breaking news
Nandyal District Latest News
-
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 62.4 మి.మీ వర్షం కురియగా డోన్లో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా శ్రీశైలంలో 55.4, నంద్యాల రూరల్లో 55.2, నంద్యాల అర్బన్, కొత్తపల్లెలో 54.2, పాములపాడులో 52.2, బండిఆత్మకూరులో 51.4, గడివేముల 48.4, పగిడ్యాల 46.8, మిడుతూరు 43.2, జూపాడుబంగ్లా 36.2, వెలుగోడు 26.8, మహానంది 24.6, నందికొట్కూరు 17.8, పాణ్యం 16.2, బేతంచెర్ల, సంజామల, గోస్పాడు 8.2, శిరివెళ్ల 7.2, ఆళ్లగడ్డ 6.0, అవుకు 5.2, కొలిమిగుండ్ల, చాగలమర్రి 4.2, రుద్రవరం 4.0, దొర్నిపాడు 3.2, బనగానపల్లె 3.0 మి.మీ వర్షం కురిసింది. నీటిని పొదుపుగా వాడుకోవాలి పాములపాడు: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి జీఎన్ఎస్ఎస్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 3 గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి 25వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. కాగా వీబీఆర్ (తెలుగుగంగ)కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెయింటెనెన్స్ కింద రూ.22 కోట్ల నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి గోరుకల్లు రిజర్వాయర్ను నీటితో నింపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, సీఈ కబీర్, ఎస్ఈ శివకుమార్, ఈఈ కిష్టన్న, వెణుగోపాల్రెడ్డి, నాగేంద్ర కుమార్, డీఈ సుబ్రమణ్యరెడ్డి, నగేష్కుమార్, రవీంద్ర, ఆర్డీఓ నాగజ్యోతి, డీఎస్పీ రామాంజనేయులు నాయక్, తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్.. పీ4 సభకు రండి! ఉయ్యాలవాడ: బంగారు కుటుంబాల పేరుతో ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలకు స్పందన కరువైంది. శుక్రవారం మండలంలోని అల్లూరు గ్రామంలో గ్రామసభ 11 గంటలకు ప్రారంభం కావాల్సి వుండగా ప్రజలు ఎవరూ హాజరు కాలేదు. 11.30 సమయం దాటినా ఎవరూ గ్రామసభకు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ రహీమ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను గ్రామసభ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు వచ్చిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేద కుటుంబాలను అఽభివృద్ధి చేయడమే పీ4 కార్యక్రమం ధ్యేయమని వివరించారు. వచ్చిన 10 మందితో గ్రామసభ మమ.. అనిపించారు. నిబంధనలు అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్లు రద్దు శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణానదిలో మత్స్యకారులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రవికుమార్ హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం శ్రీశైలండ్యాం సమీపంలో అనధికారికంగా రెండు వర్గాలు చేపల వేటకు వెళ్లి పడవలపై తెడ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆయన లింగాలగట్టులో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా రాతపూర్వకంగా ఇస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. చేపలవేట నిషేధ కాలంలో వేట కొనసాగిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని, రద్దుచేసిన లైసెన్సు లు పునరుద్ధరించమని హెచ్చరించారు. సాధారణ రోజల్లో రిజర్వాయర్కు ముందు 150 మీటర్ల వరకు చేపలవేట సాగించరాదని ప్రభుత్వం జిఓ.నె. 186 తీసుకు వచ్చిందన్నారు. గత మంగళ వారం పరస్పర దాడులకు తెగబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని టూటౌన్ సీఐ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
బండి ఆత్మకూరు: గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జీసీ పాలెం, నెమళ్లకుంట గిరిజన గూడెంలోని గిరిజనులకు ఇంటి సామగ్రి పంపిణీ చేశారు. పీ4 కార్యక్రమంలో భాగంగా గూడెంలోని 43 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల జీవన స్థాయిని మెరుగుపర్చేందుకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, హౌసింగ్ వంటి రంగాలపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్వేలు, ధ్రువపత్రాల పంపిణీ, భూమి హక్కుల రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాల్లో ఆయా శాఖలు సమన్వయంతో పనిచేసి వారికి భూ హక్కు పట్టాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివ ప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణవేణి, తహసీల్దార్ పద్మావతి, పంచాయతీ అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజకుమారి -
ఏఐఐబీ పనుల పూర్తికి త్వరలో నిధులు
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఏషియన్ ఇన్ఫ్రాక్ట్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ ) ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పూర్తి త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని పీఆర్ ఎస్ఈ వి.రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈ, డీఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు ఏఐఐబీ నిధులతో మొత్తం 139 పనులు మంజూరు కాగా, వీటిలో వివిధ కారణాల వల్ల 29 పనులు డ్రాప్ అయ్యాయన్నారు. మిగిలిన 110 పనుల్లో ఇప్పటి వరకు 76 పూర్తి కాగా, మిగిలిన 34 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో రూ.24 కోట్ల అంచనాతో ప్రారంభించిన గోరంట్ల బ్రిడ్జి పనులు ఇప్పటి వరకు దాదాపు 15 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. మొత్తం 34 పనులకు అవసరమైన రూ.96 కోట్లు విడుదలవుతాయని, ఎప్పటిలోగా వీటిని పూర్తి చేస్తారో తెలపాలన్నారు. నిధులు విడుదలైతే రోడ్లకు సంబంధించిన అన్ని పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఇంజనీర్ల అభిప్రాయాలను ఈఎన్సీ కార్యాలయానికి పంపుతామని ఎస్ఈ తెలిపారు. సమావేశంలో ఈఈలు సీఎస్సీ మద్దన్న, బీసీ వెంకటేష్, రఘురామిరెడ్డి, డీఈఈలు బండారు శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మినారాయణ, మల్లికార్జున, రమేష్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్ డీఈ, డీఈఈల సమీక్షలో ఎస్ఈ రామచంద్రారెడ్డి -
సార్.. ఎరువులు ఎక్కడ!
