Nandyal District Latest News
-
ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ‘అశోక’కు అరుదైన గుర్తింపు
కర్నూలు సిటీ: ప్రతిష్టాత్మక ఐఐఆర్ఎఫ్ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ఇటీవల విడుదల చేసిన 2026 ఇంజినీరింగ్ కళాశాలల ర్యాంకింగ్లో కర్నూలుకు చెందిన అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ జాతీయస్థాయిలో 47వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. శుక్రవారం అశోక మహిళా ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో అశోక్ ఎక్సలెన్స్ కాంక్లేవ్ – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ఏఏఎస్, ఇంటర్న్ నాలెడ్జ్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీస్, ఎర్నెస్ట్ యంగ్ (చైన్నె) మేనేజర్ శ్రీ హితేష్ శర్మ, వరల్డ్ ఏఐ గవర్నెన్స్ చీఫ్ ఏఐ అడ్వైజర్–ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ (హైదరాబాదు) ప్రెసిడెంట్ డాక్టర్ గుండాల నాగరాజులు ముఖ్య అతిథులుగా హాజరై ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథులతో జరిపిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఎంపిక ప్రక్రియ, కళాశాలల మూల్యాంకన విధానం, విద్య నాణ్యత, పరిశోధన, పరిశ్రమల అనుసంధానం, ప్లేస్మెంట్లు, మౌలిక సదుపాయాల వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఎలా నిర్ణయిస్తారనే విషయాలపై కార్యక్రమంలో చర్చించారు. కార్యక్రమంలో అశోక కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.నవీన్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శివకుమార్, మగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ.. అనాథగా !
ఓ వృద్ధురాలు ఆకలితో అల్లాడిపోతోంది. పిల్లలను తలచుకుంటూ బోరున విలపిస్తోంది. బువ్వ పెట్టమని అటుగా వెళ్లిన వారిని బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దోమలతో నరకం చూస్తోంది. ఇదంతా ఇక్కడో కాదు. జిల్లా పరిపాలన భవనం కలెక్టరేట్లోనే. ఓ వృద్ధురాలు అనాథగా అలమటిస్తోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులే శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వృద్ధురాలి దీన గాథ వినడానికి అధికారులెవరూ ముందుకు రాలేదు. ఆమె ఆర్తనాదాలు వినిపించనట్లు వెళ్లిపోయారు. తన ఊరు, పేరు కూడా చెప్పలేకపోవడంతో మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. – కర్నూలు(సెంట్రల్) -
అధికారుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం
ఓర్వకల్లు: మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, ఆంజనేయస్వామి ఆలయంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో దళితులకు శుక్రవారం ఆలయ ప్రవేశం కల్పించారు. గొందిపర్ల గ్రామానికి చెందిన మాలతి ఐదు నెలల క్రితం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన సమయంలో ఆలయ పూజారి కులవివక్షతో దూషించిన విషయం తెలిసిందే. ఆవెమె అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆ మేరకు కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, బాధితురాలు బీజేపీ జిల్లా కార్యదర్శి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు గొందిపర్ల మాలతి, ఆమె భర్త రామాంజనేయులుతో పాటు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్కుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగరాజు సమక్షంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆలయ ప్రవేశం చేసే హక్కు వుందన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం సామాజిక సమానత్వానికి నిదర్శనమని, కులవివక్షతకు సమాజంలో ఎలాంటి స్థానం లేదని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, బీజేపీ నాయకులు, దళిత సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు, దళితులు పాల్గొన్నారు. అంతా ‘మామూళ్లే’ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిఽధిలో బీఈడీ కళాశాలల అఫ్లియేషన్ ప్రక్రియ గందరగోళాన్ని తలపిస్తోంది. వర్సిటీ అఽధికారులతో కొన్ని కళాశాలల యాజమాన్యాల లోపాయకారి ఒప్పందం, అఫ్లియేషన్ కమిటీలతో లాబీయింగ్, యాజమాన్యాల రహస్య సమావేశాలు, అమ్యామ్యాల అప్పగింతలు వెరసి బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్ను కానిచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్యూ పరిఽఽధిలో 2026–27 విద్యా సంవత్సరానికి 50 కళాశాలలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కమిటీలను వేశారు. ఆర్యూ ప్రొఫెసర్లతో పాటు ఇతర వర్సిటీల నుంచి కొందరు ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు గత మూడు రోజులుగా కళాశాలలను సందర్శిస్తున్నాయి. కమిటీలు తూతూ మంత్రంగా సందర్శించడం.. అఫ్లియేషన్కు రెకమెండ్ చేయడం సర్వసాధారణంగా జరి గిపోతోంది. వర్సిటీ ఉన్నతాధికారులేమో ఫిర్యా దులు, ఆరోపణలు పట్టించుకోకుండా ‘కమిటీలు రెకమెండ్ చేశాయి.. మేము అఫ్లియేషన్ ఇచ్చేస్తున్నాం’ అని చెప్పడం పరిపాటిగా మారింది. లోపాలను ఏమాత్రం సరిచేయకుండా నెపాన్ని కమిటీలపైకి నెట్టేస్తున్నారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో వర్సిటీ అధికారులు భాగస్వామ్యంగా ఉన్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అదీ కాక ఎలాంటి బిల్డింగ్లు లేని కళాశాలల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడం పలు విమర్శల కు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీలు ఎన్ని కళాశాలలకు రెకమెండ్ చేస్తారో వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్ని కళాశాలలకు అఫ్లియేషన్ ఇస్తారో మరో వారం రోజుల్లో తేలనుంది. కమిటీలదే ప్రధాన పాత్ర .. వర్సిటీ పరిధిలోని కళాశాలలకు అఫ్లియేషన్ ఇవ్వడానికి అఫ్లియేషన్ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కమిటీలు కళాశాలలను ఫిజికల్గా సందర్శించి ఎన్సీటీఈ నిబంధనలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక ఆధారంగా మాత్రమే వర్సిటీ సీడీసీ విభాగం, వర్సిటీ ఉన్నతాధికారులు అఫ్లియేషన్ ఇస్తారు. అయితే యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్న కమిటీలను ఏర్పాటు చేయించుకొని కళాశాలలను తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకుని వ్యవహారం నడిపించారు. కమిటీ సభ్యులు ఎన్సీటీఈ నిబంధనలను కమిటీ సభ్యులు పరిశీలిస్తే సుమారు 20 కళాశాలలకు అఫ్లియేషన్ ఇచ్చే పరిస్థితి ఉండదదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ పది కళాశాలలు ఎక్కడో.. వర్సిటీ పరిధిలో అఫ్లియేషన్కు 50 కళాశాలలకు దరఖాస్తు చేసుకోగా అందులో 10 కళాశాలలకు భవనాలు లేవనేది బహిరంగ రహస్యమే. నందికొట్కూరులో రెండు, పంచలింగాలలో రెండు, కర్నూలులో మూడు, నన్నూరులో ఒకటి, డోన్లో రెండు కళాశాలల ఉన్నట్లు పేపర్లలో మాత్రమే అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కు వెళితే అక్కడే ఏదో ఒక షాపింగ్ మాల్, ఇళ్లు, మల్టీపర్పస్ బిల్డింగ్స్ ఉంటాయి. వీటిని చూస్తే అఫ్లియేష్ కమిటీలు అఫియేషన్కు రెకమెండ్ చేస్తున్నారంటే ఎంతలా లాబీయింగ్ జరుగుతుందో, ఎన్ని ముడుపులు ముడుతున్నాయో అనే సందేహం వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకే బీఈడీ కళాశాలలకు అఫ్లియేషన్ ఇస్తాం. అఫ్లియేషన్ కమిటీలు సరైన నివేదికలే ఇస్తాయి. ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఏవైనా ఫిర్యాదులు, ఆరోపణలు ఉంటే మరో కమిటీ ద్వారా కళాశాలలను సందర్శించి నివేదిక తెప్పించుకుంటాం. తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలు, లాబీయింగ్లకు ఆస్కారం ఉండదు. పారదర్శకంగా అప్లియేషన్ ప్రక్రియను నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు, వైస్ చాన్స్లర్, ఆర్యూ -
రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యం
● సూపర్సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పాణ్యం: రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. పాణ్యంలో శుక్రవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు. స్థానిక పాత ఆసుపత్రి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహానేత విగ్రహానికి గజమాల వేసి నివాళి ఆర్పించి కాటసాని మాట్లాడారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి అడిగితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో మొక్కజొన్న క్వింటా ధర రూ.2,400 ఉంటే మన రాష్ట్రంలో రూ.1,500 మాత్రమే పలుకుతోందన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వక, పంటలకు నష్ట పరిహారం అందించక రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ‘బాబూ ష్యూరిటీ .. మోసం గ్యారెంటీ’ అని అందరికీ అర్థమైందన్నారు. మద్యం ఫుల్.. అభివృద్ధి నిల్ రాష్ట్రంలో మద్యం ఎక్కడ చూసినా దొరుకుతోందని, అభివృద్ధి మాత్రంకనిపించండం లేదని కాటసాని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే బెల్ట్షాప్లు 24 గంటలు పనిచేస్తున్నాయన్నారు. రాత్రింబవళ్లు డోర్డెలివరీ చేస్తున్న ఘనత ఏపీలోనే ఉందన్నారు. ప్రతి ఊర్లో టీడీపీ నాయకులు నాలుగు నుంచి ఐదు బెల్ట్షాప్లు నిర్వహిస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం మద్యంషాప్లో మాత్రమే దొరికేదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశక్వతం కాదని, అధికారులు చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రజల తరఫున పోరాటేందుకే జనసేన పుట్టిందని చేప్పిన పవన్కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారన్నారు. సినిమాలో రీల్ హీరోగా ఉంటే నిజ జీవితంలో రియల్ హీరోగా రాణించలేకపోతున్నారన్నారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్రెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ సద్దల సుజిత్రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాంద్బాషా, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తిలో రైతులు భాగస్వాములు కావాలి
నంద్యాల(అర్బన్): విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వాములను చేసినప్పుడే మేలైన విత్తనం లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం ఖరీఫ్ విత్తన దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంటకు సరిపడ మోతాదులో రైతులు విత్తనాలను వినియోగించాలని, ఎరువులు, గుళికలు సరైన సమయంలో వేస్తే దిగుబడులు సాధించవచ్చన్నారు. నాణ్యమైన విత్తనం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. మెట్ట వరి, ఆరు తడి పంటల వల్ల నీటి వినియోగం తగ్గించుకోవచ్చని, పాడి పంటలను సమన్వయంగా ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యంతో పాటు మానవాళి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందన్నారు. సీనియర్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ శివశంకర్రెడ్డి మాట్లాడుతూ విత్తన ఎంపిలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాంకేతికతను పాటిస్తూ అధిక ఆదాయం పొందాలన్నారు. ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారానే నాణ్యమైన పంటలను పండించవచ్చన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షలు, ఎరువుల మోతాదు గురించి భూసార శాస్త్రవేత్తలు కవిత, ఫరీదా, జయలక్ష్మిలు వివరించి రైతులకు భూసార పరీక్ష పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్సీ ఏడీఏ చెన్నయ్య, ఎన్ఎస్సీ ఏరియా మేనేజర్ మోహన్రాజు, శ్రీసాయి, ఆర్ఈఏసీ మెంబర్ మద్దిలేటి, శాస్త్రవేత్తలు అశోక్కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు. -
వీవీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు
కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యువజన సంఘం నాయకుడు వీవీ నాయుడు భూ పంచాయతీల్లో తలదూర్చడం, ఆర్డీఓ కార్యాలయ సిబ్బందిని భయపెడుతున్నాడని కర్నూలు ఆర్డీఓ కె.సందీప్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన మాజీ సైనికుడు విజయ్ని వీవీనాయుడు ఓ పంచాయితీలో కలుగజేసుకొని వేధిస్తున్నారని కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి వీవీనాయుడుకు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని తెలిందన్నారు. అయినా అతను మాత్రం అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపణలు చేయడం, తన కార్యాలయ అధికారులను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రాయలసీమ యువజన సంఘం నాయకులు సోషల్ మీడియాలో ఆర్డీఓ పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. స్పెషల్ సప్లిమెంటరీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో 2019 యూజీ(డిగ్రీ)లో చేరి ఒక సబ్జెక్టు ఫెయిలైన అభ్యర్థులకు ఒక అవకాశం ఇస్తూ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2019లో యూజీ (డిగ్రీ) చేరిన విద్యార్థులు కోర్సు మొత్తంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన వారు ఈ ఎగ్జామ్కు అర్హులని తెలిపారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2023లో యూజీ (డిగ్రీ)లో చేరి 5వ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించటానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. దొర్నిపాడు: పాతసామాన్లు సేకరించే వారి ముసుగులో వచ్చి ఇటీవల కొందరు చోరీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బుర్రారెడ్డిపల్లె గ్రామంలో కొంతమంది ఆటోలో వచ్చి ఇంటి పరిసరాల్లో ప్లాస్టిక్, ఇనుప వంటి పాత సామాన్లను సేకరించుకునే పనిలో నిమగ్నం అయ్యారు. వీరు దొంగలని గ్రామస్తులు భావించి.. గ్రామంలోని విద్యుత్ స్తంభానికి ఇద్దరు వ్యక్తులను తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకోని వారిని పోలీస్ స్టేషన్కు తీసుక వెళ్లారు. ఎస్ఐ శ్రీకాంత్ వారిని పూర్తి స్థాయిలో విచారించారు. వారు దొంగలు కాదని భిక్షాటన చేస్తూ పాతసామాన్లను సేకరించి అమ్ముకొని జీవనం సాగించే వారని నిర్ధారించారు. -
సెప్టెంబర్ 6న కృత్రిమ చేతుల అమరిక శిబిరం
● జిల్లా కలెక్టర్ జి.రాజకుమారినంద్యాల: అనంతపురంలో సెప్టెంబర్ 6న మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్ఎన్–4 హ్యాండ్స్, చేయూత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శిబిరంలో రూ.30 వేల విలువైన అత్యాధునిక కృత్రిమ చేతులను ఉచితంగా అమరుస్తారన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు ముందస్తుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎల్ఎన్–4 హ్యాండ్స్ సాంకేతికతతో రూపొందించిన ఈ కృత్రిమ చేతులతో రాయడం, పెయింటింగ్ చేయడం, ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వంటి రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే నాలుగు కిలోల వరకు శిబిరానికి సంబంధించి రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం నంద్యాల కేసీ కెనాల్ కాంపౌండ్ ఆవరణలోని రెడ్ క్రాస్ కార్యాలయాన్ని, 8985770583 మొబైల్ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యుడు ఉస్మాన్ బాషా పాల్గొన్నారు. -
భూతల స్వర్గం.. అభివృద్ధికి దూరం!
● బెలుం గుహలపై సర్కారు నిర్లక్ష్యం ● ఏటా కోటికి పైగా ఆదాయం.. కనిపించని సౌకర్యాలు ● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు కొలిమిగుండ్ల: ప్రపంచంలో రెండో అతిపెద్ద గుహలుగా బెలుం గుహలకు పేరు. భూమి అంతర్భాగంలో 3,229 మీటర్ల మేర విస్తరించి దేశ,విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుహలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. సౌకర్యాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 8,9 తేదీల్లో అట్టహాసంగా బెలుం గుహల ఉత్సవాలను మొట్టమొదటి సారిగా నిర్వహించారు. పెద్ద ఎత్తున సాంసృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఉత్సవాల నిర్వహణ, సౌకర్యాల కల్పన ఊసేత్తడం లేదు. ఆదాయం ఫుల్... సౌకర్యాలు మాత్రం అంతంతే గుహలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షకు పైగా మంది పర్యటకులు వస్తుంటారు. జిల్లాలో శ్రీశైలం తర్వాత పర్యాటక శాఖకు అత్యధిక ఆదాయం అందించేది బెలుం గుహలే. 2025–26 వార్షిక సంవత్సరంలో రూ.1.10 కోట్ల ఆదాయం సమకూరింది. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు తదితర ఖర్చులు పోను రూ.40 లక్షల మేర ఆదాయం మిగిలింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఇటీవలనే గుహల సందర్శన టికెట్ల ధరలను సైతం పెంచారు. పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.70 వసూలు చేస్తున్నారు. ధర ఎంతైనా బెలుం గుహల అందాలను తిలకించాలని చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే, వారు గుహల వద్ద సరైన వసతులు లభించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2017లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో గుహ లోపలి భాగాలు అస్తవ్యస్తంగా మారాయి. అప్పట్లో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, స్పీకర్లు, లైటింగ్ వ్యవస్థ, బ్రోయర్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో సిమెంట్ బెడ్లు, బండ పరుపులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బ్రోయర్లు సరిగా పని చేయక ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రదేశాల్లో లైటింగ్ లేక అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తుందని యాత్రికులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే లోపల బురద మయంగా మారుతోంది. కోటిలింగాలు తదితర ముఖ్యమైన ప్రదేశాలను చూసేందుకు అవకాశం లేకుండా పోతుంది. వీటిపై దృష్టిసారించడంతో పాటు గుహల లోపల అధునాతన లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. డార్మెటరే దిక్కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గుహల ఆవరణలో వసతి సౌకర్యం కరువైంది. మొదట్లో నిర్మించిన డార్మెటరీ మాత్రమే దిక్కు. ఇందులో ఫ్యామిలీతో వచ్చే యాత్రికులకు అనుగుణంగా వసతులు లేవు. దీంతో తాడిపత్రి చుట్టు పక్కల పట్టణాల్లో బస చేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. గుహల ఆవరణలో విశాలమైన మైదానం ఉంది. ఓర్వకల్లు సమీపంలోని రాక్గార్డెన్ తరహాలో అన్ని వసతులతో గదుల నిర్మాణం, పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ తదితరవి ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పని చేయని స్పీకర్కుటుంబ సభ్యులతో కలిసి గుహలను తిలకించేందుకు కారులో వచ్చాం. గుహలోపల చూడదగ్గ ప్రదేశాలు బాగున్నాయి. కానీ వసతులు మాత్రం సరిగా లేవు. గాలి వచ్చేందుకు మరిన్ని బ్రోయర్లు పెట్టాలి. లైటింగ్ పెంచాలి. చీకటిగా ఉండటం వల్ల కింద పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే యాత్రికులతో పాటు గైడ్లను పంపిస్తే బాగుంటుంది. – అరుణ్కుమార్, పర్యాటకుడు, కడప గుహల అభివృద్ధి కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. లోపల లైటింగ్, సీసీ కెమెరాలు, స్పీకర్లు, అదనపు బ్రోయర్లు నిర్మించాలని కోరాం. పర్యాటకుల సౌకర్యం కోసం పది గదులు నిర్మించేందుకు నివేదికలు పంపాం. గుహలకు ఏటా కోటి రూపాయలకు పైగానే ఆదాయం వస్తుంది. – కిషోర్, గుహల యూనిట్ మేనేజర్ -
యాగంటిపల్లె కేవీకేకు నాస్–ధనుకా అవార్డు
బనగానపల్లె రూరల్: యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి నాస్ ధనుకా అవార్డు వచ్చినట్లు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మీ శుక్రవారం తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (నాస్) న్యూఢిల్లీ, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్లు సంయుక్తంగా ఈ అవార్డును ఇస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–33వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జట్, మరికొందరి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఈ పురస్కారం అందుకోవడం యాగంటిపల్లె కేవీకేకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధి బాధ్యత మరింత పెంచిందని తెలిపారు. 279 మంది విద్యార్థులు గైర్హాజరునంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 18 కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ను ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంగ్లిష్ పరీ క్షకు 475 మంది విద్యార్థులకు గాను 196 మంది హాజరు కాగా 279 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు. అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వకాలు టాస్క్ఫోర్స్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడానికి పలు మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకున్నారు. అదీ చాలక ఇసుక వ్యాపారం చేస్తున్నారు. వీటికి అదనంగా ఐరన్ ఓర్ తవ్వకాలు చేపడుతున్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, తవిసికొండ, పాపాసాని కొట్టాల, రేపల్లె, వీరాయపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వుతున్నారు. ఇందుకోసం జేసీబీ, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నాయకుల తవ్వకాలకు సహకరించడంతోపాటు వారు అనుకున్న ప్రాంతాలకు ఐరన్ఓర్ను తరలించే ప్రకియలో కొందరు అధికారులు పాలు పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పట్టా ఇప్పించమంటే.. స్థలాన్ని కబ్జా చేశారు! ● న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆందోళన నందికొట్కూరు: తాము కొనుగోలు చేసిన స్థలానికి పట్టా ఇప్పించమంటే టీడీపీ నాయకుడు అబ్దుల్లా కబ్జా చేశాడని పేద కుటుంబం సభ్యులు శుక్రవారం స్థలం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాళీ జాగా కనిపిస్తే టీడీపీ నాయకుడి కబ్జా చేస్తున్నారని, ఒక కుటుంబం ఏకంగా పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించిందన్నారు. ఒక మహిళ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారని, ఈ సంఘటన మరవకముందే తమ స్థలం కబ్జా చేశారని లక్ష్మిదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తాము 2008లో 451 నంబరు గల ప్లాట్ను కొనుగోలు చేశామని, పట్టా ఇప్పించమని కౌన్సిలర్ భర్త అబ్దుల్లాను ఆశ్రయిస్తే కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటున్నర స్థలాన్ని ఇతరులకు విక్రయిస్తే బిల్డింగ్ కూడా నిర్మించారని, మిగతా సెంటున్నర స్థలం ఆక్రమించి స్వాధీనంలో ఉంచుకున్నారన్నారు. ఖాళీ స్థలమైనా తమకు అధికారులు ఇప్పించాలని కోరారు. పేదల స్థలాలను కబ్జా చేస్తున్న అబ్దుల్లాపై చర్యలు తీసుకోవాలన్నారు. -
శ్రీగిరి.. ప్రగతి అధోగతి!
శ్రీశైలంటెంపుల్: తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం.. శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు చెప్పే మాటలు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా శ్రీశైల క్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్, సరిపడినన్ని వసతి గదులు లేక.. అరకొర సౌకర్యాలతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఉత్సవాల్లో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మాటల్లోనే అభివృద్ధి! రాష్ట్రంలో తిరుమల తరువాత రెండో పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా సీఎం హోదాలో చంద్రబాబు శ్రీశైల క్షేత్రాన్ని మూడుసార్లు సందర్శించారు. శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో కనిపించలేదు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కోసం టూరిజం, రెవెన్యూ, దేవదాయ, అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు మాటల్లో మాత్రమే అభివృద్ధి ఉంటుందని, చేతల్లో ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు. సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు పార్టీలకు చెందిన 26 మందితో జంబో ట్రస్ట్బోర్డును నియమించారు. ట్రస్ట్బోర్డు ఏర్పాటై ఎనిమిది సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. జంబో ట్రస్ట్బోర్డు సభ్యులు తమ దర్శనాలు, తమ సిఫార్స్ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వలేదని దేవస్థాన అధికారులపై ఆగ్రహించడం తప్ప క్షేత్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ట్రస్ట్బోర్డుకు స్వయంప్రతిపత్తి లేకపోవడంతో తీర్మానాలన్నింటినీ దేవదాయశాఖ కమిషనర్కు పంపుతున్నారు. అక్కడి నుంచి ఇంతవరకు అనుమతులు రావడం లేదు. భక్తుల అసంతృప్తి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తుల సంతృప్తిస్థాయిని తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐబీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది. సమయానుకూలంగా దర్శనాలు జరగకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడం తదితర విషయాలపై భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీంతో భక్తుల సంతృప్తి స్థాయిలో శ్రీశైల క్షేత్రం అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది.మెరుగుపడని సౌకర్యాలు శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ప్రస్తుతం దేవస్థానంలో రేకుల షెడ్డులతో క్యూకంపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే ఈ క్యూ కంపార్ట్మెంట్లలో సుమారు 10 వేల మంది మాత్రమే భక్తులు వేచి ఉండేలా ఉన్నాయి. దీంతో సాధారణ రోజుల్లోనే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల అవస్థలు వర్ణానాతీతం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అధునాతన టెక్నాలజీతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మిస్తామని చెబుతునప్పటికీ ఇంతరవకు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అలాగే భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేవు. శ్రీశైల క్షేత్రంలో వసతి సౌకర్యాలు మెరుగుపడాల్సిన ఉంది. అయితే ఆ దిశగా ఒక్క అడగు కూడా పడలేదు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని మరచిన చంద్రబాబు ప్రభుత్వం సమావేశాలు, చర్చలకే పరిమితమైన జంబో ట్రస్ట్బోర్డు సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు -
శిల్పా చక్రపాణిరెడ్డి హౌస్ అరెస్ట్
● ఎస్పీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలునంద్యాల: వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డిని పోలీసులు గురువారం హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో శిల్పాచక్రపాణిరెడ్డి ఆత్మకూరు కు వెళితే ఘర్షణలు జరుగుతాయని, నంద్యాల నుంచి పక్కకు వెళ్లకుండా శిల్పాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకున్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి నివాస గృహంలో ఉన్న శిల్పాచక్రపాణిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి సీఐ, ఎస్ఐలతో బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పోలీసులు ఎక్కడా ఈ కార్యక్రమం జరగకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చా రు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మహానంది, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరగనివ్వలేదు. శిల్పాచక్రపాణిరెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేశార ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు నంద్యాలకు వస్తుండగా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులు, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పాచక్రపాణిరెడ్డి, శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషాలు గురువారం ఎస్పీ సునిల్షెరాన్ను కలిసి వివరించారు. సంఘటన ఎలా జరిగింది, ఎవరు ప్రోత్సహించారు వంటి వివరాలను ఎస్పీకి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గం జరగకుండా పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారని వివరించారు. ఈనెల 8, 9, 12 తేదీల్లో శ్రీశైలం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు జరుపుకొనే విధంగా అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అభివృద్ధి అంటే ఇదేనా? శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, దాడులు చేస్తున్నారని, ఇదేనా అభివృద్ధి అంటే ప్రశ్నించారు. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్రెడ్డి చేయని అరాచకాలు లేవని, ప్రజల్లో బుడ్డాపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అతన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లో లేరన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ.. మహానేత విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడు జంబులయ్య కూటమి కార్యకర్తనేనన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పీపీ మధుసూదన్ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రె డ్డి, మైనార్టీ నాయకుడు యూనుస్ బాషా పాల్గొన్నారు. బుడ్డా.. నోరు అదుపులో పెట్టుకో! టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని, నోరు అదు పులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. గురువారం శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముందుగానే పథకం ప్రకారం ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేయించారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చే యించారన్నారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్ర హం ధ్వంసం, ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కా ర్యాలయంపై దాడి వెనుక కుట్ర ఉందన్నారు. -
10 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, రోడ్లుకు ఇరువైపుల, వివిధ కార్యాలయాల ఆవరణల్లో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వెల్దుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుంది. విద్యార్థులకు ముందుగానే నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తాం. – కిశోర్కుమార్రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి -
అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు
● జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కొలిమిగుండ్ల: సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామిలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి విమర్శించారు. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో భాగంగా గురువారం కొలిమిగుండ్ల పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నాయకులతో కలిసి కరపత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడే టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్తో పాటు 143 రకాల హామీలు ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్లో అమలవుతున్న ఒకటి, రెండు పథకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆరోపించారు. మహిళలకు ఫ్రీబస్సు ఏర్పాటు చేసి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయక పోవడంతో రద్దీ కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను పూర్తిగా దగా చేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోగా వైఎస్సార్సీపీని మరింతగా బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పేరం నందకిషోర్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి, గుర్విరెడ్డి, రామసుబ్బయ్య, రామనాథరెడ్డి, బాచం మహేశ్వరరెడ్డి, పేరం రాంశంకర్రెడ్డి, కంబయ్య, తోట శివశంకర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సుబ్బయ్య, కామిని గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
సూక్ష్మ చిత్రం.. పర్యావరణ హితం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్నంగా టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను గీచి అందరినీ ఆలోచింప చేశారు. పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతవులు స్వేచ్ఛగా ఉన్నట్లు నది జలాలు, నీటిలో నివసించే జలచరాలు ప్రకృతి సోయగాన్ని చూసి వన దేవత సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఒక వైపు.. పర్యావరణ కాలుష్యంతో పచ్చదనం ఎండి వన్యప్రాణులకు నీరు లేక అలమటించి పోయి వన దేవతకు మొరపెట్టుకున్నట్లు చనిపోయిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు చూసి వనదేవత కన్నీరు పెడుతూ చేతులు జోడించి మనుషుల్లారా ఇకనైనా మారండి అంటూ వేడుకుంటున్నట్లు మరో వైపు చిత్రాలు వేశారు. – నంద్యాల(అర్బన్) -
ఇలా చేద్దాం..
● ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వినియోగం అధికమైంది. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ● ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వాయు కాలుష్యమే అధికం. కర్నూలు జిల్లాలో 42 లక్షల జనాభా ఉంది. ఇందులో 70 శాతం జనాభా వాహనాలను వినియోగిస్తోంది. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని నివారణకు ప్రజలకు వీలైనంత వరకు వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ను వినియోగించాలి. ● కర్నూలుతోపాటు ఇతర పట్టణాల్లో దాదాపు లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. వీటిలో కాలం తీరిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోలు చేసే ధ్వని శబ్ధాలు 140 డెసిబుల్స్ వరకు ఉండడంతో శబ్ధకాలుష్యం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి సిటీ బస్సులను ప్రవేశపెడితే కాలుష్య నియంత్రణకు ఒక పరిష్కారం లభిస్తుంది. ● కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీతో పాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారబోసి నిప్పు బెడుతున్నారు. కల్లూరు ఎస్టేట్లోని పారిశ్రామిక వాడలో పరిశ్రమల కోసం వినియోగించిన వ్యర్థ ప్లాస్టిక్ను రోడ్లపైనే కాల్చి వేస్తున్నారు. గార్గేయపురంలోని డంప్యార్డులో చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ● హంద్రీ, తుంగభద్ర, కుందూ నదిలో మురుగు నీరు కలుస్తున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నదులు, వాగులు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాలుష్య కారకాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం, అధికారుల సమన్వయం ముఖ్యం. కాలుష్య నియంత్రణ మండలితో పాటు పోలీసు, రవాణాశాఖ, మునిసిపల్, పంచాయతీ అధికారుల బాధ్యత ఉంటుంది. ఎవరి విధులు వారు పాటిస్తే కాలుష్య నియంత్రణానికి మేలు చేసిన వారవుతారు. పర్యావరణ సంరక్షణ బాధ్యతలో మొక్కల పెంపకం అతి ముఖ్యమైనది. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఎవరైతే మొక్కను నాటుతారో వారే సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మొక్కలు చెట్లవుతాయి. -
ఎస్ఐఆర్లో కృత్రిమ మేధస్సును అమలు చేయాలి
● ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కర్నూలు(అర్బన్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కృత్రిమ మేధస్సును అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఉర్దూఘర్ షాదీఖానాలో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మైనారిటీ శాఖకు చెందిన కేయూపీఎస్ ట్రైనింగ్ అకాడమీ కోఆర్డినేటర్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఏపీ ముతవల్లీల సంఘం అధ్యక్షులు షకీల్షఫీ, ఐఎంసీ టీం వ్యవస్థాపకులు రహ్మత్పాషా, సామాజిక కార్యకర్త జమీల్ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు కొనసాగేందుకు ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకోవాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా అర్హులైన ఓటర్లను సులభంగా గుర్తించడం, పొరపాట్లను తగ్గించడం జరుగుతుందన్నారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులు, అవసరమైన చర్యల గురించి ఓటర్లకు ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్లు, డిజిటల్ నోటిఫికేషన్లను పంపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటరు ధ్రువీకరణ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా మారుతుందన్నారు. కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ మాట్లాడుతూ.. ఓటరు చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాచారం లేమి కారణంగా ఒక్క నిజమైన ఓటు కూడా కోల్పోకూడదన్నారు. అర్హత కలిగిన పౌరులందరూ ఓటరు జాబితాలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉలేమా, పలు సామాజిక సంస్థల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మునెప్ప నగర్లో అక్రమంగా ఓ రేకుల షెడ్లో నిల్వ ఉంచిన 56 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి విజిలెన్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుడికి చెందిన రేకుల షెడ్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ సీఐ పవన్కుమార్ మాట్లాడుతూ.. నందవరం మండలం సోమలగూడూరు మహబుబ్బాషాకు చెందిన రేకుల షెడ్లో 56 బస్తాలు (24 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి బియ్యంతో పాటు, రవాణాకు ఉపయోగించే ఆటోను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించి, నిందితుడు మహబుబ్బాషాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. సమావేశంలో ఆర్ఐ హఫీజ్, విజిలెన్స్ కానిస్టేబుళ్లు అశోక్కుమార్, ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
దొర్నిపాడు: డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెంది న ఉపాఽధి కూలీ బాలయ్య (34) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాలయ్య రోజులాగే పనులకు వెళ్లి కాలువ పూడికతీత పనుల వద్ద రెండు ఫొటోలు కూడా దిగాడు. 020587 నంబర్గల జాబ్కార్డు కల్గి ఉన్నాడు. ఇంతలో ఎండతీవ్రతకు తట్టుకోలేక పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే డబ్ల్యూ గోవిందిన్నెలోని ఓ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్త తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య సరోజ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బరాయుడు వెంటనే ఎంపీడీఓ సావిత్రి, ఏపీఎం హనీఫాకు విషయం చెప్పగా అనంతరం వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబానికి అధికారులు ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డీసీ ప్రెసిడెంట్ ప్రసాద్రెడ్డి కోరారు. గుండెపోటుతో ఏఎస్ఐ శంకర్ మృతి మద్దికెర: మద్దికెర పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆరిపల్లి శంకర్ (58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విధులకు ఇంటి నుండి బయలుదేరే సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే 108 సమాచారం అందించగా వైద్యపరీక్షల కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషన్ మృత్యువాతఎమ్మిగనూరురూరల్: గార్లదిన్నె గ్రామంలో బోరు మరమ్మతు చేసేందుకు వెళ్లిన ఓ ఎలక్ట్రిషన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన కురవ లక్ష్మన్న(36) చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్ ఎలక్ట్రిషన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గ్రామానికి చెందిన కౌలు రైతు లాజర్ పొలంలో బోరు మరమ్మతు చేసేందుకు ఎలక్ట్రిషన్ కురవ లక్ష్మన్నను తీసుకెళ్లాడు. విద్యుత్ సరఫరా లేదు అనుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు వేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారులు శ్రీకాంత్(10), హరికృష్ణ(8)లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఖరీఫ్కు సరిపడా ఎరువులు అందిస్తాం కోవెలకుంట్ల: ప్రస్తుత ఖరీప్ సీజన్కు రైతులకు కొరత లేకుండా రసాయన ఎరువులను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కోవెలకుంట్ల ఏడీఏ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులను ’ఏపీఏఐఎంఎస్’ యాప్ ద్వారా పంటల విస్తీర్ణాన్ని బట్టి మూడు విడతలుగా కేటాయిస్తామన్నారు. అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలు, ఎలినినో ప్రభావం, కౌలు కార్డుల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీడీఏ గంగాధర్, ఏడీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమం శూన్యం
● చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం బేతంచెర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతబస్టాండు సమీపంలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను చించి నిరసన తెలిపారు. అక్కడ నుంచి నగర పంచాయతీ కార్యాలయం చేరుకొని పట్టణంలోని తాగునీటి, ఇతర సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ హరిప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి బుగ్గన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేండేళ్లు పూర్తవుతున్నా మహిళలకు ఆడబిడ్డ నిధి, యువకులకు నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అందలేదన్నారు. అర్హులందరికీ కొత్త పింఛన్ల హామీని అమలు చేయకుండా చరిత్ర సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రజలపై భారం హామీలను గాలికి వదిలేసి, పెట్రోలు, డీజల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపారని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని.. ఇంతకంటే ఘోరమైన పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. అంతా అంధకారమే! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ, ఎంఎస్ఎంఈ భవనాలకు నేటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అంతా అంధకారమే కనిపిస్తోందని విమర్శించారు. బీసీ రెసిడెన్సియల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులకు కూర్చోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి రూ. 351 కోట్లతో చేపట్టిన వాటర్గ్రిడ్ పథకం పనులు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. బేతంచెర్ల పట్టణానికి పది రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతంచెర్ల పట్టణానికి రూ. 44 కోట్లతో మంజూరైన అమృత 2.0 పథకం టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. దేవుడు కూడా క్షమించరు! శ్రీ మద్దిలేటి నరసింహస్వామి, ముచ్చట్ల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు నిలిపివేశారని, టీడీపీ నేతలను దేవుడు కూడా క్షమించబోరని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. పాలుట్ల రంగస్వామి ఆలయ రహదారి పనులు ఎందుకు నిలిచిపోయాయో టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టకపోగా కనీసం రహదారులు గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి నెలకొందన్నారు. ‘వాటర్ గ్రిడ్’ ప్లాంట్ వరకు పాదయాత్ర బేతంచెర్ల పట్టణం నుంచి బుగ్గానిపల్లె మీదుగా బుగ్గానిపల్లె తండా సమీపంలో ఉన్న వాటర్ గ్రిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బుగ్గన పాదయాత్ర నిర్వహించారు. అక్కడ ట్రిట్మెంట్ ప్లాంట్ను సందర్శించి, నీటి శుద్ధి ప్రక్రియ, సరఫరాపై సిబ్బందితో చర్చించారు. పాదయాత్రలో బేతంచెర్ల పట్టణవాసులతో పాటు బుగ్గానిపల్లె, బుగ్గానిపల్లె తండా వాసులు పాల్గొన్నారు. నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, డోన్ ఎంపీపీ రాజ శేఖర్ రెడ్డి, మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, నాయకులు మెట్టు వెంకటేశ్వర్రెడ్డి, మూర్తుజావలి, బాబురెడ్డి, ఖాజాహుసేన్, రామచంద్రుడు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుడి రౌడీయిజం!
● పేరూరులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి ● ఓ మహిళకు గాయాలు రుద్రవరం: అధికారంలో ఉన్నామనే అహంకారం.. దాడులకు పాల్పడటం.. మహిళలను సైతం బెదిరించడం.. రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో ఒక టీడీపీ నాయకుడి రౌడీయిజాన్ని చూసి ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపతిరెడ్డి ఇంటిపై టీడీపీ నాయకుడు రామ్నాథ్రెడ్డి దాడి చేశాడు. తిరుపతిరెడ్డి కోడలిని గాయ పరచాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామంలో టీడీపీ నాయకుడి ఆగడాలకు అంతేలేదు. గత కొద్ది రోజులుగా పేద దళితుడి సాగు భూమిని ఆక్రమించి మట్టి తవ్వకాలు సాగించాడు. మరో రైతు పొలంలో మట్టిని అక్రమంగా తరలించాడు. రైతులందరూ వెళ్లే రహదారి తమ పొలంలో ఉందంటు దున్నేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగించాడు. తాజాగా తిరుపతిరెడ్డి వారి అన్నదమ్ముల పట్టా పొలంలో తన పొలానికి దారి ఉందని మట్టి తోలించాడు. ఇదేమని అడిగి.. వైఎస్సార్సీపీ నాయకుడు ఆ మట్టిని తొలగించాడు. ఆ కక్షతో టీడీపీ నాయకుడు వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడి చేశాడు. ఆ దాడిలో ఓ మహిళ గాయపడింది. వెంటనే వైఎస్సార్సీపీ నాయకులు రుద్రవరం పోలీస్ష్టేషన్కు వెళ్లి టీడీపీ నాయకుడు రామ్నాథ్రెడ్డిపై ఫిర్యాదు చేశారు. -
మరిన్ని విజయాలు సాధించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: విద్యార్థులు ఒక విజయం వద్దే ఆగిపోకుండా, మరిన్ని సాధించాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ వా ర్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశంసాపత్రాలు, మెమెంటోలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ.. పిల్లల విజయాల వెనుక తల్లిదండ్రులు అందించిన సహకారం, ఉపాధ్యాయు ల మార్గదర్శకత్వం అమూల్యమన్నారు. రూ. 7 కోట్ల టోకరా! ● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్లో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో దాదాపు 700 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పద్మావతినగర్లో పట్టణానికి చెందిన ముల్లా ఇమ్రాన్, వెంకట మధుసాయి, విఘ్నేష్లు ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. సీఆర్ కాలింగ్ సంస్థ పేరుతో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 700 మంది నిరుద్యోగులను చేర్చుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం మానేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీని కలిసి తమగోడును చెప్పుకుని, కంపెనీ నిర్వాహకులకు తాము ఇచ్చిన నగదు ఇప్పించాలని కోరారు. శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్గా చంద్రశేఖర్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్గా చంద్రశేఖర్ని దేవాదాయ శాఖ నియమించింది. ఈ మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంద్ర శేఖర్ ప్రకాశం జిల్లా మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మాలకొండ దేవస్థానం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. తహసీల్దార్, వీఆర్వోపై విచారణ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తహసీల్దార్ రత్నకుమారి, వీఆర్వో వెంకటనరసయ్యపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు వైఎస్సార్సీపీ మేధావివర్గం కన్వీనర్ డాక్టర్ శీలం సురేంద్రనాథరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడితో తహసీల్దార్, వీఆర్వోలు రికార్డులు పరిశీలించకుండా రామేశ్వర్రెడ్డి అనే వ్యక్తి పొలంలో కోయాల్సిన వరి పంటను పక్కనున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అయిన శీలం సుధామణి పొలంలో కోయించడం జరిగిందన్నారు. పక్క పొలంలో కోయడంతో పాటు అందులో 65 బస్తాల దిగుబడి వస్తే కేవలం 35 బస్తాలు వచ్చిందని రికార్డుల్లో నమోదు చేశారన్నారు. దీనిపై తహసీల్దార్ను ఎన్ని సార్లు సంప్రదించినా సరైన సమాధానం చెప్పక పోవడంతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూసర్వే కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో తహసీల్దార్, వీఆర్వోలపై విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని స్థానిక ఆర్డీఓకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని సురేంద్రనాథ్రెడ్డి తెలిపారు. 10న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.వి.రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించనున్న సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పాఠశాల విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు. -
70 ఏళ్ల తర్వాత..
● తమ్మడపల్లెలో ఘనంగా పెద్దమ్మ దేవర మహానంది: పది కాదు, ఇరవై కాదు.. ఏకంగా 70 ఏళ్ల తర్వాత తమ్మడపల్లె గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవరను వైభవంగా నిర్వహించారు. గ్రామంలో కొలువుదీరిన పెద్దమ్మ తల్లిని బుధవారం వేలాది మంది దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 1956 తర్వాత గ్రామంలో దేవర జరగక పోవడంతో గ్రామస్తులందరూ చర్చించుకుని దేవరను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కోలాటం, చెక్కభజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు పెద్దమ్మ తల్లీ.. ఆశీర్వదించవమ్మా.. అంటూ ప్రణమిల్లారు. వేలాది మంది బంధుమిత్రులు తరలిరావడంతో తమ్మడపల్లె గ్రామం కిటకిటలాడింది. రెండు రోజుల్లో గ్రామం మొత్తం మీద సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చైనట్లు ప్రాథమిక సమాచారం. ఇంటింటికీ పిలుచుకున్న బంధుమిత్రులతో పండగ వాతావరణం నెలకొంది. తిరుగుప్రయాణంతో నంద్యాల – మహానంది రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనం ముందుకు కదలాలంటే కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, ఏఎస్ఐలు, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధ్దీకరించి ఇబ్బందులు లేకుండా చేశారు. -
స్వలాభం కోసం అడ్డుకోవడం దుర్మార్గం..
స్వచ్ఛమైన మంచి నీరు ప్రజలకు అందించే మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని స్వలాభం కోసం టీడీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గం. ప్రజలకు అత్యంత ప్రయోజనం కల్గించే ఇలాంటి పథకాలను కూడా ఆదాయపు వనరులుగా చూడడం దురదృష్టకరం. టీడీపీ దుర్మార్గపు పాలనను అంతం చేసే రోజు త్వరలో వస్తుంది. – పిట్టల జాకీర్, బేతంచెర్ల పట్టణం టీడీపీ నాయకులు మామూళ్లకు కక్కుర్తి పడి పనులను అడ్డుకున్నారు. లేకపోతే ఈ ఏడాది స్వచ్ఛమైన తాగు నీరు ప్రజలకు అందేది. నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 20 శాతం పనులను కూడా రెండేళ్లల్లో పూర్తి చేయలేకపోవడం టీడీపీ పాలకుల అసమర్ధతకు నిదర్శనం. అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజల గొంతెండుతున్నా పాలకులకు కనికరం లేదు. – మల్లి రెడ్డి, బేతంచెర్ల పట్టణం ఈ ఏడాది కూడా వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయకపోవడాన్ని చూస్తే టీడీపీ నాయకుల చిత్తశుద్ధి తేటతెల్లమైంది. కొండమీది పల్లెల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో గుక్కడి నీటి కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజల గోడు పట్టని టీడీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠంనేర్పుతారు. – మెట్టు వెంకటేశ్వరెడ్డి, వైఎస్సార్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి● -
బెదిరింపులకు భయపడేది లేదు!
నంద్యాల(అర్బన్): చిల్లర పనులు, బెదిరింపులకు భయపడేదే లేదని వైఎస్సార్సీపీ శ్రీశైలం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ మూకలు దాడి చేయడంపై శిల్పా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని శిల్పా స్వగృహంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. తనను, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడి దాడులకు ఉసిగొల్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిపై జిల్లా కలెక్టర్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిక్కతిక్క చేష్టలు చేస్తే భయపడేది లేదన్నారు. బుడ్డా ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ‘నీ కథ చూస్తా’మంటూ బెదిరించే విధంగా మాట్లాడతారని, ఆయన బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. తాను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో పదవులు చేశానని, ప్రజలకు సేవ ఎలా చేయాలో తనకు తెలుసు అన్నారు. సున్నిపెంటలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వచ్చిన జనాలను చూసి ఓర్వలేక బుడ్డా ఇష్టారీతిగా దూషించడం మొదలు పెట్టారన్నారు. వైఎస్సార్సీపీలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భయపడి నాలుగున్నరేళ్లు నియోజకవర్గం వదిలి వెళ్లిన బుడ్డాకు ఈ రోజు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీ కార్యాలయంపై రాళ్లు వేయిస్తే భయపడతామనుకోవద్దన్నారు. చిల్లర రాజకీయాలు చేయం.. ఆత్మకూరులో జరిగిన సంఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సంయమనంతో ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. కలెక్టర్ సమక్షంలోనే బుడ్డా రాజశేఖర్రెడ్డి అసభ్య పదజాలం మాట్లాడటం దారుణమన్నారు. శిల్పా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ తగ్గేది లేదన్నారు. శిల్పా కుటుంబానికి ప్రజలకు సేవ చేయడమే తెలుసు కానీ, చిల్లర రాజకీయాలు చేయడం తెలియదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెడుతున్నా ప్రజా తీర్పును గౌరవించి సహనంతో ఎదుర్కొంటున్నామన్నారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని కూటమి కార్యకర్త ధ్వంసం చేసి ఆ సంఘటనను ప్రజల్లోకి వెళుతుంటే జీర్ణించుకోలేక టాపిక్ డైవర్ట్ చేయడానికి టీడీపీ నాయకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి ప్రజలకు ఏవిధమైన మెసేజ్ ఇవ్వాలనుకున్నారో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైఎస్సార్సీపీ వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు..ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణంలోని శిల్పా చక్రపాణిరెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. సంఘటనను తెలుసుకున్న శిల్పాచక్రపాణిరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డిలు ఆత్మకూరుకు కార్యకర్తలతో కలిసి వెళ్లడానికి బయల్దేరే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శిల్పా స్వగృహానికి రాత్రి 8 గంటల సమయానికి దాదాపు 1000 మందికిపైగా చేరుకున్నారు. నంద్యాల పోలీసులు శిల్పా స్వగృహానికి చేరుకొని ఆత్మకూరుకు వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. చివరకు నంద్యాలలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్తామన్నా పోలీసులు అనుమతించ లేదు. సున్నిపెంట అఖిలపక్ష సమావేశానికి జనాదరణ ఓర్వలేకనే దాడులు బుడ్డాపై సుమోటో కేసు నమోదు చేయాలి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
నార్మలైజేషన్తో ఉద్యోగం రాలేదు
నార్మలైజేషన్ పద్ధతితో నాకు ఉద్యోగం రాలేదు. ఎస్జీటీలో 75.35 మార్కులు వచ్చినా ఉద్యోగం రాకపోవడానికి కారణం నార్మలైజేషన్. పదేళ్లు కష్టపడి చదివినా నార్మలైజేషన్తో 0. 4 పాయింట్లతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. పాత పద్ధతిలో ఒకే రోజు ఒకే పేపర్ విధానంలో డీఎస్సీ పరీక్ష పెట్టింటే నాకు ఉద్యోగం తప్పని సరిగా వచ్చేది. – శ్రీనివాసులు, నందికొట్కూరు నేను ఎంఏ, బీఈడ్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డీఎస్సీ–2025 పరీఓలు రాసినా చివరకు ఎంపిక కాలేకపోయా. ప్రస్తుతం డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో నేను బాధపడుతున్నా. ప్రతిభ, కష్టానికి గుర్తింపు దక్కాల్సిన చోట అవకతవకలు జరగడం అన్యాయం. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. – జీ.సాదిక్ బాషా (ఎంఏ., బీఈడ్), వెలుగోడు ●దగా డీఎస్సీ -
పైపులైన్ పనులు వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ఇండిస్ట్రియల్కు నీటి సరఫరా పైపులైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన పైపులైన్ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనులు ఎందుకు జాప్యం జరుగుతున్నాయని వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశ్రామిక, ప్రజలకు తాగునీరు అవసరాల దృష్ట్యా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ పనులు చేపట్టామన్నారు. పనులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించి నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీఐఐసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా వేసిన అక్రమ వెంచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటిముంపు నిరుద్యోగులు జిల్లా కలెక్టర్ను కలిసి 70 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ వెంట ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ వెంకట శివ, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరెడ్డి, టీపీఓ రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.5 లక్షల విరాళం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విజయవాడ పట్టణానికి చెందిన న్యూ ఎలక్ట్రిసీటి కాలనీ పటమటకు చెందిన శీలందేవి వివేకానంద, పద్మజ కుటుంబ సభ్యులు రూ.5.05 లక్షల విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. విరాళం మొత్తంలో రూ. 4,50,005 ఆలయ అభివృద్ధికి, మరో రూ.50 వేలు అన్నదానానికి అందజేశారన్నారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులను సన్మానించి, అమ్మవారి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మహానంది: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవుని మనుగడ కష్టమవుతుందని అటవీశాఖ నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం సీడ్ బాల్స్ డిస్పర్సల్ క్యాంపెయిన్ నిర్వహించారు. డీఆర్ఓ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే చెట్లను పెంచడమే ఏకై క మార్గమన్నారు. అందులో భాగంగానే సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు రామకృష్ణ, తేజ, ఎఫ్బీఓలు పరమేశ్వరీ, బలరాముడు పాల్గొన్నారు. నవచేతన యాప్తో చిన్నారుల్లో లోపాల గుర్తింపు నంద్యాల(అర్బన్): నవ చేతన యాప్తో చిన్నారుల్లో లోపాలను గుర్తించవచ్చని జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి లీలావతి దేవి తెలిపారు. చిన్నారుల సమగ్రాభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు నవచేతన ఏఐ యాప్ ఉపయోగపడుతుందన్నారు. స్థానిక కార్యాలయంలో బుధవారం యాప్పై సీడీపీఓలు, సూపర్వైజర్లకు రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ.. 0–6 వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలు రాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశమన్నారు. మూడు పద్ధతుల్లో స్క్రీనింగ్ చేసి 21 రకాల లోపాలను గుర్తించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ కాంతరావునాయక్, డాక్టర్లు మహమ్మద్ అలియాస్ పాల్గొన్నారు. జీవో 207ను రద్దు చేయాలి చాగలమర్రి: నూనెపల్లి మార్కెట్యార్డు పరిధిలోని సుమారు రెండెకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 207ను వెంటనే రద్దు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల అవసరార్థం కేటాయించిన భూములను ఏడాదికి రూ.1000 చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన నంద్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఆయన చాగలమర్రిలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు మార్కెట్ యార్డు భూములను రైతుల అవసరాలకు, గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ సంబంధిత సౌకర్యాలకు మాత్రమే కేటాయించాలన్నారు. ఆయన వెంట కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు అంకాల్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు పాములేటి, మాజీ సర్పంచ్ నారాయణ, రైతులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
బొమ్మలసత్రం: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన ఈ ముఠా నుంచి భారీ నగదు, కారు, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాలలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డోన్ పట్టణంలో ఏప్రిల్ 20వ తేదీ తెల్లవారుజామున ఐటీసీ సిగరెట్ గోడౌన్లో భారీ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు డోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డోన్, సీసీఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా దొంగల కదలికలపై నిఘా ఉంచారు. డోన్ –గుత్తి జాతీయ రహదారిలోని రుద్రాక్షగుట్ట వద్ద అనుమానంతో మారుతి స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో రాజస్థాన్కు చెందిన లక్ష్మణ్రామ్ కుమావత్, గన్ శ్యామ్ అలియాస్ గణ్పత్, మానక్ చంద్ కుమావత్లున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఐటీసీ సిగరెట్ గోడౌన్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. సిగరెట్ కార్టన్లను హైదరాబాద్లో విక్రయించినట్లు తెలిపారు. దీంతో పై నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 14 లక్షల నగదు, కారు, 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన ఈ ముగ్గురు దొంగలపై తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పదుల సంఖ్యలో చోరీ కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. చోరీ కేసును ఛేదించిన డోన్ సీఐ ఇంతియాజ్ బాషా, సీసీఎస్ సీఐ సురేష్కుమార్, ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, నరేంద్రకుమార్, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రూ.14 లక్షల నగదు, కారు, నాటుసారా స్వాధీనం ఏప్రిల్నెలలో డోన్ పట్టణం ఐటీసీ గోడౌన్ చోరీ రాజస్థాన్కు చెందిన ముగ్గురు దొంగలు అరెస్ట్ -
కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
● రెండేళ్లు గడిచినా టీడీపీ ప్రభుత్వం ఒక్కటీ పూర్తి చేయలేదు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: విపక్ష పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలో చూపే శ్రద్ధ అభివృద్ధి పనులపై టీడీపీ ప్రభుత్వం చూపడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డోన్ నియోజకవర్గంలో ప్రారంభించిన కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనుల్లో ఒక్కటి కూడా టీడీపీ ప్రభుత్వం రెండేళ్లయినా పూర్తి చేయలేకపోయిందన్నారు. మంగళవారం ఉదయం దివంగత మాజీ ఎమ్మెల్యే బుగ్గన శేషారెడ్డి మార్గ్లో వాకర్స్తో కలిసి బుగ్గన గంట పాటు మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్తో మాట్లాడుతూ.. రైల్వే అండర్ పాస్, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్, హార్టికల్చర్, అంబేడ్కర్ గురుకుల ఆశ్రమ పాఠశాల భవనాలను మంజూరు చేయించినా టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వ్యయం చేసి నిర్మించిన రిజిస్ట్రార్ కార్యాలయం, క్లబ్ హౌస్, ఎంపీడీఓ కార్యాలయం భవనాలు ప్రా రంభోత్సవానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రెండేళ్లలోనే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాసేపు చిన్నారులతో.. బుగ్గన మార్గ్లోని పాత బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు గత ప్రభుత్వ హయాంలో కి.మీ. పొడవున నిర్మించిన రోడ్డుపై చిన్నారులు స్కేటింగ్ చేస్తూ తనను విష్ చేయడాన్ని గమనించిన మాజీ మంత్రి బుగ్గన వారి వద్దకి వెళ్లి పలకరించారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్డుపై తాము స్కేటింగ్ నేర్చుకుంటున్నామని పలువురు చిన్నారులు బుగ్గనతో అన్నారు. వారి కోరిక మేరకు గ్రూప్ ఫొటో దిగారు. బుగ్గన వెంట జిల్లా బీఎల్ఏల ఇన్చార్జ్ ఎద్దుల రాజేంద్రనాథ్రెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్ కుమార్, పార్టీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, మున్సిపల్ మాజీ ౖచైర్మన్ సప్తశైల రాజేష్, మాజీ వెస్ చైర్మన్ జాకీర్ హుసేన్, పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, యువజన విభాగం నాయకులు ఆర్ఈ రాజవర్ధన్, క్యాలిటీ అబ్దులా, వంశీ, ఆర్ట్ రమణ, రాజా మహేష్, చంద్ర, వెంకటేష్, రఘురాం తదితరులు ఉన్నారు. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు!
● మా స్థలాన్ని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు ● పురుగు మందు, పెట్రోల్తో ఓ కుటుంబం ఆందోళన నందికొట్కూరు: తమ మూడు సెంట్ల స్థలాన్ని తెలుగు దేశం పార్టీ 5వ వార్డు నాయకుడు అబ్దుల్లా కబ్జా చేశాడని బైరెడ్డి శేషాశేనాయనరెడ్డి నగర్కు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. మంగళవారం కబ్జాకు గురైన స్థలం వద్ద తమకు న్యాయం చేయాలని పురుగు మందు, పెట్రోల్ బాటిల్తో బాధితులు శేషారాంసింగ్, భార్య మీరాబాయ్ ఆందోళనకు దిగారు.. తమ స్థలం కబ్జా చేయడమే కాకుండా అక్కడికి వస్తే చంపేస్తానని అబ్దుల్లా బెదిరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అతనితోపాటు మరికొందరు టీడీపీ నాయకులు రసూల్, జమీల్ కూడా బెదిరిస్తున్నారన్నారు. తమ వద్ద ఒరిజనల్ పట్టాలు ఉండటంతో కోర్టును ఆశ్రయించామన్నారు. తీర్పు ఎవరికీ వస్తే వారికే ఆ స్థలం దక్కుతుందని, అప్పటి వరకు పోలీసులే తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు స్థలం కోర్టు పరిధిలో ఉందని ఏర్పాటు చేసిన బోర్డును టీడీపీ నాయకులు తొలగించారన్నారు. కోర్టు, పోలీసుల ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టీడీపీ నాయకులు దౌర్జన్యంగా బెదరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద ఉన్న పురుగు మందు బాటిల్ లాగేశారు. శేషారాంసింగ్ భార్య మీరాబాయ్ పెట్రోల్ పోలీసుల ఎదుటే పోసుకోవడంతో అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టిన బాధితులను పోలీసు స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇంటికి పంపించారు. -
అర్జీదారులతో నేరుగా..
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కార సంతృప్తి స్థాయిని స్వయంగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం కలెక్టర్ చాంబర్ నుంచి నలుగురు అర్జీదారులు టెలిఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకత, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ ఆక్రమణలు, రికార్డ్ ఆఫ్ రైట్స్ నమోదు లోపాలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ పెన్షన్, వాగు పోరంబోకు భూముల ఆక్రమణ తదితర అంశాలపై అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని అర్జీదారుల నుంచే నేరుగా తెలుసుకున్నారు. భూ ఆక్రమణ ఫిర్యాదుకు సంబంధించి డిప్యూటీఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ద్వారా స్థల సర్వే నిర్వహించి హద్దులు, కొలతలు చూపించడంతో సమస్య పరిష్కారమైందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ పెన్షన్ అంశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత లేకపోవడంతో పెన్షన్ మంజూరు సాధ్యం కాదని అధికారులు స్పష్టంగా వివరించినట్లు అర్జీదారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును నిర్దేశిత కాలపరిమితిలో నాణ్యమైన పరిష్కారంతో ముగించాలన్నారు. పంటల సాగు ఆధారంగా ఎరువుల పంపిణీ నంద్యాల(అర్బన్): ఖరీఫ్ సీజన్ 2025 పంట కాలంలో నమోదు చేసిన పంటల ఆధారంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సంబంధిత సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని సంప్రదించి వారి వివరాలు ఏపీఏఐఎంఎస్ యాప్లో పొందు పరుచుకొని ఎరువులను పొందవచ్చన్నారు. ప్రైవేటు డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు పొందాలంటే రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా ప్రైవేటు డీలర్ల వివరాలు పొందు పరిస్తే ఎరువులు పొందవచ్చని సూచించారు. ఎకరాకు కనీసం మూడు బస్తాల చొప్పున ఎరువుల విక్రయాలు ఉంటాయని, దఫాల వారీగా మూడు విడతల పద్ధతి ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. -
నల్లకాల్వ ఊట చెరువులో అక్రమ తవ్వకాలు
● టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మొరుసు తరలింపు యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామ ఊట చెరువులో మంగళవారం అక్రమ తవ్వకాలు జరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. టిప్పర్, ప్రొక్లెయిన్తో చెరువు వద్దకు చేరుకున్న వారిని యువకులు, క్రీడాకారులు అడ్డుకుని ప్రశ్నించారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయ భవనం కోసం మొరుసు తీసుకెళ్తున్నామని వారు చెప్పడంతో.. అనుమతులుంటే చూపాలని పట్టుబట్టారు. అయితే ఇంతలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు అక్కడికి వచ్చి ట్రిప్పర్లు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే చెరువులో ఒకటిన్నర అడుగుకు మించి పూడిక మన్ను తీయరాదని అది కూడా గ్రామ పంచాయతీ అనుమతి మేరకు తగిన రశీదు పొంది పంట పొలాలకు రైతులకు మాత్రమే ఆ హక్కు ఉందని గ్రామస్తులు చెప్పినప్పటికీ టీడీపీ నాయకులు దౌర్జన్యంగా మట్టి తరలించేందుకు యత్నించారు. గ్రామస్తులు మిషన్కు అడ్డుగా కూర్చోవడంతో వారు చేసేది లేక అధినాయకులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకుంటే జరగబోయే ఇబ్బందులు గ్రాస్తులకు వివరించి 20 ట్రిప్పర్లు మొరుసు తీసుకు పోయేలా పంచాయితీ చేసినట్టు తెలిసింది. గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న చెరువుపై టీడీపీ నాయకుల కన్ను పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో చెరువులోని మొరుసు (గ్రావెల్) అక్రమంగా తరలించేందుకు ఇది శాంపిల్ మాత్రమేనని చర్చించుకుంటున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్నగర్ గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యా ర్థిని సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సుప్రియ (17) ఆదోని మండలంలోని ఆరెకల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రు లు వివాహసంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురై సుప్రియ ఇంటిపైన ఉన్న గదిలో ఫ్యానుకు చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చూస్తూ ఊరుకోం
శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు నిరుద్యోగుల బాధ పట్టడం లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టును మంత్రి లోకేష్ బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది సచివాలయ ఉద్యోగాల ప్రక్రియను ఎటువంటి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించారన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, అభ్యర్థుల పక్షాన నిలిచి చివరి వరకు పోరాటం చేస్తుందన్నారు. -
యూరియాకు ‘యాప్’సోపాలే..
చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. 2024–25, 2025–26 సంవత్సరాల్లో రైతులను యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ సారి ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను విక్రయించాలని నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్లో 2025–26 సంవత్సరానికి సంబంధించి ఈ–క్రాప్ డేటా ఉంటుంది. ఈ సారి కూడా అదే పంట వేస్తే ఎన్ని బ్యాగుల యూరియా అవసరం అనేది ఇట్టే తెలిసిపోతుంది. కొత్త పంటకు మారితే యూరియా ఎంత అవసరమనే రెకమెండేషన్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన యూరియా రెండు లేదా మూడు దఫాలుగా పంపిణీ చేస్తారు. డిమాండ్ మేరకు పంపిణీ చేయకుండా యాప్ పేరుతో షరతులు విధిస్తుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
మొరాయించిన సర్వర్
● అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీకర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమవుతోంది. సోమవారం చేపట్టిన జూన్ నెల పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్ మొరాయించడంతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. సర్వర్ సమస్యల వల్ల కర్నూలు నగరంతో పాటు పలు మండలాల్లో పంపిణీ ముందుకు సాగలేదు. ఇక ఎప్పటిలానే ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ నామమాత్రంగా జరిగింది. సర్వర్ సమస్యలను అవకాశంగా తీసుకొని సచివాలయాల్లోనే పంపిణీ చేశారు. అవ్వతాతలు, వికలాంగులు అతి కష్టం మీద వార్డు, గ్రామ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కర్నూలు నగరంలోని దేవనగర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వైపి రమణారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 87.07 శాతం, నంద్యాల జిల్లాలో 86.96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పింఛన్కు సర్వర్ కష్టాలు నందవరం: పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు కష్టాలు తప్పడం లేదు. మండల పరిధిలోని జొహరాపురం గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు శ్రీ దత్తత్రేయ మఠం వద్ద పింఛన్ పంపిణీ చేసే అధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు రాగానే 3 గంటల పాటు సర్వర్ పని చేకపోడంతో ఎండలో అవస్థలు పడ్డారు. ఆ తర్వాత సమస్య పరిష్కారం కావడంతో పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. -
రెవెన్యూ సమస్యలే అధికం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రాధాన్యతతో పరిగణించి, జాప్యానికి తావులేకుండా తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’’లో భాగంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి 1,508 ఫిర్యాదులు అందాయన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 387, సర్వే శాఖ పరిధిలో 150 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పాఠశాలల సమీపంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. తన పేరుపై ఉన్న పొలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చారని, చర్యలు తీసుకోవాలని నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీపుల్లయ్య అర్జీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినప్పటికీ స్థలాన్ని చూనపించడం లేదని నందికొట్కూరు మండలం పారుమంచల గ్రామానికి చెందిన ఎస్.మూర్తుజావళి ఫిర్యాదు చేశారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరు ఏర్పాటు చేయాలని ఎస్.అబ్దుల్ రసూల్ అనే వ్యక్తి అర్జీ ఇచ్చారు. -
గూడేల్లో ‘ఏసీఎం’ పిచికారీ
శ్రీశైలం ప్రాజెక్ట్: మలేరియా, డెంగీ, గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా గిరిజన గూడేల్లో ఏసీఎం (ఆల్ఫా సైఫర్ మెత్రిన్) 5 శాతం మందును పిచికారీ చేయాలని సిబ్బందిని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం మలేరియా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నిర్మూలనకు సిబ్బంది పనిచేయాలన్నారు. మలేరియా శాఖ అధికారులు సత్యనారాయణ, కృష్ణారెడ్డి, విజయకుమారి, రామలింగారెడ్డి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. విద్యార్థినికి అభినందన బేతంచెర్ల: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు గాను 97 మార్కులు సాధించి బుగ్గానిపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థిని చైత్ర జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో ఎంఈఓ –2 అబ్రహం, ఉపాధ్యాయులు, విద్యార్థిని అభినందించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు. దరఖాస్తు చేసుకోవాలి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పనిచేస్తున్న వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ రెగ్యులర్కు దరఖా స్తు చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవోనం.7 స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉత్తర్వుల ప్రకారం పెన్షనరీ బెనిఫిట్స్ మంజూరు విషయమై దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కూడిన ధ్రువపత్రాలను ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈనెల 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. గడువు దాటిన తర్వాత స్వీకరించబోవని తెలిపారు. మరో మూడురోజుల్లో మరమ్మతులు పాణ్యం: కుంగిన గోరుకల్లు కట్టకు మరో మూడు రోజుల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు ఈఈ భవానీప్రసాద్రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వచ్చాయని, రూ. కోటితో మరో మూడు రోజుల్లో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కుంగిన కట్ట ప్రదేశంలో పనుల చేసి నీటి నిల్వకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. రిజర్వాయర్ బండ్ పనులకు సంబంధించి ఆదేశాలు త్వరలోనే ఉన్నతాధికారుల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. నాణ్యతతో విత్తన ప్రాసెసింగ్ నంద్యాల(అర్బన్): అత్యంత నాణ్యతతో విత్తనాలు ప్రాసెసింగ్ చేయాలని విత్తన శుద్ధి కేంద్రాల యజమానులకు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. తన కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకింగ్ చేసే సమయంలో ఒక రకంలో ఇంకోరకం విత్తనాలు కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన రకాలను మాత్రమే ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. కోవెలకుంట్ల ఏడీఏ సుధాకర్, నంద్యాల ఏఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మకాలకు ‘నంద్యాల సోనా’ విత్తనం నంద్యాల(అర్బన్): స్థానిక ఆర్ఏఆర్ఎస్లో ఎన్డీఎల్ఆర్–7(నంద్యాల సోనా) పునాది విత్తనం అమ్మకాలకు సిద్ధంగా ఉందని ఏడీఆర్ జాన్సన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3 నుంచి 289 క్వింటాళ్ల విత్తనం అమ్మకాలకు సిద్ధంగా ఉంచామని, 25 కేజీల విత్తనం సంచి రూ.1,250తో అమ్మకాలు జరగనున్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలకు 9989625208, 9966665434 నంబర్లను సంప్రదించాలన్నారు. -
‘విత్తు’కోని ఆశలు.. పొలాల నిండా కష్టాలు!
● గతంలో ఎప్పుడూ లేనంత పెట్టుబడి సమస్య ● పంట రుణాల పంపిణీలో బ్యాంకుల నిర్లక్ష్యం ● ఎల్నినో ప్రభావంతో జాడలేని రుతుపవనాలు ● అప్పుడే మొదలైన యూరియా కొరత ● ఈసారి యాప్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లుకర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ఆరంభానికి ముందే యూరియా సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతీగతీ లేని విత్తన పంపిణీ, పెట్టుబడి కష్టాలతో రైతులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు వర్షపు చినుకే లేని మండలాలు ఉమ్మడి జిల్లాలో 46 ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి చేయూత లేకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది అధిక వర్షాలతో కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు నిరాశజనకంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం కొద్ది నెలలుగా హెచ్చరిస్తోంది. ఇదిలాఉంటే ఖరీఫ్ రైతులను పెట్టుబడుల సమస్య వేధిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు ఖరీఫ్ సీజన్కు ముందే వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం విడుదల చేస్తుండటం రైతులకు ఊరటనిచ్చింది. అంతేగాక ఉచిత పంటల బీమా పరిహారం కూడా ఖరీఫ్ సీజన్కు ముందే విడుదల చేస్తుండటం రైతులకు పెట్టుబడి కష్టాలను దూరం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైనప్పటికీ మొదటి ఏడాది సూపర్–6లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లించడంలో చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరంలో అమలు చేసినప్పటికి తూతూ మంత్రంగానే అమలు చేసింది. ఇక కౌలుదారులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంకెల్లోనే పంట రుణాల పంపిణీ పంట రుణాల పంపిణీ అంకెల గారిడీకే పరిమితమవుతోంది. 2025–26 ఖరీఫ్లో రూ.3,635.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.4213.03 కోట్లు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. 2026–27లో రూ.4,241.54 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. పాత రుణాలను రెన్యూవల్ చేయడం మినహా కొత్త రుణాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. బ్యాంకులు సహకరించకపోవడం, ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. విత్తన సమస్య ఖరీఫ్ సీజన్లో మొత్తం 6,87,441హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు.. నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్న, మినుము, కంది, పత్తి సాగు చేయనున్నారు. కొద్ది రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కానీ విత్తన సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచి ఆర్బీకే స్థాయిలోనే విత్తనాల పంపిణీ జరిగింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇదే సమయంలో పత్తిలో నకిలీ విత్తనాలు, విత్తన ప్యాకెట్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. హెచ్టీ పత్తి విత్తనాలకు అనుమతి లేకపోయినప్పటికీ మార్కెట్లో విచ్చలవిడగా లభిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ఎల్నినో ఎల్నినో రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ మొదలైనప్పటికీ ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. వర్షాలు ప్రతి నెల సాధారణం కంటే అతి తక్కువగా నమోదయ్యే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా మే నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు విస్తరించాలి. ఈ పాటికి తొలకరి మొదలవ్వాలి. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు చురుకుతనాన్ని కోల్పోయాయి. గాలిలో తేమ తగ్గిపోయింది. ఇందువల్ల వడగాలులు తీవ్రత కొనసాగుతోంది. ఈ సారి ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న సాగు కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పంట కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా (హెక్టార్లలో) (హెక్టార్లలో) వరి 13,343 70,201 మొక్కజొన్న 6,143 61,615 కంది 42,719 38,192 పత్తి 2,39,774 15,165 మినుము --- 10,188 ఉల్లి 19,242 4,583 వేరుశనగ 44,308 8,694 మిర్చి 37,642 12,028 -
ఎంపీడీఓలుగా ఇద్దరికి పోస్టింగ్స్
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్/ మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా విధులు నిర్వహిస్తు ఇటీవలే ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఇద్దరికి ఆదివారం మండలాలు కేటాయిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. జెడ్పీ ఏఓగా పనిచేస్తున్న కేవీ నాగేంద్రప్రసాద్ను ఎంపీడీఓగా మద్దికెరకు, ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ఏఓ సయ్యద్ ఉమర్ను హొళగుంద ఎంపీడీఓగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించడంలో ఎంపీడీఓలు ముందుండాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. జెడ్పీలోని చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దగా డీఎస్సీపై నేడు వైఎస్సార్సీపీ నిరసన నంద్యాల(అర్బన్): దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నూనెపల్లె నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి దగా డీఎస్సీపై కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బెలుం గుహల సందర్శన ప్రియం కొలిమిగుండ్ల: పర్యాటక శాఖ బెలుం గుహ ల సందర్శన టికెట్లను ధరలను పెంచేసింది. గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.50 ధర ఉండేది. పెంచిన రేట్ల ప్రకారం పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.70 చొప్పున పెంచినట్లు గుహల యూనిట్ మేనేజర్ కిషోర్ తెలిపారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేట్లు పెంచామన్నారు. గుహలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు శని, ఆదివారాలతో పాటు సెలవుల్లో అత్యధికంగా వస్తుంటారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల కంటే గుహల నుంచి ఆదాయం అధికంగా వస్తుంటుంది. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల(అర్బన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 1వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని mee kosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. -
పోలీసులు ఎందుకు రాలేదు..
పట్టపగలు.. పట్టణ నడిబొడ్డున దాదాపు 20 నిమిషాలకు పైగా వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నా కూత వేటు దూరంలో ఉన్న పోలీసులు ఎందుకు రాలేదు అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రశ్నించారు. జనసేన కార్యకర్త చాకలి జములయ్య దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం తలభాగాన్ని వేరు చేసి చేత్తో పైకెత్తి రాక్షాసానందం పొందడం చూస్తుంటే కూటమి నేతలు ఎంతకు తెగించారో అర్థమవుతుందన్నారు. గత ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీలో కార్యకర్తగా పని చేసిన జంబులయ్య పార్టీ వీడి కూటమి పార్టీలో చేరాడని గుర్తు చేశారు. ఇందుకు సాక్షంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మిడియాలో ప్రచారం చేసుకున్నాడని వివరించారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్తో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో ఉందని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నటువ మనోహర్ (30) హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన భువనేశ్వరితో ఏడాదిన్నర క్రితం వావాహమైంది. శుక్రవారం రాత్రి హోటల్ పని ముగించుకుని భార్య పుట్టింటి వద్ద ఉండటంతో బైక్పై బయలు దేరాడు. మండలంలోని కంపమల్ల– గోవిందిన్నె ఆర్అండ్బీ రహదారిలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రివేళ ఆ రహదారిలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్డు ప్రమాద సంఘటనను ఎవరూ గమనించ లేదు. తెల్లవారుజామున అటుగా వెళుతున్న వాహన చోదకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్లు భావించి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కాసులకు కక్కుర్తి!
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే జిల్లాలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రోజుకో మార్గంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా 100కు 30 శాతం రీడింగ్ వస్తే మద్యం తాగినట్లు గుర్తించి వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి మరుసటి రోజు వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు కుమ్మక్కయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. కోర్టులో అపరాధ రుసుం రూపంలో కేవలం రూ.5 వేలు చెల్లించి రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై అంతర్గత విచారణ జరిపించి వాస్తవమని తేలడంతో నాలుగో పట్టణ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి కోర్టు కానిస్టేబుళ్లు రూ.5 వేలు స్వాహా చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ను స్వయంగా పిలిపించి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన వద్ద ఉన్న రూ.5 లక్షల వసూలు డబ్బుతో పాటు చలానా బుక్కును అప్పజెప్పి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా.. మద్యం తాగి పట్టుబడిన వారిని నిబంధనల ప్రకారం మరుసటి రోజు కోర్టులో హాజరుపరచాలి. అలా కాకుండా వారం రోజుల వరకు కేసులను పెండింగ్లో ఉంచుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు నగదు, ఆధార్ కార్డు తీసుకుని వారు కోర్టుకు రాకుండానే కానిస్టేబుళ్లే వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మద్యం తాగిన వ్యక్తిని కూడా కోర్టులో హాజరుపరచాలి. జేఎఫ్సీఎం కోర్టులో డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ.10 వేలు జరిమానా విధించేవారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి నాలుగు మాసాలకోసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని లోక్ అదాలత్ జరిగే నెలలో కొన్ని కేసులను హోల్డ్లో ఉంచి ఒకేసారి లోక్అదాలత్లో హాజరుపరచి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించి మద్యం బాబుల నుంచి మాత్రం రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిని ఓపెన్ డ్రింకింగ్లో పట్టుబడినట్లు చూపించి రూ.10 వేలు వసూలు చేసుకుని కోర్టులో రూ.వెయ్యి మాత్రమే జరిమానా చెల్లించి మిగతా డబ్బులు నొక్కేస్తున్నట్లు ఎస్పీ దృష్టికి వెళ్లింది. అలాగే ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులు విచారణ చేపట్టి రూ.3 వేలు అపరాధ రుసుం విధిస్తున్నారు. కోర్టు కానిస్టేబుళ్లు మాత్రం మందుబాబుల నుంచి రూ.10 వేలు వసూలు చేసి అందులో సగం నొక్కేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఇంకా దండుకున్న వారెందరో? పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన సిబ్బంది కాసులకు రుచిమరిగి డ్రంకెన్ డ్రైవ్ కేసుల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో నొక్కుడు వ్యవహారం బయటపడటంతో ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో జిల్లా పోలీసు శాఖలో కోర్టు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారందరిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ట్రాఫిక్ విభాగంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ కేసులో రూ.లక్షల్లో స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతమంది కోర్టు కానిస్టేబుళ్లు ఏళ్లుగా పాతుకుపోయి చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నిర్ణయించి జిల్లా అంతటా విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే వారికి పండగే! డ్రంకెన్ డ్రైవ్ కేసులంటే స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లకు పండగే. కోర్టుకు వెళ్తే శిక్షలు ఖాయమని మందుబాబులను బెదిరించి భారీగా దండుకుంటున్నారు. ఇలాంటి వసూలు రాజాలు కర్నూలు ట్రాఫిక్ స్టేషన్తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో హవా సాగిస్తున్నారు. రూ.10 వేలు వసూలు చేసి కోర్టులో రూ.5 వేలు చెల్లించి మిగతా మొత్తాన్ని నొక్కేస్తున్నారు. జప్తు చేసిన వాహనాలను వారికి అప్పగించేందుకు కూడా మరికొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే ఆ కేసులంటే వారికి ఉత్సాహం. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. నెలలో కనీసం ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 100కు పైగా డ్రంకెన్ డ్రైవ్, 150కి పైగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఆయా కేసుల్లో భారీగా స్కామ్ జరిగినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
రాష్ట్ర ఉత్తమ హెచ్డబ్ల్యూఓగా బెన్నమ్మ
కర్నూలు (అర్బన్): రాష్ట్ర ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధికారిణిగా నగరంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం నెంబర్–1 హెచ్డబ్ల్యూఓ బి.బెన్నమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, డైరెక్టర్ లావణ్య వేణి అవార్డును అందించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో అదే వసతి గృహంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఎ.రూప (960), ఎస్.లక్ష్మిదేవి (957)లను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం వసతి గృహ సంక్షేమాధికారిణి బెన్నమ్మ మాట్లాడుతూ.. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి జి.రాధిక, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి సలహాలు, సూచనలతో ప్రోత్సాహాన్ని అందించడంతో పలువురు విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇలాగే ప్రతి ఏడాది విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించేందుకు మరింత కృషి చేస్తామని చెప్పారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల (వ్యవసాయం): పేద, వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని మండల లీగల్ సెల్ చైర్మన్, మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అమ్మన్న రాజ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలు, గదులు, వంటశాలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి వారి ఆరోగ్యం, కేసుల గురించి వివరాలను తీసుకున్నారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే లీగల్ సెల్ హెల్ప్లైన్ 15100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గురు ప్రసాద్ రెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి విరాళం బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఆళ్లగడ్డ మండలం బాచాపురం గ్రామానికి చెందిన గజ్జల మధుమోహన్ రెడ్డి దంపతులు రూ.1.40 లక్షల విరాళం అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. దాతలకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, వేదపండితులు ఆశీర్వదించారు. ఉయ్యాలవాడలో వర్షం ఉయ్యాలవాడ: మండలంలో ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీస్తూ శనివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఈ ఏడాది మే నెల ప్రారంభమయినప్పటి నుంచి ఎండ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. గత నాలుగు రోజుల నుంచి మండలంలో 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతను భరించలేక గృహాల్లోనే ఇబ్బందులు పడ్డారు. తొలి సారిగా పలకరించిన వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. మరో వారం రోజుల్లో ఖరీప్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో వర్షం కురిసింది. దీంతో సాగుకు పొలాన్ని సిద్ధం చేసుకునేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి బనగానపల్లె రూరల్: బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని చంద్రబాబునాయుడు నగర్ ఎంపీపీ కస్బా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో డీఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ప్రభుత్వ బడుల్లో అత్యున్నతమైన విద్యా బోధనతో పాటు పాఠశాలల్లో చేరిన ప్రతి ఒక్కరికి ఉచిత పాఠ్యాపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్నభోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ స్వరూప, సమగ్ర సెక్టోరియల్ అధికారులు ప్రసన్నకుమార్, జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు సత్యప్రకాష్, ప్రతాప్, అబ్దుల్కరీం, సీఆర్పీలు సుధాకర్రావు, నాగచంద్రుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గోవింద.. గోవిందా!
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసి గోవింద నామస్మరణతో మార్మోగింది. పాములేటయ్య వారాలు ముగింపునకు వస్తున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
‘సర్’తో ఓట్ల తొలగింపునకు కుట్ర
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఒక్క ఓటు పోకూడదు ● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవెలకుంట్ల: రాష్ట్రంలో సర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడుతూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. బనగానపల్లె నియోజకవర్గం వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు శనివారం కోవెలకుంట్ల ఎఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు, కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, కోవెలకుంట్ల మండల కన్వీనర్ బీవీ నాగార్జున రెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు రోషిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గంలో 2,43,464 ఓట్లు ఉన్నాయని, సర్ పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రకు అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీఎల్ఏలు నిర్లక్ష్యం వహిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గానికి 20 వేల ఓట్లు తొలగించడానికి అవకాశం ఉందన్నారు. టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లను చేర్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలన్నారు. బీఎల్ఏలే పార్టీకి కీలకమని, 2029 ఎన్నికల్లో సీఎంగా జగనన్న అయిన తర్వాత కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తుచేశారు. జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా జూన్ నెలలో జరిగే సర్లో వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తుల ఓట్లను కాపాడుకోవాలని సూచించారు. ఓటు కీలమైనదని, గ్రామ నాయకులు బీఎల్ఏలను సమన్వయం చేసుకుని అధికార పార్టీ దొంగ ఓట్లును తొలగించడంలో చొరవ చూపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మెహన్ రెడ్డి, సంజామల మండల వైస్ ఎంపీపీ చిన్నబాబు, రాజశేఖర్ రెడ్డి, నాయకులు భీమిరెడ్డి పత్రాప్ రెడ్డి, రవీంద్రరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, హరినాథ్ రెడ్డి, రఘనాథ్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి, అన్నెం శివరామిరెడ్డి, రామన్న, వాయునంద గౌడు, తల్లెం సుబ్బు, దిల్క్ బాషా, అక్బర్ బాషా, మధుబాబు, సన్నల జనార్దన్ రెడ్డి, బత్తుల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండేళ్లలో ప్రజలకు ఒరిగింది శూన్యంరెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది శూన్యమని కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు సర్కార్ను పాతాళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగిందన్నారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపునకే పరిమితమైందన్నారు. మహానాడు కార్యక్రమంలో జగన్ నామస్మరణం తప్ప ఏమీ లేదని విమర్శించారు. అరాచకాలు, దౌర్జన్యాలలో బిహార్ను ఏపీ మించిపోయిందని కాటసాని ఆరోపించారు. -
క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యే నిఘా
సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులుకర్నూలు: ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మేవారిని, సేవించే వారిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో తనిఖీలు నిర్వహించాలన్నారు. లైంగిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. వారికి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఏడాది కాలంలో శిక్ష పడిన నేరస్తుల వివరాలు సేకరించి నిఘా కొనసాగించాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి మిస్సింగ్ కేసులు, చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీజీఎస్, సీసీటీవీ 360 అప్లికేషన్ ద్వారా వస్తున్న అలర్ట్లను ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. సీసీటీవీ ఏపీ 360 అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించాలని, 1930 సైబర్ హెల్ప్లైన్కు వచ్చిన కాల్స్పై వెంటనే స్పందించాలన్నారు. రూ.10 లక్షలకు పైగా జరిగిన సైబర్ మోసాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి నుంచి జరిమానాలు కోర్టుకు మాత్రమే చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సంవత్సరం క్రితం బదిలీ అయిన పోలీసు సిబ్బందిని పాత పోలీస్స్టేషన్లోనే కొనసాగించకుండా బదిలీల్లో వారికి కేటాయించిన స్టేషన్లలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
బండిఆత్మకూరు: భారీ ఈదురుగాలులకు మండలంలో పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈర్నపాడు, వెంగళరెడ్డి పేట, సోమయాజుల పల్లి పలు గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గాలీవానకు విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగి పడటంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం నుంచి విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్స్, సిల్వర్జూబ్లీ సెలబ్రేష న్స్ ఆఫ్ నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులకు అవార్డులు అందజేయనున్నట్లు, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయపాటి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుల విభాగాల్లో భాగంగా 10 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ 10 మంది రక్తదాతలకు ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ కార్ల్ లాండ్ స్టైనర్ మెమోరియల్ అవార్డు,10 కంటే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించిన 10 మంది స్వ చ్ఛంద సేవకులకు ల్యాండ్ స్టైనర్ బ్లడ్ డొనేషన్ ఇన్స్పిరేషన్ అవార్డు, ఉత్త మ స్వచ్ఛంద సేవకులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హ్యూమానిటీ సర్వీ సు అవార్డులకు ఎంపిక చేస్తారన్నారు.ఆసక్తిగల వారు జూన్4వ తేదీలోగా సంబంధిత ఫోటోలు,ప్రెస్ కటింగ్,బయోడేటా వివరాలతో వెంకటరమ ణ కాలనీ మొదటిలైన్లో ఉన్న నైస్ కంప్యూటర్ కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 93968 61308 నెంబర్లో సంప్రదించాలన్నారు. నంద్యాల(అర్బన్): ఈనెల 2న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ జిల్లాను సందర్శించనున్నారని ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్లో పాల్గొంటారన్నారు. షెడ్యూ ల్ కులాలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించదలచిన వారు కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వ రకు కలెక్టరేట్లో సంబంధిత జిల్లా, డివిజనల్, మండల, పో లీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. -
బ్లాక్ స్పాట్లను త్వరగా బాగు చేయండి
● రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ కర్నూలు(సెంట్రల్) : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్ స్పాట్లలో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లారోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెద్ద పాడు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిని లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాన్ని మునిసిపల్, ఆర్అండ్బీ, ఏపీఎస్ ఆర్టీసీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని చెప్పారు. పంచలింగాల టోల్గేట్ నుంచి వెల్దుర్తి వరకు, ఆదోని పట్టణంలో నూతన బైపాస్ రోడ్డు నుంచి మంత్రాలయం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను త్వరగా చేపట్టాలన్నారు. గత సమావేశాల్లో కర్నూలు నగర శివారులోని పిస్తా హౌస్ నుంచి ఉలింద కొండ వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని, ఆ పనులు ఎంత వరకు వచ్చాయని జాతీయ రహదారుల అధికారులను ప్రశ్నించారు. కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని మునిసిపల్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఉల్చాల జంక్షన్ అభివృద్ధికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి పనులు పూర్తయ్యాయని, సుందరీకరణలో భాగంగా చేపట్టిన గుంతలు పూడ్చే పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట ఆక్రమణలు తొలగించాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంటనే అనధికార అక్రమణలు, అక్రమ పార్కింగ్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 44 లో ఈనాడు కార్యాలయం నుంచి మిస్ట ర్ ఇడ్లీ వరకు సర్వీసు రోడ్లపై ఉన్న ఆక్రమణల తొలగింపున కు సంబంధించి మునిసిపల్, జాతీయ రహదారులు, రెవె న్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని నేషనల్హైవే డెప్యూటీ కలెక్టర్ను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డీటీసీ శాంతకుమారి, పీఆర్ ఎస్ఈ ప్రభాకరరరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరప్రసాదు, నేషనల్ హైవే స్పెషల్ డె ప్యూటీ కలెక్టర్ సునీత ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మగుడి, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. -
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించడానికి తరలి రావడంతో మద్దిలేటయ్య నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది. ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. -
మృత్యువును జయించి...
మంత్రాలయం: శుభకార్యానికి వచ్చి ఆనందంగా ఉన్న వారి ఇళ్లల్లో తుంగభద్ర నదీ స్నానం తీవ్ర విషాదాన్ని నింపింది. సత్యనారాయణ పూజకు వచ్చి ఐదుగురు గల్లంతయ్యారు. పిల్లవాడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మంత్రాలయానికి చెందిన కాళప్ప ఆచారి కుమారుడు శశికుమార్ వివాహం ఈ నెల 7న జరిగింది. వివాహం ముగియడంతో పూర్ణిమ సందర్భంగా కాళప్ప ఆచారి ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పూజ నిమిత్తం పలు ఊళ్ల నుంచి బంధువులు మంత్రాలయం వచ్చారు. శనివారం మధ్యాహ్నం కాళప్ప ఇంట్లో భోజనాలు ముగించుకుని ఆరుగురు బంధువులు పుణ్యస్నానాలకు తుంగభద్ర నదికి వెళ్లారు. మంత్రాలయంలో శ్మశానవాటిక దగ్గరలోని ఉన్న పుష్కర ఘాట్ సమీపానికి చేరుకున్నారు. స్నానాలకు దిగుతుండగా కర్నూలులోని ఆదిత్య నగర్ వాసి సతీష్ చంద్ర కుమారుడు యువన్ చంద్ర (5) తీరంలో చెంబుతో ఆడుతూ కనిపించారు. అయితే బాలుడి చెంబు గాలికి నీటిలోకి కొట్టుకుపోయింది. దీంతో చెంబు కోసం ఆబాలుడి నదిలోకి దిగాడు. పిల్లోడు అనుకోకుండా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో అక్కడే ఉన్న బంధువులు వెంటనే స్పందించారు. పిల్లోడిని రక్షించడానికి ఆరుగురు నదిలో దూకారు. వీరిలో ఐదుగురు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. అపర్ణ అనే యువతి మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోతూ దూరాన బండ రాయిని చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారిలో తండ్రి, కొడుకు కర్నూలులోని ఆదిత్యనగర్కు చెందిన సతీష్ చంద్ర (36) పూజారిగా పనిచేస్తున్నారు. తన ఆశలన్నీ కుమారుడు యువన్ చంద్ర (5)పైనే ఉంచుకున్నారు. అనుకోకుండా కుమారుడు తుంగభద్ర నదిలో అదృశ్యం కావడంతో తండ్రి తల్లడిల్లారు. వెంటనే నదిలో దూకి కుమారుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే నదిలో గుండాలు ఉండటంతో కుమారుడితోపాటు తండ్రి కూడా గల్లంతయ్యారు. పెళ్లి కుమార్తె చెల్లెలు.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రత్నమయ్య ఆచారి కుమార్తె సంధ్య(21) భవిష్యత్పైనే ఎన్నో ఆశలు ఉంచుకున్నారు. శశికుమార్ వివాహం చేసుకున్న యువతికి ఈమె స్వయానా చెల్లెలు. తన అక్క వివాహంలో ఎంతో సందడి చేసిన ఈ యువతి సత్యనారాయణ పూజలో పాల్గొన్నారు. భక్తి గీతాలు కూడా ఆలపించారు. పుణ్యస్నానాలు చేసేందుకు తుంగభద్ర నదికి వచ్చి బాలుడిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో గాలింపు.. తుంగభద్ర నదిలో బాలుడు అదృశ్యమయ్యాడని, మరో ఆరుగురు కనిపించడం లేదని తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించారు. పుట్టీలతోనూ నదిలో విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ధనుష్ మృతదేహం బయటపడటంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో తుంగభద్ర తీరం శోక సంద్రాన్ని తలపించింది. గల్లంతైన వారి కోసం తుంగభద్ర నదిలో గజఈతగాళ్లు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపుల్లో కర్ణాటక హసన్ జిల్లా బెలూరు నియోజకవర్గం దోడ్డ చెల్లూరు గ్రామానికి చెందిన రామలక్ష్మణగౌడు (65) మృతదేహం లభ్యమైంది. మృతదేహంలోని చొక్కాలో ఉన్న ఆధారాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందవేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆదివారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ధనుష్ మృత దేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులుబాలుడి తప్పటడుగులు ఇక కనిపించవు.. వచ్చీరాని మాటలు అదృశ్యమయ్యాయి. దివ్య సౌధాలు నిర్మించే వారి మాటలు ఇక వినిపించవు...బంగారు భవిష్యత్తుపై యువతి, యువకుల స్వప్నాలు గల్లంతయ్యాయి. కుమారుడే ఇంటి దీపం అని తండ్రి తన ధైర్యాన్ని చూపలేరు.. అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదంతో భక్తి కీర్తనలతో అలారుతూ ఉండే మంత్రాలయంలోని తుంగభద్ర నదీ తీరం శనివారం శోకాన్ని ఆలపించింది. బాలుడితోపాటు రక్షించడానికి వెళ్లిన నలుగురు గల్లంతు కావడంతో బంధువులకు దుఃఖమే మిగిలింది.ఆదోనికి చెందిన శంకరప్ప ఆచారి కుమారుడు అపర్ణ (13) మృత్యువును జయించారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా బండ రాయిని ఈ బాలికను కాపాడింది. దానిని పట్టుకుని ప్రాణాలతో నదీ తీరం చేరుకున్నారు. తనతోపాటు నదిలో దూకినవారు మృత్యువాత పడటంతో శోకసంద్రంలో మునిగారు. -
దిల్ మ్యాంగ్ మోర్
సాధారణంగా మామిడి కాయలు గుండ్రంగా, కోలగా ఉంటాయి. లేత అకుపచ్చ రంగులో, నున్నగా మెరుస్తూ నోరూరిస్తాయి. అయితే వెంగళాం పల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తోటలో లవ్ షేప్లో కాసిన ఓ మామిడి కాయ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శనివారం కాయలు తెంపడానికి వెళ్లిన కూలీ తిమ్మప్పకు ఈ కాయ కనిపించింది. అచ్చం హృదయం ఆకారంలో ఉన్న ఈ మామిడి కాయను కూలీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాయ పెరిగే దశలో వాతావరణ ప్రభావం వల్ల మామిడి కాయలు కొన్నిసార్లు ఇలాంటి విభిన్న ఆకారంలో వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి కళ్యాణి తెలిపారు. –ప్యాపిలి -
త్వరలో టీబీ డ్యాం గేట్ల ట్రయల్ రన్
● టీబీ బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి హొళగుంద: తుంగభద్ర డ్యాం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తి దశకు చేరాయని, త్వరలో ట్రయల్ రన్ చేయనున్నట్లు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్డీఓలు, సెక్షన్ ఆఫీసర్లతో కలిసి తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై శనివారం ఆయన పర్యటించారు. హొళగుంద సెక్షన్ 183 కి.మీ పరిధిలో పర్యాటిస్తూ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోని గుడుదూరు, మరికొన్ని చోట్ల కాలువలో పూడిక తీత, వంతెన ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. అవి పూర్తయితో బళ్లారికి నీటిని విడుదల చేస్తామన్నారు. హొళగుంద సెక్షన్లో 184 కి.మీ, 193 కి.మీ వద్ద కాలువ ఎడమ గట్టు అధ్వానంగా ఉందని, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తే పనులు చేపడతామన్నారు. ఆయన వెంట టీబీ బోర్డు అధికారులు సునీల్, మృత్యుంజయనాయక్, జడేష్, ఉషా, శ్రీకాంత్కుమార్ ఉన్నారు. -
స్వాతి మహోత్సవం.. అహోబిలేశుడి వైభవం
ఆళ్లగడ్డ: స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించా రు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ము గించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలంకరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభ య దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ దండయాన’
బొమ్మలసత్రం: మహిళా, శిశు భద్రత, రక్షణ కోసం ఆపరేషన్ దండయానను ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తూ నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడేలా కలెక్టర్ పర్యవేక్షణలో స్పీడ్ ట్రయల్ మానటరింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల్లో నిందితులపై నిరంతర నిఘా ఉంచుతామన్నారు. మహిళలపై జరిగే నేరాలపై ఇప్పటి నుంచి కేవలం 60 రోజుల వ్యవధిలోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంచలనమైన కేసులను ఫాస్ట్ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు అనతికాలంలో శిక్షలు పడేలా చేస్తామన్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
నంద్యాల(అర్బన్): డీఎస్సీ 2025 నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్యాదవ్ విమర్శించారు. డీఎస్సీ మొదటి మెరిట్ లిస్టు రద్దు చేయడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా కాదు.. దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కాలేజీ నుంచి బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ కింద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, పలు నియోజకవర్గ ఇన్చార్జ్ల సూచనల మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సురేష్యాదవ్ మాట్లాడుతూ.. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం బాధాకరమన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ కాదు.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు దగా డీఎస్సీని అందించిందన్నారు. యువత విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రాష్ట్రంలో జాబ్ ఫర్ సేల్ నడుస్తోందన్నారు. ప్రశ్నపత్రాలు తయారు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు మణిరెడ్డి, మాధురిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, సన్నాల సాయిరాంరెడ్డి, శ్రీశైలం విద్యార్థి విభాగం అధ్యక్షులు ధనుంజయ్, పాణ్యం విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంతోష్, జశ్వంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కారు నంద్యాలలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన -
ప్రశాంతంగా ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 18 కేంద్రాల్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన గణితం పరీక్షకు 2.149 మందికి గాను 1760 మంది హాజరు కాగా 389 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని మూడు కేంద్రాల్లో సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. శుక్రవారం ఫిజిక్స్, వొకేషనల్ పరీక్షలకు 5913 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు గాను 5627 మంది హాజరు కాగా 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రెండో సంవత్సరం కామర్స్–2, వొకేషనల్–2 పరీక్షలకు 659 మందికి గాను 603 మంది హాజరు కాగా 56మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ కు చెందిన ఎం. కుసుమ కుమారి రాజశేఖర్ రూ.1,00,116 విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్కి అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామి వారి శేషవస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. రైళ్లు తాత్కాలిక రద్దు మద్దికెర: గుంతకల్లు నుంచి బోధన్ వెళ్లే రైలు, బోధన్ నుంచి గుంతకల్లుకు వచ్చే రైలు నేడు, రేపు (30, 31 వతేదీల్లో) తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే గుంతకల్లు నుంచి మార్కాపురానికి వేళ్లే రైలు, మార్కాపురం నుంచి గుంతకల్లుకు వచ్చే రైలు ఈనెల 31, జూన్1 వతేదీల్లో రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. 60 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలో గ్రేడ్ – 5 నుంచి గ్రేడ్ –4 పంచాయతీ కార్యదర్శులుగా 60 మందికి పదోన్నతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆమోదం తెలిపినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదోన్నతి పొందనున్న పంచాయతీ కార్యదర్శులకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కోసం ఈ నెల 30వ తేదిన ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత కార్యదర్శులు తమ సర్వీస్ పుస్తకంతో హాజరు కావాలని కోరారు. రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ కేంద్రం వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లోని అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. శుక్రవారం శిరువెళ్ల్లలో 39.6 డిగ్రీలు, దొర్నిపాడు 39.6, కొలిమిగుండ్ల 39.4, బనగానపల్లి 39.4, అవుకు 39.2, పాణ్యం 39.1, రుద్రవరం 39, చిప్పగిరి 37.7, మంత్రాలయం 37.4, ఆదోని 37.2, కల్లూరులో 37.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లో గాలీవాన బీభత్సం సృష్టించింది. మంత్రాలయం, పెద్దకడుబూరు, నందవరం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మొత్తం 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందవరం మండలంలో భారీ వృక్షాలు సైతం నేల కూలాయి. తీవ్రమైన గాలులు, వానలకు 9 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. 63 విద్యుత్ స్తంభాలు, ఆరు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో విద్యుత్ శాఖకు రూ.36 లక్షల నష్టం వాటిల్లింది. నందవరంలో 22 మి.మీ, సి.బెలగల్లో 20.4, గూడూరులో 3.4, కోడుమూరులో 3.2, కర్నూలు రూరల్లో 1.4, కల్లూరులో 1.2, కర్నూలు అర్బన్లో 1 మి.మీ వర్షపాతం నమోదైంది. -
చెరువుల కోసం విద్యుత్ చౌర్యం!
