breaking news
Nandyal District Latest News
-
ఈ జాగ్రత్తలు అవసరం..
● అధిక ఉష్ణోగ్రతల(హీట్వేవ్)తో డీహైడ్రేషన్(శరీరంలో నీటి కొరత) ఏర్పడే ప్రమాదం ఉంది. ● తలనొప్పి, వాంతులు, బీపీ సమస్యలు పెరుగుతాయి. ● ఎండల్లో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తిరగరాదు. ● మధ్యాహ్నం 12 నుంచి సాయం6తం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది. ● ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. ● రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. ● కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి. ● వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది. ● ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు గొడుగు తీసుకెళ్లాలి. కనీసం తలను టోపీ, టువాలతో కప్పుకోవాలి. -
పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 71 అర్జీలు ఇంకా ఓపెన్ చేయలేదన్నారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అందజేసే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. రీ–ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్లో 130 అర్జీల స్వీకరణ... భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ను సద్వినియోగం చేసుకోవా లన్నారు. సోమవారం రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 130 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 22, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22–ఎ భూములకు సంబంధించినవి 19, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 18, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి 26 ఉన్నాయన్నారు. -
బ్రహ్మాండ నాయకా.. భక్తజన పాలకా!
భక్తజనం మధ్య రథోత్సవం● రమణీయం ఉగ్రనరసింహుడి రథోత్సవం ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాల మధ్య శ్రీ జ్వాలా నృసింహస్వామి రథో త్సవం ఎగువ అహోబిలంలో నేత్ర పర్వంగా కొనసాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన సోమవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలా నృసింహస్వామి రథోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. నిత్యపూజల్లో భాగంగా ఉత్సవమూర్తులైన జ్వాలా నృసింహ స్వామి, అమ్మవార్లకు వేదపండితుల ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకించి, నవకలశ తిరుమంజనం నిర్వహించిన అనంతరం స్వామి, ఉభయదేవేరులను పట్టుపీతాంబరాలతో అలంకరించి ఆది దంపతులుగా ముస్తాబు చేశారు. ముస్తాబైన ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కొలువుంచి దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ పుష్పాలతో నేత్రానందపర్వంగా ముస్తాబు చేసిన రథంపై అహోబిలేశుడు దేవదేవేరులతో అధిష్టించారు. వేదపండితులు రథాంగ పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలు సమర్పించి హారతిచ్చి మేష లగ్నంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. ఉభయ దేవేరులతో రథంలో కొలువైన శ్రీజ్వాలా నృసింహస్వామి -
రెంటచింతల కంటే ఎక్కువ!
కర్నూలు(అగ్రికల్చర్): అధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఇప్పటికే వేసవి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడం లేదు. ఈ సారి కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలకు ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా మారింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. చల్లదనం కనుమరుగు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమ శాతం తగ్గే కొద్ది వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో గాలిలో ఉదయం తేమ 90 శాతం వరకు, మధ్యాహ్నం సమయంలో 50 నుంచి 60 శాతం వరకు ఉంది. మార్చి మొదటి వారంలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు, మధ్యాహ్న సమయంలో 15–20 శాతానికి పడిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాల్పులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి గాలిలో తేమ పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వేసవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఏర్పడింది. కనిపించని పచ్చదనం జిల్లా మొత్తం విస్తీర్ణంలో అడవులు 33 శాతం వరకు ఉండాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటంతో భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేకపోవడంతో ఎండల తీవ్రతకు నేలకు పగుళ్లు ఏర్పడి వాటి నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అప్పుడే వడగాడ్పులు వాహనాల సంఖ్య పెరగడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్ డైఅక్సైడ్ గాలిలో చేరుతుండటంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాడ్పులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటోంది. ఉపశమనం లేనట్లే! వేసవి తీవ్రత పెరుగుతున్నా ఉపశమన చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాది వేసవి ఉపశమన చర్యలు కనిపించలేదు. ఈ సారి కూడా అధిక ఉష్ణోగ్రతలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సారి ప్రధానంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో 45–46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు ఎండకుండా నీటితడులు ఇచ్చుకోవాలి. మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురి కాకుండా అన్ని వర్గాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – నారాయణ స్వామి, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ విభాగం, అనంతపురంఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2025లో 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇవే దేశంలోనే ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదు అవుతాయి. రెంటచింతల కంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలుష్యం బెడద ఎక్కువగా ఉంది. కాలుష్యం పెరిగే కొద్ది ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపాధి కూలీలకు ఎండదెబ్బ ఉపాధి పనులకు జనవరి నుంచి మే నెల వరకు సీజన్ వంటిది. ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఉపాధి పనులు జరిగే ప్రాంతంలో నీడ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాది ఉపాధి కూలీల గురించి పట్టించుకోక పోవడంతో వడదెబ్బకు గురై దాదాపు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది మృతి చెందారు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. -
సమన్వయంతో విధులు నిర్వర్తించండి
● శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాలపై శ్రీశైల దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పించబడుతుందన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సహకారంతో పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, క్షేత్రంలో భక్తులు సేద తీరే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలన్నారు. కాలిబాట మార్గంలో, క్షేత్రంలో అన్నదానం చేసే దాతలకు దేవస్థానం తరఫున పూర్తి సహా య సహకారాలను అందిస్తామన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందజేస్తామన్నారు. క్యూలైన్లలో అవసరమైన చోట కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర పరిధిలో భక్తులు సేద తీరేందుకు షామియానాలు, పైప్ పెండ్యాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండ పం, అంకాళమ్మగుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి నంద్యాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో మహిళలు పాలుపంచుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, ఐసీడీఎస్ పిడి లీలావతి దేవి తదితరులు పాల్గొన్నారు. సారా రహిత జిల్లాగా మార్చాలి నంద్యాల: సారా రహిత జిల్లాకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎస్. రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వద్ద పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులకు సంబంధించిన చార్జిషీట్లు సిద్ధం చేసి కోర్టుకు సమర్పించాలన్నారు. తర్వాత ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల వ్యక్తిగత పనితీరుపై సమీక్షించి, వారి పనితీరును మెరుగుపరచుకోలని సూచించారు. ఈనెల 13న జరగనున్న మెగా లోక్ అదాలత్ను దృష్టిలో ఉంచుకొని, వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. మద్యం షాపులు, బార్లలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగా ది ఉత్సవాల నేపథ్యంలో శ్రీశైలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించి, వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. -
‘అలగనూరు’ పనులను పూర్తి చేయండి
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్పై ఆదివారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నేతలు జిల్లా పరిషత్లోకి దూసుకువచ్చారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న దృష్ట్యా తమ డిమాండ్ను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని వారు జెడ్పీ గేట్లు దాటుకొని వచ్చి సమావేశం భవనం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు బైఠాయించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.33 కోట్లను విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ అవే తప్పులు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలంలో తుంగభద్ర జలాశయం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టు నీరుకు 1985లో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1999లో పనులు ప్రారంభించి 2002లో పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2017లో అధిక వర్షాలతో గండి పడిందన్నారు. అప్పట్లో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఉంటే పనులు పూర్తి అయ్యేవన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాడు చేసిన తప్పులనే మళ్లీ చేస్తోందన్నారు. ఫలితంగా అలగనూరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని మంత్రులు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులను విడుదల చేసి వెంటనే పనులను పూర్తి చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్, నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్బాబు, నాయకులు రఘురాం, భార్గవ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రావణి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల సుబ్బారెడ్డి, జీ సోమన్న, జిల్లా సమితి సభ్యులు డీ శ్రీనివాసులు, నందికొట్కూరు శ్రీనివాసులు, నరసింహులు, నారాయణ, ప్రతాప్ పాల్గొన్నారు. -
తప్పు చేసినా.. మనవాడైతే ఓకే!
శ్రీశైలంటెంపుల్: భక్తులకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా, మోసం చేసినా టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాలేదనే సాకుతో తప్పు చేసిన వ్యక్తికే తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇప్పిస్తున్నారు. టీడీపీకి సంబంధం లేని వ్యక్తులు ఎటువంటి తప్పు ఏయకపోయినా, భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ..రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి. రీ–పోస్టింగ్ గత సంవత్సరం డిసెంబరు 24న ఉత్తరాఖాండ్కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వసతి కోసం మల్లికార్జున సదన్లోని డార్మెంటరీలో ఏడు బెడ్లు తీసుకున్నారు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుం రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1750తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి. వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పి.ఉదయ్కుమార్ వారి వద్ద నుంచి రూ.2వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పంధించిన దేవస్థాన అధికారులు విచారణ జరిపి కౌంటర్ విధులు నిర్వహిస్తున్న పి.ఉదయ్కుమార్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేశాడని ధృవీకరించుకుని అతనిని విధుల నుంచి తప్పించారు. అయితే సదరు ఉద్యోగి నియోజకవర్గ స్థాయి రాజకీయ నేతకు సన్నిహితంగా ఉండడంతో..రాజకీయ నేత మనవాడికి పోస్టింగ్ ఇచ్చేయండని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద దేవస్థాన అధికారులు, సంబంధిత విభాగపు అధికారి ఔట్సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేయలేదన్నట్లు ఫైల్ రాయడంతో, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి పేరుతో రీ పోస్టింగ్కు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆదివారం సదరు ఉద్యోగి తిరిగి అదే స్థానంలో ఉద్యోగంలో చేరారు. సదరు ఉద్యోగి తప్పు చేయకపోతే మూడు నెలల పాటు ఎందుకు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు, ఉద్యోగి భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయకపోతే అప్పటి సీసీ ఫుటేజ్ను బహిర్గంతం చేయవచ్చు కదా! భక్తులను, దేవస్థానాన్ని మోసం చేసిన వ్యక్తిని కేవలం భక్తుల నుంచి ఫిర్యాదు లేదనే సాకును చూపి అతనికి రీ–పోస్టింగ్ ఇచ్చేశారు. పోస్టింగ్ ఇవ్వకుండా.. గత సంవత్సరం జనవరి నెలలో శ్రీశైల దేవస్థాన టోల్గేట్లో అకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది వద్ద ఉండాల్సిన డబ్బు కంటే అదనపు డబ్బును అధికారులు గుర్తించారు. దేవస్థాన అధికారులు విచారణ జరిపి టోల్గేట్లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం.రామకృష్ణుడు(హెల్పర్), కాంట్రాక్ట్ లేబర్లు బి.నాగపరమేశ్వరుడు, జి.మల్లికార్జునరెడ్డి, ఎన్.గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బి.మల్లికార్జునరెడ్డి, బీ.ఆర్.మల్లేశ్వర్రెడ్డి, జి.శ్రీనివాసులు, డైలీ వేజ్ సిబ్బంది కె.కె.రాజు లను విధుల నుంచి నిలుపుదల చేశారు. వీరిలో ఎం.రామకృష్ణుడుకి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారందరికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు సైతం తాము ఏ తప్పు చేయలేదని కోర్టు మెట్లెక్కారు. కమిషనర్, కోర్టు కూడా వీరిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పిన ఇంత వరకు విధుల్లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు తప్పులు చేసిన వారికి ఒకలా, ఇతరులకు మరోలా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. టోల్గేట్ వ్యవహరంలోనూ భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని సమాచారం. భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోతే సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వోచ్చు కదా. కేవలం రాజకీయ కక్షతో వీరిని ఇబ్బందులకు గరిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో తప్పుచేసిన వ్యక్తికి వత్తాసు తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ టోల్గేట్ సిబ్బంది తొలగింపు సంవత్సరం అయినా పోస్టింగ్ ఇవ్వని వైనంరాజకీయ కక్ష తీర్చుకునేందుకు శ్రీశైల దేవస్థానాన్ని రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు వేదికగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంటుందనే అరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేకపోయిన టీడీపీ నాయకుల అనుచరులకు కీలకమైన పోస్టింగులు ఇవ్వడంతోపాటు అనుకూలమైన వారికి దేవస్థానంలో ఆదాయం వచ్చే స్థానాల్లోకి బదిలీ చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగుల అంతర్గత బదిలీ చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉన్నప్పటికి వాటిని పాటించడం లేదు. అంతేకాకుండా చిన్న పాటి ఉద్యోగులను సైతం ఎన్నికల్లో ప్రచారానికి తిరిగారని వారికి పోస్టింగులు ఇవ్వకుండా సంవత్సరం పాటు వేధింపులకు గురి చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులను బదిలీలు, వారిపై విధుల పట్ల అలసత్వం పేరుతో రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులకు గురిచేస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. -
కేసీ కెనాల్లో యువకుడి గల్లంతు
బండిఆత్మకూరు: మండల పరిధిలోని సింగవరం గ్రామ సమీపంలో ఉన్న కేసీ కెనాల్ వద్ద ఆదివారం నారిపెద్ద హేమంత్ (17) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ జగన్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గల్లంతైన యువకుడుది ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామం. అయితే శనివారం రాత్రి అతనితోపాటు 20 మంది యువకులు గ్రూప్గా ఏర్పడి సింగవరం గ్రామానికి వచ్చి బస చేశారు. సింగవరం గ్రామం నుంచి వీరందరూ నడుచుకుంటూ బండిఆత్మకూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కేసీ కెనాల్ మెట్ల వద్ద కాళ్లు కడుక్కోవడానికి హేమంతు దిగి కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీంతో పక్కనున్న యువకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసీ కెనాల్ లో నీటి ప్రవాహం తగ్గించి డ్రోన్ల ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు వచ్చి కెసి కెనాల్ సమీప గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. -
ఏపీ జేఏసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
● చైర్మన్గా జవహార్లాల్, ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి( ఏపీ జేఏసీ) కర్నూలు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది. జేఏసీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా యూనిట్గా ఉంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఇందుకు అనుగుణంగా జేఏసీలు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆదివారం కర్నూలులోని ఎన్జీఓ హోమ్లో జిల్లా జేఏసీ నూతన కమిటీ ఏర్పాటైంది. దాదాపు 76 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా శాఖ అధ్యక్షుడు వి.జవహార్లాల్ ఎన్నికయ్యారు. జేఏసీ ప్రధాన సెక్రటరీగా ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు), కో–చైర్మన్లుగా ఎంసీ కాశన్న (ఎన్జీజీవోస్ అసోసియేషన్), పీఎండీ ఇస్మాయిల్ (ఆర్టీజీ ఎన్ఎంయూ), సుంకన్న(ఎస్టీయూ), వెంకటేశ్వర్లు (పశుసంవర్ధకశాఖ), వైస్ చైర్మన్లుగా కృష్ణారెడ్డి, లింగన్న, చాంద్బాషా, నాగకిశోర్, మధుసూదన్రెడ్డి, నవీన్పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివారెడ్డి, కోశాధికారిగా భాస్కరనాయుడు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా వివిధ సంఘాల నుంచి 10 మంది, ఈసీ మెంబర్లుగా వివిధ సంఘాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జవహార్లాల్ మాట్లాడుతూ.. సంఘటితంగా పోరాటాలు చేసేందుకు జేఏసీ అవసరం ఎంతో ఉందని తెలిపారు. జేఏసీ ద్వారా అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యమాలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కులు, డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. నూతన జేఏసీ కార్యవర్గ సభ్యులను వివిధ సంఘాల నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎంచక్కా.. ఎద్దుల బండిలో..
పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎద్దుల బండ్లు కనుమరుగై పోయాయి. వ్యవసాయం చేసే రైతులు సైతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదివారం కొలిమిగుండ్ల మండలంలోని తోళ్లమడుగుకు చెందిన ఓ రైతు ఎద్దుల బండిలో కుటుంబ సభ్యులతో కోర్నపల్లె సమీపంలోని పట్టాభిరామాలయంలో విగ్రహాల ప్రతిష్టకు వెళ్తూ కనిపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు వాహనాల్లో వెళుతూ ఎద్దుల బండిలో వెళ్తున్న మహిళలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. – కొలిమిగుండ్ల -
కల్యాణోత్సవం.. నయనానందకరం
కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులుఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి పరిణయోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా పండితులు పుణ్యాహవచనం చేశారు. నవగ్రహ మంటపరాధన అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సమర్పించిన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను పెండ్లి కూతురు, పెండ్లి కుమారులుగా అలంకరించారు. పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా పెండ్లి మంటపానికి తోడ్కొని వచ్చి పెళ్లి పీటలపై కొలువుంచారు. ఎదుర్కోళ్లు నిర్వహించిన అనంతరం వైష్ణవ ఆచారంగా పండితులు వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని నిర్వహించారు. యజ్ఞధారణ, జీలకర్ర బెల్లం తతంగాలు చేపట్టాక మాంగళ్య ధారణ నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు కార్యక్రమం పూర్తి చేశారు. స్వామి, అమ్మవారి మీద నుంచి కింద పడ్డ తలంబ్రాలను భక్తులకు పంచి పెట్టారు. ముఖ్య అతిథులుగా (పెళ్లి పెద్దలుగా) పాల్గొన్న భక్తులకు ఆర్చకులు కంకణ ధారణ చేశారు. కమనీయ దృశ్యాన్ని తనివితీరా చూసిన ప్రతి హృదయం అంతులేని ఆనందంతో మురిసింది. నూతన పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించిన ప్రహ్లాదవరదుడిని, అమృతవల్లీ అమ్మవార్లను వేదిక వద్ద కొలువు దీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి ముగ్ధమనోహరంగా ఆలరించింది. ఆకట్టుకున్న ఎదుర్కోల్ల ఉత్సవం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి, అమ్మవారిని వేరువేరు పల్లకీల్లో కొలువుంచి పెళ్లి మండపానికి తోడ్కొని వచ్చే ముందు సాంప్రదాయ ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామి తరఫున కొందరు, అమ్మవారి తరఫున కొందరు అర్చకులు బంధుగణంగా విడిపోయి పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారు. కట్నకానుకలు, ఆడపడుచు లాంఛనాలు, ఇచ్చి పుచ్చుకోవడం తదితర విషయాలు చర్చించుకుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకునే మాటలు విశేషంగా అలరించడంతో పాటు ఆలోపించజేసింది. అనంతరం స్వామి, అమ్మవారిని ఒక్కటిగా చేసి కల్యాణ మండపానికి తోడ్కొని పోయారు. మండపంలో కొలువైన స్వామి, అమ్మవారు కల్యాణోత్సవం నిర్వహిస్తున్న పీఠాధిపతి, అర్చకులు -
అట్టహాసంగా ‘గురురాజా’ వార్షికోత్సవం
గోస్పాడు: గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. మండలంలోని బాబానగర్ గ్రామంలో ఉన్న ఈస్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవానికి స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బోధన సాగిస్తున్న గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి ఫరూక్ అభినందించారు. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన గురు రాజా ఇంగ్లిష్ మీడియం స్కూల్ నేడు 24వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాలలోనీ గురరాజా ఇంగ్లిష్ మీడియం పాఠశాల రాష్ట్రస్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ డైరెక్టర్లు పి. మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి, అతిథులను సత్కరించారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, మౌలాలి రెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు అధిష్టింపజేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు రూ.3 లక్షల విరాళాలను ఆదివారం అందించారు. అన్నప్రసాద వితరణ పథకానికి గుంటూరుకు చెందిన పి.రాజేశ్వరరావు రూ.1,01,116 విరాళాన్ని ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఎం.అవినాష్ గో సంరక్షణ నిధి పథకానికి రూ.లక్ష, ప్రాణదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. యువకుడి ఆత్మహత్య ఆదోని అర్బన్: మండలంలోని కడితోట గ్రామానికి చెందిన రామకృష్ణ, ఈరమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్(21) కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాలు.. శ్రీకాంత్ రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత ఏడేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. ఆదివారం కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిగేలా విలపించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ అద్దె బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. బస్టాండ్లో నుంచి నంద్యాలకు బయలు దేరిన ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్ ఔట్ గేటు నుంచి బయటకు వస్తుండగా ముదిగేడు రహదారి వైపు నుంచి బస్టాండ్ వైపు టిప్పర్ వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ కావడంతో ఇరువురు డ్రైవర్లు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. -
అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అక్రమ అరెస్టులు
కర్నూలు(సెంట్రల్)/డోన్ టౌన్: విజయవాడలో మార్చి 2వ తేదీన చేపట్టే మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొనకుండా పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడ వెళ్తున్న వారిని డోన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. విజయవాడకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ఇచ్చిన పిలుపుమేరకు మార్చి 2 వతేదీన చలో విజయవాడకు బయలు దేరి వెళ్తుండడంతో పోలీసులు వారిని వెళ్లనీయకుండా ఎక్కడిక్కడే అరెస్టు చేస్తుండడంపై సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, అంగన్వాడీ ఎంప్లాయీస్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.నిర్మలమ్మ ఖండించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్కార్డుల అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న 1810 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. -
సర్కారు నిర్లక్ష్యం..రైతుకు నష్టం!