నంద్యాల(అర్బన్): ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండో నెల గడుస్తోంది. అదను.. పదును చూసుకొని రైతులు దుక్కులు దున్నారు. సమయానికి అందాల్సిన విత్తనాలు, ఎరువులు జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎరువుల కొరతతో పనులు మానుకుని రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూటమి నేతల ఇళ్లకు నేరుగా ఎరువులు చేర్చుతున్న అధికారులు సామా న్య రైతుల అవస్థలు పట్టించుకోవడం లేదు. కానాల గ్రామం పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం) పరిధిలోని రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. కానాల సొసైటీ పరిధిలో పెద్దకొట్టాల, పాండురంగాపురం, పొన్నాపురం, చాబోలు, అయ్యలూరు, రైతునగర్, కానాల తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు 2,500 మంది రైతులు, 6వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. కానాల పీఏసీఎస్ పరిధిలో దాదాపు 2,500 మెట్రిక్ టన్నుల డీఏపీ, 270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 84 మెట్రిక్ టన్నుల డీఏపీ, 110 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. వారం రోజులుగా ఎలాంటి ఎరువులు మంజూరు కాకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు. శుక్రవారం 400 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా సొసైటీ భవనం వద్దకు చేరుకొని అధికారులతో వాగ్వాదం చేశారు. అప్పటికే కూటమి నేతలకు పంపిణీ చేయడం, మిగిలినవి నచ్చిన వారికి ఇచ్చినట్లు తెలుసుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ పరిఽధిలో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్థానిక అధికారులను హెచ్చరించారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం చేతులెత్తేసిందని రైతులు చిన్నహుసేన్, వెంకటేశ్వర్లు, బాబు, షేక్ హుసేన్, కాశీం, తదితరులు విమర్శించారు. రైతులను వేధిస్తున్న ఎరువుల కొరత రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు అధికారులను నిలదీస్తున్న రైతులు -
రోడ్డును దున్నేసి.. పంటను సాగు చేసి!
నంద్యాల(అర్బన్): కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. అసైన్డ్ భూములు, వాగులు, వంకలు ఆక్రమించిన వారు ఇప్పుడు దర్జాగా ఏకంగా ఆయకట్టు రోడ్డు తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైనమిది. నంద్యాల మండలం మేజర్ పంచాయతీ కానాల గ్రామంలో ఆయకట్టు రోడ్డుపై టీడీపీ నేత కన్నేశారు. నాలుగేళ్ల క్రితం రైతులంతా చందాలు వేసుకొని నిర్మించిన రోడ్డును దౌర్జన్యంగా ట్రాక్టర్తో దున్ని కందిపంటను వేశారు. దశాబ్దాల క్రితం కానాల నుంచి కోవెలకుంట్లకు వెళ్లే రహదారిలో బైసాని కృష్ణమూర్తి, నంద్యాల పక్కీర్షా పొలాల మధ్యన హైస్కూల్ కొట్టాల, నాగులవరం వరకు పోరంబోకు రస్తా ఉంది. గతంలో కరణం నాగేశ్వరరావు పోరంబోకు స్థలాలకు పట్టా పుట్టించుకొని పత్తి నాగయ్య, తదితరులకు సీలింగ్ ల్యాండ్ కింద అమ్మకాలు జరిపారు. కాలక్రమేణ కొంత మంది ఆ రస్తాను ఆక్రమించి పొలాలు సాగుచేశారు. ఆయకట్టు రోడ్డు లేక స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామ రైతులు చర్చించుకుని 2021 వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వారంతా కలిసి 30 అడుగుల రహదారిని చందాలు వేసుకొని నిర్మించుకున్నారు. కేసీ కెనాల్ అధికారులు అక్కడక్కడ కల్వర్టులు ఏర్పాటు చేసి ఆయకట్టు రైతులు ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అప్పటి వరకు ఆక్రమణ దారుల్లో ఉన్న పోరంబోకు రస్తా ఆయకట్టు రోడ్డుగా మారింది. దీన్ని జీర్ణించుకోలేని స్థానిక టీడీపీకి చెందిన నాయకుడు పిట్టల హనీఫ్ ఇటీవల ఆయకట్టు రోడ్డును దున్ని కంది పంట వేశారు. ఆయకట్టు రోడ్డులో పంటలు వేయడం ఏమిటని పలువురు రైతులు నిలదీస్తున్నా వారిని బెదిరిస్తున్నారు. దీంతో పరిష్కార వేదికలో కలెక్టర్కు సమస్యను విన్నవించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. టీడీపీ నాయకులకు ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడం పరిపాటిగా మారింది. అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తుండటంతో మరింత రెచ్చిపోతున్నారు. కానాలలో టీడీపీ నాయకుడి నిర్వాకం ఆయకట్టు రోడ్డు తమదేనంటూ బెదిరింపు -
కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రకటన ఇందుకు వేదికగా మారాయి. బీసీలకు విలువ లేదని కర్నూలు ఎంపీ అనగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పట్టించుకోరా అని ఆదోని ఎమ్మెల్
అయ్యో.. అఖిల●● మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జనసేనకు కేటాయింపు ● చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ముందుగానే బీ ట్యాక్స్ ● అధిష్టానంపై అలకబూని గండ్లేరు నీటి విడుదలకు గైర్హాజరు●● చిచ్చురేపిన మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రకటన ● మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు మధ్య విభేదాలు ● బీసీలకు విలువ లేదని సన్నిహితుల దగ్గర వాపోయిన వైనం ● ఆదోనిలో టీడీపీకి ఇవ్వడంపై ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం ఆళ్లగడ్డ: జిల్లాలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? ఆమె, భర్త వ్యవహారశైలి అధికారపార్టీకి తలనొప్పిగా మారిందా? కూటమి ప్రభుత్వంలోని ఏ నాయకుడికీ వారు నచ్చడం లేదా ? ఇక వారిని పక్కన పెట్టాలి అనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందా ?.. అని అంటే జరుగుతున్న సంఘటనలు చూస్తే అవుననిపిస్తోంది. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి జనసేనలో ఓ వర్గానికి చెందిన మేలేరి మల్లయ్య భార్య సురేఖను నియమించడంపై నియోజకవర్గంలో అందరూ షాక్కు గురయ్యారు. దాదాపు మూడు నెలల క్రితమే జనరల్ కోటాలో కేటాయించిన ఈ పదవికి టీడీపీలోని సీనియర్ నాయకులు అనేక మంది పోటీ పడ్డారు. అయితే ఎవరు ఎక్కువ మొత్తం ‘బీ’ ట్యాక్స్ చెల్లిస్తే వారికే ఆ పదవి అని చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో ఎక్కువ మొత్తం ఇచ్చిన వారికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల పదవులు కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో అఖిలప్రియకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆళ్లగడ్డ జనసేన పార్టీలోని ఓ వర్గం నేత మైలేరి సురేఖకు చైర్మన్గిరి కేటాయించారని చర్చ జరుగుతోంది. అడ్వాన్స్ ఇచ్చి.. ఇరుక్కుపోయి! మూడు నెలల క్రితం వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్కు కేటాయించారని తెలియగానే నియోజకవర్గంలో అనేక మంది పోటీ పడ్డారు. చివరకు రుద్రవరం మండలానికి చెందిన ఓ బీసీ నాయకుడు రూ.70 లక్షలు ‘బీ’ ట్యాక్స్ కడతానని ముందుకు రావడంతో పాటు ముందుగా రూ. 