● రైతుల పేర్లతో విద్యుత్ కనెక్షన్లు ● అనధికార మోటార్ల ద్వారా నీటిని సరఫరా ● ప్రభుత్వానికి లక్షలాది రూపాయల గండి నీటిని చెరువులోకి విడుదల చేస్తున్న దృశ్యం (ఫైల్)రైతు పేరున తీసుకున్న విద్యుత్ మీటర్గడివేముల: సామాన్య ప్రజలు విద్యుత్ చౌర్యానికి పాల్పడితే అధికారులు పలు కేసులు నమోదు చేస్తారు. అయితే రైతుల పేర్లతో విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న చేపల చెరువుల నిర్వాహకులు విద్యుత్ చౌర్యం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతంలో గోరుకల్లు రిజర్వాయర్కు మట్టికోసం రైతుల నుంచి పొలాను కొనుగోలు చేసి మట్టిని తీసుకెళ్లారు. దీంతో పొలాల్లో గుంతలు ఏర్పడంతో వాటిలోనే నీటిని నింపి చేపల చెరువులుగా మార్చారు. గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల, కొరటమద్ది, తిరుపాడు, దుర్వేశి గ్రామాల సమీపంలో 40 చేపల చెరువులను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. చేపల చెరువులకు నీటిని తోడుకునేందుకు వ్యవసాయ రైతుల పేర్లతో ఒక్క విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. అనధికారికంగా నాలుగు నుంచి ఐదు మోటర్లకు విద్యుత్ వినియోగించుకుంటూ వాటి ద్వారా చెరువులను నింపుకుంటున్నారు. దాదాపు కొన్నేళ్ల నుంచి ఈ విధంగా వ్యవసాయ మోటర్లను చేపల చెరువులకు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక విద్యుత్ అధికారికి చేపల చెరువుల నిర్వాహకులు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. విభేదాలతో ఫిర్యాదులు.. చేపల చెరువుల నిర్వాహకుల మధ్య విభేదాలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన విజిలెన్స్ దాడులు జరిగాయి. అక్రమంగా విద్యుత్ను నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి రూ.8 లక్షల దాకా అపరాధ రుసుం విధించారు. ఇప్పటికీ కొంత మంది చేపల నిర్వాహకులు రైతుల పేర్లతో విద్యుత్ కనెక్షన్ తీసుకుని అక్రమ చేపల చెరువులకు నీటిని వినియోగిస్తున్నారు. అక్వా కింద విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే ప్రతి నెలా వేలాది రూపాయల బిల్లు వస్తుంది. అదే రైతు పేరుతో తీసుకుంటే రూ.వంద లోపే బిల్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు తీసేందుకు వెళ్లే విద్యుత్ సిబ్బంది ఎన్ని అక్రమంగా కనెక్షన్లు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నా పట్టించుకోవడంలేదు. విజిలెన్స్ దాడులతో గతంలో జరిమానా చెల్లించిన చెరువుల నిర్వాహుకులు మారడం లేదు. స్థానికంగా వెళ్లి పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. -
కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు సమయం ఆసన్నమైంది. జిల్లాలో ప్రధానంగా వేరుశనగ సాగవుతుంది. నంద్యాల జిల్లాలో డోన్, ప్యాపిలి, క్రిష్ణగిరి, నందికొట్కూరు, మిడుతూరు మండలాల్లోనూ వేరుశనగ ప్రధాన పంట. అయితే వేరుశనగ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్) విత్తనాలు సరఫరా చేస్తుంది. కొన్నేళ్లుగా ఏపీ సీడ్స్లో వేరుశనగ విత్తనోత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ ప్రయివేటు విత్తన కంపెనీలపై ఆధారపడింది. ఖరీఫ్ సీజన్కు అవసరమైన వేరుశనగ సరఫరా చేస్తామంటూ 26 ప్రయివేటు విత్తన కంపెనీలు టెండర్లు వేశాయి. 2024–25 ఖరీఫ్, రబీ, 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు ఏపీసీడ్స్కు సరఫరా చేసిన వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, శనగ విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఏపీ సీడ్స్కు చెల్లిస్తేనే కంపెనీలకు చెల్లించే అవకాశం ఉంది. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏపీ సీడ్స్కు రూపాయి కూడా విడుదల చేయలేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఇప్పుడు వేరుశనగ సరఫరా చేస్తామంటూ టెండర్లు వేసిన కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ పూర్తి ధర, సబ్సిడీలను పేపరుపై ఖరారు చేసినప్పటికీ కార్యాచరణలో పురోగతి లేకపోవడం గమనార్హం. హమాలీ చార్జీలు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏపీ సీడ్స్ నిర్వీర్యమైంది. లోడింగ్, అన్లోడింగ్ హమాలీల కష్టానికి ప్రతిఫలం కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్ చేరుకుంది. సహజంగా వారానికి ఒకసారి నగదు చెల్లిస్తుంటారు. అప్పుడే హమాలీల జీవనం సజావుగా సాగుతుంది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సీడ్స్ నిర్వీర్యమవడంతో హమాలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటిసారి ఏప్రిల్ నుంచి నుంచి హమాలీలకు చెల్లింపులు నిలిచిపోవడంతో వీరి జీవనం దుర్భరమవుతోంది. సిబ్బందికి వేతనాలూ కరువే.. 2023–24 వరకు వరకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఒక వెలుగు వెలిగింది. ప్రతి ఏటా మే 15 నాటికే వేరుశనగతో పాటు అన్ని రకాల విత్తనాలను ఏపీ సీడ్స్ రైతులకు అందుబాటులోకి తెచ్చేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కార్మికులకు రూపాయి కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ సీడ్స్ను తీసుకొచ్చింది. హమాలీలకే కాదు డైలీ వేజ్పై పనిచేసే వారికి కూడా ఏప్రిల్ నుంచి వేతనాల్లేవు. కనీసం కరెంటు బిల్లులూ చెల్లించలేని దయనీయం నెలకొంది. ఏప్రిల్స్ నెల విద్యుత్ బిల్లులు ఇంతవరకు చెల్లించలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. ట్రాన్స్పోర్టు చార్జీలు కూడా చెల్లించకపోవడం గమనార్హం. సర్టిఫికేషన్, ట్యాగ్లు వచ్చేది ఎప్పుడో! టెండర్లు వేసిన కంపెనీల దగ్గర క్వింటా వేరుశనగ కూడా లేదు. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ పంటే లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 150 క్వింటాళ్లు, ఆదోని మార్కెట్కు 15 క్వింటాళ్లు, ఎమ్మిగనూరు మార్కెట్కు 50 క్వింటాళ్ల లోపు మాత్రమే వస్తోంది. టెండర్లు వేసిన కంపెనీలు ఇతర జిల్లాల్లో కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ మొదలే కాలేదు. కొనుగోలు చేసిన దానిని ప్రాసెసింగ్ చేసి.. ప్యాకింగ్ చేయాల్సి ఉంది. లాట్ల వారీగా శాంపుల్స్ తీసి సర్టిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థకు పంపాలి. అక్కడ మొలక శాతం, స్వచ్ఛత తదితరాలను పరిశీలించి సర్టిఫికేషన్తో పాటు ట్యాగ్లు ఇవ్వడానికి 10 రోజులకుపైగా సమయం పడుతుతుంది. టెండర్లు వేసిన కంపెనీలు ఇప్పటికప్పుడు వేరుశనగ కొనుగోలు చేపట్టినా రైతులకు పంపిణీ చేయడానికి కనీసం 20 రోజులు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఈ సారి సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేసే ఉద్దేశం లేదని అర్థమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఏపీ సీడ్స్ సరఫరాకు 26 విత్తన కంపెనీల టెండర్లు ఇప్పటి వరకు అందుబాటులో లేని వేరుశనగ ఖరీఫ్ మొదలవుతున్నా చలనం కరువు ముందుగా పాత బకాయిలు చెల్లించాలని మెలిక 15వేల హెక్టార్లు 10,723 క్వింటాళ్లు 2,136 క్వింటాళ్ల -
హుండీ ఆదాయం రూ. 60.18 లక్షలు
మహానంది: మహానందిలో శుక్రవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 60.18 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సమిత శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయాలతో పాటూ కోదండరామాలయం , ఆంజనేయ స్వామి, వినాయక నంది ఆలయాల్లో హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల ద్వారా రూ. 59,21,476, అన్న ప్రసాదం విభాగం ద్వారా రూ. 69, 515, గోసంరక్షణ ద్వారా రూ. 27,176 వచ్చినట్లు తెలిపారు. నగదు కానుకలతో పాటు రెండు గ్రాముల 950 మిల్లీ గ్రాముల బంగారు, 260 గ్రాము వెండి లభించినట్లు వివరించారు. మొత్తం 60 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. హుండీ కానుక లెక్కింపు కార్యక్రమంలో వెలుగోడు గ్రూపు టెంపుల్స్ ఈఓ జనార్దన శెట్టి, మహానంది ఎఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వర రాజు, సుబ్బారెడ్డి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
‘నీళ్లు’ నమిలిన డోన్ ఎమ్మెల్యే!
ప్యాపిలి: టీడీపీ గురించి గొప్పతనం చెప్పడానికి మహానాడు కార్యక్రమానికి హాజరైన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ప్రజల సమస్యకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలోని స్థానిక షాదీఖానాలో గురువారం మహానాడు కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి హాజరైన డోన్ ఎమ్మెల్యేను గార్లదిన్నె గ్రామ మహిళలు చుట్టముట్టారు. నీటి సమస్య గురించి నిలదీశారు. గార్లదిన్నెలోని కొత్త బిల్డింగ్స్ కాలనీకి గత మూడు రోజులుగా మంచినీరు రావడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మహానాడులో ప్రసంగాలు వినకుండా మహిళలు నీటి సమస్యపై ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఊహించని సంఘటన నుంచి తేరుకున్న అనంతరం త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
రక్తం కొరత.. రోగులు విలవిల!
● స్టోరేజీ కెపాసిటీ 7,326 యూనిట్లు ● అందుబాటులో ఉన్నది 1,298 యూనిట్లు ● ముందుచూపు లేని బ్లడ్ బ్యాంకులు ● కర్నూలు పెద్దాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి ● రక్తదాన శిబిరాలు నిర్వహించని వైనంకర్నూలు(హాస్పిటల్): రక్తం అందుబాటులో లేకపోవడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 19 రక్తనిధులు(బ్లడ్బ్యాంకులు) ఉన్నాయి. వాటిలో బ్లడ్ స్టోరేజ్ కెపాసిటీ 7,326 యూనిట్లు. అయితే ప్రస్తుతం 1,298 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరానికి రక్తం లభించక వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా లభించడం లేదు. దీంతో ఆయా బ్లడ్ బ్యాంకుల్లోని దాతల జాబితా తీసుకుని వారికి ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. నెగిటివ్ గ్రూపులు మరింత కొరత జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో పాజిటివ్ గ్రూపుల కంటే నెగిటివ్ గ్రూపుల రక్తం కొరత మరింత తీవ్రంగా ఉంది. మొత్తం బ్లడ్బ్యాంకుల్లో ఏ నెగిటివ్ గ్రూపు రక్తం స్టోరేజ్ కెపాసిటీ 238 యూనిట్లు కాగా కేవలం 15 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే బీ నెగిటివ్ గ్రూపు 253 యూనిట్లు కాగా 35 యూనిట్లు, ఏబీ నెగిటివ్ రక్తం 187 యూనిట్లు కాగా కేవలం 6 యూనిట్లు, ఓ నెగిటివ్ గ్రూపు రక్తం 210 యూనిట్లు ఉండాల్సి ఉండగా కేవలం 18 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగుల సహాయకులు అవసరమైన రక్తం కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో స్టోరేజి కెపాసిటీకి గాను ఒక్క యూనిట్ కూడా నెగిటివ్ గ్రూపు బ్లడ్ ఉండకపోవడం గమనార్హం. దాతలు ఎక్కువగా ఆయా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులే ఉండటం, ఆయా కళాశాలలకు ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో దాతలు సమయానికి లభించడం కష్టమవుతోంది. ప్రత్యామ్నాయ చర్యలు ఏవీ? బ్లడ్ బ్యాంకులకు అధికంగా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. దాతలు అధికంగా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులు ఉంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బ్లడ్ బ్యాంకులకు రక్తం కొరత ఏర్పడింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, విద్యార్థులు గాకుండా ఇతర సంఘాలు, యువజన సంఘాల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి నిల్వ చేసుకోవాల్సి ఉంది. అయితే బ్లడ్ బ్యాంకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో కనీస నిల్వలు లేకపోవడంతో రోగుల సహాయకులు సమయానికి రక్తం లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి అవసరమైన గ్రూపు రక్తం ఉండే దాతలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్బ్యాంక్ పేరు అవసరం ఉన్నది కర్నూలు పెద్దాసుపత్రి 900 183 ఆదోని 200 34 నంద్యాల 295 29 ఇండియన్ 425 149 రెడ్క్రాస్ సొసైటీబ్లడ్ బ్యాంకులు నిబంధనల మేరకు నడుస్తున్నాయా లేదో చూస్తాం. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు అయితే నిబంధనల మేరకు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ రక్తనిధికి ఇవ్వాలి. రక్తం నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా బ్లడ్ బ్యాంకులదే. – ఎల్.భాస్కర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కర్నూలు: న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ సూచించారు. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు న్యాయ వృత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరనాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే వారికి అనేక రకాల ఉపాధి కల్పనలు ఉన్నాయన్నారు. కోర్టులలో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, రాజీ ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్లైన్ ఏర్పాటు చేసుకుని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. న్యాయవాది కోర్టులో చట్టం ప్రకారం ఏది సరైనదో క్లెయింట్లకు వివరించాలన్నారు. నిజాన్ని వెలికితీయడంలో కోర్టుకు సహకరించాలన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు ఈ సందర్భంగా ఆయన పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేశ్వర రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
యూరియా ఏమవుతోంది
● సాగు 3వేల హెక్టార్లు.. యూరియా 4,861 టన్నులు! ● గతంలో ఎప్పుడూ లేని విధంగా వేసవిలో పెరిగిన అమ్మకాలు ● 2020 నుంచి 2024 మధ్య వేసవిలో అమ్మకాలు 1000 టన్నులే.. ● గత ఏప్రిల్ నెలలోనే కర్నూలు జిల్లాలో 2,161, నంద్యాల జిల్లాలో 2,700 టన్నుల అమ్మకాలు ● అడ్డగోలు అమ్మకాలపై కలెక్టర్, జేసీ సీరియస్ ● ఉమ్మడి జిల్లాలో 59 మంది డీలర్ల లైసెన్స్లు తాత్కాలిక సస్పెన్షన్ కర్నూలు సబ్ డివిజన్లోని గూడూరు మండలంలో ప్రతి బస్తా యూరియాకు లింక్లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నా వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, జేసీలు యూరియాపై దృష్టి పెట్టడంతో అప్రమత్తమైన వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాలో 19, నంద్యాల జిల్లాలో 40 ఎరువుల షాపుల లైసెన్స్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. లైసెన్స్ సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి అమ్మకాలు చేపట్టరాదు. అయినప్పటికీ డీలర్లు యథావిధిగా అమ్మకాలు సాగిస్తుండటం అధికారులకు చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.యూరియాకు లింక్ పెడుతున్న పనికిరాని ఎరువులు ఇవే కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ఆరంభానికి ముందే యూరియా కొరత ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి మే నెల వరకు వ్యవసాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. బావులు, బోర్ల కింద అక్కడక్కడ వేరుశనగతో పాటు కూరగాయల పంటలు సాగు చేయడం పరిపాటి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల కింద పత్తి కూడా సాగవుతోంది. అయితే యూరియా అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని ర్యాక్ పాయింట్లకు వచ్చే యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను 50 శాతం మార్క్ఫెడ్కు, మరో 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్కు ఇచ్చిన యూరియా బఫర్లో ఉండగా.. ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నేతలకు మినహా సాధారణ రైతులకు యూరియా బస్తా లభించని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్లో 4,861 టన్నుల యూరియా అమ్మకాలు 2020 నుంచి 2024 వరకు పరిశీలిస్తే వేసవిలో యూరియా అమ్మకాలు అతి తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తం మీద 1000 టన్నుల వరకే అమ్మకాలు జరిగాయి. 2025 నుంచి వేసవిలో యూరియా అమ్మకాలకు రెక్కకొచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వానికి ప్లానింగ్ లేకపోవడం, డిమాండ్ను అంచనా వేయడంలో విఫలమవడం, డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయడంలో చేతులెత్తేయడంతో ఉన్న యూరియా బంగారం అవుతోంది. వేసవిలో వచ్చిన యూరియాను వచ్చినట్లు డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలలో 2161 టన్నులు, నంద్యాల జిల్లాలో 2700 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తంగా వేసవిలో 3వేల హెక్టార్లలో కూడా పంటలు లేవు. అయితే ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లాలో 4,861 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అమ్మకాలు.. ఏప్రిల్, మే నెలల్లో నమోదు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం యూరియా బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లోనే విక్రయించాలి. ఏ రోజుకారోజు జరిగిన అమ్మకాలను ఈ–పాస్ మిషన్లో నమోదు చేసి బయోమెట్రిక్ వేయాలి. జిల్లాలో మాత్రం ఫిబ్రవరి నెలలో యూరియా అమ్మకాలు జరిగితే ఏప్రిల్ నెలలో ఈ–పాస్ మిషన్లో నమోదు చేయడం గమనార్హం. అన్నీ సర్దుబాటు చేసుకున్న తర్వాత ఈ–పాస్లోకి ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్, జేసీలే ఆశ్చర్యపోయినట్లు సమాచారం. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ జిల్లా వ్యవసాయ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఇతర ఉత్పత్తులు తీసుకుంటేనే యూరియా ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారు. యూరియా బస్తా ధర రూ.266 మాత్రమే. డిమాండ్ పెరగడంతో బ్లాక్లో కొనడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరు డీలర్లు ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి అడ్డగోలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. పంటకు ఏ మాత్రం ఉపయోగపడని వాటిని బస్తా రూ.1,500 ప్రకారం అంటగడుతూ యూరియాను మాత్రం ఎంఆర్పీ కంటే తక్కువకే ఇస్తుండటం గమనార్హం. ఈ బాగోతం కౌతాళం, ఎమ్మిగనూరు, హొళగుంద, ఆదోని, గూడూరు తదితర ప్రాంతాల్లో అధికంగా సాగుతోంది. సీ్త్ర శక్తి, భూశక్తి, గ్రోశక్తి పేర్లతో ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి డీలర్లు రైతులను దోచుకుంటున్నారు. దారి మళ్లిన యూరియాగత ఏడాది కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు తదితర మండలాల నుంచి యూరియా కర్ణాటకకు తరలినట్లు విమర్శలు ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని ఓ మండలానికి కేటాయించిన యూరియా కర్ణాటకకు మళ్లిందని ఏకంగా గవర్నర్కే ఫిర్యాదు వెల్లింది. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఈ సారి ముందస్తుగానే వేసవిలో వచ్చిన యూరియాను దారి మళ్లిచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు, నాలుగేళ్లతో పోలిస్తే ఈ సారి వేసవిలో భారీగా యూరియా అమ్మకాలు పెరగడంపై కలెక్టర్, జేసీలు విచారణ జరుపుతుంటే.. వ్యవసాయ యంత్రాంగం మాత్రం వేసవిలో బోర్ల కింద సాగు పెరిగిందని నమ్మించే ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క బస్తా దొరికితే ఒట్టు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కర్నూలు జిల్లాకు సంబంధించి 45,599 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 22,916 టన్నుల యూరియా వచ్చింది. ఇందులో సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ గోదాములు, రీటైల్/హోల్సేల్ డీలర్లు, కంపెనీ గోదాముల్లో రైతులకు 17,530 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో మాత్రం యూరియా దొరకని పరిస్థితి. ఇదిలాఉంటే నంద్యాల జిల్లాలో 27వేల టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నా.. పీఏసీఎస్లు, రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్ల్లో బస్తా యూరియా కూడా కనిపించకపోవడం గమనార్హం. -
స ● వి ● వి ● వి
ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో గురువారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 27న వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ప్రజలు ఊరట చెందారు. ఎల్నినో ప్రభావంతో వెంటనే ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దొర్నిపాడులో 40.8, శిరువెళ్ల 40.8, సంజామల 40.7, బనగానపల్లి 40.5, చాగలమర్రి 40.4, పాణ్యం 40.1, రుద్రవరం 40.1, అవుకు 40, కల్లూరులో 39.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 13 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థలో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని పాతబస్తీలోని గడ్డ వీధి, గరీబ్ నగర్, జొహరాపురంలోని సచివాలయాలను తనిఖీ చేశారు. ఆ సందర్భంలో పలువురు ఉద్యోగులు కార్యాలయంలో లేరు. మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లేకపోవడంతో గైర్హాజరైన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కమిషనర్ ఆయా సచివాలయాల్లో పనిచేసే 13 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో తగిన కారణాలు తెలియజేస్తూ వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జనవరి నెలలో నిర్వహించిన ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల కోర్సు 6, 8, 10వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayalase emauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో జిల్లా నేతలకు పదవులు
నంద్యాల(అర్బన్): జిల్లాకు చెందిన పలువురు నేతలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామకాల ప్రకటన వెలువడింది. పాణ్యానికి చెందిన బెల్లం మహేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా, శ్రీశైలానికి చెందిన కె.శివారెడ్డిని రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా, శ్రీశైలానికి చెందిన వంగాల నాగేశ్వరరెడ్డిని రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్యదర్శిగా నియమించారు. ఈఓల హాజరు తప్పనిసరి నంద్యాల(వ్యవసాయం): మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఈఓలు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారి పాండురంగారెడ్డి తెలిపారు. నంద్యాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్కు గైర్హాజరైన ఈఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవదాయ శాఖపై ప్రజల్లో, భక్తుల్లో మరింత సానుకూల స్పందన ఏర్పడేలా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఆళ్లగడ్డలో నేడు పీజీఆర్ఎస్ నంద్యాల(అర్బన్): ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. ఆయిల్ నిక్షేపాల కోసం అన్వేషణ పాణ్యం: ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ కంపెనీ అధికారులు గురువారం పాణ్యంలోని వద్దెల వాగు సమీపంలోని పొలాల్లో అన్వేషణ చేపట్టారు. బోర్వెల్ సాయంతో తవ్వకాలు ప్రారంభించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయిల్ నిక్షేపాల కోసం కనీసం ఒక్కో చోట 70 నుంచి 150 అడుగుల వరకు తవ్వకాలు చేపడుతున్నట్లు వారు చెప్పారు. గోసంరక్షణ నిధికి రూ.11లక్షల విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణ నిధి పథకానికి హైదరాబాద్కు చెందిన ఇందుకూరి వెంకటరామకృష్ణంరాజు రూ.11,11,116 విరాళంగా చెల్లించారు. గురువారం దేవస్థాన ఈఓ క్యాంప్ కార్యాలయంలో దేవస్థాన ఈఓ శ్రీనివాసరావును కలిసి ఈ మేరకు విరాళ చెక్కును అందజేశారు. అనంతరం విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. భవన నిర్మాణ కార్మికులకు పథకాల పునరుద్ధరణ కర్నూలు(అర్బన్): భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ పథకాలను వివరించారు. వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు భవన, ఇతర నిర్మాణ రంగ గుర్తింపు కార్డు కలిగిన కార్మికులు తమ పరిధిలోని సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సెక్రెటరీ ద్వారా AP - SEVA పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
తప్పుల్లేని ఓటరు జాబితా తయారు చేయాలి
దొర్నిపాడు: తప్పుల్లేని ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. గుండుపాపల గ్రామంలో ఎస్ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యాక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమయ్యాయరు. ఓటరు మ్యాపింగ్, క్షేత్రస్థాయిలో సర్వే విధానం, జనగణన ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పుల్లేని ఓటరు జాబితాను తయారు చేయాలన్నారు. మెట్టుపల్లి లక్ష్మి అనే మహిళ పేరు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఉండగా 2022 జాబితాలో లేకపోవడం కలెక్టర్ గమనించి వివరాలు ఆరా తీశారు. సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె పుట్టినిల్లు బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంగా తెలుసుకున్న కలెక్టర్ అక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ 169లో ఉన్న ఓటరు వివరాలను పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ వ్యవస్థలో న్యాయవాది కీలకం
నంద్యాల(వ్యవసాయం): న్యాయ వ్యవస్థలో న్యాయవాది కీలక స్తంభమని హైకోర్టు న్యాయమూర్తి ఏ.హరిహరనాథశర్మ అన్నారు. బుధవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టుల్లో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, కోర్టు వెలుపల రాజీద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్లైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యాయవాది కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించాలని, చట్టం ప్రకారం ఏది సరైనదో క్లయింట్కు వివరించాలన్నారు. నిజాన్ని వెలికి తీయడంలో కోర్టుకు సహకరించాలని, అబద్ధం చెప్పకూడదన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలన్నారు. సకాలంలో న్యాయం అందాలంటే సాంకేతికతను వాడుకోవాలని, వాయిదాల సంస్కృతిని తగ్గించడానికి ప్రతి న్యాయవాది సహకరించాలన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిని సత్కరించారు. నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, రామసుబ్బయ్య, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్, రామచంద్రారావు, శివశంకర్రెడ్డి, వివేకానందరెడ్డి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు పందిరి వేశారు!
