు కూటమి నాయకుల జేబులు నింపుకునే విధానానికి పెద్ద గండి పడినట్లు అవుతుంది. పకడ్బందీగా పర్యవేక్షణ ఎన్ఎంఎంఎస్ యాప్లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వెరిఫై చేసి రిపోర్టును ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్కు సంబంధం లేని ఫొటోను అప్లోడ్ చేశారా.. పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాతది పెట్టారా... ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా అన్న వివరాలు గమనించాలి. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ కార్యాలయంలోని ఏపీఓ, కాంట్రాక్ట్ స్టాఫ్, పర్మినెంట్ స్టాఫ్ అదే రోజు పరిశీలించి నివేదికను కలెక్టర్, డీఆర్డీఓలకు పంపించాలి. ఫొటో ఉంటేనే హాజరు కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటేనే హాజరుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోతే కూలీలకు వేతనం రాదు. ఈజీఎస్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకే గత నెలలో నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. – సూర్యనారాయణ, జిల్లా డ్వామా పీడీ, నంద్యాల ఇకపై రెండు ఫొటోలు దిగితేనే వేతనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కూలీ మంజూరు జిల్లాలో 2.05 లక్షల జాబ్ కార్డులు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 4 గంటల తర్వాతే ఫొటో అప్లోడ్ పని ప్రదేశంలో మొదటి ఫొటోను ఉదయం 6 గంటలకు తీసి అప్లోడ్ చేస్తే, అనంతరం 4 గంటల తర్వాత అనగా ఉదయం 10 గంటలకు ఫోన్లో మరోసారి ఫొటో అప్లోడ్ చేయాలని సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత ఫొటో అప్లోడ్ చేయకపోతే ఆరోజు కూలీలకు నగదు చెల్లింపులు ఉండవు. మూడు నెలలుగా వేతనదా రులకు నగదు చెల్లింపులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నగదును విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించింది. అయితే త్వరలో కొత్త విధానం ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో తమకు రావాల్సిన మూడు నెలలు వేతనాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి
గోస్పాడు: విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, సర్వజన ప్రభుత్వాసుపత్రి డాక్టర్ మల్లేశ్వరి అన్నారు. బుధవారం యాంటీ ర్యాగింగ్ డే సందర్భంగా మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిస్థాయిలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వైస్ప్రిన్సిపాల్, డాక్టర్లు రాజశేఖర్, కళావతి, హెచ్ఓడీలు లోకేశ్వరరెడ్డి, పద్మజ, డాక్టర్ నిరంజన్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత ఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని ఎనిమిది చెరువులకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ మురళీకృష్ణ, ప్రాజెక్టు చైర్మన్ పూజా మల్లికార్జునరెడ్డి తెలిపారు. వడ్లరామాపురం, కురుకుంద గ్రామాల్లో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున పాఠశాల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎవరూ వాగులు వెంట వెళ్లొద్దని సూచించారు. దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు నంద్యాల(న్యూటౌన్): ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలో పేద పిల్లలకు అందించాల్సిన 25శాతం మిగిలిన సీట్ల కోసం ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, సమగ్ర శిక్ష అనదపు అధికారి జగన్మోహన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు సచివాలయంలో, www.csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేస్తామన్నారు. పాఠశాలలో ప్రవేశాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ 18004258599 నంబరును సంప్రదించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన నంద్యాల: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను బుధవారం అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. అధికారులకు, వీఐపీలకు గ్యాలరీల ఏర్పాటు చేయాలని, వేడకులకు హాజరయ్యే అందరికీ మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు నంద్యాల(అర్బన్): ఎరువుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పట్టణంలోని అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్, సుదర్శన్ ట్రేడర్స్లలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టార్లు, బిల్ బుక్స్, నిల్వలు, ఈ పాస్ మిషన్లో స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. హోల్సేల్, రిటైల్ డీలర్లు నిర్ణయించిన ధరలతోనే రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించాలన్నారు. డీఏఓ వెంట ఏడీఏ ఆంజనేయ, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఉన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
నంద్యాల: ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాణ్యం మండలం కౌలూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాల మధ్య మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గడివేముల మండలం కొర్రపోలూరుకు చెందిన రామసుబ్బయ్య కుమారుడు సూర్య (23) డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కెళ్లాడు. ఇటీవలే అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు పని ఉందంటూ రెండు రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కౌలూరు సమీపంలో రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతుడు ఓ యువతిని ప్రేమించాడని..అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలో యువకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి అక్కడ పారవేశా రా లేక ప్రేమ విఫలమై యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమ కుమారుడిది హత్యేననివిచారించి న్యాయం చేయాలని సూర్యతల్లిదండ్రులు కోరుతున్నారు. -
కుందూలో పడి..
బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడ లు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమా దాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రూ. 5లక్షల నగదు అపహరణఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన బాధితుడు గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలున్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. చోరీ విషయాన్ని బాధితుడు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
శోభాయమానం.. ఆరాధనోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో 6వ రోజు బుధవారం ఉత్సవాలు రమణీయంగా సాగాయి. వేకువ జామున 5.30కు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ, శ్రీరాఘవేంద్రస్వామి మఠం 13వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధనలు కనుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అశ్వ వాహనంపై విశ్వ మోహనుడు బుధవారం రాత్రి 10 గంటలకు ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కడు వైభవంగా ఊరే గారు. మంగళ వాయిద్యాలు, దాస సాహిత్య మండలి మహిళల భజనలు, అశేష భక్త జనం హర్ష ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో విహరించారు. అనంతరం చెక్క, వెండి, అంబారి, స్వర్ణ రథాలపై ఉత్సవమూర్తికి రథయాత్రలు నిర్వహించారు. ఈ వేడు కలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వా మి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ కుమా ర్రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆరాధన సప్తరాత్రోత్సవాలు సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెంది న విదూషి సంగీత కులకర్ణి దాసవాణి, సుధా స్కూలు బృందం హరిదర్శన నృత్య రూపకం భక్తులను మంత్రముగ్దులు చేసింది. నేడు సర్వ సమర్పణోత్సవం ఉత్సవాల ఆఖరిరోజు అయిన గురువారం సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఏక కాలంలో పంచ వాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉద యం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. అశ్వ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
రూ.82.79 కోట్ల ఉచిత పంటల బీమా విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం కింద ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే మరోసారి రూ.82.79 కోట్ల ప్రయోజనం కలిగింది. 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉచిత పంటల బీమా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం గత రెండు రోజులుగా విడుదలవుతోంది. ఈ పరిహారం కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే. కేంద్రం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపజేయడంతో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమాను మరచిపోయిన రైతుల బ్యాంకు ఖాతాలకు బీమా పరిహారం విడుదలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా పరిహారం విడుదల చేయడంలో చేతులెత్తేసింది. దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకం కేంద్రం వాటా బీమా నిధులు విడుదల చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం -
మళ్లీ మొదటికొచ్చిన వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బదిలీల్లో అన్యాయంపై సుమారు 40 మంది వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మూడు వారాల క్రితం ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు జిల్లాల నుంచి కోర్టును ఆశ్రయించగా.. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో బదిలీల కౌన్సెలింగ్ తిరిగి చేపట్టాలని ఈనెల 11న ఆదేశించడం గమనార్హం. చేతులు మారిన రూ.16లక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 474 మంది వీఏఏలు ఉండగా 447 మందిని బదిలీ చేశారు. రేషనలైజేషన్ వల్ల ఉమ్మడి జిల్లాలో 188 రైతుభరోసా కేంద్రాలు మూత పడ్డాయి. ప్రధానంగా నంద్యాల జిల్లాలో 117 ఆర్బీకేలు మూతపడ్డాయి. ఈ కారణంగా చాలామంది వీఏఏలు కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే బదిలీల్లో ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16లక్షలు చేతులు మారినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీఓ(23, 5)లను ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్న ఉద్యోగులనూ దోచుకున్నారు గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల్లో రాజకీయ సిఫారసులకే పెద్దపీట వేశారని తెలుస్తోంది. కూటమి పార్టీల నేతలు చిన్న ఉద్యోగులను కూడా వదలకుండా అందిన కాడికి వసూలు చేసుకొని సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు ప్రకారం వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏకంగా 115 మంది వీఏఏలు ప్రజాప్రతినిధుల సిఫారుసుతో కోరుకున్న చోటుకు బదిలీ అయినట్లు హైకోర్టు గుర్తించింది. సిఫారసులు లేకుండానే కొరుకున్న చోటుకు బదిలీ చేసినందుకు కొందరు అధికారులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ ఏఓల్లో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 115 మందికి ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు రూ.16లక్షల వరకు వసూలు చేసిన కూటమి నేతలు ప్రత్యేక కౌంటర్ తెరిచిన కొందరు అధికారులు నిబంధనలకు లోబడి బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం అభాసుపాలైన వ్యవసాయ శాఖ ముడుపులు ఇచ్చుకొని కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకున్నాం.. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటని వీఏఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు పోయి, తిరిగి పోస్టింగ్ ఆ ప్రాంతానికే వస్తుందో రాదోననే కొందరు వీఏఏలు సతమతం అవుతున్నారు. ఇటీవల చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీలతో వ్యవసాయ శాఖ అభాసుపాలైంది. గ్రామస్థాయిలోని వీఏఏల బదిలీల్లో సైతం ముడుపుల వ్యవహారం ఈ శాఖ పరువును బజారున పడేసింది. -
ఎడతెరపి లేకుండా వర్షాలు
కొత్తపల్లి మండలం బండినాయునిపాలెంలో నీట మునిగిన వరిపైరునంద్యాల(అర్బన్): జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 163.8మి.మీ వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 20.4మి.మీ వర్షం కురియగా డోన్ మండలంలో అత్యల్పంగా 0.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా మిడుతూరు మండలంలో 16.4, రుద్రవరంలో 15.2, ఆత్మకూరులో 12.8, పగిడ్యాలలో 12.4, పాములపాడులో 11.4, జూపాడుబంగ్లా, నంద్యాల అర్బన్లో 10.2 మి.మీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో రైతులు సాగు చేసిన వరిపైరు నీట మునగింది. కురుస్తున్న వర్షాలతో పూత దశలో ఉన్న మినుము నేలకొరిగి పూత, పిందె రాలిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుందూ నది ఉప్పొంగి ప్రవహిస్తోందని, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
మట్టి విగ్రహాలు ఎంతో మేలు
నంద్యాల: జిల్లాలోని ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 27వ తేదీ జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. రసాయనాలతో చేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంతో పర్యావరణానికి పెను నష్టం వాటితోందన్నారు. ప్రజలు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. 25న వినాయక విగ్రహాల పంపిణీ... వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ నంద్యాల కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్రెడ్డి, ఏఈఈ రామకృష్ణ, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
మన పండు బ్రహ్మాండం!
డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా లభిస్తున్న పండు. ఇదివరలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇప్పుడు మనపక్క జిల్లా అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో విరివిగా సాగవుతోంది. అయితే ఇంతకు వెయ్యి రెట్లు బీ12, ఏ, సీ విటమిన్లు లభించే మొక్క మన దేశంలోనే ఉన్న బ్రహ్మజెముడు(పాపిచ్చి కాయ)ను విస్మరిస్తున్నాం. చైనాకు, మన పండుకు ఉన్నా తేడా ఒక్క ముళ్లు మాత్రమే. కేవలం ఈ ఒక్క కారణంతో ముళ్లు తీసుకునే సమయం లేక చైనా పండ్లను ప్రోత్సహిస్తున్నాం. పైగా ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఎవరూ పెంచకుండానే మొండిగా బతికేస్తుంది. అయితే చైనా పండు(డ్రాగన్ ఫ్రూట్)ను మాత్రం కేజీ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే ఫ్రీగా లభిస్తున్న, డ్రాగన్ ఫ్రూట్ను మించి పోషకాలను అందిస్తున్న మన బ్రహ్మజెముడును పట్టించుకోకపోవడం గమనార్హం. కార్పొరేట్, కాంక్రీట్ జంగిల్స్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు వీటి గురించి అవగాహన లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పాపాసికాయలు తెలియనివి కావు. పండును బండరాయికేసి రుద్దితే ముళ్లు విరిగిపోతాయి, ఆ తర్వాత తోలు తీసి గుజ్జును తినేయడమే. చివరగా వచ్చే విత్తనాలను మాత్రం పడేయటం విస్మరించొద్దు. ఈ పండ్లు తిన్నామంటే ఎట్టే గర్తుపట్టేయొచ్చు. చేతులు, నాలుక కొద్ది సమయం వరకు ఎరుపు, గులాబి రంగులోకి మారిపోవడం చూస్తే పాపాసికాయలు తిన్నావా అని అడగాల్సిందే. ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజెముడు పండ్లతో కాలేయ, క్యాన్సర్ వ్యాధులను సైతం నయం చేస్తోంది. అంతేకాదు.. స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉండటం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
శుభకార్యానికి వచ్చి.. అనంతలోకాలకు
ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు. -
మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి
కర్నూలు: మద్యం బార్ల పాలసీ నెలాఖరుకు ముగుస్తున్నందున కొత్త పాలసీ గురించి వ్యాపారులకు వివరించి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఎకై ్సజ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీ కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఇందుకు సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉన్న దుకాణాల నుంచి రూ.5 లక్షలు, రూ.65 లక్షలకు పైగా లైసెన్స్ ఫీజు ఉన్న దుకాణాల నుంచి ఏడాదికి రూ.7.50 లక్షలు పర్మిట్ రూమ్లకు రుసుం వసూలు చేయాలన్నారు. అలాగే నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై చర్చించారు. కర్నూలును సారా రహిత జిల్లాగా నెలాఖరుకు ప్రకటించాల్సి ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లా అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, జాన్ సైదులు మంజుల, రమేష్ రెడ్డి, లలితా దేవి, స్వర్ణలత, రామాంజినేయులు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వరలక్ష్మి, సతీష్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎకై ్సజ్ నేర సమీక్ష సమావేశంలో నోడల్ డిప్యూటీ కమిషనర్ -
యువకుని అవయవ దానం
● ముగ్గురికి కొత్త జీవితం కర్నూలు (హాస్పిటల్): ఒక యువకుడు చేసిన అవయవ దానం ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన టి.శివరామ సుబ్బయ్య (39)కు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఈనెల 10న స్నేహితులతో కలసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడ జారిపడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అతను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపారు. అదే రోజు ఓమ్నీ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు మెడికవర్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. కానీ అతనిని బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని జీవన్దాన్ ట్రస్టు వారు అవయవ దానం గురించి శివరామ సుబ్బయ్య కుటుంబానికి చెప్పగా వారు అంగీకరించారు. కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సాయిసుధీర్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ సమద్, డాక్టర్ సిద్ధార్థ హెరూర్, డాక్టర్ బి.