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే వైస్ చైర్మన్గా దొర్నిపాడు మండలానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత రూ. 12 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్గా చెల్లించినట్లు సమాచారం. వీరితో పాటు అనేక మంది డైరెక్టర్ల పదవి కావాలనే వారు ఒక్కొక్కరు కనిష్టంగా రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 6 లక్షల వరకు బేరం మాట్లాడుకుని కొందరు అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరంతా తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో చోటు
నంద్యాల: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన పలువురికి చోటు లభించింది. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బీసీసెల్ ప్రధాన కార్యదర్శిగా బి.శివశంకర్నాయుడు, కార్యదర్శిగా సి.లాలుస్వామి, జాయింట్ సెక్రటరీలుగా ఎం.బాలస్వామి, కె.పుల్లయ్యయాదవ్, ఎం.మునీర్బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా నసురుల్లాఖాన్లను నియమించారు. మంత్రాలయం తుంగా తీరంలో షవర్లు మంత్రాలయం: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల నదీ ప్రవాహంలో కర్ణాటక రాష్ట్రం అర్షికేరి మండలానిక చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీమఠం, ప్రభుత్వాధికారులు మేల్కొన్నారు. ప్రమాద ఘంటికలు పొంచి ఉండటంతో భక్తుల నదీ స్నానాలకు బ్రేకులు వేశారు. నదిలోకి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. స్నానపు ఘాట్తో రెండు విభాగాలుగా షవర్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా స్నానాలు ఆచరించేలా షవర్ల సముదాయాన్ని నెలకొల్పారు. ప్రత్యేక విద్యుత్ మోటార్ల ద్వారా షవర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. తీరం పొడవునా పోలీసులు, సెక్యురిటీ గార్డ్స్ను పహారాగా పెట్టారు. నదిలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు శ్రీమఠం మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులతోనే సాగులో రాణింపు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధాన ఉద్యాన పంటలైన ఉల్లి, మిరప, పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో రాణించవచ్చని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. గురువారం కర్నూలులోని ఉద్యాన భవన్లో ఆయా పంటల సాగుపై రైతులకు, గ్రామ ఉద్యాన సహాయకులు, ఉద్యాన సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మహానందిలోని హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు హాజరై మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 25,122 హెక్టార్లలో ఉల్లి సాగువుతుందని, అయితే ఉత్పాదకతను పెంచడంలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. చక్కటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే హెక్టారుకు సగటున 150 క్వింటాళ్ల ఉత్పాదకతను పొందవచ్చన్నారు. మిరప సాగు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉందని.. నల్లతామర, వైరస్ తెగుళ్లను నివారించుకుంటే దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. మహానంది ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ ఉల్లి, పసుపు, మిరప సాగు పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ ఫిరోజ్ ఖాన్, ఎన్హెచ్ఆర్డీఎఫ్ ప్రతినిధి శరవనన్, జిల్లాలోని ఉద్యాన అధికారులు అనూష, శ్రీవాణి, మదన్మోహన్గౌడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారి పడి యువకుడి మృతి
● ఎడమ చేతిపై గుజరాతీ భాషలో పచ్చబొట్టు ఆదోని సెంట్రల్: రైలు నుంచి జారిపడి గురువారం ఒక యువకుడు మృతి చెందాడు. అతను ఎవరో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో, ఏ రైలు నుంచి జారీ పడ్డాడో పూర్తి సమాచారం దొరక లేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. మృతదేహం ఆదోని–ఇస్వి అర్ఎస్ల మధ్య కనిపించిందని చెప్పారు. మృతుడి ఎడమ చేతిపై గుజరాతీ భాషలో పచ్చబొట్టు ఉందని, గుర్తుపట్ట కలిగిన వారు తమను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిమ్ బ్లాక్ చేసి.. డబ్బు కాజేసి! దేవనకొండ: ఫోన్ సిమ్ను బ్లాక్ చేసి.. ఫోన్పే ద్వారా డబ్బు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవనకొండ మండలంలోని తెర్నేకల్ గ్రామానికి చెందిన శాలుబి(62) అనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శాలుబీకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఖాతాలో పంటల ఇన్సూరెన్స్ బీమా, ఎల్ఐసీ ఇన్సూరెన్స్కు సంబంధించిన రూ.60 వేలు, పొదుపు లోన్ తీసుకున్న రూ.1.50 లక్షలు మొత్తం రూ.2 లక్షలు దాకా సేవింగ్ ఖాతాలో ఉంది. ఈమె ఫోన్ నంబర్తో బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం ఉంది. అదే ఫోన్ నంబర్తో ఫోన్పే ఉంది. ఈనెల 7వ తేదీన ఈమెక ఫోన్కు చెందిన సిమ్ బ్యాక్ అయ్యింది. 16వ తేదీ కొత్త సిమ్ తీసుకుని యాక్టివేట్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా ఈనెల 8వ తేదీన రూ.లక్ష, 9వ తేదీన రూ.లక్ష ఫోన్ పే ద్వారా డ్రా చేసినట్లు స్టేట్మెంట్లో బయటపడింది. దీంతో ఒక్కసారిగా విస్తుపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 19న ‘స్పాట్’ అడ్మిషన్లు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్స్, బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈనెల 19న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ మైనార్టీ కాలేజీ ప్రిన్సిపాల్ వీ.ఎస్.వీ.సీహెచ్ శ్రీనివాస ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని నేరుగా హాజరుకావొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9912342098ను సంప్రదించవచ్చునని తెలిపారు. -
కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు!
● ఒప్పందాన్ని మట్టిలో కలిపేసిన పొగాకు కంపెనీలు ● అమ్ముకోలేక రైతుల ఇళ్ల ముంగిట దిగుబడులు ● మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ ● పాలకులకు పట్టని అన్నదాత కష్టాలు కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమవుతోంది. వరి, పత్తి, మిరప రైతులు నష్టాలకే దిగుబడులు అమ్మేసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దిగుబడులను దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు. జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సత్వరమే పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ఎమ్మెల్యేలు, ఎంపీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆత్మకూరు: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పొగాకు రైతులు కుదేలవుతున్నారు. కంపెనీల చేతిలో మోసపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అదిగో.. ఇదిగో అంటూ కాలపయాన చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న తమకేమీ పట్టనట్లు పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక.. దిగుబడిని నిల్వ చేసుకోలేక దిగాలు చెందుతున్నారు. నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందిన రైతాంగానికి ఇప్పటికీ ఆదోని, కర్నూలు మార్కెట్లే పెద్ద దిక్కుగా నిలిచాయి. జిల్లాలో పండించే వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, పత్తి, కంది తదితర పంటలు సైతం ఈ ప్రాంత వ్యాపారులు, దళారులు కొనుగోలు చేయపోతే నేరుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్కు తరలించి ధాన్యాన్ని విక్రయిస్తారు. పత్తి దిగుబడిని ఆదోని మార్కెట్యార్డుకు తరలిస్తారు. జిల్లా కేంద్రం నంద్యాలలో ప్రధాన పంటల మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో గతేడాది మధ్య పంటగా పొగాకును రైతులు విస్తారంగా సాగు చేశారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పండించారు. ప్రధానంగా ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో దాదాపు 25 మండలాల్లో పొగాకును సాగుచేశారు. అయితే ఇక్కడ పొగాకు కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల పొగాకు కంపెనీలే రైతులకు దిక్కు అయ్యాయి. అయితే సాగుకు ముందు ఒప్పందం చేసుకున్న కంపెనీలు మోసం చేయడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ప్రధానంగా జీపీఐ, అలియన్స్ ఈ కంపెనీలు క్వింటా రూ.15 వేలు దాకా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి చివరకు అరకొరగా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఉన్నఫలంగా చేతులెత్తేశాయి. ఇక రైతులు ఏమి చేయలేక ఇళ్లు, కల్లాల్లో పొగాకు బేళ్లను నిల్వ ఉంచారు. దీనికితోడు ఏప్రిల్, మే నెలలో వర్షాలు కురవడంతో పొగాకు దెబ్బతింది. రైతులు రూ. లక్షలు నష్టపోయారు. గుంటూరు తరహాలో నంద్యాలలో కూడా పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే నేరుగా అక్కడికి తరలించి విక్రయించే అవకాశం ఉండేదని చెబుతున్నారు. కళ్లేదుట నిల్వలు.. కంపెనీలు మోసం చేయడంతో ఇప్పటికీ కొందరు రైతుల వద్ద 30 నుంచి వంద క్వింటాళ్ల దాకా పొగాకు నిల్వలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఒక్క కరివేన గ్రామంలోనే దినకర్ 100 క్వింటాళ్లు, గౌతం 150, ఎల్లారెడ్డి 150, శేషయ్య 60, సుదర్శన్ 65, రవి 50, కుమ్మరి రవీంద్ర 70, పాపన్న వంద, మద్దిలేటి 100, కురువ శీన 50, పి.నాగేంద్రుడు 100, రమణ, మల్లయ్యల వద్ద వంద క్వింటాళ్ల దాకా పొగాకు నిల్వలు ఉన్నాయి. పొగాకును అమ్ముకోలేక, ఇళ్లలో దాచుకోలేక రైతుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు కళ్ల ముందు విలువైన పంట.. మరోవైపు వేధిస్తున్న అప్పుల భారంతో సతమతమవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీకి రైతుల సమస్య పట్టదా? -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవనకొండ: అప్పుల బాధతో గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన గువ్వల రంగస్వామి(45) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని ఈయన పంటలు పండించేవారు. గొర్రెలు, పొట్టేళ్ల పెంపకంతో జీవనం సాగించేవాడు. అయితే గతేడాది పంటలు పండలేదు. పిల్లల పెళ్లిళ్లకు దాదాపు రూ.8 లక్షలు దాకా అప్పు చేశాడు. తనకున్న గొర్రెలను అమ్మినా అప్పు తీరకపోవడంతో ఈయన కొడుకు, కోడలు హైదరాబాద్కు వలస వెళ్లారు. అప్పుల బాధతో గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. ఇంటి పక్కన ఉండే వారు ఈ విషయాన్ని పొలంలో పనిచేస్తున్న కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించారు. రంగస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మంత్రాలయం: మంత్రాలయంలోని ఓ హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలివి.. కర్ణాటకలోని ఇడపనూరు పోలీస్ పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ దుల్లయ్య కొన్ని రోజులుగా స్థానిక హోటల్లో పని మనిషిగా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికో.. లేదా ఇతరుల ప్రమేయం మేరకో తెలీదు గానీ ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వాహనాలు వెళ్లే స్థలంలో దుల్లయ్య అనుకోకుండా మృత్యువాత పడ్డాడు. మృతుడి ఛాతీ భాగంలో, తొడల భాగంలో కొన్ని కందిన గాయాలు ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. -
మరణించినా ముగ్గురికి ప్రాణదానం
● బ్రెయిన్ డెడ్ అయిన యువకుని అవయవదానం కర్నూలు(హాస్పిటల్): రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకు ని అవయవదానంతో మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త భానకచర్ల గ్రామానికి చెందిన మొలక రాజు, ఈశ్వరమ్మల కుమారుడైన మొలక తరుణ్(21) ఈ నెల 9వ తేదీన స్కూటర్పై వెళుతూ పాములపాడు సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. కర్నూలులోని గౌరీగోపాల్ ఆసుపత్రిలో ఈనెల 10వ తేదీన చేరాడు. చికిత్స పొంది ఈ నెల 14వ తేదీన మెడికవర్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ 16వ తేదీన అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో జీవన్దాన్ ద్వారా అవయవదానం గురించి అతని కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో గురువారం మెడికవర్ హాస్పిటల్లో అవయవాలను శస్త్రచికిత్స ద్వారా సేకరించారు. శస్త్రచికిత్సలో యురాలజిస్టు డాక్టర్ అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సిద్దార్థ్ హెరూర్, అనెస్తెటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం గ్రీన్ చానల్ ద్వారా సేకరించిన అవయవాల్లో పోలీసుల సహకారంతో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ ఆధ్వ ర్యంలో ఊపిరితిత్తులను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, ఒక కిడ్నీని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, మరో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అనంతరం తరుణ్ తల్లిదండ్రులను ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, ఆసుపత్రి క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి, వైద్యులు తదిత రులు సన్మానించారు. -
శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
అనిత మృతితో సంబంధం లేదు అనిత మృతికి ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని శ్రీ చక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకుమార్రెడ్డి చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిత అనే యువతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జ్వరంతో చికిత్స నిమిత్తం వచ్చిందని, క్యాజువాలిటీలోనే సాయంత్రం వరకు ఆమెకు అవసరమైన మందులు ఇచ్చి, ఫ్లూయిడ్స్ పెట్టామన్నారు. ఆమె కోలుకోవడంతో ఇంటికి వెళ్తానంటే పంపించామన్నారు. మరుసటి రోజు రాత్రి అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెను క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెంది ఉందన్నారు. ఆమె మృతికి, ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆసుపత్రిపై దాడులు చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. కర్నూలు/కర్నూలు(హాస్పిటల్): జ్వరం కారణంగా చికిత్సకు వచ్చి యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు గురువారం కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిపై దాడులు చేసి గాజుతో తయారు చేసిన కిటికీలు, తలుపులు ద్వంసం చేశారు. వంద మందికి పైగా నిర్వహించిన ఈ దాడితో ఆ ప్రాంతంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు స్థానిక కల్లూరు ఎస్టేట్లోని పోలీస్ కాలనీకి చెందిన ప్లాట్ల రమణ కుమారుడు నాగేంద్రతో ఏడాది క్రితం వివాహం జరిగింది. నాగేంద్ర తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. ఈ క్రమంలో అనితకు ఈ నెల 15వ తేదీ జ్వరం రావడంతో సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి క్యాజువాలిటీలో ఆమెకు అవసరమైన చికిత్సను అందించి సాయంత్రం ఇంటికి పంపించారు. మరుసటి రోజైన బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా గురువారం ఉదయం అనిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున శ్రీచక్ర హాస్పిటల్ వద్దకు వచ్చారు. అనితకు సకాలంలో వైద్యం అందించలేదని, మెరుగైన వైద్యం అందించి ఉంటే బ్రతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో ఆసుపత్రిపై రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. ఆ తర్వాత బయట మెడికల్షాపుకు ఉన్న పెద్ద అద్దాన్ని, గాజు తలుపును ధ్వంసం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లి కనిపించిన ప్రతి వస్తువును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ కియోస్క్, కిటికీలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య యాదవ్, నాగరాజురావు, శేషయ్య, విక్రమసింహ, తబ్రేజ్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిపి న్యాయం చేయండి శ్రీచక్ర హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ ఇచ్చిన మందులు వికటించడం వల్లే తన భార్య అనిత (20) మృతిచెందిందని భర్త వడ్ల నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 12వ తేదీన తన భార్యకు జ్వరంగా ఉండటంతో రెండు రోజుల పాటు మాత్రలు మింగినా నయం కాలేదు. ఈనెల 15న శ్రీచక్ర ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు పరిశీలన జరిపి రెండు రోజుల పాటు వైద్యచికిత్సలు చేసి డిశ్చార్జి చేశారన్నారు. మరుసటి రోజు వైద్యం వికటించి తన భార్య మృతిచెందిందని నాగేంద్ర ప్రసాద్.. నాలుగో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన ఆసుపత్రిపై దాడులు, అద్దాలు ధ్వంసం -
ప్రతి ఒక్కరికి అడ్మిషన్లు ఇస్తున్నాం
సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. భవిత కేంద్రాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. కేంద్రాల పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. –జగన్మోహన్రెడ్డి, సహిత విద్య, జిల్లా కో ఆర్డినేటర్, నంద్యాల నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు‘ ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. శారీరక, మానసిక పరిస్థితికి అనుగుణంగా వారికి అవసరమైన విద్యను భవిత కేంద్రాల ద్వారా కల్పిస్తున్నాం. వారికి అవసరమైన ఉపకరణాలు అందించడంతో పాటుగా, అలవెన్సులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భవిత కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. –ప్రేమాంతకుమార్, జిల్లా సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్, నంద్యాల -