● శ్రీశైల దేవస్థానంలో ఇంజినీర్ల ఇష్టారాజ్యం ● రూ.26.50 లక్షల పనికి రూ.39 లక్షల బిల్లు శ్రీశైల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేసిన పైప్పెండ్యాల్స్క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన అరేబియన్ టెంట్లు (పగోడాలు)శ్రీశైలంటెంపుల్: కాంట్రాక్టర్లతో ఇంజినీర్లు కుమ్మకై ్క అక్రమాలకు పందిరి వేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనులను చూపిస్తున్నారు. క్షేత్రంలోని పెద్దచెరువు, దామర్లకుంట వద్ద భక్తులు సేదతీరేందుకు రూ.26.50 లక్షల అంచనాతో పైప్ పెండ్యాల్స్, షామియానాలు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఓ కాంట్రాక్టర్ 25.90 శాతం లెస్కు పనులు దక్కించుకుని పూర్తి చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు దేవస్థాన ఇంజినీర్లు నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ ఇచ్చినట్లు సమాచారం. అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా పని పూర్తిగా అయిపోయిన తరువాత పాత తేదీలతో అగ్రిమెంట్ చేసినట్లు తెలిసింది. డబుల్ ధమాకా! ఇదిలా ఉండగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రులు, ప్రత్యేక అధికారులు భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో పలుచోట్ల అరేబియన్ టెంట్లు (పగోడాలు) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లెస్ పనిలో మిగిలిపోయిన డబ్బుతో పని చేయించకుండా ఇంజినీర్లు తెలివి ప్రదర్శించారు. లెస్ తక్కువ ఉన్న కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించడంపై పలు అరోపణలు వచ్చాయి. పెద్దచెరువు పని సుమారు రూ.23లక్షలు, శ్రీశైలంలో పనులకు సుమారు రూ.15లక్షలు మొత్తం కలిపి రూ.39లక్షలు బిల్లు చేశారు. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం పని జరగకపోగా, అగ్రిమెంట్ ప్రకారం దక్కించుకున్న లెస్ పోను కాంట్రాక్టర్కు డబుల్ డబ్బు వచ్చేలా బిల్లులు చేశారు. అక్కడి ఫైల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది పెద్ద చెరువు, దామర్లకుంట వద్ద చేపట్టిన పని ఫైల్లో శ్రీశైలంలో చేపట్టిన పని ఫైల్ను ఎందుకు రాయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక పనికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కింద 5 శాతం పెంచేందుకు మాత్రమే దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు అనుమతులు ఉంటాయి. అయితే ఈ పనిలో 5 శాతం కంటే ఎక్కువ చేశారు. అంతేకాకుండా దేవస్థాన ఈఓతో నోట్ఫైల్ అప్రూవల్ తీసుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా దేవస్థానం కాంట్రాక్టర్కు చెల్లించిన ఫైనల్ బిల్లు డబ్బుతో శివరాత్రికి ఏర్పాటు చేసిన షామియానాలు, పైప్పెండ్యాల్స్, అరేబియన్ టెంట్లు కొత్తవి కొనుగోలు చేయవచ్చునని పలువురు కాంట్రాక్టర్లు అరోపిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆడిట్ నిర్వహించిన అధికారులు సైతం ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా బిల్లు పాస్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం ఉన్నతాధికారులు క్షేత్ర పరిధిలో పలుచోట్ల అరేబియన్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పని కావడంతో ముందుకు వచ్చిన కాంట్రాక్టర్తో పనులు చేపట్టాం. దేవస్థాన ఈఓతో నోట్ఫైల్ అప్రూవల్, రివైజ్డ్ ఎస్టిమేషన్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నాం. కాంట్రాక్టర్ నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకున్నాం. నిబంధనల ప్రకారమే బిల్లులు చెల్లించాం. – ఎం.నరసింహారెడ్డి, శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -
డీసీసీబీ సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల
● జనరల్ మేనేజర్ రామాంజనేయులుకు ఇన్చార్జి బాధ్యతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా పనిచేస్తున్న శివలీల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డికి మంగళవారం ఆమె రాతపూర్వకంగా రాసిచ్చారు. శివలీల సీఈఓగా మార్చి మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 20 రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఇవో పోస్టును వ్యక్తిగత కారణాలతో వదులుకుంటున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమె వినతిని చైర్మన్ ఆమోదించారు. వెంటనే డీసీసీబీలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న పి.రామాంజనేయులును ఇన్చార్జి సీఈఓగా నియమించారు. సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల జనరల్ మేనేజర్గా కొనసాగనున్నారు.చెంచులకు ఉచిత స్పర్శదర్శనం శ్రీశైలంటెంపుల్: చెంచులకు శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం కల్పించారు. తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద వారికి దేవస్థాన ఽఅధికారులు ఆహ్వానం పలికారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసిన చెంచు భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు హారం బహూకరణశ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి బుధవారం నెల్లూరుకు చెందిన పెళ్లకూరు దామోదర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 22 గ్రాముల బంగారు లక్ష్మీకాసుల హారాన్ని సమర్పించారు. హారాన్ని తీసుకున్న అనంతరం ఆలయ అధికారులు దాతకు రశీదును, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. 17 మండలాల్లో వర్షాలు ● మంత్రాలయంలో 48.2 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం 11 గంటల వరకు జల్లులు పడ్డాయి. 17 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదోనిలో 36.2, సి.బెళగల్లో 31.2, ఎమ్మిగనూరులో 30.2, కౌతాళంలో 26.8, పెద్దకడుబూరులో 24.8, కోసిగిలో 20.6, నందవరంలో 16.8, గోనెగండ్లలో 15.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26 వరకు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా పలు మండలాల్లో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. ఆదోనిలో 28.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు డీఎస్పీకి పదోన్నతి కర్నూలు: కర్నూలు డీఎస్పీ జె.బాబుప్రసాద్కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఏపీలో 20 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా, 41 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలు గా పదోన్నతి కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్కు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వాటర్స్ మంగళగిరిలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన బాబుప్రసాద్ 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. -
టీడీపీ కార్యాలయమా.. టీటీడీ కల్యాణ మండపమా?
● టీడీపీ నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహండోన్: ఆధ్యాత్మిక కేంద్రాలను, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపాలను సైతం టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారు. ఇందుకోసం పసుపు జెండాలతో అలంకరిస్తున్నారు. ఉడుములపాడులోని టీటీడీ కల్యాణ మండపాన్ని ఇలా చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రవిత్ర స్థలాలను సైతం పార్టీ ప్రచార కేంద్రాలుగా మార్చడంపై మండిపడ్డారు. ఇంధన పొదుపు బాధ్యత అంటూ నెల్లూరులో నిర్వహించే టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు వీక్షించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో పది క్లస్టర్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఉడుములపాడులోని టీటీడీ కల్యాణ మండపంలో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి. -
పట్టా భూమిలో టీడీపీ నాయకుల మట్టి దందా
● అడ్డుకున్న బాధిత రైతులు ● బెదిరించిన అధికార పార్టీ నాయకులు నంద్యాల(అర్బన్): టీడీపీ నాయకుల మట్టి దందా పట్టా భూముల్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న బాధిత రైతులు పొలం వద్దకు వెళ్లి అక్రమార్కులను అడ్డుకోగా మమ్మల్నే అడ్డుకుంటావా జేసీబీతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎదురు తిరిగితే అంతు చూస్తామని హెచ్చరించారు. చేసేది లేక తహసీల్దార్ శ్రీవాణికి జరిగిన విషయం అర్జీ ద్వారా బుధవారం వివరించారు. బాధిత రైతు ఉప్పరి మహేష్ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం కానాల గ్రామం నాగమ్మ చెరువులో గత 50 ఏళ్ల క్రితం నుంచి ఉప్పరి మహేష్ తండ్రి ఉప్పరి హుసేనయ్య పేరున సర్వేనం.1269లో 3.02 ఎకరాల పట్టా భూమి సాగులో ఉంది. ఇటీవల టీడీపీకి చెందిన కొంత మంది నాయకులు చెరువు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 1269 సర్వేనం.లోని ఎకరా పొలంలో లోతైన గుంతలు తీసి మట్టిని తరలించారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఉప్పరి మహేష్, హుసేనయ్యలు అక్కడికి వెళ్లారు. తమ పొలంలో మట్టిని తరలించడాన్ని చూసి నివ్వెర పోయారు. రిజిస్టర్ పొలంలో మట్టిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రిజిస్టర్ పొలమంటూ తెలియదని, పొలాన్ని చదును చేసే పరిస్థితి ఉండదని, దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. ప్రాణ భయంతో వణికిపోయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ శ్రీవాణికి వినతి పత్రం ఇచ్చారు. -
ఆర్బీకేల్లో అందుబాటులో లేని ఎరువులు
మాకు 10 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం నీటి సదుపాయం కింద పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నాం. గ్రామ స్థాయిలో ఆర్బీకే ఉన్నా యూరియా, డీఏపీ అందుబాటులో లేవు. పేరుసోమల, తిమ్మనాయునిపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా వ్యయప్రయాసలకు లోనవుతున్నాం. ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచితే ఎంఆర్పీకే లభిస్తాయి. – వెంకటేశ్వరరెడ్డి, పెద్ద వెంతుర్ల, కొలిమిగుండ్ల మండలం మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా, మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాం. నేడు బస్తా ఎరువు కావాలన్నా, నీళ్ల మందులు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని డోన్కు లేదా 28 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండకు పోతున్నాం. ప్రతి అవసరానికి డోన్ లేదా పత్తికొండకు పోవాల్సి వస్తుండటంతో ఎక్కువ డబ్బులు ఖర్చవుతున్నాయి. రాజకీయాలు మానుకొని ఆర్బీకేలను రైతులకు అందుబాటులో ఉంచాలి. – గన మద్దిలేటి, మారెళ్ల, తుగ్గలి మండలం -
చంద్రబాబు కుట్రను తిప్పికొడదాం
కర్నూలు(సెంట్రల్): సర్ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని 2029 ఎన్నికల్లో మరోసారి ఓటు చోరీ చేసి అధికారంలోకి రావాలనే సీఎం చంద్రబాబునాయుడు కుట్రను వైఎస్సార్సీపీ బీఎల్ఏలు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని హ్యాంగౌట్ హోటల్లో పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏలకు సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు గుండం సూర్యప్రకాష్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సర్ పేరుతో అనేక రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలోనూ నియోజకవర్గానికి 20 వేల ఓట్లను తొలగించాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని బూతు ఓటర్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సాను భూతి పరుల ఓట్లను తొలగించాలని యత్నిస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చి మరోసారి దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వారి కుట్రలను సాగనీయవద్దని హెచ్చరించారు. భవిష్యత్లో బీఎల్ఏలే పార్టీలో కీలకమని, వారు పార్టీ నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందన్నారు. పార్టీ కోసం ఇప్పుడు కష్టపడితే జగనన్న సీఎం అవ్వగానే వారికి పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, 2029లో మాత్రం కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని, అప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చన్నారు. టీడీపీ నేతలకు దోచుకోవడమే పని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకుని దాచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని.. ఇసుక, గ్రావెల్కు తెలుగు తమ్ముళ్లు టిప్పర్కు రూ.500 వసూలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. ఎవరికై నా అనుమానం ఉంటే తన వెంట వస్తే ఏ టీడీపీ నాయకుడు ఎంత వసూలు చేసింది చూపిస్తానని, ఇందుకు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం పాణ్యం నియోజకవర్గ బీఎల్ఏల సమావేశం కర్నూలు శివారులోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి.. వాళ్ల పార్టీ నేతల జేబులు నింపుతున్నాడని ఆరోపించారు. నంద్యాల జిల్లాలో పబ్లిక్గా టీడీపీ నాయ కులు ఇసుక, గ్రావెల్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని, టిప్పర్ ఇసుకకు రూ.500, టిప్పర్ గ్రావెల్కు రూ.5 వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు చెప్పినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు కాకుండా టీడీపీ నాయకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని, 75 శాతం స్థానికులకు ఇవ్వాలని చట్టం ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. జయరాజ్ ఇస్పాత్, క్యాంపకోలా కంపెనీల్లో మంత్రి టీజీ భరత్ తన అనుచరులకు ఉద్యోగాలు ఇప్పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ హబ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వకుండా టీడీపీ, వైఎస్సార్సీపీ అని వేరు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాదాపు 9వేల ఎకరాల భూములను హబ్ కోసం తీసుకున్నా ఎక్కడా పరిహారం రాలేదన్న మాట వినిపించలేదన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్ మండల రైతులు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ పరిహారం కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు నగరంలో వెంటకరమణ కాలనీ, కృష్ణానగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని, టీజీ భరత్ ఒక్కటైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కూడా తమ హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో నోడ్ పాయింట్గా గుర్తించామని, 9 వేల ఎకరాల భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేశామని, ఇప్పుడు మంత్రి టీజీ భరత్ తన హయాంలోనే మొత్తం జరిగినట్లు చెప్పడం దారుణమన్నారు. కాగా టీడీపీ నాయకులు చెప్పగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అక్రమ కేసులు పెడితే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
చాగలమర్రిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. ఎల్నినో ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్నినో కారణంగానే రుతుపవనాలు బలహీనపడినట్లు తెలుస్తోంది. చాగలమర్రిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం రోహిణి కార్తె కావడంతో రోళ్లు పగిలే తీవ్రమైన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటం గమనార్హం. మండలం ఉష్ణోగ్రత నంద్యాల రూరల్ 43.8 ఆళ్లగడ్డ 43.1 గోస్పాడు 42.7 గూడూరు 42.3 ఉయ్యాలవాడ 42.4 సంజామల 42.1 దొర్నిపాడు 42.1 రుద్రవరం 42 కోడుమూరు 41.8 కోసిగి 41.6 -
160 ఆర్బీకేలు మూత
ఇతర సేవలకు వీఏఏ, వీహెచ్ఏలు ● వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి రైతులకు సేవలు అందించాల్సిన వీఏఏ, వీహెచ్ఏలను చంద్రబాబు ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోంది. ● నిరంతరం ఏదో ఒక సర్వే చేపడుతూ.. ఇందులో వీఏఏ, వీహెచ్ఏలను సైతం భాగస్వాములను చేస్తుండటంతో రైతులకు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతోంది. డోన్ మండలం కొత్తపల్లిలో సేవలకు దూరమైన రైతుభరోసా కేంద్రం కర్నూలు(అగ్రికల్చర్): దేశానికే రోల్మోడల్గా గుర్తింపు పొందిన రైతుభరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) నేడు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుతోనే వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. రైతుభరోసా కేంద్రాల పేరుతోనే కొనసాగితే వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మదిలో చిరస్థాయిగా ఉండిపోతారనే అక్కసుతో రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేశారు. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో రైతన్నలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ ఆ రోజులు పునరావృతం అవుతున్నాయి. వైఎసార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849 ఆర్బీకేలు ఉండగా.. 28 ఆర్బన్ ప్రాంతాల్లో సేవలందించాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు రూపుదిద్దుకోవడం విశేషం. రైతులకు విశేషంగా సేవలు అందించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన రేషనలైజేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 408, నంద్యాల జిల్లాలో 309 మిగిలాయి. కర్నూలు జిల్లాలో 58, నంద్యాల జిల్లాలో 102 రైతుభరోసా కేంద్రాలను మూసివేయడం గమనార్హం. ఆర్బీకేలు మూతపడటంతో 160 పోస్టులు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఆర్బీకేలకు వీఏఏ, వీహెచ్ఏ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సెరికల్చర్కు సంబంధించి 13 వీఎస్ఏలను గత వైఎసార్సీపీ ప్రభుత్వం నియమించింది. వీరందరికీ పదోన్నతులు లభించాయి. ఆ తర్వాత వీటిని భర్తీ చేయడం పక్కనపెడితే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రద్దు చేసింది. రైతు గ్రంథాలయం కనుమరుగు రైతుల్లో వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు ప్రతి ఆర్బీకేలో 50 పుస్తకాలతో రైతు గ్రంథాలయం ఏర్పాటైంది. నేడు ఆర్బీకేల్లో గ్రంథాలయాల ఉనికే లేకుండా పోయింది. వీటి ద్వారా ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేయడం జరిగేది. నేడు ఆర్బీకేలు గ్రామాల్లో దిష్టిబొమ్మలను తలిపిస్తున్నాయంటే ప్రభుత్వం ఏస్థాయిలో కక్షగట్టిందో అర్థమవుతోంది. దిష్టిబొమ్మల్లా రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్బీకేల వ్యవస్థ వ్యవసాయ శాఖలో సరికొత్త విప్లవం. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడం, ఇందుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్(విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు)తో రైతులకు అండగా నిలిచాయి. ఖరీఫ్, రబీ సమయాల్లో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధకశాఖ, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమల య్యాయి. రైతులకు విశేష సేవలు అందించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆర్బీకేల ద్వారా నేడు రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర ఏ విధమైన సేవలు అందని పరిస్థితి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన ఏ అవసరానికై నా డిజిటల్ కియోస్క్ ద్వారా ఆర్డర్ పెడితే కొన్ని గంటల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చేవి. నేడు డిజిటల్ కియోస్క్లు మూలన పడ్డాయి. -
మంత్రి ఇలాఖాలో పేట్రేగుతున్న మట్టి మాఫియా
నంద్యాల(అర్బన్): రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ప్రాతినిథ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగుతోంది. అనుమతులు లేకుండా కుందూ నది, చెరువులు, కుంటల్లో ఇసుక, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు తరలించి రోజు రూ. లక్షల్లో పోగేసుకుంటున్నారు. నంద్యాల మండలంలోని భీమవరం, ఊడుమాల్పురంతో పాటు గోస్పాడు మండలంలోని రాయపాడు గ్రామాల సమీపంలోని కుందూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అదే విధంగా నంద్యాల చిన్న చెరువు, కానాల నాగమ్మ చెరువు, మిట్నాల చెరువు కుంటల్లో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై రైతులు, ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో టీడీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కానాల నాగమ్మ చెరువు నుంచే రోజుకు 100 ట్రాక్టర్లతో దాదాపు 800 నుంచి 1000 ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. ఒక్కో ట్రిప్పుకు ట్రాక్టర్ యజమానికి రూ.330 మాతమ్రే చెల్లిస్తుండగా బయట రూ.700 నుంచి రూ.900 మధ్యన విక్రయిస్తూ సొమ్ము చేసుకుంున్నారు. మొత్తం మీద నంద్యాల చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. పట్టపగలే బహిరంగంగానే జేసీబీలు ఏర్పాటు చేసి ఇష్టారీతిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ మట్టి మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేత హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన అండతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మామూళ్లతో సరిపెట్టుకుని... చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ సమీపంలోని నంద్యాల చిన్న చెరువుతో పాటు భీమవరం వద్ద ఉన్న కుందూనది మట్టి, పట్టణంలోని 1వ వార్డు, ఊడుమాల్పురం, రాయపాడు వద్ద ఉన్న కుందూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేత ఆదేశాలతో కనీసం ఇరిగేషన్ సిబ్బంది కూడా అటు వైపు వెళ్లకుండా అతను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు చుట్టపు చూపుగా వెళ్లి మట్టి మాఫియా ఇచ్చే మాముళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఓ వైపు జలధార.. జలహారతి అంటూ చెరువుల పరిరక్షణ పేరుతో పనులు జరుగుతుండగా.. మరో వైపు మట్టి మాఫియా చెరువులను కొల్లగొడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.5.28 కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ఉభయ దే వాలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.5,28,37,281 లభించినట్లు కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవా రం అలంకార మండపంలో హుండీ కానుకలను లెక్కించారు. గత 33 రోజుల్లో భక్తులు ఈ ఆదాయాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పించారన్నా రు. అలాగే బంగారం–96.500 గ్రాములు, వెండి–3.780 కేజీలు లభించిందన్నారు. అలాగే కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్దిని, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థాన సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. అన్నదాన పథకానికి రూ.2లక్షల విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తు న్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.2 లక్షల విరాళాలు సమర్పించారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన సచిన్ కుమార్ దేవరెడ్డి రూ.లక్ష, కర్నూలుకు చెందిన కె.నాగరాజు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని అందించి సత్కరించారు. ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష వాయిదా నంద్యాల(న్యూటౌన్): ఈనెల 28వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఎకనామిక్స్ పేపర్–1, మ్యాథ్స్–2బీ పరీక్షలను బక్రీద్పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి శంకర్నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు జరగాల్సిన పరీక్షను జూన్ 5న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్డీఓలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆదేశాల మేరకు 26, 27వ తేదీన ఆన్సర్ బుక్స్ పరీక్షలు సంబంధిత పోస్టాఫీసుల్లో బుక్ చేయాలన్నారు. పరీక్షలు లేకపోయినప్పటికీ తమ పరీక్షా కేంద్రాలకు హాజరై జరిగిన పరీక్షలకు సంబంధించి ఆన్సర్ బండిల్స్ను కచ్చితంగా పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలన్నారు. తేదీల ప్రకారం ట్రంక్ బాక్సుల్లో ఉన్న ప్రశ్నాపత్రాలను డివైజ్గా సక్రమంగా సర్దుబాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్స్తో యువత జాగ్రత్త బొమ్మలసత్రం: రుణాలు పొందేందుకు నిషేధిత లోన్ యాప్స్లో యువత వ్యక్తిగత వివరాలు నమో దు చేస్తే అది చాలా ప్రమాదమని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మంగళవారం ప్రకటన ద్వారా హెచ్చరించారు. యువత అవసరాలను ఆసరాగా చేసుకుని తక్షణమే లోన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నకిలీ ఏపికే ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని, అ లాగే ఆర్టీవో ఈ చలానా, వెడ్డింగ్ ఇన్విటేషన్ లాంటి మెస్సేజ్లు తెరవద్దని హెచ్చరించారు. ఈలింక్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్ధిక నేరాల కు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా గురై ఉంటే వెంటనే 112, 100 నంబర్లను సంప్రదించాలని కోరారు. సబ్జైలు తనిఖీ నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్ జైలు ను ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జై లు పరిసరాలను, వంట, స్నానపు గదులు, జైలు గదులను, పరిశీలించారు. అనంతరం ఖైదీల ఆరోగ్య విషయాలు, వారి నేర వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామన్నారు. అదే విధంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, పారా లీగల్ న్యాయవాది బాలు, తదితరులు పాల్గొన్నారు. -
పూల మార్కెట్లో చోరీ
డోన్ టౌన్: పట్టణంలోని నంద్యాల, కర్నూలు రైల్వే గేట్ల మధ్యలో ఉన్న పూల మార్కెట్లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి పూల మార్కెట్లోని పది దుకాణాలకు ఉన్న షట్టర్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వ్యాపారస్తులు పూల శ్రీను, ఖాజా మస్తాన్ వలి, ఉప్పరి శ్రీను, తారా, రవి, వీరేష్, భీముడు, రషీద్, చిన్నన్న, రాజు వారికి చెందిన దుకాణాల్లో చోరీకి పాల్పడ్డాడు. ఓ బైకుతో పాటు దాదాపు రూ.20వేల వరకు నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు నెమలి అప్పగింత పగిడ్యాల: ఎం. ఘణపురం గ్రామంలో ఆదివారం లభ్యమైన నెమలిని ఆత్మకూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జ్యోతిస్వరూప్కు పంచాయతీ కార్యదర్శి అనిల్ సోమవారం అప్పగించారు. గ్రామ సమీపలోని పంట పొలాల్లోకి మేత కోసం వచ్చిన నెమలిని కుక్కలు తరుముతూ వెంటపడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు నెమలిని కుక్కల బారి నుంచి రక్షించి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్కు అప్పగించారు. కుక్కల దాడిలో గాయాలకు గురైన నెమలికి పశువైద్యాధికారి విజయ్ చికిత్స చేశారు. అనంతరం ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం అధికారులు ఘణపురం గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ ఆటో బోల్తా.. కోడిగుడ్లు నేలపాలు ఎమ్మిగనూరురూరల్: ఆదోని నుంచి రాయచూర్కు కోడిగుడ్లను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో సోమవారం నలందా కాలేజీ సమీపంలో బోల్తా పడింది. అందులో ఉన్న కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. కోడిగుడ్లు పగిలిపోయి రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. -
గోరుకల్లు, అలగనూరుకు మరమ్మతులు చేపట్టాలి
నంద్యాల(న్యూటౌన్): గోరుకల్లు, అలనూరు రిజర్వాయర్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రైతులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, ఉపాధి హామీ పథకంలో ఫేస్ యాప్, రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎదుట రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. సంఘాల సమన్వయ కమిటీ నాయకుడు సుబ్బారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉపాధి పనులు చేసే చోట తాగునీటి సౌకర్యం కల్పించి కూలీలందరికీ పనిముట్లు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజల్, గ్యాస్, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు భాస్కర్, సురేష్, శ్రీనివాసరెడ్డి, ఏలియా, నాయక్, డేవిడ్, కరీముల్లా, రత్నమయ్య పాల్గొన్నారు. -
వంక కాదు రోడ్డే!
పై చిత్రంలో కనిపిస్తున్నది వంక అనుకున్నారా.. అది రోడ్డే! వర్షానికి రోడ్డుపై ఉన్న గుంతలో నీళ్లు నిలిచి ఇలా దర్శనమిస్తోంది. మార్లమడికి వద్ద ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలను కలిపే వేదావతి(హగరి) నది వంతెన రోడ్డు ఇది. రోడ్డుపై పెద్ద గుంతలు ఉండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఎక్కడ గుంతలు ఉన్నాయో..రోడ్డు ఎక్కడ ఉందో అర్థంకాక కిందపడి గాయపడుతున్నారు. శనివారం రాత్రి కొద్దిపాటి వర్షం కురవడంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరి వంకలా కనిపిస్తోంది. – హొళగుంద -
రాజు వెడలె వేటకు..
రాజులు, రాజ్యాలు కాల గర్భంలో కలసిపోయాయి. అయినా ఆ నాటి వైభవం శిల్పాలు, శిలా శాసనాల ద్వారా బయటపడుతూనే ఉంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నాటి అరుదైన రాతి చిత్రం చెత్తపాలవుతున్నా పట్టించుకునేవారు లేరు. తాటిపాడు గ్రామ సమీపంలోని ఎత్తిపోతల పథకం పంప్హౌస్ వద్ద చెత్తకుప్పల్లో ఓ రాతి చిత్రం కొన్నాళ్లుగా అక్కడే ఉన్నా అధికారులు అటు వైపు చూడటం లేదు. ఎవరో రాజు గుర్రంపై కూర్చుని ఈటెతో అటవీ జంతు వును వేటాడుతున్నట్లుగా బండ రాయిపై చెక్కిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. పూర్వం గద్వాల సంస్థానం రాజులు కృష్ణా, తుంగభద్ర నదుల తీరం వెంట ఉన్న నల్లమల ప్రాంతానికి చేరుకొని వేటాడే వారని, ఆ క్రమంలో ఎవరైనా రాజు తన చిత్రాన్ని బండరాయిపై చెక్కించినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. రాతి చిత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి భవిష్యత్ తరాలకు భద్రపరచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. – జూపాడుబంగ్లా -
ఆప్టా నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
కర్నూలు సిటీ: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికకు సోమవారం నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రకాష్ రావు పాల్గొనగా, నూతన జిల్లా కమిటీ, నూ తన కార్యవర్గం ఎంపికకు రాష్ట్ర నాయకులు బండారు శంకర్ ఎన్నికల అధికారిగా వ్యవహారించారు. సమావేశంలో పాల్గొన్న ఆయా మండలాల నాయకులు నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎం.మధుసూదన్ రెడ్డి(కోడుమూరు), జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.గోపాల్(కర్నూలు), ఆర్థిక కార్యదర్శిగా ఎన్.బి వినోద్కుమార్(ఆస్పరి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు అసోసియేట్ అధ్యక్షులుగా లక్ష్మా నాయక్, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రసాద్, డి.లక్ష్మన్న, బషీర్, పద్మావతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి బండారు శంకర్ వెల్లడించారు. వాగులోకి దూసుకెళ్లిన కారు పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని తిరుమల గిరి కాలనీ వద్ద కారు దుర్రవాగులోకి దూసుకెళ్లింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు.మధుసూదన్ రెడ్డి, గోపాల్, వినోద్కుమార్ -
బైన్దొడ్డి తిప్పను పరిశీలించిన మైనింగ్ అధికారులు
కోడుమూరు రూరల్: మండలంలోని బైన్దొడ్డి తిప్పను సోమవారం మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు పరిశీలించారు. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బైన్దొడ్డి తిప్ప నుంచి గత కొద్ది నెలలుగా యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు. ఎర్రమట్టి మాఫియాపై ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 17న ‘బైన్దొడ్డి..కొల్లగొట్టి’, 22న ‘కరిగిపోతున్న బైన్దొడ్డి’ అనే శీర్షికలతో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలకు మైనింగ్ అండ్ జియాలజీ ఇన్స్పెక్టర్ శివపార్వతి, టెక్నికల్ అసిస్టెంట్ బాలునాయక్ స్పందించి సోమవారం బైన్దొడ్డి తిప్పను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివపార్వతి మాట్లాడుతూ.. బైన్దొడ్డి తిప్ప నుంచి ఎర్రమట్టి తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎవరైనా అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి ఎర్రమట్టి తవ్వకాలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
ప్రసవాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం
● అరుదైన రికార్డు సాధించిన ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి ● జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1,024 మందికి ప్రసవాలుఎమ్మిగనూరురూరల్: ప్రసవాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి మరోసారి కై వసం చేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రి నుంచి వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ అయ్యింది. నాలుగేళ్లుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 1,024 మందికి ప్రసవాలు కాగా అందులో 281 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. ఇందుకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ చంద్రబాబు నుంచి ప్రశంసాపత్రం వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ సోమవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటల్స్లో ఐదో సారి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. సేవలు ఇలా.. ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్ ముగ్గురు గైనకాలజిస్టులకు అందుబాటులో ఉన్నారు. నెలకు 280 నుంచి 340కి పైగా నార్మల్ డెలివరీలు, సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు, సాధారణ చెకప్లు అందిస్తున్నారు. అర్ధరాత్రి అయినా అత్యవసరమైన కాన్పుకోసం వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఒక్క రోజే 500 మందికి స్కానింగ్ ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, పెద్దకడుబూరు, కోసిగి మండలాల నుంచి వచ్చే గర్భవతులకు ప్రతి నెలా 9న స్కానింగ్ పరీక్షలకు చేస్తారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సుజిత, ఫాతిమా, హిమబిందు గర్భవతులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ప్రతి నెలా 9వ తేదీ ఒక్కరోజే 490 నుంచి 500 మందికి పైగానే గర్భవతులకు స్కానింగ్ పరీక్షలు చేసి టాప్లో నిలుస్తున్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం. నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్లు, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు 41 మందికి స్టేమీ ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాం. – డాక్టర్ ఆదినాగేష్, సూపరింటెండెంట్ సంవత్సరం (ఏప్రిల్–మార్చి) నార్మల్ డెలివరీ ీసిజేరియన్ మొత్తం 2022-23 (ఏప్రిల్–మార్చి) 2,778 517 3,295 2023-24 (ఏప్రిల్–మార్చి) 2,642 62 2,704 2024-25 (ఏప్రిల్–మార్చి) 3,419 607 4,026 2025-26 (ఏప్రిల్–ఢిశంబర్) 1,709 553 2,262 2026 జనవరి–ఏప్రిల్ 743 281 1,024 -
మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్రదీపార్చన సేవ
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గుండెపోటుతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుదర్శన్ రాజు (57) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. నంద్యాల జిల్లా అయ్యలూరుమిట్ట గ్రామానికి చెందిన ఈయన 1995లో ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. పత్తికొండ, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఈయన కర్నూలు శివారు నందికొట్కూరు రోడ్డులోని చైతన్య నగర్లో నివాసముంటున్నాడు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోవడంతో 108 అంబులెన్స్కు సమాచారమిచ్చారు. వారు ఇంటి వద్దకు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐ వెంకటరాజుతో పాటు సహోద్యోగులు రామలింగ, చంద్రపాల్, నరసింహులు, ఎం.రాజు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, సువర్ణమ్మ తదితరులు ఇంటి వద్దకు చేరుకుని పూలమాలతో నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మహిళ ఆత్మహత్య బండిఆత్మకూరు: కడమల కాలువ గ్రామానికి చెందిన తలారి మహేశ్వరి (31) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మహేశ్వరి గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధ పడుతుండేదని, ఈ క్రమంలో ఆదివారం నొప్పి తాళలేక మనస్తాపం చెంది గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త తిరుపతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరుడు మహేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఖరీఫ్కు అంతా సిద్ధం
నంద్యాల(అర్బన్): జూన్ 2వ వారంలో ప్రారంభం కానున్న 2026 ఖరీఫ్కు సిద్ధంగా ఉన్నామని, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడా ది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయన్నారు. భూసారం పెంచేందుకు ఈ ఏడాది పచ్చిరొట్ట పంటల విత్తనాలైన జీలుగ 5,685 క్వింటాళ్లు, పిల్లిపెసర 1,515 క్వింటాళ్లు, జనుము 76 క్వింటాళ్లు, వేరుశనగ 2,136 క్వింటాళ్లు, మినుము 40, కొర్ర 27క్వింటాళ్లు మొత్తం 9,479 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్కు జిల్లాకు 1,73,115 టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా జిల్లాలో ఇప్పటికే 27,304 టన్నుల యూరియా, 11,309 టన్నుల డీఏపీ, 43,804 టన్నుల కాంప్లెక్స్ ఎరువుల అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా ఇప్పటికే వ్యవసాయ యంత్ర పరికరాలకు 8.6 కోట్లు మంజూరు కాగా రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ● జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు -
రేషన్కు ఈ కేవైసీ గండం
నంద్యాల(అర్బన్): జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్కార్డుదారులకు రేషన్ సరఫరా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్ షాపుల వద్దకు వెళ్లలేక పలువురు లబ్దిదారులు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో రేషన్కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలుకూడా ఆగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 1204 రేషన్ షాపుల్లో 5.41 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 27,205 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదు. ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోకుంటే రేషన్తో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలసపోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, రేషన్ డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో కార్డు దారులు ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్తో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. -
మే..మే.. తినేశాం!
● మేకను అపహరించి ఆరగించిన టీడీపీ నాయకులు ● పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ‘అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తిని పొట్ట ముందుకు వచ్చింది.. ఉక్కకు తట్టుకోలేకపోతున్నాం.. కాసింతైనా వాన పడింటే బాగుండు’ అనుకుంటున్న టీడీపీ నేతలను చల్లబరుస్తూ మేఘం వర్షించింది. అంతా బాగానే ఉన్నా వానలో ఒక ముక్క అయినా నమిలితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకులు మేకను కొట్టేశారు. ఎవరికీ తెలియకుండా దాన్ని కై మా చేసి ఆరగించారు. మేక ఊరుకుంటుందా? వారి పొట్టలోకి వెళ్లినా ‘మే..మే..’ అని అరిచింది.. విషయం అందరికీ తెలిసింది. పంచాయితీ పోలీస్ స్టేషన్కు వరకు వెళ్లింది. ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టిని దోచుకుంటున్న టీడీపీ నేతలు తామేం గొప్పవారు కాదని, మేకను తిన్నవారే సంపద సృష్టించే అసలైన పార్టీ నాయకులని కీర్తిస్తూ గీతాలు పాడుతున్నారు. ఇది కథ కాదు.. గోనెగండ్లలో జరిగిన వాస్తవం. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. గోనెగండ్లలో ఒక మేక పొలం నుంచి దారితప్పి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి చేరింది. దీన్ని గమనించి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు డైరెక్టర్, టీడీపీ నాయకుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మరో ముగ్గురు కలిసి మేక తీసుకెళ్లారు. కోసుకొని కుప్పలుగా వేసి, పంపకాలు చేసుకుని, ఎవరికీ తెలియకుండా ఆరగించారు. ఈ విషయం మేక యాజమానికి తెలిసి స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచారణ చేసి మేక మాంసాన్ని ఆరగించిన టీడీపీ నాయకులను విచారణకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీపీఐకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ‘మీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు రచ్చకెక్కితే బాగోదు’ అంటూ సర్దిచెప్పారు. మేకను ఖరీదు చేసి పరిహారాన్ని బాధితుడికి ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ విషయం తెలిసి గోనెగండ్ల మండల ప్రజలు టీడీపీ నాయకులు ఇలాగా కూడా ఉంటారా అని నవ్వుకున్నారు. – గోనెగండ్ల -
పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు
శిరివెళ్ల: కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేస్తు న్నారు. ఆయా పాఠశాలల్లోని తరగతి గదులు, హెచ్ఎం, స్టాఫ్ రూంలలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. జిల్లాలోని 43 పాఠశాలలో 730 సీసీ కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మండలంలోని శిరివెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్లో పనులు జరుగుతున్నాయి. ప్రతి తరగతి గదికి సీసీ కెమెరా ఏర్పాటుతో విద్యార్థులపై పర్యవేక్షణ మరింత సులువవుతోంది. శిరివెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 20, మోడల్ స్కూల్లో 30, రుద్రవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10, మోడల్ స్కూల్లో 16, ఆళ్లగడ్డ బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలో 30, బాలికల పాఠశాలలో 7, చాగలమర్రి ఉన్నత పాఠశాలలో 8, దొర్నిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల 8, ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. కాగా జిల్లాలో ఇంత వరకు 10 పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు జరిగాయి. త్వరలో కస్తూర్బా పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎంఈఓ నాగార్జునరెడ్డి తెలిపారు. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. చెక్ డ్యాం కబ్జా పగిడ్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని మండలంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పడమర ప్రాతకోట గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఆ గ్రామ టీడీపీ నాయకుడు యత్నించగా స్థానికులు అడ్డుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరువక ముందే పగిడ్యాలలో చెక్ డ్యాం కబ్జా ఉదంతం వెలుగులోకి వచ్చింది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలు అభివృద్ధి చేయాలని నల్లవాగు కాలువపై రూ. లక్షలతో గతంలో చెక్ డ్యాం నిర్మించారు. అయితే రెండు రోజుల క్రితం చెక్ డ్యాం పక్కనే పొలం ఉన్న టీడీపీ నాయకుడు చెక్ డ్యాం ఆనవాలు లేకుండా ధ్వంసం చేసి ఆ స్థలాన్ని పొలంలోకి కలుపుకోవడానికి యత్నించాడు. విషయం తెలిసిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఖాజాబాబు అడ్డుకున్నాడు. టీడీపీ నాయకుడి నిర్వాకంపై జిల్లా కలెక్టర్, పోలీసుల ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. చెంచు గూడేల్లో దోమల నివారణ చర్యలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని చెంచు గిరిజన గూడేల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో మలేరియా అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచులు మలేరియా, డెంగీ, చికున్గున్యా జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఏసీఎం 5 శాతం పిచికారీ చేయాలన్నారు. కొత్తపల్లి, మద్దూరు, శ్రీశైలం, సున్నిపెంట, కపిలేశ్వరం, నాగులూటి గూడేల్లో దోమల నివారణపై చెంచులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎంఓలు సత్యనారాయణ, విజమ్కుమార్, సబ్ సెంటర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పిల్లల భద్రత సమాజ బాధ్యత
కర్నూలు: పిల్లల భద్రత సమాజ బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు కోర్టు కాంపౌండ్లోని న్యాయ సేవా సదన్లో అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా సంబంధిత అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రితో పాటు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, సీ్త్ర, శిశు సంక్షేమ మహిళాభివృద్ధి ఆఫీసర్ విజయ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రతి సంవత్సరం వేలాదిమంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాప్, అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు, కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పిపోయిన పిల్లల కోసం న్యాయసేవలు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయని.. పోలీసులు, పీఎల్వీలు అందుబాటులో ఉంటారన్నారు. ఉమ్మడి జిల్లాల మిస్సింగ్ చిల్డ్రన్స్ సమాచారాన్ని సేకరించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
ఒత్తిడి నివారణకు ధ్యాన శిక్షణ
కర్నూలు: పోలీసు అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం జిల్లా పోలీసు కార్యాలయ మైదానం, బి.క్యాంప్లోని కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక మెడిటేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మూడు రోజుల పాటు ధ్యాన తరగతులు నిర్వహించనున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది మొదటి రోజు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు, ట్రైనర్లు, పోలీసు సిబ్బందికి శ్వాస ప్రక్రియలు, ఏకాగ్రత పెంపొందించే సాధనాలు, మానసిక ఒత్తిడిని తగ్గించే ధ్యాన విధానాలపై ప్రత్యేకంగా శిక్షణ అందించారు. వెంకటరమణ కాలనీలోని సీఐడీ, ఏపీఎస్పీ రెండో బెటాలియన్, వెల్దుర్తి, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని పోలీసులకు కూడా హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో మెడిటేషన్ తరగతులు కొనసాగనున్నాయి. -
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందజేసిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను చివరి నిమిషం వరకు పెండింగ్లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 61,530 అర్జీలు స్వీకరించగా, అందులో 4,214 అర్జీలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇంకా పరిశీలించని 128 అర్జీలను వెంటనే ఓపెన్ చేసి పరిశీలించాలన్నారు. రీఓపెన్ అర్జీలు 197 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా అర్జీదారులతో సంబంధిత శాఖ అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినప్పటికీ, విద్యుత్ శాఖ, పౌర సరఫరాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, సెర్ప్, టిడ్కో, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తదితర శాఖలు ఇప్పటి వరకు నివేదికలు సమర్పించలేదన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 153 దరఖాస్తులు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు ‘ఫొటో’ తిప్పలు
రుద్రవరం: నిబంధనల పేరుతో అధికారులు ఉపాధి కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదయం పని ప్రదేశానికి వెళ్లగానే ఓ ఫొటో, పని ముగిశాక రెండో ఫొటో దిగాల్సి రావడం తప్పనిసరి చేయడంతో కూలీలు గంటల తరబడి పనుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం ఫొటో వరకు బాగున్నప్పటికీ రెండో ఫొటోతోనే సమస్య తీవ్రమవుతోంది. ఒకసారి ఫొటో దిగితే రెండో ఫొటో తీసుకునేందుకు తప్పనిసరిగా నాలుగు గంటల వ్యవధి పడుతోంది. అంతే కాక ఒక్కోసారి సర్వర్ పని చేయక మరింత సమయం పడుతోంది. ఇలా రెండో ఫొటో ఆలస్యం కావడంతో కూలీల అవస్థలు వర్ణణాతీతం. ఇప్పటికే పని ప్రదేశంలో నీడ సౌకర్యం లేక మండే ఎండలో కూలీలు అలసిపోతున్నారు. రెండో ఫొటో కోసం ఎండలో నిరీక్షించాల్సి రావడంతో కూలీలు మండిపడుతున్నారు. తిప్పారెడ్డి పల్లె వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన రెండో ఫోటో కోసం దాదాపు 80 మంది కూలీలు పడిగాపులు కాశారు. ఎండకు తాళలేక ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల నీడన కూర్చుండి పోయారు. ఫొటో సమస్యపై ఏపీఓ గౌరీబాయ్ని అడగ్గా సాఫ్ట్ వేర్ అప్డేట్ కాక పోవడం, సర్వర్ పని చేయక పోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. -
పొట్టేళ్ల సంత కిటకిట
విక్రయానికి ఉంచిన పొట్టేళ్లు బక్రీద్ పండుగ సమీపిస్తుండటంతో ముస్లింలు ఖుర్బానీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొట్టేళ్ల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎమ్మిగనూరు పొట్టేళ్ల సంత కిటకిటలాడింది. ఎమ్మిగనూరుతో పాటు కర్నూలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలు దారులు తరలివచ్చారు. వ్యాపారులు, పొట్టేళ్ల పోషకులు పొట్టేళ్ల ధరను పెంచి విక్రయించారు. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా ధర నిర్ణయించి విక్రయానికి ఉంచారు. పండుగకు ముందు వచ్చే చివరి ఆదివారం సంతలో పొటేళ్ల క్రయ,విక్రయాలు జోరందుకున్నాయి. – ఎమ్మిగనూరుటౌన్రూ.52 వేల ధర పలికిన పొట్టేలు -
సర్పై అప్రమత్తంగా ఉండాలి
● ఎమ్మెల్సీ ఇసాక్బాషానంద్యాల: ఎన్నికల సంఘం నిర్వహించే సర్ కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసాక్బాషా మాట్లాడుతూ.. జూలై నెల నుంచి ఏపీలో సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాను పటిష్టం చేయడానికి, తప్పులను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రజలు తమ ఓటు భద్రతపై ఏ మాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు నిర్ణయించే ఓటును కాపాడుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ సర్వేలో లక్షలాది మంది ఓట్లు గల్లంతైనట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో పాల్గొనకపోతే ఓటు హక్కును తొలగించే అవకాశం ఉందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో ఉండేలా, నకిలీ ఓట్లు వేరు చేసేలా చూసే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తమ ఓటు హక్కు భద్రంగా ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తును ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. రాజకీయాలకు అతీతంతా ప్రతి ఒక్కరు సర్ కార్యక్రమంలో పాల్గొని ఓట్లు గల్లంతు కాకుండా, దొంగ ఓట్లు లేకుండా చూసుకోవాలన్నారు. -
గాలివాన బీభత్సం
● నేలకొరిగిన చెట్లు, విరిగిపడిన కరెంట్ స్తంభాలు ● పలు చోట్ల నిలిచిపోయి విద్యుత్ సరఫరా ● దెబ్బతిన్న మామిడి, వివిధ పండ్ల తోటలు కర్నూలు(సెంట్రల్): జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ పట్టణాల్లో హోర్డింగ్లు, పెద్ద పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కర్నూలు నగరంలోని 20 వార్డులు, జిల్లాలో 50 గ్రామాల్లో అంధకారం నెలకొంది. మామిడి తోటల్లో కాయలు రాలి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కర్నూలు నగరంలోని రాజ్విహార్, ఆర్ఎస్రోడ్డు, కలెక్టరేట్, సీక్యాంపుల్లో పలు చోట్ల పాతబడిన కరెంట్ స్తంభాలు విరిగిపోయి. వృక్షాలు నేలమట్టం కావడతో ట్రాఫిక్కు అంతరాయం నెలకొంది. ముఖ్యంగా కలెక్టరేట్లోని పలు చెట్లు విరిగి పడ్డాయి. దీంతో మునిసిపల్ అధికారులు వాటి ని తీసివేసేందుకు చర్యలు తీసుకున్నారు. చాలా చోట్లా విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, వైర్లు గాలికి కోట్టుకుపోవడంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. దాదాపు 20 వార్డుల్లో శనివారం రాత్రంతా అంధకారం నెలకొంది. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ఆదివారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మామిడి రైతులకు తీవ్ర నష్టం గాలివాన బీభత్సం సృష్టించడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు కాపు దశలో ఉండడంతో ఒక్కసారిగా రాలిపోయాయి. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, చిప్పగిరి, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో దాదాపు 150 ఎకరాల్లో ఉన్న తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కర్నూలులో ఒకరు మృతి గాలివాన బీభత్సానికి కర్నూలులో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. కల్లూరు మండలం పందిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ శనివారం సాయంత్రం కర్నూ లు నగరంలోని బీఆర్ రెడ్డి కాలనీ వెనుకవైపు ప్రయాణికులను దింపడానికి వెళ్లారు. అయితే ఆకస్మికంగా గాలివాన రావడంతో ఆటోపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకులు టి.రాముడు. వై.నగేష్ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖకు రూ.1.20 కోట్ల నష్టంకర్నూలు (టౌన్): గాలివాన బీభత్సంతో విద్యుత్ శాఖకు రూ.1.25 కోట్లు నష్టం వాటిల్లింది. జిల్లాలో 475 విద్యుత్ స్తంభాలు, 60 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్లు, 17 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 139 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నా ఆదివారం సాయంత్రానికి పూర్తి కాలేదు. దీంతో కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలు, అనేక గ్రామాలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది.పిడుగుపడి వ్యక్తి మృతి నందికొట్కూరు: పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె గ్రామ పొలిమేరలో శనివారం రాత్రి గొర్రెలు మేపుతుండగా నందికొట్కూరు పట్టణం వడ్డేపేటకు చెందిన కందాల రాముడు(60) పిడుగు పడి మృతి చెందాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి కుమారులు రామకృష్ణ, రాజు కన్నీటి పర్యంతమయ్యారు. -
వామ్మో.. థై‘రాయి’డ్!
● జిల్లాలో పెరుగుతున్న వ్యాధి కేసులు ● పిల్లలు, పెద్దలు అందరూ బాధితులే! ● అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు కర్నూలు(హాస్పిటల్): థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. పాతికేళ్ల క్రితం వందలో ఒకరిద్దరిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ప్రతి పది మందిలో ఒకరికి ఉంటోంది. గతంలో మహిళల్లోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మగవారిలోనూ సాధారణంగా కనిపిస్తోంది. పిల్లలు, పెద్దలు, సీ్త్రలు, పురుషులు అన్న తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ చికిత్స నిర్వహిస్తారు. ప్రతి నెలా 700 నుంచి 800 మంది థైరాయిడ్ సమస్యతో చికిత్స కోసం ఈ విభాగానికి వస్తారు. వీరిలో 500 నుంచి 600 మందికి హైపోథైరాయిడిజం, 200 మందికి హైపర్ థైరాయిడిజం ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక్కడే గాక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులైన జనరల్ ఫిజీషియన్, ఎండోక్రైనాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 200 మంది దాకా ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు అంచనా. జాగ్రత్తలు తప్పనిసరి థైరాయిడ్ వ్యాధి ఉన్న వారికి మెడ కింద భాగంలో వాపు కనిపిస్తుంది. ఆందోళన/నిరాశతో సహా మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి. వేడి/చలితో ఇబ్బంది, పొడి చర్మం, పెళుసుగా ఉండే గోళ్లు, ముఖం ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బాధితులకు కీళ్లనొప్పులతో పాటు ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. థైరాయిడ్ లక్షణాలు ఉంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకుని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో అయోడిన్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియను ఉత్తమంగా చేయడానికి, నట్స్, చిక్కుళ్లు, తృణదాన్యాలు వంటి సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి ఉంటే దానిని నియంత్రించుకోవడంతోపాటు తరచూ వ్యాయామం చేయాలి. -
అరటి తోటకు నిప్పు
మహానంది: మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్కాకుల నారాయణ అరటి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అరటిచెట్లతో పాటు చెట్లను కాపాడుకోవడానికి తెచ్చుకున్న కర్రలు, డ్రిప్ పరికరాలు కాలిబూడిదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. నారాయణ సాగు చేస్తున్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భారీ గాలుల నుంచి చెట్లను కాపాడుకునేందుకు సపోర్ట్గా ఏర్పాటు చేసేందుకు కర్రలు ఇటీవల కొనుగోలు చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు వెయ్యి కర్రలు, డ్రిప్ పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ. 2లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు నారాయణ తెలిపారు. -
సీఎం గారూ.. ఆడవాళ్లు పిల్లలను కనే యంత్రాలా?
కర్నూలు(సెంట్రల్): ఆడవాళ్లంటే పిల్లలను కనే యంత్రాలుగా సీఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, ఎవరు ఎంతమంది పిల్లలను కనాలో ఆయనే నిర్ణయించే హక్కు ఎవరిచ్చారని ఏపీ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా కార్యదర్శి పి.శ్రావణిరెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్లే ముగ్గురు, నలుగురు సంతానం కలిగితే వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్, పౌష్టికాహారం, ఉన్నత సదుపాయాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. నేడు ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లితే లక్ష బిల్లు వేస్తున్నారని, ఈ సమయంలో మూడో కాన్పుకు రూ.30 వేలు, నాలుగో కాన్పుకు రూ.40 వేలు ఇస్తేలా ఎలా సరిపోతాయన్నారు. నేటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో కుటుంబం ముగ్గురు, నలుగురు పిల్లలను సాకి పెద్ద చేసే పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం ఒక్కరినీ, ఆయన కుమారుడు లోకేష్ కూడా ఒక్కరే సంతానమని, అయితే ప్రజలను మాత్రం నలుగురిని కనాలని చెప్పడం వారికి భావ్యమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆశాబేగం, సోఫియా, రజియా పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి ఆదివారం హైదరాబాద్కు చెందిన టీ.వెంకటరామయ్య రూ.1,01,116విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, బాండ్ అందించి సత్కరించారు. పోక్సో కేసు నమోదు అవుకు(కొలిమిగుండ్ల): జూనూతల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వెంట పడుతూ వచ్చాడు. బాలిక మైనర్ అని తెలిసి కూడా పదే పదే ప్రేమించమని వెంటపడుతుండేవాడు. తనను ప్రేమించక పోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులపై తేనెటీగల దాడి పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె సమీపంలో కొండపై ఉన్న శివాలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఆలయానికి వచ్చిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తేనెటీగల దాడి లో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ నందికొట్కూరు రూరల్: దామగట్ల గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడి సమీపంలోని కుంట వద్ద కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.10, 630 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు. -
ఆందోళన ఉద్ధృతం చేస్తాం
నందికొట్కూరు: వెంటనే నీటిముంపు నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆ సంఘం నాయకులు జయన్న హెచ్చరించారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధా న రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారానికి 60వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతులది త్యాగం అయితే శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన తమది త్యాగం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు నీటిముంపు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు స్పందించకపోవడం మోసం చేయడమేనన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. 98 జీవో కింద అధికారంలోకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేయడం దుర్మార్గమన్నారు. 1,085 లస్కర్ ఉద్యోగాలు నీటిముంపు నిరుద్యోగులకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో నాయకులు నాగసుంకన్న, నారాయణ, నాగేంద్రుడు, పఠాన్ సాహెబ్ ఖాన్, తదితరులు కూర్చున్నారు. -
చెరువులో మట్టి దొంగలు
● తెలుగు తమ్ముళ్ల మట్టి దందా ● దర్జాగా అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికారులు ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యంరాయపాడులో కుందూ కట్టపై ఉన్న ఇసుకను తరలించిన దృశ్యంనంద్యాల(అర్బన్): వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే చెరువులు ఉనికిని కోల్పోతున్నాయి. చెరువుల మట్టి తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. మండలంలోని కానాల నాగమ్మ చెరువులో సాగునీటి సంఘానికి సంబంధించిన ఓ నాయకుడు గత వారం రోజులుగా మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల చిన్న చెరువులో బిల్లలాపురం గ్రామానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు మట్టిని అమ్ముతూ లక్షలు గడిస్తున్నారు. రోజుకు 50 ట్రాక్టర్లతో ప్రొక్లెయీన్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని తోడేస్తూ వెంచర్లు, పొలాలకు తరలిస్తున్నారు. వెంచర్లకు ఒక రేటు, పొలాలకు మరో ధర నిర్ణయించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది అధికారులు మాముళ్ల మత్తులో అక్కడేమి జరగలేదంటూ నివేదికలు పంపుతున్నారు. బహిరంగంగా మట్టి దందా జరుగుతూ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతున్నా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. వారం రోజులుగా చెరువుల్లో మట్టి తోడేస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులు కేసీ కెనాల్, రెవెన్యూ, పోలీసు అధికారులను పురామాయించగా కొద్ది సేపు మాత్రమే మట్టి తరలించే వాహనాలను నిలిపేశారు. వారు వెళ్లగానే రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లను మళ్లీ చెరువుల్లో దించి మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతులు కొంత అయితే బావులను తవ్వినట్లుగా మట్టిని తోడేస్తున్నారు. ఓ వైపు ప్రజాప్రతినిధులు, మరో వైపు అధికారులు అండదండలతో తమ మట్టి దందాకు తిరుగులేదని తెలుగు తమ్ముళ్లు చెబుతుండటం విశేషం. దూరాన్ని బట్టి వసూళ్లు.. దూరాన్ని బట్టి చెరువు మట్టికి ఖరీదు కడుతూ మాఫియా దందా సాగిస్తోంది. ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టి దగ్గర ప్రాంతానికి రూ.800, దూరమైతే రూ.1000 నుంచి రూ.1,200తో అమ్మకాలు జరుగుతున్నాయి. కానాల నాగమ్మ చెరువులోనే దాదాపు 50 నుంచి 60 ట్రాక్టర్లతో ఉదయం 5 గంటల నుంచే మట్టి దందా సాగుతుండటంతో రోజుకు 700 నుంచి 800 ట్రిప్పుల మట్టిని చెరువు నుంచి తోడేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఒక్క నాగమ్మ చెరువు నుంచే రూ.5 లక్షల నుంచి రూ.6లక్షల వరకు తమ్ముళ్లు ఆదాయం పొందుతున్నారు. మంత్రి తనయుడు పేరు చెప్పి దందా.. స్థానిక మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ పేరు చెబుతూ తెలుగు తమ్ముళ్లు మట్టి దందా సాగిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఏమీ చేయలేరంటూ తమకు మంత్రి నుంచి పూర్తి సహకారం ఉందని తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా చెరువుల్లో మట్టి యథేచ్ఛగా తోడేస్తున్నా సంబంధిత ప్రజాప్రతినిధి దీనిపై స్పందించకపోవడం తెలుగు తమ్ముళ్లు చెబుతున్న దాంట్లో నిజముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మట్టి దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే తాను బాధ్యున్ని కాదంటూ మంత్రి తనయుడు ఫిరోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హల్చల్ చేస్తోంది. గోస్పాడు మండలం రాయపాడు గ్రామంలో యథేచ్చగా కుందూ ఇసుకను తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కుందూ విస్తరణ చేశారు. ఈ క్రమంలో కుందూ ఇసుకను తీసి కట్టపై భారీగా వేశారు. ఈ ఇసుకను కొందరు టీడీపీ నాయకులు మంత్రి తనయుడితో మాట్లాడుకొని అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పెరిగిన కేసులు
కోవిడ్ తర్వాత థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 3 శాతం వరకు థైరాయిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తోంది. ఇమ్యూన్ డెఫిసెన్సీతో థైరాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీకి 100 మంది థైరాయిడ్ రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఈ లెక్కన నెలకు 800, సంవత్సరానికి దాదాపు 9వేల మంది దాకా చికిత్స తీసుకుంటున్నారు. పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లోనూ థైరాయిడ్ కనిపిస్తోంది. దీనిని కంజెంటెనల్ థైరాయిడ్గా పేర్కొంటాం. – డాక్టర్ పి.రాధారాణి, ఎండోక్రైనాలజిస్టు, జీజీహెచ్, కర్నూలు -
నేర ప్రవృత్తిని మార్చుకోకపోతే పీడీ చట్టం
● రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్కర్నూలు: జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన వారు గౌరవ ప్రదమైన జీవితం గడపాలని, లేదంటే పీటీ చట్టం అమలు చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీస్ అధికారులు రౌడీ షీటర్లకు నేర చరిత్ర ఉన్న వారికి, సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో దాదాపు 2 వేల మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం వారు ఊర్లోనే ఉన్నారా.. లేక మరో ప్రాంతంలో జీవిస్తున్నారా.. ఎంత కాలం నుంచి నేర ప్రవృత్తికి దూరంగా ఉన్నారు.. అనే విషయాలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని హితబోధ చేశారు. -
అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదకరం
థైరాయిడ్ క్యాన్సర్లో నాలుగు రకాలుంటాయి. అందులో అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. మిగిలిన మూడు ప్రమాదం కాదు. థైరాయిడ్ కణితి ఉన్న అందరికీ క్యాన్సర్ రాదు. అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. కణితికి సంబంధించిన పరీక్షలను బట్టి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది నిర్ణయిస్తాం. థైరాయిడ్కు ఒకవైపు మాత్రమే కణితి ఉంటే ఆపరేషన్ తర్వాత మాత్రలు అవసరం లేదు. రెండు వైపులా కణితులు ఉంటే మాత్రం థైరాయిడ్ గ్రంథిని తీసివేయడమే గాక దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది. –డాక్టర్ భార్గవ వ్యాస్ ఏఎన్, జనరల్ సర్జన్, కర్నూలు -
చేదెక్కిన పండ్ల ధరలు!
● తగ్గిన విక్రయాలునంద్యాల(న్యూటౌన్): పండ్ల ధరలు అమాంతం పెరిగిపోయి. పేద, మధ్యతరగతి ప్రజలు కొనలేని, తినలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో సామాన్యుడికి అందుబాటులో పండ్ల ధరలు ఉండేవి. దానిమ్మ, బత్తాయి, నల్ల కిస్మిస్ వంటి పండ్లను అధికంగా కొనుగోలుచేసేవారు. ఇప్పుడు ఈ పండ్ల కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గముఖం పట్టాయి. వేసవికాలం కావడంతో పాటు పండ్ల దిగుమతులు తగ్గడం కారణంగానే ఈ ధరలు పెరుగుదల అని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన అరటి ధర పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడంతో అరటిపండ్ల ధరలు పెరిగాయి. గతంలో గెల ధర రూ.300 ఉండగా, ఇప్పుడు రూ.500 పలుకుతోంది. లోకల్గా లభించే అరటిపండ్లకు కూడా ధర పెరిగింది. వీటిని వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. జ్యూస్ల రేట్లకు రెక్కలు పండ్ల ధరలు పెరగడంతో జ్యూస్ షాపుల వ్యాపారులు జ్యూస్లు ధరలు పెంచేశారు. ద్రాక్ష, బత్తాయి, కమలా, సపోట, పైనాపిల్ వంటి జ్యూస్ల ధరలు గతంలో గ్లాసు రూ.25 ఉండేది. ఇప్పుడు రూ.30కు పెంచారు. ఇందులో రకరకాల ఐస్ క్రీమ్ల వినియోగం ఆధారంగా ధరలు రూ.60లకు పైబడి పలుకుతున్నాయి. గతంలో ఇతర జిల్లాల నుంచి నేరుగా పండ్ల ట్రేలు వచ్చేవి. ఇప్పుడు అలా రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ట్రేలు తీసుకురావాల్సి వస్తోంది. వీటి రవాణా చార్జీలు పెరిగాయి. నాణ్యత పెద్దగా ఉండడం లేదు. ధరలు గతంలో కంటే పెరిగాయి. పండ్ల ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. –పెద్దయ్య, పండ్ల వ్యాపారి, నంద్యాల పండ్ల ధరలు (కేజీ ప్రకారం రూ..) పండు పేరు ధర దానిమ్మ 300 కమలాలు 170 నల్ల కిస్మిస్ 300 వైట్ కిస్మిస్ 200 యాపిల్ 300 గతంలో కిలో దానిమ్మ రూ.150, కమలాలు రూ.40కు వచ్చేవి. -
నల్లమలలో గుక్కెడు నీరు కరువు
● ఖాళీగా సాసర్ పిట్లు ● వన్యప్రాణులు విలవిలరుద్రవరం: నల్లమల అడవిలోని వాగులు, వంకల్లో నీటి జాడలేదు. అరకొరగా ఉన్న నీరు కాస్త ఎండ తీవ్రతకు ఆవిరి అయ్యింది. అడవి దాటి బయటకు వద్దామనుకుంటే వంతెనల వద్ద ఇనుప గేటు వేశారు. వాటిని దాటుకుని అడవికి సమాంతరంగా ఉన్న తెలుగుగంగ ప్రధాన కాల్వ వద్దకు వెళ్దామంటే అక్కడ చుక్కనీరు లేక ఎండింది. వేసవిలో అడవి జంతువుల దాహం తీర్చేందుకు అధికారులు పలు చోట్ల సాసర్ పిట్లను నిర్మించి, వాటిలోను నీరు నింపలేదు. దీంతో దాహం తీరక మూగజీవాలు పడుతున్న వేదన అరణ్య రోదనగా మారింది. దారులను మూసివేస్తూ ఇనుప గేట్లు రుద్రవరం, చెలిమ రెండు రేంజ్ల పరిధిలో అటవీ ప్రాంతం దట్టంగా ఉంది. వర్షాకాలం అయితే అడవంతా పచ్చదనం అలుముకొని ఉంటుంది. వేసవి కాలంలో చెట్ల ఆకులన్నీ రాలి మోడుబారడంతో పాటు వాగులు, సెలేర్లలో నీరు ఆవిరి అయ్యి ఎండి పోతాయి. అప్పటి నుంచి అడవి జంతువులకు సమస్యలు మొదలవుతున్నాయి. గతంలో మూగజీవాలు రాత్రి సమయాల్లో అడవిలో నుంచి బయట పొలాల వద్దకు వచ్చి ఆకలి, దప్పులు తీర్చుకొని తిరిగి అడవిలోకి వెళ్లేవి. అలా వచ్చి వెళ్లే సమయంలో వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతుండేవి. అలా జరక్కుండా ఉండేందుకు అటవీ అధికారులు సాసర్ పిట్లను నిర్మించారు. వేసవి రాగానే ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకెళ్లి ఆ సాసర్ పిట్లలో నింపేవారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నా అధికారులు సాసర్ పిట్లను నీటితో నింపలేదు. అంతేకాకుండా వన్యప్రాణులు అడవిలో నుంచి బయటకు రాకుండా అక్కడక్కడ ఉన్న దారులను మూసి వేస్తూ ఇనుప గేట్లు అమర్చారు. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీరు లేక, అడవి దాటి బయటకు రాలేక మూగజీవాల పరిస్థితి అరణ్య రోదనగా మారింది. ఇప్పటికై నా అటవీ అధికారులు సాసర్ పిట్లలో నీరు నింపి మూగజీవాల గొంతులు తడిపేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదీ దుస్థితి.. రుద్రవరం గుమ్మకొండ ఉసేనయ్య స్వామి దారిలో రెండు సాసర్ పిట్లను నీటితో నింపలేదు. చెలిమ రేంజ్ పెద్దకంబలూరు బీట్లో రెండు సాసర్ పిట్లలో నీరు లేదు. ఉసేనయ్యస్వామి, పెద్దకంబలూరు వద్ద ఉన్న మూడు వంతెనలపై అడవి జంతువులు బయటకు రాకుండా ఇనుప గేట్లను అమర్చారు. -
కుళాయి నుంచి బురద నీరు
ప్యాపిలి: మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా అవుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగే మాట దేవుడెరుగు.. కనీసం గృహ అవసరాలకు కూడా ఉపయోగపడ టం లేదని వాపోతున్నారు. గతంలోనూ ఒకసారి ఇలాగే కుళాయిలకు బురద నీరు రాగా.. అధికారులు స్పందించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అయితే ఆదివారం మళ్లీ అదే రీతిలో మలినాలతో కూడిన నీరు సరఫరా కావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బోరు పైపులు దెబ్బతినడమే కారణం .. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మనోహర్ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీకి చెందిన బోరు పైపులు దెబ్బతిన్న కారణంగానే కుళాయిల్లో బురద నీరు వస్తోందని తెలిపారు. సమస్యను గుర్తించామని, త్వరగతిన మరమ్మతులు పూర్తి చేయించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బురద నీరు ఎవరూ వినియోగించవద్దని సూచించారు. -
ప్రమాదం మాటేసింది!