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాల్లో జిల్లా ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా డ్యా గేట్ల మార్పునకు దిగువ కాలువ నీటి విడుదలకు ఎలాంటి సంబఽంధమే లేదు. అయినప్పటికి గేట్ల మార్పు పేరుతో డ్యాంలో ఉన్న నీటిని వృథాగా దిగువకు వదిలేశారు. ఫలితంగా ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1.5 లక్షల ఎకరాల పంటల సాగును రైతన్నలు కోల్పోవాల్సి వచ్చింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు రావడంతో తుంగభద్ర డ్యాంలో ఇన్ఫ్లో మొదలైంది. సీజన్ ప్రారంభం నాటికే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా చేరాయి. 2025–26 నీటి సంవత్సరంలో 415.16 టీఎంసీల నీరు డ్యాంలో చేరింది. 2024 ఆగస్టులో టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం..ఆ తరువాత గేట్ల నిపుణులతో సలహాతో మొత్తం గేట్లు మార్చేందుకు నిర్ణయం తీసుకొని టెండర్లు సైతం ఖరారు చేశారు. నీటి నిల్వను 105.79 టీఎంసీల నుంచి 80 టీఎంసీల తగ్గించారు. డిసెంబరు నెలలో కూడా 80 టీఎంసీల నీరు ఉన్నప్పటికి గేట్ల పనుల సాకుతో డ్యాం నుంచి వృథాగా దిగువకు నీటిని విడుదల చేసి క్రస్ట్ లెవెల్ 1613 అడుగులకు నీటి మట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నీటి మట్టాన్ని చూపి రబీకి నీరు ఇవ్వలేమని ఈ ఏడాది జనవరి 15 వరకు నీటిని విడుదల చేసి బంద్ చేశారు. గేట్ల మార్పునకు ఎల్ఎల్సీకి నీటి సరఫరా నిలిపివేతకు ఎలాంటి సంబఽంధం లేదు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే దీనిపై చంద్రబాబు సర్కారు స్పందించకపోవడం లోలెవన్ కెనాల్లో మిగిలిపోయిన ఆధునికీకరణ పనులు చేసి బిల్లులు చేసుకునేందుకేనని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. దిగువ రైతుకు మొండిచేయి తుంగభద్ర దిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్, రబీలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో లక్ష ఎకరాలకు పైగా నీరు ఇవ్వాల్సి ఉంది. గతేడాది టీబీడ్యాం గేట్లు మార్చేందుకు ఖరీఫ్లో మాత్రమే సాగుకు నీరిస్తామని, రబీలో నీరివ్వమని టీబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రబీ ఆయకట్టుకు నీరు అవసరం లేదని ఇండెంట్ ఇవ్వలేదు. దీన్ని సాకు చూపించి ఏపీ ప్రభుత్వం కూడా ఎల్ఎల్సీ, కేసీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడం గమనార్హం. టీబీ డ్యాంలో ఎల్ఎల్సీకి 4.7, కేసీకి 4.6 టీఎంసీల వాటాకు ఇండెంట్ పెట్టి ఉన్నట్లైతే ఆరుతడి పంటలైన పండించుకునేందుకు అవకాశం ఉండేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 9.3 టీఎంసీల తుంగభద్ర జలాలను ఆయకట్టుదారులు కోల్పోయారు. ఫలితంగా 1.5 లక్షల ఎకరాలకుపైగా సాగును కోల్పోయి దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో పాటు ఎల్ఎల్సీ ఆధారిత, తుంగభద్ర నది తీరంలోని గ్రామాలు, తీరంలోని తాగు నీటి పథకాలకు నీరందని పరిస్థితులు రావడంతో వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం గేట్ల మార్చేందుకు క్రస్ట్ లెవెల్ 1,613 అడుగులకు నీటి మట్టాన్ని తగ్గించేందుకు డిసెంబరు నెలలో నీటిని దిగువకు విడుదల చేశాం. క్రస్ట్ లెవెల్లో కూడా 43 టీఎంసీల నీరు ఉంటుంది. ఈ నీటిలోనే జనవరి 15 వరకు ఎల్ఎల్సీకి తాగు నీటి ట్యాంకులు నింపుకునేందుకు నీరు ఇచ్చాం. రబీలో సాగు నీరు వద్దని కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టకపోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఇండెంట్ పెట్టలేదు. ఎల్ఎల్సీ ఆధునీకీకరణ పెండింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్ఈ డ్యామ్ గేట్ల మార్పు పేరుతో రబీకి నీరు ఇవ్వలేమని ప్రకటించిన టీబీ బోర్డు అవకాశం ఉన్నా ఏపీ వాటాకు ఇండెంట్ ఇవ్వని చంద్రబాబు సర్కారు బిల్లులు చేసుకునేందుకు ఇలా వ్యవహరించిందనే విమర్శలు రబీ ఆయకట్టును కోల్పోయిన రైతులు ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీటి నిల్వలు ఎల్ఎల్సీ, తుంగభద్ర నది తీర ఆధారిత తాగు నీటి పథకాలకు పొంచి ఉన్న ముప్పు -
శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు
● 20 వరకు నిర్వహణ ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారన్నారు. గతేడాది 7 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. తాగునీరు.. వైద్య సదుపాయాలు భక్తులకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు రోజుకు 4 నుంచి 5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రొటేషన్ పద్ధతిలో వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా రెడ్ కలర్ డస్ట్బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్యం.. మౌలిక వసతులు ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. భక్తులు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను నిర్దిష్ట ప్రదేశాల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాలివానలు వచ్చినా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు దృఢంగా ఉండేలా ఆర్ అండ్ బి శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్కింగ్ .. ట్రాఫిక్ నిర్వహణ పార్కింగ్ ప్రదేశాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వాహనాలు మొరాయించినపుడు తరలించేందుకు క్రేన్లు, టోయింగ్ వాహనాలు మెకానిక్స్తో సహా సిద్ధంగా ఉంచాలన్నారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తెలుగు, కన్నడ భక్తుల కోసం శ్రీమే ఐ హెల్ప్ యూశ్రీ డెస్క్లను పెంచాలని, ముఖ్యంగా కన్నడ భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలని, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దర్శన ఏర్పాట్లు రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో స్లాట్ రెండు గంటల పాటు ఉండగా, మొత్తం ఎనిమిది గంటలు స్లాట్ దర్శనం నిర్వహిస్తామని . మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుందని, స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూ లైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. వలంటీర్ల నియామకంజిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాల వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. పాతాళగంగ బోటు సేవల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వలంటీర్లను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి వలంటీర్లను సమీకరించనున్నట్లు చెప్పారు. కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆత్మకూరు అటవీ శాఖ డీడీ విఘ్నేష్ అపూర్వ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల గుండా వచ్చే పాదయాత్ర మార్గాల్లో ఫైర్ వాచర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి కార్మికుడికి ఈ–శ్రామ్ కార్డులు
కర్నూలు: అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడు కార్మిక శాఖ జారీ చేసే ఈ–శ్రామ్ కార్డులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యుడు రాయపాటి శ్రీనివాసులు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని రైతు మార్కెట్లో అసంఘటిత కార్మికులకు ఏర్పాటు చేసిన ఈ–శ్రామ్ కార్డుల నమోదు కేంద్రం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లీలా వెంకటశేషాద్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి, హెల్త్ చెకప్లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కార్మికులకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 మంది కార్మికులకు ఈ–శ్రామ్ కార్డులు, ఐదుగురికి పెన్షన్ కార్డులను అందజేశారు. అనంతరం కంటి వైద్యనిపుణులు డాక్టర్ జయరాం, డాక్టర్ రంగనాథ్, ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్మికులకు కంటి వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. -
మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసాన్ని పురస్కరించుకొని చిన్నారుల తలనీలాలు సమర్పించారు. వివాహాలు ఉంటడంలో స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన చేశారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన వరపూజ నిర్వహించారు. 3న మహానంది ఆలయం మూసివేత మహానంది: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న మహానంది ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ తలుపులు మూసివేసి రాత్రి 7 గంటలకు తెరిచి సంప్రోక్షణ పూజలు, ఆలయ శుద్ధి నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత భక్తులకు శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనం కల్పిస్తామన్నారు. శ్రీశైలంలో నేడు కామదహనం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ.. ఆదివారం స్వామి వారి ప్రధాన ఆలయం ముందుభాగంలో గల గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.30 గంటలకు కామదహన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిస్తామని, అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహర గుండం ఎదురుగా అధిష్టింపజేసి విశేష పూజలు చేస్తామన్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీసేవ నిర్వహించి, గంగాధరమండపం వద్దకు తెచ్చి శాస్త్రోక్తంగా పునఃపూజలు చేస్తామన్నారు. సంప్రదాయాన్ని అనుసరించి మన్మథ రూపాన్ని దహనం చేస్తామని పేర్కొన్నారు. మహానంది ఆలయానికి రూ. 80 లక్షల విరాళం మహానంది: మహానంది దేవస్థానంలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆలయాల్లో బ్రాస్ గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు కోసం విజయవాడకు చెందిన శ్రీ వైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ. 80 లక్షలు విరాళం ఇచ్చేందుకు అంగీకార పత్రం అందించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వామి, అమ్మవారి దర్శనానికి శనివారం వచ్చిన ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందులో భాగంగా పనులు ప్రారంభించేందుకు మొదటి విడతగా రూ. 30 లక్షలు చెల్లించారని చెప్పారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎరమల మధు, వేద పండితులు పాల్గొన్నారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
కల్యాణ మండపానికి వస్తున్న అమ్మవారు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్ల తిరు కల్యా ణోత్సవం ఎగువ అహోబిలంలో వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్ శఠకోప రంగనాధయతీంద్ర మహదేశికన్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ఎదురుకోళ్ల కార్యక్రమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవారిని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చి కొలువుంచారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ తంతు పూర్తిచేశారు. అనంతరం స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు. చివరగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి కల్యాణ మహోత్సవాన్ని ముగించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం తొట్టి తిరుమంజనం, రాత్రి అశ్వవాహన సేవలు కొనసాగుతాయి. దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, సాయంత్రం గజవాహనం సేవ, రాత్రి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువుల ఆశీర్వాదం కోసం తాళి చూపుతున్న అర్చకుడు -
చీకటి ఒప్పందంతో ‘సీమ’కు అన్యాయం
● ఎమ్మెల్సీ ఇసాక్బాషాబొమ్మలసత్రం: తెలంగాణ ముఖ్యమంత్రితో సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేసి సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. సాగునీరు అందక రైతులు వలసలు పోతూ.. అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకోపవడం దారుణమన్నారు. నంద్యాలలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని ప్రశ్నించామన్నారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్కు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వాటిపై సమాధానం ఇవ్వాలని అడిగామన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు వివరించాలని కోరితే మంత్రి సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమయం తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తెలంగాణాలో ప్రాజెక్ట్లు నిర్మించి కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి కోసం పోతిరెడ్డిపాడు వద్ద 800 అడుగుల్లో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం పనులు నిలిపివేయటం సరైందికాదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రాజెక్ట్పై నడుస్తున్న కేసుపై చంద్రబాబుకు ఎందుకు శ్రద్ధ చూపటంలేదో అర్థం కావటంలేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో సీమకు భవిష్యత్తులో జరగబోయే అన్యాయంపై ఆదివారం కడపలో రౌండ్టేబుల్ సమావేశం జరగనుందన్నారు. -
మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంపై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఎకై ్సజ్, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీ వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి అక్రమ మద్యం తయారీని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు చేపడుతోందన్నారు.సమావేశంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఎకై ్సజ్, పోలీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈఓ, ఐసీడీఎస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో బంగారం వ్యాపారి
● రూ.5 కోట్లకు పైగా అప్పులు ● రెండు నెలలుగా మూతపడిన దుకాణంఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయం సమీపంలోని ఓ బంగారం దకాణం యజమాని రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వ్యాపారులు, ఇతరుల దగ్గర దాదాపు రూ.5 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. దుకాణం మూతపడటం, ఇళ్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా కనిపించకుండాపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పెళ్లిళ్లు ఉండటంతో కుదువ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన బాధితులు వ్యాపారి సెల్ఫోన్కు కాల్ చేయగా స్వీచ్ఆఫ్ వస్తుండటంతో మోసపోయామని తెలుసుకున్నారు. పలువురు బాధితులు శుక్రవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నందవరం మండలం మిట్టసోమపురానికి చెందిన లింగన్న 2 తులాల బంగారు చైన్ కోసం రూ.2.80 లక్షలు, జొహరాపురం వెంకటేష్ బంగారు చైన్ కోసం రూ.1.30 లక్షలు, కడిమెట్ల మహేష్ తులం బంగారు, బీషన్న అరతులం బంగారం, మిట్టసోమపురం లక్ష్మీ లాంగ్ చైన్ రిపేరికి ఇవ్వటమే కాకుండా, అర తులం చైన్ చేయటానికి రూ.50 వేలు, రంగమ్మ తులం బంగారు చైన్, నందవరం రామలక్ష్మీ 100 తులాల వెండి కుదవపెట్టింది. వీరే కాకుండా వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 23న పత్తికొండకు చెందిన షేక్షావలి జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్కు తాను కుదవపెట్టిన బంగారం ఇవ్వటం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
సమ్మోహనం.. జగన్మోహినీ రూపం
ఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో నృసింహుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం వాడవాడల్లో సంచరిస్తూ.. భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం సింహరూపుడైన స్వామిని జగన్మోహినీ అలంకరణతో గడగడపకు వెళ్లారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ చేశారు. పుష్పాలంకరణ పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య వీధుల్లో సంచరించారు. శరభవాహనంపై శ్రీహరి సర్వాలంకార భూషితుడైన శ్రీహరి శరభ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో వివహరించారు. ఈ వాహనసేవ శోభాయనంగా సాగింది. భక్తులు తరలివచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పొన్నచెట్టు వాహనంపై ఊరేగిన గోవిందుడు శ్రీ అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నృసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్ప పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాలా నృసింహుడు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ( పొన్నచెట్టు వాహనం) అధిష్టించి భక్తజనులకు దర్శనమిచ్చారు. అహోబిలంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం ఉదయం అభిషేకం, సాయంత్రం గజవాహన సేవ, రాత్రి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, రాత్రి పొన్నచెట్టు వాహనంపై స్వామి వివహరించనున్నారు. ‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు దిగువ అహోబిలంలో మోహినీ అవతారంలో సందడి చేసిన ప్రహ్లాదవరదుడు రాత్రి శరభ వాహనము పై దర్శనమిచ్చిన స్వామి ఎగువ అహోబిలం లో పొన్నచెట్టు వాహనము పై దర్శనమిచ్చిన జ్వాలనారసింహుడు -
మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 35.05 లక్షలు
మహానంది: హుండీ కానుకల ద్వారా శ్రీ మహానందీశ్వరస్వామికి రూ. 35.05 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో హుండీ కానుకలను గురువారం లెక్కించినట్లు చెప్పారు. ఆలయాల ద్వారా రూ. 34,64,108 , గో సంరక్షణ ద్వారా రూ.16,825 , అన్నప్రసాదం ద్వారా రూ. 24,640 మొత్తంగా రూ. 35,05,573 లభించిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి మోహన్, ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మార్చి నెల పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీ ఈ నెల 28న చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. పంపిణీకి అవసరమైన నిధులు శుక్రవారం బ్యాంకులకు విడుదలయ్యాయి. వెంటనే వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. మార్చి 1న ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 2,36,185 పింఛన్లకు రూ.103.87కోట్లు, నంద్యాల జిల్లాలో 2,12,494 పింఛన్లకు రూ.92.03 కోట్లు పంపిణీ చేయనున్నారు. మిగిలిపోయిన వారికి మార్చి 2న పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. వైభవంగా తిరుచ్చి మహోత్సవం బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, పండితులు, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. తిరుచ్చి మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బంగారు రుద్రాక్షమాల, హారం విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బాపట్లకు చెందిన కూరపాటి మాధవి, కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు జి.రవికుమార్, ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జునకు అందజేశారు. బంగారు హారాన్ని విరాళంగా అందించిన దాతకు రసీదుతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. దాతలు మాట్లాడుతూ.. 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం తయారు చేయించినట్లు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు చెప్పారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
కర్నూలు: న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో మధ్యవర్తిత్వంపై న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యవర్తిత్వ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టారన్నారు. మార్చి 7వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల నుంచి మధ్యవర్తిత్వ ప్రక్రియకు కేసులు స్వీకరిస్తారన్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీంతో కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నాలుగు కేంద్రాల్లో మే 3న ‘నీట్’
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలలో 1,320 మంది విద్యార్థులు మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి నుంచి నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్, టెక్కే జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నార. అవసరమైతే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను కూడా కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. కేటాయించిన సామర్థ్యానికి 10 శాతం అదనంగా సీట్లు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే పనులు చేపట్టాం
భారత ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్ల పనుల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనుల్లోను నిబంధనల మేరకే చేశాం. దేవస్థానానికి సీఎం పేషీ నుంచి పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదును పరిశీలించి క్షుణ్ణంగా అన్నింటికీ వివరాలు సమర్పించాం. అన్ని పనులకు ఆన్లైన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్లు నిర్వహించాం. ప్రధాని భద్రతా అధికారులైన ఎస్పీజీ సూచనల మేరకు మూడంచెల భద్రత కోసం పటిష్టంగా బారికేడింగ్ ఏర్పా టు చేశాం. భ్రమరాంబా అతిథిగృహంలో ఐదు గదులకు ఫర్నిచర్ మార్చాం. టీటీడీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే పెయింటింగ్ పనులు చేపట్టాం. – ఎం.నరసింహారెడ్డి, శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -
పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ
ఈ ఆర్థిక సంవత్సరం ముగి సే నాటికి జిల్లాలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం. ప్రత్యేకంగా ఉన్నతాధికారు లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరముల కింద రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.17 కోట్లు వసూలయ్యా యి. మిగిలిన 12 కోట్లను మార్చి 15వ తేదిలోగా వసూలు చేయాల్సి ఉంది. అధిక డిమాండ్ ఉండ డం వల్ల కర్నూలు, ఆదోని మండలాల్లో కొంత మేర పురోగతి తక్కువగా ఉంది. కౌతాళం, కోసిగి మండలాలు కూడా పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి. – జి.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి -
తీవ్ర మానసిక వేదన
సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహించాలని రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు చేస్తున్న ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాం. ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు లేవని, సంబంధిత శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. మాకు రావాల్సిన పదోన్నతులు, బకాయిలు, నోషనల్ ఇంక్రిమెంట్స్, ఏఏఎస్పై మాత్రం నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం. – ఎం రవికుమార్, ఏపీ జీఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ -
285 మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–2 పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులతో కలిపి 13,934 మంది విద్యార్థులకు గాను 13,649మంది హాజరు కాగా 285 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. తెలుగుగంగ ప్రధాన కాలువకు భారీ గండి బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాలువ కుడి వైపున 4వ బ్లాక్ వద్ద బుధవారం రాత్రి 15 అడుగుల భారీ గండి పడింది. దీంతో నీటి ప్రవాహం వరి పంట మీదుగా జీసీ పాలెం, లింగాపురం చెరువుల వైపు వెళ్లడంతో 60 ఎకరాల పొలం నీటి ముంపుకు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగు గంగ ఈఈ శంకర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటి ప్రవాహన్ని పూర్తిగా నిలిపి వేశారు. పరిస్థితి అదుపులోనికి వచ్చాక గండిని మూసి వేస్తామని అధికారులు తెలిపారు. కాగా గండి పడిన సమయంలో కాలువలో రెండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎడమ వైపున గండి పడింది. మళ్లీ గండి పడటంతో కట్ట భద్రతపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉన్నతాదికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సబ్ జైలులో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్ జైలులో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం నంద్యాల మండల లీగల్సెల్ చైర్మన్ అమ్మన్న రాజ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్నరాజ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, నంద్యాల సబ్ జైళ్లలో ఉన్న రిమాండ్ ఖైదీలకు సమస్యలను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యుల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డీఎంహెచ్ఓ, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎంప్లాయీ మెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్, ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ఆఫీసర్లు ఉంటారన్నారు. వీరు ప్రతి నెలా నంద్యాల జిల్లాలోని సబ్ జైళ్లను తనిఖీ చేస్తూ ఖైదీల సమస్యలు, సంక్షేమం, న్యాయపరంగా విద్యా, ఆరోగ్య పరంగా సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం కోసం పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ శ్రీనివాసులు, డీఈఓ జనార్ధన్రెడ్డి, సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డిలతో పాటు లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నమో.. శేషశైలావాసా!
● వైభవంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. వేకవజామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. శరభ వాహనం అధిరోహించిన జ్వాలా నారసింహ స్వామి అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వా మి గురువారం శరభ వాహనం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అన ంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు.మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అల ంకరించి యాగశాలలో కొలువుంచి భక్తుల కు దర్శ న భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామిని శరభ వాహనంపై కొలువుంచి మాడవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఎగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి పొన్నుచెట్టువాహనం సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో ఉదయం మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహనము సేవలు నిర్వహిస్తారు. -
అధిక రేట్లు.. అనర్హులతో పనులు!
శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా అధిక రేట్లకు, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు, భారీగా అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి, విజిలెన్స్ శాఖకు, దేవదాయశాఖ ముఖ్య అధికారులకు శ్రీశైలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల్లో సైతం భారీ అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇవీ.. ● ప్రధాని నరేంద్రమోదీ గత సంవత్సరం అక్టోబరు 16న శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ● ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచామని చెబుతున్న దేవస్థానం జీవో.ఎంఎస్ నెం.94 ప్రకారం కాకుండా తప్పుగా ఎలిజిలిటీ క్రైటీరియా చేసి అర్హత లేని వారికి క్లాస్–4 బదులుగా క్లాస్–5తో రెకమెండేషన్ చేశారు. ● సప్లై మెటీరియల్ టెండర్లకు ఎంఎస్ఎంఈ, ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు. ● దేవస్థాన ఇంజినీర్ల తమ బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు దక్కేలా టెండర్లు తయారు చేశారనే విమర్శలు ఉన్నాయి. ● ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భ్రమరాంబా అతిథిగృహంలో ఫర్నిచర్ నిమిత్తం రూ.1.5కోట్లు వృధా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ● మార్కెట్ రేట్ల కంటే నాలుగు నుంచి ఐదు రేట్లకు ఫర్నిచర్ కొనుగోలు చేశారని, భ్రమరాంబా అతిథిగృహంలో పాత ఫర్నిచర్ ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పలేదని ఫిర్యాదు చేశారు. ● దేవస్థానంలోని పలు ప్రదేశాల్లో పెయింటింగ్, చిత్రాల పెయింటింగ్ వేయడానికి అయిదు రెట్లు అధికంగా డబ్బులు ఇచ్చి స్వామివారి నిధులకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. ● బారీకేడింగ్, పెండాల్స్ కొనుగోలు చేశారో, అద్దెకు తీసుకొచ్చారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. బారికేడ్లు ఒక ఫ్రేమ్ రూ.300కాగా దేవస్థానం తీసుకున్న కోటేషన్ రేటు రూ.2వేలు, అపై జీఎస్టీతో టెండర్లు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నార. ● దేవస్థానం శానిటేషన్ విభాగం రూ.80లక్షలతో బిల్లులు చెల్లించేలా సిద్ధం చేశారు. ● ప్రధానికి స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణ పేరుతో మహిళలకు కాషాయం చీర, జాకెట్, స్కార్ప్, పురుషులకు తెల్లచొక్కా, పంచె పేరుతో నాసిరకం వస్తువులను తీసుకువచ్చి, అది కూడా తక్కువ తీసుకువచ్చి ఎక్కువ మందికి ఇచ్చినట్లు బిల్లులు సిద్ధం చేశారు. ● తోటలు, గార్డెన్లు, ఇతర మొక్కలు ఏర్పాటు చేసినందుకు రూ.లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు బిల్లులు సిద్ధం చేశారు. ● పై విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సర్వేత్రా ఉక్కిరిబిక్కిరి!
కర్నూలు నగరం డాక్టర్స్ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయివేట్ ఉద్యోగి నివాసం ఉంటున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతోందని తెలుసుకొని తమ ఇంటికి ఎవరూ రాకపోవడంతో సచివాలయానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో సర్వే పూర్తయిందని, మీరు అందుబాటులో లేకపోవడంతో వివరాలు తీసుకోలేదని చెప్పడంతో అవాక్కయ్యాడు. ఈ ప్రాంతంలో చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడి తాళలేక ఉద్యోగులు ఆ కుటుంబం అందుబాటులో లేనట్లుగా నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయల ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనేక రకాల సర్వేలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు ఆందోళనకు చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీ కార్యదర్శులపైనే అధిక భారం పడుతోంది. మెజారిటీ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తమ పరిధిలోని గ్రామాల్లో కుటుంబాలను కలిసి సర్వేలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ అప్డేట్, పీ4(బంగారు కుటుంబాలు)తో పాటు గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు, తాజాగా వార్డుల వారీగా ఓటరు జాబితా రూపకల్పన కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శులే చేయాల్సి ఉండటం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అధిక సమయం తీసుకుంటున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నవశకం’ పేరిట సాగిన సర్వేను ప్రస్తుత కూటమి ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేగా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరు విధులు నిర్వహించిన దృష్ట్యా, అప్పట్లో చాలా సులభంగా సర్వే చేపట్టారు. ప్రస్తుతం వలంటీరు వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిన నేపథ్యంలో భారమంతా సచివాలయ ఉద్యోగులపైనే పడింది. ఒక కుటుంబానికి ఈ సర్వే పూర్తి చేయాలంటే కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలోని అందరు వ్యక్తులకు చెందిన సమాచారాన్ని 20 నుంచి 30 డాక్యుమెంట్ల రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఒక ఉద్యోగి సగటున వంద నుంచి వెయ్యి కుటుంబాలను సర్వే చేయాల్సి ఉందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు మనిషి జీవించి ఉన్నాడా, లేదా? అని నిర్ధారించుకునేందుకు ఈకేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో విధిగా బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉండటంతో ప్రక్రియ ప్రహసనంగా మారుతోందంటున్నారు. అలాగే పీ4(బంగారు కుటుంబాలు)లను గుర్తించే బాధ్యత కూడా వీరి నెత్తిపైనే ఉంది.ఆన్లైన్ పన్ను చెల్లింపులతో ఇబ్బందులుప్రస్తుతం అన్ని రకాల పన్నులను ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు తమ మొబైల్ ద్వారా పన్నులు చెల్లిస్తున్నారు. ఇంటి నెంబర్ లేదా ఇతర అంశాలను పూరించే సమయంలో చిన్నపాటి పొరపాట్లు చేస్తే మరో 24 గంటల పాటు సర్వర్ స్తంభిస్తోంది. అలాగే పలు ప్రాంతాల్లో సర్వర్లు పనిచేయక పోవడం వల్ల కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు.తాజాగా ఓటరు జాబితా రూపకల్పనఓ వైపు సర్వేలు, మరో వైపు పన్ను వసూళ్లకు లక్ష్యాలు, ఇంకో వైపు ఓటరు జాబితాలను మార్చి 9 నాటికి రూపొందించాలని డెడ్లైన్ విధించారు.దీంతో పంచాయతీ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ రకమైన ఒత్తిడికి లోనవుతుంటే ఐవీఆర్ఎస్ మరో రకంగా భయపెడుతోంది.గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.తీవ్ర పని ఒత్తిడి కారణంగా ఏ గ్రామ పంచాయతీలోనైనా పారిశుద్ధ్యంపై నెగిటివ్గా తెలియజేస్తే, సంబంధిత కార్యదర్శులపై వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడకపోవడం గమనార్హం.సవాలుగా పన్ను వసూళ్లుగ్రామాల్లో పన్ను వసూళ్లు పంచాయతీ కార్యదర్శులకు సవాల్గా మారింది. మార్చి 20వ తేదిలోగా జిల్లాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్అండ్ఆర్డీ కమిషనర్ ప్రత్యేకంగా పన్ను వసూళ్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టింది. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పన్నులు, పన్నేతరములు కలిపి రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.17 కోట్లను వసూలు చేశారు. ఇంకా 20 రోజుల్లో రూ.12 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. పన్ను వసూళ్లలో ఎవరు అశ్రద్ధ చూపినా, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. -
ఆధార్ చూపించాలి..ఓటీపీ చెప్పాలి
కర్నూలు(అగ్రికల్చర్): కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్న రైతన్నలకు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ –నామ్ 2.0 వర్షన్ మరింత తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఈ–నామ్ 2.1 వర్షన్ కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవడం జరిగేది. ఈ వర్షన్ మంగళవారం రాత్రి క్లోజ్ అయింది. తాజాగా ఈ–నామ్ 2.0 నందు వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ లోపలికి అనుమతిస్తారు. కనీస సమాచారం లేకుండా కొత్త వర్షన్ అమలు చేయడంపై రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షన్ మారడంతో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మార్కెట్కు వచ్చే రైతులు సాధారణంగా ఆధార్ కార్డు తెచ్చుకోరు. అనేక మంది రైతుల దగ్గర మొబైల్ ఫోన్లు కూడా ఉండవు. ఇక నుంచి మార్కెట్ యార్డుల్లో పంటలను అమ్ముకోవాలంటే రైతులు విధిగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం నకళ్లు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలి. మార్కెట్ ఎంట్రీ గేటులోనే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం కాపీలు ఇవ్వాల్సి ఉంది. ఓటీపీ నెంబరు చెప్పాల్సిందే.. ఈనామ్ కొత్త వర్షన్లో ఫోన్ నంబరు కూడా చెప్పాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత రైతు మొబైల్కు ఓటీపీ నంబరు వస్తుంది. ఓటీపీ నెంబరు చెబితేనే రైతు వివరాలు రిజస్టర్ అవుతాయి. అయితే రైతులు తమ వెంట ఆధార్ తెచ్చుకోకపోవడం, కొంతమంది తెచ్చుకున్నా.. ఓటీపీ నెంబరు చెబితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం ఇవ్వడానికి, ఓటీపీ నెంబరు చెప్పేందుకు ఇష్టపడలేదు. వర్షన్ మారడంతో రిజిస్ట్రేషన్లు ముందుకు సాగ లేదు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీపీ నెంబర్లు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ–నామ్ 2.0 వర్షన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. ఆధార్ ఇవ్వం.. ఓటీపీ చెప్పేదిలేదని భీష్మించారు. కొత్త వర్షన్కు రైతులు సహకరించకపోవడంతో బుధవారం కర్నూలు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ యార్డులో మాన్యువల్గా ఈ–నామ్ అమలుకు ముందున్న విధానం ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓటీపీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేపట్టి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపట్టారు. కాగా.. ఈ–నామ్ వర్షన్ మారినందున మార్కెట్ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్ముకునేందుకు వచ్చే రైతులు విధిగా వెంటనే ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం నకళ్లు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్ తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. ఉన్నట్టుండి ఈ–నామ్ వర్షన్ మార్పు చేసిన కేంద్రం ఇంతవరకు ఈ–నామ్ 2.1 వర్షన్ కింద వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు తాజాగా 2.0 వర్షన్ కింద ప్రతి రోజు రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి వెంట ఆధార్, బ్యాంకు పాసు బుక్తో పాటు మొబైల్ ఫోన్ తెచ్చుకోవాల్సిందే ఆందోళనలో అన్నదాతలు -
టీబీ డ్యాం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ఆలూరు: టీబీ డ్యాం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈనెల 24వ తేదీన 20 గేట్లు ఎత్తి 62.610 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్యాం కు ఇన్ ఫ్లో 74.555 క్యూసెక్కులు, ఔట్ప్లో 85.616 క్యూసెక్కులు ఉంది. 105.788 సామర్థ్యం గల డ్యాంలో 75.612 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాగా రబీ సీజన్లో ఎల్లెల్సీ కింద వివిధ పంటలు సాగయ్యాయి. నీటి విడుదల తగ్గిపోవడంతో పంటలు చేతికి వస్తాయోలేదోననే భయం రైతులకు పట్టుకుంది. హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ అవుకు(కొలిమిగుండ్ల): తండ్రి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అవుకు పోలీస్ స్టేషన్లో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి వివరాలను విలేకరులకు వెల్లడించారు. మండలంలోని ఉప్పులపాడు గ్రామానికి చెందిన మంగలి శివరాముడిని కుమారుడు నాగశేఖర్ 2022లో హత్య చేశాడు. వీటికి సంబంధించి నంద్యాల అడిషనల్ సెషన్స్ కోర్టుకు ముద్దాయి హాజరు కాక పోవడం, వాయిదాలకు వెళ్లకుండా ఉండటంతో కోర్టు ముద్దాయిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ పర్యవేక్షణలో అవుకు ఎస్ఐ అశోక్ సిబ్బందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసి బెంగళూరు,కర్ణాటక తదితర ప్రాంతాల్లో వెతుకుతూ వచ్చారు. చివరకు మండలంలోని సంగపట్నం ఊరి వాకిలి వద్ద పట్టుబడటంతో అదుపులోకి తీసుకొని నంద్యాల కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు. -
ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం. వయస్సు 63 ఏళ్లు. ఒక కుమార్తె సంతానం కాగా సున్నిపెంటలో ఉంటోంది. పింఛను కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. పూట గడవక రెండేళ్లుగా కలెక్టరేట్ ముఖద్వారం వద్ద కూర్చొని అడుక్కుంటున్నాడు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినప్పటికీ కొత్త పింఛన్ల ఊసెత్తడం లేదు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు 50 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. ఏ పనీ చేయలేని పరిస్థితి. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రకటించారు. చంద్రబాబు మాటలకు ఎంతో సంతోషించాం. ఇప్పుడు ఆ మాట ఎత్తకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – బి.ఆంజనేయులు, చిన్నటేకూరు, కల్లూరు మండలం 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలను విశ్వసించాం. ప్రభు త్వం ఏర్పాటై 20 నెలలు అవుతోంది. ఇంతవరకు హా మీ అమలు దిశగా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నా వయస్సు 58 ఏళ్లు. రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలి. – కుషిదా బేగం, కేఈ మాదన్న నగర్, డోన్ కర్నూలు(అగ్రికల్చర్): 2024 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సూపర్–6లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు అవుతున్నప్పటికీ ఈ పింఛను హామీ పట్టాలెక్కని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటీ కొత్త పింఛను ఇవ్వకపోగా ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో త్వరలో కొత్త పింఛన్ల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చంద్రబాబు సర్కార్ కర్నూలు జిల్లాలో 4,748, నంద్యాల జిల్లాలో 4,163 దివ్యాంగుల పింఛన్లను అనర్హత పేరిట తొలగింపునకు నోటీసులు జారీ చేసింది. వీరంతా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దిగి వచ్చిన ప్రభుత్వం మళ్లీ రీ వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో దివ్యాంగుల పింఛన్లు 55,861 ఉండగా.. 48,314 పింఛన్లను రీ వెరిఫికేషన్ చేశారు. మిగిలిన 7,547 మంది దివ్యాంగుల పునః పరిశీలన చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉంది. దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వితంతు పింఛన్లను కూడా పునఃపరిశీలన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్లకు తప్పని నిరీక్షణ చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావనే లేకపోవడం అవ్వతాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 నుంచి 60 ఏళ్లలోపు అవ్వతాతలు దాదాపు 4.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 60 శాతం మందికి పింఛన్లకు అర్హులే. 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దాదాపు 2లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పింఛను దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛను ప్రకటన జిల్లా గత ఏడాది జూన్ నెల పింఛన్లు ఈ ఏడాది జనవరి నెల పింఛన్లు కోత కర్నూలు 2,45,687 2.36,185 9,502నంద్యాల 2,21,702 2.12,494 9,208 మొత్తం 4,67,389 4,48,679 18,710 నెరవేరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను హామీ అవ్వతాతలు, దివ్యాంగులు, చేనేత, మత్స్యకారుల నిరీక్షణ చంద్రబాబు ప్రభుత్వంలో 18710 పింఛన్ల కోత త్వరలో కొత్త పింఛన్లని అసెంబ్లీలో ప్రకటన అయినప్పటికీ ఒక్క అడుగూ ముందుకుపడని పరిస్థితి -
16 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మార్చి 16వ తేది నుంచి 20వ తేది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగుతాయని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్రం భాగల్కోట్ జిల్లా తేర్దాళ్లోని అల్లమ ప్రభు దేవస్థానంలో భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ధర్మ ప్రచార రథయాత్ర బసవేశ్వర సర్కిల్ నుంచి అల్లమ ప్రభు దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీఠాధిపతి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ సమయంలో అలంకార దర్శనానికే అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కాలిబాటగా వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా, దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
40 ఏళ్ల భూ పరిహారం కేసు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): లోకాయుక్త చొరవతో 40 ఏళ్లనాటి భూ పరిహారం కేసు పరిష్కారమైంది. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బాధిత రైతుకు రూ.1,47,078 నష్టపరిహారం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం బొర్రపాళెంగ్రామానికి చెందిన కేవీఎస్ సూర్యనారాయణ మూర్తికి చెందిన టీ.నర్సాపురం మండలం సర్వే నంబర్ 67/2లోని 0.76 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్కేకేవైఆర్ ప్రాజెక్టు కోసం 1980 అక్టోబర 27వ తేదీన స్వాధీనం చేసుకుంది. అయితే సదరు భూమికి సంబంధించి నష్టపరిహారం కేసులో మంజూరైన పరిహారంపై అప్పటి బాధిత రైతు తండ్రి లేటు అప్పారావు ఒప్పుకోలేదు. దీంతో ఆయన కుమారుడు కేవీఎస్ సూర్యనారాయణ మూర్తి పరిహారం కోసం లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ క్రమంలో 40 సంవత్సరాలు గడిచిన తరువాత లోకాయుక్త కేసును పరిష్కరించి బాధితుడికి రూ.1.47 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కేసును మూసి వేస్తున్నట్లు ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బుధవారం ప్రకటించారు. -
మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
● ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలో మాదిగలపై పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాలోని తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఎం.రమేష్ హత్యకు నిరసనగా బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సభను నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు, బుంగా సంజయ్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ జనవరి 31న టి.ఎం.రమేష్ను అతి దారుణంగా హత్య చేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దళితులకు, ముఖ్యంగా మాదిగ బిడ్డలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నా పాలకులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు కావాలి కాని వారి ప్రాణాలు పోతుంటే పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా అని నిలదీశారు. రమేష్ హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రమేష్ హత్య కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఛలో అమరావతి కార్యక్రమానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. మాదిగలపై జరుగుతున్న హత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం స్పందించడం లేదన్నారు. అగ్ర వర్ణాలకు చెందిన నాయకులు హత్యలకు గురైతే కోట్ల రూపాయల పరిహారంతో పాటు కోట్లు ఖరీదు చేసే స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదన్నారు. మాదిగ బిడ్డ హోంమంత్రిగా ఉన్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు హత్యలకు గురవుతున్నా ఆమె స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెద్ద మాదిగ అని చెప్పే మందకృష్ణ మాదిగ సైతం మాదిగల హత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయ్యారన్నారు. ● కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కమతం పరుశురాం, సుధాకర్ మాదిగ, రాయలసీమ దండోరా అధ్యక్షులు అనంతరత్నం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి మాదిగ, రాష్ట్ర కోకన్వీనర్ వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షులు పులికొండ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గద్ద రాజశేఖర్ మాదిగ, నగర అధ్యక్షుడు కన్నెమరకల వెంకటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు గిడ్డయ్య మాదిగ, విన్సెంట్ విజయ్ కుమార్ మాదిగ, రంగడు మాదిగ, నవీన్ మాదిగ, శాంతి పాల్గొన్నారు. -
స్వలాభం కోసమే ‘సీమ’ తాకట్టు
బొమ్మలసత్రం: సాగునీరు అందక, పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇలాగైతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రా రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, ఎస్ఈసీ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి, స్టేట్ మైనారిటీ సెక్రటరీ యూనూస్ బాషా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డి, జిల్లా యూత్వింగ్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసుకు భయపడి .. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. అనంతపురం నివాసి చిలకూరి నారాయణ నంద్యాల గడ్డపై నిలబడి 1982లో రాయలసీమ అని నామకరణం చేశారన్నారు. రాయలసీమలో కరువు ఉండకూడదనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే సాగు, తాగునీరే కాకుండా స్నానాలకు కూడా నీరు దొరకని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను మధ్యలోనే తరలించుకుపోయేందుకు ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించిందన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి సాగునీటి ప్రాజెక్ట్లను గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్ట్ పనులు తిరిగి మొదలుపెట్టకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రజలు ఈ ప్రాజెక్ట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే భావితరాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. చంద్రబాబును నిలదీయాలి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనుందన్నారు. ఇందుకు కోసం సీమ ప్రజలు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు తన శిష్యుడు రేవంత్రెడ్డికి సీమ ప్రాజెక్ట్లను తాకట్టుపెట్టారన్నారు. ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మా ట్లాడుతూ సీమ బాగుండాలంటే ప్రాజెక్ట్ నిర్మాణాలు అవసరమన్నారు. ఇప్పటికే వర్షాభావంతో నీళ్లు తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు లేకపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్ట్ల కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. సీమ రైతుల కోసం ఉద్యమాలువైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ కడపలో రాయలసీమ జిల్లాల నాయకులతో సాగునీటి ప్రాజెక్ట్లపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో రాయలసీమకు 40 వేల క్యూసెక్కుల నీరు అందించేలా చర్యలు తీసుకుంటే ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కుల నీరు అందించేందుకు కృషి చేశారన్నారు. దీన్ని చంద్రబాబు అడ్డుకోవటం సరైందికాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు తన పాలనలో ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ రైతుల కోసం భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుందని, అందరూ సహకరించాలని కోరారు. ప్రజలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎత్తిపోతల పథకం నిలిచిపోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది 1న కడపలో ‘సీమ’ నాయకులతో ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై సమావేశాలు విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు -
క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
● సమర్థవంతంగా పీఎం రాహత్ పథకం అమలు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణం నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రవాణాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, రోడ్లు, భవనాలు శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో బుధశారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజుల్లో ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. పోలీసుల ధ్రువీకరణ అనంతరం సాధారణ గాయాల కేసుల్లో 24 గంటల పాటు, తీవ్ర గాయాల కేసుల్లో 48 గంటల పాటు స్థిరీకరణ వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు చెల్లింపులు మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా చేరతాయన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం బీమా చేసినట్లయితే బీమా సంస్థలు వ్యయాన్ని భరిస్తాయని తెలిపారు. బీమా చేయని వాహనాలు ఉన్న సమయంలో భారత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించడంలో అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె పట్టణం కొండపేటకు చెందిన శాలిక శివప్ప (32) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కోవెలకుంట్లలో ఉన్న బంధువులను చూసేందుకు ఇంటి వద్ద నుంచి బైక్పై బయలుదేరాడు. మండలంలోని అమడాల మెట్ట పెట్రోల్ బంక్ సమీపంలో పంక్చరై ఆగి ఉన్న కంకర టిప్పర్ను వెనుకవైపు నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మేరి, కుమారుడు మోక్షిత్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శపపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. 1,113 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి నెల 4,49,792 పింఛన్లు ఉండగా.. మార్చి నెలలో 4,48,679కు తగ్గిపోయాయి. అంటే 1,113 పింఛన్లు కోతపడ్డాయి. పింఛన్ల పంపిణీకి రూ.195.9 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు నోటిఫికేషన్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు(1)కు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. క్రిమినల్ లా ప్రాక్టీసులో ఏడు సంవత్సరాలు, సెషన్స్ కేసులు చేయడంలో అనుభవం కలిగిన న్యాయవాదులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా కోర్టు వెబ్సైట్ https://www.ecourtskurnool.com నందు అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మార్చి 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను పంపాలని పేర్కొన్నారు. -
అరెస్టుల మధ్య ప్రమాణ స్వీకారం
● ‘ఉరుకుంద’ చైర్మన్గా పాండురంగయ్య ప్రమాణం ● తీవ్ర నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్లు ● హౌస్ అరెస్టు చేసిన పోలీసులు కౌతాళంలో టీడీపీ నాయకుడు చెన్నబసప్పను అరెస్ట్ చేసి పోలీసులుఉరుకుందలో టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుకౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పాలక మండలి సభ్యుల ప్రమాణాస్వీకారం సొంత పార్టీ నేతల అరెస్టుల నడుమ పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది. మంత్రి టీజీ భరత్ చిన్నాయన పాండురంగయ్య శెట్టిని చైర్మెన్గా పాలకమండలి ఎన్నికకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కౌతాళం మండలంతో పాటు నియోజవర్గంలోని టీడీపీ నేతలు బహిరంగంగా నిరసనకు దిగారు. కొందరు రాజీనామాలూ చేస్తున్నారు. బుధవారం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం వద్ద కౌతాళం మండలం నేతలు, మాజీ ట్రస్ట్బోర్డు చెర్మన్లు చెన్నబసప్ప, శివమోహన్ రెడ్డి, కోట్రేష్ గౌడ, కురుగోడు, మంత్రాలయం నాయకుడు పన్నాగ వెంకటేష్, కోసిగి నాయకుడు భరత్ శెట్టి, పెద్ద కడుబూరు నాయకులు సుమారు 400 మందితో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించక పోతే విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉంటే మరో వైపు మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో పాలక మండలి సభ్యులు రాకపోయినా హడావుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందు జాగ్రత్తగా సొంత పార్టీ నేతలు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెన్నబసప్పను కౌతాళంలో, మాజీ డైరెక్టర్ కోట్రేష్ గౌడు, మాజీ ఎంపీటీసీ కురుగోడు తదితరులను ఉరుకుందలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): ఆహార భద్రత నియంత్రణ విభాగం అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూ లు నగరంలోని పలు పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో పాలకల్తీతో మరణాలు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలులోని సి.క్యాంపులో ఉన్న రామి రెడ్డి తాత మిల్క్ డైరీలో వల్లభ గోల్డ్ మిల్క్ను, మాధవనగర్లోని పంచముఖి మిల్క్ పార్లర్లోని గాయత్రి ఫుల్క్రీమ్ మిల్క్ను, ఠాగూర్ నగర్లోని ఇందుమణి మిల్క్ పార్లర్లోని ఆరోక్య టోన్ మిల్క్ను, అమ్మ హాస్పిటల్ సమీపంలోని ఎస్ఎస్ మిల్క్ పార్లర్లో లూజు పాల ప్యాకెట్ పాల ను శాంపిల్స్ తీసి హైదరాబాద్లోని ల్యాబోరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఈ తనిఖీల్లో పాల్గొని పాల విక్రయ దారులకు పలు సూచనలు చేశారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు డీబార్ కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బుధవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. కర్నూలు సాయి కృష్ణ , ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కాలేజీల్లో ఒక్కొక్కరు చొప్పున డీబార్ అయ్యారు. మరోవైపు డిగ్రీ ఫస్టు సెమిష్టర్ పరీక్షకు 85 శాతం, బీటెక్ పరీక్షలకు 97 శాతం, లా పరీక్షలకు 93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మెడికల్ విద్యార్థులు రక్తదానం కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యను పూర్తి చేసి త్వరలో మెడిసిన్ పట్టా తీసుకుంటున్న వేళ కర్నూలు మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులు బుధవారం రక్తదానం చేశారు. ఈ వైద్యవిద్యా ర్థులు త్వరలో ఔట్గోయింగ్ బ్యాచ్ ఏఆర్ఓకేఏహెచ్–26 పేరుతో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యార్థులు వైద్యంతో ప్రాణాలు కాపాడటమే గాక రక్తదానంతో కూడా ప్రాణాలు నిలిపేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి వైద్య విద్యార్థి ఇలాంటి సంప్రదాయాన్ని పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షెహనాజ్, పెథాలజి అసోసియేట్ ప్రొఫెసర్ శైల, 2కే20 బ్యాచ్ సీఆర్ డాక్టర్ అభిషేక్, అఖిల్, శిరీష, స్వర్ణలత, ప్రవల్లిక, హరినాత్, జైషన్, బాలు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు నంద్యాల: జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 2026–27 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి బుధవారం అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి, తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి పట్టివేత నంద్యాల: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్డీపీఓ మందాజావళి, వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నందమూరినగర్కు చెందిన దాసరి కల్యాణ్, బైటిపేటకు చెందిన మనోహర్ గంజాయికి అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే వైజాగ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కేజీ రూ. 4వేలు ప్రకారం గంజాయిని కొనుగోలు చేసి పది గ్రాముల ప్రకారం చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి ఒక్కోక్కటి రూ.2 వేలు చొప్పున నంద్యాల పట్టణంలో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఆ ఇద్దరిపై నిఘా వేసిన పోలీసులు బుధవారం జగజ్జననీ నగర్ చెరువు కట్ట మల్లెలమ్మ గుడి వెనుక ఉండగా దాడి చేసి పట్టుకొని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే లడ్డూపై చర్చ
● చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై చర్చ పెట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. బుధవారం స్థానిక సీ క్యాంపులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన, సంక్షేమంలో వైఫల్యం చెందడంతో తిరుమల లడ్డూపై చంద్రబాబు తన దైన మార్క్ రాజకీయం నడుపుతున్నారన్నారు. దేవుడితో రాజకీయం ఇంకెన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న హిందూవులు జీవితంలో ఒక్కసారైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, ప్రసాదం స్వీకరించాలని భావిస్తారన్నారు. లడ్డూపై విష ప్రచారం ద్వారా అలాంటి వారి మనోభావాలను చంద్రబాబు సర్కారు దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారం చూపకుండా జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం దుర్మార్గమన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతియాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
శేష వాహనంపై అహోబిలేశుడు
● వైభవంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలానృసింహస్వామి శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నృసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారుజామున మేలుకొలుపు చేసి వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. విశేష పుష్పాలంకరణ అనంతరం శేష వాహనంపై ఉభయ దేవేరులతో శ్రీ జ్వాలా శ్రీ జ్వాలానృసింహస్వామి కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో మాడవీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులకు మధ్యాహ్నం పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై దర్శనం ఇచ్చారు. భక్తజనం మధ్య మాడవీధుల్లో విహరించారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవ అనంతరం మూలమూర్తులను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. జలాభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గారుడ విమానం వాహనం అధిరోహించారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో వైభవోపేతంగా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నేటి ఉత్సవాలు.. ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి. శేషవాహనంపై.. -
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని శనివారం చెంచులకు కల్పించారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు సమర్పించారు. స్థానిక మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి వెనక్కు ● ఆ 11 మంది గ్రేడ్–1 వీఆర్వోలే.. కర్నూలు (సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం 11 మంది సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకుంది. 2022లో ఉమ్మడి జిల్లాలోని కర్నూలులో నలుగురు, నంద్యాల జిల్లాలో ఏడుగురికి గ్రేడ్–1 వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించారు. అయితే వీరు డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ కాలేదన్న నెపంతో వారి పదోన్నతిని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఇన్నాళ్ల వరకు సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసిన వారంతా తిరిగి గ్రేడ్–1 వీఆర్వోలుగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకోవడం అవివేకమని, వారికి మరో అవకాశమిచ్చి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు పరిష్కరించకుండా వేధిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పదోన్నతులను వెనక్కు తీసుకోవడం దారుణంగా ఉందని మండిపడుతున్నారు. -
డిగ్రీ పాఠ్యాంశాల్లో సాంకేతికతను జోడించాలి
కర్నూలు(సెంట్రల్): డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుదిద్దేలా ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు ఆకాంక్షించారు. బుధవారం వర్సిటీ సెనేట్ హాలులో అకడమిక్ ఆఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో యూజీ బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ..డిగ్రీ పూర్తయ్యేసరికి విద్యార్థి స్వయం సహాయకంగా ఎదగాలన్నారు. ఈ దిశగా పాఠ్యాంశాలకు సాంకేతికతను మేళవించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం కంప్యూటింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్పై కూడా విద్యార్థులకు బోధనాంశాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు పాల్గొన్నారు. -
తనిఖీ లో‘పాలు’!
● రెండేళ్లుగా ప్రయివేటు డెయిరీల్లో తనిఖీలు శూన్యం ● శాంపిల్స్ తీయడానికే పరిమితమవుతున్న ఫుడ్ సేప్టీ అధికారులు ● కల్తీ నిర్ధారణ అయితే జరిమానాలతో సరిపుచ్చుతున్న వైనం ● రాజమహేంద్రవరం సంఘటనతో ప్రభుత్వం మేలుకొనేనా!కర్నూలు(అగ్రికల్చర్): పాలు ఆరోగ్యానికి మంచిదంటారు. ఉదయాన్నే గ్లాసు పాలు తాగాలంటారు. ఇప్పుడు మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన సంఘటనలో ఐదుగురు మరణించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు ప్రయివేటు పాల డెయిరీలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. మరోవైపు అనధికారికంగా పాలవ్యాపారం చేసే వ్యాపారులు పెరిగిపోతున్నారు. వీరు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు. ఎన్ని సేకరిస్తున్నారు.. పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దానిని పరిశీలించే యంత్రాంగమే లేదు. ప్రయివేటు డెయిరీల్లో పాల నాణ్యతపై దృష్టి పెట్టిన దాఖలాలు రెండేళ్లలో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు పాడి పశువులు సేపునకు రావడానికి అడ్డగోలుగా అక్సిటోసిన్ అనే సూదులు వేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు వేయడం కూడా ప్రాణాంతకమే. అయితే, దీనిని అరికట్టేవారే కరువు అయ్యారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఫుడ్ సేస్టీ అధికారులు 15 పాల శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పంపారు. ఇందులో అను మిల్క్ డెయిరీకి చెందిన పాల శాంపిల్స్లో నాణ్యత లేదని తేలింది. అయితే చర్యలు లేవు. నాణ్యత లేదని తేలినప్పుడు జేసీ కోర్టులో ఫుడ్ సేప్టీ అధికారులు కేసు ఫైల్ చేస్తారు. అక్కడ విచారణ జరిగినా జేసీ జడ్జిమెంటు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఇందులో కూడా జరిమానాతో సరిపుచ్చే అవకాశాలే ఎక్కువ. ప్రయివేటు డెయిరీల్లో తనిఖీలు చేయని అధికారులు రాజమహేంద్రంలో జరిగిన సంఘటనకు సంబంధించి శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించిన ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలువడం వల్లే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడి మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు దాదాపు 20 లక్షల పాల వినియోగం ఉంది. ఉత్పత్తి అవుతున్న పాలు కేవలం 10 లక్షల లీటర్ల వరకే. ప్రయివేటు డెయిరీలు, పాల వ్యాపారులు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాల గురించి రెండేళ్లలో తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ కార్యాలయం ఉంది. పాల నాణ్యత ప్రమాణాలు చూడాల్సిందే ఈకార్యాలయ అధికారులే. అయితే తనిఖీలకు మంగళం పలికి శాంపిల్స్ తీయడానికే వారు పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెయిరీలను తనిఖీ చేసే అధికారం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పశు సంవర్ధక శాఖ అధికారులు డెయిరీలు, పాల వ్యాపారంపై ఏ నాడు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజమహేంద్రవరం సంఘటనలతోనైనా పాల వ్యాపారంపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
పొట్టు లారీలో మంటలు
● అనుమానాలకు తావిస్తున్న ఘటనకొలిమిగుండ్ల: పొట్టును తరలిస్తున్న లారీకి మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పగా చివర్లో నాటకీయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆళ్లగడ్డ నుంచి తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తున్న పొట్టు లారీలో మంటలు చెలరేగాయి. సంజామల మండలం పేరు సోముల సమీపంలో స్థానికులు గమనించి చెప్పినా డ్రైవర్ రామేశ్వరయ్య అలాగే డ్రైవింగ్ చేస్తూ వచ్చా డు. నందిపాడు–కల్వటాల మధ్యలో లారీకి వెనుక వస్తున్న కానిస్టేబుల్ పెద్దయ్య ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని ఆపించాడు. సీఐ రమేష్బాబు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఫైర్ ఇంజిన్ను తెప్పించి మంటలను అదుపు చేయడంతో పాటు జేసీబీల సాయంతో పొట్టును కిందకు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక పోలీసులు, రామ్కో సిబ్బంది సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. చీకటి పడ్డాక మళ్లీ లారీ మంటల్లో కాలిపోవడం చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టడంతో వాహనం కాలిపోయిందనే అను మానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విచారణ చేస్తామని సీఐ తెలిపారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేద్దాం
ఆళ్లగడ్డ: మార్చి 14వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సమష్టిగా విజయవంతం చేద్దామని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు శైలజ, భాస్కర్ అన్నారు. స్థానిక బార్ అసోసియేషన్ సభ్యు లు, బ్యాంక్ల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న సివి ల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులతోపాటు వాహన ప్రమాదం, చెక్బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఇరువర్గాల కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయవాదులు ఈ విషయంలో చొరవ చూపితే కేసులను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
బాలికల్లో పోటీతత్వం పెరగాలి
వెల్దుర్తి: సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు బాలికల్లో పోటీతత్వం పెరగాలని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్, సమగ్రశిక్ష జిల్లా అధికారి ఎన్. లోకరాజు, రాష్ట్ర ప్రభుత్వ అబ్జర్వర్ జయలక్ష్మి, జిల్లా జీసీడీఓ మేరి స్నేహలతతో కలిసి స్థానిక పీఎంశ్రీ బాలికల జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సైన్స్ల్యాబ్లో విద్యార్థినులు చేసిన ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థినులతో మాట్లాడి కంప్యూటర్స్, గ్రంథాలయం, సాంకేతిక విద్య, క్రీడలపై ఆసక్తిని తెలుసుకున్నారు. కర్నూలు: ఓ కేసు విషయంలో స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్కుమార్పై దాడి చేసిన సీఐ విక్రమసింహాపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలనే డిమాండ్తో మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. 24 గంటల్లో సీఐపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హుసేన్ పీరా చెప్పారని, అయితే ఎలాంటి చర్యలు లేకుండా కాలయాపన చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. మరోవైపు బాధిత న్యాయ వాది పవన్కుమార్ ఇంటికి ఇద్దరు సీఐలు వెళ్లి బెదిరించి రాజీ అయినట్లు వీడియో తీసి బార్ అసోసియేషన్ అధ్యక్షుల పేరుతో జిల్లా పోలీసు అధికారులకు పంపినట్లు న్యాయవాది పవన్ మీడియా ఎదుట ఆరోపించారు. ఈ విషయంలో మరో సీఐ జోక్యం చేసుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం నేరమని, ఇందులో రాజీ ధోరణి కాకుండా పోరాటం చేయాలని న్యాయవాద సంఘం సభ్యు లు తీర్మానం చేశారన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వరకు తమ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద సీఐ విక్రమసింహాకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. -
భక్త హనుమా.. వైభవం కనుమా!
ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం అంబరాన్ని తాకుతోంది. ఎగువ, దిగువ అహోబిలంలో ఓబులేశుడి ఉత్సవాలను తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. మంగళవారం హంస, సూర్యప్రభ, యోగా నరసింహ గరుడ, హనుమంత వాహనాలపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై ఊరేగారు. త్రేతాయు గం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవ లో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తుల ను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా అవతరించారన్న సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. ఉదయం యోగా నరసింహ గరుడ విమాన వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉదయం హంస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలోని హంస వాహనంపై కొలువై మాడవీధుల్లో విహరించారు. దేవాలయ ప్రాంగణం నుంచి అహోబిల మఠం చేరుకున్న హంస వాహానధీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వాములను యాగశాలలో కొలువుంచి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కనుల పండువగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై ఊరేగిన జ్వాలా నరసింహుడు హంస, సూర్యప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -
జనగణన గణాంకాలు దేశాభివృద్ధికి పునాది
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(అర్బన్): కచ్చితమైన జనగణన గణాంకాలు దేశాభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది వంటివని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాల సమయంలో సమగ్రమైన, పారదర్శక సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇంటింటి సమాచారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలన్నారు. సేకరించిన గణాంకాల ఆధారంగానే విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం, మౌలిక వసతుల ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా పని చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ – చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ డా. జగన్నాథ్ మజ్హి, డిప్యూటీ డైరెక్టర్– డిప్యూటీ చీఫ్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ దిబ్బకర్ బరిహ, జిల్లా ఇన్చార్జ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ జి. విష్ణుమాధురి, డైరెక్టరేట్ శిక్షకులు మోహన్ రమణ, అమిత్ సింగ్, దీపక్ భరద్వాజ్, డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బండిఆత్మకూరు: హోటళ్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి రవిబాబు హెచ్చరించారు. మంగళవారం బండి ఆత్మకూరు బస్టాండ్ ఆవరణలో హోటళ్లను జిల్లా పౌర సరఫరాల అధికారులు తనిఖీ చేశారు. పలు హోటళ్లలో గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాణిజ్య కార్యకలాపాల కోసం తప్పకుండా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని జ్యోతి రవిబాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సివిల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.చదువుతోనే పేదరికం నిర్మూలన సంజామల: చదువుతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జగ్గయ్య అన్నారు. మండల కేంద్రం సంజామల ప్రభుత్వ హాస్టల్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పదో తరగతి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు వారి అభిప్రాయాల మేరకు చదివించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటూ ఎంతో మంది విద్యార్థులు ఐపీఎస్, ఐఎఎస్లు అయ్యారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ హాస్టల్ డోన్ క్లస్టర్ ఇన్చార్జ్ మునిరాజు, ఉపాధ్యాయులు బాషా తదితరులు పాల్గొన్నారు. మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మృతి నందికొట్కూరు రూరల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత గ్రామమైన మండల పరిధిలోని కొణిదేలలో మట్టిమిద్దె కూలి వృద్ధురాలు గ్రంధే లక్ష్మిదేవి(80) మృతి చెందిగా మరో మహిళకు గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలి పిన వివరాలివీ.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవికి ఇద్దరు కుమారులు సంతానం. ఉమ్మడి కుటుంబంలో కుమారులతో కలిసి జీవనం సాగిస్తోంది. ఇంటి పక్కనే మట్టి మిద్దెలో జిలాన్ నిర్వహిస్తున్న పిండి మిషన్ వద్ద జొన్నలు పిండి పట్టించేందుకు వృద్ధురాలు, కుర్వ సాలమ్మ కలసి వెళ్లారు. ఆ సమయంలో మట్టిమిద్దె కూలడంతో వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళ కుర్వ సాలమ్మ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నందికొట్కూరు ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఓర్వకల్లు: పొగాకు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఐటీసీ కంపెనీ ప్రతినిధులను కోరారు. మండల కేంద్రమైన ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఐటీసీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన మండల నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గిట్టుధర కల్పిస్తున్నారా? నాణ్యత బాగున్నప్పటికీ సీఆర్ పేరుతో తిరస్కరణకు గురి చేస్తున్నారా? అని తెలుసుకుంటూ.. రైతులతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఎక్కువ శాతం పొగాకు బేళ్లను సీఆర్ పేరుతో వెనక్కి పంపుతున్నారని, దీంతో రవాణా ఖర్చులు భరించలేక చాలా అవస్థలు పడుతున్నామని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది పొగాకు నాట్లు ప్రారంభంలోనే కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడం, రసాయన ఎరువులు, వ్యవసాయ కూలీలు ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో పెట్టుబడి పెరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఎన్నో నష్టాలు, కష్టాలు అధిగమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పంట నాణ్యత సరిగా లేదని, తేమశాతం ఎక్కువగా వుందని, రీబేల్ కట్టమని వెనక్కి పంపడం సబబు కాద న్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం బేళ్లను సీఆర్ చేయకుండా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ప్రైవేటు కంపెనీల ద్వారా పొగాకు రైతులు నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని కాటసాని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదని, పుష్కలంగా అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు రోడ్డెక్కారన్నారు. కాటసాని వెంట కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జీకే వెంగన్న, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, వైఎస్సార్సీపీ మండల నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గోపా రమణారెడ్డి, నాగతిరుపాలు, గోపా రామ్మోహన్రెడ్డి, రామేశ్వరరెడ్డి, హరినాథ్రెడ్డి, పుల్లారెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, మహేశ్వరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అధిక బేళ్లను ఐటీసీ అధికారులు కొనుగోలు చేయాలి తేమ శాతం పేరుతో వెనక్కు పంపొద్దు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి -
మూడు ఎకరాల్లో పైరు తొలగించాను
ఖరీఫ్ సీజన్లో ఎకరా రూ.15 వేలు కౌలు చెల్లించి మూడు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. రసాయన ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 10 వేలు వెచ్చించాను. గత ఏడాది అక్టోబర్ నెలలో తుపాన్ ప్రభావంతో పైరు దెబ్బతినడంతో పైరును పూర్తిగా తొలగించాను. ఆ స్థానంలో పప్పుశనగ పంట సాగు చేయాల్సి వచ్చింది. కందిసాగుతో పెట్టుబడుల రూపంలో నష్టం వాటిల్లగా రెండోసారి వేసిన పంటకు మరలా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది కంది పంట సాగులో పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు రూ. 20 వేలు చెల్లించి పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, సేద్యాల రూపంలో ఎకరాకు రూ. 22 వేలు, క్రిమి సంహారక మందుల పిచికారీకి రూ. 15 వేల చొప్పున పెట్టుబడుల రూపంలో ఖర్చు చేశాను. అధిక వర్షాలు, పొగమంచు కారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. కందికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. – మనోజ్కుమార్, రైతు, కంమపల్ల, కోవెలకుంట్ల మండలం ● -
‘సూర్యఘర్’ ప్రయోజనాలను వివరించండి
● ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్యనంద్యాల(అర్బన్): పేదలకు విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య అన్నారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యఘర్ ఏర్పాటులో ప్రస్తుతం నంద్యాల జిల్లా మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానం సాధించేలా అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కృషి చేయాలన్నారు. సూర్యఘర్ ప్రయోజనాలను వివరించడంతో పాటు పురోగతిని మెరుగు పరచడానికి వినియోగదారుల ఇళ్లకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు సకాలంలో సూర్యఘర్కు సంబంధించి సబ్సిడీ రుణాలు అందేలా చూడాలన్నారు. ఫీడర్ సోలరైజేషన్ను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ సుధాకర్కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరంలో ‘కరెంటోళ్ల జనబాట’ కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాల మండలం భీమవరం గ్రామంలో ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లో ఓల్టేజీ సమస్యలు, ఎత్తు తక్కువగా ఉన్న స్తంభాలు, తదితర వాటిని సీజేఎంకు స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కరించాలని అసిస్టెంట్ ఇంజినీర్ సుధాకర్ను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్యం, అసిస్టెంట్ లైన్మెన్ రాముడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్నంద్యాల: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యా లయంలో మంగళవారం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని సొత్తును రికవరీ చేయాలన్నారు. రికవరీ అయిన సెల్ఫోన్లను ప్రతినెల మొదటిరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బాధితులకు నేరుగా అందించాలన్నారు. రాబోయే లోక్ అదాలత్ సందర్భంగా కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాలేజీలు, వసతి గృహాలు, ఆలయాలు, చర్చి, మసీదు పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సమా వేశంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావళి, డీఎస్పీలు రామంజి నాయక్, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
● ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలకు చట్టపరధిలో న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ సునీల్ షెరాన్ వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీజేఆర్ఎస్లో 88 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.... ● తనకు నంద్యాల పట్టణంలోని నందమూరినగర్లో అధికారులు మూడు సెంట్ల స్థలం మంజూరు చేశారని, ఈ స్థలాన్ని మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆక్రమించుకొని దౌర్జన్యంగా రేకులు వేశారని షేక్వహీదాబీ ఫిర్యాదు చేశారు. ● తన వద్ద తొమ్మిది పొట్టేలను తీసుకుని డబ్బులు అడిగితే ఇవ్వకుండా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన పసులరాజు బెదిరిస్తున్నాడని, న్యాయం చేయాలని పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన ఓబులేసు కోరారు. పలువురు వైద్యులకు పదోన్నతి కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారికి పదోన్నతిపై బదిలీ స్థానాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో పనిచేస్తున్న డాక్టర్ కె.వెంకటేవ్వర్లు(బయోకెమిస్ట్రీ) కర్నూలుకు, అనంతపురంలో పనిచేస్తున్న డాక్టర్ పీవీ శ్రీనివాసకుమార్(కమ్యూనిటి మెడిసిన్) కర్నూలకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ జె.విజయలక్ష్మి(మైక్రోబయాలజి) మచిలీపట్నంకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ జి.రాధిక, డాక్టర్ ఆర్.ఎలిజబెత్రాణి(ఫిజియాలజి) అక్కడే పోస్టింగ్ లభించింది. కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ పీఎస్ అరుణలత(అనెస్తీషియా)కు విజయవాడ ఎంఎంసీకి, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ పి.హరికృష్ణకు కర్నూలులోనే, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజిలో పనిచేస్తున్న డాక్టర్ ఒ.శ్రీధర్(రేడియో డయాగ్నోసిస్)కు కర్నూలుకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి(రేడియేషన్ ఆంకాలజి), అనంతపురంలో పనిచేస్తున్న డాక్టర్ జె.ప్రశాంతి(రేడియేషన్ ఆంకాలజిలకు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు బదిలీ అయ్యారు. బార్ ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాల్టీ పరిధిలో బార్ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు రీ–నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ బార్ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మూడోసారి బార్ ఏర్పాటుకు లైసెన్స్ జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.5 లక్షలు తిరిగి చెల్లించని రుసుంతో ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కనిష్టంగా నాలుగు దరఖాస్తులు వస్తేనే 4వ తేదీ కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి లైసెన్స్ దారున్ని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈఎస్ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు 617 మంది విద్యార్థుల గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్–1, హిందీ, ఉర్దూ, అరబిక్, సాంస్కృతం పరీక్షలకు జిల్లాలో 617 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాలలో 14,359 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా 13,861 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1385 మందికిగాను 1266 మంది హాజరు కాగా.. 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వేధిస్తే చూస్తూ ఊరుకోం
● మైక్రోఫైనాన్స్ వేధింపులతోనే వైఎస్సార్సీపీ కార్యకర్త బలవన్మరణం ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు: మైక్రోఫైనాన్స్ వేధింపులతోనే వైఎస్సార్సీపీ కార్యకర్త కార్పెంటర్ రమణ బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళ్రెడ్డి నగర్లో వైఎస్సార్సీపీ కార్యకర్త రమణ మృతదేహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడారు. కార్పెంటర్ రమణ అల్లుడు గంగాధర్ మైక్రోఫైనాన్స్లో పనిచేస్తుండటంతో పలువురు అతడిని నమ్మి ఫైనాన్స్కు ఇవ్వాలని డబ్బులు చెల్లించారన్నారు. అయితే గంగాధర్ తమకు డబ్బులు చెల్లించడం లేదని మామ కార్పెంటర్ రమణను బెదిరించారన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేయడమేగాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. మైక్రోఫైనాన్స్ పేరుతో ఆత్మకూరు ప్రాంతంలో చాలామంది తిరుగుతున్నారని, ఇందులో రాజమండ్రి, వెస్ట్ గోదావరి ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉన్నారని శిల్పా తెలిపారు. ఆత్మకూరు ప్రాంతంలో ఆస్తులు తనఖా పెట్టుకుని రూ.100కు రూ.10, రూ.20 చొప్పున అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్నారు. చంపుతామని బెదిరింపులు తన అల్లుడు గంగాధర్ ఈ మైక్రోఫైనాన్స్లో పనిచేస్తున్న విషయం కార్పెంటర్ రమణ కూడా తెలియదని శిల్పా అన్నారు. అల్లుడు బదులు రమణ డబ్బులు చెల్లించాలని, లేకపోతే చంపుతామని బెదిరించారన్నారు. ఈ విషయమై డీఐజీతో మాట్లాడామన్నారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీతో డీఐజీ మాట్లాడి రమణపై బలవంతం చేయవద్దని చెప్పారన్నారు. అయినా కూడా డీఎస్పీ, పోలీసులు వేధించడం మానుకోకపోవడంతో పాటు రమణను పిలిపించి మందలించారన్నారు. ప్రజలే తరిమికొట్టాలి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హరివెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి తీవ్ర ఒత్తిళ్లు చేసి, టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల చేత ఒత్తిళ్లు చేయించడంతో కార్పెంటర్ రమణ ఆత్మహత్య చేసుకున్నాడని శిల్పా తెలిపారు. పోలీసులు, మైక్రోఫైనాన్స్ వారు రమణ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తే తాము సహించబోమని శిల్పా అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేయడమేగాక కేసులకు కూడా వెనుకాడబోమన్నారు. మైక్రోఫైనాన్స్ వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మైక్రోఫైనాన్స్వ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫైనాన్స్ వారి చేతిలో ఏ ఒక్కరూ కూడా మృతిచెందరాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శిల్పా వెంట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
ప్యాకెట్ పాలు తాగితే క్యాన్సర్ బారిన పడతామంటారు. బయట పాలు కొనుగోలు చేద్దామంటే గుర్తు పట్టలేని విధంగా కల్తీ చేస్తున్నారు. అసలు రోజూ తాగుతున్న పాలు మంచివేనా? తెల్లనివన్నీ పాలేనా? ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న దందా గొంతుల్లో ‘పాల’కూట విషం నింపుతోందా? అధికారు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లా జనాభాకు అనుగుణంగా రోజుకు 16 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లు మాత్రమే. ఈ అంకెలను చూస్తే వివిధ రూపాల్లో కల్తీ చేయడం ద్వారా డిమాండ్కు అనుగుణంగా పాలు సరఫరా అవుతున్నట్లు స్పష్టమవుతోంది. పాలు ఉత్పత్తి చేసే నిజమైన రైతుకు లీటరు మీద పొందుతున్న లాభం రెండు, మూడు రూపాయలైతే.. వాటిని కొంటున్న వ్యాపారులు కల్తీ చేయడం ద్వారా లీటరుకు రూ.10పైగా లాభం పొందుతుండటం గమనార్హం. గత ఏడాది జనవరి నెలలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అనంతపురం జిల్లాలో పాల కల్తీ గుట్టు రట్టయింది. పాలల్లో మాల్తో టెస్టిన్ పౌడర్, పామాయిల్ 250/500 ఎంఎల్, లీటరు పలుచని పాలు, ఉప్పు తీసుకొని మిక్సీకి వేస్తారు. ఇలా చేయడం వల్ల చిక్కటి లిక్విడ్ వస్తుంది. దీనిని ప్రతి 20 లీటర్ల పాలకు అర్ధలీటరు లిక్విడ్ను కలిపి మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం వెలుగు చూసింది. ఇలా కల్తీ చేయడం వల్ల పాలు చిక్కగా ఉంటాయి. వెన్న శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొంత మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలుకావడం కలకలం రేపుతోంది. రెండేళ్లలో ఏడు కేసులు 2024–25లో కర్నూలులోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్/డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లా మొత్తంగా పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి 15 శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ఇందులో 4 శాంపిల్స్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2025–26లో 15 శాంపిల్స్ తీయగా మూడింట్లో ఉన్నట్లు తేలింది. ఇవన్నీ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితిని చూస్తే కల్తీ పాలతో ప్రజారోగ్యం ఏస్థాయిలో దెబ్బతింటుందో అర్థమవుతోంది. అధికారుల ఉదాసీన వైఖరి ప్రజల ప్రాణాల మీదకొస్తోంది.ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లే..ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారం ప్రతి రోజు చిన్నారులు 500 ఎంఎల్, ఇతరులు 300 ఎంఎల్ పాలు, పాల పదార్ధాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా జనాభా నేడు 50 లక్షల పైనే. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం మొత్తం జనాభాకు దాదాపు 16 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 10 లక్షల లీటర్లు మాత్రమే. ఉమ్మడి జిల్లాలో 2,16,590 పశువుల నుంచి రోజూ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆవులు, బర్రెలు రోజుకు సగటున 4–5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ ప్రకారం రోజుకు 10 లక్షల లీటర్లు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల పాలు తక్కువ పడుతున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు డెయిరీలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఉన్న పాలనే కల్తీ చేస్తున్నట్లు సమాచారం. ఆందోళన కలిగిస్తున్న పాల నాణ్యత కలకలం రేపిన రాజమహేంద్రవరం ఘటన కల్తీ పాలతో పలువురు మృత్యువాత ఉమ్మడి జిల్లాకు 16 లక్షల లీటర్ల పాలు అవసరం అందుబాటులో ఉన్నది కేవలం 10 లక్షల లీటర్లే.. అధికారుల తనిఖీలు నామమాత్రం -
మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులకు వ్యక్తి బలి
ఆత్మకూరులోని వెంగల్రెడ్డినగర్కు చెందిన కార్పెంటర్ రమణ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రమణ అల్లుడు గంగాధర్ కూడా మామ వద్దే చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు. గంగాధర్ కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హరికృష్ణారెడ్డి నిర్వహిస్తున్న హరిహరనాథ్ మైక్రోఫైనాన్స్లో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అప్పులు ఇచ్చి, వసూలు చేయడం అతని పని. కాళహస్తిగౌడ్, ఉప్పరి శివ కూడా మైక్రోఫైనాన్స్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వసూలు చేసిన డబ్బును గంగాధర్ సక్రమంగా చెల్లించకుండా సొంతానికి వాడుకున్నట్టు తెలుస్తోంది. అందులో కొంత చెల్లించినా ఇంకా భారీగా అప్పు పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ వ్యాపారి నుంచి ఒత్తిళ్లు అధికమవడంతో గంగాధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో హరికృష్ణారెడ్డితో పాటు కాళహస్తిగౌడ్, ఉప్పరి శివ, మరో వ్యక్తి ఆచారి డబ్బు కోసం గంగాధర్ మామ రమణపై ఒత్తిడి చేస్తున్నారు. కాళహస్తిగౌడ్కు ఓ టీడీపీ ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులనూ రంగంలోకి దింపడంతో రమణ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. విధిలేని పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన కర్నూలులో డీఐజీని కలిసి మైక్రో ఫైనాన్స్ వేధింపులను వివరించారు. స్పందించిన డీఐజీ సంబంధం లేని విషయంలో రమణను వేధించవద్దని స్థానిక పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ మైక్రోఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు ఆగకపోవడంతో రమణ గత శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి రమణ సోమవారం మృతిచెందాడు. రమణ భార్య శారద ఫిర్యాదు మేరకు వెంకటకృష్ణారెడ్డితో పాటు కాళహస్తిగౌడ్, శివ, మరో వ్యక్తి ఆచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రీ ఓపెన్ అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులపై నమ్మకంతో ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తారని, వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 53 దరఖాస్తులు ఇంకా ఓపెన్ చేయలేదని, వాటిని తక్షణమే పరిశీలించాలన్నారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయన్నారు. అలాంటి అర్జీలపై సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం అందించాలని తెలిపారు. ఇంకా 2,455 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తిచేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చిన అర్జీలను కూడా అదే ప్రాధాన్యతతో పరిష్కరించడం అధికారుల బాధ్యతని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో స్టేట్ ఫుడ్ లేబొరేటరీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో స్టేట్ ఫుడ్ లేబొరేటరీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)తో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్) కింద అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.19.84 కోట్లను మంజూరు చేసింది. -
అంగన్వాడీల ఉద్యమ బాట
● ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు ● మార్చి 2న విజయవాడ అలంకార్ సెంటర్లో మహా ధర్నా కర్నూలు(అర్బన్): సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉద్యమ బాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా, నిర్లక్ష్యం చేయడంపై సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాజెక్టుల పరిధుల్లోని ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట దీక్షలను కొనసాగిస్తున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలను ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగించేందుకు ఆయా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో రిలే దీక్షలకు పిలుపునిచ్చారు. ఉద్యమ కొనసాగింపులో భాగంగా మార్చి 2వ తేదిన విజయవాడలోని అలంకార్ సెంటర్లో మహా ధర్నా చేపట్టేందుకు ఆయా సంఘాల నేతలు సన్నాహాలు ప్రారంభించారు. ఇవీ డిమాండ్లు.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, ఆయాలకు రూ.20 వేలు ఇవ్వాలి. ● సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టం అమలు చేయాలి. ● పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హెల్త్ కార్డులు ఇప్పించాలి. ● పెండింగ్లో ఉన్న మినీ వర్కర్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారిని మెయిన్ వర్కర్లుగా, మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ● పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయాలి. ● లబ్ధిదారులకు మెనూ చార్జీలను పెంచి నాణ్యమైన సరుకులను అందించాలి. ● మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలి. ● రకరకాల యాప్లను మెర్జ్ చేసి పనిభారాన్ని తగ్గించాలి. ● ప్రీ స్కూల్స్ బలోపేతం చేసి, వీరికి తల్లికి వందనం అమలు చేయాలి. ● ఐదు సంవత్సరాల లోపు పిల్లలను నిర్భంధంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలి. ● సాయంత్రం పిల్లలకు స్నాక్స్ అందించాలి. -
అమ్ముకోలేరు.. నిల్వ చేసుకోలేరు!
కోవెలకుంట్ల: రబీ సీజన్లో మొదటి పంటగా సాగు చేసిన పప్పుశనగ చేతికందటంతో కోత, నూర్పిడి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 53,801 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పైర్లలో ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు, తర్వాత సాగు చేసిన పైర్లలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడులు లభించాయి. ఈ ఏడాది పప్పుశనగ సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటారూ. 5 వేల నుంచి రూ. 5,300 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం క్వింటాకు రూ. 5,850 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు విక్రయించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. పొలాలు, కలాల్లోని దిగుబడులను ట్రాక్టర్ల ద్వారా నేరుగా గోదాములకు తరలిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 80 వేల బస్తాల నుంచి లక్ష బస్తాలు నిల్వ సామర్థ్యం గల దాదాపు 150 గోదాములున్నాయి. ఇప్పటికే ఆయా గోదాములు శనగ బస్తాలతో నిండి పోయాయి. గోదాముల్లో నిల్వ ఉంచుకున్న పంట ఉత్పత్తులకు ఆరు నెలలకు ఒక్కో బస్తాకు రూ. 70 ప్రకారం, ఆరు నెలలు దాటిన తర్వాత ప్రతి నెలా రూ. 10 ప్రకారం బాడుగ చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నీరు నిలిచి.. బీడువారి!
జూపాడుబంగ్లా/రుద్రవరం: ఖరీఫ్లో అధిక వర్షాలతో పంటలు పండక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పైసా నష్టపరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కార్ ఇప్పుడు కేసీ కాల్వకు సాగు నీటిని నిలిపివేసింది. దీంతో ఆయకట్టులో పంటలు ఎండిపోతున్నాయి. తుంగభద్రడ్యాం గేట్ల మరమ్మతులంటూ కేసీ కాల్వకు నీరు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ 2న జరిగిన జిల్లా సాగునీటి సలహామండలి సమావేశంలో కర్నూలు–కడప కాల్వకు రబీ పంటల సాగుకు నీటి సరఫరా విషయమై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. కేసీ కెనాల్ పరిధిలో 150 కిలోమీటర్ల వరకు 60 వేల ఎకరాల పొలం ఉంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం 82.30 నుంచి 150 కిలోమీటరు వరకు 20వేల ఎకరాల్లో ఆరుతడిపంటలైన మినుము, కంది, మొక్కజొన్న, జొన్న, నువ్వులు, పెసలు, తదితర పంటలను రైతులు సాగుచేసుకున్నారు. ఎకరాకు రూ.30వేల దాకా పెట్టుబడి పెట్టారు. మరో రెండు తడుల నీరు వస్తే దిగుబడి చేతికందుతుందన్న తరుణంలో కేసీ కాల్వకు సాగునీటిని నిలిపివేశారు. ఇప్పటికే వారం రోజులుగా నీరు రాకపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో పంటలు వాడుమొహం పట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే నీళ్లున్నా (శ్రీశైలం బ్యాక్ వాటర్) సాగుచేసిన పంటలకు పారించుకోలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల పరిధిలోని కేసీ ఆయకట్టు పొలాలకు సాగునీటిని ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీ కాల్వకు నీరు సరఫరా చేయకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర పంటనష్టం చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టం వాటిల్లితే చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తెలుగుగంగ కింద.. తెలుగుగంగ కాలువ కింద నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని చందలూరు రైతులు వందలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. తెలుగుగంగ ద్వారా చందలూరు చెరువును నీటితో నింపడంతో పంట పండుతుందని ఆశించారు. ఇప్పటికే ఒక్కో ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే కాల్వ ద్వారా సాగు నీరు అందకపోవడం, ఎండ తీవ్రంగా ఉండటంతో పొలాలు ఎండి బీటలు వారుతున్నాయి. తెలుగుగంగ కాల్వల ద్వారా రైతులకు సాగు అందుతుందా లేదా అని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తమకు ఈ పరిస్థితి నెలకొందని చందలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20వ బ్లాక్ కాల్వ ద్వారా సాగు నీరు అందకపోవడంతో దాదాపు 300 ఎకరాల్లో వరి పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. కేసీ కాల్వకు అకస్మాత్తుగా సాగునీటిని నిలిపివేయడం తగదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీరు నిలిపేస్తే పంటలు ఏం కావాలి. 11 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. రూ.6లక్షల పెట్టుబడి పెట్టాను. మార్చి వరకు సాగు నీరివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. – దొడ్డాసుధాకర్, రైతు, కనకయ్యకొట్టాల రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే వెంటనే కేసీ కాల్వకు సాగు నీరివ్వాలి. అధికారులు రబీపంటలకు సాగు నీరు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పి ఉంటే మేం పంటలు వేసేవాళ్లం కాదు. కేసీ కాల్వకింద 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. మార్చి వరకు నీరిస్తేనే పంట చేతికందుతుంది. లేకపోతే తీవ్రనష్టం కలుగుతుంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి వెంటనే సాగు నీరివ్వాలి. – నాగేంద్రగౌడు, రైతు, తూడిచెర్ల కేసీ కెనాల్ కింద రబీ పంటలకు అందని సాగునీరు తెలుగుగంగ కాలువ కింద ఇదే దుస్థితి పంటలు చేతికొచ్చే సమయంలో నీరు నిలిపివేసిన చంద్రబాబు సర్కారు సాగు నీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు -
ఉయ్యాలవాడ పోరాటం అజరామరం
● వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి కర్నూలు(అర్బన్): బ్రిటీష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం అజరామరమని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఏ క్యాంప్ కూడలిలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నగరం నుంచి ఓర్వకల్ విమానాశ్రయం వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వరకు భారీగా కార్ల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులని, రేనాటి సూర్యునిగా కొలవబడే ఆయన 1857 సిపాయిల తిరుగుబాటు కంటే పదేళ్ల ముందే బ్రిటీష్ దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి యువతకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. కార్పొరేటర్లు దండు లక్ష్మికాంతరెడ్డి, సుదర్శన్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవ మినీత్రెడ్డి, సంఘటన కార్యదర్శి తూముకుంట ప్రతాపరెడ్డి, నాయకు లు సంజీవరెడ్డి, ఇన్నెం రజనీకాంత్రెడ్డి, రమకాంతరెడ్డి, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
రెండేళ్లవుతున్నా హామీ నిలబెట్టుకోలేదు
మాకు సొంత భూమి నాలుగు ఎకరాలు ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. నాకు వ్యక్తిగతంగా తైవాన్ స్ప్రేయర్లు అవసరం ఉంది. వీటిని 50 శాతం సబ్సిడీపై వెంటనే పంపిణీ చేయాలి. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో వ్యక్తిగత పనిముట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లవుతున్నా ఈ హామీ నిలబెట్టుకోలేదు. నిజమైన రైతులను గుర్తించి యంత్ర పరికరాలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. – సయ్యద్ హుసేన్ బాషా, రామాపురం, తుగ్గలి మండలం -
మాట మార్చడం దారుణం
మాకు 25 ఎకరాల పొలం ఉంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తాం. గతేడాది అరకొరగా యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. సబ్సిడీ పోను బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వకుండా యాప్లు డౌన్లోడ్ చేసుకోండి.. అద్దెకు యంత్ర పరికరాలు తీసుకోండని సలహా ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చడం దారుణం. – పి.గోవిందు, హొళగుంద -
భక్తిశ్రద్ధలతో గురువైభోత్సవాలు
మంత్రాలయం: గురు వైభోత్సవాలు ఐదో రోజు శ్రీమఠంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాన్ని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి కుమారగౌడు దర్శనం చేసుకున్నా రు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. ఆయనకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్రం, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్ర జ్ఞాపిక అంజేశారు. ఐదో రోజు ప్రముఖులకు ప్రశస్తి అవార్డులు అందజేశారు. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాదు, సీనియర్ న్యాయవాది పి.రఘరాం పీఠాధిపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. -
కేసీకి తక్షణమే నీటిని విడుదల చేయాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిపగిడ్యాల: కేసీ కాల్వకు తక్షణమే కృష్ణా జలాలు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రమైన పగిడ్యాలలో కేసీ కాల్వను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీ ఆయకట్టు కింద రబీ సీజన్లో ఆరుతడి పంటలకు మార్చి చివరి వరకు సాగునీరు ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా డిసెంబర్లోనే నీటిని నిలిపేయడం దారుణమన్నారు. మార్చి చివరినాటి వరకు కాల్వకు సాగునీటిని విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రెండురోజుల్లో నీటివిడుదల చేయకపోతే పైర్లు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేసీకి నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్సీపీ అధ్వర్యంలో రైతులతో కలసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. రైతులు ఏటా సాగు కష్టాలను ఎదుర్కొంటు నష్టపోతున్నారన్నారు. ఆయన వెంట మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ పెరుమాల శేషన్న, నాయకులు ఉన్నారు. -
దిగువ అహోబిలంలో..
దిగువ అహోబిలంలో 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ పలికారు. శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనం చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహాదేసికన్, వేదపండితులు, అర్చక బృందాలు స్వస్తివాచనం పూజ లు చేశారు. అంతకు ముందు ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామిని ఉభయ దేవురులతో యాగశాలలో కొలువుంచి తిరుమంజనం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టనున్నారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులనే ఇన్విజిలేటర్లుగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షలకు జిల్లాలో మొత్తం 55 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మొదటి సంవత్సరానికి చెందిన విద్యార్థులు 15,443, ద్వితీయ సంవత్సరానికి 14,632 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షకు అర్ధ గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జోనల్, రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియెట్ కార్యాలయం వరకు పర్యవేక్షణ చేసేందుకు లైవ్స్ట్రీమ్ సదుపాయాలను కల్పించారు. పరీక్షలకు నిర్దేశించిన వేళకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను కల్పించారు. పరీక్షల నిర్వహణపై సిట్టింగ్ స్వాడ్ 8 మంది, ఫై్ౖలయింగ్ స్వాడ్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 300 మందిని నియమించారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర 144 సెక్షన్తో పాటు, అదనపు పోలీసు బంద్ బస్తూ ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ శంకర్నాయక్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని గోస్పాడు,నంద్యాల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. నేడు కలెక్టరేట్లోప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 23 తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వసతి గదుల నిర్మాణానికి రూ. 65 లక్షల విరాళం మహానంది: మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించనున్న 55 వసతి గదుల సముదాయంలో మొదటి అంతస్తు నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన ఎన్ఆర్ఐ వడ్లమూడి సరోజిని తన వంతుగా గతంలోనే రూ.1.25కోట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సీనియర్ అసిస్టెంట్ జగదీష్ల ఆధ్వర్యంలో రూ. 65 లక్షల చెక్కును అందజేశారు. దాత సరోజినికి అర్చకులు శివశంకర శర్మ, రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మలు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. -
దేవతలారా రారండి!
ఆళ్లగడ్డ: సత్యలోకానికి సంకేతంగా కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ ఆళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించే ధ్వజారోహణం.. తనువు, మన స్సు పులకించిపోతుండగా దేవదేవుడి వాహనమైన గరుత్మంతుని ద్వారా దేవతలను ఆహ్వానించే దేవతాహ్వానం కార్యక్రమాలు ఎగువ అహోబిలంలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుడి చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు దేవాలయం ఆవరణలో గరుత్మంతుని పల్లకీలో కొలువుంచి ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ మొదటి జియర్ ఆదివన్ శఠగోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేసి మంత్ర పూర్వకంగా పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణానికి ముక్కోటి దేవతలు వస్తారని విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలతో పాటు, సకుటుంబ సపరివార సమేతంగా తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా గరుత్మంతుడు కాపలా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రాత్రి ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో శాస్త్రోక్తంగా ధ్వజపటావిష్కరణ సింహ వాహనంపై విహరించిన జ్వాలా నరసింహుడు దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ -
అభివృద్ధి మరిచి.. పేరు చెరిపి !
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో నలువైపులా పలు పనులు చేపట్టారు. రహదారులు, పర్యాటకం, విద్యాలయాలు, ఆసుపత్రులు, మంచినీటి పథకాలు, మార్కెట్.. ఇలా ఎన్నో పనులు చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పలు అభివృద్ధి పనులకు మాజీ శాసనసభ్యులు బుగ్గన శేషారెడ్డి పేరును పెట్టారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో పాలకులు ఒక్క అభివృద్ధి ఇటుక కూడా వేయలేదు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు చేపట్టకపోగా గత వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని దాచే ప్రయత్నం చేస్తూ.. క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక కంబాలపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన బుగ్గన శేషారెడ్డి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పేరు మార్పునకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ ముఖ్యనేత సూచనతో ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రం బోర్డుపై ఉన్న బుగ్గన శేషారెడ్డి పేరును చెరిపేశారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా, పైనుంచి ఆదేశాలంటూ తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. అభివృద్ధిని విస్మరించి ఉన్నవాటికి పేర్లు మార్చడం, ఆ తర్వాత ప్రారంభించడం ఏమిటని స్థాని కులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణానికి చెందిన వివాహిత శిరీష మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని అమరావతి కాలనీకి చెందిన శిరీషను బండిమెట్ట కాలనీకి చెందిన చిన్నఈరన్న ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే గత రెండు నెలలుగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య శిరీష చిన్న ఈరన్నను ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చిన్నఈరన్న మూడు రోజుల క్రితం మందు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఈరన్న, రాములమ్మలు తమ కుమారుడికి ఏమైనా జరిగితే నీదే బాధ్యత అని శిరీషను హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష పట్టణంలోని రైల్వేస్టేషన్కు వెళ్లి చేతికున్న గాజులతో చేయిని కోసుకుని అపస్మారక స్థితిలో రైల్వే ట్రాక్పై పడింది. అక్కడున్న వారు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు స్పందించి శిరీషను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శిరీష కోలుకుంటోందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. శిరీష ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. కేసును స్థానిక పోలీస్స్టేషన్కు ఫార్వర్డ్ చేస్తామన్నారు. ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఒక కుట్టుమిషన్ దుకాణం, నా లుగు కూరగాయల దుకాణాలు దగ్ధమయ్యాయి. కూ రగాయల మార్కెట్లో సా విత్రి,ఈరమ్మల కూరగాయల దుకాణం పక్కన ఉన్న విద్యుత్ స్తంభం నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అవి దుకాణాలకు వ్యాపించాయి. మార్కెట్ నుంచి వెళ్తున్న వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు స్థానికలు ప్రయత్నించినా కాకపోవటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే పూర్తిగా కూరగాయాల దుకాణాలు కాలిబూడిదైపోవటంతో అందులో ఉన్న సరుకులు పూర్తిగా కాలిపోయాయి. అలాగే చిన్ననర్సోజీ అనే వ్యక్తి టార్పల్ కుట్టే మిషన్, వస్తువులు కాలిపోయాయి. మార్కెట్లోని సావిత్రి, ఈరమ్మ, రంగమ్మ, సుగుణమ్మ, నర్సోజీల దుకాణాలు కలిపి మొత్తం రూ. 3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. కూరగాయాలు అమ్ముకొని జీవనం సాగించేవాళ్లమని, ఇప్పుడు రోడ్డున పడ్డామని,ప్రభుత్వం అదుకోవాలని బాఽధి తులు కోరుతున్నారు. ఆలూరు రూరల్: పశుగ్రాసం కోసం జొన్నచొప్పను కటింగ్ మిషన్లో వేస్తున్న యువకుడి కుడి చెయ్యి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని మొలగవల్లి గ్రామ సమీపంలోని పొలంలో శనివారం ప్రమాదం చోటు చేసకుంది. వివరాలు..మండలంలోని కురువళ్లి గ్రామానికి చెందిన హరికృష్ణ పశుగ్రాసం కోసం జొన్న చొప్ప మిషన్ బాడుగుకు తీసుకుని పొలాల్లో జొన్న కంకలు కోసిన చొప్పను కటింగ్ చేసి సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మొలగవల్లి గ్రామ సమీప పొలంలో జొన్నచొప్పను మిషన్లో వేస్తుండగా ప్రమాదశాత్తు కుడిచేయి మణికట్టు వరకు తెగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కూలీలు బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిచారు. వైద్యపరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. -
వైద్యరంగంలో నిరంతర శోధన తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): వైద్యరంగంలో నిరంతర శోధన తప్పనిసరి అని, వైద్యశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు జరుగుతుండాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 55వ ఒస్సాపొకాన్–2026 రాష్ట్రస్థాయి సదస్సు శనివారం రెండోరోజుకు చేరుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. వైద్యరంగంలో పరిశోధనలు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఆర్థోపెడిక్ రాష్ట్రస్థాయి సదస్సు కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహించడం మంచి పరిణామన్నారు. ఆర్థోపెడిక్, మెడికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్, పేషంట్ సేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెండోరోజు కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య ప్రముఖులు పాల్గొని ట్రామా మేనేజ్మెంట్, స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ గాయాలు, పిల్లల ఆర్థోపెడిక్స్ వంటి అంశాలపై డిబేట్లు, పేపర్ ప్రజెంటేషన్లు, అధునాతన ప్రొసీజర్ల గురించి చర్చించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఒసాప్కాన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు డాక్టర్ అశోక్కుమార్, డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, సెక్రటరీలు డాక్టర్ ఇలియాస్ బాషా, కో చైర్మన్ డాక్టర్ రమణ, సైంటిఫిక్ కమిటీ డాక్టర్ రాజయ్య, డాక్టర్ అచ్యుత్రావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజేష్, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ ఎస్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వీసీ డాక్టర్ చంద్రశేఖర్ -
బస్సుల కొరత..ఆటోలే దిక్కు!
లింగంపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్న విద్యార్థులు హొళగుంద: మండలంలోని లింగంపల్లితో పాటు వందవాగిలి, ముద్దటమాగి, కోగిలతోట తదితర గ్రామాలకు అదనపు బస్సులతో పాటు వేళకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లింగంపల్లికి చెందిన దాదాపు 60 మంది విద్యార్థులు హెబ్బటం జెడ్పీ ఉన్నత పాఠశాలలో, అలాగే మరికొందరు హొళగుందలోని జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. హొళగుంద – ఢణాపురం రోడ్డు దారుణంగా ఉండటంతో ఇటీవల కాలంలో బస్సు సర్వీసులను తగ్గించడం, కండిషన్ లేని బస్సులు నడపడం తదితర కారణాలతో సమయానికి రాలేక పోవడం, కొన్ని బస్సులు చెడిపోతుండడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఒక్కో ఆటోలో 20 నుంచి 25 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగుచేసి వేళకు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు చూద్దాంరండి!
● నవ నారసింహ క్షేత్రం.. దినదిన ప్రవర్థమానం ● అడుగడుగున గుడి.. గుడిగుడికీ ఓ దేవుడు ● నాటి ‘అహోబలమే’ నేటి ‘అహోబిలం’ ● నేటి నుంచి ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు ● భారీగా హాజరుకానున్న భక్తజనం ఆళ్లగడ్డ: దేవలంతా ఒక్కటై ఇలపైకి వచ్చేందుకు ముహూర్తం సమీపించింది. శ్రీ అహోబిల లక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు ముల్లోకాల్లోని దేవతా మూర్తులంతా కదలి రానున్నారు. శ్రీమద్ అహోబిల బ్రహ్మోత్సవాలు అంటే స్వామిని కొలిచే ప్రతి ఇంటా పండుగే. నల్లమల్ల అడవిలో వెలిసిన ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువలో శ్రీ ప్రహ్లాదవరద మూర్తులు కొలువై ఉన్నారు. ఎగువలో ఈనెల 22వ తేదీ నుంచి, దిగువలో 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ప్రపంచలో ఏ వైష్ణవ క్షేత్రంలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒకే అలంకరణ, ఒకే వాహన సేవలు వరుసగా రెండు రోజుల పాటు కొనసాగించరు. ఒక అహోబిల క్షేత్రానికే ఇది ప్రత్యేకం. ముందు రోజు శ్రీ జ్వాలా నరసింహస్వామికి జరిగిన ఉత్సవం, అలంకరణ, వాహన సేవలు మరుసటి రోజు శ్రీ ప్రహ్లాదవరదస్వామికి నిర్వహించడం ఆనవాయితీ. ఎగువ, దిగువ దేవాలయంలో చుట్టూ మహా భక్తులైన ఆల్వార్లు కొలువై ఉన్నారు. వీరికి ముఖ్య వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీనరసింహస్వామితో పాటు ఈ మూర్తులకు పూజలు చేసుకుని భక్తులు పరమానందం పొందనున్నారు. రూపం ఉగ్రం.. మనస్సు శాంతం రాక్షస రాజైన హిరణ్యకశిపుణి రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకశపుణ్ణి సంహరించేందుకు లక్ష్మీనరసింహ స్వామి ఉక్కు స్తంభంలోంచి ఉద్భవించిన (చీల్చుకుని వచ్చిన) స్థలం అహోబిల పుణ్యక్షేత్రం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ని తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు ‘అహో బలం.. అహో బలం’ అని ప్రశంసించడంతో ఈ స్థలం అహోబిలం అయ్యింది. ఉగ్ర నరసింహస్వామిని పరమశివుడు ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ అనే నరసింహ మంత్రం జపించి శాంతింప జేసి శాంత స్వరూపుడిని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దిగువ అహోబిలం కొలువైన స్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు. ఎగువ అహోబిలంలో స్వామి జ్వాలా నరసింహుడై స్వయంభూగా అవతరించగా, దిగువ అహోబిలంలో శ్రీ వేకంటేశ్వరస్వామి చేత ప్రతిష్టించబడి ప్రహ్లాదవరదుడిగా కొలువై కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నవ నారసింహులు కొలువైన క్షేత్రం నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించాడు కనుక దీనిని నవనారసింహ క్షేత్రం అంటారు. అన్ని ఆలయాల్లో దేవతా విగ్రహాలు ఉన్నా .. ఆళ్వారులు దర్శించి దేవదేవుని స్తుతించిన వైష్ణవ క్షేత్రాలు కొన్నింటిని మాత్రమే దివ్య క్షేత్రాలు అని అంటారు. ఇలాంటివి ఇలపై 108 ఉండగా వాటిలో ప్రముఖమైనది అహోబిల క్షేత్రం. 6వ శతాబ్ధి నుంచి 12 మంది ఆళ్వారులలో ఒకరైన చివరి తిరుమంగ ఆళ్వార్ మంగళ శాసనం చేసినందున 10వ క్షేత్రమైంది. అందుకనే ఇక్కడ శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి సన్నిధి, కల్యాణ మంటపాలు కూడా ఉన్నాయి. స్వామి వారి కల్యాణానికి తిరుమల నుంచి పట్టు పీతాంబరాలు ఇప్పటికీ వస్తాయి. సుదర్శన పీఠం మీద గరుత్మంతుడు, ఆయన పైన స్వామి ఉన్నట్లు ఉంటుంది. తూర్పు ముఖంగా కొలువైన స్వామి చతుర్భుజుడై రెండు హస్తాలతో శంఖ, చక్రాలను ధరించగా, ఒక చేత్తో భక్తులకు అభయమిస్తూ, ఇంకొక చేతితో లక్ష్మీదేవిని పట్టుకుని ఉంటారు. శిరస్సు మీద ఆదిశేషుడు, మెడలో సాలగ్రామ మాలతో స్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు. అద్భుతమైన శిల్పకళతో అమృతవల్లీ అమ్మవారిని చూడవచ్చు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఎగువ అహోబిలంలో.. 22వ తేదీన ధ్వజారోహణం, భేరి పూజ, రాత్రి సింహ వాహనం 2న రథోత్సవం 3న చక్రస్నానం, ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణం 4న తీర్థవారి చక్రస్నానం దిగువ అహోబిలంలో.. 22వ తేదీన ఉత్సవాలకు అంకురార్పణం 23న ధ్వజారోహణం, భేరి పూజ, రాత్రి సింహ వాహనం 3న రథోత్సవం 4న చక్రస్నానం, ద్వాదశ ఆరాధనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణం -
నొస్సంలో దొంగల హల్చల్
సంజామల: దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీసు చెక్పోస్టు ఉన్న గ్రామంలోనే వరుస చోరీలకు పాల్పడ్డారు. నొస్సం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు ఏడు ఆలయాలు, రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని వినాయకుడి, సాయిబాబా, గంగమ్మ, పెద్దమ్మ, శివాలయం, పీర్లచావిడి, జమాలయ్య స్వామి దర్గా హుండీలను పగలగొట్టి సొమ్ము అపహరించారు. అంతేకాకుండా అదే గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న అబ్దుల్ షుకూర్ దుకాణం, మజూద్ హోటల్ చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీల్లో దాదాపు రూ. లక్ష నగదు, బియ్యం బస్తాలు అపహరించారు. నెల క్రితం మండలంలో విద్యుత్ తీగల చోరీలతో రైతులు బెంబేలెత్తారు. ప్రస్తుతం ఆలయాల్లో చోరీ జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆస్పరి: మండలంలోని శంకరబండ బస్టాప్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. మతిస్థిమితం సరిగా లేని, తెలుగులో మాట్లాడుతున్న ఈ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఆస్పరి సమీపంలో కనిపించాడు. ఆదోని వైపు నడిచివెళ్తుండగా గమనించారు. రాత్రి శంకరబండ బస్టాప్ సమీపంలో రోడ్డు వెంబడి వెళ్తున్న అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో పడిపోయడు. ఆదారి వెళ్లే వారు చూసి 108 వాహనంలో ఆదోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యలు సూచన మేరకు మైరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీగదిలో ఉంచినట్లు సీఐ తెలిపారు. మృతుడి శరీరంపై క్రీమ్ కలర్ పుల్ షర్టు, నీలం కలర్ లుంగి ధరించారన్నారు. శంకరబండ వీఆర్ఓ మాబుసుబానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి బొమ్మలసత్రం: నంద్యాల సమీపంలోని పొన్నాపురం రైల్వే ట్రాక్పై శనివారం ఓ బీటెక్ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల పట్టణంలోని బైటి పేటకు చెందిన రామేశ్వర్ రెడ్డికి ఇద్దరు సంతానం. రామేశ్వర్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు విజయ్ కుమార్రెడ్డి (22) కర్నూలు నగర శివారులోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి దుపాడు రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి నంద్యాలకు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దిగి అక్కడే చాలా సేపు సంచరించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పొన్నాపురం సమీపంలో స్థానికులు రైల్వే ట్రాక్పై యువకుడు మృతదేహం పడి ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విజయ్కుమార్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమా? ఆత్మహత్యా? మరేదైనా అనుమానాస్పద కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు మృతుడి స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీ య ఫీడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు పదును పెట్టే క్రీడ అని అన్నారు. నంద్యాలలో అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులపై ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి పెంచరాదని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక వికాసం కలుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతలకు రూ.3 లక్షల నగదుతో పాటు ట్రోఫీలు, పథకాలు, ప్రశంసా పత్రాలు ఆదివారం సాయంత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కళా శాల డైరెక్టర్ హేమంత్రెడ్డి, చీఫ్ ఆర్బిటర్ ఫణికుమార్, మణికంఠ, రాజారమేష్ చక్రవర్తి, సుజాత, కోచ్లు పాల్గొన్నారు. కర్ణాటక వాసి మృతి ఆదోని రూరల్: మండలంలోని 104 – బసాపురం సమీపంలో ఎల్లెల్సీ కాల్వ మరమ్మతు పనుల్లో ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి కర్ణాటక వాసి మృతి చెందాడు. ఇస్వీ ఎస్ మహేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఎల్లెల్సీ కాల్వ మరమ్మతులు పనులు చేసేందుకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా పూలబావి గ్రామానికి చెందిన బసప్ప (38)తో పాటు మరి కొందరు వచ్చారు. కాల్వ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో బసప్ప, మరో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. బసప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. శనివారం ఉదయం మృతుడి కుటుంబీకులు అక్కడికి చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి సర్దిచెప్పి బసప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య రేణుకమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
నమో.. నారసింహా!
● శ్రీ జ్వాలా నరసింహుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ● శాస్త్రోక్తంగా అంకుర హోమం ఆళ్లగడ్డ: అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి అంకుర్పారణ పూజలు చేశారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి పూలమాలలు వేసి, తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న పుట్టకు పూజలు నిర్వహించి పుట్టమన్నును సేకరించి మండపం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలను పోసి సోమకుంభ స్థాపన చేశారు. ప్రధానార్చకుడు వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్, సీఏఓ రామానుజన్ పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సోవాల్లో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భేరీపూజ కొనసాగుతుంది. మధ్యాహ్నం అభిషేకం, రాత్రి స్వామి సింహవాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు దిగువ అహోబిలంలో.. దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి పండితుల ఆధ్వర్యంలో అంకుర్పారణ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం
● కేసీ కెనాల్ వద్ద రైతుల ఆందోళననందికొట్కూరు: సకాలంలో పంటలకు సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్యాల గ్రామం వద్ద ఎండిపోయిన కేసీ కెనాల్ వద్ద రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు షరీఫ్, మధు, శివన్న, షాలు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ ఏడాది కేసీ కెనాల్ కింద మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు సాగుచేశామన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఈ నెల 12న కేసీ కెనాల్కు నీటిని బంద్ చేశారన్నారు. సాగునీరు మరో రెండు రోజుల్లో అందకపోతే పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలని కోరారు. మొక్కజొన్న కంకులు పాలు పడుతున్న సమయంలో సాగునీరు అందకపోతే ఎండిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. -
న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్ శిక్షణ
కర్నూలు: న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్పై రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. కంప్యూటర్ నైపుణ్యాల అభివృద్ధి, ఈ–కోర్ట్స్ ప్రాజెక్టు అవలోకనం, వీడియో కాన్ఫరెన్సింగ్ తదితర అంశాలపై న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగే ఈ–కోర్ట్స్ శిక్షణ కార్యక్రమానికి విజయవాడ అదనపు జిల్లా జడ్జి మాస్టర్ ట్రైనర్ జి.భూపాల్ రెడ్డి, కర్నూలు ఏఎస్సీజే ఎస్.ప్రతిమ, జూనియర్ సివిల్ జడ్జి బి.పల్లి తదితరులు హాజరయ్యారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు శిక్షణ కార్యక్రమంలో రెండు రోజుల పాటు పాల్గొంటారు. -
ఎలాంటి ధృవీకరణ లేకుండానే ప్యాకింగ్
వివిధ కంపెనీలు ఎలాంటి ధృవీకరణ లేకుండానే విత్తనాలు ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం విత్తనోత్పత్తి జరిగితే మండల వ్యవసాయ అధికారులు పంటలను తనిఖీ చేసి విత్తనం నాణ్యతను సర్టిఫై చేస్తారు. సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ అధికారులు కూడా విత్తనోత్పత్తి చేసిన పంటలను వివిధ దశల్లో పరిశీలిస్తారు. ఈ వివరాలను వ్యవసాయ శాఖ కమిషనర్కు సమర్పించి ప్యాకింగ్కు అనుమతి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా విత్తనోత్పత్తి నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. విత్తనోత్పత్తి వివరాలు వ్యవసాయ అధికారులకు ఇవ్వకపోయినా.. సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అందించాలి. ఇక్కడ కూడా ముడుపులు పుచ్చుకొని గుడ్డిగా సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): గిట్టుబాటు ధరలు లభించక, కనీసం మద్దతు ధర కూడా ఊరటనివ్వకపోవడంతో రైతులు విత్తనోత్పత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కంపెనీలు కనీస మార్గదర్శకాలు, నిబంధనలు పాటించకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. విత్తనోత్పత్తిలో పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాలను సంబంధిత కంపెనీలే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాయి. అంతా సవ్యంగా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విత్తనోత్పత్తిలో నేరుగా విత్తన కంపెనీలు రైతులు ముందుకు రావడం లేదు. సీడ్ కంపెనీల తరపున ఆర్గనైజర్లు(దళారీలు) రైతులకు, విత్తన కంపెనీలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వీరి ద్వారానే రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు తదితరాలను సరఫరా చేస్తారు. విత్తనోత్పత్తి ఏఏ మండలాల్లో జరుగుతోంది. ఏఏ కంపెనీలు ఏ పంటల్లో సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాయనే కనీస సమాచారం వ్యవసాయ శాఖ వద్దలేదు. నిబంధనల ప్రకారం విత్తన కంపెనీలు వివరాలను విధిగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో అందించాలి. రైతులతో అగ్రిమెంట్ చేసుకొని, కాపీ రైతులకు ఇవ్వాలి. సరఫరా చేసే విత్తనాలకు బిల్లులు తప్పనిసరి. అయితే విత్తన కంపెనీలు మార్గదర్శకాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మండలాల వారీగా దళారీలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే రైతులను గుర్తించడంతో పాటు రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఫలితంగా పంట దెబ్బతిన్నప్పుడు దళారీలు చేతులెత్తేస్తున్నారు. కంపెనీలు మాకు సంబంధం లేదని పత్పుకుంటున్నాయి. లోపాయికారీ ఒప్పందం 2025 ఖరీఫ్లో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేపట్టిన రైతులు గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టపోయారు. విత్తనం కారణంగానే పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తేల్చినప్పటికీ నష్టపోయిన రైతులను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉన్నతాధికారులు ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా విత్తనోత్పత్తి చేశారు, మీదే తప్పని చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీలకు, వ్యవసాయ శాఖ యంత్రాంగానికి లోపాయికారీ ఒప్పందం ఉండటం వల్లే ఈ పరిస్థితి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 50వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి విత్తనోత్పత్తిలో ఉమ్మడి కర్నూలు జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వరి, పత్తి, వేరుశనగ, కంది, శనగ, మొక్కజొన్న, జొన్న, మినుము తదితర పంటలతో పాటు కూరగాయల పంటల్లోనూ దశాబ్దాల తరబడి విత్తనోత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో విత్తనోత్పత్తి దారితప్పింది. వ్యవసాయ శాఖ చూసీచూడనట్లు పోతుండటంతో విత్తన కంపెనీలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. 50వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి జరుగుతున్నా ఏ ఒక్క వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులకు విత్తనోత్పత్తిపై కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. ఫిర్యాదుల వెల్లువ 2024–25లో మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 150 వరకు ఫిర్యాదులు వచ్చాయి. 2025–26 సంవత్సరంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు సబ్ డివిజన్లోనే మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి 52 ఫిర్యాదులు వచ్చాయి. నంద్యాల జిల్లా మొత్తంగా 180 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లా గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, క్రిష్ణగిరి, మంత్రాలయం, కోడుమూరు, దేవనకొండ, కౌతాళం తదితర మండలాల నుంచి మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మార్గదర్శకాలు పాటించని విత్తన కంపెనీలు వ్యవసాయ యంత్రాంగానికి కనీస సమాచారం కరువు సీడ్ ప్రొడక్షన్పై చూసీ చూడనట్లుగా వ్యవహారం దళారీల మాయలో నష్టపోతున్న రైతులు ముంచెత్తుతున్న నాసిరకం, నకిలీ విత్తనాలు -
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
● అటకెక్కిన ఐడీటీఆర్ నిర్మాణ పనులు ● రెండేళ్లుగా బిల్లులు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం ● ఉపాధి కోల్పోతున్న యువత పూర్తికాని వెహికల్ ట్రాక్టీడీపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ప్రతిష్టాత్మకమైన ఐడీటీఆర్ నిర్మాణం పనులు పూర్తయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని అడ్డుకుంటున్నారు. ఐటీడీఆర్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. వెంటనే పనులు పూర్తిచేయాలి. – దుగ్గిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్, దేవరబండ గ్రామం ఐడీటీఆర్ భవన నిర్మాణ పనులు పూర్తయితే సుశిక్షితులైన డ్రైవర్లు అందుబాటులోకి వస్తారు. తద్వారా జాతీయ రహదారులపై భారీ వాహనాల ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయి. వేలాది మంది నిరుద్యోగులకు ఏటా ఉపాధి లభిస్తుంది. – క్రాంతికుమార్, ఎంవిఐ, డోన్. నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడే ఈ ప్రాంతంలో చుక్క సాగునీరు అవకాశం లేదు. ఐడీటీఆర్ ఏర్పాటు నిరుద్యోగులకు గొప్పవరం లాంటిది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భవనాల అభివృద్ధి మందకొండిగా సాగుతోంది. –చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట డోన్: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్) కేంద్ర భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఏటా వేయి మంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సురక్షితులు, నైపుణ్యంతో కూడిన డ్రైవర్లు అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇప్పటివరకు 11వ ఐడీటీఆర్ల ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పొదిలి తర్వాత నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపంలో 44వ జాతీయ ర హదారి పక్కన రెండో ఐడీటీఆర్ను మంజూరు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.18.50 కోట్ల వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారంతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఐడీటీఆర్ ఏర్పాటుకు ఎనలేని కృషిచేశారు. నిధుల లేమితో పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మాట వాస్తవమే. అయితే ఇటీవల కాలంలో ఐటీడీఆర్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యా యి. త్వరలోనే శిక్షణకు అనువైన కేంద్రంగా ఇక్కడి ఐడీటీఆర్ విరాజిల్లుతుందనే నమ్మకం మాకు ఉంది. – శ్రీనివాసులయ్య, ఆర్అండ్బి డీఈఐడీటీఆర్ అడ్మినిస్ట్రేషన్ భవనం, భోజన, వసతి సదుపాయాల కోసం ఆధునిక హాస్టల్ భవనం పూర్తిచేయకపోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గత ప్రభుత్వం చేసిన 50 శాతం పనులు పూర్తి చేసింది. రెండేళ్లయినా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం దురదృష్టకరం. – శ్రీనివాసరెడ్డి, మల్యాల బిల్లులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు భారీ వాహనాల మరమ్మతులు చేయడంలో కూడా తర్ఫీదు ఇచ్చేందుకు ఐడీటీఆర్లో అన్నిరకాల అవకాశాలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గ నిరుద్యోగులకు ఐడీటీఆర్ ఏర్పాటు గొప్పవరం లాంటిది. ఇక్కడి వారే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వారు కూడా డ్రైవింగ్లో నైపుణ్యత సాధించి భారీ వేతనాలతో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు చెల్లించని కారణంగా ఐడీటీఆర్ భవనాల నిర్మాణం నిలిచిపోయింది. -
మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసం పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన చేశారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఉపకమిషనర్ రామాంజనేయులు ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రత సమష్టి బాధ్యత నంద్యాల: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. చెత్త, వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, వివిధ విభాగాల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో సిబ్బంది అందరూ ప్రతిజ్ఞ చేశారు. జాతీయ శిక్షణకు దివ్యాంగ విద్యార్థులు కోవెలకుంట్ల/చాగలమర్రి: జమ్మూ కాశ్మీర్లోని లడక్లో నిర్వహిస్తున్న పర్వతారోహణ జాతీయ స్థాయి శిక్షణకు దివ్యాంగ విద్యార్థులు మధు మనోజ్, కీర్తన ఎంపికయ్యారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.కోవెలకుంట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మధు మనోజ్ రెండునెలల క్రితం రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. చాగలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కీర్తన రాష్ట్రస్థాయి ఎంపికలో ప్రతిభ కనబరిచారు. ఈ నెల 23 నుంచి మార్చి3 వరకు లడక్లో జరిగే జాతీయస్థాయి శిక్షణకు హాజరుకానున్నారు. 1న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మార్చి 1న(ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ప్రధానంగా గ్రామీణ నీటి సరఫరా, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జెడ్పీ/మండల పరిషత్ అంచనా బడ్జెట్పై సమీక్ష కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు.. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, కేడీసీసీ, కేడీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ, కుడా, కురువ, వాల్మీకి, కుర్ణి – కరికాల భక్తల, విశ్వ బ్రాహ్మణ, బొందిలి వెల్ఫేర్ కార్పొరేషన్ల ఛైర్మన్లకు సమావేశానికి హాజరు కావాలని సమాచారాన్ని పంపినట్లు సీఈఓ తెలిపారు. మనోజ్కీర్తన -
అహోబిలంలో టీడీపీ ‘భూ’తాలు!