ప్రవీణ్, డాక్టర్ శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్కు, మరో కిడ్నీని మెడి కవర్ హాస్పిటల్లోనే ఒక రోగికి, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల వత్తాసు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆలూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న గూండాగిరీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం ఎన్నాళ్లు ఉండదని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, పార్టీ ఆలూరు మండలం అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు. రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి నంద్యాల: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని గుడిమెట్ట వద్ద మద్దయ్య(42) అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ఈనెల 11న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంగళవారం రాత్రి రైలులో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుడిమెట్ట వద్ద రైలు నుంచి జారి కింద పడి మృతి చెందినట్లు బుధవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి కోరారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ కబర్థి సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్లో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, ఎస్సీ, ఎస్టీ, పౌర హక్కుల రక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల రక్షణ, అమలు పథకం 2015, ఆదివాసీలు, సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.శాంతికళ, ఆర్ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, డీసీపీఓ శారద, జిల్లా సాంఘీక సంక్షేమం, సాధికారత అధికారిణి బీ రాధిక, నంద్యాల ఏటీడబ్ల్యూఓ హుసేనయ్య, నంద్యాల జిల్లా సీఐ పీ గౌతమి, రెండు జిల్లాలకు చెందిన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి -
కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’
● వైఎస్సార్సీపీ నాయకుడు భూమా కిషోర్రెడ్డి కాంపౌండ్ వాల్ కూల్చివేత ఆళ్లగడ్డ: నంద్యాల నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కూల్చివేతలకు తెర తీశారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రాం కక్ష సాధింపునకు అధికారులు బేషరతుగా జీ హుజూర్ అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా భార్గవ్ డైరెక్షన్లో అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి తన స్థలానికి ఎప్పుడో నిర్మించుకున్న ప్రహరీ కూల్చివేతకు అధికారులు యత్నించడం మంగళవారం పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డికి సర్వే నెం.574/2 లో 3.50 ఎకరాల పొలం ఉంది. ఈ స్థలం కబ్జాకు గురికాకుండా సుమారు 4 సంవత్సరాల క్రితం చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే ఆమె భర్త భార్గవరాం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ ప్రహరీ కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గిన కమిషనర్ గోడ కూల్చేందుకు జేసీబీ తీసుకునిపోయి కూల్చివేత మొదలు పెట్టారు. అంతలో భూమా కిషోర్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకుని కమిషనర్ కిషోర్తో వాగ్వాదానికి దిగి కూల్చివేతను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మాణానికి అనుమతులు లేవంట.. గోడ కూల్చేందుకు వచ్చిన కమిషనర్ను ఎందుకు కూల్చుతున్నారని అడగ్గా ముందుగా గోడ నిర్మాణానికి అనుమతులు లేవని, అనంతరం గోడ అంత ఎత్తు కట్టుకోకూడదని.. మరోసారి పక్కన అనుమతులు లేకుండా ప్లాట్లు వేశారని ఇలా పొంతన లేని మాటలు చెప్పడం అక్కడున్న వారికి వింతగా అనిపించింది. అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించారంటే ఇదే సర్వే నంబర్లో పదుల సంఖ్యలో ప్రహరీలు నిర్మించారు. ఎత్తుగా ఉందంటే దీని పక్కనే ఎమ్మెల్యే నిర్మాణం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంది, మరి వీటన్నింటిజోలికి పోకుండా ఇక్కడకే రావడం ఏంటని ప్రశ్నించారు. కక్ష సాఽధింపు కాకుంటే పక్కనున్న వాటిపై కూడా కమిషనర్ చర్యలు తీసుకోవాలి కదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాంపౌండ్ వాల్ కూల్చివేస్తున్న దృశ్యం ప్రజలే బుద్ధి చెబుతారు ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆస్తులను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ చేస్తున్న దౌర్జన్య కాండకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇదే సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాలు అధికారులకు కనిపించవా? వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు అధికారపార్టీ నేతలు ఎలా చెబితే అలా తలాడించడం విచారకరం. – భూమా కిషోర్రెడ్డి -
మొక్కజొన్న.. మురిపించేనా..!
కోవెలకుంట్ల: గతేడాది నష్టాలు మూటగట్టుకున్న మొక్కజొన్న రైతులు దేవుడిపై భారం వేసి ఈ ఏడాది మళ్లీ అదే పంట సాగు చేస్తున్నారు. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగు కావడం గమనార్హం. ఇటీవల ఎస్సార్బీసీ, కేసీకెనాల్, తెలుగుగంగ కాల్వల్లో నీరు పుష్కలంగా చేరడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో అత్యధికంగా 6,745 హెక్టార్లలో, కొత్తపల్లె 5,793, పాణ్యం 5,279, నందికొట్కూరు 4,607, ఆళ్లగడ్డ 4,288, ఆత్మకూరు 4,033, బనగానపల్లె 3,964, మిడుతూరు 3,635 హెక్టార్లలో రుద్రవరం 3,225, పగిడ్యాల మండలంలో 2,406 హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. గత ఏడాది జిల్లాలోని 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం కాగా ఆయా డలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభా పంట చేతికందే తరుణంలో తుపాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు.కత్తెర పురుగు భయంజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. ముందుగా సాగు చేసిన మొక్కజొన్నను కత్తెర పురుగు వెంటాడే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరును కత్తెర పురుగు ఆశిస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సుంకుదశలో ఉన్న మొక్కజొన్న పైరు ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న కంకి కట్టే దశలో భారీ వర్షాలు కురిస్తే నష్టం చేకూరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో కోటి ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయా, ప్రకృతి వైపరీత్యాలు మరోసారి దెబ్బతీస్తాయన్న ఆందోళన నెలకొంది.మిరపకు ప్రత్యామ్నాయంగా.. రెండేళ్ల నుంచి మిర్చి సాగు రైతుల కళ్లలో కారం కొడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మిర్చి ఎర్ర బంగారం కాగా గత ఏడాది నుంచి భారంగా మారింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా ఎండు మిరపకాయలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు ధర పలికాయి. గతేడాది నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది నవంబర్ నెలలో క్వింటా రూ. 15 వేల నుంచి రూ. 16 వేలు పలుకగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ధర రూ. 10 వేలకు పడిపోయింది. మిరప సాగుకు ఎకరాకు రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మిర్చికి తెగుళ్లు ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా గిట్టుబాటు ధర లేకపోవడంతో గతేడాది ఎకరాకు రూ. 50 వేల నష్టం వాటిల్లింది. దీంతో ఈ ఏడాది మిరప సాగు చేయాలంటే నే రైతు లు భయపడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 5–6 వేల హెక్టార్లకు మించి మిరప సాగయ్యే సూచనలు లేవని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది మిరపసాగు తో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది అంతమొత్తం పెట్టుబడి పెట్టి సాగు చేసేందుకు సాహ సం చేయడం లేదు. మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న విస్తారంగా సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, మూడు నుంచి నాలుగు సాగునీటి తడులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పెట్టుబడులు వెచ్చించాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.ఐదు ఎకరాల్లో సాగు చేశాఈ ఏడాది ఐదు ఎకరాల సొంత పొలంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 12 వేలు వచ్చింది. గత ఏడాది రెండు ఎకరాలు సాగు చేయగా ఏడాది అదనంగా మరో మూడు ఎకరాల్లో వేశాను. నాలుగు నెలల పంటకాల కాగా ఇప్పటి వరకు పైరు ఆశాజనకంగా ఉంది. – రాంభూపాల్రెడ్డి, రైతు, కోవెలకుంట్లఈ ఏడాది దిగుబడులపై ఆశలుగత ఏడాది మొక్కజొన్న సాగు చేసి నష్టాలు చవి చూశాను. ఈ ఏ డాది ఎకరా రూ. 15 వేలు మేరకు మూడు ఎకరాలు కౌలుకు తీసుకు ని రెండు నెలల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టు బడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 10 వేలకు పైగా పెట్టాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాగు కలిసొస్తుందని భావిస్తున్నాను. – కృష్ణారెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం