breaking news
Nandyal District Latest News
-
యూరియా పంపిణీలో ఘర్షణ
● కొత్తపల్లెలో పోలీసుల పికెట్ నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో యూరియా పంపిణీలో ఘర్షణ నెలకొంది. ఇటీవల గ్రామానికి వచ్చిన యూరియా పంపిణీపై టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీశారు. రైతులకు ఇవ్వకుండా యూరియా ఎక్కడికి వెళ్తుందంటూ ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్సీపీకి కార్యకర్తలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దూషించారు. శుక్రవారం టీడీపీ నాయకుడు కుమారుడు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ప్రతి దాడులు చేసుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో వాతావరణం వేడెక్కింది. షయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. తోపులాట సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన కొత్తపల్లెలో ఏ సంఘటన జరిగినా ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. గత డిసెంబర్లో గ్రామ ఎంపీటీసీ హరినాథరెడ్డిపై కొంత మంది టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సంఘటన మరువక ముందే యూరియా పంపిణీ, చిన్నచిన్న ఘర్షణలతో ఇరువర్గాలు దాడులకు దిగేందుకు యత్నించారు. గ్రామ సచివాలయానికి వ్యవసాయాధికారులు 100 టన్నుల యూరియా మంజూరు చేశారు. అర్హులైన రైతులకు అందించకుండా యూరియా ఎక్కడికి వెళ్తుదంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులకు దిగుతుండటంతో విధిలేని పరిస్థితిలో బయట కొనుగోలు చేస్తూ పంట సాగు చేపడుతున్నారు. గత మంగళవారం గ్రామానికి 35 టన్నులు యూరియా సచివాలయానికి వచ్చింది. గ్రామ రైతులకు యూరియా పంపిణీ చేయకపోవడంపై టీడీపీ నాయకులు, అధికారులను వైఎస్సార్సీపీ సానుభూతి పరులైన రైతులు ప్రశ్నించారు. అక్కడ మొదలైన వివాదం శుక్రవారం సాయంత్రం గ్రామ టీడీపీ నాయకుడి కుమారుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వాగ్వాదం మొదలై తోపులాటకు దిగారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నామని బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తాలూకా సీఐ ఈశ్వరయ్య తెలిపారు. -
నల్లమలలో పాదయాత్ర నిషేధం
ఆత్మకూరురూరల్: శ్రీశైలం వెళ్లేందుకు పాదయాత్ర కోసం కన్నడిగులు శుక్రవారం వెంకటాపురం వద్దకు చేరుకోగా నాగలూటి ఇన్చార్జ్ ఎఫ్ఆర్వో ప్రణతి నేతృత్వంలో ఉన్న అటవీ సిబ్బంది వారిని నిలిపి వేశారు. రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్ళేలా వారిని ఒప్పించారు. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతి బైర్లూటి చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి వచ్చిన పాదయాత్రికులకు గురువారం ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటి డైరెక్టర్ విగ్నేష్ అపావ్ అవగాహన కల్పించారు. పెద్ద పులుల అంచనా గురించి, అటవీ మార్గం మూసివేత గురించి వివరించారు. కేవలం ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఉంటుందని చెప్పారు. అనంతరం పాదయాత్రికులను రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించారు. -
బండిఆత్మకూరు రైతు సేవా కేంద్రం వద్ద గత శుక్రవారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం 24 టన్నుల యూరియా రావడంతో రైతులు ఉదయం నుంచే క్యూలో నిలబడి అగచాట్లు పడ్డారు. క్యూలో ఉన్న ఒక రైతు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించా
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాకు రావాల్సిన మూడు ర్యాక్ల యూరియాను ఇతర జిల్లాలకు మళ్లించారు. దీంతో కొరత తీవ్రమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్లో నీటిపారుదల కింద వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగు చేశారు. పైరు ఎదుగుదలకు యూరియా అవసరం ఎంతో ఉంది. ఎలాంటి కొరత లేదని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక బస్తా యూరియా కోసం రైతులు ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తోంది. నోరు మెదపని టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలు అదనంగా యూరియా తెప్పించాలి. అలా చేయకపోగా వచ్చిన ఎరువులు దారి మళ్లుతున్నా మౌనంగా ఉండిపోయారు. నంద్యాలకు స్పిక్, కోరమాండల్, క్రిఫ్కో యూరియా ర్యాక్లు వస్తాయని అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ ర్యాక్లతో 9,500 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందనుకున్నారు. అయితే వీటిని ఇతర జిల్లాలకు దారి మళ్లించారు. దీంతో బండిఆత్మకూరు, మహానంది, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో రైతులు ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అసలైన రైతులకు ఇవ్వకుండా.. యూరియా లేకపోతే పంటలే వేయలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల మార్క్ఫెడ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు డీసీఎంఎస్లు, పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాలకు యూ రియా సరఫరా చేస్తున్నారు. ఈ కేంద్రాలను టీడీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైన వారికి మాత్రమే యూరియా ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజమైన రైతులకు వైఎస్సార్సీపీ ముద్ర వేసి ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి 532 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. తీవ్ర కొరత నంద్యాల జిల్లాలో రబీ సాధారణ సాగు 1,75,865 హెక్టార్లు ఉండగా ఇప్పటికే 1,80,312 హెక్టార్లలో సాగైంది. వరి 40,264, మినుము 20569, మొక్కజొన్న 15,442, జొన్న 28,120 హెక్టార్లలో సాగైంది. కలెక్టర్, డీఏవో ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ నుంచి యూరియా బయటికి వెలుతున్నప్పటికీ సామన్య రైతులకు దక్కడం లేదు. అన్నింటా టీడీపీ నేతలే తిష్ట వేసి టోకన్లు ఇవ్వడం సహా మొత్తం వారే చేస్తున్నారు. దీంతో రైతులు ప్రయివేటు దుకాణాల్లో లింక్లతో కొనాల్సి వస్తోంది. మార్క్ఫెడ్, ఆర్ఎస్కేలు, ప్రయివేటు డీలర్లు, కంపెనీ గోదాముల్లో 8,000 టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుచెబుతున్నారు. తాము చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులను హెచ్చరిస్తున్నారు. బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరిశెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దోపిడీ చేస్తూ.. కర్నూలు జిల్లాలో రబీ సీజన్లో 75 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్కు 24,580 టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే 14 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇటీవల కర్నూలు ర్యాక్పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా 1300 టన్నులు వచ్చింది. ఇందులో 650 టన్నులు మార్క్ఫెడ్కు, 650 టన్నులు ప్రయివేటు డీలర్లకు కేటాయించారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు కేటాయించారు. యూరియాను ప్రయివేటు డీలర్లు లింక్లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఇతర జిల్లాలకు మళ్లింపు ఒక బస్తా కోసం రైతులకు తప్పని నిరీక్షణ బయోఫర్టిలైజర్ లింకుతో దోపిడీ చేస్తున్న డీలర్లు విక్రయాల్లో టీడీపీ నాయకుల చేతివాటం చంద్రబాబు ప్రభుత్వంలో తొలగని యూరియా కష్టాలు -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు: రానున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వారితో గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. పదవులు పొందిన వారు గ్రామ, పట్టణ స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రానున్న మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పార్టీ సానుభూతిపరులు, అభిమానులను కలుపుకుంటూ కార్యక్రమాల్లో ముందుకు సాగాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు క్రుటలు పన్నే అవకాశం ఉందని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం సీనియర్ నాయకుడు శిల్పా భువనేశ్వర్రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో పార్వతీ, పరమేశ్వరులకు లీలాకల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సంకల్పం తర్వాత మహా గణపతిపూజ, పుణ్యహావచనం జరిపారు. ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి సింహాసనానికి, కంకణాలకు పూజాదికాలు చేశారు. స్వామికి యజ్ఞోపవీతధారణను చేసి మంత్రాలను పటించారు. అమ్మవారికి కంకణధారణ జరిపారు. మహాసంకల్పం తరువాత మంగళకరమైన ఎనిమిది శ్లోకాలు చదివి స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి స్థానిక చెంచులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై అధిష్టింప చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా గోపూజ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కనుమ పండుగరోజైన శుక్రవారం శ్రీశైల దేవస్థానంలో శ్రీగోకులంలో, గోసంరక్షణశాల వద్ద శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో రావణవాహనంపై అధిష్టింపజేశారు. ఆలయ ఉత్సవం దేదీప్యమానంగా కొనసాగింది. రావణవాహనంపై స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజల అనంతరం స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. అడవి ఆకులతో ఆభరణాలు సమర్పించిన చెంచులు కనుమ పండుగ రోజున రావణవాహన సేవ నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు యాగపూర్ణాహుతి -
విద్యుత్ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈ నెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సీడీసీఎల్ చైర్మన్, సీఎండి శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం.. 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. -
ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(టౌన్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్ www.ecourts.kurnool.com అలాగే kurnool.dcourts.gov.in లో చూసుకోవచ్చన్నారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటల్లోపు జిల్లా కోర్టు కాంపౌండ్లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్రస్ పేరుతో రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో శుక్రవారం ఆంధ్ర పరిధిలోని హొళగుంద సెక్షన్ దిగువ కాలువలో 70 శాతం మేర నీటి సరఫర తగ్గుముఖం పట్టింది. వీఆర్ఎస్పీ సమీపంలో చిరుత పులులుఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు (వీఆర్ఎస్పీ) సమీపంలోని రహదారులపై మూడు చిరుత పులులు ఒకటి వెంట ఒకటి కూర్చుంటూ కలియ తిరుగుతూ కనిపించాయి. ఈ సమయంలో వాహనదారులు సౌండ్ హారన్ వేయడంతో ఒకదాని వెంట ఒకటి అడవిలోకి పరుగులు తీశాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వీఆర్ఎస్పీని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.వాహనాలను వెనక్కి మళ్లించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీఆర్ఎస్పీ నీటిపారుదల సంఘం అధ్యక్షులు కురుకుంద మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల చిరుతనపులు అధికంగా సంచరిస్తున్నాయని, అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకుని పర్యాటకులు వెళ్లాలన్నారు. చేపల వలలో కొండచిలువ ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పాములపాడు మండలం ఇస్కాల గ్రామ సమీపంలోని నీటికుంటలో చేపల వలకు భారీ కొండచిలువ చిక్కింది. గురువారం ఇస్కాల సమీపంలోని ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దనున్న నీటికుంటలో చేపలకోసం వల వేశారు. ఇందులో ఓ కొండచిలువ చిక్కుకున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ మేరకు యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువకు ఎలాంటి గాయాలు కాకుండా వలను తొలగించి నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం కొండ చిలువను బైర్లూటి రేంజ్లోని గంగరాజు చెరువులో వదలి పెట్టారు. యాంటీపోచింగ్ స్క్వాడ్లో ఎఫ్బివోలు కృష్ణకాంత్, పీరా తదితరులు ఉన్నారు. -
అనారోగ్యంతో సర్పంచ్ మృతి
తుగ్గలి : మండలంలోని రాతన గ్రామ సర్పంచ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గూడూరు రాచప్ప (80) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదారాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికి త్స అనంతరం నాలుగు రోజులకు క్రితం ఇంటికి వచ్చారు. తిరిగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట ఆదోనికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ కోలుకోలేక తుది శ్వాస విడిచారు. రాచప్ప మాస్టారు 2021లో వైఎస్సార్సీపీ మద్దతుదారుగా సర్పంచ్గా గెలిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎస్.రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మేధావుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, మైనార్టీ నాయకులు టీఎండీ హుసేన్, కో ఆప్షన్ సభ్యుడు చాంద్బాషా, ఇన్చార్జ్ సర్పంచ్ అన్వర్బాషా, సీ నియర్ నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, బసవరాజు,పంచాయతీ పాలకవర్గం నివాళులర్పించారు. సెల్ఫోన్ అప్పగింత వెల్దుర్తి: తనకు దొరికిన సెల్ఫోన్ను పోగొట్టుకున్న యజమానికి పోలీసుల ద్వారా అప్పగించి ఓ యువకుడు తన నిజాయితీ చాటుకున్నాడు. పట్టణానికి చెందిన కర్రెక్కగారి లక్ష్మీకాంతరెడ్డి రోజులాగే తెల్లవారుజామున వంకగడ్డనున్న తన ఇంటి నుంచి రామళ్లకోట రోడ్డులో జాగింగ్కు వెళ్లాడు. నక్కల తిప్ప దాటిన తర్వాత రహదారి పక్కన సెల్ఫోన్ పడి ఉండటాన్ని చూసి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అదే సమయంలో ఆ సెల్ఫోన్కు ఫోన్ కాల్ రావడం, లిఫ్ట్ చేయగా పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్ చేయడాన్ని గుర్తించి పోలీస్స్టేషన్కు పిలిపించారు. ఏఎస్ఐ ఆనందరెడ్డి విచారించి సెల్ఫోన్ను బొమ్మరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణకు అందజేశారు. -
పాల వ్యాపారి అదృశ్యం
కర్నూలు: కల్లూరు మండలం ఎన్టీఆర్ బిల్డింగ్స్లో నివాసముంటున్న పాల వ్యాపారి బ్రహ్మానంద రెడ్డి (26) అదృశ్యమయ్యాడు. తల్లి లక్ష్మిదేవితో కలసి పంచలింగాల వద్ద డైరీ ఫారం ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం సాగిస్తున్నాడు. పంచలింగాల నుంచి రోజూ కర్నూలుకు పాలు తీసుకుని వచ్చి వ్యాపారం సాగించేవాడు. ఈనెల 12న పాలు తీసుకుని కర్నూలుకు వచ్చాడు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మిదేవి ఆయన సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి గాలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో కేసీ కెనాల్ హైవే పక్కన అతని బైకు కనిపించడంతో స్వాధీనం చేసుకుని మేనమామ మల్లికార్జున రెడ్డి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాల వ్యాపారి శ్రీకాంత్ రెడ్డితో డబ్బుల విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, అతనిపైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కేసీ కెనాల్ వెంట పాములపాడు వరకు గస్తీ తిరుగుతున్నారు. మూడు రోజులుగా బ్రహ్మానందరెడ్డి కనిపించకపోవడంతో ఎలాగైనా తన కుమారుడిని వెతికి అప్పగించాలని తల్లి లక్ష్మీదేవి పోలీసులను వేడుకుంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● గంజిహళ్లిలో రాయలసీమ జోన్ మైనింగ్ అధికారుల విచారణ గోనెగండ్ల: అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఎ. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో ‘ఆగని ఇసుక దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులతో కలిసి వారు గంజిహళ్లి హంద్రీనదిలో ఇసుక తవ్వే ప్రాంతాన్ని పరిశీలించారు. హంద్రీనదిలో ఎక్కడెక్కడ ఇసుక కోసం తవ్వకాలు జరిపారు. రోజుకు ఎన్ని ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని ఆరా తీశారు. హంద్రీలో ఇసుక తరలిస్తున్న ప్రాంతం గాజులదిన్నె ప్రాజెక్టుకు చెందిన భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే, గంజిహళ్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి సొంత భూమి అని ఒక ట్రాక్టర్ ఇసుక రూ.400 చొప్పున అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు మైనింగ్ అధికారులకు తెలియడంతో అతడిని విచారించారు. అనంతనం ఆ అధికారులు మాట్లాడుతూ హంద్రీనదిలో తవ్విన గుంతలను కొలతలు తీసుకున్నామని.. అలాగే శ్రీనివాసులును విచారించిన రిపోర్టును జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. గోనెగండ్ల మండలంలో ఇసుక రీచ్కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అధికారుల అనుమతులు అక్కడ ఇసుక తవ్వకాలు జరపరాదన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మండలంలోని గంజిహళ్లి హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. తర్వాత వాటిని మైనింగ్ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
తండ్రి కర్మకాండకు వెళ్తూ..
● సంతజూటూరు ప్రభుత్వ పాఠశాల టీచర్ నాగన్న మృతి ● ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ప్రమాదం ● శోకసంద్రంలో బాధిత కుటుంబం జూపాడుబంగ్లా: తండ్రి కర్మకాండలకు వెళ్తూ కుమారుడు ప్రమాదానికి గురై మృతిచెందాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన బుధవారం జూపాడుబంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లాకు చెందిన జేమ్స్(చెంచన్న) డిసెంబర్ 31న మృతి చెందాడు. ఈయన కుమారుడైన నాగన్న (50) బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి కర్మకాండల నిమిత్తం బుధవారం భార్య విజయకుమారితో కలిసి నాగన్న స్వగ్రామమైన జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. ఆత్మకూరు ఆర్టీసి బస్టాండులో శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సులో ఎక్కారు. మరో ఐదు నిమిషాల్లో బస్సు జూపాడుబంగ్లా బస్టాండుకు చేరుకుంటుంది. నాగన్న దంపతులు దిగేందుకు ముందుగానే సీట్లోంచి లేచి ఫుట్బోర్డుపై నిల్చొన్నారు. కండక్టర్ చంద్రమోహన్ గమనించి అలా నిల్చొ వద్దని ఇరువురిని వారించాడు. అదే సమయంలో హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావటంతో బస్సు డ్రైవర్ ఆకుల లక్ష్మన్న సడన్ బ్రేక్వేశాడు. ఫుట్బోర్డుపై నిల్చొన్న నాగన్న బస్సు లోంచి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని పక్కనే నిలబడిన మృతుని భార్య కూడా పడబోతుండగా కండక్టర్ చె య్యి అడ్డుపెట్టడంతో ప్రమాదం తప్పి ంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యు లు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని బో రున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సంజీవ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించాడు. -
వైభవంగా గోదాదేవి పరిణయం
● అహోబిలంలో శాస్త్రోక్తంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు.. వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ శ్రీ అహోబిలేశుడు, గోదాదేవీ పరిణయ వేడుక బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వైభవంగా జరిగింది. ఈ తంతుతో నెలరోజులు విశేష పూజలు నిర్వహిస్తూ గోదాదేవి అమ్మవారిని రోజుకో అలంకరణ చేస్తూ నిర్వహించిన ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ముగిశాయి. బుధవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవర్లాతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక ధనుర్మాస, భోగి పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పెళ్లి మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశస్థాపణ, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి స్వామి, అమ్మవారిని ఆండాళ్ అమ్మవారి సన్నిధికి తీసుకెళ్లి శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని, గోదాదేవిని పల్లకీల్లో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. -
ఈత ఆకులే ఆభరణాలుగా
చెంచులే అతిథులుగా..శ్రీశైలంటెంపుల్: నల్లమల అడవిలో నివసించే చెంచులు భ్రమరాంబాదేవిని కూతురుగా, మల్లికార్జునస్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో బ్రహ్మోత్సవ కల్యాణానికి వారే అతిథులుగా నిలిచి ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామిఅమ్మవార్లను అలంకరించనున్నారు. మకర సంక్రాంతి రోజే జరిగే ఈ కల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక గాథ ప్రకారం: ప్రచారంలో ఉన్న స్థానిక గాథలను బట్టి ఒకానొకసారి పార్వతీదేవికి భూలోకా అందాలను తిలకించాలనే కోరిక కలిగింది. దాంతో అమ్మవారు చెంచు యువతి రూపాన్ని పొంది శ్రీశైలం అటవీ ప్రాంతానికి విచ్చేసింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దురాలైన అమ్మవారు కొంతకాలం శ్రీశైలంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అడవిలో ఒకచోట తన నివాసాన్ని ఏర్పరుచుకుని ఉండసాగింది. చెంచు రూపంలో ఉన్న పార్వతీదేవిని స్థానిక చెంచులు ఆదరిస్తూ ఆమెకు సపర్యలు చేయసాగారు. ప్రతిరోజూ ఆమెకు పాలు, తేనే, పలురకాల అడవిపండ్లు, దుంపలు మొదలైనవాటిని అమెకు ఆహారంగా ఇవ్వసాగారు. ఇక సంతానం లేని ఈ ప్రాంతపు చెంచుదొర దంపతులు అమ్మవారినే తమ సొంత బిడ్డగా భావించి పార్వతీదేవిపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. ఇదిలా ఉంటే అమ్మవారు కై లాసాన్ని వీడిరావడంతో కై లాసమంతా బోసిపోయింది. దాంతో పార్వతీదేవిని వెతుకుంటూ పరమేశ్వరుడు శ్రీశైల అడవికి చేరుకుంటాడు. అమ్మవారిని కలుసుకోవడానికి తాను కూడా చెంచు యువకుడి రూపం ధరిస్తాడు. ఇలా ఇద్దరు కలుసుకొని ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుని వివాహానికి సిద్ధపడుతారు. అయితే, తనను కన్నబిడ్డగా చూసుకున్న చెంచుదొర దంపతుల అంగీకారం పొందాలని అమ్మవారు స్వామిని సూచిస్తారు. అతను దొర వద్దకు వెళ్లి అడిగితే వివాహమైతే కుమార్తెను భర్తతో పంపాల్సి ఉంటుందని అంగీకరించడు. ఇలా ఎంతకీ చెంచులు వివాహానికి అంగీకరించక పోవడంతో స్వామి అమ్మవారు ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకుంటారు. ఆ పెళ్లి జరిగిన రోజే మకర సంక్రాంతి. తరువాత ఆ వివాహాన్ని తెలుసుకున్న చెంచులు చేసేదేమిలేక మహాశివరాత్రి రోజు అందరి సమక్షంలో స్వామిఅమ్మవారికి మళ్లీ పెళ్లి చేస్తారు. ఈ కథ ఆధారంగా శ్రీశైల సంస్కృతి లో చెంచులకు గల విశిష్టస్థానాన్ని గుర్తించిన దేవస్థానం గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. పార్వతీ, పరమేశ్వరుల కల్యాణానికి అటవీఆకులతో సిద్ధం చేసిన ఆభరణాలు కల్యాణానికి సిద్ధమైన పెళ్లి ఆభరణాలు శ్రీశైలం మేకలబండ చెంచు గూడెంలో నివసిస్తున్న మండ్లి మల్లికార్జున(దేవ చెంచు) స్వామిఅమ్మవార్ల కల్యాణానికి అడవి ఆకులతో ఆభరణాలు సిద్ధం చేశారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు. అలాగే స్వామివారికి జంజం, మెడలో ధరించేందుకు ఆభరణం, ఉంగరం, తలంబ్రాలుగా వెదురు బియ్యం ఇలా కల్యాణానికి అవసరమైన అన్ని వస్తువులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. -
పేర్లు మార్చిరి.. మూతేసిరి!
రామకృష్ణారెడ్డి: ఓయ్.. సుబ్బాడ్డి.. యాడికి పోతుండావు.. చేతిలో సంచి పట్టుకుంటివి.. బేగిరా .. మనోళ్లు వచ్చున్నారు. అప్పిరెడ్డి: సుబ్బాడ్డి పది రోజులు పాణం బాగ లేక ఆసుపత్రిలో ఉండే.. డీలర్ వద్దకు బియ్యం తెచ్చుకుని పోతుండు. చంద్రబాబు వచ్చాక సిస్టమ్ మార్సా. ఇప్పుడు రేషన్ బియ్యం బండి ఇంటి వద్దకు రాదు. డీలర్ వద్దకు పోయి మనమే తెచ్చుకోవాల. అంతేకాదు రేషన్ షాపులో కంది బ్యాలు, పిండి, చక్కర అన్నీ ఇప్పుడు ఇవ్వరు. జగన్ ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి అన్ని సరుకులు ఇచ్చిరి. ఒక్కొక్క సీఎం ఒక్కో విధంగా పాలన చేచున్నారు. సంజీవరెడ్డి: రేషన్ బండి దేవుడెరుగు... ఆ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ చూస్తే ఎంత గప్పుడు ఇప్పుడు ఎంతో తేడా. ఇప్పుడు ఎప్పుడు తెరుస్తారో.. ముచ్చారో తెలియదబ్బీ. ఏదో సచివాలయం ఉందంటే ఉంది. అందులోని ఉద్యోగులు సరిగా లేరు. ఏ పని కావాలన్నా అప్పుడు గ్రామంలోనే అయిపోయేది. ఇప్పుడు నంద్యాలకు వెళ్లాల్సి వచ్చుంది. రైతు భరోసా కేంద్రంలో జగన్ ప్రభుత్వంలో గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు లభించేవి. ఇప్పుడు దాన్లకు పేర్లు మారిచినప్పటి నుంచి ఎప్పుడూ మూస్తనే ఉంటారు. అప్పుడు ఎరువులు మాత్రం ఇస్తున్నారు. వెంకటరెడ్డి: చంద్రబాబు తన హయాంలో ఎన్నడూ ఒక్క మెడికల్ కాలేజీ కట్టలా. జగన్ తెచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ.. గీపీపీ అంటా.. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా ఉన్నాడు. కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంట కానీ.. ఒక్క రోజు యోగా చేయడానికి రూ.300 కోట్లు మన సీఎం ఖర్చు చేస్తాడు. జగన్ మళ్లీ సీఎంగా అయి ఉంటే ఈ పాటికి రాష్ట్రమల్లా కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేవి. సుధాకర్రెడ్డి: చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేసిఉండ్లా?. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేలు ఇస్తాడనుకుంటే నిరుద్యోగులను మోసం చేశాడు. సాంబిరెడ్డి: నిరుద్యోగులకే కాదబ్బీ. 18 ఏళ్లు దాటిన ఆడోళ్లందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పి మహిళలను సైతం మోసం చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఆ మాట చంద్రబాబు చెప్పడం లేదు. నెలనెలా రూ.1,500 వస్తాయని మహిళలు ఎంతో ఆశపడ్డారు. చంద్రబాబు కుర్చి ఎక్కి రెండేళ్లు అవుతున్నా ఆడబిడ్డ నిధి ఇవ్వడం లేదు. చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది మోసపోతిరి. బసివిరెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమీ అమలు కావడం లేదు. ఒక్క పింఛన్ పెంచడం తప్ప. పింఛన్ కూడా 50 ఏళ్లకు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఒక్కరికి కూడా కొత్త పింఛన్ ఇవ్వలేదు. పాండురంగాపురంలో.. -
కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు..
భాస్కర్రెడ్డి: శివాడ్డి ఎక్కడికి పోయింటివి..ప్యాంటు వేసుకున్నావు..గని కాడికి పోలేదా? శివారెడ్డి: తాడిపత్రికి పోయింటిని..పాలీష్ ప్యాక్టరీ ఓనర్ దగ్గరకు. సంక్రాంతి పండుక్కు లెక్క ఇస్తే కూలోల్లకు ఇద్దామనుకుంటిని..వ్యాపారాలు అప్పుడు మాదిరి లేవు..రాళ్లన్నీ ప్యాక్టరీలోనే ఆనుకున్నాయి.. అని కొంచెం ఇచ్చినాడు. కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు. ఇంతకు ముందు గన్లలో రాళ్లు ఉండగానే ముందుగానే అడ్వాన్సు ఇచ్చి తీసుకుబోతండిరి. ఇప్పుడు భంగకపోయి రాళ్లు ఎత్తిచ్చన్నాం. మనకున్నదే గన్లే కాబట్టి. కూలోల్లకు పండక్కన్నా డబ్బులు ఇయ్యక పోతే మల్లా గనికి రారు. ఏట్లైనా వాల్లకు లెక్క ఇయ్యాల్సిందే. కొన్నాల్లుంటే రాల్లు అడిగే వారుండరేమో.. భాస్కర్రెడ్డి: భాగ్యాలూ.. మేకలు బాగున్నాయా.. భాగ్యాలు: బాగనే ఉన్నాయిన్నా..కానీ మన ఊర్లో పసుల ఆసుపత్రి ఉంది కానీ మందులే ఉండవు. డాక్టరు లేడు.. వేరు వాళ్లు ఎప్పుడో ఒక సారి వస్తాడంటా. నేనేం మేకలు తోలుకొని మేతకు కొండకు పోయింటాను. ఆసుపత్రి పడిపోయేలాగా ఉంది. ఇంతకు ముందు గవర్నమెంట్లో పశువులకు మందులు ఎన్ని కావాలన్నా ఇస్తండిరి. ఎదన్న రోగం వచ్చి మేకలు చచ్చిపోతే ఇన్సురెన్స్ కూడా రావడం లేదంటా.. పోయిన ప్రభుత్వంలో పశవులు చచ్చిపోతే ఆఫీసర్లు పోస్టుమార్టం చేసి పైకి పంపించగానే లెక్క పడుతుండేదంట. భాస్కర్రెడ్డి: ఏం మద్దిలేటి.. యాడికి పోయింటివి లేటుగా వస్తివే! మద్దిలేటి: ఒళ్లంతా నొప్పులుంటే ఖాశీం డాక్టర్ కాడికి పోయింటి..సూదేసి రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. జగన్ ఉన్నప్పుడు నెల నెలా 104 బాగా వచ్చుండేది. ఇప్పుడు.. ఎప్పుడు వచ్చుందో తెల్దు. మాత్రలు కూడా అప్పుడు మాదిరాగా మంచివి కావంటున్నారు. రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. తగ్గక పోతే తాడిపత్రి కన్నా పోయి సూపించుకుంటా. పోయిన గవర్నమెంట్లో జగనన్న వైద్య శిబిరం మన ఊర్లో బడి కాడ పెట్టినప్పుడు పోయింటిని డాక్టర్లు మంచి మందులు ఇచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం ఊర్లలో ఒక్క సారి కూడా వైద్య శిబిరం పెట్టనేలేదు. భాస్కర్రెడ్డి: వెంకటనారాయణ నీకు 60 ఏళ్లు ఉండవు? వెంకటనారాయణ: 60 ఏళ్లు పడి సంవత్సరం దాటిందిప్పా. సచివాలయం కాడికి ఆధార్ కార్డు తీసుకొని ఐదార్లు సార్లు పోయినా సచివాలయం వాళ్లు ఇంకా పైనుంచి రాలేదు వచ్చినప్పుడు చెప్పుతామంటున్నారు ఏం చేయాలా. నాలాంటోళ్లు మన ఊర్లు చాలా మంది ఉన్నారంటప్పా. జగన్ ఉన్నప్పుడు ప్రతి వాళ్లకు ఇచ్చినాడు. అప్లికేషన్ పెట్టేదే ఆలస్యం వెంబడే వచ్చండ్లా. ఒక్కో ఊల్లో పించన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తన్నారు. కాళ్లు, చేతులు లేనళ్లకు ఇయ్యలా. అంకిరెడ్డిపల్లెలో.. -
మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం
నందవరం: మద్యం మత్తులో ఓ టీడీపీ నాయకుడు డ్యూటీ లోని కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో బైక్పై వస్తూ పడిపోగా లేపబోయిన కానిస్టేబుల్పైనే నోరు పారేసుకున్నా డు. నీవెంత, నువ్వు తాగవా అంటూ మానవత్వం చూపిన పాపానికి బూతులు తిట్టాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, నందవరం మండలంలోని నదికై రవాడి గ్రామానికి చెందిన కురవ వీరేష్ తెలంగాణలోని రాజపురంలో పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సరిహద్దు చెక్ పోస్టు వద్ద బైక్ నుంచి కింద పడిపోగా చెక్పోస్టు విధుల్లోని కానిస్టేబుల్ కె.రాజు మానవత్వంతో అతడిని లేపబోయాడు. ఇంతలోనే టీడీపీ నాయకుడు కొడకల్లారా.. నా ఇసుక ట్రాక్టర్లే ఆపుతారా అంటూ బూతులు మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వీరంగం సృష్టించాడు. ఇంతచేసినా ఇప్పటివరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో బుధవారం రెండు అడుగుల వరకు నీటి ప్రవాహం తగ్గింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లెల్సీకి దాదాపు 1,700 క్యూసెక్కుల నీరు వదులుతుండగా ప్రస్తు తం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్ర మే విడుదలవుతోంది. రెండు, మూడు రోజుల వరకు ఈ విధంగా నీటిని వదులుతూ పూర్తిగా నిలిపి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జలాశయం గేట్ల ఏర్పాటుకు సంబంధించి రబీలో డ్యాం నుంచి వచ్చే ఎల్లెల్సీతో పాటు ఇతర కాలువలకు నీటిని నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఖరీఫ్లో సాగు చేసిన వరి, ఇతర పంటలు డిసెంబర్ నెలలో చేతికి రావడంతో బోరు బావులున్న కొందరు రైతులు వరినారు వేసుకున్నారు. కాలువకు ఇంకా నీటి సరఫరా జరుగుతుండడంతో ఎల్లెల్సీ నీటితో మడులను తడిపి సిద్ధం చేసుకున్న రైతులు వరి, ఇతర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్లెల్సీ కింద ఒక కారు పంటతో సరి పుచ్చుకోవాల్సి రావడంతో బోరుబావులున్న రైతులు రబీ పంట విషయంలో బెంగపెట్టుకున్నారు. టీబీ డ్యాంలో 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి బుధవారం 1604 అడుగులతో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో లేకపోగా.. ఔట్ఫ్లో 3,474 క్యూసెక్కులు ఉంటోంది. పిచ్చికుక్క స్వైర విహారం పాణ్యం: తమ్మరాజుపల్లెలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో పలువురిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్క దాడిలో విష్ణు అనే బాలుడికి, మరో మహిళకు, వంట సామగ్రి వ్యాపారం నిమిత్తం వచ్చిన మరో మహిళకు గాయాలైనట్లు సమాచారం. అధికారులు చర్యలు చేపట్టి పిచ్చి కుక్కను తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు నందివాహనసేవ
సంక్రాంతి రోజు గురువారం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు నందివాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో గంగాపార్వతీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ● శ్రీగిరిలో వైభవోపేతంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ● నేడు పార్వతీ సమేత మల్లికార్జునుడికి కల్యాణోత్సవంచీకట్లను తరిమేస్తూ.. భోగి భాగ్యాలను ఆహ్వానిస్తూ.. సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం బుధవారం వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు పూర్తయిన తరువాత ప్రధాన ఆలయ మహాద్వార ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగి మంటలు వేశారు. అర్చకస్వాములు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరకు వేసి భోగిమంటలు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఈ భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించి, గణపతిపూజ జరిపారు. అనంతరం షోడశోపచారపూజలు నిర్వహించి రేగిపండ్లను, చిన్న చిన్న చెరకు ముక్కలు, పూలరెక్కలతో కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి భోగిపండ్లను పిల్లలపై వేశారు. ఈ భోగిపండ్లు వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతుంది. భక్తజనం మధ్య గ్రామోత్సవం -
రూ.10 వేల కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర
కల్లూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్పరం చేసి రూ.10వేల కోట్ల ఆస్తిని తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఆయన కల్లూరులో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రతులను, పీపీపీ జీవోలను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పని చేస్తోందన్నారు. నిరుపేద విద్యార్థుల మెడికల్ కలను సాకారం చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చా యన్నారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ పద్ధతిన ప్రయివేటుపరం చేసే దిశగా అడుగులు వేయడం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మెడికల్ కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది పేదలకు సూపర్ స్పెషాలిటి వైద్య సేవలు అందడంతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందు బాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, రాయలసీమ మహిళ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, సుదర్శన్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 18 నుంచి శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వాముల గురు వైభవోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 24వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్ యస్కె.శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా గురువైభవోత్సవ ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు మట్లాడుతూ భక్తులు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందాలని కోరారు. ఫిబ్రవరి 19న గురు వైభవోత్సవాల్లో భాగంగా 405వ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.3.72కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.3,72,50,251 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహనాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో 21రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అలాగే బంగారం 158గ్రాముల200మిల్లీగ్రాములు, వెండి 11కేజీల460గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా లభించిందన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో హుండీల లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, భరద్వాజశర్మ, డీఈఓ ఆర్.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని సోమవారం మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆండాల్ ఆమ్మవారి దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ముగించారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
మోసం చేశారు.. న్యాయం చేయండి
● ఏఎస్పీకి ఫిర్యాదులు అందించిన ప్రజలునంద్యాల: అబద్ధపు మాటలు చెప్పి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబుకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. బండిఆత్మకూరు మండలం భోజనం గ్రామం పరిధిలో స్థలాన్ని ఇస్తామని రూ.1.50లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నారని, న్యాయం చేయాలని నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకట నాగేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేశారని డోన్ పట్టణానికి చెందిన దేవా సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన భూమిలో ఇల్లు కట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జా చేయాలని చూస్తున్న వారి నుంచి స్థలాన్ని కాపాడాలని నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లు కోరారు. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పేర్కొన్నారు. -
108 .. ముక్కుతూ మూల్గుతూ!
● ఆటో, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు● గంట సేపైనా రాని 108 వాహనం బండిఆత్మకూరు: మండలంలోని సోమవారం పార్నపల్లిలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా గంట సేపు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. వెలుగోడు నుంచి నంద్యాల వైపు బైక్పై వెళ్తున్న లక్క కేశవ పార్నపల్లి గ్రామంలోని చర్చి వద్దకు రాగానే నంద్యాల నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కేశవ తలకు గాయమవడంతో పాటు కుడి చేయి, ఎడమ కాలు విరిగింది. దీంతో గ్రామస్తులు 108కి ఫోన్ చేశారు. అయితే గంట సేపైనా వాహనం రాకపోవడంతో క్షతగాత్రుడు నొప్పితో అల్లాడిపోయాడు. ఎట్టకేలకు 108 రావడంతో అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమంటోంది!
కర్నూలు: టీడీపీలో మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో పాటు ఆ పార్టీ నేతలనే పరోక్షంగా బెదిరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం ఇన్చార్జి విష్ణువర్దన్రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చేతులు కలిపినట్లు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. కోడుమూరులో ఇటీవల మంత్రి అచ్చెన్నాయడు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, విష్ణు మధ్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదిన వేడుకల సందర్భంగా వెలిసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీని వెనుక మంత్రి టీజీ హస్తం ఉన్నట్లు శ్యాంబాబు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్బాబుపై జరిగిన దాడి పట్ల కూడా విష్ణు తీవ్రంగా స్పందించారు. దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుదున్న సునీల్బాబును స్వయంగా వెళ్లి పరామర్శించారు. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస పరిణామాలతో మంత్రి వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విష్ణు, కేఈలు కలిసి పార్టీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు వారి అనుచరుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలులో మంత్రి అనుచరుల గుండాయిజంపై చంద్రబాబు, లోకేష్లకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి అనుచరుల గుండాయిజంపై విష్ణు ఫైర్ ‘‘తాజా పరిణామాలు పూర్తిగా నాకు తెలుసు, వాటి పర్యవసానం త్వరలో మీరే చూస్తారు. సునీల్బాబు.. విష్ణువర్దన్రెడ్డి అనుచరుడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అతను టీడీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాయకుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు దాడి చేశారు. మనపై జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా మనం కూడా అదే స్థాయిలో స్పందించాలి. ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదు’’ అంటూ విష్ణువర్దన్రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో ముఖ్య అనుచరులు, కర్నూలు మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను తాపత్రయపడుతున్నానని, ఇటీవల ఆల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్పైప్ లీకేజీ విషయంలో కూడా అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేశాను. అయితే చివరి నిమిషంలో అధిష్టానం సూచన మేరకు విరమించుకున్నట్లు చెప్పారు. వివాదాస్పదమవుతున్న మంత్రి టీజీ భరత్ తీరు జట్టుకడుతున్న రెండు ప్రధాన కుటుంబాలు ఆజ్యం పోసిన సోషల్ మీడియా కార్యకర్తపై దాడి ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశమైన విష్ణు అదేస్థాయిలో స్పందిద్దామని భరోసా -
పింఛన్ ఇవ్వాలి.. వంతెన నిర్మించాలి
● పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చిన ప్రజలునంద్యాల: తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన రహమత్ బీ అనే మహిళ అర్జీ ఇచ్చారు. తన 0.50 ఎకరాలు రహదారి నిర్మాణంలో పోతోందని, నష్టపరిహారం ఇవ్వాలని కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేటకు తిరుమలగారి కొండయ్యకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో శ్మశానవాటిక వెళ్లే దారిలో వాగు ఉండడంతో ఇబ్బందిగా ఉందని, వంతెన నిర్మించాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామస్తులు పత్రం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్డీఎ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన 328 అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను డీఆర్ఓ డి. రామునాయక్ ఆదేశించారు. -
రాష్ట్ర పార్టీ కమిటీలో సూర్యనారాయణరెడ్డికి స్థానం
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పాణ్యం నియోజకవర్గానికి చెందిన సూర్యనారాయణరెడ్డిని రాష్ట్ర సెక్రటరీ(పార్లమెంట్)గా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా ఉపాధ్యక్షుడిగా గత కొంత కాలంగా సూర్యనారాయణరెడ్డి కొనసాగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీలో ఆయనకు స్థానం కల్పించింది. కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది ఖరీఫ్లో పండించిన కందులను నాఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ కర్నూలు బ్రాంచీ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు నాఫెడ్ ఏపీ స్టేట్ హెడ్ వినయ్కుమార్ తెలిపారు. సోమవారం మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధర రూ.8వేలతో కందులను కొనుగోలు చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా అక్కడే రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కొనుగోలు తేదీ ఇస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(అర్బన్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని 91 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే అనేక మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొనలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులపై 24 గంటల్లోగా సచివాలయ ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు. సమస్యలను సత్వరం పరిష్కరించాలి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్ఈ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరిస్తే వినియోగదారుల్లో సంతృప్తి రేటు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ చేసి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. సోమవారం కలెక్టరేట్లోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఈ నెల 22న నిర్వహించే విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిడుతూరు తహసీల్దారుగా పని చేసి 2024 జనవరి 31న పదవీ విరమణ పొందిన సిరాజుద్దిన్ ఈ సందర్భంగా తన గోడు వినిపించారు. కర్నూలుకు చెందిన ఈయనకు రెండేళ్లవుతున్నప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. 2024 జనవరి నెల నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఈయన పెన్షన్ ప్రపోజల్స్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. జూన్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారులు విశ్రాంత తహసీల్దారు పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే కనీసం పెన్షన్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. నిరంతర పోరాటంతో 9 నెలల క్రితం పెన్షన్ మంజూరైంది. ఇక ఏపీజీఎల్ఐ, ప్రాపిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, 10 నెలల సెలవు వేతనం ఇప్పటికీ చెల్లించని పరిస్థితి. దాదాపు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. రెవెన్యూ శాఖలో ఈయన ఒక్కరే కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే ఆవేదన.బైక్ అదుపు తప్పి.. డోన్ టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఖాజా హుస్సేన్(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు పట్టణ సమీపంలోని యు. కొత్తపల్లెలో క్లీనిక్ నిర్వహిస్తూ ప్రతి రోజు బైకుపై కొత్తపల్లె గ్రామానికి వెళ్లి వచ్చేవాడు. విధి నిర్వాహణలో భాగంగా బైక్పై వెళుతుండగా వైఎస్, కోట్ల నగర్ కాలనీల మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచేందకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంద్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో నిరక్షరాస్యులుగా ఉన్న 1,61,914 మందిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. అక్షరాంధ్రలో భాగంగా నిరక్షరాస్యులకు డీఆర్డీఏ, మెప్మా, విద్యా వలంటీర్ల ద్వారా చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, వయోజనవిద్య డీడీ చంద్రశేఖరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్, సీపీఓ భారతి, డివిజినల్ పంచాయతీ అధికారి తిమ్మక్క పాల్గొన్నారు. ఫుట్బాల్ విజేత అనంతపురం కర్నూలు (టౌన్): నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్జోన్ స్థాయి మహిళల ఇన్విటేసన్ ఫుట్బాల్ టోర్నమెంటు సోమవారం సాయంత్రం ముగిసింది. ఫైనల్ పోరులో చైన్నె మాసి మహిళల జట్టుపై 1–0 గోల్స్తో అనంతపురం ఆర్డీటీ జట్టు విజేతగా నిలిచి కప్పు కై వసం చేసుకుంది. మూడవ పట్టణ సీఐ శేషయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పీడీ శ్రీనివాస రెడ్డి, టోర్నీ ఆర్గనైజేషన్ కార్యదర్శి బ్రహ్మకుమార్ పాల్గొన్నారు. -
బోడబండలో పట్టపగలు భారీ చోరీ
● 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి ఏకంగా 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనర్సిరెడ్డి అనే వ్యక్తి ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పొలం పనులు ముగించుకొని వచ్చిన పెద్దనర్సిరెడ్డికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం, తలుపులు తెరుచుకొని ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలోని 15 తులాల బంగారు చోరీకి గురైందని బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
మాకు పరిహారం ఏదీ?
కర్నూలు(సెంట్రల్): ఉల్లి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని దేవనకొండ మండలం గుడిమిరాళ్ల, బేతపల్లి, చెల్లెలి చెలిమల, కొటకోండ, బండపల్లి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు టీడీపీ నాయకులకు ఇచ్చి నిజమైన బాధితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామాల ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వకీలు రంగన్న, ప్రకాస్రెడ్డి, హనుమంతరెడ్డి, సురేంద్రబాబు, మల్లి, భాస్కర్, విజయుడు, వంశీశెట్టి, గోపాల్, సోమలింగ, షేక్ మహ్మద్బాషా, గజ్జెలు శ్రీనివాసులు, బోయ కిష్టన్న, కౌలుట్లయ్య, ఆంజనేయులు, రంగడు మాట్లాడుతూ..తమ గ్రామాల్లో వందల మంది ఉల్లి పండించి ధర లేక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కూడా రాకపోవడంతో పారబోసి వచ్చామని, అయితే ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులకు కాకుండా మండలంలో టీడీపీ నాయకులకు మాత్రమే అందించారన్నారు. పరిహారం మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికారులు స్పందించి నష్టపోయిన రైతుల కు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, ఉల్లి రైతులకు ఏపీ రైతు సంఘం నాయకులు వీరశేఖర్, సూరి మద్దతు తెలిపారు. అనంతరం రైతులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో తమకు న్యాయం చేయాలని వినతిపత్ర ఇచ్చారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బేతంచెర్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మండల పరిధిలోని సీతారామాపురం మెట్ట వద్ద 340బీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని యంబాయి గ్రామానికి చెందిన పరమేశ్వరప్ప(55) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. సీతారామాపురం మెట్ట వద్ద కర్నూలుకు వెళ్తున్న కోవెల కుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరమేశ్వరప్ప తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తర్వాత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. బుగ్గరామేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ జడ్జి ఓర్వకల్లు: మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన బుగ్గరామేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా కాల్వబుగ్గ దేవస్థానానికి రాగా ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, ఈఓ మద్దిలేటి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి బుగ్గరామేశ్వర స్వామిని దర్శించుకోగా ఆలయ అర్చకులు కళ్లె లక్ష్మీనారాయణ శర్మ వారికి ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వదించారు. -
విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టేస్తుంది!
● విద్యుత్ కంచెల నుంచి రక్షణకు అటవీశాఖ వినియోగం ఆత్మకూరురూరల్: అటవీ సమీప గ్రామాల్లోని రైతులు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు తమ పొలాలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తారు. కొన్ని సార్లు ఈ కంచెకు పెద్దపులిలాంటి ముఖ్య సంరక్షిత జంతువులు కూడా బలయ్యే అవకాశముండటంతో వాటిని అధికారులు నిషేధించారు. అయినప్పటికీ నల్లమల అటవీ సమీప గ్రామాల్లోని రైతులు కొందరు గుట్టుగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించి వాటిని తొలగించేందుకు అటవీ సిబ్బంది పొలాల్లో తచ్చాడుతుంటారు. ఈ క్రమంలో వెలుగోడు వెస్ట్ బీట్లో విద్యుత్ కంచె తగిలి లక్షణ నాయక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ ప్రసారాన్ని కొద్ది దూరం నుంచే గుర్తించి హెచ్చరించే ( లైవ్ వైర్ డిటెక్టర్) పరికరాన్ని అటవీశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో అటవీ రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి పరికరాలను నాలుగు చొప్పున కేటాయించారు. ఈ పరికరాన్ని మధ్యప్రదేశ్కు చెందిన ఒక అటవీ అధికారి తయారు చేసినట్టు తెలిసింది. ఈ పరికరం ద్వారా కరెంటు ప్రవాహమున్న తీగలు కంటికి కనిపించకున్నా కొన్ని అడుగుల ముందే గుర్తించవచ్చు. ఫుట్ పెట్రోలింగ్ చేసే సిబ్బందికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ పరికరాన్ని డీడీ విగ్నేష్ అపావ్ సోమవారం పరిశీలించి, ఆపరికరం పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల ఆలయం మస్తాబు అయింది. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంగా సోమవారం ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. అలాగే మహాగణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం జరిపిస్తారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, ఽ7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
జాతీయ స్థాయి పోటీలకు వర్షిత
కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 29న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అసోషియేషన్ రగ్బీ పోటీల్లో ప్రతిభ కనపరచడంతో జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 13 నుంచి భువనేశ్వర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ గేమ్స్లో కూడా జాతీయస్థాయికి ఈ బాలిక ఎంపిక అయ్యారని, పోటీలు ఈ నెల చివరల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు. -
దారిలోనే దేవుడు కనిపిస్తాడు
కొత్తపల్లి: దేవుడిని దర్శించుకుందామని బయలు దేరిన భక్తులకు దారిలోనే కనిపిస్తాడు. కొలనుభారతి, సంగ మేశ్వరం క్షేత్రాలు ఉన్న రహదారి గుంతలమయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి క్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు గతులకు రహదారిని చూసి దేవుడా.. అనుకుంటూ వెళ్తున్నారు. వాహదారుల, ప్రయాణికుల ప్రయాణం సజావుగా సాగలంటే రోడ్లు బాగుండాలి. గుంతల్లేని రహదారులే లక్ష్యమంటూ పాలకులు ప్రచారం చేస్తూ కనీసం ప్రధాన రహదారులను కూడా పట్టించుకోవడం లేదు. రోడ్లన్ని అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు, వాహనదారులకు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం చేరాలంటే భక్తులు 45 కి.మీలు, ఇదే దారిలో 30 కి.మీలు కొలనుభారతి పుణ్యక్షేత్రం ఉంది. దారంతా గుంతలు, కంకర తేలిన రహదారితో వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈనెల 23వ తేదీన కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి దేవి అమ్మ వారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులు వాహనాలు, బస్సులు, ఆటోల్లో చేరుకుంటారు. అలాగే ఆత్మకూరు పట్టణం నుంచి కొత్తపల్లి మండాలని సుమారు 12 గ్రామ పంచాయతీలలోని ప్రజలు ప్రతి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఉత్సవాలు సమీపిస్తుండటంతో వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.బావాపురం – నందికుంట గ్రామాల మధ్య భయపెడుతున్న గుంతలునందికుంట సమీపంలో రహదారిపై కంకర తేలిన దృశ్యం అధ్వానంగా ఆత్మకూరు – సంగమేశ్వరం రహదారి 45 కి.మీలు నరకయాతన ప్రధాన క్షేత్రాలు ఉన్నా పట్టించుకోని అధికారులు -
దామోదరం జయంతిని ‘సాధికారత’గా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 లేదా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11వ తేదీని సామాజిక సాధికారత దినంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో దామోదరం సంజీవయ్య తొలి దళిత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర కల్కూర, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, మానవశక్తి పరిశోధన కేంద్ర వ్యవస్థాపకుడు ఎస్ఏ రెహమాన్, కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం.హర్ష తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దామోదరం సంజీవయ్య ఎన్నో విప్లవాత్మక, సామాజిక మార్పులు తెచ్చారన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సాధికారతకు కృషి చేసిన నేపథ్యంలో దామోదరం సంజీవయ్యకు గౌరవంగా సాధికారత బహుమానం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈమేరకు సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడి సాధికారత దినోత్సవం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
దుకాణాలలో చోరీ
ఓర్వకల్లు: రెండు వేర్వేరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో మస్తాన్ కిరాణం దుకాణం, దామోదరం అనే వ్యక్తి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కన స్టేషనరీ షాపు నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపులకు తాళం వేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో మస్తాన్ దుకా ణం తాళం పగులగొట్టి రెండు బియ్యం బస్తాలు, రూ.3 వేల నగదు, దామోదరం దుకాణంలో రూ.1300, స్టేషనరీ సామగ్రి అపహరించారు. ఆదివారం ఉదయం చోరీలు వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఆదివారం ఆక్సిజన్ పైప్లైన్లో లీక్ ఏర్పడింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి కంటి ఆసుపత్రికి వెళ్లే ఆక్సిజన్ పైప్లైన్ ప్రధాన ద్వారం సమీపంలో లీక్ కావడంతో సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులకు చర్యలు ప్రారంభించారు. ఆక్సిజన్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను పిలిపించారు. మధ్యాహ్నం వరకు శ్రమించి లీకేజీని అరికట్టడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం కావడం, కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అమర్చిన రోగులు ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. -
రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మాత దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారి మహమ్మద్ ఆదివారం తెలిపారు. మార్కాపురం జిల్లా నెక్కంటి పరిధిలోని ఇష్టకామేశ్వరి మాత అమ్మవారి ఆలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వాహనాలను నిలుపుదల చేసి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు గమనించి ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించారు. 31న ఎంపీపీపై అవిశ్వాసం జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండల ఎంపీపీ సువర్ణమ్మపై ఈనెల 31వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. ఎంపీటీసీ సభ్యులకు ఆత్మకూరు ఆర్డీఓ నాగ జ్యోతి నోటీసులు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన సువర్ణమ్మను ఎంపీపీ పీఠం నుంచి దించేందుకు మండలంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ మేరకు వినతిపత్రాన్ని పరిశీలించి అవిశ్వాస తీర్మానం సభ లో ప్రవేశపెట్టేందుకు ఈనెల 31వ తేదీని ఆర్డీఓ నిర్ణయించారు. 2021 ఏప్రిల్ 8న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా తాటిపాడు, పారుమంచాల గ్రామా ల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలువలేదు. 2024 ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ సువర్ణమ్మను పీఠం నుంచి దింపేందుకు యత్నించటం గమనార్హం. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 12వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అటవీ శాఖలో డ్రోన్ పైలట్లు ● శిక్షణకు ఆరుగురు అధికారుల ఎంపిక ఆత్మకూరురూరల్: అటవీ సంరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్కు చెందిన ఆరుగురు అధికారులు డ్రోన్ పైలట్లుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆత్మకూరు డివిజన్ ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అపావ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని డ్రోన్ అకాడమిలో శిక్షణ కోసం ఆరుగురు అధికారులను ఎంపిక చేసి పంపామని, వారు డ్రోన్ అకాడమి డైరెక్టర్ వద్ద ఆదివారం రిపోర్ట్ చేశారన్నారు. కెపాసిటి బిల్డింగ్లో భాగంగా డివిజన్కు చెందిన ఎఫ్ఎస్ఓలు మహబూబ్ బాషా, రాజశేఖరరెడ్డి, ఎఫ్బీవోలు పీరా సయ్యద్, ఇస్మాయిల్, రజాక్ సాహెబ్, శ్రీనివాసులు శిక్షణ పొందడం కోసం వెళ్లారని వివరించారు. 57 రోజుకు చేరిన రిలే దీక్షలు ఆదోని టౌన్: ఆదోని జిల్లాను సాధించుకునేంతవరకు ఐక్యంగా పోరాడుదామని జేఏసీ నాయకులు రఘురామయ్య, కుంకనూరు వీరేష్, దస్తగిరి నాయుడు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 57వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు కమతం వెంకటేష్, వై.వెంకోబ, సి.వీరేష్, నరేంద్రయాదవ్, కుమార్, రామలింగయ్య, వెంకటేష్, నరసింహా, మల్లికార్జున, అశోక్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. -
యువ శక్తి.. విజయ కీర్తి
● వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతున్న యువత విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న వైనం ● నేడు స్వామి వివేకానంద జయంతిదేశ రక్షణలో భాగస్వామి కావాలని.. చిత్రంలో ఉన్నది దూది మనీషా. ఆళ్లగడ్డ మండలం రామతీర్థం గ్రామానికి చెందిన దూది లక్ష్మమ్మ, దూది చిన్నమద్దిలేటి దంపతుల కుమార్తె. రామతీర్థం జెడ్పీహెచ్ఎస్లో పాఠశాల విద్య, నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్వైవీసీపీ కళాశాలలో ఇంటర్ చదివారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొంది దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్సీసీలో చేశారు. గత ఏడాది మేలో నంద్యాలలో 9 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరం–1, 2లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతపురంలో 6వ ఆంధ్రా పటాలం ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరం–1లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆగస్టు 21 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలోనే జరిగిన తల్ సైనిక్ తుది శిబిరంలో కూడా రాణించి బంగారు పతకం అందుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో పాల్గొని బంగారు పతకాలు సాధించి అభినందనలు అందుకున్నారు. ‘తల్లిదండ్రులు సహకారం, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ అనూషల మార్గదర్శనంలో ఎన్సీసీలో రాణించడం ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరి దేశ సేవ చేయడమే లక్ష్యం ’ అని దూది మనీషా చెబుతున్నారు. జాతి ఖ్యాతి పతాకను విశ్వ వేదికపై రెపరెపలాడించిన స్వామి వివేకానంద ఎందరికో ఆదర్శం. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో యువతను చైతన్య పరిచారు. నిరుత్సాహం ..నిస్తేజం.. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతలు, అసమానతలు వదలి.. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మ వికాసం పెంపొందించుకొని ముందుకు పయనించాలన్నదే వివేకానందుని ప్రభోదనల అంతరార్థం. స్వశక్తిపై ఆధారపడి ఇతరులకు సాయపడేలా మనం నేర్చుకున్న విద్య ఉపయోగ పడాలని వివేకానందుడు బోధించారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల విజయాల మనోగతం ఇలా.. – కర్నూలు కల్చరల్చిత్రంలో ఉన్నది ఎం.డి.నాగరాజు. కృష్ణగిరి మండల కేంద్రానికి చెందిన పార్వతమ్మ, సంజీవయ్యల దగ్గర (జేజీ, జేజినాన్నలు పెంచారు) పెరిగిన ఇతను కృష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్లో పాఠశాల విద్య, కళా శాల విద్యను అభ్యసించాడు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలో ని కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీకాం చివరి చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొందితే అన్నిరంగాలో రాణించడంతో పాటు క్రమశిక్షణతో పాటు దేశ భక్తి అలవుడుతుందని ఇందులో చేరినట్లు నాగరాజు చెబుతున్నాడు. గత ఏడాది మేలో కర్నూలు నగరం సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రా బెటాలియన్–1 ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరంలో పాల్గొని రైఫిల్ షూటింగ్లో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం 6వ ఆంధ్రా బెటాలియన్ వార్షిక శిక్షణ శిబిరంలో కర్నూలు గ్రూప్ తరుఫున పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. అనంతపురంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో రజతం, కాకినాడలో ఆంధ్రా బెటాలియన్ –3 ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో 7వ స్థానం, ఆగస్టులో అనంతపురంలో జరిగిన తల్సైనిక్ తుది శిబిరంలో రైఫిల్ షూటింగ్లో 5వ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో కర్నూలు గ్రూప్నకు ప్రాతినిథ్యం వహించి బంగారు పతకం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉండి రక్షణ విభాగానికి ప్రాతినిథ్యం వహించాలన్నది తన లక్ష్యమని, కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, ఎన్సీసీ ఆఫీసర్ కమ్లినాయక్ ప్రోత్సాహంతోనే ఉన్నతంగా రాణిస్తున్నామని నాగరాజు చెబుతున్నారు. -
యాదవులను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం
● అఖిల భారత యాదవ మహాసభ నేతలుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యాదవులను గుర్తించకపోవడం దారుణమని అఖిల భారత యాదవ మహాసభ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శకుంతల కళ్యాణ మండపం ఆవరణలో నందికొట్కూ రు, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘాలు ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాయలసీమ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, నాయకు లు సదానందం యాదవ్, ఓంకార్ యాదవ్, బాల చెన్నయ్య యాదవ్, మల్లికార్జున యాదవ్, దేవశంకర్యాదవ్, రాముడు యాదవ్ తదితరులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కాటమరాజు ముత్తుకూరు గౌడప్ప యాదవ్, గోసాయి వెంగన్నయాదవ్ వంటి మహోన్నత వ్యక్తులు అనేక ఉద్యమాలు చేశారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పండుగల జాబితాలో ఒక్క యాదవ రాజుకు కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇదే వైఖరితో వ్యవహరిస్తే భవిష్యత్తులో యాదవుల శక్తిని ఈ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు.యాదవ నేతలు విజయభాస్కర్యాదవ్, శ్రీనివాసులు యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ నీటి హక్కులను కాలరాయడం తగదు
నంద్యాల(అర్బన్): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి పేరుతో రాయలసీమ నీటి హక్కులను కాలరాయడం తగదని రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని నిరంతరం దిగువకు వదిలే విధానాన్ని తక్షణమే నిలిపి నాగార్జున సాగర్కు కేటాయించిన నీటితో మాత్రమే విద్యుత్ఉత్పత్తి చేయాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయాలన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ అవసరాలకు వినియోగించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుల్లో పూడిక కారణంగా ఇప్పటికే 90టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో పూడిక నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు కీలకమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వెంటనే చేపట్టాలన్నారు. సీమ అభివృద్ధిని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు కుంటల పునరుద్ధరణ అత్యంత కీలకమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక నిధులను సీమలోనే పూర్తిగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్రెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్రావు పాల్గొన్నారు. -
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఈఓ పాండు రంగారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తి కుటుంబసభ్యులను సన్మానించి ఉమామహేశ్వరస్వామి చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాన్ని అందజేశారు. నాలుగు తులాల బంగారం అప్పగింత ఆదోని అర్బన్: ఆటోలో మరిచిపోయిన నాలుగుతులాల బంగారాన్ని గుర్తించి బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు..అనంతపురం పట్టణానికి చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి శనివారం ఆదోనికి వచ్చారు. బస్టాండ్లో బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కి పట్టణంలోని అమ్మ ఇంటికి వెళ్లారు. ఆటోలో హ్యాండ్ బ్యాగు మరిచిపోయారు. అందులో రూ.5 లక్షలు విలువచేసే నాలుగు తులాల బంగారం, ఒక ఫోన్ ఉంది. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ లేదని గుర్తించిన విజయలక్ష్మి వెంటనే వెంటనే వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బ్యాగ్లో ఉన్న ఫోన్ నంబర్ తీసుకుని లొకేషన్ ద్వారా ఆటో ఎక్కడ ఉందో గుర్తించి సమాచారం అందించారు. డ్రైవర్ విద్యాసాగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను బాధిత మహిళకు అందించారు. దీంతో ఆటో డ్రైవర్ విద్యాసాగర్ను సీఐ శాలువా కప్పి సన్మానించారు. వెనుక సీటులో ఉన్న బ్యాగును తాను ముందే చూసి ఉంటే వెంటనే ఇచ్చేవాడినని డ్రైవర్ ఈ సందర్భంగా తెలిపారు. మంత్రాలయం రూరల్ : 1990–91 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీస్సులతో గురువుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చనిపోయిన గురువులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో కలసి కట్టుగా భోజనం చేశారు. కార్యక్రమంలో గురువులు, పూర్వ విద్యార్థులు శంకరయ్య, మాబు, బసప్ప, సరోజ, సూర్యనారయణ, శ్రీకాంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన యువకుడి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన చాకలి మహేంద్ర(21), కురువ భరత్ కర్నూలు ఫర్మెన్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. భరత్కు సంబంధించిన కూరగాయలను మార్కెట్లో అమ్ముకునేందుకు శనివారం సాయంత్రం ఆటోలో పంపారు. భరత్ తన మోటారు సైకిల్పై స్నేహితుడు మహేంద్రతో కర్నూలుకు బయలుదేరారు. కూరగాయలు అమ్ముకొని రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద బైక్ అదుపుకాకపోవడంతో వెనకాల కూర్చున్న మహేంద్ర కింద పడి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మహేంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి మద్దికెర: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్రమాదం మద్దికెర– పత్తికొండ రోడ్డులో బురుజుల గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ట్రాక్టర్ మట్టి తీసుకుని వచ్చే నిమిత్తం పత్తికొండకు వెళ్తూ అదుపుతప్పింది. తగ్గులో ఉన్న పొలాల్లోకి వెళ్లి వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన దొడ్ల బోయకిష్టప్ప (64) అనే వ్యక్తిపై ట్రాలీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఉన్న గుంతకల్లుకు చెందిన శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని 108లో గుంతకల్లుకు తరలించారు. విషయం తెలుసుకున్న మద్దికెర ఎస్ఐ హరిత పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకులకు తప్పిన ప్రమాదం మహానంది: నంద్యాల పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆదివారం మహానందికి వచ్చారు. మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు నంద్యాలకు వెళ్తుండగా పర్యావరణ కేంద్రం దాటిన తర్వాత వారి ముందు ఓ బైక్ వెళ్తుండటంతో తగులుతుందేమోనని సడన్ బ్రేక్ వేశారు. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వస్తుండటం, ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైకును కాల్చిన దుండగులు మహానంది: గోపవరం గ్రామంలో బైకుకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం మల్లికార్జున తన ఇంటి ముందు బైకును పెట్టి నిద్రించారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు బైకుకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తాము నిద్రిస్తున్నామని, కాలిన వాసన, మంటలతో కూడిన శబ్ధం రావడంతో బయటికి వచ్చే సరికి బైక్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి మహానంది: ప్రమాదవశాత్తూ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విజయ్కుమార్(13) ఈ నెల 6న పాఠశాల ఆవరణలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూ లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలు కోలేక ఆదివారం ఉదయం మృతి చెందినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. సాంబవరం గ్రామానికి చెందిన ప్రతాప్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు విజయ్కుమార్, మరో కుమార్తె ఉన్నారు. 13 ఏళ్లకే కుమారుడికి నిండు నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ లేక పోవడంతో విద్యార్థుల ప్రాణాలకు భద్రత కరువైందని స్థాని కులు విమర్శిస్తున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారు లు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలో కొన్నేళ్లు గా పని చేస్తున్న వారిని మార్చి, కొత్తవారిని నియమించి, విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
కర్నూలు (టౌన్): సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను డీఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కేవల ం సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డయల్ 112, డయల్ 100కు లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
కుక్ పోస్టులకు ‘ఉన్నత’ దరఖాస్తులు
● 77 నాన్ టీచింగ్ పోస్టులకు 8,982 దరఖాస్తులుకర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కుక్ పోస్టులకు ఉన్నత విద్యావంతులు (పీజీ చదివిన వారు) సైతం పోటీ పడుతున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనే టీడీపీ అధినేత హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క జ్యాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇటీవల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 77 పోస్టులు ఉంటే 8,982 దరఖాస్తులు వచ్చాయి. కుక్ పోస్టులకు పీజీ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. ఉన్నత విద్యావంతులు అధికం జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యాలు, 16 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందు లో 16 కేజీబీవీల్లో అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులు 32 ఉన్నాయి. వొకేషన్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 12, ఏఎన్ఎం 8 పోస్టులు భర్తీ చేయనుండగా..ఈ పోస్టులు జిల్లా స్ధాయిలో భర్తీ చేయనున్నారు. ఏపీ మోడల్ స్కూళ్ల లో నాలుగు వార్డెన్ పోస్టులు, తొమ్మిది పార్ట్టైం టీచర్ పోస్టులు, తొమ్మిది కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులు మండల స్థాయిలోనే భర్తీ చేయ నున్నారు. కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులకు ఉన్నత విద్య అభ్యసించిన యువతీ, యువకు లు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దళారులుగా మారిన టీడీపీ నాయకులు మండల స్థాయిలో భర్తీ చేసే పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో టీడీపీ నేతల సిఫారసులు సైతం ఈ పోస్టులకు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యో గుల వద్ద భారీగా డబ్బులు తీసుకుని సిఫారసు లేఖలు తీసుకొచ్చారు. మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నెల 3న మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. -
ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
● నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం విడ్డూరం ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి నంద్యాల(అర్బన్): గత ఖరీఫ్లో ఉల్లి పంట సాగుతో నష్టపోయిన జిల్లా రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 5,486.8 హెక్టార్లలో గత ఖరీఫ్ కింద రైతులు ఉల్లి సాగు చేశారన్నారు. దాదాపు 47,250 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడులు వచ్చినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారన్నారు. మరికొంత దిగుబడులు రావాల్సిన సమయంలో వాతావరణం మార్పులతో ఎదుగుదల లేకపోవడం, అదే సమయంలో మార్కెట్లో ధర లేకపోవడంతో పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారన్నా రు. ఆ పరిస్థితుల్లో సంబంధిత అధికారు లు నష్టపోయిన రైతు ల వివరాలను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. అధికారులు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉల్లి రైతులకు మంజూరు చేసిన పంట నష్ట పరిహారంలో నంద్యాల జిల్లా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే పంట నష్ట పరిహారం అందకుండా పోయిందని చెప్పారు. పంట దిగుబడులు లేకపోవడంతో గత సెప్టెంబర్ మాసంలో ప్రభు త్వం క్వింటా రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కేవలం 5 శాతం ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసి, పంట నష్టపరిహారం కింద హెక్టారుకు రూ.50 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్టపరిహార సాయం అందించకపోవడం దారుణమన్నారు. పంట నష్ట పరిహారం పంపిణీలో భాగంగా కడప, కర్నూలు జిల్లా రైతులకు హెక్టార్లకు రూ.50 వేలు (ఎకరాకు రూ.20 వేలు), పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వం నంద్యాల, అనంతపురం జిల్లా రైతులను విస్మరించడం దుర్మార్గమన్నారు. నంద్యాల జిల్లా రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.28 కోట్లు రావాల్సి ఉందని, ప్రభుత్వం ఏదో కుంటి సాకు చెబుతూ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తక్షణమే రెండు జిల్లాల ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలన్నారు. -
పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి
కోవెలకుంట్ల: పట్టణంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత పాండురంగ విఠలేశ్వరస్వామి ని జిల్లా న్యాయమూర్తి అమ్మన రాజ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్ జడ్జి ప్రతిమ, సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, పవనచార్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. జిల్లా జడ్జి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జూనియర్ సివిల్ కోర్టును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కోర్టు రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవాదులు వాసగిరి సాయికృష్ణమూర్తి, బాలమురళీకృష్ణ, ఆరికట్ల మల్లికార్జునరెడ్డి, తిరుపతయ్య, జీఎల్నరసింహులు తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా పైపులైన్కు లీకేజీ డోన్: ఓబులాపురం మెట్ట వద్ద హంద్రీనీవా పైపులైన్ లీకేజీతో నీరంతా వృథా అవుతోంది. హంద్రీనీవా నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఓబులాపురం గ్రామస్తులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే. శుక్రవారం ఈ విషయంపై మాజీ మంత్రి బుగ్గన స్పందిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా చెరువులను హంద్రీనీవా నీటితో నింపడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం హడావుడిగా నీటిని నింపే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిసింది. అయితే నీటి సరఫరాలో ఒత్తిడిని తట్టుకోలేక ఓబులాపురం మెట్ట వద్ద పైపులైన్ లీకేజీ నీరు వృథాగా పోతోంది. మంత్రాలయం: భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు కొలువై శ్రీమఠం ఆవరణలో విహరించారు. మంత్రాలయ క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. రాత్రి శ్రీ మఠం ప్రాంగణంలో మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన బంగారు రథంపై ప్రహ్లాద రాయలు కొలువై భక్తులకు దర్శనమిస్తూ విహరించారు. -
మా భూమిలోకి మమ్మల్నే అడుగు పెట్టనివ్వడం లేదు
అడంగల్, పాస్ పుస్తకాల్లో మా పేరు ఉన్నా టీడీపీ నాయకులు బలవంతంగా మా భూమిని ఆక్రమించుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేపట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. మా భూమిలోకి అడుగు పెట్టాలంటే పెట్టనివ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. న్యాయపరంగా హైకోర్టుకు వెళ్లాం. మైనింగ్ కార్యకలాపాలను ఆపించి మా భూమిలోకి మమ్మల్ను అడుగు పెట్టనివ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా టీడీపీ నాయకులు లెక్కచేయడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి సమస్య విన్నవించుకున్నా స్పందించడం లేదు. స్థానిక ఎస్ఐ, సీఐ మాట వినడం లేదు. మా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో సామాన్యులను బతకనివ్వడం లేదు. – రాజాగౌడ్, సుంకేసుల గ్రామం, అవుకు -
నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం
● రూ. 50 లక్షల ఆస్తి నష్టంనంద్యాల: పట్టణంలోని శ్రీనివాస సెంటర్లోని జేబీ ఎలాక్ట్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలిపోయాయి. దుకాణ మేనేజర్ రాజ్పురోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
యువతిని వేధిస్తున్నాడని చంపేశారు!
పాణ్యం: గడివేముల మండలంలో సంచలనంగా మారిన యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్నాడని యువకుడి ని దారుణంగా చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన యువతితోపాటు ఓ యువకుడు, ఇద్దరు మైనర్లను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాణ్యం సర్కిల్ కార్యాలయంలో నంద్యాల ఎస్డీపీఓ మందజావళి విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను మీడియాకు వివరించారు. మండల కేంద్రం గడివేములకు చెందిన వినోద్కుమార్(19) డీఎంఎల్టీ కోర్సు చేస్తున్నాడు. కాగా రేవనూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైంది. అయితే ఆమెను నిత్యం ఫోన్లో వేధిస్తుండటంతో వినోద్ కుమార్ను హత్య చేయాల ని కుట్ర పన్నింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర బర్మశాల వద్ద ఉంటున్న తేల్కర్ మణికంఠ సహాయంతో పథకం రూపొందించింది. గత ఏడాది ఆగస్టు 31వ తేదీన నంద్యాలకు చెందిన ఇద్దరు మైనర్లును తోడు తీసుకుని ఆటో లో గడివేములకు వెళ్లారు. వినోద్కుమార్కు ఫోన్ చేసి ఇంటి నుంచి బొల్లవరం రస్తాలోని మద్దిలేరు వాగు వద్దకు రప్పించారు. బైక్పై వచ్చిన వినోద్కుమార్ను జన సంచారం లేని చోటుకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి పాణ్యం మండలం పిన్నాపురం రస్తాలోని గాలేరు నగరి కాల్వలో పడేశారు. ఆ సమీపంలోనే బైక్ను కూడా నీటిలో వేసేశారు. కాగా తమ కుమారుడు కనిపించడం లేదని వినోద్కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు కేసు ఛేదించి హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీఓ మందజావళి తెలిపారు. హత్యకు పాల్పడిన తేల్కర్ మణికంఠ, యువతితో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. నాలుగు నెలల క్రితం యువకుడి హత్య మృతదేహాన్ని గాలేరు నగరిలో పడేసిన వైనం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు మైనర్లు, యువతి, యువకుడు అరెస్ట్ -
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పలు విషయాల్లో ఇదే విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా స్పందన కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు తమ భూమిలోకి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని బాధితులు ఎస్ఐ, సీఐలను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పీజీఆర్ఎస్కు వచ్చి ఎస్పీ సునీల్ షొరాణ్కి తమ సమస్యను చెప్పుకున్నా చర్యలు తీసుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టీడీపీ పాలనలో సామాన్యుడిని బతుకనివ్వరా అంటూ ఆవేదన చెందుతున్నారు. అడంగల్, పాసుపుస్తకం తమ పేరు మీదనే ఉన్నాయని.. మా భూమిలోకి మేం వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులకు ఏం హక్కుందని ప్రశ్నిస్తున్నారు. రైతుల పొలంలో అక్రమంగా మైనింగ్ చేసిన దృశ్యంసాక్షి, నంద్యాల: అధికారమే అండగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. రైతుల భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే ‘అధికారం మాది.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో అటు వైపు చూసేందుకు అధికారులు భయపడుతున్నారు. అప్పట్లో ప్రణాళిక ఇప్పుడు అమలు అవుకు మండలం సుంకేసుల గ్రామంలోని సర్వే నంబర్ 325–2ఏ1లో ముప్పగాని గోపాలు, ముప్ప గాని రాజుగౌడ్లకు 7.86 ఎకరాల పొలం ఉంది. ఆరుతడి పంటలు వేస్తూ జీవనం సాగించేవారు. ఇద్దరు సోదరుల మధ్య మనస్పర్ధలు రావడంతో రెండేళ్ల పాటు సాగు చేయలేదు. ఇదే అదనుగా భావించి 2016లో టీడీపీ నాయకులు భూమిని కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. అక్కడే పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుంకన్నను రంగంలోకి దించారు. తన భార్య జి.కమలమ్మ పేరు మీద నాపరాయి గనుల కోసం లీజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు 2019 ఫిబ్రవరిలో లీజు మంజూరు చేస్తూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) మంజూరు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మారడంతో పాటు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు అటువైపు చూడలేదు. అయితే ఈ మధ్యలో రైతులను తమ భూమిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటూ వచ్చా రు. 2024లో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు, వారికి ఓ మంత్రి అండగా నిలచడంతో టీడీపీ మండల నాయకుడు ఉగ్రసేనారెడ్డి రెచ్చిపోయాడు. భూమిలో అక్రమంగా ప్రవేశించి మైనింగ్ చేపట్టాడు. నాపరాయి గనులను తవ్వుకుంటూ రూ. కోట్లలో సంపాదిస్తున్నాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ గతే డాది అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలీసులు రక్షణ కల్పించి బాధితులను తమ భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవుకులో ఓ మంత్రి అనుచరుడి అరాచకం రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కొంటున్న వైనం అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న టీడీపీ నాయకుడు హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు ● 15వ తేదీన మకర సంక్రాంతి రోజున స్వామిఅమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం ● ఈ నెల 17న ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ ● బ్రహ్మోత్సవాల్లో చివరిరోజై 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు.. 12న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 13న భృంగివాహనసేవ, 14న కై లాసవాహనసేవ, 15న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న రావణవాహనసేవ, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 18న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్జితసేవల నిలుపుదల.. ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామికల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ, ప్రాతఃకాలసేవలు నిలుపుదల చేశారు. శ్రీశైలంలో రేపటి నుంచి ఏడు రోజుల పాటు నిర్వహణ ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు, వాహనసేవలు -
పేదల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డిబొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దుపోకడలను నిలదీస్తూ సామాన్య, పేదల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు.. గ్రామ స్థాయిలో ముఖ్యమైన కార్యకర్తలను వివిధ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవాలని సూచించారు. వారి ఫొటోలను సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపితే గుర్తింపు కార్డు అందజేస్తామని వివరించారు. ఈ ప్రక్రియను జిల్లాలో నేటి నుంచి 45 రోజుల్లోగా టాస్క్ఫోర్స్ పేరుతో వేగంగా చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు, పట్టణ, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకం చేపట్టి త్వరితగతిన వారికి పార్టీ నుంచి ఒక గుర్తింపు కార్డును అందిస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలను సమన్వయం చేసుకుంటూ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఎప్పటికప్పుడూ కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తామని వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్రకార్యదర్శి దేశం సుధాకర్రెడ్డి, బుడ్డా శేషిరెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, ఎస్ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లు లేవు.. పండుగకు పిలువం!
● పండుగ వేళ భయపెడుతున్న నీటి సమస్య ● బంధుమిత్రులను పండుగకు ఆహ్వానించలేకపోతున్న వైనం ప్యాపిలి: కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిన ఆ రెండు గ్రామాల ప్రజలు నీటి సమస్యతో భయపడుతున్నారు. పండుగ పూట ఇంటికొచ్చిన వారికి నీటి కష్టాలు చెప్పలేమని, పండుగకు ఎవరినీ పిలుచుకోవడం లేదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్య తలెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నల్లమేకలపల్లి గ్రామంలో 2 వేల మంది నివసిస్తున్నారు. గ్రామంలో రెండు మంచినీటి బోర్లు ఉండగా ఒక బోరు మాత్రమే సక్రమంగా పని చేస్తోంది. అయితే ఈ బోరు నుంచి గ్రామంలోని ట్యాంకులకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. పలువురు తమ తోటలకు, ఇళ్లకు నేరుగా నీళ్లు వచ్చేలా కనెక్షన్లు ఇచ్చు కోవడంతో ట్యాంక్లోకి నీటి సరఫరా జరగడం లేదు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా గ్రామంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సంధ్య గ్రామ పంచాయతీ తరపున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే పంచాయతీ పరిధిలోని డి. రంగాపురం గ్రామంలోనూ పది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటర్ పని చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తిందని గ్రామస్తులు తెలిపారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ శివారు ప్రాంతంలో తోటలకు వెళ్లి ద్విచక్రవాహనాలు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండటంతో గ్రామస్తులను నీటి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పండుగకు తమ ఇంటికి వచ్చే బంధువులను సైతం నీటి సమస్య కారణంగా రావొద్దని చెప్పాల్సిన పరి స్థితి నెలకొందని ఓబులమ్మ, ఉషారాణి, సావిత్రి, నాగమ్మ తెలిపారు. అధికారులు స్పందించి బోర్లు, మోటర్లకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
స్టెమీ ఇంజెక్షన్తో గుండెపోటు బాధితులకు రక్షణ
ఎమ్మిగనూరు రూరల్: గుండెపోటు బాధితులకు స్టెమీ ( సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారాక్షన్ ) ఇంజెక్షన్ పనిచేస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి గుండెపోటుతో వచ్చిన నాసిర్, భాగ్యమ్మకు స్టెమీ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాదు. ఈ సదర్భంగా డాక్టర్ ఆదినాగేష్ మాట్లాడుతూ గుండె పోటు వచ్చిన వారికి అత్యవసరంగా స్టెమీ ఇంజెక్షన్ ఇస్తే కంట్రోల్ చేయవచ్చునని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ. 45 వేలు ఉంటుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. ఆగని ఇసుక దందా గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. మండలంలో గంజిహళ్లి హంద్రీనది నుంచి రాత్రీ పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.3నుంచి రూ.5వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుంది. పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం మండలంలో 20 గ్రామ పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండలంలో గంజిహళ్లి, హెచ్. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతుంది. ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం హంద్రీనది సమీపంలో బోర్లు వేశారు. ప్రతి రోజు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రానున్న వేసవి కాలంలో తమకు తాగునీటి సమస్య ఎదురువుతుందని హంద్రీతీర గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గంజిహళ్లి గ్రామం హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా విషయం తమ దృష్టికి రాలేద ని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల సీఐ చంద్రబాబు పేర్కొన్నారు. రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి కర్నూలు కల్చరల్: రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి జి.ఉమామహేశ్వర్ రచించిన ‘అహానికి ఆవల’ కథల పుస్తకావిష్కరణ శనివారం మద్దూరు నగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ, కథా రచయితలు వెంకట కృష్ణ, మారుతి, డాక్టర్ ఎం. హరికిషన్, డాక్టర్ వి.పోతన్న, ఇనాయతుల్లా, సుభాషణి పాల్గొని మాట్లాడారు. ఉమామహేశ్వర్ రాసిన అహానికి ఆవల కథలు సమాజంలో మార్పును కోరుకుంటాయని, మధ్యతరగతి కుటుంబాల్లో సాగే సున్నితమైన మానవ సంబంధాలు విలువలు ఈ కథల్లో ఉంటాయన్నారు. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయన్నారు. కళ్లముందు కనిపించే జీవితాన్ని కథల్లోకి ఎక్కించే జీవన దృశ్యాల్లాగా మలిచాడన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ఎస్డీవీ అజీజ్, వెంకటేష్, డాక్టర్ అవిజ వెంకటేశ్వర రెడ్డి, విరసం నాయకులు పాణి, తెలుగు భాషా వికాస ఉద్యం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, ఆవుల చక్రపాణి యాదవ్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు
పాణ్యం: ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్టీయూఏ ఉపలకులపతి డాక్టర్ హెచ్ సుదర్శన్రావు, చెర్మన్ శాంతిరాముడు ప్రారంభించారు. 40 కళాశాలల నుంచి సుమారు 2,200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. రగ్బీ, ఫుట్బాల్, త్రోబాల్, బ్యాట్మింటన్, బాస్కెల్బాల్, వాలీబాల్ తదితర క్రీడలు జరగనున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. జేఎన్టీయూఏ క్రీడ మండలి కార్యదర్శి నారాయణరెడ్డి విశ్వవిద్యాలయాలరిధిలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు క్రీడలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెర్మన్ శాంతిరాముడు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్, ఎండీ శివరామ్, డీన్ అశోక్కుమార్, కో–ఆర్డినేటర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
మరి కొద్దిరోజులు ఎల్లెల్సీకి నీటి సరఫరా
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు మరి కొద్ది రోజులు నీటి సరఫరా కొనసాగే అవకాశా లు కనిపిస్తున్నాయి. జలాశయం క్రస్ట్గేట్ల ఏర్పాటులో భాగంగా ఖరీఫ్ పంటకు మాత్రమే నీరిచ్చి రబీ పంట కు నీరివ్వలేమని టీబీ బోర్డు అధికారులు ముందుగా నే ప్రకటించారు. జనవరి 10నుంచి నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్యాంలో ఇంకా 29 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో కర్ణాటక పరిధిలో ఇంకా సాగులో ఉన్న పంటలకు నీటిని అందించేందుకు మరి కొద్ది రోజులు అంటే ఈనెల 20 వరకు సరఫరా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని 18వ నంబరు గేటును కొత్తగా బిగించారు. మే చివరి నాటికి మొత్తం 33 క్రస్టు గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1605 అడుగులతో 29 టీఎంిసీల నీరు నిల్వ ఉండగ ఇన్ఫ్లో జీరో ఉండి ఔట్ఫ్లో రూపంలో 7,886 క్యూసెక్కుల నీరు వివిధ కాలువలకు వదులుతున్నారు. శనివారం ఆంధ్ర కాలువ ప్రారంభ (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 635 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది. -
వసంత పంచమికి భారీ ఏర్పాట్లు
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సరస్వతి క్షేత్రమైన కొలనుభారతిలో ఈనెల 23న వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆర్డీఓ నాగజ్యోతి కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొలనుభారతి ఆలయం శ్రీశైల దేవస్థానంలో కలిసిన తర్వాత జరుగుతున్న తొలి వసంత పంచమి కావడంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీరు, క్యూలైన్లు, మహిళలకు ప్రత్యేక గదులు, చిన్నారులకు అక్షరాభ్యాస ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆలయ చైర్మన్ వెంకటనాయుడు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీడీఓ మేరి, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీ ఉద్యోగి ఇంట్లో చోరీ
కోవెలకుంట్ల: పట్టణంలోని బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఎస్సార్బీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జయరామిరెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బెంగుళూరులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటికి తాళం వేయడంతో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 20 వేలు నగదు అపహరించుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికొచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకివెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్టీం రంగప్రవేశం చేసి దొంగతనానికి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నగదు అపహరణ -
సాక్షి సినిమాలు
ఎస్వీసీ కాంప్లెక్స్: ది రాజాసాబ్ వి మెగా ఆనంద్ సినీ కాంప్లెక్ : ది రాజాసాబ్ వెంకటేష్ సినీ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ శ్రీరామ : బిజినెస్ మేన్ (2012) రాజ్ : ఆంధ్రా కింగ్ తాలూకా భరత్ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ విజయ : ది రాజాసాబ్ విక్టరీ : దురంధర్ -
● మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు
వైఎస్సార్ హయాంలో ఒక మోడల్గా ఉపాధి హామీ పథకం కర్నూలు(అర్బన్): ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గొప్పగా అమలు చేసిన చరిత్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏపీలో ఉపాధి హామీ పథకం ఒక మోడల్గా అమలు చేశారన్నారు. శనివారం కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్జీఎస్ను రద్దు చేయరాదనే డిమాండ్పై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బీకేఎంయూ పతాకాన్ని సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు భీమలింగప్ప ఆవిష్కరించారు. కొప్పుల రాజు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ఒక కుట్ర దాగి ఉందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ ‘పనైనా చూపండి–తిండైనా పెట్టండి’ అనే నినాదంతో చేసిన పోరాట ఫలితమే ఈ చట్టం అన్నారు. ఈ నెల 14న భోగి మంటల్లో కొత్త పథకం ప్రతులను దగ్ధం చేయాలని, 30న సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. -
క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం
కర్నూలు (టౌన్) : క్రీడ ల్లో పాల్గొనడం వల్ల ఉ ద్యోగుల్లో మానసిక ఒత్తి డి తగ్గి ఉల్లాసంగా ఉంటారని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అన్నా రు. శనివారం స్థానిక ఎగ్జిబిషన్, కౌన్సిల్ హాల్, ఔట్డోర్ స్టేడియం,ఇండోర్ స్టేడియం లలో మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పురుష ఉద్యోగులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారెమ్స్, చెస్ క్రీడలు, మహిళా ఉద్యోగులకు త్రోబాల్, బ్యా డ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. క్రీడలను ప్రారంభించిన కమిషనర్ మాట్లాడుతూ శని, ఆదివారం రెండు రోజులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు,కార్యదర్శి నాగరాజు, ఎస్ ఈ రమణమూర్తి, ఎంఈ మనోహార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
కర్నూలు (సిటీ): నగర శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఆ స్కూల్ అధినేత కేజే రెడ్డి, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్వీ రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ కరస్పాండెంట్ శేషన్న, శ్రీలక్ష్మి విద్యాసంస్థల కరస్పాండెంట్ దీక్షిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అమలులో ఉన్న విద్యా ప్రణాళిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమలు చేస్తున్నారన్నారు. ఈ విద్యాబోధన భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు చక్కగా దోహదపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కొండెక్కిన గుడ్లు, చికెన్ ధరలు
● హోల్సేల్లో వంద కోడిగుడ్ల ధర రూ.740 ● కిలో చికెన్ రూ. 260 నుంచి రూ.300 ● రిటైల్గా కోడిగుడ్డు ఒక్కటి రూ.9 పైమాటే గోస్పాడు: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కోవలోకే చేరాయి. చికెన్, గుడ్లు. జిల్లాలో దాదాపుగా 2వేల పైగా చికెన్ సెంటర్లు ఉండగా, మరిన్ని కిరాణ కొట్లలో గుడ్లను విక్రయిస్తునారు. జిల్లాలో దాదాపుగా రోజుకు నాలుగు లక్షలకు పైగా గుడ్లు అమ్ముడుపోయేతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పరుగులు పెడుతున్న గుడ్ల ధరలు... మార్కెట్లో గుడ్ల ధర ఎన్నడూ లేనంతగా పరుగులు పెడుతోంది. రెండు నెలల క్రితం నుంచి ప్రారంభమైన ధర నేటికీ ఆగడం లేదు. బహిరంగ మార్కెట్లో ధరలు ఒకలాఉంటే మారుమూల గ్రామాల్లో గుడ్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. నెల క్రితం 30 గుడ్ల ధర రూ.170 నుంచి రూ.180 వరకు (ఒక్క గుడ్డు రూ. 6) ఉండింది. కాగా.. ప్రస్తుతం వంద గుడ్ల ధర రూ.740గా ఉంది. మార్కెట్లో రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడికి హైదరాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్లు,గుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరకు రెక్కలు.. హోల్సేల్ వ్యాపారుల వద్ద కిలో చికెన్ ధర రూ.260 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. గ్రామా ల్లోని వ్యాపారులు రూ.330 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో మాంసాహార ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. -
నల్లమలలో ఎర్రమట్టి తవ్వకాలు!
మహానంది: దర్జాగా ప్రకృతి వనరులు కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కన్నెర్ర చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తుండటంతో అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల – గిద్దలూరు రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని మహదేవపురం గ్రామ సమీపంలోని పోలేరమ్మ రస్తా ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 15 టిప్పర్లు, జేసీబీతో యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో మహదేవపురం ప్రజలు అడ్డుకున్నారు. ఎర్రమట్టిని తరలిస్తూ పొలం రస్తాలను ధ్వంసం చేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. అర్ధరాత్రి చలిని సైతం లెక్క చేయకుండా తవ్వకాలను అడ్డుకున్నారు. పొలాలకు, సర్వనరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉన్న రస్తా మట్టి అక్రమార్కుల జేసీబీల కారణంతో ధ్వంసమవుతుందన్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు సంబంధం లేదంటూ దాటవేస్తున్నారని గ్రా మస్తులు ఆరోపించారు. అయితే టిప్పర్లను అడ్డు కునేందుకు వెళ్లిన వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు బౌన్సర్లను పంపుతూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా బేఖాతర్.. పోలేరమ్మ రస్తాలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలపై రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో స్పందించిన అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి కేవలం రెండు ఎర్రమట్టి టిప్పర్లను మాత్రమే సీజ్ చేసి అధికార భక్తిని చాటుకున్నారు. అనుమతులు ఉంటే అర్ధరాత్రి మట్టి తవ్వకాలు ఎందుకు జరపాలంటూ పలువురు విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని మండల అధికారులే చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి పూర్వం నుంచి ఉన్న పోలేరమ్మ రస్తాను ధ్వంసం చేయడం తగదన్నారు. అర్ధరాత్రి అడ్డుకున్న మహదేవపురం ప్రజలు -
నాలుగు నెలల క్రితమే ప్రమీలమ్మ మృతి
● సాక్షి కథనంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ● కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చాగలమర్రి: ముత్యాలపాడు ఎస్సీ కాలనీ 4వ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. సాక్షి కథనంతో అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ‘ప్రమీల ఆచూకీ ఎక్కడ?’ అన్న శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఒక రోజులోనే అనుమానాలకు తెరదించారు. అంగన్వాడీ కార్య కర్త ప్రమీల అనారోగ్యంతో సెలవుల్లో వెళ్లి తిరిగి రాలేదు. గత 9 నెలలుగా విధులకు హాజరుకాకపోవడం, ఆమెకు కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ అధికారులు నోటీసులు పంపి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆచూకీపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అటు ఐసీడీఎస్, ఇటు పోలీసులు అధికారులు రంగంలోకి దిగి చివరకు ప్రమీలమ్మ చనిపోయినట్లు గుర్తించారు. ముందుగా ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను చికిత్స కోసం ఆటోలో చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించినట్లు గుర్తించి, ఆ మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మెరుగైన వైద్యం కోసం ఆమె కడప పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిందని తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విచారించారు. అయితే ప్రమీల అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని ఐదు రోజుల పాటు మార్చురీలో ఉంచగా ఎవరూ రాక పోవడంతో మున్సిపాలిటీకి అప్పగించి దహనం చేయించినట్లు తెలిసింది. అంగన్వాడీ కార్యకర్త ప్రమీలమ్మ అనాథగా మృతి చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
ఫిబ్రవరి 8 నుంచి ఇరుముడి స్వాములకు స్పర్శదర్శనం
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే ప్రతి భక్తుడికి ఆహ్లదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 8 నుంచి 12వ తేది వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని.. 8 నుంచి 18వ తేదీ వరకు సామాన్య భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధ్యక్షతన కర్నూలు, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా అన్ని శాఖల అధికారులతో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే 20శాతం మంది భక్తులు అదనంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రగా భక్తులను దృష్టిలో ఉంచుకొని అటవీమార్గంలో మెడికల్ క్యాంప్లు, అంబులెన్స్లు, డస్ట్బిన్లు, టాయిలెట్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈలోగా మరో రెండు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ పటిష్ట చర్యలు చేపడతామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నెష్ అప్పావ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేది నుంచి అటవీప్రాంతంలో పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 2లీటర్లు, 5లీటర్ల వాటర్ బాటిల్స్ను మాత్రమే అనుమతిస్తామన్నారు. -
అమ్మ కడుపు చల్లన..
ఎమ్మిగనూరురూరల్: ప్రజా చైతన్యం.. వైద్యుల సేవాతత్వం వెరసి ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ‘తల్లి–బిడ్డల సురక్షితం లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఆదర్శ కాన్పుల వార్డు’ అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రా మాల ప్రజలకు ఎమ్మిగనూరు వైద్యశాలలో విస్తృత వైద్యసేవలు అందుతున్నాయి. ప్రారంభంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న 2002లో కమ్యూనిటీ ఆసుపత్రిగా నూతనంగా నిర్మించి పడకలను పెంచారు. ఆతర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 12.60 కోట్లతో వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతనంగా నిర్మాణం చేసిన వంద పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో సేవలు అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య పరి కరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫిజిషీయన్స్, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులను కేటాయించడంతో ఉత్తమ సేవలు అందుతున్నాయి. రికార్డుల్లో మొదటి స్థానం ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది సేవాతత్వం..చురుకుదనం మూలంగా రికార్డుస్థాయిలో కాన్పులు నమోదు అవుతున్నాయి. ముగ్గురు గైనకాలజిస్టులకు అందుబాటులో ఉన్నారు. నెలకు 280 నుంచి 340కి పైగా నార్మల్ డెలివరీలు, సిజేరియన్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు, సాధారణ చెకప్లు చేస్తున్నారు. రికార్డుస్థాయిలో కాన్పులు చేపట్టి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో వరుసగా నాలుగేళ్లుగా మొదటి స్థానం నిలుస్తోంది. అర్దరాత్రైనా..అత్యవసరమైన కాన్పు కోసం వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. స్కానింగ్ పరీక్షల్లో టాప్.. ప్రభుత్వాసుపత్రిలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీన ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, కోసిగి మండలాల నుంచి వచ్చే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. సూపరిండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సుజితా, ఫాతిమా, హిమబిందులు గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ప్రతి నెల 9వ తేదీ ఒక్కరోజే 490 నుంచి 500 మందికి పైగానే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేసి టాప్లో నిలుస్తున్నారు. ఎంత సమయం పట్టినా వచ్చిన వారందరికీ స్కానింగ్ పరీక్షలు చేసి పంపుతున్నారు. సంవత్సరం సాధారణ డెలివరీ ీసీజిరియన్ మొత్తం 2022-23 2,778 517 3,295 2023-24 2,642 62 2,704 2024-25 3,419 607 4,026 2025-26 (డిసెంబర్) 1,709 553 2,262 -
ఇది మోసం కాదా?
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: అభివృద్ధి చేయకుండా అబద్ధాలు చెప్పడం సీఎం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఉడుములపాడు టీడీపీ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో రూ. 5కోట్లతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల్లో మౌలిక వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో కళ్యాణ మండపాలు రెండేళ్ల కాలం పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. మంజూరైన వాటిని ఎందుకు రద్దుచేశారు? డోన్ నియోజకవర్గానికి అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినా వాటిని నేటి వరకు ఎందుకు ప్రారంభించలేదని మాజీ మంత్రి బుగ్గన నిలదీశారు. ఎస్సీ బాలుర కోసం ఓబులాపురం వద్ద మంజూరు చేసిన వసతి గృహ నిర్మాణం పనులతో పాటు బేతంచెర్ల పాలిటెక్నిక్ భవన నిర్మాణం పనుల టెండర్లు కూడా టీడీపీ నాయకుల స్వార్థం కోసం రద్దు చేశారన్నారు. రాష్ట్రానికే తలమానికమైన ఐటీడీఆర్ నిర్మాణం పూర్తయితే ఏటా వందలాది మంది నైపుణ్యం గల డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని, దానిని మరుగున పడవేశారన్నారు. జ్యోతిరావ్పూలే ఆశ్రమ పాఠశాలను ఎక్కడా లేనివిధంగా ఆధునిక హంగులతో నిర్మిస్తే అందులో వసతిగృహం, డార్మెంటరీ నిర్మాణం పనులు ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. చెరువులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ చేస్తే వాటిని నీటితో నింపలేదన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వాల్మీకి గుహలు, నగరవనంతో పాటు చెరువుల్లో బోటు షికారు కేంద్రాలను మంజూరు చేస్తే అవన్నీ శిథిలమయ్యేట్లు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అండర్పాస్ ఏమైంది? డోన్ పట్టణ నడిబొడ్డున నంద్యాల, కర్నూలు రైల్వేగేట్లు ఉన్నందున కేంద్ర రైల్వేశాఖ మంత్రి చొరవతో తాను రెండు అండర్పాస్ బ్రిడ్జిలను మంజూరు చేయించానన్నారు. అయితే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి వాటి పనులు జరగకుండా ఆపివేశారన్నారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ అండర్ పాస్ బ్రిడ్జి పనులను చేసి చూపించాలని ఆయన సవాల్ చేశారు. వాటర్గ్రిడ్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గ ప్రజలకు శుద్ధజలాన్ని అందించేందుకు వాటర్గ్రిడ్ పనులను రూ.210 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిందని బుగ్గన గుర్తు చేశారు. పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇందులో ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. రూ.40కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి డాక్టర్లను నియమిస్తే నేడు కనీసం ఆసుపత్రిలో ఫర్నిచర్ సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రానికి నాలుగుసార్లు సీఎంగా ప్రాతినిథ్యం వహించానని చెప్పుకుంటున్న చంద్రబాబు అనేకమార్లు అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని, ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రచారం చేసి వైఎస్ఆర్సిపి బలోపేతానికి కార్యకర్తలందరూ పనిచేయాలని రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు అన్నారు. ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు కురుకుందు హరి, పార్టీ మండల అధ్యక్షుడు సోమేష్ యాదవ్, పార్టీ నాయకులు మల్యాల భాస్కర్ రెడ్డి, దినేష్గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర పాల్గొన్నారు. -
అడవి జంతువులు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలి
● జీఐఎఫ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీశైలం: పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాలకు అడవి జంతువులు రావొచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డీడీ విగ్నేష్ అప్పావ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులతో ఆయన సమావేశమయ్యారు. అటవీ ప్రాంతం నుంచి చిరుత పులు నివాసిత ప్రాంతాల్లో ఉన్న కుక్కలను వేటాడడానికి కోసం వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో అడవి జంతువులు నివాసిత ప్రాంతాల్లోకి వచ్చి వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జంతువులకు కలుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. సమావేశంలో శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ లలిత కుమారి, దోర్నాల సబ్ డీఎఫ్ఓ నీరజ్, శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ‘టెట్’లో 39.27 శాతం ఉత్తీర్ణత నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో జిల్లాలో 39.27 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 2,48,420 మంది హాజరయ్యారన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని ఏపీ టెట్ కన్వీ నర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్కు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కాగా వారిలో 47.82 శాతం(15,239) మంది ఉత్తీర్ణలయ్యారని తెలిపారు. ఫలితాలను 9552300009 వాట్సాప్ నంబరు ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రాణదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు శుక్రవారం చిలకలూరిపేటకు చెందిన ఇ.లక్ష్మీ తేజశ్విని రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలో రెండురోజులుగా ఒక వ్యక్తి తాను ఫుడ్ ఇన్స్పెక్టర్ను అని శ్యాంపుల్ చెక్ చేయాలంటూ బేకరీలు, స్వీట్ షాపులు, హోటళ్ల వద్ద హల్చల్ చేశాడు. అంతే కాకుండా రెండువేల రూపాయలు ఇవ్వాలని బెదిరించి వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈయన వ్యవహారం కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో పట్టణంలోని ప్రముఖ స్వీట్షాపు యజమాని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి జారుకున్నాడు. దొర్నిపాడు: పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని డబ్ల్యూగోవిందిన్నె గ్రామంలోని జెడ్పీ ఉన్నత, ఎంపీపీ స్కూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పరీక్షలకు సంబంధించి ఎదైనా అనుమానం ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. గతేడాది వంద శాతం ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సారి వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్రెడ్డి, హెచ్ఎం దస్తగిరి తదితరుల పాల్గొన్నారు. -
విజయ డెయిరీ అధికారులపై అక్రమ కేసులు తగదు
● డీఐజీని కలసిన నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నేతలుకర్నూలు: నంద్యాల విజయ డెయిరీ డైరెక్టర్, అధికారులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ముఖ్య నేతలు అన్నారు. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం డీఐజీ కోయ ప్రవీణ్ను కలిశారు. కర్నూలు బి.క్యాంప్లో ఉన్న ఆయన కార్యాలయంలో డీఐజీని కలసి విజయ డెయిరీలో అక్రమ కేసులు, వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పాల డెయిరీలో అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న పరిణామాలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కోరగా అందుకు డీఐజీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. -
గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులు వ్యతిరేకించాలి
నంద్యాల(వ్యవసాయం): ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులను వ్యతిరేకిస్తూ శుక్రవారం గ్రామీణ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఎదుట బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు సుజీత్ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వ్యయంతో రుణాలు అందించే సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులను మార్చి 2026 చివరి నాటికి ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్లకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా రంగంలో వాటాల విక్రయానికి పాల్పడ్డాయని విమర్శించారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామీణ బ్యాంకులు కూడా ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు రవితేజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ బుక్ను ప్రకాశం బ్యారేజ్లో ముంచుతాం
● నంద్యాలలో విద్యార్థి, యువజన సంఘాల నేతల ధర్నానంద్యాల(న్యూటౌన్): ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే రెడ్బుక్ను ప్రకాశం బ్యారేజీలో ముంచుతామని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. బొమ్మలసత్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాగరాముడు, వైఎస్సార్సీపీ యువజన నాయకులు చంద్రశేఖర్రెడ్డి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తే యువజన, ప్రజా సంఘాల నాయకులపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగ, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కేసులు ఎత్తి వేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నాయకులు ప్రతాప్, ధనుంజయుడు, శశిధర్రెడ్డి, ఎర్రిస్వామి, వైఎస్సార్సీపీ విభాగం నాయకులు మధు, పాములేటి తదితరులు పాల్గొన్నారు. -
సెలవులకు ఊరికెట్టా వెళ్లేది?
పరుగో.. పరుగుసంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంతూర్లకు బయలుదేరారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బస్టాండ్కు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే అరకొర సర్వీసులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ పండుగ వేళ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచడటంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యార్థులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన బస్సు ఎక్కేందుకు తోపులాట జరగడంతో మహిళలు, విద్యార్థినులు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడాలి
కర్నూలు కల్చరల్: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడేలా విద్యా విధానం ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెస ర్ వి.వెంకట బసవరావు అన్నారు. శుక్రవారం వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇండియన్ క్యాంపసెస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని వీసీ ప్రారంభించారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్ మావులూరి మాట్లాడుతూ దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్లో అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తమ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థల నుంచి పట్టాలు తీసుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ప్రారిశ్రామిక అవసరాలకు తగినంత మంది యువత దొరకడం లేదన్నారు. దీంతో పాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, వ ర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, సీడీసీ డీన్, ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపా ల్ ఆచార్య పీవీ సుందరానంద్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూసీ డైరెక్టర్ ఆచా ర్య ఆర్. భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అతిథులు వచ్చారు !
పొడవైన కాళ్లపై భారీ ఆకారంలో ఉండే పెయింటెడ్ స్టార్క్ పక్షులు అతిథులా ఆత్మకూరుకు వచ్చేశాయి. శీతాకాలంలో ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం అతి శీతల ప్రాంతాలైన హిమాలయాల నుంచి అటు రష్యాలోని సైబీరియా నుంచి కూడా దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. కల్వకుర్తి – నంద్యాల 167కే హైవే నిర్మాణం పనులు నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జరుగుతున్నాయి. ఆ పనులను పర్యవేక్షించేందుకు వచ్చాయా.. అన్నట్లుగా అక్కడ ఈ పక్షులు కనిపించాయి. – ఆత్మకూరురూరల్ -
శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పోలీసుల మాక్ డ్రిల్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితుల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సాయంత్రం స్థానిక సిద్ధిరామప్ప కాంప్లెక్స్ వద్ద అవగాహన కల్పించారు. రద్దీ సమయంలో తొక్కిసలాట ప్రారంభమైతే ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి, ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుని వ్యక్తికి సీపీఆర్ చేసే విధానాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏదైనా భవంతిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఆరోగ్య, ఆర్అండ్బీ, ఏపీఎస్పీడీసీఎల్ తదితర శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎకై ్సజ్ నేరాలపై కమిషనర్ సమీక్ష కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై ఆ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సమీక్షించారు. శుక్రవారం వారు అనంతపురం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ నోడల్ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తదితరులు కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో వారితో సమావేశమై ఉమ్మడి జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై సమీక్షించినట్లు డీసీ శ్రీదేవి తెలిపారు. నవోదయం 2.0, పొరుగు రాష్ట్రాల మద్యం పూర్తిగా కట్టడికి తీసుకోవలసిన చర్యల సమీక్ష జరిగినట్లు డీసీ తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో పని చేయాలి గోస్పాడు: రక్త కేంద్రాల నిర్వాహకులు సామాజిక సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదబాయి అన్నారు. శుక్రవారం స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్త కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్త కేంద్రాలు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రతి నెల వారి నివేదికలు సకాలంలో ఇవ్వాలని, రక్తదానం శిబిరాలు, రక్తదాతల వివరాలు ఈ– రక్తకోష్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ సాక్స్ రాష్ట్ర కార్యాలయం డిప్యూటీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలు, సేవాసంస్థలు, యువజన సంఘాల సమన్వయంతో అన్ని ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ స్వాతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రొగ్రాం మేనేజర్ అలీ హైదర్, గణాంక అధికారి దేవి శంకర్ గౌడ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్త కేంద్ర కౌన్సిలర్, ప్రైవేట్ రక్త కేంద్రాల వైద్య అధికారులు, సాంకేతిక పర్య వేక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకోం
● జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డికొలిమిగుండ్ల: సరైన పర్యవేక్షణ లేక కొలిమిగుండ్ల మండలంలో తొమ్మిది పాఠశాలలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకునేది లేదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రెండు సమావేశాలకు గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపాలని ఎంపీడీఓ దస్తగిరిబాబును ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి చెందిన మినరల్ వాటర్ గ్రామాలకు కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలో ఎందుకు అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వడం లేదు యూరియా ఇవ్వడం లేదని, ఎద్దుకు చికిత్స చేయాలని 1962కు ఆరు సార్లు ఫోన్ చేస్తే ఆంబులెన్స్కు డీజల్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి గౌరవ వేతనం అందలేదని, వాటిని ప్రభుత్వం వాడుకుంటుందా అని ఎంపీటీసీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్లను కరువు మండలంగా ప్రకటించి ఏడాది అయినా రైతులకు రూపాయి సాయం అందలేదని మీర్జాపురం సర్పంచ్ లాయర్ మహేశ్వరెడ్డి విమర్శించారు. -
ప్రేమ జంట ఘటనపై విచారణ
శిరివెళ్ల: స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఈ నెల 8వ తేదీన జరిగిన సంఘటన పరిణామాలపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమ జంట వ్యవహారం ముదిరి దాడులకు దారి తీసింది. రక్షణ కోరి స్టేషన్కు వచ్చిన జంట వ్యవహారాన్ని రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నించినా కుదరలేదు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో స్టేషన్కు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జంటను వేర్వేరు పోలీస్ వాహనాల్లో తరలించారు. అయితే అబ్బాయిని తరలించే పోలీస్ వాహనంపై కొంత మంది రాళ్లు రువ్వడంతో పోలీస్లు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై శుక్రవారం జిల్లా అడిషనల్ ఏస్పీ యుగంధర్బాబు స్టేషన్కు చేరకుని సీఐ దస్తగిరిబాబును విచారణ చేశారు. అనంతరం రాళ్లు పడిన వాహనాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రధాన కూడలిలో స్పెషల్ పార్టి పోలీస్లను నియమించారు. పోలీస్ బందోబస్తును అడిషనల్ ఏస్పీ పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండంగా ఘటనలో పోలీస్ వాహనంపై ఎవ్వరు రాళ్లు రువ్వారు, ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీస్లు విచారణను ముమ్మురం చేశారు. కార్యక్రమంలో డీఏస్పీ ప్రమోద్, ఎస్ఐ మధుసూదన్ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య వెలుగోడు: పట్టణంలోని గొల్లపేటకు చెందిన గాజా రవి (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గాజా రవి వెలుగోడులో ఓ పాల డైయిరీ తరఫున డిస్ట్రిబ్యూటర్గా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి తల్లి గాజా మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
నకిలీ జీతాల బిల్లుల కేసులో వైద్యశాఖ ఉద్యోగి అరెస్ట్
ఆళ్లగడ్డ: నకిలీ జీతాల బిల్లులు పెట్టుకుని రూ. కోట్ల ప్రభుత్వ నిధులు కాజేసిన కేసుకు సంబంధించి వైద్యశాఖ ఉద్యోగి ఇంతియాజ్ అలీఖాన్ను గురువారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఏజీ ఆడిట్లో 2020 నుంచి 2023 మధ్య కాలంలో అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నకిలీ జీతాల బిల్లులు సృష్టించి రూ. 1,00,16,901 ఆళ్లగడ్డ సబ్ట్రెజరీ నుంచి అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అహోబిలం, నరసాపురం ప్రాథమిక వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న అలీఖాన్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వైద్యాధికారులైన డాక్టర్ నాగదాసయ్య, డాక్టర్ మునిసుధావాణిలకు సంబంధించిన నకిలీ రబ్బరు వేలిముద్రలు, హెచ్పీ ల్యాప్ట్యాప్, మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 93 నకిలీ బిల్లులు సృష్టించి రూ 1.94 కోట్లు డ్రా చేసి వీటిని తన సోదరి మొహతాబ్ బున్నీసా బేగం ఖాతాకు జమ చేయడం చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రమణ, ఎస్సై వరప్రసాద్లు ఉన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి ‘విబి–జి రామ్ జి’
నంద్యాల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విబి–జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్) కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ‘విబి–జి రామ్’ జి విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో భరిస్తుందన్నారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచారన్నారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను మార్చి 31 నాటికి పూర్తిగా వినియోగించాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 1.39 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద బ్యాంకర్లు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, డీఆర్ఓ రాము నాయక్, సీపీఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పులుల అంచనాకు శివభక్తులు సహకరించాలి
ఆత్మకూరు రూరల్: జాతీయ పెద్దపులుల అంచనా కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోందని, శ్రీశైల మల్లన్న భక్తులు అటవీశాఖతో సహకరించి తాము సూచించిన తేదీల్లో మాత్రమే అడవిలో పాదయాత్రకు సిద్ధపడాలని డిడి విగ్నేష్ అపావ్ కోరారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం ఎన్టిసిఏ ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ప్రొటోకాల్ ప్రకారం జరిగే కార్యక్రమం కావడంతో మార్పు చేయడానికి వీలుపడదన్నారు. అందు వల్ల మహాశివరాత్రికి వచ్చే భక్తులు ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే వెంకటాపురం నుంచి నాగలూటి ద్వారా పాదయాత్ర చేసుకోవచ్చన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం బైర్లూటిలో అన్నదాన నిర్వాహకులతో సమావేశమై తగు సూచనలు చేశామన్నారు. సూచించిన రోజుల్లో పాదయాత్రకు వచ్చే భక్తులు తమ వెంట ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దన్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులు, మద్యం సీసాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. విలేకరుల సమావేశంలో సబ్ డీఎఫ్ఓ బబిత పాల్గొన్నారు. -
‘దారి’తప్పిన తమ్ముళ్లు!
కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రహదారుల నిర్వహణపై ఒంటి కాలిపై లేచిన కూటమి నేతలు నేడు రహదారుల నిర్మాణాలు పూర్తికాకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. నంద్యాల జిల్లాలోని గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ వర్క్ కింద రూ.3 కోట్ల అంచనాతో 7.95 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు గత ఏడాది జూలై 4న అగ్రిమెంట్ చేసుకున్నారు. నాబార్డు ఆర్ఐఎఫ్డీ–30 నిధులతో చేపట్టిన పనులను ఈ ఏడాది జూన్ 3 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి రోడ్లకు ఇరువైపులా జంగిల్ను క్లియరెన్స్ చేయించి, డబ్ల్యూఎంఎం పనులు కూడా పూర్తి చేశారు. దాదాపు 70 శాతం మేర పూర్తయిన పనులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్ రికార్డు చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంబంధిత పీఆర్ ఇంజనీర్లు ఈ రోడ్డు పనులను నేటి వరకు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఎంబుక్ రికార్డు చేసిన అనంతరం క్వాలిటీ కంట్రోల్ అధికారులు చేసిన పనులపై క్వాలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయాల్సి ఉంది. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రాంట్ల కింద చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికల్లో ఈ రోడ్డు పనులు దాదాపు 70 శాతం పూర్తయినా జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేసినట్లు నమోదు చేయడం చూస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. 15 కి.మీలు తగ్గనున్న దూరం ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండల కేంద్రమైన గోస్పాడు నుంచి తిరుపతి జాతీయ రహదారికి వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లికి 8 కిలోమీటర్లు, కామినేనిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని గోవిందపల్లి మీదుగా కర్నూలు – తి రుపతి జాతీయ రహదారికి చేరుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రస్తుతం గోస్పాడు నుంచి నంద్యాల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఎంబుక్ రికార్డు చేయకుండా అధికారులపై ఒత్తిళ్లు గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించి ( జంగిల్ క్లియరెన్స్ ) డబ్ల్యూఎంఎం పనులు పూర్తి చేశారు. అయితే స్థానిక తెలుగుదేశం నేతలు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనులకు అనుగుణంగా ఎంబుక్ రికార్డు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎంబుక్ రికార్డు చేయకపోవడం, క్యూసీ చెక్ చేయకపోవడం వల్ల డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయలేని పరిస్థితి ఏర్పడింది. 7.95 కిలోమీటర్ల మేర డబ్ల్యూఎంఎం వేసి వదలేయడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎంబుక్ రికార్డు చేయకపోవడంపై కాంట్రాక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గోస్పాడు–కామినేనిపల్లి రోడ్డుకు రాజకీయ గ్రహణం -
ఎత్తిపోతల పూర్తి చేస్తావా?
రేవంత్ మాటలకు కట్టుబడతావా, జూపాడుబంగ్లా: ఇప్పటికే రాయలసీమ ద్రోహిగా మారిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతవా, రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేస్తావా అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం ఆయన ఏపీ రైతుసంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, కేసీకాల్వ రైతు సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, వైఎస్సార్ కడప జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలిచంద్ర, అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేష్ తదితరులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ పక్కనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థరాజకీయాల కోసం నీటి వివాదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు ఎడాపెడా నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. శ్రీశైలం డ్యాంకు వరదలు వచ్చే కేవలం 30రోజుల్లోనే రాయలసీమ వాటా 110టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే తప్పనిసరిగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలన్నారు. రోజుకు 3టీఎంసీల చొప్పున రాయలసీమప్రాంత నీటివాటాను ఎత్తిపోతల ద్వారా సద్వినియోగం చేసుకొనేలా నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ చేపట్టారన్నారు. చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాయలసీమ లిఫ్టుకు ఎగనామం పెట్టి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. సాగునీటి నిపుణలు రాయలసీమ లిఫ్టు ప్రయోజనకరమని పేర్కొంటుంటే చంద్రబాబు అవసరంలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీటిప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహనలేని నిమ్మలరామనాయుడు రాయలసీమ లిఫ్టు అవసరం లేదని చెప్పడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని, లేకపోతే అన్ని పార్టీలు, వామపక్షపార్టీలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్కు చెక్
శిరివెళ్ల: మందస్తు వైద్య పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చని అసంక్రమిత వ్యాధుల జిల్లా నోడల్ ఆధికారి డాక్టర్ కాంతారావు అన్నారు. గురువారం వీరారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు దాటిన వారందరికీ వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. డాక్టర్ ముఖేష్, సీహెచ్ఓ రాంమోహన్రెడ్డి, పీహెచ్ఎన్ సరస్వతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్ లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని ఎస్సార్బీసీ సీఈ కబీర్ బాషా పేర్కొన్నారు. రిజర్వాయర్ వద్ద జరుగుతున్న ప్లగ్గింగ్ పనులను గురువారం సీఈ సీడీఓ శివకుమార్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కేధారేశ్వరనాథ్, విజయసారధి, అడ్వైజర్ కృష్ణారావు,ఏ ఈఈ ప్రదీప్, క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో పాటు ఎస్సార్బీబీసీ ఎస్ఈ శుభకుమార్తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్లో లీకేజీ పాయింట్ను ఇప్పటికే గుర్తించామన్నారు. శుక్రవారం నుంచి అండర్వాటర్ కాంక్రీట్ పను లు ప్రారంభమవుతాయని చెప్పారు. పనులు పూర్తి కాగానే రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం నీటిని నింపుతామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మద్రా స్ ఐఐటీ ప్రొఫెసర్ సుబ్బారావు, డీఈఈలు మల్లి ఖార్జున, సుబ్బారావు, సాయికిరణ్, ఏఈఈలు సుధాకర్, రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ: ఒకరినొకరు ఇష్టపడి వెళ్లిపోయి, పోలీసుస్టేషన్ను ఆశ్రయించిన ప్రేమజంటను కాపాడేందుకు పోలీసులు సాహసం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన శిరువెళ్లలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శిరివెళ్ల పట్టణానికి చెందిన వేరు వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. యువతి కుంటుంబ సభ్యు లు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు యువతి బేతంచర్ల బస్టాండు సమీపంలో ఉన్నట్లు గుర్తించి బుధవా రం రాత్రి నంద్యాలకు తరలించి గురువారం శిరివెళ్ల పోలీస్ స్టేషనకు తీసుకొచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యుల ముందు కౌన్సెలింగ్ నిర్వహించగా మేజర్లమైన మేము కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. దీంతో పోలీసులు మేము ఏమీ చేయలేమని, వారి ఇష్ట్రపకారం నడుచుకోవాలని సూచించారు. విషయం తెలిసిన యువతి తరపు బంధువులు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సమయస్ఫూర్తితో యువతిని నంద్యాల హోంకు తరలిస్తామని, మళ్లీ మాట్లాడుదామని చెప్ప వాహనంలో తరలిస్తుండగా రోడ్డు పై అటకాయించారు. గుంపులో నుంచి ఓ ఆకతా యి వాహనంపై రాయి విసరడంతో అందులో ఉన్న ఓ వ్యక్తికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అ యినా పోలీసులు ప్రేమ జంటను రహస్య ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరి 7న నవోదయ ప్రవేశ పరీక్ష ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల ని ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 7న నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్గా పుట్టిన తేదిన ఉపయోగించి హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి https://cbseitms.nic.in/2025/ nvsix, 11వ తరగతికి https://cbseitms.nic.in/ 2025/nvsxi వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. -
అభివృద్ధికి మారుపేరు ఎస్వీ సుబ్బారెడ్డి
పత్తికొండ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలో పులికొండ గ్రామానికి చెందిన ఎస్వీ అభిమానులు ఎస్వీ సుబ్బారెడ్డి 95 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగాగా 95 కేజీల కేక్తో ఎస్వీ కుటుంబం అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు నివాసానికి ఊరేగింపుగా చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, విజయ మనోహరి దంపతులు తదితరులు ఎస్వీ సుబ్బారెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డిని పూలమాల, శాలువా తో సత్కరించి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. -
ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు
గోస్పాడు: గోస్పాడు మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ ఖాజాహుసేన్, పీఈటీ గీతావాణిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, విద్యార్థులను గ్రూపులుగా విభజించి విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పాఠశాలలో వారు పనిచేస్తే తాము పాఠశాలకు రాలేమని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. పాఠశాలలో వారితో కాకుండా ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ను చుట్టుముట్టడంతో ఉద్రిక్తతత నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి పాఠశాలలో రాలేదని ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు. సమాచారం అందుకున్న ఎంఈఓలు అబ్దుల్ కరీం, ఎస్ఐ సుధాకర్రెడ్డి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ గీతావాణి సెలవులో వెళ్లారని ఎంఈఓ తెలిపారు. డీఈఓ విచారణ: మోడల్ స్కూల్లో విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఈవో జనార్దన్రెడ్డి గురువారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడారు. నివేదిక తయారు చేసి పంపాలని ఎంఈఓను ఆదేశించారు. -
కాటసాని శివ దీక్ష స్వీకరణ
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రంలో గురువారం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి శివదీక్ష స్వీకరించారు. కాటసాని ఈ దీక్ష స్వీకరించడం 35వ సారి కావడం విశేషం. శివదీక్ష సందర్భంగా కాటసానితో పాటు ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఆలయంలోని ఉమామహేశ్వరులను దర్శించుకున్నారు. నందీశ్వరుడికి కూడా పూజలు నిర్వహించారు. కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు సుమారు 200 మంది శివదీక్ష స్వీకరించారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మందుల గుట్టురట్టు
క్యూఆర్ కోడ్తో కర్నూలు(హాస్పిటల్): ప్రస్తుతం మందుల మాయాజాలం నడుస్తోంది. ఏది అసలో, ఏది నకిలీ మందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది మంచి మందో, ఏది సరైనది కాదో అర్థంకాని స్థితిలో మార్కెట్ ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్ను తీసుకొచ్చింది. ప్రతి ఔషధంపై దాని మందుల తాలూకు వివరాలు ఉండేలా దానిని రూపొందించింది. ఈ మేరకు ఇకపై తయారయ్యే మందులపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,800 రిటైల్ మెడికల్షాపులు, వెయ్యి దాకా హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులు, పోటీ కారణంగా అనేక రకాల నకిలీ మందులు అచ్చు బ్రాండెడ్ మందుల రూపంలో పుట్టుకొస్తున్నాయి. దీనికితోడు ఊరు, పేరు లేని మందుల కంపెనీలు తయారు చేసే మందులూ మార్కెట్లో కొల్లలుగా ఉన్నాయి. లాభాలు అధికంగా ఉండటంతో అధిక శాతం వైద్యులు వారికి తక్కువ ధరకు లభించే ఎక్కువ లాభాలను ఇచ్చే ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏ మందులో ఎంత మోతాదులో మందు ఉంది, అసలు మందు ఉందా లేదా, ఏది నకిలీ, ఏది అసలు తెలుసుకోవాలంటే కష్టంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో క్యూ ఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికంగా విక్రయాలు జరిగే బీపీ, షుగర్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్, అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధులను తగ్గించే మందులపై ఆయా కంపెనీలు క్యూ ఆర్ కోడ్ను ముద్రించి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు మాత్రమే వీటికి ప్రాధాన్యత ఇస్తుండగా త్వరలో ఇతర కంపెనీలు కూడా క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా దేశంలోని అన్ని ఫార్మాకంపెనీలు అవి తయారు చేసే మందులపై తప్పనిసరిగా క్యూ ఆర్ కోడ్ను ముద్రించి వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత చేకూరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్ విధానం వల్ల ఆయా మందుల వివరాలు అందులో తెలుస్తాయి. ఏ ఔషధం దేనికి పనిచేస్తుంది, అది ఎక్కడ తయారైంది, ఆ ప్రాంతం వివరాలు ఉంటాయి. ఔషధంలో మందు ఎంత మోతాదులో ఉంది, ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇది రోగి ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. – హరిహరతేజ, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్.కొత్తపల్లె గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన నరేష్ ఆచారి (39) బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పదేళ్లుగా పని చేస్తూ బనగానపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సొంతూరులో పొలం పని చూసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆర్ కొత్తపల్లె – ఆర్ఎస్ రంగాపురం గ్రామాల మధ్య రహదారి పక్కన్న నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ప్రమాదవశాత్తూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్ ఆచారిని వాహనదారులు బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య జ్యోతితో పాటు కుమార్తె కోమలి, కుమారుడు అఖిరానందన్ ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు గురువారం తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని.. గోనెగండ్ల: పని చేయకుండా ఖాళీగా ఉంటే ఎట్లా అని..తల్లిదండ్రులు మందలించడంతో కుమారు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన ఎరుకల రంగముని, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు స్టీల్ సామాన్లు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు సతీష్కు వివాహమైంది. చిన్న కుమారుడు వీరేంద్ర (19) ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతు న్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరేంద్ర స్నేహితులతో కలిసి మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న సోదరుడి ఇంటికెళ్లి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి అన్న సతీష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు గోనెగండ్ల: అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను రాయలసీమ జోనల్ మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్), జిల్లా రాయల్టీ ఇన్స్స్పెక్టర్ శివ పార్వతి ఆదేశించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘హంద్రీలో ఇసుక తోడేళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన ఈ కథనానికి మైనింగ్ అధికారులు స్పందించారు. తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల సమీపంలోని హంద్రీనదులను పరిశీలించారు. హంద్రీనదిలో తవ్విన గుంతలు, ఇసుకను పరిశీలించారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి బనగానపల్లె రూరల్: నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ సమీపంలో తోడేళ్ల గుట్ట వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ భూపాలుడు వివరాల మేరకు.. బేతంచర్ల పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన నాగరాజు కుమారుడు లక్ష్మన్న(26) పలుకూరు గ్రామంలో జరుగు మైనింగ్ గనుల్లో కూలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పలుకూరు అడ్డ రోడ్డు నుంచి గని వద్దకు నడుచుకుంటూ బయల్దేరాడు. అయితే వెనుక వైపు నుంచి పలుకూరు వైపు వేగంగావెళ్తున్న టాక్టర్ లక్ష్మన్న ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్ఐ భూపాలుడు తెలిపారు. మృతుడి అన్న అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తలసీమియా రక్తమార్పిడి కేంద్రం ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో గురువారం తలసీమియా బాధితులకు రక్తమార్పిడి కేంద్రం ప్రారంభమైంది. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా వంద మందికి పైగా తలసీమియా బాధితులకు రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రక్తాన్ని ప్రభుత్వ, ఇతర ఆసుపత్రుల్లో ఎక్కి ంచేవారన్నా రు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేశామన్నారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
డోన్/ప్యాపిలి: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్రెడ్డి గురువారం డోన్, ప్యాపిలి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అందజేసిన కానుకలను బుగ్గన ఆదేశాల మేరకు విద్యార్థులకు అందజేశారు. డోన్లోని జ్యోతిరావ్పూలే ఆశ్రమ పాఠశాల, ఐటీఐ, బాలికల వసతి గృహాలతో పాటు ప్యాపిలిలోని కేజీబీవీ విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, వైఎస్ చర్మన్ జాకీర్ హుసేన్, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజ్కుమార్, పార్టీ నాయకులు శ్రీరాములు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
కర్నూలు: ప్రేమ పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరంలో నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఎన్హెచ్–40 రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబంతో పాణ్యంలో నివాసముంటున్న పఠాన్ రహంతుల్లా పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వారింట్లోని ఓ మైనర్ బాలిక(16)తో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మైనర్ బాలికను శారీరకంగా దగ్గరయ్యాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2020 నవంబర్ 2న తనకు గర్భం వచ్చిందని బాలిక చెప్పగా తన మోటర్ సైకిల్పై బాలికను నెల్లూరుకు తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత మీ ఇంట్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పాణ్యంకు పిలిచుకువచ్చి హోటల్ ముందు బాలికను దించి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లితో కలసి పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పఠాన్ రహంతుల్లాపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు నిరూపణ కాగా 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. క్వింటా పత్తి రూ. 8,149 ఆదోని అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం పత్తి ధర రూ.39కి పెరిగింది. క్వింటాకు సీసీఐ గిట్టుబాటు ధర రూ.8110 ఉండగా మార్కెట్లో రూ.8149 పలికింది. అమ్మకానికి 2,097 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.8,149, మధ్య ధర రూ.7,469, కనిష్ట ధర రూ.4,279గా నమోదయ్యింది. -
వామ్మో చిరుత
రోడ్డు పక్కన ఉన్న చిరుత కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఆదానీ సిమెంట్ మైనింగ్ పరిసరాల వద్ద గురువారం తెల్లవారు జామున చిరుత కనిపించింది. సిమెంట్ ఫ్యాక్టరీలో ముగ్గురు ఉద్యోగులు డ్యూటీ ముగించుకొని కారులో తిమ్మనాయినిపేటకు వెళ్తున్న సమయంలో మైనింగ్ పరిసరాల్లోకి చేరుకొనే సరికి రోడ్డును క్రాస్ చేయడా న్ని గమనించారు. కారు లైటింగ్కు కొద్ది సేపు చిరుత ఆగడంతో అందులో ఉన్న సిబ్బంది సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దెయ్యాల చెరువు వైపు చిరుత వెళ్లిపోవడాన్ని గమనించారు. చిరుత సంచారం విషయం తెలియడంతో అబ్దులాపురం, కోర్నపల్లె గ్రామాల రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లరాదని ఫ్యాక్టరీ సిబ్బంది సూచించారు. మరో వైపు అనంతపురం జిల్లా తాడిపత్రి అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రదేశాన్ని తిలకించి పాద ముద్రలు సేకరించారు. దాదాపు ఏడు నెలల క్రితం తిమ్మనాయినిపేట సమీపంలో చిరుత దారిన పోయే వాహనదారులకు కనిపించింది. ఇప్పుడు కోర్నపల్లె కనిపించిన చిరుత రెండు ఒక్కటే ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జంట హత్యల కేసులో 12 మంది నిందితుల అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన బోయ పరమేష్, బోయ వెంకటేష్ జంట హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్. భార్గవి మర్రివాడ వెల్లడించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ ఆదే శాల మేరకు.. రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, రూరల్ ఎస్ఐ కె.శ్రీనివాసులు, హెచ్సీలు విక్టర్బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర, కానిస్టేబుళ్లు వెంకటాపురం తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, అశోక్కుమార్, మల్లయ్య, జి. తిప్పన్న బృందంగా ఏర్పడి హత్య కేసులో నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామ శివారు లోని ఇటుకల బట్టీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో 20 మంది నిందితులు ఉండగా 12 మందిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, రెండు బైక్లు, టాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బిక్కి సీతారాముడు, బిక్కి రాముడు, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి దుబ్బ నరసింహుడు, బిక్క. శంకరన్న, బిక్కి శ్రీహరి, బిక్కి విష్ణువర్దన్, బిక్కి హరిబాబు, బిక్కి అశోక్, బోయ బిక్కి మల్లేష్, బిక్కి అంజినప్ప ఉన్నారన్నారు. మరో ఎనిమిది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యల దాకా వచ్చిందన్నారు. రెండేళ్ల క్రితం బోయ బిక్కి తునకల రవి, బోయ బిక్కి తునకల నరసింహులను బోయ గోవిందు కుటుంబీలు దాడి చేసి చంపేశారన్నారు. హతుల కుమారులు కక్ష పెంచుకుని బోయ గోవిందు కుటుంబంపై ఈనెల 5వ తేదీ దాడి చేయడంతో గోవిందు సోదరులు పరమేష్, వెంకటేష్ హత్యకు గురయ్యారు. గోవిందు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుల అరెస్ట్లో ప్రతిభ చూపిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
టీడీపీ నాయకుడి హల్చల్
● బిహార్ కూలీలపై దౌర్జన్యం ● అనుచరులతో కలిసి ట్రాక్టర్లు, బైక్, డీజల్ డ్రమ్ములు ధ్వంసం సంజామల: పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా బతుకుదేరువు కోసం వచ్చిన బిహార్ కూలీలపట్ల సంజామల మండలం పేరుసోముల గ్రామ టీడీపీ నాయకుడు సురేష్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసివారి ట్రాక్టర్స్, బైక్,డీజల్ డ్రమ్ములను ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. పేరుసోముల గ్రామ శివారు పెద్దమ్మ గుడి వద్ద టర్నింగ్లో టవర్ వర్క్ పనుల నిమిత్త వచ్చిన బిహార్ కూలీలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నాయకుడు సురేష్రెడ్డి కోవెలకుంట్ల నుంచి వస్తున్నాడు. పేరుసోముల పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుగా ఉందని బిహార్ కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ వాగ్వాదం దిగాడు. వారు ప్రతిఘటించడంతో గ్రామానికి వెళ్లి అనుచరులను వెంటేసుకుని కూలీల నివాసం దగ్గరికి వచ్చాడు. టీడీపీ కార్యకర్తలు కొట్టాడానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బిహార్ కూలీలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇళ్ల వద్ద ట్రాక్టర్స్, బైక్, డీజల్ డ్రమ్ములు ఉండటంతో వాటిని ధ్వంసం చేసి హల్చల్ చేశారు. కూలీలపై దాడి విద్యుత్ టవర్ కాంట్రాక్టర్ ను బయపెట్టడానికా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
● కేసీ కెనాల్లో దూకిన యువరైతు
అప్పుల బాధతో.. పాములపాడు: పంటలకు ధర లేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ యువరైతు మనస్థాపం చెంది కేసీ కెనాల్లో దూకాడు. ఈనెల 6వ తేది రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జూటూరు గ్రామ పంచాయతీ మజరా కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన యువరైతు వంశీ(21) తండ్రి చంద్రపాల్, తల్లి నాగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు.దీనికితోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, మినుము పండిస్తే సరైన ధర లభించలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులపై ఇంట్లో కుటుంబసభ్యులతో మదనపడ్డాడు. తర్వాత ఇంటికి గొళ్లెం పెట్టి పరుగెత్తుకుంటూ సమీపంలోని కేసీ కెనాల్లో దూకాడు. ఈత కూడా రాకపోవడంతో క్షణాల్లో మునిగిపోయాడు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సిబ్బందితో పాటు, బంధువులు కేసీ కెనాల్ వెంట గాలింపు చేపట్టారు. చంద్రబాబువి చీకటి ఒప్పందాలు జూపాడుబంగ్లా: సీఎం చంద్రబాబునాయుడు చీక టి ఒప్పందాలు చేసుకుంటారని, అందులో భాగ మే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్బాబు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు నేడు సీపీఐ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఈశ్వ రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రైతుసంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్ర య్య తదితరులు రానున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన జూపాడుబంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌతాళం: మండ లంలోని ఎరి గేరి గ్రామంలో బంగారమ్మ దేవరకు వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిగేరి గ్రామంలో బుధవారం బంగారమ్మ దేవర జరుగుతుంది. కౌతాళం గ్రామానికి చెందిన రాము..భార్య మహదేవి, కుమారుడు నాగిరెడ్డి, మనవడు అభిరాంతో కలిసి ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. దేవర ముగించుకుని సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. కౌతాళం నుంచి ఎరిగేరి వైపు ఎదురు వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లి బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మహదేవి(48), నాగిరెడ్డి (28) మృతి చెందారు. మహదేవి చేతిలో ఉన్న మనవడు అభిరాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అశోక్కుమార్ సంఘ టనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగిరెడ్డి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగిరెడ్డికి భార్య శాంతితో పాటు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. -
తగ్గిన టమాటా ధర
ఆస్పరి: టమాటా ధర తగ్గిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల క్రితం 40 కిలోలు ఉన్న రెండు బాక్సులు కలిపి రూ.1,500 నుంచి రూ. 2వేలు వరకు ధర పలికాయి. కిలో టమాటా ఇక్కడే రూ.30 నుంచి రూ. 40 వరకు ధర పలికింది. బుధవారం ఆస్పరి మార్కెట్లో 50 కిలోలు ఉన్న రెండు బాక్సులు రూ. 575 లోపే పలకడం గమనార్హం. ప్రస్తుతం రూ.12 వరకు కిలో టమాటా ధర ఉంటోంది. వారం రోజుల్లోనే కిలో ధర రూ.28 వరకు తగ్గడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఆస్పరి, బిల్లేకల్లు టమాటా మార్కెట్లకు 72 క్వింటాళ్ల దాక దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా?
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులపై రౌడీషీట్, పీడీ యాక్ట్ ఓపెన్ చేశారని, ఇది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం సీఆర్ భవన్లో ఐక్య విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కె.శ్రీనివాసులు, సోమన్న, కె.భాస్కర్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, హనోక్ హాజరై మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని కోరిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్షపూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. దీన్ని ఖండిస్తూ జనవరి 9న విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు. -
నియమ నిష్టలు
శ్రీగిరి శివస్వాముల పాదయాత్ర (ఫైల్)శివదీక్ష చేపట్టే భక్తులు నియమ నిష్టలను పాటించాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందిన తరువాత గురుస్వామి ద్వారా దీక్షను స్వీకరిస్తారు. రుద్రాక్షమాలను ధరించి, భస్మంతో అలంకరించుకుని, గోధుమరంగు దుస్తులను ధరిస్తారు. రోజు సూర్యోదయం పూర్వం, సంధ్యాసమయాన చల్లనీటి స్నానం ఆచరిస్తారు. శవ దర్శనం జరిగినప్పుడు కూడా స్నానం ఆచరించాలి. అనంతరం శివయ్య దర్శనం, పూజాదికాలు నిర్వహించాలి. ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటిస్తారు. కటిక నేలపైనే నిద్రిస్తారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు. కోపతాపాలకు దూరంగా ఉండి ఎవరినీ విమర్శించకుండా, నిరాడంబంరంగా జీవిస్తారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిత్యం శివపంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ, ఎదుటి వారిని శివ నామంతో పలకరిస్తారు. వెల్లిపాయ, గోంగూర, ఉల్లిపాయ లేని ఆహారాన్ని స్వీకరిస్తారు. -
హత్యకోణంలో విచారణ
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన ఓ యువకుడి అదృశ్యం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. వినోద్ (21) గత ఏడాది ఆగస్టు 31 వ తేదీన నంద్యాలలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి రాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగుచూశాయి. వినోద్ బైక్ను బొల్లవరం రస్తాలోని ఎస్సార్బీసీ బ్రిడ్జి నుంచి కిందకు పడేసినట్లు అనుమానితులు చెప్పడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించగా బైకు కనిపించింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యకోణంలో విచారిస్తున్నారు. -
శివభక్తి..దీక్షతో ముక్తి!
శ్రీశైలంటెంపుల్: భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన సాధనం శివదీక్ష. ఈ దీక్ష ద్వారా శివుడి అనుగ్రహం పొందడంతో పాటు సకల పాపాలు హరించబడతాయని భక్తుల విశ్వాసం. దీంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడి భక్తులు శివదీక్ష చేపడుతారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈదీక్షను ఉభయ తెలుగురాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు స్వీకరిస్తారు. అత్యంత నియమ నిష్టలతో ఈ దీక్షలు సాగుతాయి. 1994సంవత్సరంలో అప్పటి శ్రీశైల దేవస్థాన ఈఓ వంగాల శివరామిరెడ్డి శివదీక్షను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. మొట్టమొదటిసారిగా ఆయనే స్వయంగా ఈ దీక్షను స్వీకరించారు. తర్వాత దీక్ష ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో క్రమంగా దీక్షపరులు పెరుగుతూ వచ్చారు. నేడు ఈ సంఖ్య 5లక్షలకు పైగా చేరిందని శ్రీశైలదేవస్థానం అధికారులు తెలిపారు. 41రోజుల పాటు దీక్ష: శివదీక్షను 41రోజుల పాటు మండలం, 21రోజుల పాటు అర్ధ మండలం దీక్షను స్వీకరిస్తారు. గురువారం నుంచి శివదీక్షలు ప్రారంభం కానున్నాయి. మండల (41రోజుల)దీక్షను స్వీకరించే భక్తులు గురువారం నుంచి, జనవరి 28న అర్థమండల (21రోజుల)దీక్షను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 17న శివదీక్షను విరమిస్తారు. కొంత మంది భక్తులు ప్రస్తుతం 11రోజుల పాటు కూడా దీక్షను స్వీకరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికి 41 రోజులు పూర్తయ్యేలా దీక్షను స్వీకరిస్తారు. అలాగే కార్తీకమాసం నుంచి 108 రోజుల పాటు అఖండదీక్ష స్వీకరిస్తారు. 41రోజుల పాటు దీక్ష పూర్తయిన తరువాత ఇరుముడి సమర్పిస్తారు. ఇరుముడి సమర్పణ శివదీక్ష పూర్తయ్యే రోజున ఇరుముడితో శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. ఎక్కువ మంది శివస్వాములు పాదయాత్రగా వెళ్తుంటారు. గోధుమ వర్ణం సంచిలో స్వామి అమ్మవారికి నివేధించేందుకు పూజా సామగ్రి, నైవేద్యం ఇరుముడిగా తీసుకువెళతారు. స్వామివారికి ఇరుముడి సమర్పించిన తరువాత మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజలు అనంతరం శివదీక్షను విరమిస్తారు. శివస్వాములకు దేవస్థానం సహకారం శివమాల ధరించి శ్రీశైలం చేరుకున్న శివస్వాములకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సహకారాలు అందిస్తుంది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి శివరాత్రి రెండు రోజుల ముందు వరకు మల్లన్న లింగ (స్పర్శ) దర్శనం కల్పిస్తుంది. అలాగే శివమాల విరమణకు శివదీక్షశిబిరాల వద్ద ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేసి, హోమగుండాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా శివదీక్ష భక్తులకు తాగునీరు, భోజనం, స్నానాదికాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. -
హోం వర్క్ చేయలేదని విద్యార్థిపై టీచర్ దాడి
బేతంచెర్ల: హోంవర్క్ చేయలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. గోరుమానుకొండ ఏపీ రెసిడెన్సియల్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ మండల ఉడుములపాడు గ్రామానికి చెందిన కుల్లాయి కొడుకు హర్షవర్ధన్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3వ తేదీన విద్యార్థి హోం వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో తలపై కొట్టడంతో రక్త గాయమైంది. మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి 4వ తేదీన ఉదయం ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళనకు గురైన వారు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి కుమారుడు ఇంటికి రావడంతో టీచర్ తలపై కొట్టిన విషయం తెలిసింది. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డోన్ ఆర్డీఓ నరసింహులును కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
కర్నూలు: సంక్రాంతి పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీఐజీ/ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా దొంగలు చోరీలు పాల్పడే అవకాశం ఉందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పండుగకు ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఇంట్లో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు రాత్రివేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ల కాలనీ వాసులు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మరింత భద్రత ఉంటుందన్నారు. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను తిరస్కరించాలన్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే 112 కానీ, డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
ఉగాదికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ఉగాది పండుగ నాటికి జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి హౌసింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ డీఈలు, ఏఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 14,868 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం రూఫ్ స్థాయిలో 1,583, లింటెల్ స్థాయిలో 2,805 బేస్మెంట్ స్థాయిలో 6,880 ఇళ్లు ఉన్నాయన్నారు. వాటి నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసేలా హౌసింగ్ ఇంజినీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 556 ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, గడివేముల మండలాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తక్కువ పురోగతి సాధించిన మండలాలను ప్రత్యేకంగా తనిఖీ చేయనున్నామన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు హౌసింగ్ 2.0 పథకం ద్వారా రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు చెప్పాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్ పాల్గొన్నారు. -
అటవీశాఖలో ఇక డిజిటల్ చెల్లింపులు
ఆత్మకూరురూరల్: శ్రీశైలం పరిధిలోని శిఖరం, లింగాలగట్టు చెక్ పోస్టుల్లో పర్యావరణ సెస్ను క్యూర్ కోడ్తో వసూలు చేయనున్నారు. అలాగే సాక్షిగణపతి వద్ద పార్కింగ్ ఫీజును డిజిటల్ విధానంలో తీసుకోనున్నారు. ఎన్ఎస్టీఆర్ పరిధిలోని ఆత్మకూరు డివిజన్లో జరిగిన పొరబాటుకు అటవీశాఖ ఈ చర్యలు చేపట్టింది. అటవీ శాఖ చెక్ పోస్ట్ల నుంచి సుమారు రూ.4 కోట్ల సొమ్మును ఉద్యోగి చాంద్ బాషా ఇతర ఖాతాలకు దారి మళ్ళించిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఆయన అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేరం మరోసారి జరగకూడదని ఆత్మకూరు అటవీ డివిజన్ నుంచి నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా ఆయా చెక్ పోస్టులు, పార్కింగ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. కమాండ్ కంట్రోల్ ఆత్మకూరు డీడీ కార్యాలయంలో పర్యవేక్షించనున్నారు. బైర్లూటి చెక్పోస్ట్ వద్ద సెల్ సిగ్నల్లు బలహీనంగా ఉండటంతో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆత్మకూరు డీడీ విఘ్నేష్ అపావ్, సూపరిన్డెంట్ చంద్రశేఖర్ రాజులు పర్యవేక్షిస్తున్నారు. -
యూరియా కోసం తప్పని తిప్పలు
రుద్రవరం: రబీ సీజన్లో సాగు చేసిన వరి పంటకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయినప్పటికీ ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే అందుతున్నాయి. రుద్రవరంలోని సంత మార్కెట్లో ఉన్న గ్రామ సచివాలయం వద్ద బుధవారం యూరియా కోసం టోకెన్లు తీసుకునేందుకు రైతులు గంపులుగా చేరారు. గంటల కొద్ది వేచి ఉండి స్లిప్పులు రాయించుకొని వెళ్లారు. గురువారం ఇదే సచివాలయం వద్దకు వచ్చి ఇచ్చే రెండు బస్తాల యూరియాను తీసుకెళ్లాల్సి ఉందని రైతులు తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేక పోతోందని, ప్రయివేటు దుకాణాల్లో ధరలను అదుపు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కనిపించని పెద్ద డాక్టర్లు
నిబంధనల ప్రకారం ఓపీ విభాగంలో రోగులకు చికిత్స అందించేందుకు తప్పని సరిగా ఆయా విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఉండాలి. దీని పర్యవేక్షణలో పీజీ వైద్యులు ఉండి రోగులకు చికిత్స చేయాల్సి ఉంది. జిల్లా ఆసుపత్రిలో మాత్రం అలాంటి పరిస్థితులు లేకుండా అసలు డాక్టర్లు లేకుండానే జూనియర్లు, సీనియర్ రెసిడెంట్లు వైద్య సేవలు అందిస్తున్నారు. గోస్పాడు: నంద్యాల జిల్లా ఆసుపత్రిలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఉద యం 9గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు కొందరు వైద్యులు అందుబాటులో ఉండటం లే దు. ఆసుపత్రికి జిల్లా ప్రజలతో పాటు అత్యవసర ప రిస్థితులలో సమీప జిల్లాలు కడప, ప్రకాశం సరిహద్దు ప్రాంతాల నుంచి రోగులు కూడా వస్తుంటారు. దాదాపుగా 1,200 నుంచి 1,400 మంది దాకా ప్రతిరోజు ఓపీ ఉంటూ ఎంతో రద్దీగా ఉంటుంది. పెద్ద డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జూనియర్, సీనియర్ రెసిడెంటు వైద్యులు రోగులకు వైద్యం చేసున్నారు. కానరాని వైద్యులు ఉదయం తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఓపీ(ఔట్ పేషెంట్ల)ను వైద్యులు చూడాల్సి ఉంది. అయితే వివిధ రోగాలతో బాధపడుతూ వచ్చిన ప్రజలు వైద్యుల కోసం నిరీక్షిస్తూ కూర్చుండి పోవాల్సివస్తోంది. ఉదయం వైద్య పరీక్షలు చేయించుకొని వాటి రిపోర్టులు చూపించేందుకు కూడా కొంతమంది రోగులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. మూడు గంటలకు రావాల్సిన వైద్యులు వారివారి ఓపీలకు సక్రమంగా రావటం లేదు. జూనియర్, సీనియర్ రెసిడెంటు డాక్టర్లు కూడా వారికిష్టమైనప్పుడు వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఒక్కటితోనే సరి రోగులకు వైద్యసేవలందించేందుకు ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, మానసిక వ్యాధుల విభాగాల్లో మా త్రమే డాక్టర్లు ఉంటున్నారు. ఎముకలు, శస్త్రచికిత్సలు, చర్మ వ్యాధుల విబాగంలో రెండేసీ ఓపీ విభాగాలు ఉన్నా వాటిలో ఒక్కటే మధ్యాహ్నవేళల్లో తలుపులు తెరుచుకుంటున్నాయి. ఉన్న ఒక్కచోటైనా డాక్టర్లు సక్రమంగా రాక రోగులకు జూనియర్, సీనియర్ రెసిడెంటు డాక్టర్లు వైద్యసేవలు చేయాల్సి వస్తుంది. కొరవడిన పర్యవేక్షణ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పెద్ద డాక్టర్లపై పర్యవేక్షణ లేకపోవడంతోనే వారు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం గంట పాటు నిర్వహించే ఓపీ సేవల్లో ఎప్పుడు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంత మంది వైద్యులు విధులకు సమయపాలన పాటించకుండా మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్నారు. ఓపీ విభాగాల్లో జూనియర్ వైద్యులు వ్యాధుల నిర్ధారణ కోసం వారే వైద్య పరీక్షలకు రాసి పంపుతున్నారు. విధులకు ఎవరు ఎప్పుడు వస్తున్నారన్న విషయాన్ని ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ తంతు కొనసాగుతోంది. నంద్యాల జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజు అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలతో పాటు సదుపాయాలు ఉన్నాయి. ఆసుపత్రికి రోగాలతో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. ఓపీ విభాగాల్లో ప్రతి ఒక్కరు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాం. సమయానికి లేకపోతే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జిలానీ, ఇన్చార్జి సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల రాక కోసం ఎదురుచూపులు ఒకటి, రెండు విభాగాల్లోనే కనిపిస్తున్న వైద్యులు ప్రతి రోజూ 1,200 నుంచి 1,400 దాకా ఓపీలు గంటల తరబడి నిరీక్షణ బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న రోగులు పట్టించుకోని అధికారులు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర న్యాయ విభాగం సెక్రటరీగా అబ్దుల్ ఖైర్
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర న్యాయ విభాగం కమిటీ సెక్రటరీగా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన అబ్దుల్ ఖైర్ను నియమిస్తూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరాముడును రాష్ట్ర న్యాయ విభాగం జాయింట్ సెక్రటరీగా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన గనపురం ధనుంజయరెడ్డిని జాయింట్ సెక్రటరీగా నియమించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు నందికొట్కూరు: డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ డీఐజీ పీ విజయలక్ష్మి హెచ్చరించారు. నందికొట్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్లు తప్పులతడకగా చేస్తే సమస్యలు ఏర్పడతాయన్నారు. జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక ప్యాపిలి: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి హరినాథ్ రెడ్డి జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం పద్మాబాయి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో హరినాథ్ రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుని బంగారు పతకాన్ని సాధించాడన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటుకోవాలని హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు. అనంతరం హరినాథ్ రెడ్డిని ఉపాధ్యాయులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బనగానపల్లె రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని, ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. నందివర్గం జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేగు పండ్ల కోసం వెళ్లి...
● బావిలో పడి బాలుడి మృతి శిరివెళ్ల: రేగు పండ్ల కోసం వెళ్లిన బాలుడు తలారి రఘరాం (7) వైన్ షాపు వెనుక ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన గోవిందపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ చిన్న పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. గోవిందపల్లెకు చెందిన తలారి రఘరాం ఈ నెల 6వ తేదీ సాయంత్రం తోటి పిల్లలతో కలసి రేగు పండ్ల కోసం కామినేనిపల్లె రస్తాకు వెళ్లారు. అక్కడ వైన్ షాపు వెనుక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ విషయాన్ని తోటి పిల్లలు చెప్పలేదు. ఆందోళనతో తల్లి మల్లేశ్వరి గ్రామంలో, బంధువుల వద్ద వెతికారు. బుధవారం గ్రామం వెలుపల బావిలో చూడగా బాలుడు మృతి దేహం కనిపించింది. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఆ రైలెక్కితే కడుపు ఉబ్బరమే!
కోవెలకుంట్ల: ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం సులభతరం చేయాలని పదేళ్ల క్రితం ప్రారంభమైన నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలోని డెమో రైలు ప్రయాణంలో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. రైలులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కి.మీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నంద్యాల జిల్లా నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నంద్యాల నుంచి రేణిగుంట వరకు ప్రతి రోజు ఉదయం నంద్యాల నుంచి ఉదయం 6 గంటలకు డెమో బయలుదేరుతుంది. మొదట్లో ఈ రైలు నంద్యాల నుంచి కడప వరకు మాత్రమే నడిచేది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులపాటు అదే జిల్లా పెండ్లిమర్రి వరకు పొడగించారు. మూడేళ్ల క్రితం నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు నడుస్తోంది. నంద్యాల నుంచి ఉదయం వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి నంద్యాలకు చేరుకుంటోంది. ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి రోజు రైలు బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. వివిధ స్టేషన్లలో ఎక్కుతున్న ప్రయాణీలు కూర్చునేందుకు సీట్లు లేక గమ్యస్థానం చేరేవరకు నిలుచుని పోవాల్సి వస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం డెమో రైలులో మరుగుదొడ్ల వసతితోపాటు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు రైల్వే అధికారులను విన్నవించారు. ఇప్పటి వరకు ఆ దిశగా రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రయాణికులకు మనవి.. కాలకృత్యాలు తీర్చుకుని రైలెక్కండి.. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలును బాత్రూం, మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. నంద్యాల నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు బయలుదేరి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, తదితర ప్రయాణికులతో రైలు ప్రతి రోజు కిటకిటలాడుతోంది. రైలు బయలుదేరిన నుంచి గమ్యస్థానం చేరే వరకు రోజుకు 12 వందలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక డెమూకు ప్రత్యామ్నాయంగా రెండు డెమూ రైళ్లు ఉండగా ఒక రైలులో మరుగుదొడ్లు, బాత్రూంలు అసలు లేవు. మరో రైలులో ఒకటి, రెండు మాత్రమే ఉన్నా నీటి వసతి లేకపోవడంతో వినియోగంలో లేవు. మొదట్లో కడప వరకు మాత్రమే రైలు నడిచే సమయంలో మరుగుదొడ్ల వినియోగం అవసరం లేకుండా ఉండేది. ప్రస్తుతం నంద్యాల రేణిగుంటకు ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉండటంతో ప్రయాణికులకు ఒకటి, రెండు కష్టాలు తప్పడం లేదు. షుగర్వ్యాధిగ్రస్తులు, మహిళలు, వృద్థులు, చిన్న పిల్లలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. రైలు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉగ్గపట్టుకుని కూర్చోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రైలు క్రాసింగ్కు ఆగిన ప్రదేశాల్లో రైలు దిగి బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. నంద్యాల నుంచి రేణిగుంట వెళ్లే ప్రయాణికులు దాదాపు 288 కిమీ ప్రయాణం చేయాల్సి రావడంతో మరుగుదొడ్ల కష్టాలు తప్పడం లేదు. ప్రతి రోజు నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు నడుస్తున్న డెమూ రైలులో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. రైలులో బాత్రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు మరుగుదొడ్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఆరు గంటల పాటు రైలు ప్రయాణం చేయాల్సి ఉండగా షుగర్వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. – రమణారెడ్డి, ప్రయాణికుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం ప్రధాన రైల్వేస్టేషన్లలో మౌలిక వసతుల కొరత డెమో రైళ్లతోపాటు ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులను మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. డెమో రైలు మినహా మిగిలిన రైళ్ల రాకపోకలన్నీ రాత్రి వేళ్లలో కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో బన గానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్లల్లో తాగేందుకు సరైన నీటి వసతి లేకపోవడం విచారకరం. కొన్ని చోట్ల చిన్నపాటి వాటర్క్యాన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా నిమిత్తం ఏర్పాటు చేసిన కుళాయిల దిమ్మెలు దెబ్బతిని వినియోగం లేకుండా పోయాయి. గతంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారాయి. రెండు డెమూ రైళ్లలో అందుబాటులో లేని మరుగుదొడ్లు నంద్యాల – ఎర్రగుంట్ల మార్గంలో ప్రయాణికుల ఇక్కట్లు ఈ రైళ్లలో రోజుకు దాదాపు 2500 మంది రాకపోకలు ఒకటి, రెండుకు ఆరుగంటల పాటు ఉగ్గపట్టుకోవాల్సిందే 288 కి.మీ వరకు వేచి ఉండాల్సిందే రైల్వేస్టేషన్లలోనూ మరుగుదొడ్లు కరువు -
వార్డెన్లు పని చేసే చోటే నివాసం ఉండాలి
● బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ కర్నూలు(సెంట్రల్): సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల హెచ్డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూలు, డీబీసీడబ్ల్యూఈఓలు, ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూర్ ఈఐఎస్ ప్రిన్సిపాళ్లతో బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. మెనూపై శ్రద్ధపెట్టి మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రతి రోజూ స్టడీ అవర్స్ను నిర్వహించాలని, ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికను హాస్టళ్లలో సక్రమంగా అమలు చేయాలన్నారు. తరచూ పేరెంట్, టీచర్స్తో పిల్లల చదువు అంశాలపై సమీక్షించాలన్నారు. పనిచేసే ప్రదేశంలో ఉండకపోతే సిబ్బందిపై వేటు వేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ హాస్టల్ సెక్రటరీ మాధవీలత, జేడీ శ్రీధర్రెడ్డి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్రసూన, కుస్బూ కొఠారి, జగ్గనయ్య, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలుతో ప్రత్యేకానుబంధం... బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి హోదాలో కర్నూలుకు రావడంతో ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనతో స్నేహంగా ఉన్న పలువురు అధికారులను గుర్తు చేసుకున్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
నంద్యాల (వ్యవసాయం): బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని అన్నారు. మంగళవారం ఎస్పీజీ పాఠశాల ఆవరణలోని బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు సమాజానికి శాపమని, వీటి వలన బాలికల ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత స్వాతంత్య్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. అదే విధంగా విద్యా ర్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటి వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ న్యాయవాది దాసరి రవి, సామాజికవేత్త రవికుమార్, మండల లీగల్ సెల్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
కోవెలకుంట్ల: పొగాకు సాగు రెండేళ్ల నుంచి రైతులకు కలసి రావడం లేదు. గతేడాది వర్షాభావం, అధిక వర్షాలు, చీడపీడలతో తీవ్ర నష్టాలు వచ్చాయి. నష్టాన్ని పూడ్చుకుందామని ఈ ఏడాది మళ్లీ చేసిన సాగు నిరాశ మిగిల్చింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 3,371 హెక్టార్లలో పొగాకు సాగు కావాల్సి ఉంది. అయితే 1,329 హెక్టార్లలో మాత్రమే సాగు చేయగలిగారు. నాట్లు వేసిన తర్వాత వివిధ దశల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో నష్టాలు తప్పడం లేదు. పెరిగిన పెట్టుబడులు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రైతులు రూ. 30 వేలు వెచ్చించారు. వర్షాలు అధికం కావడంతో పైరులో కలుపు విపరీతంగా పెరిగిపోవడంతో కలుపు తొలగించేందుకు ఎకరాకు రూ. 10 వేలు భారం పడింది. అధిక తేమ శాతం కారణంగా పైరును నీటికుట్టు తెగులు ఆశించి ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు ఎండు తెగులు ఆశించి అరకొగా ఉన్న ఆకులు ఎండిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. క్వింటాకు రూ. 20 వేలు ధర ఇవ్వాలి చీడపీడల కారణంగా ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే సూచనలు లేవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయాలు వెచ్చించామని, రాబోయే రోజుల్లో ఆకు కొట్టడం, తోరణాలు కుట్టడం, పందిర్లపై ఆరబెట్టుకోవడం, కొనుగోలు కేంద్రాలకు తరలించడం వంటి పనులకు ఎకరాకు మరో రూ. 15 వేలు భారం పడనుందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో పొగాకు దెబ్బతినిందని, క్వింటాకు రూ. 20 వేలు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు కంపెనీలు క్వింటాకు రూ. 18,500 ధర చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాయి. పంట చేతికందిన తర్వాత ఆ ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. క్వింటా రూ. 11వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. రైతులు క్వింటాపై రూ. 6 వేలకు పైగా నష్టపోయారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు అడుగడునా మోసపోయారు. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని పొగాకు సాగు చేసిన రైతులకు బోర్డు అధికారులు, వ్యాపారులు, దళారులు కలిపి రైతులకు టోపి పెట్టడంతో నష్టాల ఊబిలో కూరుకపోయారు. పొగాకు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అండగా నిలిచింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేని సమయంలో అప్పట్లో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకుంది. క్వింటా రూ. 18 వేల వరకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు గడించారు. రైతులకు తీవ్ర నష్టం వచ్చిన పొగాకు సాగు వెంటాడిన అధిక వర్షాలు, ఎండు తెగులు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్ -
మంచు మాటున కాటేసిన మృత్యువు
● పొగ మంచు కారణంగా రహదారిపై కనిపించని వాహనాలు ● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో ● ఇద్దరు దుర్మరణంప్యాపిలి: పొగ మంచు మాటున దాగిన మృత్యువు ఇద్దరిని మింగేసింది. ఎన్. రంగాపురం సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎన్ రంగాపురం గ్రామానికి చెందిన ఎలుకపెంట్ల రాజశేఖర్ (24), కొప్పుల సురేంద్ర (26) డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విధినిర్వహణకు వారు ప్రతి రోజూ బైక్పై ఫ్యాక్టరీకి వెళ్లివచ్చేవారు. రోజు లాగే మంగళవారం వేకువజామునే దిచక్రవాహనంపై ఉడుములపాడుకు బయలుదేరారు. అయితే కొద్ది దూరం ప్రయాణించగానే ఎదురుగా ప్యాపిలి వైపు వస్తున్న ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దట్టంగా కమ్ము కున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న బైక్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సురేంద్రకు భార్య కల్యాణి, ఏడాది వయస్సుగల కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. మృతుడు రాజశేఖర్ తండ్రి రాముడు కొద్ది సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా.. కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తల్లి మాధవిని పోషించుకుంటున్నాడు. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కాగా ఇదే ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో యువకుడు తలారి సురేంద్రకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
41 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
శిరివెళ్ల: జిల్లాలో 41 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపా మని డీపీఓ లలితాబాయి తెలిపారు. మంగళవారం జాతీయ రహదారిపై ఉన్న శిరివెళ్ల మెట్ట వద్ద పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ప్రభుత్వం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా మురికి కాల్వల శుభ్రత, పారిశుద్ధ్యంపై సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 489 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 188 పంచాయతీల్లో స్వామిత్వ సర్వే మొదలై 88లో సర్వే పూర్తయిందన్నారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.10.69 కోట్ల ఇంటి పన్నులు వసూళ్ల లక్ష్యం కాగా ఇంత వరకు రూ. 3.86 కోట్లు వసూలైనట్లు తెలిపారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా ఇంటి పన్ను లు, నీటి పన్నులు చెల్లించవచ్చన్నారు. ఆమె వెంట ఈఓ అశ్వనికుమార్ ఉన్నారు. మల్లికార్జున సత్రంపై కేసు నమోదు శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని మల్లికార్జున అన్నదాన సత్రంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడంపై దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయపై సీఐ గంగనాథ్ బాబు మంగళవారం మాట్లాడుతూ.. సీఎస్ఓ ఫిర్యాదు మేరకు సత్రంలో జరిగిన సంఘటన మేరకు ఇందుకు బాధ్యులైన ఐదుగురు సిబ్బంది, సత్రం వారి పై భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 196, 199 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకర పాటలతో డ్యాన్స్ వేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు చర్యలు డోన్: స్క్రబ్ టైఫస్, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పి ంచాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందని జిల్లా మలేరియా ముఖ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కన్నపకుంట, కమలాపురం గ్రామాల్లో సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, సబ్యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దోమల నియంత్రణ, నివా రణకు సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశంమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ను పాటించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు వేణుగోపాల్రెడ్డి, ఆనంద్రావ్, పార్వతి, లత, చెన్నయ్య, చింతలయ్య పాల్గొన్నారు. ఫేజ్ 3లో పులుల గణన ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఫేజ్–3లో కెమెరా ట్రాప్ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్లో ఈ గణన ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పులుల గణన కార్యక్రమానికి జాతీయ ప్రాముఖ్యత ఉండటంతో ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు, పెచ్చెరువు – నాగలూటి మార్గంలో ఫిబ్రవరి 8వ తేదీ వరకు భక్తుల పాదయాత్రకు అనుమతి ఇవ్వమన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ
కర్నూలు: ఓ వ్యక్తిని అరెస్టు చేయకుండా నోటీసులతో సరి పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ దండగల కిరణ్ బాబు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన పి.శివనాగిరెడ్డికి భారతితో 2017లో వివాహమైంది. కొంతకాలం తరువాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త అదనంగా కట్నం కోసం వేధిస్తున్నాడని గత ఏడాది నవంబర్ 24న భారతి మహి ళా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ కిరణ్ కుమార్ భార్యాభర్తలకు రెండు విడతలుగా కౌన్సెలింగ్ చేశారు. అయి నప్పటికీ తన భర్తలో మార్పు రావడం లేదని భారతి పోలీసులకు చెప్ప డంతో శివనాగిరెడ్డిపై వేధింపుల కేసు నమోదైంది. అయితే కేసులో లేని హత్యాయత్నం 307 సెక్షన్ను తొలగించేందుకు రూ. 60 వేలు ఇవ్వాల ని శివనాగిరెడ్డిని ఎస్ఐ కిరణ్ బాబు బెదిరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు సోమవారం (5వ తేదీ) కర్నూలు ఎ.క్యాంప్లోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సోమన్నను సంప్రదించాడు. ఈ మేరకు శివనాగిరెడ్డితో ఎస్ఐకి ఫోన్ చేయించి వారి సంభాషణను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. రూ.30 వేలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మంగళవారం మధ్యాహ్నం గుత్తి రోడ్డులోని ఎస్ఐ కిరణ్ బాబు ఇంటికి వెళ్లి బాధితుడు శివనాగిరెడ్డి రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మహిళా పీఎస్ కు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి మహిళా పీఎస్ ఎస్ఐగా కిరణ్ పని చేస్తున్నారు. కేసులో లేని 307 సెక్షన్ పేరిట బాధితున్ని బెదిరించి లంచం తీసుకుంటున్న ఎస్ఐ కిరణ్ను వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజాప్రభాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలి
నంద్యాల: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్దేశించిన 10 కీలక పారామీటర్లపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాని సూచించారు. మెప్మా కార్యక్రమాల ద్వారా మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచాలని, ఈ రంగంలో జిల్లా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నంద్యాల, డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్లు శేషన్న, ప్రసాద్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, హరిప్రసాద్, కిశోర్, రమేష్ బాబులతో పాటు మెప్మా పీడీ వెంకటదాసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కిశోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పా టు చేశామని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో అక్రమ పెట్రోలియం రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ ప్రొటెక్షన్ కమిటీతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా, అనుమతి లేకండా పెట్రోలియంను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరా యం కలుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి సివిల్ సప్లయిస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత కమిటీలో రవాణా శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, సివిల్ సప్లయిస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖ లు నాలుగు విభాగాలుగా కలసి పనిచేస్తాయన్నారు. సమావేశంలో డీటీసీ శాంతకుమారి, కమర్షియల్ ట్యా క్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆయి ల్ కంపెనీ మేనేజర్లు పాల్గొన్నారు. -
ఒకరు, ఇద్దరు కాదు.. ఐదుగురు
ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో కొంతైనా మార్పు రావడం లేదు. అందుబాటులో రవాణా సౌకర్యాలు సరిగా లేకనో.. త్వరగా చేరుకోవాలనో పలువురు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం గోనెగండ్ల బస్టాండ్ వద్ద బైక్పై వెళ్తున్న వారిని చూస్తే వామ్మో అనాల్సిందే. బైక్ నడుపుతున్న వ్యక్తికి అసలే హెల్మెట్ లేదు.. ఆపై బైక్పై ఐదుగురు. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజూ పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నా వాహనదారులకు కనువిప్పు కలగడం లేదు. – గోనెగండ్ల -
పేకాట రాయుళ్లపై కేసు నమోదు
కౌతాళం: మండల కేంద్రం కౌతాళంలో నలుగురు పేకటరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక బీరప్ప దేవాలయం పక్కన పబ్లిక్ స్థలంలో ఉసేన్సాబ్, దస్తగిరి, వెంకటేష్, అశోక్ పేకాట ఆడుతుండగా అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.5725 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడినా, అక్రమంగా సారా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. బాలిక అదృశ్యం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామానికి చెందిన నాగవేణి(17) అనే బాలిక అదృశ్యమైనట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. గ్రామానికి చెందిన బి.శారదమ్మ, రామాంజినేయులు కుమార్తె బి.నాగవేణి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంట్లో కనపడలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా, బందువులను ఆరా తీసినా జాడ తెలియక పోవడంతో తల్లి శారదమ్మ మంగళవారం మంత్రాలయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నాగవేణి ఇంటి దగ్గరే టైలరింగ్ నేర్చుకునేది. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. యువకులకు గాయాలు పాములపాడు: మండలకేంద్రం పాములపాడులోని పాలడెయిరీ వద్ద కారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు చెందిన మురహరి వినోద్కుమార్, కిరణ్లు ఆత్మకూరుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పాల డెయిరీ వద్ద యూ టర్న్లో బైక్ తిప్పుకుంటుండగా వేగంగా ఆత్మకూరు వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన కారు ఢీ కొట్టి వెళ్లి పోయింది. గాయపడిన ఇద్దరిని స్థాణికులు 108 వాహనంలో ఆత్మకూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనూమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామ సమీపంలో వడ్దె బెల్లం వెంకట్రాముడు(55) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.బోడబండకు చెందిన వెంకట్రాముడు నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు తిరిగి అతడే వస్తాడులే అనుకుని ఉన్నారు. అయితే, గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన పొలంలో నుంచి దుర్వాసన వస్తుండగా మంగళవారం అటుగా వెళ్తున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా మృతదేహాం కనిపించింది. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పరిశీలించి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయింటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీ హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు వెళ్లే దారిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విలువైన విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో ఎల్లెల్సీ కింద ఎక్కువగా వరిసాగు చేస్తారు. కాలువకు నీటి విడుదల లేకపోవడంతో రబీ సాగు లేక రైతులు పొలాల వైపు వెళ్లడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పొలాల్లోని మోటర్ నుంచి స్టార్టర్ బాక్స్ల వరకు వెళ్లిన విలువైన కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఇలా రమేష్, సత్యప్ప, చిన్న మల్లేశ్, అడ్లిగి బసవరాజు, మల్లయ్య, గౌరవప్ప తదితర 20 మంది రైతులకు చెందిన మోటర్ల వైర్లను ఎత్తుకెళ్లారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.వందకు పైగ ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగ వైర్లను కత్తిరించారని రైతులు తెలిపారు. ఈ దొంగతనాలను అరికట్టాలని తుంగభద్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కృషయ్య కోరారు. చోరీ విషయాన్ని హొళగుంద పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు విలేకరులకు తెలిపారు. -
824 మంది ఉల్లి రైతులకు అందని పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 824 మంది ఉల్లి రైతులకు పరిహారం విడుదల కాలేదని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో 31,352 మంది ఉల్లి రైతులకు ఎకరాకు 20 వేల ప్రకారం విడుదల అయిందని తెలిపారు. ఇందులో 30,528 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. 824 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం వల్ల జమ కాలేదని తెలిపారు. ఈ రైతుల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు పంపామని రైతులు చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం చేసుకోవాలని సూచించారు. కర్నూలు(అర్బన్): ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకే ప్రభుత్వం ఈ – గవర్నెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చిందని డీపీఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు ఈ – గవర్నెన్స్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకే వేదిక నుంచే ఆన్లైన్ అప్లికేషన్లను అన్ని శాఖల సమన్వయంతో ఈ గవర్నెన్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల హాజరును ఖచ్చితత్వంతో జీయోట్యాగ్తో నమోదు చేయవచ్చునన్నారు. శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు ఆస్రఫ్బాష, పి. జగన్నాథం, ఖలీలుల్లా, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
టీజీవీ ఆల్కాలీస్లో గ్యాస్ లీక్!
సాక్షి, టాస్క్ఫోర్సు: టీజీవీ గ్రూపునకు చెందిన రాయలసీమ అల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై అంతటా గోప్యత పాటిస్తున్నారు. ప్రమాద వివరాలు చెప్పేందుకు అటు జిల్లా యంత్రాంగంగానీ, యాజమాన్యంకానీ ముందుకు రావడంలేదు. అంతేకాదు అస్వస్థతకు గురైన వారి వివరాలు తెలియనీయకుండా పెట్టడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల సమీపంలోని టీజీవీ గ్రూపు అల్కాలీస్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ పైపును శుభ్రం చేస్తుండగా దానిపై ఇటుకలు పడడంతో పైపు పగిలినట్లు సమాచారం. దీంతో క్లోరిన్ వాయువు రూపంలో అలుముకోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు, సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడే ప్రథమ చికిత్స చేయగా ఐదుగురు కోలుకోవడంతో మిగతా వారిని నగరంలోని గౌరీ గోపాల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందులో సోమవారం రాత్రే కొందరు కోలుకోగా.. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గొందిపర్ల, ఈ.తాండ్రపాడుపై ప్రభావం ఆల్కాలీస్ ఫ్యాక్టరీకి గొందిపర్ల, ఈ. తాండ్రపాడులు అతి సమీపంగా ఉంటారు. ఫ్యాక్టరీ, ఆ గ్రామాలకు మధ్య 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లోరిన్ వాయువు గ్రామాలను చుట్టమట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో దాదాపు 10 మంది శ్వాస తప్పి పడిపోయినట్లు సమాచారం. వారిలో ముగ్గురిని గ్రామస్తులు రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు సమాచారం. క్లోరిన్ గ్యాస్ పైప్పై ఇటుకలు పడటంతో ప్రమాదం పలువురికి అస్వస్థత.. గౌరీ గోపాల్కు తరలింపు గోప్యత పాటిస్తున్న అధికార యంత్రాంగం, యాజమాన్యం -
ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): టీజీవీ గ్రూప్నకు చెందిన శ్రీ రాయలసీమ అల్యూమినియం అండ్ అలయన్స్ కెమికల్స్ పరిశ్రమలో గ్యాస్ లీకు ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పీఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వై.నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైప్ లీకై క్లోరిన్ విడుదల కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారి వివరాలను యాజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ పనులు జరుగుతుండగా గ్యాస్ లీకై ందని, ఆ వాసనను పీల్చడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారికి ఎక్కడ చికిత్స చేయిస్తున్నారో యాజమాన్యం చెప్పడం లేదన్నారు. మరోవైపు గొందిపర్ల వాసులు కూడా క్లోరిన్ వాయువు వాసన పీల్చడంతో కళ్లలో మంటలు, శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడ్డారని, వారిని ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు రహస్యంగా తరలించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి అంబులెన్స్లో రోగులను తీసుకెళ్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఈ ప్రమాద సంఘటనపై కలెక్టర్, ఇత ర అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. -
పాలనలో పారదర్శకతకు పెద్దపీట
● రూ.387.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ● ఉమ్మడి జిల్లాలోని 695 జనవాసాలకు సురక్షిత మంచి నీటి సరఫరాకు ప్రాధాన్యత ● జెడ్పీ సాధారణ నిధులు రూ.12.03 కోట్లతో 266 పనులు ● కారుణ్య నియామకాల కింద 154 మందికి ఉద్యోగాలు ● నాలుగేళ్ల పాలనపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీకి జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన జెడ్పీలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ... పెద్దగా ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్కు ఆర్థిక జవసత్వాలు తీసుకువచ్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా జెడ్పీ స్థిరాస్తులకు సంబంధించిన, స్టాంప్ డ్యూటీ, సీనరేజి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా వనరులతో జెడ్పీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారన్నారు. రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 695 జనవాసాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021–22 నుంచి 2024–25 వరకు రూ. 297.15 కోట్లు వెచ్చించామని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.90.57 కోట్లు వెచ్చించేందుకు పరిపాలనా ఆమోదం జారీ చేశామన్నారు. అలాగే గడచిన నాలుగేళ్లలో 110 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 77 పనులు పూర్తి అయ్యాయని, ఇందుకు రూ.41,34,45,165 వెచ్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.41.52 కోట్ల అంచనాతో 990 పనులు చేపట్టామని, ఇందులో రూ.22.61 కోట్ల ఖర్చుతో 649 పనులు పూర్తి చేశామన్నారు. అలాగే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఎస్సీ కార్పొరేన్కు రూ.2.81 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1.11 కోట్లను విడుదల చేశామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రూ.12.03 కోట్ల అంచనాతో 266 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.8.79 కోట్ల వ్యయంతో 204 పనులు పూర్తి కాగా, ఇంకా 62 పనులు వివిధ దశల్లో ఉన్నాయని చైర్మన్ వివరించారు. వేసవిలో తాగునీటి నివారణకు ప్రాధాన్యత వేసవిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులను విడుదల చేసినట్లు చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రూ.6.13 కోట్ల అంచనాతో 188 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల వ్యయంతో 157 పనులు పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. సున్నిపెంటకు ప్రత్యేకంగా రూ.72 లక్షలు సున్నిపెంట గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనందున 15వ ఆర్థిక సంఘం నిధులు అందని పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సుండిపెంట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు జెడ్పీ 4 శాతం నిధుల కింద రూ.72.10 లక్షలను విడుదల చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలో జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద 154 మందికి వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పించామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు 43, టైపిస్టులు 42, ఆఫీసు సబార్డినేట్లు 66, స్వీపర్లు 03 మంది ఉన్నారన్నారు. అలాగే వివిధ కేడర్లలో 378 మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారన్నారు. -
కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్త, మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుకా అన్నారు. మంగళవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని ఏపీఎస్పీ క్యాంపు వద్ద ఉన్న కార్యాలయంలో గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికి బుట్టా రేణుకా తో పాటు జిల్లా యాక్టివిటీ కార్యదర్శి నాగేష్ నాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డి. నజీర్ అహమ్మద్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కారని విమర్శించారు. రెండేళ్లు అవుతున్న ఇంకెప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తారని ప్రశ్నించారు. గోనెగండ్ల మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంజిహాల్లి ముల్ల రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి స్వామిదాసు, ఏసన్న మత్తయ్య, యాకోబ్, సల్మాన్ రాజ్, ఆనంద్, రాజు, విజయ్, డేవిడ్, సుధాకర్, కిషోర్, మల్లిఖార్జున, చిన్న మునిస్వామి, రమేష్, బాస్కర్లతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బనవాసి బసిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ 15 వ వార్డు ఇన్చార్జీ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు షరీఫ్, పూర్ణ నాయుడు, నరసింహ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక -
ప్రతి అర్జీకి స్పష్టమైన పరిష్కారం చూపాలి
నంద్యాల: ప్రజా సమస్యలను సీరియస్గా పరిగణించి ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఇత ర అధికారులు జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదే విధంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి 255 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేను సచివాలయ సిబ్బంది జనవరి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక్కో సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 కుటుంబాల సర్వే పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించి, ఆర్డీఓలు, డీఎల్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమానికి 139 అర్జీలు అందాయని, వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. -
ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి
● జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కుట్రజూపాడుబంగ్లా: తెలుగు దేశం పార్టీకి మండలంలో ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా ఆ పార్టీ నేతలు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఆరుగురు ఎంపీటీసీలను జతచేసుకొని టీడీపీ నేతలు ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతికి అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేసినట్లు సమాచారం. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా 2021 ఏప్రిల్ లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో 9 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాటిపాడు, పారుమంచాల గ్రామాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే మరో నాలుగు మాసాల్లో పాలక మండలి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండటం వెనుక ఆంత్యమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్డీఓ నాగజ్యోతికి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిలో మండ్లెం–2, జూపాడుబంగ్లా–1, 2, పారుమంచాల, తరిగోపుల, తంగడంచ ఎంపీటీసీలు సంతకాలు చేశారని తెలుస్తోంది. కాగా మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను తాటిపాడు ఎంపీటీసీ బోయ చిన్నశంకర్ మృతిచెందగా, తర్తూరు ఎంపీటీసీ పీఎం నాగిరెడ్డి సర్పంచ్గా ఎన్నికవ్వటంతో ఎంపీటీసీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తొమ్మిది సభ్యులుండగా అందులో 2/3 ప్రకారంగా ఆరుగురు సభ్యులు మెజార్టీ తెలిపితే ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గుతోంది. ఈ క్రమంలో మెజార్టీ సభ్యులు ఇచ్చిన తీర్మానం ప్రతులను ఆర్డీఓ పరిశీలించి ఎంపీటీసీ సభ్యులదంరికీ నోటీసులిచ్చి వారంలోగా సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
విఖ్యాత్రెడ్డి మెంబర్ షిప్ రద్దు : త్రిసభ్య కమిటీ సభ్యులు
విజయడెయిరీలో రుణం తీసుకొని చెల్లించకుండా భూమా విఖ్యాత్రెడ్డి డీఫాల్టర్ అయ్యారని, యూనియన్కు తిరిగి డబ్బులు చెల్లించనందుకే చక్రవర్తుల పల్లె పాల సొసైటీ మెంబర్ షిప్ రద్దు అయ్యిందని త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి తెలిపారు. స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. అక్రమ మార్గంలో ముత్యాలపాడు సొసైటీ నుంచి అధ్యక్షుడినంటూ డెయిరీ వద్ద హంగామా చేయడం అలవాటుగా మారిందన్నారు. ఆయన ఎక్కడా పోటీ చేసేందుకు అర్హత లేదని చెప్పారు. డెయిరీ నియమ నిబంధనలు పాటిస్తూ ముత్యాలపాడు పాలక మండలి సభ్యులు సహకరిస్తే సమస్య సావధానంగా పరిష్కారం చూపుతామన్నారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. భూమా విఖ్యాత్రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. ఆ కారణంతోనే పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తుల పల్లెలో విఖ్యాత్ మెంబర్ షిప్ను 25–12–2024లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయి న విఖ్యాత్కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. మోసపూరిత సభ్యత్వం, సభ్యుల బాధ్యతా ఉల్లంఘన, అర్హత లేకుండా డైరెక్టర్గా విఖ్యాత్ను కో ఆప్షన్ చేయడం అధ్యక్ష పదవికి అక్రమంగా ఎన్నుకోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. -
త్వరలో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు
మహానంది: వినూత్నమైన కథతో త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు తేజ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనానికి సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఆలయ అర్చకులు దర్శకుడు తేజకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుందన్నారు. ఆయన వెంట బొల్లవరం ప్రసాద్, మిత్రులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు ఫొటోలు తీసుకున్నారు. -
కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలట
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్కు బాధితురాలి ఫిర్యాదునంద్యాల: కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నాడని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ సురేష్ షెరాన్కు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని ఆమె కోరారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని సమస్యలకు తక్షణమే గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన 78 సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కారులో రూ.5 లక్షలు చోరీ
ఆదోని అర్బన్: కారు అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో ఉన్న రూ.5 లక్షలు నగదును దొంగలించి పరారైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని కట్టేందుకు బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్, ఆయన కుమారుడు రఘు ఆదోని పట్టణానికి వచ్చారు. రుణాన్ని కట్టేందుకు వారి బంధువు అయిన చంద్రప్ప వద్ద రూ.5 లక్షలు అడిగారు. చంద్రప్ప స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డ్రా చేసి కారులో కూర్చొని వారికి రూ.5 లక్షలు అందజేశారు. డబ్బును ముందు సీటులో ఉన్న క్యాష్ బోర్డులో పెట్టారు. లోన్ కట్టేందుకు మరో రూ.50 వేలు తక్కువగా ఉండడంతో వెంటనే శేఖర్ అనే వ్యక్తిని అడిగారు. శేఖర్ ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న మారుతి వైన్స్ దగ్గర వస్తే ఇస్తానని చెప్పడంతో వెంటనే తండ్రి, కుమారుడు కారులో అక్కడికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్లో కారును ఉంచి శేఖర్ దగ్గరకు వెళ్లి రూ.50 వేలు డబ్బు ఇప్పించుకుని తిరిగి వచ్చారు. కారుకు ముందు ఎడమ డోర్ అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో పెట్టిన రూ.5 లక్షలు నగదు అపహరణ కావడంతో తండ్రి, కుమారుడు అవాక్కయ్యారు. దీంతో వెంటనే త్రీటౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తండ్రి, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా వెంబడించారా అనే కోణంలో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తామని సీఐ తెలిపారు. -
గట్టెక్కని లైనింగ్ పనులు!
జీరో గేటు సమీపంలో కోతకు గురైన కరకట్ట నిలిచిపోయిన కాంక్రీట్ పనులుపాణ్యం: జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి)లో పెండింగ్ పనులు అలాగే ఉండిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీఎన్ఎస్ఎస్ కాల్వ జీరో నుంచి అవుకు టన్నెల్ వరకు 57.7 కిలోమీటర్ల దూరానికి లైనింగ్ చేసేందుకు టన్నల్ మినహాయించి దాదాపుగా రూ. 650 కోట్ల నిధులను విడుదల చేసింది. అప్పట్లో జీరో నుంచి బనగానపల్లె వరకు దాదాపుగా 70 శాతంపైగా లైనింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తట్టెడు మట్టిని వేయలేదు. సీమకు తలమానికంగా ఉన్న గాలేరు– నగరి కాల్వ లైనింగ్ పనులు పూర్తి అయితే 30వేల క్యూసెక్కుల వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. ఇందుకు లైనింగ్ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం గాలేరు ప్రారంభమయ్యే జీరో రెగ్యులేటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేయలేదు. ఫలితంగా కరకట్ట కోతకు గురవుతోంది. కాల్వలకు 20వేల క్యూసెక్కుల నీరు వదలడంతోనే ఈ ప్రవాహానికి లైనింగ్ లేని కారణంగా అటు ఇటు కరకట్ట కోతకు గురై మరింత విస్తరిస్తుంది. దీంతో కట్టపై వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జీఎన్ఎస్ఎస్ కాల్వలో అటు, ఇటు లైనింగ్ పనులతో పాటు కాంక్రీట్ వాల్ పనులు కూడా నిలిచిపోయాయి. అధికారులు పరిశీలించిన త్వరగా లైనింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
సీమ ప్రాజెక్ట్లను తెలంగాణకు తాకట్టుపెట్టారు!
బొమ్మలసత్రం: రాయలసీమ రైతాంగం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. సోమ వారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి కాటసానితో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఎస్ఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్రెడ్డి, రాయలసీమ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కాట సాని రాంభూపాల్రెడ్డి.. మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి చంద్రబాబునాయుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారన్నా రు. ఆయన సొంత ప్రయోజనాల కోసం సీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడవడం బాధాకరమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్ పనులను చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకొని అడ్డుపడటం సరైందికాదన్నారు. ఈనెల 3వ తేదీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు ద్వంద వైఖరి బయటపడిందన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన ఘటన బాబుకే దక్కుతుందన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ పథకాన్ని అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో శ్రీశైలం నుంచి 798 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని కిందకు వదిలేస్తోందని, అంతేకాకుండా శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీళ్లు ఎత్తిపోసేందు కు పలు ప్రాజెక్ట్లు చేపట్టారన్నారు. వారిని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 2019కి ముందు చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ వైపు పాలమూరు, రంగారెడ్డి లాంటి పలు ప్రాజెక్ట్ల ద్వారా శ్రీశైలం నీటిని తరలించే పనులు ప్రారంభమయ్యాయన్నారు. వీటిని ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ చేస్తారో అన్న భయంతో బాబు రాష్ట్రానికి పారిపోయి వచ్చారన్నారు. 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం పలు ప్రాజెక్ట్ల నిర్మాణాలను మొదలుపెట్టారన్నారు. ప్రాజెక్ట్లపై నిద్రిస్తే నేల తడవదు.. ప్రాజెక్ట్లపై నిద్రించి రాష్ట్రానికి మేలు చేశానని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన దాఖాలాలు లేవని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో శ్రీశైలం నుంచి కేవలం 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో 11 వేల క్యూసెక్కులు పెంచారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 44 వేల క్యూసెక్కుల నీరు తరలించేలా కృషి చేశారని కొనియాడారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టి ప్రజలకు నీరు అందించాలన్న లక్ష్యంతో మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజోలి, జోళదరాశి ప్రాజెక్ట్ల నిర్మాణం కోసం భూసేకరణ పనులు కూడా పూర్తి చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులకు భయ పడి చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై బయటపడిన బాబు ద్వంద్వవైఖరి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ వల్లే సీమకు ప్రాజెక్ట్లు సాగునీటి కోసం పార్టీలకతీతంగా ఉద్యమించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
శ్రీ మఠం పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: శ్రీ మఠం పీఠాధపతి సుబుధేంద్ర తీర్థులుకు వివిధ రకాల డ్రైఫ్రూట్స్తో సోమవారం తులాభారం చేసి జ్ఞాపికను అందజేశారు. తమ పాదయాత్ర 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భగా సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం వారు శ్రీ మఠం పీఠాధిపతిని సన్మానించారు. శ్రీ రాఘవేంద్ర సర్కిల్ నుంచి ప్రత్యేక ఆలంకరించిన వాహనంలో వాయిద్యాల నడుమ ఊరేగించారు. శ్రీ మఠంలోని యోగీంద్ర కళామండంపంలో ముత్యాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మట్లాడుతూ..సిరుగప్ప ఆర్యవైశ్య సంఘం 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనీయమన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల ఆశీర్వాదం భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హెచ్.జి హనుమంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 900 మంది పాల్గొన్నారు. -
శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆన్లైన్ నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో స్వచ్ఛంద సేవకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో దేవస్థానంలో శివసేవ బృందాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ స్వచ్ఛంద సేవకు సంబంధించి పలు సూచనలు చేశారు. శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో బృందాలుగా, లేక వ్యక్తిగతంగా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. శివసేవకులు సేవను నిర్వహించే సమయంలో దేవస్థానమే తాత్కాలికంగా గుర్తింపుకార్డులను, దేవస్థానం అధికారిక చిహ్నం(లోగో)తో స్కార్ప్ను అందజేస్తుందన్నారు. శివసేవకులకు అవగాహన కార్యక్రమంతో పాటు దేవస్థానం కరదీపికను అందజేస్తుందన్నారు. సమావేశంలో శివసేవకుల విభాగపు ఏఈవో కె.వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు టి.హిమబిందు పాల్గొన్నారు. -
కేసీ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం
కర్నూలు: కర్నూ లు మండలం పడిదెంపాడు గ్రామ పొలిమేరలో కేసీ కెనాల్లో నీటిలో కొట్టుకుపోతున్న గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. కర్నూలు గడ్డా వీధికి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ వ్యక్తిగత పనిమీద పడిదెంపాడు వైపు కేసీ కెనాల్పై వెళ్తుండగా నీటిపై మృతదేహం తేలినట్లు కనిపించింది. దీంతో షేక్ ఉమర్ ఫరూక్ స్పందించి మృతదేహాన్ని పక్కకు లాగి అక్కడే ఉన్న దుప్పటి సహాయంతో పక్కనున్న రాయికి కట్టి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా పీఎస్ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీయించారు. మృతదేహం కుడిచేతిపై షేకున్ అని ఇంగ్లిషులో పచ్చబొట్టు, ఎడమ మెడ వద్ద గుండ్రని పచ్చబొట్టు ఉంది. నల్లని టీషర్టు ధరించాడు. సుమారు 28 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. ఆచూకీ తెలిసినవారు తాలూకా పోలీసులను సంప్రదించి సమాచారమివ్వాలని ఎస్ఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. వివాహిత ఆత్మహత్య బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామా నికి చెందిన దూదేకుల ఇమాం సాహెబ్ కూతురు ఆశాబీ (27)కి కొన్నేళ్ల క్రితం మద్దూరుకు చెందిన కమాల్తో వివాహమైంది. కమాల్ ఇల్లరికం అల్లుడిగా వచ్చి గోర్లగుట్టలోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా రెండవ కుమారుడు ఉస్సేన్వలి నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశాబీ తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంది. మరో కుమారుడు ఉసేన్ బాషా బేతంచెర్ల పట్టణంలో డ్యాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ప్రతి రోజు కుమారుడిని వెంట తీసుకోని పట్టణానికి వచ్చేది. ఈ క్రమంలో సోమవారం కుమారునితో డ్యాన్స్ కోచింగ్ సెంటర్ వచ్చిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి రసాయన పౌడర్ నీటిలో కలుపుకుని తాగి ఆపస్మారక స్థితిలో పడి పోయింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ నబీ సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇమాంసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కోడుమూరు రూరల్: కోడుమూరులోని షణ్ముఖరెడ్డి నగర్కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న తన ఇద్దరు కుమారులతో పాటు కన్పించడం లేదు. పోలీసులు తెలిపిన మే రకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మార్కె ట్లో గుమస్తాగా పనిచేసే సుధాకర్ ఆదివారం తన కుమారులు భరత్కుమార్, మాన్విత్ కుమార్ ను పిలుచుకుని భార్య పుట్టినిల్లు అయిన దేవనకొండకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే సుధాకర్ దేవనకొండకు వెళ్లకపోవడంతో పాటు, కోడుమూరుకు తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో ఆందోళన చెందిన భార్య అనురాధ సోమవారం సాయంత్రం కోడుమూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేర కు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం పగిడ్యాల: పడమర ప్రాతకోట ఎస్సీ కాలనీలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కా ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన ఇస్కాల జేమ్స్ అలియాస్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా రోళ్లపాడు గ్రామంలో జరిగిన ఫంక్షన్కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో నుంచి పొగలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరాను బంద్ చేయించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో కర్నూలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంతో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్, రెండు బీరువాలు, టీవీ, బియ్యం, బట్టలు, ఫర్నిచర్ కాలిపోయాయి. ఆస్తి నష్టంపై తహసీల్దార్కు నివేదిక పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఇక ఒకే మాట.. ఒకే బాట
● ప్రత్యేకంగా సమావేశమైన చల్లా కుటుంబ సభ్యులు ● చల్లా విఘ్నేశ్వరరెడ్డికి కుటుంబ, రాజకీయ బాధ్యతలు అప్పగింత అవుకు(కొలిమిగుండ్ల): దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు, కుటుంబ సభ్యులు ఒకే మాట..ఒకటే బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం అవుకు పట్టణంలోని చల్లా ప్రజాభవన్లో చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చల్లా సూర్యప్రకాష్రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథ్రెడ్డి, రామేశ్వరరెడ్డితో పాటు కుమారుడు వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చల్లా చరణ్రెడ్డి, చల్లా విక్రాంత్రెడ్డిలు కలిసి ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుటుంబ, రాజకీయ బాధ్యతలను అందరూ కలిసి చల్లా విఘ్నేశ్వరరెడ్డికి అప్పగించారు. ఇకపై చల్లా ఫ్యామీలీ అంతా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని విఘ్నేశ్వరరెడ్డి వివరించారు. కలిసి మెలిసి భవిష్యత్ అంతా ప్రయాణం చేస్తామన్నారు. బహు నాయకత్వం లేకుండా ఒకే నాయకత్వం ఉంటుందన్నారు. తమ కుటుంబ పెద్దలు అంతా ఏకమై సారథ్య బాధ్యతలు తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఏ కార్యక్రమం అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దలతో చర్చించుకొని భవిష్యత్లో ముందుకెళ్తామన్నారు. తమ కుటుంబం వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ అండగా నిలబడుతామని భరోసా ఇచ్చారు. -
మదిమదిలో ‘మహా’ భక్తి
అర్ధనారీశ్వరుడు.. అద్వైతుడు.. మహా దేవుడు.. శ్రీ నీలకంఠేశ్వరస్వామి భక్తుల మధ్యకే వచ్చారు. మహా రథం నుంచి ప్రజలందరినీ దీవించారు. చేనేతపురి ఎమ్మిగనూరులోని తేరుబజారు సోమవారం ఆధ్యాత్మిక దీప్తితో ప్రభవించింది. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాల సమ్మేళనం మధ్య మహారథోత్స వం అంగరంగ వైభవంగా సాగింది. మదిమదిలో ‘మహా’ భక్తి వెల్లివిరిసింది. రథోత్సవంలో రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. రథాన్ని లాగి స్వామివారి కృపను పొందా లని పోటీపడ్డారు. రథంపై డ్రోన్తో పూలను చల్లడం విశే షంగా ఆకట్టుకొంది. ఉత్సవాన్ని తిలకించేందుకు పలుచో ట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నందికోళ్ల సేవ, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి
నంద్యాల(అర్బన్): జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామచంద్రారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు.. ఆదివారం స్థానిక నిశాంత్ భవన్లో నంద్యాల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. సంఘంలో మొత్తం 21 పోస్టులకు 21 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి నాగరాజు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరరెడ్డి, రామచంద్రారావులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండవ సారి తమను జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికై న వారిలో సహ అధ్యక్షులుగా ప్రసాద్బాబు, ఉపాధ్యక్షులుగా సత్యదీప్, మధుసూదన్, స్వప్న, రబ్బాని, కోశాధికారిగా నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ రామచంద్రారావు, సంయుక్త కార్యదర్శిగా రామసంజీవరావు, శ్రీనివాసరెడ్డి, సురేష్నాయుడు, అల్లాబకాష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా చంద్రానాయక్, కార్యనిర్వాహక సభ్యులుగా నాగాంజనేయులు, వెంకటరమణ, బ్రహ్మం, మహేష్కుమార్, అనూష, అరవింద్, కొండారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న సభ్యులను పలువురు సన్మానించారు. -
నేడు నీలకంఠుడి మహా రథోత్సవం
ఎమ్మిగనూరుటౌన్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను మేళతాళాలతో పూర్ణకుంభంతో తేరుబజారులోని రథశాల వద్దకు తీసుకురానున్నారు. హోమం, విశిష్ట పూజలు చేసిన అనంతరం మహారథంపై ఉత్సవమూర్తిని అధిష్టింపజేసి ఉత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త నీలమురళీధర్ ఆధ్వర్యంలో మహారథానికి ఆదివారం తుదిమెరుగులు దిద్దారు. శనివారం రాత్రే పార్వతీపరమేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తిశ్రద్ధలతో ఆదివారం రాత్రి 9 నుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవాన్ని నిర్వహించారు. -
స్వామికే శఠగోపం!
● స్వామి వెండి ఆభరణాలు అపహరణ ● ఆలయ పూజారి, రిటైర్డ్ ఈఓ అరెస్ట్ ● 5.80 కిలోల వెండి స్వాధీనం ఆళ్లగడ్డ: స్వామి పూజల్లో తరించాల్సిన అర్చకుడు, ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారి చివరకు స్వామి వారి వెండి ఆభరణాలపై కన్నేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరులే అనుకు న్నారే ఏమో.. కానీ స్వామి వారి నగలను అదును చూసి ఊరి దాటించి అమ్మేశారు. ఉత్సవాల సమయంలో దేవుడికి ఆభరణాలు అలంకరించకపోవ డంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వామి వారి ఆభరణాలను అపహరించిన ఆలయ పూజారి, రిటైర్ట్ ఈఓను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సునీల్ షెరాన్ విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మద్దూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయా నికి ఎంతో విశిష్టత ఉంది. గతనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అయితే ఆ రోజు ఆలయ పూజారి కృష్ణకిషోర్ స్వామికి ఆభరణాలు అలంకరించకపోవడంతో గ్రా మస్తులు నిలదీశారు. సమాధానం చెప్పలేక పూజా రి పరారయ్యాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పూజరి కృష్ణకిషోర్, రిటైర్డ్ ఈఓ నరసయ్య తో పాటు ఆభరణాలను కొనుగోలు చేసిన ఆళ్లగడ్డ బంగారు నగల వ్యాపారి దూదేకుల పెద్ద ముసేనయ్యను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.14.76 లక్షల విలువైన 5.80 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ప్రమోద్, సీఐ రమణ ఉన్నారు. -
మారని రోగుల తలరాత!
మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రోగులకు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్ పెద్ద అక్షరాలతో, జనరిక్ నేమ్తో రా యాలి. అది కూడా ఏ మందు, ఎప్పుడు, ఎలా వాడాలో కూడా స్థానిక భాషలో రాసి ఉండాలి. అలా గాకుండా ఇష్టమొచ్చినట్లు, ఎవ్వరికీ అర్థంగానట్లు రాస్తే అలాంటి వైద్యులపై మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200కు పైగా ప్రైవేటు ఆసుపత్రులు, వెయ్యికి పైగా క్లినిక్లు పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రులోని వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు అర్థమయ్యేరీతిలో మందుల చీటిని రాసివ్వాలి. ఆ మందుల చీటి పట్టుకుని ఏ మెడికల్షాపునకు వెళ్లినా వారు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మందులు ఇచ్చేలా ఉండాలి. కానీ కొందరు వైద్యులు గజిబిజి రాతతో రోగులను తికమకపెడుతున్నారు. మందులను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా, పెద్ద అక్షరాలతో రాయా లని ఉన్నా పలువురు వైద్యులు ఆచరించడం లేదు. వారు రాసిన మందులు అటాచ్డ్ కౌంటర్(డాక్టర్ క్లినిక్లో ఉండే మెడికల్షాప్)లో మాత్రమే అర్హమయ్యేలా మందులు రాస్తున్నారు. అక్కడ తప్ప ఆ చీటి తీసుకుని దేశమంతా తిరిగినా మందులు లభించని విధంగా ఉంటున్నాయి. ఒక్కసారి ఆ వైద్యుని వద్దకు వెళ్లిన రోగి మళ్లీ అదే డాక్టర్ వద్దకు వెళ్లి, అక్కడి మెడికల్షాపులోనే మందులు తీసుకునేలా వైద్యంతో వ్యాపారం చేస్తున్నారు. జాతీయ వైద్య కౌన్సిల్ చెప్పినా! మందుల వివరాలను వైద్యులు స్పష్టంగా రాయాల్సిందేనని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులతో పాటు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్లు, డైరెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి బోధనాసుపత్రిలో తప్పనిసరిగా ‘డ్రగ్స్ థెరప్యూటిక్స్ కమిటి(డీటీసీ) ఏర్పాటు చేసి తాము జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అందులో సూచించింది. వైద్యులు స్పష్టమైన చేతి రాతతో చీటిపై మందులు రాయాలని, ఈ మేరకు గత యేడాది ఆగష్టులో పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పునిచ్చిన అంశాన్ని గుర్తు చేసింది. మందుల చీటిపై స్పష్టమైన రాత అన్నది రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి లోబడి ఆరోగ్యహక్కు(రైట్ టు హెల్త్)కిందకు వస్తుందని ఈ కోర్టు పేర్కొందని వివరించింది. ఎన్ఎంసీ, ఎంసీఐలు వైద్యుల చేతి రాత గురించి పదే పదే ఆదేశించినా డాక్టర్లలో మార్పు రావడం లేదు. తమను ఎవరేమి చేస్తారులే అన్న చందంగా వారు నిర్భీతిగా వ్యవహరించడం గమనార్హం. స్పష్టంగా రాయకపోతే ఇబ్బందులు డాక్టర్ ప్రిష్క్రిప్షన్ ఒక్కోసారి మెడికల్షాపు వారికే అర్థం గాక ఒక మందు బదులు, ఒక డోసు బదులు ఇంకో డోసు మందులు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వేసుకోవడం వల్ల రోగికి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కాగా మరికొందరు వైద్యులు మందుల చీటిలో మందుల కింద ఏ మందు ఎన్ని పూటలు, ఎలా వాడాలో తెలుగులో స్పష్టంగా రాసేవారు. కానీ ఇప్పుడు బీడీ, ఓడీ, టీఐడీ అంటూ రాస్తున్నారు. వైద్యపరిభాషలో తెలిసిన వారికి మాత్ర మే ఇలాంటి పదాలకు అర్థం తెలుస్తుంది. సామాన్య ప్రజలకు ఇవి అర్థం కావు. అర్థం కాని వైద్యుల ప్రిష్క్రిప్షన్ బీడీ, ఓడి, టీఐడీ అంటూ సామాన్యులకు అర్థం కాని గీతలు మందులు ఎలా వాడాలో స్పష్టంగా రాయని డాక్టర్లు ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పినా వినని వైనం చర్యలు లేకపోవడంతో కొందరు వైద్యుల ఇష్టారాజ్యం -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 5వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీ దారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. తుంగభద్ర నదిని కాపాడుకుందాం మంత్రాలయం రూరల్: కలుషితం కాకుండా తుంగభద్ర నదిని కాపాడుకుందామని బసవరాజ్ పాటిల్ అన్నారు. జల జాగృతి యాత్ర డిసెంబర్ 27న గంగావతి దగ్గర కిష్కంద దగ్గర నుంచి ప్రారంభమై ఆదివారం మంత్రాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగ ఆనిర్మల తుంగభద్ర అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రస్వామికి, మంత్రాయం ఎమ్మెల్యేకు బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్మల్లిగౌడ మాట్లాడుతూ.. తుంగభద్ర నది రక్షణే మన లక్ష్యం, భావితరాల క్షేమం అన్నారు. డాక్టర్ శివకుమార్ పాటిల్, లలిత రాణి బొల్లిశెట్టి సత్యనారాయణ, బసవరాజు పాటిల్, జగన్నాథ్, చల్లా వరుణ్, పర్యావరణ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్, జేసీలకు లగ్జరీ కార్లు కర్నూలు(సెంట్రల్): కలెక్టర్, జేసీల కాన్వాయ్ కోసం రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఆదివారమే ఆ కార్లను అదనపు ఫిట్టింగ్లతో షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్నారు. ఒక్కో కారు విలువ రూ.60 లక్షలు. రెండు కార్లకు కలిపి రూ.1.20 కోట్లతో కొనుగోలు చేశారు. కాగా, ఈ కార్ల కొనుగోలుకు వినియోగించిన ఫండ్ వివరాలు తెలియలేదు. కిసాన్ మేళానుసద్వినియోగం చేసుకోండి కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 6వ తేదీన పెద్ద ఎత్తున కిసాన్మేళా జరుగుతుందని కర్నూలు ఏరువాక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త సుజాతమ్మ తెలిపారు. ఇందులో ప్రదానంగా మెట్ట వ్యవసాయం– ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై అవగాహన కల్పించనున్నట్లు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పంటల్లో యాంత్రీకరణ ఎలా వినియోగించుకోవచ్చు. మెట్ట వ్యవసాయంలో పాటించాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులపై ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కిసాన్మేళాలో కర్నూలు జిల్లా రైతులు కూడా పాల్గొనవచ్చని సూచించారు. ఆదోని జిల్లా కోసం పాదయాత్ర ఆదోని టౌన్: ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఉద్యమం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వీరు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదోనిలోని రీలే దీక్షల శిబిరం నుంచి ఇస్వీ గ్రామం వద్ద నారా లోకేష్ యువగళం పాదయాత్ర వెయ్యి కి.మీ. స్మారక స్థూపం వద్దకు 300 మంది పాదయాత్ర చేపట్టారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూపానికి వినతి పత్రం అందించారు. జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానందరెడ్డి, నూర్అహ్మద్, కృష్ణమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వేపచెట్లకూ కష్టమొచ్చింది!
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు అన్ని రకాల పంటలకు సోకే చీడపీడలు, పురుగుల నివారణకు వేప ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. సహజంగా వేప చెట్లకు చీడపీడలు, పురుగుల బెడద ఉండదు. ప్రతి రోజు నాలుగైదు లేత వేపాకులు తినడంతో ఆరో గ్యం కాపాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అపర సంజీవనిగా చెప్పుకునే వేప చెట్లకూ ప్రస్తుతం కష్టం వచ్చింది. ఎవరో కాల్చేసినట్లుగా చెట్లు ఎండిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. టి మస్కిటో బగ్ అనే పురుగు వేపచెట్లకు హాని కలిగిస్తోంది. ఈ పురుగు 2021, 2022 సంవత్సరాల్లో వేప చెట్లపై విజృంభించింది. అప్పట్లో కూడా చెట్లు ఎండిపోయాయి. అయితే తర్వాతి కాలంలో మళ్లీ కోలుకున్నాయి. ఇప్పుడు కొద్ది నెలలుగా ఇదే పురుగు మళ్లీ దాడిచేస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. -
ప్రాణం తీసిన అప్పులు
మహానంది: నందిపల్లె గ్రామానికి చెందిన రైతు సద్దల రామపుల్లయ్య (44)ను అప్పులు మింగేశాయి. ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సద్దల రామపుల్లయ్య సుమారు పది ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు చేశాడు. ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గి తీవ్ర నష్టాలు చవిచూశాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో బ్యాంకుల్లో బంగారు పెట్టి తీసుకున్న రుణంతో పాటు బయట తీసుకున్న అప్పులన్నీ కలిపి సుమారు రూ. 15 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ మేరకు అప్పులు ఎక్కువ కావడంతో తీర్చలేనన్న మనస్తాపంతో శనివారం గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూ లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానిన బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
వీరి రాత పక్కన మెడికల్షాపునకు ఎరుక
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న పలువురు వైద్యుల ప్రిస్కిప్షన్ ఎవ్వరికీ అర్థం కాని రీతిలో ఉంటున్నాయి. ఓ కార్డియాలజిస్టు ప్రిస్కిప్షన్ చూస్తే ఈసీజీ గ్రాఫ్లా కనిపిస్తుంది. దానిని చూసి అర్థం చేసుకుని అక్కడే ఉన్న మెడికల్షాపు వారు మందులు తీసి ఇస్తారు. అక్కడ తప్ప ఆ మందులు బయట ఎక్కడా లభించవు. అలాగే గాయత్రి ఎస్టేట్లోని ఓ న్యూరోసర్జన్ సైతం ఇదే విధంగా మందులు రాస్తున్నారు. అక్కడే ఉన్న ఓ జనరల్ సర్జన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లంగ్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్టీ, గైనకాలజిస్టు, న్యూరాలజిస్టు, యురాలజిస్టు, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పలు ఆసుపత్రులు, ఎన్ఆర్ పేటలోని పలువురు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్లు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఇటీవల బ్రాండెడ్ మందుల స్థానంలో స్థానికంగా తయారయ్యే మందులు అధికంగా వస్తున్నాయి. వాటిని రాస్తే అధికంగా లాభాలు వస్తాయన్న ఆశతో పలువురు వైద్యులు ప్రిస్కిప్షన్ రూపంలో ఇలా తప్పుడు గీతలు గీసి రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఒక డాక్టర్ రాసిన మందుల చీటి -
అప్పుల భారంతో ఆత్మహత్య
కోసిగి: వందగల్లు గ్రామానికి చెందిన కోసిగి రామాంజనేయులు(28) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనేయులు, భార్య నాగతేజ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా అప్పుల భారంతో మానసిక ఒత్తిడికి గురై గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితితో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కోలుకోలేక శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు తండ్రి పెద్ద నరసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. -
తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా!
● మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్న టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యేసాక్షి టాస్క్ఫోర్స్: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా’ అంటూ నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఓ మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని ఏ. కోడూరులో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్తో పాటు ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త భారతి ఎమ్మెల్యేతో తన గోడు వినిపించేందుకు ప్రయత్నం చేసింది. ఒక్కగానొక్క మనవడు గుండె సమస్యతో బాధపడుతుంటే మీరు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తన కుమారుడు వచ్చి గుండె ఆపరేషన్ కోసం డబ్బులు లేక సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆ పేపర్లు కూడా ముట్టుకోలేదని వాపోయింది. తన ఇంటిపైన నిలబడి టీడీపీ జెండా కట్టించానని, ఇంత చేస్తే మీరు ఏమి చేశారని నిలదీసింది. ఇందుకు ఎమ్మెల్యే గట్టిగా నోరు చేసుకుంటూ 50 మందిలో ఓ ఎమ్మెల్యేను నిలదీస్తే గొప్ప అనుకుంటున్నావా, నన్ను ఎవరనుకుంటున్నావు, ఏంది నీ కమాండింగ్.. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పక్కనున్న నాయకులు ఆమెకు సర్దిచెప్పబోగా టీడీపీ జెండా కట్టిన నాకు ఆ బాధ తెలుస్తుందని, మీరేంది అడ్డుకునేదని చెప్పడంతో అక్కడ రసాభాస చోటు చేసుకుంది. సాయం కోసం వస్తే మీ ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వరని చెప్పగా, నేను ఎప్పుడూ అలా చేయలేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కొడుకు సాయం కోసమే మీ ఇంటికి వచ్చాడని, అప్పుడేం చేశారని.. మీ వల్లే తన మనవడు చనిపోయాడని ఆరోపించింది. ఇంతలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా.. అనడంతో అక్కడున్న అధికారులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె కూడా అదేస్థాయిలో ఏం చంపుతావా అని గట్టిగానే సమాధానమివ్వడం గమనార్హం. ఇటీవల ఓ ఫారెస్టు అధికారిపైన చేయి చేసుకోవడం, ఇప్పుడు తమ పార్టీకే చెందిన మహిళా కార్యకర్తపై నోరు పారేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా, తమ బాధలు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీ తరహాలోనే టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
జ్ఞాపకాల జాడలో సేవా పరిమళం
● వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ● నేడు ఆత్మీయ సమ్మేళనం వెల్దుర్తి: దాదాపు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న పాఠశాల ఇది. 67 ఏళ్ల క్రితం పదో తరగతి మొదటి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారు. వీరంతా ఏటా జనవరి నెల మొదటి ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం క్రమేణా పాఠశాల అభివృద్ధి సేవా కార్యక్రమంగా మారిపోయింది. వారు చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల మొట్టమొదటి ఎస్ఎస్ఎల్సీ (పదవ తరగతి) బ్యాచ్ 1958లో పూర్తి చేసుకుంది. చుట్టుపక్కల హైస్కూళ్లు లేని కాలం నుంచి ఏర్పాటైన ఈ పాఠశాలలో చదివిన వారిలో వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్, ఓర్వకల్, కల్లూరు, కోడుమూరు మండలాల వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ చదివిన చాలా మంది ఉన్నత, మహోన్నత స్థానాలలో ఉన్నారు. నాటి నుంచి చదివిన విద్యార్థులలో 1967 పదవ తరగతి బ్యాచ్కు చెందిన వావిలాల కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ‘వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సేవా సంఘం’ ఏర్పడి 2015లో రిజిస్టర్ అయి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 335 మంది సభ్యుల (పూర్వ విద్యార్థులు)తో కొనసాగుతోంది. పాఠశాల అభివృద్ధికి కృషి సభ్యుల సహకారంతో తాము చదివిన పాఠశాలలో (విడిపోయిన బాలికల జెడ్పీ హైస్కూల్లో) నీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు ఇచ్చారు. భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించారు. ఏటా పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, పరీక్షలలో ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతేడాది సమావేశంలో పట్టణానికి చెందిన అగస్టీన్ అధ్యక్షుడిగా, ఖాజాబేగ్ ఉపాధ్యక్షుడిగా, మల్లెపల్లె సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి సెక్రటరీగా పూర్తి కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నేడు బాలికల జెడ్పీహైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అదే పాఠ శాలలో చదివి, అక్కడే ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి రిటైర్ట్ అయిన 1958 బ్యాచ్ శంకరయ్య, 1962 బ్యాచ్ బోయనపల్లె కృష్ణమోహన్ రెడ్డిని ఆదివారం సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేశారు. -
ఏడాదిన్నరకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● యంబాయి గ్రామస్తులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరికబేతంచెర్ల: టీడీపీ ప్రభుత్వంపై ఏడాదిన్నర గడవక ముందే ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండలపరిధిలోని యంబాయి గ్రామ సర్పంచ్ యుగంధర్రెడ్డి, ఉప సర్పంచ్ భోగేశ్వరప్ప ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొక్కల రామకృష్ణ, నాగన్న, మాబు, చిన్న కిట్టు, తిరుపాలుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి బుగ్గన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం కింద నీటిని తీసుకొచ్చి ఎన్నికలకు ముందే బేతంచెర్ల మండలానికి తాగునీరు అందించామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 3 నెలల్లో పనులు పూర్తయి బేతంచెర్లతో పాటు డోన్, ప్యాపిలి మండలాలకు తాగునీరు అందేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా వాటర్ గ్రిడ్ పథకం పనులు డోన్, ప్యాపిలి మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయన్నారు. రూ.36 కోట్లతో నిర్మించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కూర్చోవడానికి బల్లలు, పడుకోవడానికి మంచం, ఉపాధ్యాయులకు కుర్చీలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 90 శాతం పూర్తయిన ప్రభుత్వ భవనాలను మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం లేదంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. యంబా యి గ్రామానికి గతంలో ప్రారంభించిన రహదారి నిర్మాణ పనులు నేటి వరకు చేపట్టకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. డోన్ నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు, అభివృద్ధి పనుల వల్ల భూముల విలువ 3 రెట్లు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రజలు గత వైఎస్సార్సీసీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గ్రామ గ్రామాన టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్ రెడ్డి, గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.