కళ్ల ముందు ప్రమాదం కనిపిస్తున్నా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారిలో శిథిలావస్థకు చేరిన వంతెన వాహనదారులను భయపెడుతోంది. మాయలూరు – ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగుపై ఉన్న దశాబ్దాల కాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడో ఇప్పుడో కూలేందుకు సిద్ధంగా వుంది. వంతెనకు ఇరు వైపులా గ్రిల్ లేకపోవడంతో వదర నీరు పైకెక్కి ప్రవహించే సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రహదారిలో ఆళ్లగడ్డ నుంచి తాడిపత్రి, కోవెలకుంట్ల, తిరుపతి, తదితర పట్టణాలకు ఆర్టీసీ బస్సులు, లారీలు నిత్యం వందల సంఖ్యలతో వాహన చోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు వంతెన దాటే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు. శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – ఉయ్యాలవాడ -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 25వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. భక్తులతో మర్యాదగా మెలగాలి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రం చేరుకునే భక్తులతో దేవస్థానం సిబ్బంది మర్యాదగా మెలగాలని ఈఓ ఎం.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం అన్నప్రసాద వితరణ భవనానికి చేరుకున్న ఈఓ ముందుగా విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే అన్నప్రసాద వితరణ గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విరివిరిగా వినియోగించుకోవాలని పర్యవేక్షకులకు సూచించారు. -
26 ఏళ్ల తర్వాత..
మహానంది: వారంతా వేర్వేరు ఉద్యోగాల్లో, కొందరు ప్రైవేటు జాబ్లు చేస్తూ స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఫోన్లలోనే మాట్లాడుకుంటూ ఉండే మనమందరం ఒకచోట కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. అందుకు మహానంది వేదికై ంది. 26 ఏళ్ల తర్వాత ఆదివారం అందరూ ఒక చోట చేరి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కర్నూలులోని విశ్వభారతి బీఈడీ కళాశాలలో 2000–2021లో చదువుకున్న వివిధ జిల్లాలకు చెందిన పూర్వ విద్యార్థులు మహానందిలో కలిశారు. ముందుగా వారందరూ శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థి, గతంలో మహానంది అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేసిన రఘుశంకర్ ఆధ్వర్యంలో పర్యావరణ కేంద్రం వద్ద సమావేశమై ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని విందు భోజనం చేశారు. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్
ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు పదేళ్లు దాటితే గోడలకు నెర్రలు కనిపిస్తుంటాయి. అలాంటిది బేతంచెర్ల పట్టణంలో వందేళ్లైనా చెక్కు చెదరని ప్రభుత్వం భవనం ఉంది. పట్టణంలోని అంగళ్ల బజారులో స్వాతంత్య్రానికి మునుపు బ్రిటీష్ హయాంలో కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం 1999 వరకు పోలీస్ స్టేషన్గా కొనసాగింది. తర్వాత తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. 2014లో నూతనంగా నిర్మించిన భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం మార్పు చేయడంతో తర్వాత కొంత కాలం పాటు గ్రామ రెవెన్యూ కార్యాలయంగా కొనసాగింది. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడంతో 3వ సచివాలయం ఏర్పాటు చేశారు. 2023లో డ్రైవర్స్ కాలనీలో గ్రామ సచివాలయ భవనం నిర్మించడంతో తదనంతరం సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని ఇందులోకి మార్పు చేశారు. కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటమే గాకుండా ఆవరణలో పెద్ద చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో స్వాగతం పలుకుతూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఠీవీగా నిలుస్తోంది. – బేతంచెర్ల -
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
కర్నూలు (హాస్పిటల్) : గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ చెప్పారు. శనివారం ఇ.తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకేసుల గ్రామంలో నిర్వహిస్తున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి, అందుకు సహకరించిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారన్నారు. కూతురు అంటే భారం కాదని, వరమని చెప్పారు. ఆడ అయినా, మగ అయినా ఇద్దరూ ఒకటేనని మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి వివాహాలు బాలికల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మంజూష, సచివాలయ ఆరోగ్య కార్యకర్త లక్ష్మీప్రసన్న, ఆశా కార్యకర్తలు నారాయణమ్మ, జ్యోతి, ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. -
చక్కనమ్మకు ముక్కెరందం
ఆడపిల్ల పుట్టగానే చాలా మంది తమ పాపకు చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కు పుడక పెట్టి అందంగా అలంకరించి చూడచక్కని చిలకమ్మలా చూడాలనుకుంటారు. బుడిబుడి నడకలు వేసే సమయంలో గాజులు, కడియాలు, గజ్జలు కట్టి ఆనందిస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత చెవులు, ముక్కు కుట్టించి తమ బాధ్యతను ప్రారంభిస్తారు. చెవులు, ముక్కు కుట్టించడం ఇప్పటికీ సాంప్రదాయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో అధునిక పద్ధతులతో కుట్టిస్తున్నారు. కానీ పల్లెల్లో మాత్రం వరుసకు అమ్మమ్మ మాత్రమే బాలికలకు చెవులు, ముక్కు కుట్టిస్తారు. అందుకు ఆమెకు కానుకగా తాంబూలం, కొబ్బెరిగిన్నె, జాకెట్ పీస్ ఇస్తారు. తుమ్మ ముళ్లుతో ఎంతో చాకచక్యంగా కుట్టడం వీరి పనితనం. ఇక్కడ చిత్రంలో బాలికకు వరుసకు అమ్మమ్మ అయిన మరియమ్మ క్రిష్టిపాడు గ్రామంలో శనివారం చెవులు, మక్కు కుడుతుండగా చిన్నారులు, పెద్దలు ఇలా చూస్తూ ఉండిపోయా రు. ఈ దృశ్యం చూడముచ్చటగా కనిపించింది. – దొర్నిపాడుతుమ్మ ముళ్లుతో ముక్కు కుడుతూ.. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బేతంచెర్ల: మండలపరిధిలోని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం ఈ ఘటన వెలుగుచూసింది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన వడ్ల రామ్మోహన్ గురువారం సాయంత్రం ఇంటి నుంచి పని నిమిత్తం బుగ్గానిపల్లె తండాకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం బుగ్గానిపల్లె తండా సమీపంలో ఓ వ్యక్తి మృత దేహం కనిపించడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సిమెంట్ నగర్కు చెందిన వడ్ల రామ్మోహన్దిగా గుర్తించారు. వడదెబ్బకారణంగా మృతి చెందాడా లేక మరి ఏదైనా జరిగిందా అన్న అనమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య రుద్రవరం: మండలంలోని మాచినేనిపల్లెకు చెందిన మాబ్బాషా(35) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు..మృతుడు మద్యానికి బానిస కావడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన మొత్తం కలిపి రూ.14లక్షల వరకు అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చలేక ఈ నెల 18వ తేదీన మద్యంలోనే పురుగుల మందు కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి అబ్దుల్ బీబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్రూసెల్లోసిస్ ప్రాణాంతకం కాదు ఎమ్మిగనూరు సెంట్రల్: బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రాణాంతకం కాదని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని డీఎస్వో డాక్టర్ విశేశ్వరరెడ్డి, ఎపడమాలజిస్టు వేణుగోపాల్, పీహెచ్సీ వైద్యులు హరీష్కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలో సిబ్బందికి, కుటుంబసభ్యులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. కోడుమూరు రూరల్: గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు బండగట్టు నడిపి మిన్నెల్ల, రాముడు, నాగన్నకు చెందిన నాలుగు గడ్డివాములకు అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడుతుండటంతో గ్రామస్తులు గమనించి ఆర్పేందుకు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో నాలుగు గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. కాగా రెండు వారాల క్రితం ఇదే రైతుల పొలాల్లోని డ్రిప్ పైపులు, మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జై చిరంజీవా! ఆదోని అర్బన్: హనుమంతుడి నామస్మరణతో ఆదోని రణమండలకొండ మారుమోగింది. శనివారం 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కనుల పండువ గాసాగింది. ఓ వైపు పూజలు, అభిషేకాలు.. మరో వైపు హోరెత్తిన భక్తి గీతాలు, మహిళ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తజ నంభారీగా తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. -
చీకట్లో నగరం
కర్నూలు(హాస్పిటల్): నగరంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రజలు అల్లాడిపోయారు. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. రాత్రి 12 గంటల వరకు పనులు కొనసాగుతుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించ లేకపోయారు. అర్ధరాత్రి వరకు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడారు. ఆసుపత్రుల్లో రోగులు అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు కల్లూరు మండలం పందిపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడటంతో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ దుర్మరణం చెందాడు. ఆటోలో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్నూలు నగరంలో కురుస్తున్న వర్షం -
చిన్నారులకు తియ్యని బాధ
● పుట్టుకతోనే వస్తున్న మహమ్మారి ● వంశపారంపర్యం, పలు రకాల ఇన్ఫెక్షన్లే కారణంటైప్–1 డయాబెటీస్ చిన్నారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఎండోక్రైనాలజీ విభాగానికి ఓపీకి వచ్చే వారిలో ఒకప్పుడు వీరి సంఖ్య 5 శాతం ఉండగా ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. కోవిడ్–19 తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధికి గురైన పిల్లలకు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స, మందులు ఇస్తున్నాం. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. –డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు తల్లిదండ్రుల్లో ఎవరికై నా షుగర్ ఉన్నా, గర్భస్థ సమయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా అలాంటి వారికి జన్మించే పిల్లలకు షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు పిల్లలను గమనిస్తూ ఉండాలి. షుగర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి సలహా తీసుకోవాలి. వైద్య పరీక్షల్లో షుగర్ నిర్దారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఏమీ కాదు. ఇలాంటి పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియంత్రణ తప్పనిసరి. ఈ మేరకు పిల్లలకు వారి తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తూ ఉండాలి. – డాక్టర్ కె.అమరనాథ్రెడ్డి, చిన్నపిల్లల వైద్యులు, కర్నూలు ● నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి కుమారునికి టైప్–1 డయాబెటీస్ ఉంది. ఆయన వైద్యుడు కాబట్టి కుమారుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి, జాగ్రత్తలు పాటించి, అవసరమైన మందులు వాడుతూ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దవాడై ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 లక్షల జనాభాలో దాదాపు 20 శాతం వరకు షుగర్ బాధితులు ఉన్నారు. ఇందులో పెద్దలకు వచ్చే టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం (9 లక్షలు) ఉంటే టైప్–1 బాధితులు 10 శాతం (ఒక లక్ష) వరకు ఉన్నారు. టైప్–2 షుగర్కు ప్రారంభ దశలో మందులతో నియంత్రణలో ఉంటుంది. కానీ పిల్లలకు వచ్చే టైప్–1 షుగర్ వ్యాధికి మాత్రం తప్పనిసరిగా ఇన్సులిన్ మందులు వాడాల్సిందే. ఈ మందును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. కానీ నెలకు ఒకటి, రెండు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. అవి వారం, పది రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. మిగతావి మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. చిన్నారులకు వచ్చే షుగర్ అంటే..! శరీరంలో ఉండే క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కొందరికి కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా సెల్స్) కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే నాశనం చేస్తుంది. అలాగే క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు/గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్నే టైప్–1 డయాబెటీస్ అంటారు. ఇలాంటి పిల్లలకు క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా ఆకలి, నోరు తడి ఆరిపోవడం, కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ఆహారం తింటున్నా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గడం, శ్వాస తీసుకోవడానికి కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నిద్రలో మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉంటాయి. షుగర్ వ్యాధి పెద్దలనే కాదు పిల్లలనూ వేధిస్తోంది. కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే ఈ వ్యాధి కనిపిస్తోంది. వంశపారంపర్యంతో పాటు గర్భంలో కలిగే ఇన్ఫెక్షన్లు వారిని షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుస్తున్నాయి. ఈ వ్యాధిపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటే ఆ చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. -
వావ్.. ఆల్చిప్పలు!
దొర్నిపాడు: సముద్రాలు, పెద్ద పెద్ద నదుల్లో కనిపించే ఆల్చిప్పలు కుందూనదిలో దర్శనమిచ్చాయి. వేసవిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నది అడుగంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నది వెంట ఆల్చిప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మొలస్కా జాతికి చెందిన ఇవి రెండు గట్టి కర్పరాల (షెల్స్) మధ్య తమ శరీరాన్ని రక్షించుకుంటూ జీవిస్తాయి. నీటిలోని నాచు, సూక్ష్మక్రిములను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే ఈ ఆల్చిప్పలను సహజ వడపోత యంత్రాలుగా పిలుస్తారు. శనివారం మండలంలోని క్రిష్టిపాడు గ్రామం వద్ద ఇవి కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అలాగే పారే నీటిలో బతికే గుర్రపు డెక్క కూడా నదిలో నీరు లేకపోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోయింది. -
దెబ్బతిన్న కేసీ లైనింగ్ బెడ్
పగిడ్యాల: ఆయకట్టు రైతులకు జీవానాధారమైన కర్నూలు–కడప కాలువ లైనింగ్ బెడ్ శిథిలమై దెబ్బతింది. పగిడ్యాల నేలగండి సమీపాన మట్టి కట్ట బలహీనపడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. సిమెంట్ బెడ్ పూర్తిగా దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే వర్షాకాలంలోగా కేసీ లైనింగ్ పనులు చేపట్టకపోతే కాలువ మరింత కోతకు గురై తెగిపోయే ప్రమాదం ఉంది. ఇంకా పగిడ్యాల దుంకుడు తూము (90 కి.మీ. స్లూయిస్) నుంచి 91 కి.మీ. స్లూయిస్ మధ్యలో కూడా కేసీ లైనింగ్ బీటలు వారి దెబ్బతింది. కేసీ కాలువ పరిరక్షణ నిమిత్తం పనిచేసే లష్కర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లైనింగ్ దెబ్బతిని ఏళ్లు కావొస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి దెబ్బతిన్న కేసీ లైనింగ్ బెడ్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
పగిడ్యాల: నీటి మునక ప్రాంతమైన మూర్వకొండ సమీపంలో జరుగుతున్న పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనుల వద్ద ప్రమాదవశాత్తు ఓ వృక్తి మృతి చెందాడు. ముచ్చుమరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జౌకుపల్లె గ్రామానికి చెందిన చౌడప్ప(50) ఎల్ఎన్టీ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తాడిపత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వరకు పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దక్కించుకున్న ఎల్ఎన్టీ కంపెనీ కొద్ది నెలల క్రితం మూర్వకొండ నీటి మునక భూముల్లో టవర్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఎలక్ట్రికల్ పనులను పర్యవేక్షించే సమయంలో స్పేస్ డాంపర్ (రింగ్) సూపర్వైజర్పై పడింది. 60 మీటర్ల ఎత్తులో నుంచి పడటంతో తల పగిలిపోయింది. తోటి వర్కర్లు గమనించి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య జీవమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె సంగీత ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జెడ్పీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన లిఫ్ట్ కర్నూలు (అర్బన్) : జిల్లాపరిషత్ కార్యాలయంలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రూ.25 లక్షలతో మరో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా జిల్లాపరిషత్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ డీఈఈ కర్రెన్న తెలిపారు. -
కులగణన సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలి
● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రానంద్యాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టే కులగణన సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలని రిటైర్డ్ ఐఏఎస్, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన ఆధారంగానే భవిష్యత్లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీలు సహా వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ అయ్యాయి, వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి, అలాగే అన్ రిజర్వడ్ కేటగిరీల్లో బీసీలు ఎంతమంది ఎన్నికయ్యారు? అనే వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. కులగణనకు సంబంధించిన డేటా మైగ్రేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు వివరించగా.. సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే వారం రోజుల్లో సూపర్ చెక్ నిర్వహించి, తనిఖీ నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించాలన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బీసీ కులాల కవరేజ్ ఎలా ఉందన్న అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ కులాలకు చెందిన విద్యార్థుల నమోదు వివరాలు (ఎన్రోల్మెంట్) సేకరించాలన్నారు. పేర్లు, విద్యార్హతలు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునే అవకాశం కల్పించి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి డీసీఎస్. రాజు, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కమిషన్కు అందిన వినతులు... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలో వాల్మీకులు మొదటి స్థానంలో ఉన్నారని, వారిని ఎస్టీ లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి నాయకులు కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచి రాజకీయంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కాంట్రా క్టుల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ (భక్తజన) సేవా సంఘం నాయకులు కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. -
బాల్య వివాహాలు జరిపిస్తే రెండేళ్ల జైలు
కర్నూలు: నూతన చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కర్నూలు కోర్టు కాంపౌండ్ ఆవరణలోని న్యాయ సేవా సదన్లో శనివారం బాల్య వివాహ నిరోధక చట్టంపై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, ఎన్జీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని మీ దగ్గరకు వస్తే సంబంధిత శాఖలకు కానీ, 15100 లేదా 1098 టోల్ఫ్రీ నంబర్స్కు సమాచారం అందించాలన్నారు. ఐసీడీఎస్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయని, బాల్య వివాహాలపై వారికి సమాచారమిస్తే వెంటనే ఆ వివాహాన్ని ఆపేస్తారన్నారు. కార్యక్రమంలో కర్నూలు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఐ సొసైటీ డీసీఓ ఎంఈ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ – 2 బాలురకు 180 స్టేట్ ర్యాంకు నుంచి 2893 వరకు, ఎస్సీ – 3 బాలురకు 821 స్టేట్ ర్యాంకు నుంచి 10,152 వరకు, ఎస్టీ బాలురకు 506 నుంచి 6119 వరకు, బీసీ బాలురకు 23 నుంచి 304 వరకు, ఓసీ బాలురకు 86 నుంచి 1023 వరకు ఈ నెల 26వ తేదిన చిన్నటేకూరులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఎస్సీ – 2 బాలికలకు స్టేట్ ర్యాంకు 593 నుంచి 7014 వరకు, ఎస్సీ –3 బాలికలకు 1038 నుంచి 13,366 వరకు, ఎస్టీ బాలికలకు 2167 నుంచి 10,205 వరకు, బీసీ బాలికలకు 33 నుంచి 609 వరకు, ఓసీ బాలికలకు 80 నుంచి 3063 వరకు ఉన్న వారికి ఈ నెల 27న దిన్నెదేవరపాడులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందన్నారు. వివరాలకు 08518– 295601 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘మద్దిలేటయ్య’ క్షేత్రం కిటకిట బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు మొక్కుబడుల కార్యక్రమాలు ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. ఇంధన పొదుపునకు సమష్టి ప్రయాణం నంద్యాల: ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు సమష్టిగా బస్సుల్లో ప్రయాణించి ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్లో నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సందేశం ఇచ్చే ముందు అధికారులే ఆచరణలో చూపించాలని, జిల్లా, డివిజనల్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ తమ వ్యక్తిగత వాహనాలలో కాకుండా, సమష్టిగా మూడు బస్సుల్లో ప్రయాణించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమం కింద ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే ఇంధనాన్ని వినియోగిస్తూ వృథా ఖర్చులను తగ్గించుకునే దిశగా ముందుకు రావాలన్నారు. ఎంబీబీఎస్ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థుల ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2021–22 బ్యాచ్కు చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో కర్నూలు మెడికల్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఎస్.శషింద్ర 77 పర్సెంట్, సయ్యద్ ఫైజ సుల్తానా 75 పర్సెంట్తో డిస్టింక్షన్ సాధించగా, 135 మంది ఫస్ట్ క్లాస్, 78 మంది సెకండ్ క్లాస్ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంకండి
● ఓటర్ల జాబితా సర్వేపై బీఎల్ఏలు నిఘా పెట్టాలి ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వగృహంలో శనివారం డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణ, మండల బీఎల్ఏలతో బుగ్గన సమావేశమయ్యారు. పార్టీ వ్యవసాయ విభాగం కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో సర్ పేరుతో చేపడుతున్న ఓటర్ల సర్వేపై కార్యకర్తలు గట్టి నిఘా ఉంచాలన్నారు. డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు తొలగింపు పేరిట అధికార పార్టీ నేతలు సర్వే అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు. అర్హులైన విపక్ష పార్టీ కార్యకర్తల ఓట్ల తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల జాబితాను నిరంతరం పరిశీలిస్తుండాలన్నారు. అర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడంతో పాటు ఫారం 6 ద్వారా తిరిగి వారిని ఓటర్ల జాబితాలో చేర్పించాలన్నారు. అక్రమాలకు పాల్పడడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిన వారనే విషయాన్ని ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తతో పాటు బీఎల్ఏలు గుర్తుంచుకోవాలని బుగ్గన హెచ్చరించారు. కష్టపడి పని చేసే వారికే గుర్తింపు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యకర్తలను, బీఎల్ఏలను పార్టీ గుర్తించి భవిష్యత్త్లో తగిన విధంగా పదవులతో గౌరవింస్తుదని బుగ్గన అన్నారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మర్చిపోయి వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఎవైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వంతో పాటు తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొరెడ్డి పుల్లారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రరెడ్డి, నాగభూషణం రెడ్డి, మండల బూత్ కమిటీ కన్వీనర్ విఘ్నేశ్వరరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, బాలయ్య, నేరడుజర్ల చంద్రశేఖర్రెడ్డి, శ్వామ్ప్రసాద్రెడ్డి, బోరెడ్డి రామచంద్రారెడ్డి, రామకృష్ణ, కొండయ్య, బోరా మల్లికార్జునరెడ్డి, రజినీకాంత్రెడ్డి, రాఘవా, మద్దయ్య, రంగస్వామి, మోహన్, రంగనాయకులు, శ్రీనివాసులు, రసీల్, కొండారెడ్డి, రాచర్ల దివాకర్రెడ్డి, కంబగిరి, తులసిరెడ్డి, శంకర్రెడ్డి, ఓబుల్రెడ్డి యాదవ్, జమాల్, వెంకటేష్ నాయక్, భాస్కర్ నాయుడు, రఘునాథ్రెడ్డి, కృష్ణారెడ్డి, చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జొన్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ● సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు నంద్యాల(అర్బన్): రాజకీయాలకు అతీతంగా జొన్నలు కొనుగోళ్లు జరగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ టీడీపీ అనుకూల రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద జొన్న కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు ఇచ్చారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గోడౌన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ వద్ద ఉన్న జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ట్రక్ షీట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్నలన్నింటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జొన్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి రాజకీయ ఒత్తిడితో కొందరు రైతులకు మాత్రమే అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రతి రైతు వద్ద ఉన్న జొన్న పంటను కొనుగోలు చేసి ట్రక్షీట్ ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న చంద్రబాబు ఆరుగాలం కష్టించి పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కన్నీరు పెడితే ఏ రాష్ట్రం సుఖంగా ఉండదని గుర్తు చేశారు. అనంతరం మొత్తం పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాటసాటని రాంభూపాల్రెడ్డి, నాయకులు కలెక్టర్ కార్యాలయ ఏఓ సుభాకర్కు వినతి పత్రం అందజేశారు. వీరి వెంట వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
మూడో రోజూ రైతులకు అన్నదానం
వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద జొన్న విక్రయాల కోసం వచ్చిన రైతన్నలకు మూడో రోజు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. శనివారం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డిలు రైతులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గుండం నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తిండి తిప్పలు మాని గోదాముల వద్ద బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని జొన్న కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, జిల్లా కార్యదర్శి సద్జల చంద్రశేఖర్రెడ్డి, గోపవరం జయప్రకాష్, నారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బ్లాక్ మనీ’ మోసగాడు అరెస్ట్
● రూ.2 లక్షలు రికవరీ, నిందితుడి రిమాండ్వెల్దుర్తి: బ్లాక్ మనీ పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వెల్దుర్తి సర్కిల్ కార్యాలయంలో సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. ఈనెల 15వ తేదీన కృష్ణగిరి మండల పరిధిలోని ఆగవేళి గ్రామానికి చెందిన వీరేశ్కు సి.బెళగల్ మండలం బాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు రూ.లక్షకు రూ. మూడు లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. ట్యాక్స్ ఇతరత్రా ఎగ్గొట్టిన వాళ్లు వైట్ మనీగా మార్చుకునేందుకు దండిగా ఇస్తారని, బ్లాక్ మనీ అంటే నిజంగానే నిజమైన నోట్లను బ్లాక్ కలర్లో ఇస్తానని నమ్మించాడు. అతని ఎదురుగానే కొన్ని బ్లాక్ కలర్లో ఉన్న పేపర్లను కెమికల్లో ముంచి తీశాడు. బ్లాక్ కలర్ పోయి అసలైన రూ.500 నోట్లు తేలడంతో వీరేశ్ నమ్మి రూ.లక్ష అప్పజెప్పాడు. నిందితుడు బ్లాక్ కలర్ పేపర్ల కట్టలను ఆరింటిని (రూ.500ల నోట్లుగా తెలుపుతూ), తన వద్ద ఉన్న కెమికల్ను వీరేశ్కు అప్పజెప్పి, ఇంటికెళ్లి అన్ని కెమికల్లో అద్ది చూసుకో అని వెళ్లిపోయాడు. తీరా వీరేశ్ చూసుకోగా కేవలం పైన, కింద కొన్ని పేపర్లు నోట్లుగా మారి, మిగితావి నల్లరంగు పేపర్లు అని తెలిసి మోసపోయానని గ్రహించి కృష్ణగిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకులపాడు రస్తాలోని రైస్మిల్ గుడి వద్ద ఉన్న నిందితుడు గొల్ల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మానేసి బ్లాక్ మనీతో బురిడీ కొటిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, సాధారణ నోట్లను నల్లగా మార్చిన కట్టలు, నల్లరంగు కాగితాల కట్టలను స్వాధీనం చేసుకున్నామన్నారు. డోన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన వెల్దుర్తి సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తిని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
దెబ్బతిన్న లైనింగ్
ఈ ఏడాది కాల్వల అభివృద్ధికి ఎస్సార్బీసీ అధికారులు రూ.31.64 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో కాల్వల్లో పూడికతీత, దెబ్బతిన్న ప్రాంతాల్లో లైనింగ్ పనులు, ముళ్లపొదల తొలగింపు, కాల్వగట్లును బాగుచేయడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో కాల్వల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాల్వల మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ప్రధాన కాల్వలు సైతం ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. పదోబ్లాక్ కాల్వ బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలో పలుచోట్ల లైనింగ్ దెబ్బతిని అధ్వానంగా ఉంది. సంబంధిత అధికారులు వచ్చే ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని కాల్వలకు మరమ్మతులు చేపట్టి పంటలకు పుష్కలంగా సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు, లొద్దిపల్లె గ్రామాల మధ్య ప్రధాన రోడ్డు పక్కన గుర్తు తెలియని మగ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడి వయస్సు 35–40 ఏళ్ల మధ్య ఉంటుందని, శరీరంపై నలుపు, బూడిద వర్ణం గీతలు కలిగిన ఫుల్ టీషర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01067 సెల్ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళ దారుణ హత్య ● ఆస్థి తగాదాలే కారణం ● కేసు నమోదుహొళగుంద: ఆస్తి తగాదాల కారణంగా గురువారం అర్ధరాత్రి మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని సుళవాయి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన గాదిలింగప్పకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న హరిజన యల్లమ్మ (45) పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా నరికిన స్థితిలో దారుణహత్యకు గురైంది. ఆమెను మొదటి భార్య కుమారుడు హరిజన శేఖన్న నరికి చంపాడని మృతురాలి కుమార్తె గుండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆలూరు ఇన్చార్జ్, ఆస్పరి సీఐ శ్రీనివాసనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు హొళగుంద పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలుండగా అందరికీ వివాహాలయ్యాయని, మోదటి భార్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నట్లు వారు తెలిపారు. గుండెపోటుతో ఉపాది కూలీ మృతి ఆలూరు: మండలంలో అరికెర గ్రామానికి కామవరం తిమ్మప్ప (52) ఉపాధి పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. గ్రామ చెరువులో శుక్రవారం ఉపాధి కూలీలకు పని కల్పించారు. అందరితో పాటు తిమ్మప్ప పనికి వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఇంటికి చేరుకుని ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటి ఆవరణలో ముఖం కడుక్కుంటూ కుప్పకూలి మృతి చెందాడు. కళ్లెదుటే తిమ్మప్ప మృతిచెందడంతో భార్య ఉలిగమ్మ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఏపీఓ శ్రీనివాసులు తదితరులు తిమ్మప్ప భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూలీ మృతి విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లు ఏపీఓ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలంలో వ్యక్తి ఆత్మహత్య శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం ఉచిత వైద్యశాల పక్కన అంబులెన్స్ నిలిపే స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. దేవస్థానం వైద్యశాల పక్కన ఉన్న షెడ్లో వాటర్ పైకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి (50) శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. -
అర్ధరాత్రి మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేత
● ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిబనగానపల్లె: అవుకు మెట్ట సర్కిల్లో వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ అర్ధరాత్రి కూల్చి వేశారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందనే సాకు చూపుతూ జేసీబీతో నేలమట్టం చేసి ఉదయానికంతా ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇది ముమ్మాటికీ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి కక్ష సాధింపేనంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోపించారు. రోడ్డు అభివృద్ధికి వాటర్ ప్లాంట్ ఏమాత్రం అడ్డురాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్లాంట్ను కూల్చివేయించారని, ఏడాది క్రితం పాత బస్టాండ్లోని కూలింగ్ మినరల్వాటర్ ప్లాంట్ను కూడా ఇలాగే కూల్చివేయించారన్నారు. తన హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు నీళ్లు ఇవ్వడం మంత్రి బీసీకి ఇష్టంలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాటిని తొలగించడం తగదని, ప్రజలలో పేరు రావాలంటే అభివృద్ధి పనులు చేయాలి కానీ ఇలా ఉన్నవాటిని తొలగించడం కాదని హితవు పలికారు. కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకుంటారో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతారో చూద్దామని రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు 2020 జూన్ 28న అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజల తాగునీటి సమస్యను గుర్తించి అవుకుమెట్ట సర్కిల్ వద్ద కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్మించి ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ పక్కనే మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారి, అతి సమీపంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, హిందూ ఆలయం, రాంభూపాల్ నగర్, గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం తదితర కాలనీల ప్రజలకు ఐదేళ్లపాటు వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ పాంట్ను ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. చివరకు రోడ్డు అభివృద్ధి పనులకు అడ్డుగా ఉందంటూ వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్అండ్బీ నేషనల్ హైవే ఇంజినిరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. -
మోసపోయానమ్మా.. ఇక బతకలేను!
ఆళ్లగడ్డ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. అహోబిలంలో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ నాయకుడి భార్య మోజు తీరాక మరో వివాహితతో సహజీవనం ఇద్దరు బిడ్డలతో అవస్థలు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య -
తగ్గేదే లే!