ఇక్కడ చెట్లు తొలగించి శుభ్రం చేసిన ఈ స్థలం అహోబిలం పోలీస్స్టేషన్ నిర్మాణానికి దేవస్థాన నిర్వాహకులు కేటాయించినది. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్లే బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ స్థలంపై గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కన్ను పడింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వెంటనే అక్కడున్న కంపచెట్లు తొలగించి మన్ను తోలుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ‘పోలీసు స్టేషన్ స్థలమే కబ్జా చేస్తావా’ అని అడగడంతో ఈ విషయం దేవస్థానం వారివద్దనే తేల్చుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థలం మైనర్ ఇరిగేషన్ పరిధిలోని మఠంవారి చెరువు (మఠమోల్ల చెరువు)ది. చెరువు బాగోగులు చూసుకునేందుకు కార్యాలయం ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులు కోరితే 282 సర్వేనంబర్లో రెండు ఎకరాలు కేటాయించారు. ఇది అన్యాక్రాంతమవుతూ 0.80 ఎకరాలే మిగిలింది. ఈ స్థలం విలువ రూ. కోటి పైనే ఉండటంతో గ్రామంలోని 20 మంది టీడీపీ నాయకులు కంచె ఏర్పాటు చేసుకున్నారు. అందులో షెడ్లు (బంకులు) వేస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బాడుగకు ఇస్తే నెలనెలా రూ. లక్షల్లో వస్తాయని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన అధికార పార్టీ నాయకులు జలవనరుల భూమికి ఎసరు పోలీస్ స్టేషన్ స్థలం స్వాహాకు సన్నాహాలు వారం రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నా కన్నెత్తి చూడని అధికారులు -
విద్యాలయాల వద్ద నిఘా పెంచాలి
● ఎస్పీ సునీల్ షెరాన్కొలిమిగుండ్ల: పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల వద్ద నిఘా పెంచాలని పోలీసులకు ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. అమ్మాయిలు ఆకతాయిల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్ల వద్ద లైటింగ్ సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. కొలిమిగుండ్ల, అవుకు పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిపై సీఐ రమేష్బాబు, అవుకు ఎస్ఐ అశోక్తో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మందుబాలులు బహిరంగ ప్రదేశాలతో పాటు పాఠశాలల వద్ద మద్యం సేవించకుండా పోలీస్ కానిస్టేబుళ్లతో తరచూ గస్తీ చేయించాలన్నారు. సైబర్ మోసాలపైప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొలిమిగుండ్లలో పోలీస్ సిబ్బంది ఉండే క్వార్టర్స్ శిథిలమయ్యాయని వాటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు హౌసింగ్ కార్పొరేషన్కు నివేదికలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. -
దండిస్తారా.. ప్రోత్సహిస్తారా!
శ్రీశైలం ప్రాజెక్ట్: టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. ఆడపిల్లలను బయటకు పంపాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలను సైతం దారుణంగా హత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన ఇటీవల కాలంలో అధికమయ్యాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుంటే.. ప్రశ్నిస్తామన్న పవన్కళ్యాణ్ సినిమా షూటింగ్లలో బిజీ అయిపోవడం గమనార్హం. ఎవరైనా అమ్మాయిలను వేధిస్తుంటే ఏం చేస్తారు, బాధిత కుటుంబానికి అండగా నిలిచి అందుకు కారణమైన యువకునికి చీవాట్లు పెడతారు. కానీ ఇది టీడీపీ ప్రభుత్వం, బాధిత కుటుంబానికి కాకుండా, వేధింపులకు గురిచేస్తున్న యువకుడికే వత్తాసు పలకడం వివాదానికి కారణమైంది. ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబ సభ్యులు సదరు టీడీపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన స్థానిక ఎమ్మెల్యే, యువకుడికి అండగా నిలిచిన టీడీపీ నేతను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించడం ఈ ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. వివరాలివీ.. లింగాగట్టు గ్రామంలో మత్స్యకార కుటుంబానికి చెందిన ఓ అమ్మాయికి టీడీపీకి చెందిన చిట్టిబాబు కుమారుడు నాని తరచూ మెసేజీలు పంపుతూ వేధిస్తున్నాడు. ఈ విషయమై అమ్మాయి బంధువులు స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో అబ్బాయి తరపున స్థానిక టీడీపీ నాయకుడు పోలయ్య వత్తాసు పలకడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి మాత గుడి సమీపంలో పోలయ్యపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన అతన్ని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆకతాయి తరపున వత్తాసు తీసుకున్న పోలయ్యను ఆసుపత్రికి వెళ్లి పరాామర్శించడం విమర్శలకు తావిస్తోంది. తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించలేకపోయినా ఎమ్మెల్యే, వేధింపులకు పాల్పడే వారికే అండగా నిలవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఇకపోతే అమ్మాయి తరపు కేసును పట్టించుకోని పోలీసులు, పోలయ్య కేసును మాత్రం ఆగమేఘాలపై స్వీకరించడం గమనార్హం. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందో ఇదే తాజా ఉదాహరణ. యువతికి ఆకతాయి వేధింపులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు అండగా నిలిచిన ఓ టీడీపీ నేత సహనం కోల్పోయి దాడికి పాల్పడిన అమ్మాయి బంధువులు ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే బుడ్డా -
తోడు‘నడక’గా..
చిన్న సమస్యలకే భార్యాభర్తలు గొడవపడుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండటాన్ని చూసి ఉంటాం. విడాకులు కావాలని కోర్టు ఎక్కేవారిని గమనించి ఉంటాం. భార్య అనారోగ్యం పాలైతే తన భుజాలపై మోస్తూ భిక్షాటన చేసేభర్త శుక్రవారం బేతంచెర్లలో కనిపించాడు. ఒక ఊరును చిరునామాగా చేసుకోకుండా బాటసారిగా తిరుగుతున్న ఈయన కథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆకలి తీర్చుకునేందుకు డబ్బుల్లేకున్నా.. నిద్రపోవడానికి కాసింత స్థలం కనిపించకపోయినా.. బంధువులు లేకున్నా ఈయన ధైర్యాన్ని వీడలేదు. నడవలేని తన సహచరికి ఈ లోకాన్ని చూపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇంతకష్టం ఎందుకు అని ప్రశ్నించగా ఆయన తన దీనగాథను చెప్పారు. ‘మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నా పేరు శ్రీను. నా భార్య పేరు లక్ష్మి. మేం 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు రెండుడున్నరేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టింది. పసిబిడ్డ ఐదు నెలల వయస్సులోనే అనారోగ్యంతో మృతి చెందింది. ప్రసవసమయంలో నా భార్య లక్ష్మి వెన్నుపూస వద్ద సమస్య వచ్చి నడవ లేని పరిస్థితి నెలకొంది. వైద్యం చేయించినా మార్పు లేకపోయింది. కూలి పనులు చేసే మా వద్ద డబ్బుల్లేవు. ఇల్లు కూడా లేదు. నా భార్య భుజాలపైన మోస్తూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఎవరైనా దానం చేస్తే తింటాం. లేదంటే పస్తులే. ఊరూరా తిరుగుతున్నాం. రాత్రి సమయంలో దేవాలయాలు, బస్, రైల్వే స్షేషన్లలో తలదాచుకుంటాం. ఇద్దరం తోడుగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది.’ అని వివరించారు. – బేతంచెర్ల -
కనులపండువగా తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో పాల్గుణ శుక్రవారం తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, పండితులు, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. తిరుచ్చి మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షల్లో 30 మంది విద్యార్థులు డిబార్ కర్నూలు(సెంట్రల్): రాయలసీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భారీ స్థాయిలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ దొరికిపోయారు. శుక్రవారం జరిగిన పరీక్షలో ఏకంగా 30 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. సోలార్ సమస్యలపై 1912కు కాల్ చేయండి కర్నూలు(అగ్రికల్చర్): సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం దిశగా ఏపీఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టిందని చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు అనేక సమస్యలు, అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోల్ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి వినియోగదారులు తాము ఎదుర్కొంటు న్న సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇంటరాక్షన్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఫోన్/మొబైల్ స్క్రీన్పై 5 అంకెను నొక్కి సోలార్ విద్యుత్ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జనన, మరణాలు నమోదు చేయించుకోండి కర్నూలు(హాస్పిటల్): జనన, మరణాలను 21 రోజుల్లో తప్పక నమోదు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 రోజుల్లో నమోదు చేయించుకుంటే ఉచితమన్నారు. ఆ తర్వాత నుంచి 30 రోజుల్లో నమోదుకు రూ.25 రుసుం చెల్లించాలని, అనంతరం ఏడా ది వరకు రూ.250 అపరాధ రుసుముతో పాటు అఫిడవిట్ అవసరమని పేర్కొన్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్నంద్యాల: పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ ఆదేశించారు. తన చాంబర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 18,510 మంది, ఒకేషనల్ విద్యార్థులు 6,268 మంది, ప్రైవేటు విద్యార్థులు 257 మంది పదోతరగతి పరీక్షలు రాస్తున్నారన్నార. మొత్తం 25,035 మంది విద్యార్థులకు 130 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్లుగా నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తక్షణమే పరిష్కరించేలా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం: 9515185150 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ సూర్యమౌళి, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తిచేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని గృహాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉగాది నాటికి 10,178 గృహాలను పూర్తిచేయాలన్నారు. ప్రస్తుతం 374 గృహాలు పూర్తయ్యాయని, బేస్మెంట్, లెంటల్, రూఫ్ లెవెల్లలో ఉన్న వాటిని ఉగాది నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద మంజూరైన 2,348 గృహాల్లో 584 గృహాలకు గ్రౌండింగ్ పూర్తయ్యిందని, మిగిలిన 1,630 గృహాలకు ఫిబ్రవరి నెలాఖరులోగా శాతం వంద గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. చెంచు కాలనీల్లో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన 556 గృహాలలో 302 గృహాలు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన 254 గృహాలకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరైన 26,609 యూనిట్లలో 12,616 పూర్తి కాగా, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 3,409 యూనిట్లను వేగవంతం చేయాలని, ఇంకా ప్రారంభం కాని 8,679 యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టి మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద మంజూరైన 12,715 గృహాలలో 8,112 పూర్తయ్యాయని, మిగిలిన 4,603 గృహాలకు సంబంధించిన ఖాతా వివరాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. -
బ్రహ్మోత్సవాల్లో మల్లన్న ఆదాయం రూ.5.61కోట్లు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు రూ.5.61కోట్ల ఆదాయం లభించింది. గురువారం చంద్రవతి కల్యాణ మండపంలో ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. గత 13 రోజులలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.5,61,81,535 లభించినట్లు శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. పలు విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించినట్లు ఈఓ చెప్పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో హుండీ లెక్కింపు చేపట్టారు. పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
పావనం.. పట్టాభిషేకం
● వైభవంగా బంగారు పాదుకల అభిషేకం ● ఆకట్టుకున్న బంగారు రథోత్సవం మంత్రాలయం: వేద మంత్రోచ్ఛారణలు.. భక్తి కీర్తనలు.. మంగళవాయిద్యాలు.. అశేష భక్తజనుల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి గురు భక్తి వైభవోత్సవాలు కనుల పండవగా సాగాయి. వైభవోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో రాఘవేంద్రుల పాదుక పట్టాభిషేకం నిర్వహించారు. తొలుత శ్రీ మఠంలో బంగారు సింహాసనంపై పాదుకలను కొలువుంచి ముత్యాలు, బంగారు నాణేలు, పుష్పాలతో ప్రత్యేక అభిషేకం చేపట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని బంగారు కవచాలతో అలంకరణ చేసి పీఠాధిపతి హారతులు పట్టారు. శ్రీమఠంలో గోపూజ చేపట్టారు. రమణీయంగా రథయాత్ర వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల పాదుకలకు బంగారు రథయాత్ర చేపట్టారు. ముందుగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పాదుకలకు హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. శ్రీమఠం అధికారుల బంగారు రథాన్ని ప్రాంగణంలో లాగారు. అశేష భక్తజనం మధ్య రథయాత్ర నిర్వహించారు. పూలు, అరటి ఆకులతో శ్రీమఠం ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు ఉత్సవమూర్తిని ఊరేగించారు. యజ్ఞశాల ప్రారంభోత్సం శ్రీమఠంలో యజ్ఞహోమాలు, పూజలు చేసేందుకు నిర్మించిన యజ్ఞశాల శిలాఫకాన్ని ఊంజల మండపంలో శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రారంభించారు. యజ్ఞశాల గ్రౌండు, ఫస్ట్ఫ్లోర్ను బెంగళూరుకు చెందిన కేఎం నాగరాజు కుటుంబ సభ్యులు నిర్మించి ఇచ్చారు. యజ్ఞశాలను నిర్మించి ఇచ్చిన దాతకు శ్రీమఠం పీఠాధిపతి శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు, రాఘవేంద్రులస్వామి జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్లు ఎస్కె.శ్రీనివాసులు, వెంకటేష్జోషి, శ్రీపతిఆచార్, శ్రీమఠం ఇంజినీర్ సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు. స్వామి పాదుకలను భక్తులకు చూపిస్తున్న శ్రీమఠం పీఠాధిపతి -
అహోబిలం చేరుకున్న పార్వేట పల్లకీ
ఆళ్లగడ్డ: పార్వేట మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ముగించుకుని గురువారం అహోబిలం చేరుకున్న శ్రీ జ్వాలా నృసింహ స్వామి, ప్రహ్లాదవరద స్వాములకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉత్సవమూర్తులను దేవాలయ సన్నిధికి తోడ్కొని వచ్చారు. పార్వేటకు బయలుదేరి 33 రోజుల తరువాత ఉత్సవమూర్తులు అహోబిలం వస్తుండటంతో పండుగ వాతవరణం నెలకొంది. తెల్లవారుజామునే గ్రామస్తులందరూ కులమతాలకు అతీతంగా పుణ్యస్నానాలు ఆచరించి పొలిమేర వద్ద మామిడి తోరణాలు కట్టి సంబరాలు జరుపుకున్నారు. పొలిమేర హద్దు నుంచి దేవాలయం వరకు రహదారి వెంట ఆవుపేడతో కల్లాపు చల్లి మహిళలు రంగవల్లులు వేసి తమ భక్తిని చాటుకున్నారు. ప్రాయశ్చిత్య హోమం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నృసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములకు పండితులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాయశ్చిత్య లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేష పుష్పాలంకకరణ గావించిన ఉత్సవమూర్తి శ్రీజ్వాలా నృసింహస్వామిని పల్లకీలో కొలువుంచి ఎగువ అహోబిలం తోడ్కొని వచ్చి దేవస్థానంలో కొలువుంచారు. పూజల్లో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయన్, సీఏఓ రామానుజన్ పాల్గొన్నారు. -
ముగిసిన అహోబిలేశుడి పార్వేట ఉత్సవం
రుద్రవరం:అహోబిలేసుడి పార్వేట ఉత్సవం బుధవారంతో ముగిసింది. ఉత్సవమూర్తులైన శ్రీజ్వా లా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారు పల్లకీ ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాలు 33 రోజల పాటు పర్యటించి చివరి మజిలీ అయిన రుద్రవరానికి చేరుకుంది. మూడు రోజల పాటు గ్రామంలోని పలు కాలనీల తెలుపులపై ఉత్సవమూర్తులు పూ జలందుకున్నారు. చివరి రోజున రుద్రవరంలోని బెస్తకాలనీకి ప ల్లకీ చేరుకోగా ఆ కాలనీ వాసులు మేళ తాళాలు పూల వర్షం కురిపిస్తు స్వాగతం పలికారు. అక్కడ విశేష పూజలందుకున్న అనంత రం రాత్రి ఆనవాయితీ ప్రకారం పల్లకీని బోయిలు కాలి నడకన మోస్తూ మండలంలోని హరినగరం సమీపంలో ఉన్న హరేరామ హరేకృష్ణగోశాల వద్దకు చేర్చారు. -
● మాజీ మంత్రి బుగ్గన చొరవతో ప్యాపిలిలో సెంట్రల్ లైటింగ్ పనులు ● ప్రారంభించేందుకు టీడీపీ నేతలు సిద్ధం ● విస్మయం వ్యక్తం చేస్తున్న డోన్ నియోజకవర్గ ప్రజలు
టీడీపీ నేతల ‘సెంట్రల్’ క్రెడిట్ చోరీ డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై, పూర్తయిన పనుల క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రారంభోత్సవాలు చేయడం టీడీపీ నేతలకు షరా మామూలుగా మారింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద 2024 మార్చి 24న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్యాపిలికి సెంట్రల్ లైటింగ్ సిస్టంను కేటాయించి, పూర్తి చేయించారు. అయితే ఈ క్రెడిట్ను చోరీ చేసేందుకు టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. డోన్ మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ కింద చిరు వ్యాపారుల కోసం ప్లాట్ఫారంతో పాటు ఫ్లైఓవర్ సుందరీకరణ కోసం రూ.కోటిని మాజీ మంత్రి బుగ్గన మంజూరు చేయించిన విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తుచేస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఓవర్హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేసి, పైపులైన్ల నిర్మాణాలను పూర్తిచేయడమే కాక బేతంచెర్ల పట్టణానికి గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా శుద్ధజలాన్ని మాజీ మంత్రి బుగ్గన అందించారు. దీనిని కూడా తమ ఘనతగా చెప్పుకునేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసి స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు తప్ప నయాపైసా కూడా డోన్ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్వయంగా టీడీపీ నాయకులే చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
లైన్మ్యాన్కు ఉత్తమ పురస్కారం
బేతంచెర్ల: పట్టణానికి చెందిన విద్యుత్ లైన్మ్యాన్ నాగరాజ శేఖర్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి7న దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే లైన్మెన్ దివాస్ వేడుకలో ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రజలకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది. లైన్మ్యాన్ నాగరాజ శేఖర్ను విద్యుత్ ఏడీ మధుసూదన్ రెడ్డి, ఏఈలు శ్రీనివాసులు, శివన్న, సిబ్బంది అభినందించారు. ఉర్దూ స్కూళ్ల పనివేళలు మార్పు నంద్యాల(న్యూటౌన్): రంజాన్ నెల సందర్భంగా ఉపవాసం పాటించే విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం జిల్లాలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో పనివేళలు మార్పు చేసినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఉర్దూ మాధ్యమ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లను ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పనివేళలు రంజాన్ నెలలో అమలవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇస్లాం మతాన్ని ఆచరించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రతి రోజు పని దినంలో సాధారణ ముగింపు సమయానికి ఒక గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అహోబిలేశుడి సేవలో టీవీఎస్ చైర్మన్ ఆళ్లగడ్డ: శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని టీవీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల్లో భాగంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దిగువ అహోబిలం క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం మఠం చేరుకుని పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి నంద్యాల: జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విపత్తుల నిర్వహణ సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ అందించడంతో పాటు ప్రమాద సూచికల బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి యూనిట్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించే బాధ్యత గల సిబ్బందిని నియమించి, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలైన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతి కార్మికునికి స్పష్టంగా తెలిసేలా ఉండాలన్నారు. దుగ్గిరాలలోని టర్మరిక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేవడానికి సుమారు 25 రోజులు పట్టిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని అగ్రి సోల్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల మండలం ఊడుమాల్పురం ప్రాంతంలోని ఎస్పీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శ్రీశైలం.. పుష్పశోభితం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల చివరిరోజు బుధవారం శ్రీశైలంలో స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు. తొలుత అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల నృత్యప్రదర్శనలు అకట్టుకున్నాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు. ఇందులో పలు రకాల సుగంధ పుష్పాలను వినియోగించారు. ఉత్సవమూర్తులకు అద్దాల మండపంలో(శయమందిరం)లో శయనోత్సవం నిర్వహించి ఏకాంతసేవ జరిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు వివిధ రకాల వాహనసేవలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. -
‘అలవి’గాని అక్రమాలు!
● అలవి వలలతో చేపల వేట ● అధికారులతో కుమ్మకై న వేటగాళ్లు ● పట్టించుకోని మత్స్యశాఖ అధికారులు నందికొట్కూరు: కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేట చేస్తున్నారు. ఈ వలలో చేపపిల్లలు పడి చనిపోతున్నాయి. అయినా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు నెలల క్రితం 63 లక్షల చేప పిల్లలను కృష్ణానదిలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, మత్స్యశాఖ జిల్లా అధికారులు వదిలేశారు. ఇవి వృద్ధి చెందకుండా కొందరు అలవి వలలతో చేపల వేట చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణానది తీరంలో చేప పిల్లలను వదిలిన రెండు నెలలు గడవక ముందే వాటిని చంపేస్తూ రూ. కోట్ల ఆదాయం పొందుతున్నారు. టీడీపీ నాయకులకు, అధికారులకు వాటాలు ప్రతి నెలా అందుతునట్లు విశ్వసనీయ సమాచారం. చేపలు పట్టేందుకు వైజాక్, కాకినాడ ప్రాంతాల నుంచి వ్యాపారులు అడ్వాన్స్లు ఇచ్చి తీసుకొస్తారు. సెప్టంబర్ నుంచి మార్చి నెల వరకు కృష్ణానదిలో వేట సాగిస్తారు. వ్యాపారులు మేసీ్త్రకి నెలకు రూ. 12 వేలు, మిగతా చేపలు పట్టే వారికి నెలకు రూ. 10 వేలు ఇస్తారు. వ్యాపారులు అలవి వలలతో చేపలు పడుతుంటే మత్స్యశాఖ అధికారులు స్పందించడం లేపదు. కృష్ణానది చేపలకు భలే గిరాకీ ఉండేది. వీటిని కర్నూలు నుంచి రైల్లో తరలిస్తున్నారు. ఎండు చేపలను కలకత్తాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలవి వలలతో వేటగాళ్లు చిరు చేపలను చంపేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరిపి మత్స్యశాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అలవి వలలతో చేపల పట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే దీక్షకు కూర్చొంటా. – జనార్దన్గౌడ్, శాతనకోట, నందికొట్కూరు మండలం -
హామీలను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ అన్నట్లు ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కొన్నింటికి అరకొర నిధులను కేటాయించి మరికొన్నిటికి నిధులను కేటాయించక పోవడం దారుణం. సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ సక్సస్ అంటున్నారే గానీ లబ్ధిదారులకు మాత్రం అరకొరగానే అందుతున్నాయి. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టి పథకాలను నీరుగార్చడం సరికాదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – వీరారెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి,ఆదోని -
ప్రణాళిక నీరసించి.. ఏకాగ్రత చెదిరి
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘పది’ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక పేరుతో సుమారు రెండు నెలలుగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారే కానీ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు.ఆళ్లగడ్డ: జిల్లా వ్యాప్తంగా మొత్తం 206 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో ఈ ఏడాది 11,252 మంది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల్లో ఎలాగైనా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో ప్రతి రోజూ ఉదయం 8 నుంచి, సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ మోడల్ పరీక్షలు పెడుతున్నారు. సామర్థ్యాలను గుర్తిస్తూ వెనుకబడిన విద్యార్థులపై మరింత ఒత్తిడి తీసుకువస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం 6 గంటల వరకు స్కూల్లో ఉండాలి. దూర ప్రాంత పిల్లలు ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 7, 8 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 12 గంటలు పాఠశాల లో సాధారణ తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, అసైన్మెంట్లు, ప్రిపరేషన్ పరీక్షలు రాయడంతో విద్యార్థులు నీరసించి పోతున్నారు. విద్యార్థుల క్షేమం దృష్ట్యా రోజుకు ఓ సారైనా స్నాక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతు న్నారు. అనేక మంది నీరసించి అస్వస్థతకు గురువుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమ్రాతం పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.చదువులతో కుస్తీ.. ఆకలితో సుస్తీప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల అర్ధాకలి గురించి పట్టించుకోవడం లేదు. వంద రోజుల ప్రణాళిక సజావుగా సాగుతుందా లేదా అని అధికారులు తనిఖీలు చేస్తున్నారే కానీ విద్యార్థుల ఆకలి కేకలు ఎవరీ పట్టడం లేదు. విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క మధ్యాహ్నం భోజనం మాత్రమే తిని ఎలా చదువుకుంటారని ఆలోచించడం లేదు. వసతి గృహాల సౌకర్యం ఉన్న కేజీబీవీ, గురుకుల, ఏపీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు మాత్రం ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి స్నాక్స్ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు సమకూర్చుతోంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రం ఒక్క పైసా విదల్చలేదు. కనీసం దాతల సహాయం తీసుకోండి అని కూడా అధికారికంగా చెప్పకపోవడంతో పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఏమీ చేయలేక పోతున్నారు. ఫలితంగా విద్యార్థులు నీరసించి అనారోగ్యం పాలవుతున్నారు.సార్.. ఆకలి!విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థుల పరిస్థితిని చూసి కొందరు ఉపాధ్యాయులు కొంత మేరైనా స్నాక్స్ అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నా.. ఎవరూ స్పందించడం లేదు. దీంతో మనకెందుకులే అని కొందరు ఉపాధ్యాయులు చందాల రూపంలో బిస్కెట్లు తదితర వాటిని అందజేస్తున్నారు. కొందరు విద్యార్థులు ‘సార్ ఆకలి’.. అవుతోందని అడిగితే మధ్యాహ్నం భోజనం సమయంలో ఇచ్చే చిక్కీలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అటువంటి పిల్లలను చూస్తే బాధేస్తుందని, అయినా ఏమి చేయలేని పరిస్థితి తమదని అనేక మంది ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
● బాలోత్సవాలు ప్రారంభంనంద్యాల(న్యూటౌన్): స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో మంగళవారం బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు అంశాలపై ఆలోచించే ప్రదర్శనలు చేపట్టారు. ప్రారంభ కార్యక్రమానికి డీఈఓ జనార్దన్రెడ్డి, ఎంఈఓలతో పాటు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు రాకేష్రెడ్డి, క్రాంతి, మౌలాలిరెడ్డి, భాస్కర్ తది తరుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రారంభ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. పాఠశాలల్లో పాఠాలు వినడమే కాకుండా ఆట పాటల్లో ఆనందంగా గడపాలని, అప్పుడే చక్కగా చదవగలుగుతారన్నారు. రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటున్నారనార్రు. శాస్త్ర సాకేంతిక రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో మూడ విశ్వాసాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు వాస్తవ పరిస్థితులను గమనించాలన్నారు. విద్యార్థులు బట్టి చదువులకు బలైపోతున్నారని, వాటి నుంచి విముక్తి పొందడానికి ఈ కార్యక్రమాలు దోహదపడుతాయ న్నారు. మొదటి రోజు వ్యాసరచన, చిత్రలేఖనం, కథా రచన, కవితారచన, ఏకపాత్రాభినయం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి, విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మౌలాలి, గురుస్వామి, భగత్ సింగ్ గ్రంథాలయ ట్రస్ట్ చైర్మన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యాఘ్ర వాహనంపై మహానందీశుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వరస్వామి మంగళవారం వ్యాఘ్ర వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చెస్ శాప్ లీగ్ పోటీలు ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని స్థానిక క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి చెస్ శాప్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలన్నారు. చెస్ పోటీల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు శాతం క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి చెస్ లీగల్ కార్యదర్శి విశ్వనాథ్, రామసుబ్బారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు పాల్గొన్నారు. 96.3 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ గోస్పాడు/నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రలను మంగళవారం 96.3 శాతం పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్, జూని యర్, డిగ్రీ కళాశాల, అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ అయిన చిన్నారులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. జిల్లాలో 4,38,475 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా 4,22,271 మందికి మాత్రలను అందజేశామని డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు. నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలతోనే సాధ్యమని తెలిపారు. వైద్య సిబ్బంది కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. మిగిలిపోయిన వారికి ఈనెల 24న మాప్అప్డే సందర్భంగా మాత్రలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యా శాఖ అధికారి జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డాక్టర్ కాంతరావునాయక్, లక్ష్మీప్రసన్న, కోటిరెడ్డి, ఎంఈఓలు బ్రహ్మయ్య, శివరాంప్రసాద్, చిత్రలేఖ, గుర్రప్ప, తదితరులు పాల్గొన్నారు. పంట పొలాల్లో మోటార్ల తీగలు చోరీ ● రూ. 5 లక్షలకు పైగా నష్టం మహానంది: అరటి తోటల్లో గెలలు అపహరించే కేటుగాళ్లు రూటు మార్చారు. ఈ సారి పొలాల్లోని విద్యుత్ మోటార్ల వద్ద కేబుల్ తీగలను చోరీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. మహానంది మండలం తెలుగుగంగ పదో బ్లాక్ కింద రైతులు అరటి సాగు చేస్తున్న పంట పొలాల్లో సుమారు 70 మోటార్ల వద్ద కేబుల్ వైర్లు అపహరించారు. సుమారు రూ. ఐదు లక్షలకు పైగా విలువ చేసే తీగలను ఎత్తుకెళ్లారని బాధిత రైతులు బోడెద్దుల రమేష్, శ్రీనివాసులు తదితరులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఏర్పాటు చేసుకోవాలంటే అదనపు ఖర్చు అని, పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుల నుంచి తీగలను రికవరీ చేయాలని కోరుతున్నారు. -
ఒక్క రూపాయీ.. ఇవ్వలేదు
ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెతిచ్చారు. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఇంత వరకు రూ. ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఈ రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం లేక వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉంటున్నాను. వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాలేదు. అప్పుల పాలవుతున్నాం. – షేక్ ఇమామ్ హుస్సేన్, పట్టభద్రుడు, జీనేపల్లె, శిరివెళ్ల మండలం -
సాయంత్రానికి నీరసం వస్తోంది
మా ఊరు నుంచి స్కూల్ కు రావాలంటే ఉదయం 7 గంటలకు బస్సు వస్తుంది. ఆ బస్సుకు రావాలంటే ఆరు గంటలకే రెడీ అయి బస్టాండ్కు రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో పక్కకు కదలకుండా సారొళ్లు కోర్చో పెట్టి చదివిస్తున్నారు. ఉదయం ఇంటి దగ్గర పొద్దున్నే ఏదీ తినబుద్ది కాదు. మధ్యాహ్నం, పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని రాత్రి ఇంటికి వెళ్లే సరికి నీరసం వస్తోంది. – శిరివెన్నెల, మందలూరు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మా ఊరు నుంచి స్కూల్కు రావాలంటే ఉదయం 6.45 గంటలకే బస్సు ఉంది. ఆ బస్సు తప్పిపోతే మరో బస్సు లేదు. దీంతో ఆరు గంటల నుంచి బస్సు కోసం రోడ్డుపై నిలబడి 8 గంటలకు అంతా స్కూల్కు చేరుకుని వెంటనే స్పెషల్ క్లాసులో కూర్చుని చదువుకుంటాం. ఒక్కోరోజు ఇంటికి చేరుకునే లోపు 7.30 – 8 గంటలు అవుతుంది. అప్పటికే నీరసించిపోయి మళ్లీ ఇంటి దగ్గర పుస్తకం తీసినా దృష్టి పెట్టలేక పోతున్నాం. – నాగఅంజలి, చందలూరు, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ఆళ్లగడ్డ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మూడు పూటలా తప్పనిసరిగా కడుపు నిండా తినడంతో పాటు సాయంత్రం సమయంలో అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే మనస్సు నిమగ్నం చేసి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అర్ధాకలితో చదివితే ఏమాత్రం ఫలితం ఉండదు. ఆకలిని చంపుకుని చదువుకుంటూ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – డాక్టర్ ఆంజనేయులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు -
శాస్త్రోక్తంగా చండీశ్వరునికి త్రిశూల స్నానం
● సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి క్రతువులు పూజల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు, ఆలయ చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు, అర్చకులుపుష్కరిణిలో త్రిశూలస్నానం శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించిన శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవ యాగాలకు మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు ఉత్సవ ముగింపు క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు మంగళవారం స్వామివారి యాగశాలలో వేదపండితులు చండీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపా రు. పూర్ణాహుతిలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సు గంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు వంటి పూజాద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతి గా సమర్పించారు. వసంతోత్సవంలో అర్చకులు, పండితులు వసంతాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. చండీశ్వరుడికి సరస్వి పుష్కరిణి వద్ద ఆగమశాస్త్రబద్ధంగా స్నానాదికాలు జరిపారు. చివరిగా త్రిశూలస్నానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాల ముగింపు సూచికంగా మొదటిరోజు బ్రహ్మోత్సవ ప్రారంభ సూచికంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణంలో స్వామిఅమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించిన భ్రమరాంబాదేవికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి దంపతులు, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల చివరి రోజు బుధవారం సాయంత్రం భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. ధ్వజపటాన్ని -
కమనీయం.. కల్యాణం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశుడి దంపతులకు కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత మహానందీశ్వరుడికి లింగోద్భవం కాలంలో మహారుద్రాభిషేకం పూర్తయిన అనంతరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఆలయ అర్చకులు, రుత్వికుల బృందం ముందుగా నూతన వధూవరులను అలంకార మండపం నుంచి తీసుకొస్తూ రాజగోపురం ముందు ఎదురుకోళ్లు ఉత్సవం చేపట్టారు. కల్యాణవేదిక వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచన, మాంగల్య ధారణ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. గుండంపాడు, గుండుపాపల గ్రామానికి చెందిన వారు స్వామి, అమ్మవారి తరఫున పెళ్లిపెద్దలుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో ఆర్డీఓ విశ్వనాధ్, కళావేదిక నిర్మాణ దాత పోగుల మహేశ్వరరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
● ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులకు చెక్ ● ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మాత్రల పంపిణీ ● 1 నుంచి 19వ వయస్సు లోపు పిల్లలందరికీ ● నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. మాత్రలు తీసుకున్న తర్వాత ఏవిధమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలు తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలి. – కాంతారావునాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆల్బెండజోల్ మాత్రల డోస్ ఇలా.. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర(200 ఎంజీ) నీటిలో కలిపి తాపాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 ఎంజీ మాత్రను మధ్యాహ్నం భోజనం తరువాత చప్పరించేలా చూడాలి. మింగకుండా వైద్య సిబ్బంది పర్యవేక్షించాలి. ఏదైనా పరిస్థితుల దృష్ట్యా మంగళవారం మాత్రలు తీసుకోని వారు ఉంటే వారి కోసం మాప్ అప్ డే రోజున ఈనెల 24వ తేదీ మరోమారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రలు అందజేయనున్నారు. గోస్పాడు: చిన్నారులను పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల కడుపులో చేరి మెలిపెడుతూ పిల్లల్లో పేలతనం, నీరసం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తరచూ కనిపిస్తుంటోంది. ఈ పురుగులు రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. సహజంగా తలెత్తే ఈ సమస్య పరిష్కారానికి ఏడాదికి రెండు సార్లు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మంగళవారం (ఈనెల 17న) జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం రోజున అంగన్వాడీలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాలు, 3318 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా గుర్తించారు. వీటి పరిధిలో 1–2 ఏళ్ల లోపు పిల్లలు 35,163 మంది, 2–19 సంవత్సరాల లోపు పిల్లలు 4,03,312 మంది పిల్లలు కాగా మొత్తంగా 4,38,475 మంది పిల్లలు ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. -
సహకార సంఘాల్లో స్తంభించిన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమ్మె కారణంగా ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాల్లో అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు బ్రాంచ్ల ఎదుట పీఏసీఎస్ల సీఈఓలు, ఇతర ఉద్యోగులు బైఠాయించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు కృష్ణానగర్లోని డీసీసీబీ బ్రాంచ్ ఎదుట జరిగిన నిరసనలో ఉమ్మడి జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక అధ్యక్షుడు హరిఫ్ బాషా మాట్లాడారు. డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని, సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. -
చమురు నిక్షేపాల కోసం బోరుబావులు
● ఆందోళనలో రైతులు దొర్నిపాడు: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో రెండు రోజుల నుంచి పంటపొలాల్లో బోరుబావులు తవ్వుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్, పెట్రోల్ వంటి చమురు నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లు తవ్వకాలు చేస్తున్నవారు చెబుతున్నారు. 60 మీట్లర్ల ఒకటి చొప్పున 100 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. ప్రస్తుతం శనగ పంటకోతలు జరుగుతుండగా మరో వైపు బోరుబావులు వేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రైతులకు సమాచారం ఇవ్వకుండా త మ పొలాల్లో బోర్లు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 20 చోట్ల బోర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై దొర్నిపాడు తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ.. చమురు నిక్షేపాల కోసం ఓఎన్జీసీ అధికారులు గతంలోనే వచ్చారని, తవ్వకాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్జీలను గడువులోగా పరిష్కరించండి ● జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 100 దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖలకు సరైన విధంగా కేటాయించాలని సూచించారు. నిర్ణీత సేవా ప్రమాణాల గడువు (ఎస్ఎల్ఏ) దాటి పోకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 34 దరఖాస్తులు స్వీకరించామన్నారు. దృష్టి పోర్టల్పై శిక్షణ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక డిప్యూటీ డీఈవో ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఐడీఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్లకు, ఐఈఆర్టీహెచ్ఐ, ఎమ్మార్లకు దృష్టి పోర్టల్పై మూడు రోజుల శిక్షణ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నూతన విద్యా విధానం అమలు చేయడానికి సమగ్ర శిక్ష రూపొందించిన దృష్టి పోర్టల్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. డిప్యూటీ డీఈవో శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి భవిత కేంద్రాల్లో ఐఈఆర్టీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐడీఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్లు సమగ్ర శిక్ష అందించిన ట్యాబ్లలో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యా బోధన చేయాల్సి ఉంటుందన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ జస్నా, బ్రీజిత్ మరియా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి, మాధవీలత, ప్రసన్న కుమార్, శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఆందోళనలో కేసీ ఆయకట్టు రైతులు
● కృష్ణా జలాల ఎత్తిపోతల నిలిపివేతపగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ నుంచి కేసీ కాలువకు శ్రీశైలం బ్యాక్వాటర్ కృష్ణా జలాల సరఫరా నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. హొస్పేట్లోని తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో కేసీ కాలువకు గత నెలలో నీటి సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేసీ ఆయకట్టు కింద రబీ సీజన్లో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు నీటి విడుదల కొనసాగించాలని పట్టుబట్టారు. వారం రోజుల పాటు రైతులు ఆందోళనలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం దిగిరాలేదు. అయితే వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్ ఆధ్వర్యంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఎట్టకేలకు బాబు ప్రభుత్వం దిగి వచ్చి గత నెల 24వ తేదీ నుంచి మల్యాల లిఫ్ట్ నుంచి ఒక మోటార్, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి మూడు మోటార్లను రన్ చేసి కృష్ణా జలాలను కేసీ కాలువకు సరఫరా చేశారు. అయితే ఈనెల 13వ తేదీ నుంచి మల్యాల లిఫ్ట్ మోటార్లను నిలిపివేయగా, 15వ తేదీన ముచ్చుమర్రి మోటార్లను పూర్తిగా ఆపేయడంతో కేసీలో నీటి మట్టం అడుగంటిపోయింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈఈ వీరమ్మను వివరణ కోరగా.. మల్యాల నుంచి ఒక టీఎంసీ, ముచ్చుమర్రి నుంచి ఒక టీఎంసీ నీటిని కేసీ కాలువకు సరఫరా చేశామని, మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరణపై ఎటువంటి ఆదేశాలు లేవన్నారు. నీటి సరఫరా నిలిపివేయడంతో 0 నుంచి 150 కి.మీ. వరకు ఉన్న ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్చి చివరి వరకు కేసీకి నీటి సరఫరా కొనసాగితేనే ప్రస్తుత పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
మయూర వాహనంపై మహానందీశ్వరుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం ఉదయం మయూర వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి మహానందీశ్వరస్వామి దంపతులు నంది వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం మధ్య గ్రామోత్సవం కనులపండుగగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పూజల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, రుత్విక్కులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అలాగే రూ. 15 లక్షల విలువైన సూట్రూమ్ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన యలమంచిలి సాంబశివరావు, సుజాత దంపతులు రూ. లక్ష విరాళం అందించారు. -
పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..
లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన హస్తినాపురం వాసి ఫృధ్వి సుబ్బారావు స్వామివారికి పాగాలంకరణ చేశారు. ఈ పాగా గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవ నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. మొత్తం సుమారు 10 పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. -
నిత్యం పర్యవేక్షణ
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆదివారం వేకువజామున నుంచి ప్రారంభమైన దర్శనాలు నిరంతరాయంగా కొనసాగేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించారు. కలెక్టర్ రాజకుమారి గనియ, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ సునీల్ షెరాన్ నిత్యం ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ దేవస్థానం సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ కనిపించారు. క్యూలలో వృద్ధులు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకొని కలెక్టర్, ఎస్పీ, జేసీ సంయుక్తంగా సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితులను తెలుసుకుంటూ వైర్లెస్ సెట్ల ద్వారా అక్కడ అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించారు. -
నేటి నుంచి ‘సహకార’ నిరాకరణ
● నిరవధిక సమ్మె ప్రకటించిన సహకార సంఘాల ఉద్యోగులు ● జిల్లాలోని 99 సహకార సంఘాల్లో నిలిచిపోనున్న అన్ని రకాల సేవలు కర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులను పలుసార్లు కలసినప్పటికి ఫలితం కనిపించలేదు. గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ ఎదుట సుదీర్ఘంగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మె చేపట్టినట్లు ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరీఫ్ బాషా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు చేరుతోంది. ఈ సమయంలో రికవరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పడితే రికవరీలు నిలిచిపోనున్నాయి. రుణాల పంపిణీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె లోకి వెళితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇవీ డిమాండ్లు.. ● జీవో 36 ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ● వేతన సవరణ కార్యరూపం దాల్చేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. ● పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. ● రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ● ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి. ● బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా సంఘాల ద్వారానే రుణాలు పంపిణీ చేయాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. ● కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి. -
కేసీ కాల్వకు నీటి పంపింగ్ నిలిపివేత
● ఆందోళనలో రైతులు జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కర్నూలు–కడప కాల్వకు అధికారులు నీటి పంపింగ్ నిలిపి వేశారు. తుంగభద్ర డ్యాం మరమ్మతు పనుల్లో భాగంగా కేసీ కాల్వకు జనవరి 17 నుంచి సుంకేసుల నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. రబీలో సాగు చేసిన పంటలకు సాగునీరివ్వకపోతే పంటలు ఎండి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆందోళన చేశారు. దీంతో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కాల్వకు 5 టీఎంసీల నీటిని సరఫరా చేయటానికి ప్రభుత్వం అనుమతులివ్వటంతో జనవరి 25 నుంచి కేసీ కాల్వకు అధికారులు నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఆదివారం నాటికి ఐదు టీఎంసీల నీటి పంపింగ్ పూర్తికావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం పంటలు సాగు చేసి రెండు మాసాలు కాగా పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాల్వ కు సాగునీటి సరాఫరా నిలిపేస్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్య లు తీసుకొని కేసీ కాల్వకు మార్చి నెలాఖరుదాకా సాగునీటిని సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నేడు కలెక్టరేట్లోప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 16 తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖలో డిప్యూటేషన్లు! ● అవసరం లేకపోయినప్పటికీ పైరవీల ద్వారా బదిలీలు కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద ఎత్తున పైరవీలు చేసి డిప్యూటేషన్(ఆన్డ్యూటీ)పై బదిలీలు చేయించుకునే సంస్కృతి వ్యవసాయ శాఖలో ఎక్కువగా ఉంటోంది. కర్నూలు మండలం ఎదురూరు ఫామ్కు ఒక ఏఓ, ఒక ఏఈఓ, ఒక ఆఫీసు సబార్డినేటు పోస్టు ఉంది. ఎప్పుడూ లేని విదంగా ఇక్కడ డిప్యూటేషన్పై ఆరు నెలలుగా ఆదనంగా మరో ఏఓ పనిచేస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ డిప్యూటేషన్పై బదిలీ చేశారనే చర్చ జరుగుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష కేంద్రానికి ఒక ఏవో పోస్టు మాత్రమే ఉంది. అదనంగా మరో ఏఎ డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) దాదాపు నిర్వీర్యమైంది. ఆత్మలో కూడా ఒక ఏఓ డిప్యుటేషన్పై కొనసాగుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో టెక్నికల్ ఏవో పోస్టులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అయితే ఆన్డ్యూటీపై అదనంగా నలుగురు ఏఓలు పనిచేస్తున్నారు. డీఆర్సీలో ఇద్దరు ఏఓలు ఆన్డ్యూటీపై పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్డ్యూటీపై పనిచేస్తున్న వారందరూ కొనసాగించే విధంగా పైరవీ చేస్తుండగా.. మరికొంత మంది ఏఓలు ఆన్డ్యూటీపై బదిలీల కోసం పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్య సంఘాలు బలోపేతం కావాలి కర్నూలు(సెంట్రల్): ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వేదికను ఇతర జిల్లాలకు విస్తరింపజేయాలని నిర్ణయించారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో దశాబ్ధి సదస్సును రోజా రమణి అధ్యక్షతన నిర్వహించారు. కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విశ్వాసాలు వేరైనా ప్రజా వ్యతిరేక విధానాలపై వేదిక స్పందిస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత భేషజాలతో పార్టీలు, సంఘాలు విడిపోతున్నాయన్నారు. భిన్న రాజకీయ విశ్వాసాలు కలిగిన సంఘాలు, సంస్థలు పదేళ్లుగా వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. విప్లవ రచయితల సంఘం బాధ్యుడు పాణి మాట్లాడారు. కార్యవర్గ సభ్యుడు రత్నంఏసేపు గతేడాది వేదిక కార్యకలాపాలు, ఆర్థిక నివేదికను సమీక్షించారు. -
తెల్లశనగల ధర పతనం
దొర్నిపాడు: కాబూలి(తెల్లశనగల)రకానికి మంచి గిరాకీ ఉందని ఎర్రశనగల(జేజే11)ను తగ్గించి విస్తారంగా సాగుచేశారు. దిగుబడులు వచ్చిన వేళ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రెండేళ్ల క్రితం క్వింటా రూ.7వేల నుంచి రూ.9వేల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.5,500 ధర లభిస్తోంది. విత్తనాల సమయంలో క్వింటా రూ.9వేలు వెచ్చించి కొనుగోలు చేసిన రైతులు పండించిన పంటను కల్లాల్లో నిల్వ ఉంచుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి సంజీవయ్య కృషి నంద్యాల: అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతిని శనివారం నిర్వహించారు. దామోదరం చిత్రపటానికి డీఆర్ఓతో పాటు కలెక్టరేట్ ఏఓ సుభాకర్ రావు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ... కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవమయ్య కష్టకాలంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారన్నారు. ముఖ్యమంత్రిగా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మాఫియాను అరికట్టాలి కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న క్లినిక్ల నుంచి కార్పొరేట్ హాస్పిటళ్ల వరకు..గల్లీ మందుల దుకాణాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల వరకు కమిషన్ల దందా కొనసాగుతుండడంతో పేద ప్రజల నడ్డి విరుగోతోందన్నారు. నామ మాత్రపు సేవలకు కూడా రూ.వేలలో బిల్లులు వేసి మాఫియా సభ్యులు పంచుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, లెనిన్బాబు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు మహేష్, శ్రీనివాసరావు, ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న పాల్గొన్నారు. మహాధర్నాను విజయవంతం చేయండి కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 20వ తేదీన తాడేపల్లిలో నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శిసి.గురుశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం చాకలి ఐలమ్మ కార్యాలయంలో న్యూసిటీ కార్యదర్శి సి.శేషాద్రి, అధ్యక్షుడు రాముడు, ట్రేజరర్ శ్రీనివాసులు, ఓల్డ్సిటీ కార్యదర్శి జయమ్మతో కలసి ఆయన మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రజకులకు అట్రాసిటీ తరహాలో రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమయ్యారని చెప్పారు. -
పరమేశ్వరుని వరమే!
● ఫృథ్వీ సుబ్బారావు ‘మా కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా మల్లన్న పాగాలంకరణ సేవలో తరిస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుని వరమే’ అని ఫృథ్వీ సుబ్బారావు అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం మల్లన్నకు లింగోద్భవకాలంలో జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉందని ఆయన చెప్పారు. ‘సాక్షి’తో శనివారం ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మా ఇంటి పెద్దలు దైవంగా కొలిచే మల్లన్నకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వయంగా నేసిన పాగాను అలంకరించేవారు. మొదట మా ముత్తాతాతయ్య కందస్వామి, ఆ తరువాత మా తాత సుబ్బారావు, మా నాన్న వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఇప్పుడు నేను స్వామివారికి పాగాలంకరణ చేస్తున్నాను. మా పూర్వీకుల నుంచి 70ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో నేస్తాం ‘మాది బాపట్ల జిల్లా చీరాల వద్ద హస్తినాపురం. నా భార్య ఫృథ్వి దుర్గ, చెల్లెలు మల్లీశ్వరి అందరం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నాం. స్వామివారికి పాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేస్తాం. గతంలో ప్రతిరోజూ ఒక మూర చొప్పున ఏడాది పాటు 365 రోజులు 365 మూరలు నేసేవారు. ప్రస్తుతం కార్తీకమాసం నుంచి పాగా నేతను ప్రారంభించాం. శివరాత్రికి పది రోజుల ముందే 300 మూరలు పూర్తి చేశాం. పాగాలంకరణ సేవ సందర్భంగా దేవస్థానం మాకు అతిథ్యం ఇస్తుంది. కోట్లాది మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం మేం చేసుకున్న అదృష్టం.’ -
సేవాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం: సాధారణ భక్తులతో పాటు శివ స్వాములు తలనీలాలను సమర్పించుకోవడానికి వస్తారని, కళ్యాణకట్టలో విధి నిర్వహణలో ఉన్నవారు సేవాభావంతో వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. పాతాళగంగ రోడ్డు మార్గంలోని దేవస్థానం కళ్యాణకట్టను శనివారం సాయంత్రం ఆమె సందర్శించారు. గుండు చేయడానికి ఎంత రుసుం చెల్లించారు, అధికంగా ఏమైనా వసూలు చేశారా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అధిక రుసుం చెల్లించలేదని వారు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం సూపరిండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పాతాళగంగ వద్ద అప్రమత్తంగా ఉండాలి
శ్రీశైలం: పాతాళగంగ వద్ద విధులు నిర్వహించే పోలీసులు, అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. పాతాళంగంగ మెట్ల మార్గంలో స్నానఘట్టాల వద్దకు చేరుకొని అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి నుంచే పాతాళగంగలో పుణ్యస్నాలాచరించుకోవడానికి వేల సంఖ్యలో శివస్వాములు భక్తులు మెట్ల మార్గం ద్వారా వస్తారని తెలిపారు. విడతల వారీగా భక్తులను స్నానఘట్టాల వద్దకు పంపించాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మైకుల ద్వారా సూచనలు జారీ చేయాలని సూచించారు. పాతాళగంగలో బోట్ విహారానికి వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా భక్తుల భద్రతపై నిఘానేత్రలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు 84,000 మంది స్వామివార్లను దర్శించుకున్నారని, వీరిలో 32,543 మంది శివ స్వాములు ఉన్నారని చెప్పారు. క్షేత్ర వ్యాప్తంగా భక్తుల భద్రత దష్టిలో ఉంచుకొని డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. -
తప్పొకరిది.. శిక్షొకరికి!
ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం(ఎన్ఎస్టీఆర్ ప్రాజెక్ట్ టైగర్) ఫీల్డ్ డైరెక్టర్ బి.విజయకుమార్ను ఉన్నఫళంగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టుమని ఐదు నెలలు గడవక మునుపే శుక్రవారం ఆయనను బదిలీ చేస్తూ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే అటవీదళాల ప్రధాన అధికారి పీసీసీఎఫ్ చలపతి ఎదుట రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా సీఎఫ్ కాశీ విశ్వనాథరాజుకు ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అయితే శ్రీశైలంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను బలిపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలంలో ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు శ్రీశైలం ఆలయ ఈఓ, పాలకవర్గం మీనమేషాలు లెక్కించడంతోనే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు లాఠీచార్జికి దారి తీయడం భక్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అద్దం పట్టింది. తప్పులను సరిదిద్దుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం, తప్పంతా అటవీ శాఖపై నెట్టి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీ విజయకుమార్ బదిలీయే ఇందుకు నిదర్శనం. అటవీ మార్గంలో పాదయాత్రకు ఈనెల 8 నుంచి ఏడు రోజుల పాటు మాత్రమే అవకాశం కల్పించడం వల్లే శ్రీశైలంలో భక్తుల రద్దీకి కారణమైందనే కోణంలో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. పులుల అంచనా కేంద్రం నిర్ణయం జాతీయ ప్రొటోకాల్లో భాగంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు పులుల అంచనా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత అటవీ శాఖపైనే ఉంటోంది. అప్పటికీ శివ భక్తుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. ఫలితంగా రెండు రోజుల ముందు నుంచే వెంకటాపురం నుంచి భక్తుల పాదయాత్ర మొదలైంది. అయితే కేంద్రం పరిధిలోని నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ శాఖ అధికారిపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. శ్రీశైలం ఘటన నేపథ్యంలో స్థానచలనం? వాస్తవంలోకి వెళితే.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీని అంచనా వేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇదే సమయంలో సామాన్య భక్తులు, శివస్వాములను కాదని ప్రోటోకాల్ దర్శనాలు, వీఐపీల సేవలోనే శ్రీశైలం ఈఓ, పాలక వర్గం తరించడం వల్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. క్యూలైన్లలో, ఎండలో గంటల తరబడి నిల్చోబెట్టిన ఫలితంగా శివస్వాముల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ విషయంలో ఆత్మ విమర్శను పక్కనపెట్టి తప్పంతా అటవీశాఖదే అన్నట్లుగా చర్యలకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. -
నివురు గప్పిన పేరూరు
రుద్రవరం: ‘అధికారం మాది.. దేవుడి ఉత్సవమైనా మేము చెప్పినట్లు జరగాల్సిందే’నని ఓ టీడీపీ నేత హుకుం జారీ చేయడంతో పేరూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శివరాత్రి ఉత్సవాల్లో దేవుడి పల్లకీ ముందుగా తన ఇంటి వద్ద పూజలందుకున్నాకే గ్రామోత్సవం ప్రారంభించాల్సిందేనని ఏకంగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించాడు. పేరూరు గ్రామంలో ఈశ్వర, చెన్న కేశవ, రామాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయంలో శివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లను గ్రామంలోని రెడ్డి గారి (బాలనాగిరెడ్డి) ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ప్రారంభిస్తారు. అయితే బాబు సర్కారు అధికారంలో ఉండటంతో ఓ టీడీపీ నేత గతేడాది అప్పటి ఈఓ నర్సయ్యను బెదిరించి సంప్రదాయలకు గండి కొట్టాడు. అవతలి వర్గీయులను నమ్మబలికించి ఉత్సవమూర్తుల పల్లకీని తన ఇంటి వద్దకు రప్పించుకున్నాడు. దీంతో గ్రామస్తులు అడ్డుపడ్డారు. అప్పట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే వివిధ శాఖల అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ సారి కూడా ఉత్సవ మూర్తుల పల్లకీ ముందుగా తన ఇంటి వద్దకు రావాల్సిందేనని టీడీపీ నేత ఆలయ ఈఓ సాయి జయచంద్రారెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈఓ గ్రామస్తులను విచారించిన తర్వాత టీడీపీ నాయకుడు చెప్పేది అంతా విరుద్ధమని తెలుసుకున్నారు. అయితే ఓ వైపు ఉత్సవాలకు సిద్ధం చేస్తూ.. మరో వైపు సమస్యను ఎస్ఐ జయప్పకు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం నిర్వహించే ఉత్సవం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం -
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
● నలుగురిపై కేసు నమోదు శ్రీశైలం: స్థానిక కొత్తపేట, మేకలబండ ప్రాంతాల్లో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో 85 మద్యం బాటిళ్లు, 34 లీటర్ల నాటు సారా పట్టుబడింది. సీఐ మోహన్రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి మేకల బండకు చెందిన పోతుల సాయి దగ్గర నుంచి 34 లీటర్ల నాటు సారా, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మంజుల లలిత ఇంటి వద్ద 45 మద్యం సీసాలు, అదే ప్రాంతానికి చెందిన సంపంగి మహేశ్వరి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలు గురు నిందితులపై దేవదాయ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఘాట్ రోడ్డులో నిబంధనలు పాటించాలి ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించే వాహనదారులు అటవీ సంరక్షణ నిబంధనలు పాటించాలని సబ్ డీఎఫ్ఓ బబిత శుక్రవారం తెలిపారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల వేల అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళ్తున్నారని, ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేస్తున్నామన్నారు. అటవీ మార్గంలో 30 కి.మీ వేగానికి మించి వెళ్ల వద్దని, రహదారిపై వన్యప్రాణులు కనిపిస్తే వాహనాలను నిలిపేయాలని సూచించారు. తీవ్రంగా హారన్లు మోగించడం, అడవిలో మల విసర్జనకు వెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అటవీ చట్టాలను అతిక్రమించే డ్రైవర్లకు రూ.500 – రూ.1000 వరకు అపరాధ రుసుం విధిస్తామన్నారు. -
సాధారణ భక్తురాలుగా కలెక్టర్
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి ఉచిత క్యూలైన్లో సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో భక్తులతో మమేకమై వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ఉచితంగా అందిస్తున్న లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. లడ్డూ కౌంటర్ వద్ద టోకెన్ విధానం, భక్తుల రద్దీ నియంత్రణ పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్నప్రసాద వితరణ భవనానికి వెళ్లి అక్కడి భక్తులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి పరిశీలించారు. భక్తులతో కలిసి కూర్చ్చొని భోజనం చేస్తున్న కలెక్టర్ రాజకుమారి -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలంప్రాజెక్ట్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఫలితంగా క్షేత్ర పరిధిలో అన్ని ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. పాతాళగంగలోని కృష్ణా నదిలో తెల్లవారు జాము నుండే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దైవదర్శనం కాగానే కొందరు భక్తులు తిరుగు ప్రయాణమవుతుండగా, చాలా మంది మహాశివరాత్రి పర్వదినం వరకు శ్రీశైలంలోనే ఉండిపోతున్నారు. దీంతో శ్రీగిరిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ స్వామి అమ్మవార్లను 1.25 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల ప్రధాన వీధి -
వెంకటాపురంలో దొంగల హల్చల్
శిరివెళ్ల: వెంకటాపురంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు. దాదాపు రూ. లక్ష నగదు, రూ. 80 వేలు విలువ చేసే బంగారు కమ్మలు, ముక్కు పుడకలు చోరీకి గురయ్యాయి. ముందుగా శ్రీరామ వెంకటేశ్వర్లు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాను బయటకు తెచ్చి ఇంటి సమీపంలోని ఓ దిబ్బ వద్ద పగల గొట్టారు. శబ్ధం విన్న ఇంటి యాజమాని, చుట్టు పక్కల వాళ్లు రాగా దొంగలు పరారయ్యారు. అలాగే రిటైర్డ్ వీఆర్వో అనందయ్య ఇంటిలో బీరువాలోని బంగారు కమ్మలు, ముక్కు పుడకలు అపహరించారు. గుడి నరసింహ ఇంటిలో బీరువాలోని రూ. 80 వేలు నగదును చోరీ చేశారు. వలివేటి శేషగిరి ఇంటిలో ప్రవేశించి రూ. 20 వేల నగదును ఎత్తు కెళ్లారు. అలాగే పొదిలి చిన్న కేశయ్య టీ కొట్టులో తినుబండారాలు తిని, కూల్ డ్రింక్స్ తాగారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో నలుగురు ముఖాలకు ముసుగు వేసుకోగా, ఒకరు ఖర్చీఫ్ కట్టుకుని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఇద్దరు మహి ళలు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాము గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలో స్వామి వారి వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొలిమిగుండ్ల: తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని వేర్హౌస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిపల్లెకు చెందిన బండ నాగాంజనేయులు (29) పని నిమిత్తం స్నేహితులతో కలిసి జమ్మలమడుగుకు బైక్పై వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తిమ్మనాయినపేట జంక్షన్ వద్దకు వచ్చే సరికి బైక్లో ఉన్న ఇద్దరు స్నేహితులు టాయ్లెట్ వెళ్లేందుకు కిందకు దిగారు. నాగాంజనేయులు రోడ్డుకు అటు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించి చట్టబద్ధం చేయాలని జాతీయ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన జాతీయ కిసాన్ జాగృతి యాత్ర శుక్రవారం కర్నూలుకు చేరుకుంది. ఈ యాత్ర సుమారు 40 రోజులపాటు కొనసాగి కశ్మీర్ చేరుకుంటుంది. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ కిసాన్ నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా (పంజాబ్), ఇంద్రజిత్సింగ్ పొన్నెవాలా (రాజస్థాన్), దేవరాజ్కుమార్ (కర్ణాటక), అరుణపటేల్ (మధ్యప్రదేశ్), అభిమన్యు (హర్యానా), సోముఅలక్ (పంజాబ్), పి.రామచంద్రయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాత్ర కర్నూలు చేరిన సందర్భంగా ఎస్టీయూ భవన్లో జాగృతి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ జాగృతి నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా, ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. 2019లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధం చేయాలని భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారుసు చేసినా పెడచెవిన పెట్టారన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు రైతుల ఉద్యమం చేస్తే అబద్ధపు హామీలు ఇచ్చి విమరమింపజేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన ప్రధానమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధం కల్పించడంలేదని ఆరోపించారు. 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్ళి కె.జగన్నాథం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ !
నల్లమల గిరుల నుంచి నమఃశివాయ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తోంది. పాతాళ గంగలో భక్తి కెరటం ఎగిసిపడుతోంది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా అంతా శివ మయం. పాదయాత్రగా శివయ్య దండు తరలివస్తోంది. శ్రీగిరిలో అడుగు పెట్టగానే మల్లన్న స్పర్శించాడనే అనుభూతికి లోనవుతున్నారు. శివరాత్రి ఉత్సవాల వేళ శ్రీశైలం భక్తజనసంద్రమైంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్నను దర్శించుకునేందుకు క్యూలో బారులుదీరుతున్నారు. మరో వైపు భక్తుల సేవలో దాతలు తరిస్తున్నారు. ఫొటోలు: వడ్డె శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు దారులన్నీ శ్రీగిరి వైపు..పుణ్యస్నానాలు చేస్తున్న భక్తురాలు పాతాళగంగలో భక్తుడి ధ్యానంరోప్ వే మార్గంలో.. -
బైక్ అదుపుతప్పి కిందపడి ..
ఎమ్మిగనూరురూరల్: కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తమ బంధువుల అమ్మాయికి సంబంధం కుదుర్చుకుని సంతోషంగా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఎంకప్ప(28) తమ బంధవుల అమ్మాయికి ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తెర్నేకల్ గ్రామం నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు శుక్రవారం అబ్బాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం కుదరటంతో అక్కడే భోజనాలు చేసి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. ఎంకప్ప పల్సర్ బైక్పై వెళ్తుండగా కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి కాలువగట్టు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక వస్తున్న బంధువులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పాదయాత్రగా శ్రీశైలయానికి చేరుకుంటున్న భక్తులు -
శ్రీశైలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు!
శ్రీశైలం ప్రాజెక్ట్: నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని దోర్నాల వరకు ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీశాఖ గతంలో ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ప్లాస్టిక్తో తయారు చేసిన ఎలాంటి వస్తువులను అనుమతించకుండా దోర్నాల, లింగాలగట్టు అటవీ శాఖ చెక్పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. ఏదైనా ప్లాస్టిక్ వస్తువు దొరికితే వాహనం సీజ్ చేయడంతో పాటు, జరిమానా విధిస్తారు. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్లు ఎక్కడా కనిపించకుండా అటవీశాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. ముఖ్యంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని శ్రీశైల దేవస్థానం బయో వాటర్ బాటిళ్ల సరఫరాకు గత రెండు సంవత్సరాల క్రితం టెండర్లు పిలిచింది. హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్ వీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ రహిత కోర్ ఏరియా శ్రీశైలంలోకి మహాశివరాత్రి బ్రహ్సోవాలలో లక్షలాది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను దేవస్థానం ఆధ్వర్యంలో సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. దేవస్థాన అధికారులు సిద్ధం చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు -
బందోబస్తు మరింత ‘పది’లం
● ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: భక్తుల భద్రత కోసం బందోబస్తును మరింత పెంచామని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. బందోబస్తు చేయాల్సిన ప్రాంతాలను పది సెక్టార్లుగా విభజించామని చెప్పారు. శ్రీశైలంలోని వన్ న్ సర్కిల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నాలుగు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి 1,614 మంది సివిల్ పోలీసులు వచ్చారన్నారు. మొత్తం 11 మంది అదనపు ఎస్పీలు, 24 మంది డీఎస్పీలు, 78 మంది సీఐలు, 132 మంది ఎస్ఐలు, ఏఎస్ఐ/హెచ్ లతో కలిపి 303 మంది పనిచేస్తారన్నారు. వీరు కాకుండా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బం, మూడు స్పెషల్ పార్టీ బృందా లు పనిచేస్తాయన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని సెక్టార్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ స్వామి వారి ప్రసాదం అందేలా చూడాలని సూచించారు. -
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. ఓం నమఃశివాయ, హరోం హర శంకరా అంటూ భక్తులు స్వామి, అమ్మవార
● శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు ● అరకొర ఏర్పాట్లతో అవస్థలు పుష్ప పల్లకీలో విహరిస్తున్న ఆది దంపతులుపుష్పపల్లకీలో ఆదిదంపతులు బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబసమేత మల్లికార్జునుడు పుష్పపల్లకీపై దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన పుష్పపల్లకీ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుష్పపల్లకీని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, శంఖానాదాల మధ్య గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. పూజా కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శనివారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ ఉంటుంది. పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
ఇలా అయితే.. వంద శాతం కష్టమే!
● ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ ఆగ్రహం ప్యాపిలి: ఇలా ఉంటే పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టమేనని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పీఆర్పల్లి, బూరుగల, సీతమ్మతండా, హుసేనాపురం, ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పీఆర్ పల్లిలో స్టడీ అవర్స్కు 56 మందికి గాను 9 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో డీఈఓ అసహనం వ్యక్తం చేశారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్థానంలో సోషల్ స్టడీస్ టీచర్ ఉండటంపై మండిపడ్డారు. జీఎన్ఎస్ఎస్ నుంచి నీటి విడుదల బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు జీఎన్ఎస్ఎస్ ద్వారా సంబంధిత అధికారులు నీటిని గురువారం రాత్రి విడుదల చేశారు. కడప, చిత్తూరు మరి కొన్ని ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఈ నీటిని అవుకు రిజర్వాయర్లోకి విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్కు అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. జీఎన్ఎస్ఎస్ ద్వారా అధికారులు సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉత్సవమూర్తులకు విశేష పూజలు రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలానరసింహ స్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వామి గ్రామగ్రామానా ప్రజల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. పార్వేట పల్లకీ శుక్రవారం మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లెకు చేరుకోవడంతో గ్రామపెద్దలు ఎదురేగి వెళ్లి స్వాగతించారు. అనంతరం బోయిలు స్వామి వారి పల్లకీని గ్రామంలోని పలు తెలుపుల మీద కొలువుదీర్చారు. సప్తనదీ జలాలతో అభిషేకం కొత్తపల్లి: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సప్తనది సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. శివలింగానికి సప్తనదీ జలాలతో అభి షేకం చేశారు. కుంకుమార్చన, పుష్పార్చన, మంగళహారతి వంటి విశేష పూజకార్యక్రమాలు జరుపుకున్నారు. ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది. వెల్లివిరిసిన సామరస్యం ఆత్మకూరు: మహాశివరాత్రి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శివాలయంలో పలువురు భక్తులు శివమాల ధరించి నిష్టతో పూజలు నిర్వహిస్తున్నారు. శివస్వాములపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ పఠాన్వలిఖాన్ ఉదారత చాటారు. సుమారు 200 మంది శివస్వాములకు అవసరమైన అల్పాహారాన్ని తానే స్వయంగా తయారు చేయించారు. కేవలం ఆహారం అందించడమే గాకుండా ప్రతిఒక్క స్వామికి ఎంతో వినమ్రతతో స్వయంగా దగ్గరుండి వడ్డించి సోదరభావాన్ని చాటుకున్నాడు. ప్రశాంతంగా బార్ ఎన్నికలు నంద్యాల(వ్యవసాయం): ఏపీ స్టేట్ బార్ మెంబర్స్ ఎన్నికలు నంద్యాల బార్ అసోసియేషన్లో ప్రశాంతంగా ముగిశాయి. సీనియర్స్, జూనియర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ పోటీ చేస్తున్న అభ్యర్థి విజయశేఖర్రెడ్డి ఓటును వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్ హుసేన్బాషా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశమౌళిరెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, కృపావతి, వెంకటప్రసాద్, తోట మురళీలు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కార్యాలయంలో 446 ఓటర్లు ఉండగా 419 ఓట్లు పోలయ్యాయన్నారు. 95 శాతం పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. 27 మంది గైర్హాజరయ్యారన్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
శ్రీగిరిలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తజనం పోటెత్తుతున్నారు. పాదయాత్రగా నల్లమల మీదుగా భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్నను కనులారా దర్శించుకుంటున్నారు. వందల కి.మీ నడిచి అలసిపోయిన భక్తకోటి శ్రీగిరిలో అడుగు పెట్టిన వెంటనే
అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవం కోవెలకుంట్ల: 65 ఏళ్ల మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ కామాంధుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురువారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. 2023 సెప్టెంబర్ 24వ తేదీన సంజామలకు చెందిన ఓ వృద్ధురాలు కోవెలకుంట్ల బస్టాండ్ వద్ద ఊరికి వెళ్లేందుకు వేచి ఉంది. ఇంటి వద్ద వదిలిపెడతానని అదే గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి మద్యం మత్తులో బైక్పై ఎక్కించుకున్నాడు. స్థానిక గుంజలపాడు రహదారిలో వైపు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ వృద్ధురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన తర్వాత రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ మీదుగా నడుచుకుంటూ వెళుతూ వృద్ధురాలు తీవ్రరక్తస్రావంతో ఓ పెట్రోల్ బంకు సమీపంలో కింద పడిపోయింది. గుర్తించిన పెట్రోల్బంకు నిర్వాహకులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుౖగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో నంద్యాల మేజిస్ట్రేట్ ఎన్బీడబ్ల్యూ జారీ చేయడంతో కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నాగన్న, కానిస్టేబుల్ చాంద్బాషా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ ఖైదీగా ఉంచి కేసుకు సంబంధించిన సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కర్నూలు న్యాయమూర్తి లక్ష్మిరాజ్యం నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా చేసిన సీఐ హనుమంతునాయక్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, మౌలానీ, పోలీసు సిబ్బందిని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందిస్తూ రివార్డుకు ప్రతిపాదించారు. శ్రీగిరికి చేరుకుంటున్న పాదయాత్ర భక్తులురావణ వాహన సేవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులుఆలయం .. పుష్పశోభితంఇరుముడితో పూజల్లో పాల్గొన్న మంత్రి ఆనం, కలెక్టర్, ఈఓ, చైర్మన్, ఎమ్మెల్యే తదితరులు శివ శివ శంకరా.. -
విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి
దొర్నిపాడు: విద్యుదాఘాతంతో ఓ టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. అర్జునాపురం – నందింపల్లె గ్రా మాల మధ్య రోడ్డు నిర్మా ణ పనులు జరుగుతున్నా యి. బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్లో కంకర అన్లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ద్వారా టిప్పర్ ట్రాలీ ఎత్తే క్రమంలో పైన ఉన్న కరెంట్ తీగలను గమనించ లేదు. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రవళ్లిక ఉన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి వెల్దుర్తి: జాతీయ రహదారిపై మదార్పురం సమీపంలోని కోళ్ల ఫారం ఆవరణలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణానికి చెందిన అల్లాబకాష్ మదార్పురం వద్ద కోళ్ల ఫారంలో నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. ఇతని మిత్రులు డోన్ పట్టణం సుందర్సింగ్ కాలనీకి చెందిన సురేష్(24), అమ్రేశ్ నాయక్లు బుధవా రం రాత్రి అక్కడికి చేరుకుని మద్యం సేవించారు. మద్యం అయిపోవడంతో సురేష్, నాయక్లు వెల్దుర్తికి వచ్చి మద్యం తీసుకువెళ్లి మళ్లీ తాగారు. వీరిలో అల్లాబకాష్, నాయక్ ఇద్దరు గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిద్రలేచారు. ఈ సమయంలో సురేష్లో చలనం లేకపోవడంతో 108కు సమాచారమిచ్చారు. వారు సంఘట నా స్థలికి చేరుకుని సురేష్ అప్పటికే మృతి చెందినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ సంఘటనాస్థలి కి చేరుకుని విచారించారు. ఆ సమయంలో అమ్రే శ్ నాయక్ హైవే రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు తల్లి ఎల్లవేణమ్మ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. -
ప్చ్.. ఇది చంద్రన్న మందే!
ఇది కూల్డ్రింకేనా! తాగుదామా, వద్దా..బ్రహ్మగుండంలో కోతులెక్కువ. ఏ ద్విచక్ర వాహనం ఆలయ ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లినా వాహనాల బ్యాగులు చించి మరీ అందులో ఏమున్నా ఎత్తుకెళ్తుంటాయి. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బ్రహ్మగుండంలో వ్యాపారులు అంగళ్లు వేసుకోవడంలో, ఉత్సవ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గురువారం ఓ కోతికి ఏదో ఓ ద్విచక్ర వాహనం బ్యాగ్లో ఓ నైన్టీ మద్యం బాటిల్ దొరికింది. బాటిల్ తీసుకుని వెళ్లి చెట్టుపై కూర్చుంది. అలవాటైన కూల్ డ్రింక్ అనుకుందేమో బాటిల్ మూత తీసేందుకు విఫల ప్రయత్నం చేసింది. రాకపోవడంతో పళ్లతో కొరికింది. చిన్న ధారలా మద్యం చిమ్మడంతో తాగేందుకు ప్రయత్నించింది. వాసన నచ్చలేదో, లేక నాసిరకం అనుకుందో కానీ విసిరికొట్టి వెళ్లిపోయింది. – వెల్దుర్తిమూత తీసి టేస్ట్ చూద్దాం..ఇది చంద్రన్న మందులా ఉంది.. ప్చ్! -
జిల్లాలో రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు రీనోటిఫికేషన్
● ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● 23వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్ జారీ కర్నూలు: జిల్లాలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఆగిపోయిన రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు రీనోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు రూరల్లో ఒకటి, చిప్పగిరి మండలం యూనిట్లో ఒక దుకాణాలను గతంలో నిర్వహించిన టెండర్లు దక్కించుకున్నవారు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదేశం మేరకు వాటి ఏర్పాటుకు గురువారం రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వ తేదీ సాయంత్రం లోగా ఆయా దుకాణాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్క దుకాణానికి కనిష్టంగా ఒక దరఖాస్తు వస్తేనే లాటరీ ద్వారా దుకాణాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను బట్టి ఈ నెల 23వ తేదీన రెండు దుకాణాలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి లైసెన్స్ను జారీ చేయనున్నట్లు ఈఎస్ పేర్కొన్నారు. -
పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు
● టెక్నాలజీ సహాయంతో సకాలంలో స్పందన నంద్యాల: భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బయటకు వెళ్లిన వ్యక్తి ఆచూకీని టూటౌన్ పోలీసులు కనుగొని పిల్లలను రక్షించారు. టూటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలో బుధవారం గిరినాథ్ సర్కిల్లో నివాసముండే శివకుమార్ ఉదయం కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బైక్పై వెళ్లాడు. అనంతరం పిల్లలను స్కూల్ వద్ద నుండి తీసుకొని వచ్చి తన స్కూటీపై ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో హుటాహుటిన పిల్లల తల్లి సుబ్బలక్ష్మి, ఆమె తరఫు బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శివకుమార్ ఫోన్ను ట్రాక్ చేయగా శివకుమార్ పిల్లలను తీసుకొని గుత్తి రోడ్డులో వెళ్తున్నట్లు చూపించింది. వెంటనే స్పందించిన పోలీసులు పిల్లల తల్లిని, వారి బంధువులతో పాటు వెహికల్లో వెళ్లి శివకుమార్ గుత్తిలో వారి సోదరుని ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకొని కుటుంబ సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని పిల్లలను ఇలా బెదిరించి తీసుకురావడం నేరమని మందలించి పిల్లలను నంద్యాలకు తీసుకొని వచ్చి వారి బంధువులకు అప్పగించారు. పిల్లలను కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏదైనా చేస్తాడని భయపడిన స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు వెంటనే స్పందించి క్షేమంగా తన పిల్లలను నాకు అప్పగించినందుకు తల్లి సుబ్బలక్ష్మి ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జిల్లాలో కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్న క్రమంలో వెంటనే పోలీసులు స్పందించి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో టూ టౌన్ పోలీసులను పట్టణ ప్రజలు, అభినందిస్తున్నారు. -
భక్తుల నిలువు దోపిడీ
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దేవస్థానం సరిపడా సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా భక్తులు ఎక్కడికి వెళ్లినా నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీస సౌకర్యమైన మరుగుదొడ్లను ఉచితంగా ఏర్పాటు చేయలేదు. శివదీక్షా శిబిరాల వద్ద గతేడాది రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు ఈ ఏడాది రూ.20 తీసుకుంటున్నారు. పాతాళగంగ, నందిసర్కిల్, ప్రధాన ఆలయానికి ఎదురుగా పలువురు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. రోజుకు వెయ్యి మంది కార్మికులతో పనులు చేపట్టకుండా కొంతమందితో తూతూమంత్రంగా సాగిస్తున్నారు. దీంతో క్షేత్ర పరధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. టోల్గేట్ సమీపంలో చెప్పులు, సాక్స్లను భక్తులు వదిలి వెళ్తున్నా తొలగించడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం శ్రీశైలంలో వర్తించడంలేదని భక్తులు వాపోతున్నారు. ఘాట్రోడ్డు పేరుతో స్టాండింగ్ ఎక్కించుకోకపోవడం, తక్కువ బస్సులు ఉండడంతో మహిళా భక్తులు అవస్థలు పడుతున్నారు. ముక్కుపిండి వసూలు సాక్షిగణపతి ఆలయం వద్ద, మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద, నందిసర్కిల్ వద్ద భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి వారు కొబ్బరికాయ కొడితే రూ.10 ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్షేత్రంలోని చాలా హోటళ్లలో ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అధిక రేట్లు తీసుకుంటున్నారు. శివమాలను స్వీకరించిన వారు ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. టెంకాయ సమర్పిస్తే రూ.10 చెల్లించాల్సిందే ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాల్సిందే రోడ్డుకు మధ్యలో వ్యాపారాలు -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
కర్నూలు: పది సంవత్సరాలకు పైగా పెండింగ్లోని సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.కబర్ధి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం ఆయన స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులలో పెండింగ్లోని సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కక్షిదారులు ఈ అవకాశా న్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
జైలులో జతకట్టి.. నేరాల బాటపట్టి!
కర్నూలు: హైదరాబాద్లోని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కి చెంచల్గూడ జైలుకు వెళ్లారు. అక్కడ వారి మధ్య పరిచయం పెరిగి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జట్టుగా ఏర్పడి పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. శివసింగ్ వయస్సు 25 ఏళ్లు కాగా ఇతనిపై 28 ఇంటి దొంగతనాలు, అలాగే రఘు వయస్సు 24 కాగా 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసు రికార్డులకెక్కారు. పక్కా ఆధారాలతో వీరిద్దరినీ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శివారులోని సంతోష్ నగర్లో నివాసముంటున్న మద్దిలేటి ఇంట్లో గత జనవరి 29న పట్టపగలే దొంగలు పడి అందినకాడికి మూటకట్టుకుని ఉడాయించారు. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయన విధులకు వెళ్లగా భార్య లక్ష్మీదేవి, కుమార్తె హేమచరిత ఇంటికి తాళం వేసి బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంకుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. ఒక గంట సమయంలో తల్లీ కుమార్తె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం తొలగించి ఉండటం, తలుపులు మూసి ఉండటంతో ఆందోళనతో తలుపులు తీయమని గట్టిగా అరిచారు. అప్పటికే బీరువాలోని సొత్తును దోచుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు దుండగులు తలుపులు తీసి అడ్డంగా ఉన్న తల్లీ కూతుళ్లను పక్కకు నెట్టేసి పరారయ్యారు. కాస్త దూరంలో సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్ర వాహనంపై దొంగలిద్దరూ పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. కాలనీలో ఓ చోట సీసీ కెమెరా ఫుటేజీలో దుండగులు చోరీకి ముందు ద్విచక్ర వాహనంపై కాలనీలో సంచరించిన దృశ్యాలను గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు మురళీధర్, లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు నుంచి షాద్నగర్ వరకు సీసీ ఫుటేజిలను క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణ పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకుని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్లుగా గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచి గురువారం మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు సమీపాన బంజారా హిల్స్ వెంచర్లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదింపు ఏడు తులాల బంగారు నగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం -
మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
● ఈ ఏడాది 1.50 లక్షల మంది వచ్చే అవకాశం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. గతేడాది మహాశివరాత్రి పర్వదినాన అత్యధికంగా 1.10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఈ ఏడాది 1.50 లక్షల మంది శివరాత్రి రోజున దర్శనం చేసుకుంటారని అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కై లాస ద్వారం నుంచి 26,000 మందికిపైగా భక్తులు కాలినడకన శ్రీశైలం చేరినట్లు చెప్పారు. వారికి వైద్య సేవలతో పాటు ఆహారం, మంచినీరు అందించామన్నారు. స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతాళగంగ వద్ద బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను కూడా నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా బస్సులు, కార్లకు విడివిడిగా పార్కింగ్ ప్రదేశాలను కేటాయించినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణానికి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దేవస్థానం చెక్పోస్టుల వద్ద ఫారెస్ట్ చెక్ పోస్ట్లు టోల్ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘాట్లో గంటకు 30 కిలోమీటర్ల వేగపరిమితితో వాహనాలు వచ్చేలా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. క్యూలైన్లలో పిల్లలకు మంచినీరు, వద్ధులకు పాలు, బిస్కెట్లు అందజేసే చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు పరిశీలన మహాశివరాత్రి పర్వదినానికి రెండు రోజులుగా మాత్రమే వ్యవధి ఉండడంతో సునీల్షెరాన్ భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు. గురువారం సాయంత్రం క్యూలైన్లలను పరిశీలన చేశారు. క్యూలైన్ల డివైడర్ల ఎత్తును పెంచాల్సిందిగా దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రంలో ఉన్న క్యూలు, శివాజీ గోపురం, అమ్మవారి ఆలయ ప్రాంగణం, నాగుల కట్ట ప్రాంతాలను పరిశీలించారు. శివదీక్ష స్వాముల కోసం ఏర్పాటు చేసిన చంద్రావతి కళ్యాణ మండపంలోని కంపార్ట్మెంట్లలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
నేడే ‘బార్’ ఎన్నికలు
● 445 మంది ఓటర్లు ● ఆరు పోలింగ్ బూత్లునంద్యాల(వ్యవసాయం): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగే ఏపీ స్టేట్ బార్ కౌన్సిలర్ ఎన్నికలకు నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పోలింగ్ ఆఫీసర్ హుసేన్బాషా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశ మౌళిరెడ్డి, వెంకటేశ్వర్లు, తోటా మురుళీ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల బార్ అసోసియేషన్లో న్యాయవాదులు 445 మంది ఓటర్లు ఉన్నారని, అందుకోసం ఆరు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారన్నారు. ఓటింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందన్నారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితా, సీలింగ్ కిట్లు ఏపీ బార్ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి నంద్యాల బార్ అసోసియేషన్కు చేరుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది బార్ మెంబర్లుగా పోటీలో ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు సీరియల్ నంబర్లను క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలన్నారు. కచ్చితంగా ఐదుగురిని గుర్తించాలని, అంతకన్నా తక్కువ అయితే ఓటు చెల్లదన్నారు. పోలీసుల భద్రత ఉంటుందన్నారు. నంద్యాల జిల్లాలో బార్ అసోసియేషన్ నుంచి ఎం.విజయశేఖర్రెడ్డితో పాటు మరొకరు, ఆళ్లగడ్డ నుంచి ఒకరు, డోన్ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు చెప్పా రు. జిల్లాలో ఏడు బార్ అసోసియేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లు కచ్చితంగా ఏపీ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు. -
అక్రమాల్లో ‘ఘను’లు
● యథేచ్ఛగా సుద్ద అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు సాక్షిటాస్క్పోర్స్: ఎన్వోసీ, రాయల్టీ లేకుండా టీడీపీ నాయకులు సుద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవుదినాలుగా ఉన్నందున అధికారులు పట్టించుకోరన్న ధైర్యంతో అక్రమ మైనింగ్ పనులు చేస్తున్నారు. బనగానపల్లె మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి చెరువుపల్లెకు వెళ్లే రహదారిలోని చాకలికుంట సమీపంలో సుమారు నెల రోజులుగా సుద్ద అక్రమమైనింగ్ పనులు చేపడుతున్నారు. టిప్పర్ల ద్వారా గని లోపలి నుంచి సుద్దను బయటకు తీసుకొస్తున్నారు. కుప్పలుగా పోసిన సుద్దను రాయల్టీ ఉన్నావారు కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారు. అక్రమ మైనింగ్ చేపట్టే వారికి టిప్పర్ ద్వారా ఖర్చులు పోను సుమారు రెండులక్షల వరకు మిగులు ఉంటుందని తెలుస్తోంది. రోజుకు రెండు టిప్పర్ల సుద్దను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారంలో రెండు రోజులు విక్రయిస్తే సుమారు మూడు లక్షల వరకు ఆదా ఉంటుందని సమాచారం. ఈవిధంగా నెలకు 10–12 లక్షల వరకు మిగులు ఉంటుంది. సుద్ద అక్రమమైనింగ్తో ప్రభుత్వ ఆదాయం కోల్పోతుండగా అక్రమమైనింగ్ చేపట్టేవారు సంపాదన పరులుగా మారుతున్నారు.