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్ర పరిధిలో తలనీలాల సేకరణకు శుక్రవారం నిర్వహించిన వేలం పాట మరోసారి వాయిదా పడింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి తలనీలాల వేలం పాటలు ఇప్పటివరకు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. ఎలాగైనా తక్కువ ధరకు కొట్టేయాలన్న తెలుగు తమ్ముళ్ల దురాశకు దేవస్థాన నిర్వాహకులు తలొగ్గడం లేదు. ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా.. బెదిరింపులకు పాల్పడ్డా అధికారి ఏమాత్రం తలొగ్గలేదు. ఎన్నిసార్లయినా వాయిదా వేసుకుంటాం. అవసరమైతే సొంతంగా సేకరించుకుని విక్రయించుకుంటాం తప్ప రూ.1.50 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఇచ్చేది లేదని చెబుతూ వేలం పాట రద్దు చేశారు. ఉద్రిక్తత మధ్య వేలంపాట రద్దు అహోబిలంలో తలనీలాల వేలంపాట శుక్రవారం జరుగుతుందని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎలాగైనా దాన్ని అడ్డుకుని తాము చెప్పినట్లు రాసివ్వాలని తీవ్రస్థాయిలో అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అయినా లెక్కచెయ్యని అధికారి గుడి ఆదాయం పెంచడమే తన కర్తవ్యమని వేలం పాట నిర్వహించేందుకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ శుక్రవారం అహోబిలానికి అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతి భద్రతలు లోపిస్తాయని వేలంపాట వాయిదా వేసుకోవాలని సూచించారు. అయినా లెక్క చేయకుండా వేలం పాట నిర్వహించి తీరుతామని చెప్పడంతో ఒకానొక సమయంలో దేవస్థానం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎట్టకేలకు వేలం పాటను రద్దు చేయడంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై అహోబిలం సీఏఓ పార్థసారథి మాట్లాడుతూ.. నిర్ణయించిన కనీస ధర (రూ.1.50 కోట్లు)కు వేలం పాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగిందని, త్వరలో మరోసారి వేలం నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు.రూ.2 కోట్లు వస్తుందని అంచనా..గత రెండేళ్ల క్రితం వరకు (వైఎస్సార్సీపీ హయాంలో) అహోబిలం దేవస్థానంలో ఏటా తలనీలాల వేలం పాట ద్వారా రూ.2 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక గతేడాది అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అప్పటి అధికారులు వేలం పాట నిర్వహించకుండా నేతలు చెప్పిన ధరలకు, వారు సూచించిన వారి పేరిట హక్కులు రాసిచ్చారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా గతేడాది కంటే తక్కువకు హక్కులు రాసివ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికారి నేతల ఒత్తిడికి తలొగ్గలేదు. తలనీలాల హక్కులను నామినేషన్ పద్ధతిలో రహస్యంగా రాసిచ్చే ప్రసక్తే లేదని, వేలం పాట నిర్వహించి ఎవరు ఎక్కువ పాడితే వారికే ఇస్తామని తేల్చిచెప్పారు. కనీస ధర రూ.1.50 కోట్ల కంటే తగ్గించబోమని చెబుతూ, వేలంపాట అక్కడి నుంచే మొదలు పెట్టారు. నిర్ణయించిన ధర వచ్చే వరకు ఎన్నిసార్లైనా వేలం పాటను రద్దు చేస్తూనే ఉంటామని ఖరాకండిగా చెప్పారు. అహోబిలంలో తలనీలాల వేలం పాట మరోసారి రద్దు నామమాత్రపు రేటుకే కొట్టేయాలని తెలుగు తమ్ముళ్ల విశ్వప్రయత్నం రూ.1.50 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఇచ్చేది లేదన్న నిర్వాహకులు -
పంచాయతీల్లో నిలిచిన బిల్లుల చెల్లింపు
● ఆగిన అభివృద్ధి పనులు ● ఆందోళనలో ప్రత్యేక అధికారులుజూపాడుబంగ్లా: సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికార పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి నెలరోజులపాటు చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయకపోవటంతో ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మంజూరు చేసే విషయమై ప్రత్యేక అధికారులకు డిజిటల్ కీ ఇచ్చి లాగిన్ ఇవ్వకపోవటంతో నిధులు మంజూరు చేసుకునే అవకాశం లేకపోవటంతో అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య కేవలం నంద్యాల జిల్లాలోని 489 పంచాయతీల్లో నెలకొనడంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్య, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు సీఎఫ్ఎంఎస్ ఐడీద్వారా థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్ నమోదు చేసి వారి పేరున నిధులు మంజూరు చేసేవారు. ప్రస్తుతం స్వర్ణపంచాయతీ యాప్లో థర్డ్పార్టీ వెండర్స్ డిటెయిల్స్ డిస్ప్లే కావటం లేదు. థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్ ఏవిధంగా నమోదు చేయాలనే విషయమై కంప్యూటర్ ఆపరేటర్లకు వివరించకపోవటంతో ఏవిధంగా బిల్లులు మంజూరు చేయాలో అర్థంకాక కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామపంచాయతీలో చేసిన అభివృద్ధి పనులపై తీర్మానం, థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు వాటిని అప్రూవల్ చేస్తే బిల్లులు మంజూరమవుతాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధుల్లోంచి కంప్యూటర్ ఆపరేటర్లకు, వాటర్మెన్లకు, గ్రీన్అంబాసిడర్లకు, థర్డ్పార్టీ వెండర్స్కు నిధులు స్పెషల్ అధికారుల లాగిన్లో మంజూరు చేయాల్సి ఉంది. సర్ణ పంచాయతీ యాప్లో కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల వివరాలు డిస్ప్లే అవుతుండటంతో వారికి మాత్రమే వేతనాలు మంజూరు చేసే వెసలుబాటు ఉండగా గ్రీన్అంబాసిడర్ల వేతనాలు, థర్డ్పార్టీ బిల్లులు చెల్లింపుచేసుకోలేని దుస్థితి నెలకొందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మాసాల నుంచి బిల్లులు మంజూరు కాకపోవటంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన వారికి బిల్లులు మంజూరు చేయకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బిల్లుల చెల్లింపు నెమ్మదిగా జరుగుతుంది. త్వరలో సమస్యలు క్లియర్ అవుతాయి. గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు నిలిచిపోలేదు. – గోపికృష్ణ, ఎంపీడీఓ, జూపాడుబంగ్లా -
పంచగవ్యంతో సర్వ పాప హరణం
కర్నూలు కల్చరల్: గోవులు సంచరించిన ప్రదేశం పవిత్రమైనదని, గోవును స్మరిస్తే మనసు ఉత్సాహంగా ఉంటుందని ప్రవచన చక్రవర్తి, వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గాయత్రీ గోశాల, గాయత్రీ గో సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారు సుంకేసుల రోడ్లోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘గోమాత వైభవం’ అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. గోసేవ ఎంతో గొప్పదని, గోమాత ముక్కోటి దేవతల స్వరూపమని చెప్పారు. గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేస్తే గోవు దానికి రుద్దుకున్నప్పుడు ఎన్ని కేశాలు రాలుతాయో అన్ని సంవత్సరాలు గరుకు స్తంభం ఏర్పాటు చేసిన వారి పితృ దేవతలకు పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని వివరించారు. గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి కలిపితే పంచగవ్యం అవుతుందని, దీన్ని స్వీకరించిన వారికి సమస్త పాపాలు తొలగిపోవడమే గాకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. గోవులను పోషించాలని, గోశాలలకు సహకరించి అనుగ్రహం పొందాలన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బందార్లపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు (53) గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడి నాపరాతి గనిలో నిల్వ ఉన్న నీటిలో బట్టలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఉతుక్కోవాలనే ఉద్దేశంతో బట్టల డ్రమ్మును తీసుకొని వెళుతుండగా కాలికి రాయి తగిలి సమీపంలో ఉన్న మోటర్పై పడటంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. పక్కనే ఉన్న కుమారుడు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు చాకలి వెంకట ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మామిడిని రసాయనాలతో మాగబెట్టొద్దు కర్నూలు(హాస్పిటల్): మామిడి కాయలను రసాయన పదార్థాలతో మాగబెట్టి వాటిని విషపూరితం చేయవద్దని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపు రైతుబజార్లో మామిడి పండ్లను విక్రయించే రైతులు, వ్యాపారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ మేరకు 9 మామిడి పండ్లను, ఒక సాధారణ బఠానీ, ఒక గ్రీన్ బఠానీ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామిడి పండ్లను సహజ పద్ధతిలోనే మాగబెట్టాలని, త్వరగా మాగించేందుకు రసాయనాలు వాడి విషపూరితం చేయవద్దని చెప్పారు. ఇలా చేసి మాగించిన పండ్లను తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పద్ధతుల్లో పండ్లను మాగించాలన్నారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాముడు, డిస్ట్రిక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సెక్రటరీ శివమోహన్రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి కళ్యాణి ఉన్నారు. మద్యం మత్తులో కారు ఢీ..ముగ్గురికి గాయాలు ఆదోని అర్బన్: ఫుల్గా మద్యం తాగి కారు నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కడితోట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోసిగి గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు, భార్య షాబేరీ, షబ్బీర్, షహిత్తా అంజుమ్ ఆదోనిలో పని ముగించుకుని స్వ గ్రామానికి కారులో తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో ఆదోని వైపు వస్తున్న పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి మద్యం సేవించి రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న షాబేరీ, షహిత్తా అంజుమ్, షబ్బీర్కు గాయాలయ్యాయి. వెంటనే ఆ రహదారిలో వెళ్తున్న వారు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం షాబేరీ, షహిత్తాఅంజుమ్ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఈ విషయంపై పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ దృష్టికి తీసుకెళ్లగా... పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి షమీవుల్లా పూర్తిగా అలసిపోయి కారును ఢీకొట్టారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కర్నూలులోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. క్యాన్సర్ వ్యాఽధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అతిగా బరువు తగ్గడం, జ్వరం, అలసట, శరీరంలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, మలమూత్ర విసర్జనలో మార్పులు, మానని పుండ్లు, రుతుక్రమంలో మార్పులు, రొమ్ములో గడ్డలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చలలో మార్పులు, బొంగురు గొంతు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి తెలపాలని, ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు, 30 ఏళ్లు దాటిన వారందరికీ రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చేస్తారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి ముందస్తు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, నర్సులు జయమ్మ, సాయికుమార్, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. -
ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలి
కర్నూలు(సెంట్రల్): ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఏఆర్టీ సేవలను మరింత బలోపేతం చేసి రోగులకు అండగా నిలవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు చికిత్సను మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టిగ్మా కారణంగా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి అవగాహన కల్పించాలన్నారు. మందుల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సస్థలు, ఏఆర్టీ సిబ్బంది గ్రామీణ స్థాయి ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. హెచ్ఐవీ నియంత్రణలో మొదటి 95 లక్ష్యాల సాధనలో జిల్లా ఇప్పటికే మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. ఇంకా పురోగతి అవసరమని సూచించారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రగ్నెన్సీని నివారించాలి జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇంకా బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయని, వాటిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసు, ఏఎన్ఎం, ఆశా సిబ్బందితో కౌమార దశలో ఉన్న బాలికలు, వారి తల్లిదండ్రులకు టీనేజ్ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వైద్య విద్యార్థులతో పాఠశాలల్లో అవగాహన సదస్సులను నిర్వహించాలని డీఎంహెచ్ఓ వై.కామేశ్వర ప్రసాదు, కేఎంసీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మను ఆదేశించారు. కళాజాతా బృందాలు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథం, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఐసీడీఎస్ పీడీ విజయను ఆదేశించారు. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా పాల్గొన్నారు. -
ఉరిమిన పెనుగాలులు
● నందవరంలో 68 మి.మీ వర్షపాతంకర్నూలు(అగ్రికల్చర్): పెనుగాలులు ఉమ్మడి కర్నూలు జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన గాలుల తీవ్రత శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. పలు మండలాల్లో వర్షాలు కూడా కురిశాయి. ఒకవైపు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుండటం గమనార్హం. నందవరంలో 68 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. కర్నూలు జిల్లాలో సగటున 11.8 మి.మీ, నంద్యాల రూరల్లో 10.4 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో చెట్లు విరిగిపడగా, మామిడి పంట భారీగా నేల రాలింది. విద్యుత్ శాఖకు రూ.90 లక్షల నష్టం గాలుల తీవ్రత విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.90 లక్షల నష్టం వాటిళ్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మండలం వర్షపాతం(మి.మీ) హొళగుంద 40.2 పెద్దకడుబూరు 26.4 హాలహర్వి 26.2 కొలిమిగుండ్ల 24.8 ఎమ్మిగనూరు 23.2 కోడుమూరు 22.6 దేవనకొండ 22.4 నందికొట్కూరు 20.2 కౌతాళం 18 ఆదోని 16.8 అవుకు 15.4 బనగానపల్లి 12.6 -
ఓట్ల తొలగింపు కుట్రను తిప్పికొడదాం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిడోన్: ఓటర్ల సర్వే పక్రియ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు ముస్టిం మైనారిటీ, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించేందుకు చేస్తున్న అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీఎల్ఏలకు సూచించారు. తన స్వగృహంలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన డోన్ మండల బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ)సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రలకు జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు సర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సర్వే సందర్భంగా అర్హులైన లక్షలాది మంది ఓటర్లను తొలగించడం చూస్తే తమ వాదనలకు మరింత బలం చేకురుతుందన్నారు. వచ్చే స్థానిక, సాధారణ ఎన్నికలకు ముందే మన రాష్ట్రంలో కూడా అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లును జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయని, అప్రమత్తంగా ఉండి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సామాస్య, మధ్యతరగతి ప్రజలతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లను తొలగించే కుట్రను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతి బీఎల్ఏకు పార్టీ నాయకులతో పాటు స్థానిక నాయకుల సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జరిగే ఓట్ల తొలగింపు ఎన్ని రూపాల్లో ఉంటుందనే విషాయాన్ని మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు వివరించారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, బీఎల్ఏ నియోజకవర్గ కమిటీ కన్వీనర్ దొరపల్లి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు తురుమాంపల్లె తిరుమల్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణంరెడ్డి, మల్యాల భాస్కర్రెడ్డి, బుగ్గన జయచంద్రరెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి పాల్గొన్నారు. -
యువకుడిపై టీడీపీ రౌడీషీటర్ల దాడి
● కేసు నమోదు చేయని పోలీసులుసాక్షి టాస్క్ఫోర్స్: అధికారం మనదైతే అన్యాయానికి, అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకు అడ్డేముందన్నట్టు డోన్ తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. రౌడీ షీటర్లను వెంటేసుకొని అమాయక యువకులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా డోన్ తారకరామనగర్కు చెందిన గొల్ల సుధాకర్ అనే యునికుడిపై జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనం. బాధిత యువకుడు తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా లెక్క చేయకుండా తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు స్పందించకపోగా ఫిర్యాదు కూడా స్వీకరించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. చివరకు సుధాకర్ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా పలుకుబడి ఉపయోగించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబం వాపోతుంది. ఇదిలా ఉండగా తమకు గొల్ల సుధాకర్ నుంచి ఫిర్వాదు అందలేదని డోన్ పోలీసులు చెప్పడం గమనార్హం. తనపై హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఎరుకలి పవన్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరికొందరు రౌడీషీటర్లు ఉన్నారని, వెంటనే వారిని అరెస్టు చేయకపోతే తనను చంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తగ్గిన ఉష్ణోగ్రతలు! కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉన్నాయి. పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పటికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అదుపులో ఉండటం ప్రజలకు ఊరటనిస్తోంది. నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. సంజాలమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దొర్నిపాడులో 42.9, పాణ్యంలో 42.6, కొత్తపల్లిలో 42.4, గోస్పాడు, ఆళ్లగడ్డ, రుద్రవరంలలో 42.2, గడివేములలో 42.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లాలోని పుట్లంపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర క్రీడాపాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎస్ రాజు తెలిపారు. 4వ తరగతిలో బాలబాలికలకు 40 సీట్లు ఉన్నాయన్నారు. అలాగే 5వ తరగతిలో ప్రవేశానికి 23 సీట్లు, 6వ తరగతిలో 8, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 8, 9 వతరగతిలో 26 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చేనెల 2వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం క్రీడా శాఖ వెబ్సైట్ https://apsportsschool.ap. gov.in/.ను సంప్రదించాలని చెప్పారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 2567 మంది ఫీజులు చెల్లించగా 2420 మంది హాజరయ్యారు. సెకెండియర్ పరీక్షలకు 1,309 మంది ఫీజులు చెల్లించగా 1,217 మంది హాజరై పరీక్షలు రాశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి ప్యాపిలి: మండల పరిధిలోని కొమ్మేమర్రి గ్రామానికి చెందిన పూసలపాటి నారాయణ (59) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. రో జూ లాగే గురువారం ఉద యం ఇంటి నుంచి ఉపాధి పనికి బయలుదేరిన నారాయణ మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని డోన్ ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేశారు.అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. మృతుడికి భార్య రమాదేవి, ఒక కుమార్తె ఉన్నారు. మహిళా ఉద్యోగులపై వేధింపులు ● పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆరా తీసిన డీఎల్డీఓ శివారెడ్డి కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె స్వర్ణగ్రామం (గ్రామ సచివాలయం)లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులపై పంచాయితీ కార్యదర్శి సుధాకరరెడ్డి వేధింపులు అధికమయ్యాయని ఇటీవలనే ఉన్నతాధికారులతో పాటు మంత్రి బీసీ జనార్ధనరెడ్డికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం డీఎల్డీఓ శివారెడ్డి గ్రామానికి చేరుకొని మహిళా సిబ్బందిని విచారించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శి తమ పట్ల అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఈయన సంజామల మండలంలో పని చేసే సమయంలో కూడా మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెండ్కు గురయ్యాడని డీఎల్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. సదరు పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
బిల్లలాపురం వద్ద యథేచ్ఛగా మట్టి తవ్వుతున్న దృశ్యంట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యంనంద్యాల(అర్బన్): మట్టి మాఫియా చెలరేగిపోతుంది. అధికార పార్టీ అండదండలతో చెరువులు, వాగులు, వంకలను వదలడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల మండలంలో నంద్యాల చిన్న చెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో గత రెండు మూడు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్వుతున్నారు. నంద్యాల చిన్న చెరువు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ బిల్లలాపురం గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతుండగా, 856 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కానాల నాగమ్మ చెరువు చిన్న తూము వద్ద చాబోలు గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు మట్టి దందా సాగిస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు.. తవ్విన చెరువు మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లతో బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి 800 నుంచి రూ.1000 చొప్పున, అదే టిప్పర్ మట్టి అయితే రూ. 3వేల నుంచి 4వేల వరకు వెంచర్ల నిర్వాహకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే రైతుల పొలాలకు మట్టిని తోలుతున్నామంటూ బుకాయిస్తున్నారు. మట్టి కోసం లోతుగా తవ్వడం వల్ల చెరువు గర్భం లోతు పెరిగిపోయి పంట పొలాలకు సాగు నీటి సరఫరా జరిగే పరిస్థితి ఉండదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక మంత్రి తనయుల అండదండలతోనే మట్టి దందా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు నంద్యాల చిన్నచెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నా అందులో ఎలాంటి వాస్తవం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. మట్టి దందాపై మూడు రోజుల క్రితం సంబంధిత రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కానాల నాగమ్మ చెరువులో మట్టి తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదని, విచారించి తగు చర్యలు తీసుకుంటామని కేసీ కెనాల్ ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలు వెంచర్లు, పొలాలకు విక్రయం చోద్యం చూస్తున్న అధికారులు -
ఉపాధి పనుల్లోనూ రాజకీయమే
ఉయ్యాలవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పేదలకు సంబంధించిన ఉపాధి పనుల్లోనూ రాజకీయం చేస్తున్నారు. నచ్చిన వారికి పని కల్పించి మిగతా వారికి మొండిచేయిచూపుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మండలంలోని నర్సిపల్లె గ్రామంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఈ గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే అధికారపార్టీ నాయకులు పనులు కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది కూలీలు ఇళ్ల వద్దే ఖాళీగా ఉన్నారు. అధికారంలోకి రాగానే తమకు అనుకూలంగా ఉన్న ఉపాధి మేటి, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించుకుని, వారి ద్వారా తమను పనుల్లోకి రానివ్వడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం గ్రామానికి చెందిన కూలీలు హుసేన్సాహెబ్, షరీఫ్, సుభద్ర, శివమ్మ, చాంద్బీబీ, దస్తగిరి, జైనాబీతో పాటు మరి కొందరు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీఓ లేకపోవడంతో కార్యాలయ సీనియర్ అసిస్టెంటు శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ఉపాధి పనులు చూపడం లేదని, పాత ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించి కొత్త వారిని కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కొత్తగా మేటిని నియమించి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బరితెగించిన అధికారపార్టీ నాయకులు నర్సిపల్లె గ్రామంలో నచ్చినవారికే ఉపాధి పనులు నిజమైన కూలీలకు రెండేళ్లుగా మొండిచేయి -
ఓట్ల తొలగింపునకు కుట్ర
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: వచ్చే స్థానిక ఎన్నికలలోపు తమకు వ్యతిరేకమైన వారి ఓట్లు తొలగించేందుకు అధికారపార్టీలు కుట్ర పన్నుతున్నాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి తన స్వగృహంలో పట్టణ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఎ) సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 10 రాష్ట్రల సాధారణ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకొని సర్ పేరుతో ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓట్లను జాబితా నుండి తొలగించినట్లు అరోపణలు వచ్చాయాన్నారు. మన రాష్ట్రంలో కూడా బోగస్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని ప్రతి బీఎల్ఎ తన బూత్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు బూత్ పరిధిలో ఓటరుజాబితాపై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కొన్ని పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయన్నారు. వాటి కుట్రలను భగ్నం చేసేందుకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త బీఎల్ఎలతో కలిసి సైనికుల వలే పని చేయాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు బదిలీలకు బయపడి, ప్రలొభాలకు లొంగి అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే నిజమైన ఓటర్ల పేర్లను మాయం చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మీట్ మాజీ చైర్మెన్ శ్రీరాములు, మాజీ మున్సిపల్ చైర్మెన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మెన్ జాకీర్ హుసేన్, ముస్లిం మైనారిటీ నాయుకులు అక్బర్ బాషా,షేట్లతో పాటు పట్టణ బీఎల్ఎలు పాల్గొన్నారు. -
సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు
● విపక్షపార్టీపై వేధింపులు, కక్ష సాధింపులు ● టీడీపీ నేత తిలక్ తీరుతో వైఎస్సార్సీపీ కార్యకర్త సతీశ్ ఆత్మహత్య ● సూసైడ్ నోట్లో తిలక్ పేరు రాసినా కేసు నమోదు చేయని పోలీసులు ● మంత్రి భరత్ అరాచకాలపై నిరసన చేపట్టిన వైఎస్సార్సీపీ ● మంత్రి టీజీ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.45కోట్లు తీసుకున్నారని బైరెడ్డి ఆరోపణ ● బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ ఫిర్యాదు.. కర్నూలు త్రీటౌన్లో కేసు నమోదు ● టీజీ అక్రమాలు, అరాచకాలపై ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రణాళికకర్నూలులో సమ్మర్హీట్ కంటే పొలిటికల్ హీట్ రెండింతలు ఉంది. టీడీపీ నేత, మంత్రి టీజీ భరత్, బీజేపీ నేత టీజీ వెంకటేశ్, వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి అవినీతిపై సిద్దార్థ ఆరోపణలు సంధిస్తే, ప్రతిగా మంత్రి సిద్ధార్థపై కేసు నమోదు చేయించారు. దీంతో కర్నూలులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలు ఏంటి? అందులో వాస్తవం ఏంటి? టీజీ భరత్, టీజీ వెంకటేశ్ల రాజకీయ, వ్యాపార, ఆర్థిక వ్యవహారాలేంటి? అనే చర్చ కర్నూలు, నందికొట్కూరుతో పాటు ఉమ్మడి జిల్లా మొత్తం జోరుగా జరుగుతోంది. అసలు ఈ వివాదం ఏంటి? పరస్పర ఆరోపణల్లో వాస్తవాలేంటి అనే అంశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం – సాక్షి ప్రతినిధి కర్నూలు ప్రశాంత వాతావరణం ఉన్న నగరం కర్నూలు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ రౌడీయిజం, ఫ్యాక్షన్, కక్ష సాధింపులు, వేధింపులు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రశాంతంగా ఉండేది. అయితే తొలిసారి మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే అయిన తర్వాత విపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. అధికార అండతో పోలీసులను అస్త్రంగా చేసుకుని ఈ వేధింపులకు దిగుతున్నారనేది విపక్ష పార్టీ ప్రధాన ఆరోపణ. మంత్రి టీజీ భరత్ వేధింపులు, అవినీతి ఆరోపణలపై మాత్రమే సిద్ధార్థ ఆరోపణలు చేశారు. టీడీపీ నేతగా మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. కానీ టీడీపీకి బీజేపీ వత్తాసు పలికినట్లు టీజీ వెంకటేశ్ పరోక్షంగా సిద్ధార్థపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా సిద్ధార్థ కూడా ఘాటుగా బదులిచ్చారు. ఈ దారుణాలకు సమాధానం ఏంటి టీజీ?! మంత్రి అనుచరుడు, టీడీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్నోట్ రాసి దళిత కార్యకర్త సతీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఉన్నా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? చిన్న పోస్టు పెడితేనే కేసు నమోదు చేసే పోలీసులు సూసైడ్ నోట్ ఉన్నా కేసు నమోదు చేయకపోవడానికి భరత్ కారణం అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ● వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు పార్టీలో చురుగ్గా ఉన్నారనే కారణంతో అతని వాహనంలో 20 లీటర్ల నాటుసారా ఉందని త్రీటౌన్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని విపక్షపార్టీ ఆరోపించింది. ● 10వ వార్డు మాజీ కార్పొరేటర్ యూనస్ ఆఫీసును భరత్ అనుచరుడు అయూబ్ఖాన్ ధ్వంసం చేశారు. విచిత్రమేంటంటే తిరిగి యూనస్పైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంత్రి అండదండలతో అయూబ్ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగసత్యమే. ● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం నేత తిరుమలేశ్వరరెడ్డి మంత్రి భరత్ ఇంటి సమీపంలో నివాసం ఉంటారు. ఇతని ఇంటివద్ద కార్లు అడ్డంపెట్టి రౌడీయిజం చేసి తిరిగి అతనిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ● బిజినేపల్లి సందీప్ అనే వ్యక్తి కార్పొరేషన్లో ఎవ్వరూ టెండర్లలో పాల్గొనవద్దని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఈ స్క్రీన్షాట్లతో సహా సాక్షి కథనం ప్రచురిస్తే సాక్షిపై కేసు నమోదు చేశారు. ● ఏ, బీ, సీ క్యాంపులు ఖాళీ చేయాలని అక్కడి నివాసితులను వేధించడం, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ప్రభుత్వ ఆస్తిని కూల్చేసి కాజేసే కుట్ర జరుగుతోందని కథనాలు రాస్తే సాక్షిపై మరో 4 కేసులు నమోదు చేశారు. ● డోన్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాండ్రపాడులో నివాసం ఉంటున్నారు. భరత్ సోషల్ మీడియా అకౌంట్లో ‘జై జగన్’ అని కామెంట్ చేస్తే అతన్ని పట్టుకుని వచ్చి భరత్ కాళ్లు పట్టించుకుని ‘అయ్యా క్షమించండి’ అని చెప్పించుకుని వదిలేశారని నాగరాజు, సిద్ధార్థ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. ● కిమ్స్ ఆస్పత్రిలో పని చేసే జొహరాపురం వాసి కూడా ‘జై జగన్’ అని కామెంట్ పెడితే అతన్ని కొట్టి మంత్రి కాళ్లు పట్టించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఓ ఫార్మాకంపెనీ నుంచి రూ.45కోట్లు లోకేశ్కు తెలీకుండా భరత్ లంచం తీసుకున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. అలాగే ఓర్వకల్లు వద్ద మంత్రికి 1,100 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీటిపై మంత్రి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసుస్టేషన్లో పరువునష్టం దావా కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వైఎస్సార్సీపీ ఘాటుగానే స్పందిస్తోంది. ఫార్మా కంపెనీ పేరు చెబితే వారితో తిరిగి ప్రెస్మీట్ పెట్టించి ఖండించేలా చేస్తారని, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తానని సిద్ధార్థ చెబుతున్నారు. అలాగే మంత్రి బంధువు టీజీ విశ్వప్రసాద్కు 1,100 ఎకరాలు కట్టబెట్టింది నిజం కాదా? అని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. యువగళం పాదయాత్రలో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సుల్తానియా మసీదుకు చెందిన 1.5 ఎకరాల వక్ఫ్భూమిని కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారని, దానిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కడతారా? అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. ఆరోపణలకు సమాధానం చెప్పలేక కేసులతో భయపెట్టే చర్యలకు మంత్రి ఉపక్రమిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. -
వడగాడ్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రానున్న ఏడు రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. పీజీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఈనెల 20 నుంచి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. బహిరంగ పనుల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి ● ఈఓ ఎం.శ్రీనివాసరావు శ్రీశైలంటెంపుల్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సూచించారు. దేవస్థాన పరిపాలన భవనంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఉద్యోగి విధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వేసవి దృష్ట్యా ఇప్పటికే క్షేత్ర పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఆలయంలో, క్యూలైన్ల వద్ద మట్టి కుండలతో నీటిని భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద వితరణ భవనంలో శుభ్రత పాటిస్తూ భక్తులను అత్మీయంగా పలకరిస్తూ వడ్డన చేయాలని సూచించారు. చికెన్ వండమంటే పచ్చడి చేశాడని హత్య ● మద్యం మత్తులో దారుణం ● మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఆళ్లగడ్డ: చికెన్ వండమంటే పచ్చడి చేశాడనే కోపంతో స్నేహితుడిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన అహోబిలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం గ్రామానికి చెందిన శివ, బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన శంకర్ స్నేహితులు. అహోబిలంలో ఒకే ఇంట్లో ఉండేవారు. వారం రోజుల క్రితం ఇద్దరు మద్యం తాగారు. మత్తులో ఉన్న శివ చికెన్ కూర చేయాలని శంకర్కు సూచించాడు. అయితే శంకర్ చికెన్ కూరకు బదులు చికన్ పచ్చడి చేశాడు. పచ్చడి ఎందుకు చేశావని ఆగ్రహానికి గురైన శివ పక్కనున్న పచ్చడి చేసిన రోకలిబండతో శంకర్ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన శంకర్ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు రోజులు ఎవరికీ చెప్పకుండా మద్యం తాగుతూ తిరుగుతుండే వాడు. ఇరుగు పొరుగు వారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని శివను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిజం ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. దరఖాస్తు గడువు పొడిగింపు నంద్యాల(అర్బన్): నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్లో చేరేందుకు దరఖాస్తు గడువు మే 31 వరకు పొడిగించినట్లు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www. angrau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయం పని వేళల్లో 9989625208 నంబరును సంప్రదించాలన్నారు. -
అహోబిలేశునికే శఠగోపం!
తలనీలాలు చోరీకి గురైన మాట వాస్తవమే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీ వేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి, అహోబిలం దేవస్థానం అహోబిలం క్షేత్ర ప్రతిష్టను కాపాడాలి. గతంలో ఎప్పునడూ లేని విధంగా నిర్వాహకులు టీడీపీ నేతలకు భయపడొద్దు. రెండేళ్లుగా క్షేత్రానికి రావాల్సిన రూ. కోట్ల ఆదాయాన్ని దోచు కున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. టీడీపీ నాయకుల అండ చూసుకుని కొందరు సిబ్బంది చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలతో పాటు తలనీలాలు సైతం దోచుకుంటున్నారు. అహోబిలేశునికే శఠగోపం పెడుతున్న సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానుక.. దేవుడికే ఎరుక! ఇలపై ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ప్రముఖమైనది. క్షేత్రంలో వెలసిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారు తమకు శక్తి మేరకు హుండీలో కానుకలు వేయడం ఆనవాయితీ. విలువైన బంగారు కానుకలతో పాటు హుండీలో వేసిన నగదును సైతం గత రెండేళ్లుగా చోరీ చేశారు. రూ.లక్షలు కొట్టేస్తూ సీసీ కెమెరాల్లో దొరికి, పోలీసులు కేసు నమోదు చేసి, సొమ్ములు తిరిగి ఇచ్చిన వారిని సైతం మళ్లీ విధుల్లోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. దొంగను వదిలి.. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు టిక్కెట్ తీసుకుంటున్న సమయంలో అసలు ధరపై అదనంగా రూ.10 నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. గత శనివారం పావన క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రూ. 3 లక్షల విలువ చేసే 10 కిలోకు పైగా తలనీలాలు దొంగలించారు. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందే దేవస్థాన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరో తెలిసి కూడా పిలిచి వివరణ కూడా తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారు. మెమో తయారు చేసినా దానిని ఇచ్చేందుకు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. దొంగతనం చేసిన వ్య క్తులు, ఇందుకు సహకరించిన వారిని వదిలిపెట్టి దొంగతనం జరిగిందని బయటపెట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తికి మోమో ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు అహోబిల క్షేత్రంలో గత రెండేళ్లుగా భక్తులు సమర్పించే ఎంతో విలువైన కానుకలు, తలనీలాలు చోరీ అవుతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడేవారికి అక్కడే విధులు వేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే అహోబిలంలో ఏం చేసినా చెల్లుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అండ ఉన్న సిబ్బందికి ఇష్టమైన చోట (ఆదాయం వచ్చే) విధులు వేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. శనివారం వస్తే వారికి వసూళ్ల పండగే! టిక్కెట్ ధరపై అ‘ధనం’ వసూలు రూ. 3 లక్షల విలువైన వెంట్రుకలు చోరీ తస్కరులకు టీడీపీ నాయకుల అండ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం