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కల్లూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. పుసులూరు గ్రామంలో గురువారం సాయంత్రం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ క్యూఆర్ కోడ్ ద్వారా గత ఏడాది కాలంలో ప్రతి కుటుంబం ఎంత నష్టపోయారో వివరించారు. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మహిళలకు ఉచిత బస్సు అమలు కావడం లేదని ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, సోమన్న, పార్టీలో వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘విభిన్న’ చిన్నారుల భవితకు భరోసా
● జిల్లాలో కొత్తగా 267 మంది దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు ● వీరికి సమీప పాఠశాలల్లో అడ్మిషన్లుజిల్లాలో పరిస్థితి ఇది.. జిల్లాలో భవిత కేంద్రాలు 29 ప్రత్యేక అవసరాల పిల్లలు 5369 భవిత కేంద్రాలకు వచ్చే వారు 555 హోం బెస్ట్ ఎడ్యుకేషన్ పొందుతున్న వారు 591 కేంద్రాల్లో ఐఈఆర్పీలు 58 ఆయాలు 29 ఫిజియో థెరపిస్ట్లు 08 నంద్యాల(న్యూటౌన్): విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు ఉజ్వల భవిత అందనుంది. జిల్లాలో మే 13 నుంచి జూన్ చివరి తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించి 267 మంది దివ్యాంగ విద్యార్థులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పధకాలు అందేలా జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు. యూ–డైస్లో నమోదు విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను మండల యూనిట్గా లెక్కించారు. జిల్లాలో ఇప్పటికే 5,369 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు కొత్తగా గుర్తించిన 267 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్కార్డును అనుసంధానం చేస్తూ ఆయా పాఠశాలల యూ–డైస్ కోడ్లో విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లల వాస్తవ గణాంకాల్లో పారదర్శకతతో పాటు వారు ఎక్కడ చదువుతున్నారనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఇళ్లకు వెళ్లి బోధన ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 29 భవిత కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు 8 ఫిజియోథెరపిస్టులు చిన్నారులకు సేవలందిస్తున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులు కావటంతో వీరికి ఆటపాటలతో చదువులు చెప్పాల్సిన ఆవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన ఆట పరికరాలు, వస్తువులను కేంద్రాలకు సమకూరుస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలో ఇద్దరు ఇంక్లూజీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు (ఐఈఆర్పీలు) చిన్నారులకు విద్యను అందిస్తారు. వీరితో పాటు ప్రతి కేంద్రంలో ఒకరిని ఆయాగా నియమించారు. శారీరక వైకల్యం అధికంగా ఉన్న చిన్నారులకు ఇంటి వద్దనే ఆవనరమైన వైద్య సేవలు అందించేలా ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా పాఠశాలకు వెళ్లని విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల ఇళ్లకు వెళ్లి ఐఈఆర్పీలు బోధన చేస్తారు. -
ఎస్సార్బీసీకి జలకళ
కోవెలకుంట్ల: మూడు రోజుల క్రితం గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి విడుదల చేసిన నీరు బ్లాక్లకు చేరుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు వదిలిన నీరు బానకచర్ల మీదుగా ఎస్సార్బీసీకి విడుదలవుతున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎస్సార్బీసీ కాల్వలు కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయి. కోవెలకుంట్ల పట్టణ శివారులోని 10వ బ్లాక్ కాల్వకు నీరు చేరింది. కాల్వ పరీవాహక ప్రాంత రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, మినుము పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. లాటరల్ ఎంట్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులునంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఐవీసీ) అభ్యర్థుల నుంచి లాటరల్ ఎంట్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి.శైలేంద్రకుమా ర్ తెలిపారు. ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్స్ పాస్ అయిన విద్యార్థులు డిప్లొమోలోని మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో అడ్మిషన్ పొందుటకు అర్హులని తెలిపారు. సరైన ధ్రువపత్రాలతో ఈనెల 18వ తేదీ ప్రభుత్వ పాలిటెక్నిక్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలన్నారు. 19వ తేదీన కర్నూలు పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీ కళాశాలలో జరుగే స్పాట్ అడ్మిషన్కు హాజరు కావాలన్నారు. సమాచారం కోసం 9912377723ను సంప్రదించాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కర్నూలు(అర్బన్): నగరంలోని సి.క్యాంప్ శారీరక వికలాంగుల (దివ్యాంగుల) బాలుర వసతిగృహంలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు ఇతర కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హాస్టల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 100 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే బి.క్యాంప్లో రూ.2.86 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో నూతన వసతి గృహాన్ని కూడా నిర్మిస్తున్నామన్నారు. దరఖాస్తులను వసతి గృహ సంక్షేమాధికారికి అందించాలన్నారు. మరిన్ని వివరాలకు 08518– 277864ను సంప్రదించాలన్నారు. 17 టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపివేతగోస్పాడు: మండల కేంద్రం గోస్పాడులోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి 17 టన్నుల ఎరువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపి వేశారు. గురువారం రాష్ట్రస్థాయి తనిఖీ బృందంలోని కమలాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు నరసింహారెడ్డి, విజిలెన్స్ ఎస్ఐ గోపాలుడు తదితరులు స్థానిక ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. కాగా శ్రీవెంకటసాయి ఫర్టిలైజర్స్ అండ్ ఫెర్టిసైడ్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. 9:24:24 ఎరువు మందును గుర్తించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దాదాపు రూ.8.13 లక్షల విలువైన 17.12 టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారి వెంట స్థానిక వ్యవసాయాధికారి స్వప్నికారెడ్డి, సిబ్బంది ఉన్నారు. జిల్లాలో మోస్త్తరు వర్షం నంద్యాల(అర్బన్)/దొర్నిపాడు: నంద్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. బనగానపల్లె మండలంలో అత్యధికంగా 37.0 మి.మీ, జూపాడుబంగ్లా మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల అర్బన్లో 32.0, కోవెలకుంట్ల 31.4, కొలిమిగుండ్ల 30.0, ఆళ్లగడ్డ 29.6, బేతంచెర్ల 24.2, మహానంది 18.6, అవుకు 18.2, ఉయ్యాలవాడ 16.4, నంద్యాల రూరల్ 15.6, డోన్ 14.2, చాగలమర్రి 13.8, దొర్నిపాడు 11.2, ప్యాపిలి 6.8, సంజామల 6.4, గోస్పాడు 6.2, పాణ్యం 6.0, రుద్రవరం 4.2, బండిఆత్మకూరు 3.2, గడివేముల 2.2, వెలుగోడు 2.0, పగిడ్యాల 1.4 మి.మీ వర్షం కురిసింది. కుందూనదికి వరద నీరు పోటెత్తడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలి
గడివేముల: రైతుల నుంచి పొగాకు యాజమాన్యం కుదుర్చున్న ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని నంద్యాల – నందికొట్కూరు ప్రధాన రహదారిపై జీపీఐ కొనుగోలు కేంద్రం వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన పొగాకు రైతులు ధర్నా నిర్వహించారు. సాగు చేసే సమయంలో జీపీఐ కంపెనీ అధికారులు రైతుల నుంచి రూ 12 వేల నుంచి 18 వేల వరకు పొగాకు కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం రూ. 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం మోసం చేయడమేనన్నారు. పొగాకు రైతులను మోసం చేసిన జీపీఐ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. పొగాకు రైతులు ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. -
యూరి‘యాతన’!
రైతులకు ఎక్కడి లేని కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పెట్టింది. పంటలకు కావాల్సిన ఎరువుల్ని స్టాక్ లేకుండా చేసింది. ముందస్తుగా వచ్చిన వర్షాలతో రైతులు కొన్ని పంటలు వేశారు. అవి పండితే అప్పులు తీరుతాయని అన్నదాతలు అనుకుంటున్న తరుణంలో పంటల ఎదుగుదలకు అవసరమైన యూరియా కరువైంది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైతులందరికీ కౌతాళం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా ఇస్తామని చెప్పారు. దీంతో గురువారం రైతులు వందలాదిగా తరలివచ్చారు. తమ పట్టాదారు పాస్పుస్తకాలను వరుస పద్ధతిలో క్యూలో పెట్టుకుని నిరీక్షించారు. మధ్యహ్నం వచ్చిన మూడు, అనంతరం వచ్చిన మరో మూడు లోడ్లు రైతులకు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో వ్యవసాయాధికారి శేషాద్రితో రైతులు చాలాసేపు వాగ్వాదం చేశారు. అనంతరం మరో రెండు లోడ్ వచ్చినా రైతులకు సరిపోలేదు. యూరియా కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని రైతులు మండిపడ్డారు. – కౌతాళంయూరియా కోసం పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి నిరీక్షిస్తున్న రైతులు●● క్యూలో నిల్చున్నా అందని వైనం ● రైతులకు తప్పని తిప్పలు -
కష్టాలు వినలేదు.. వరాలు ఇవ్వలేదు
నందికొట్కూరు: మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవా కాలువకు నీటి విడుదల చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, ప్రజల కష్టాలు తెలుసుకోలేదు. ఇచ్చిన హామీలపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందారు. గురువారం మల్యాల ఎత్తిపోతలను సందర్శించి మోటార్లు ఆన్ చేసి కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన రైతు సభలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్ల, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత మంది ఎమ్మెల్యేలను వేదికపైకి ఆహ్వానించలేదు. ఆర్థిక శాఖ మంత్రి, నంద్యాల జిల్లా ఇన్చార్జ్ పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడినట్లు కనిపించింది. సీఎం బాబు పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నార ని పొగడ్తలతో ముంచెత్తారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఒక మిడుతూరు మండలం ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించడంతో మిగతా మండలాల ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు కనబడటం లేదా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మండలానికి మాత్రమే ఎమ్మెల్యేనా అని.. సభకు వచ్చిన రైతులు, ప్రజలు మండిపడ్డా రు. నీటి ముంపు బాధితులకు సీఎం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి విస్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ సభను తలపించిన రైతుసభ -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది చెప్పారు. మధ్యవర్తిత్వంతో కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిచడంతో పాటు సమయం, డబ్బు వృథా కావన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు వన్ కే ర్యాలీని నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది, జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఇన్చార్జి కార్యదర్శి దివాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి, బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, మీడియేషన్ శిక్షణ పొందిన న్యాయవాదులు నాగశేషయ్య, ఆశాబాయి, యూ.లక్ష్మి, ఉమాదేవి పాల్గొన్నారు. -
పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం
● గత వైఎస్సార్సీపీ పాలనలో కూటమి నేతల గగ్గోలు ● అప్పట్లో రూ.182.83 కోట్ల నాబార్డు నిధులు ● ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు రూ.42.13 కోట్లు ● ఒక్కో నియోజకవర్గానికి రూ.5కోట్ల పనులకు ప్రతిపాదన ● రూ.3కోట్ల పనులకే మంజూరు ● ఆళ్లగడ్డ, డోన్ నియోజకవర్గాలపై వివక్ష నాలుగు నెలలకే ఛిద్రం పీఎంజీఎస్వై కింద రూ.480.50 లక్షల అంచనాతో కర్నూలు మండలం పసుపుల నుంచి గార్గేయపురం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 2024 మార్చి 6న ప్రారంభించి ఈ ఏడాది మార్చి 5న పూర్తి చేశారు. ఈ రోడ్డును ఐదు సంవత్సరాలు నిర్వహించేందుకు రూ.31.21 లక్షలుగా పేర్కొన్నారు. అయితే రోడ్డును ప్రారంభించిన నాలుగు నెలలకే పలు చోట్ల ఛిద్రమైంది. -
94 పరిశ్రమలకు అనుమతులు
నంద్యాల: వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోసం గత మూడు నెలల కాలంలో 116 దరఖాస్తులు వచ్చాయని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 94 పరిశ్రమలకు అనుమతులు మంజూరు అయ్యాయని చెప్పారు. ఇంకా 22 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. ఉత్పాదన, సేవా రంగాల్లోని 25 యూనిట్లకు మొత్తం 96.08 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలను మంజూరు చేశామన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ (ఒక జిల్లా ఒక ఉత్పత్తి)లో భాగంగా జిల్లాలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చేపడుతున్న సర్వేను పూర్తి చేయాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం ఎస్.మహబూబ్బాషా, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఎల్డీఎం రవీందర్ కుమార్, పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు ఈఈ కిశోర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కా మర్స్ అధ్యక్షుడు రాజమహేంద్రనాథ్ పాల్గొన్నారు. డీఆర్ఓ రామునాయక్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
నందికొట్కూరు: మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువకు నీటిని గురువారం సీఎం చంద్రబాబు నాయుడు విడు దల చేయనున్నారని, జలహారతి ఇవ్వనున్నా రని, అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా తెలిపారు. అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ స్థలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. నీటి పంపింగ్ స్టేషన్, జలహారతి ఇచ్చే ప్రదేశం, సభాస్థలితో పాటు ఇతర ప్రాంతాలను వారు పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
హంద్రీ–నీవా.. అక్రమాలు కనవా!
కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ● హంద్రీ–నీవా సుజల స్రవంతి రాయలసీమ ప్రాంతంలో పొడవైన కాలువ. ● దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ● కాలువ మొదటి దశ మల్యాల వద్ద మొదలై రాయలసీమ జిల్లాల్లో పారుతుంది. ● ఈ కాలువ మొత్తం 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ● రాయలసీమ జిల్లాలకు చెందిన 33 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది. ● ఈ కాలువ కింద కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ● జిల్లాలో 0.161 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణగిరి, 1.126 టీఎంసీల సామర్థ్యంతో పందికోన రిజర్వాయర్లు ఉన్నాయి. ● హంద్రీ–నీవా ప్రధాన కాలువలో అసంపూర్తిగా లైనింగ్ పనులు ● నాసిరకంగా మరమ్మతులు ● కాలువలో తొలగని మట్టి గుట్టలు ● నేడు నీరు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబుకర్నూలు సిటీ/నందికొట్కూరు/పాములపాడు: రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించే హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వ అధ్వానంగా మారింది. కాల్వలో ఎక్కడి గుట్టలు అక్కడే ఉండిపోయాయి. లైనింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. కాంట్రాక్టర్లు కనీసం పిచ్చి మొక్కలను సైతం తొలగించలేకపోయారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి నేడు(గురువారం) హంద్రీ–నీవా ప్రధాన కాలువకు సీఎం చంద్రబాబు నీరు వదలనున్నారు. కాలువకు నీరు వదిలితే నాసిరకంగా నిర్మించిన లైనింగ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్లు అయిన టీడీపీ నాయకులు నాణ్యత లేకుండా హంద్రీ–నీవా ప్రధాన కాలువకు మరమ్మతులు చేశారు. పనులు నాసిరకంగా చేసి జేబులు నింపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ప్రధాన కాలువపై నిర్మించిన 6వ బ్రిడ్జి వద్ద మట్టి, రాళ్ల గుట్టను కాంట్రాక్టర్లు అలాగే వదిలేశారు. అలాగే ఆ బ్రిడ్జి వద్ద హంద్రీనీవా కాలువ లైనింగ్ నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టారు. నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇవి గుర్తుగా మిగిలాయి. హంద్రీ–నీవా కాలువ అధ్వానంగా ఉండగా సీఎం చంద్రబాబు వదిలిన నీరు ఆయకట్టుకు చేరుతుందా.. ప్రజల గొంతు తడుపుతుందా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘చంద్ర’ గ్రహణం హంద్రీ–నీవా కాలువ నిర్మాణానికి 1996 మార్చి 11న ఉరవకొండలో, 1999 జూలై 9న ఆత్మకూరులో ఎన్.చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినా హంద్రీ– నీవాను పట్టించుకోలేదు. అయితే ‘తానే హంద్రీ–నీవాను తెచ్చానని, అదే తన ఆలోచన’ అని తప్పు ప్రచారం చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ వెనుకటి జలాలను 40 టీఎంసీలను ఈ కాలువ ద్వారా తరలించాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో 2017–18లోనే విస్తరణ పనులు కొంత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ● హంద్రీ– నీవా కాంట్రాక్ట్ల నుంచి డిస్ట్రిబ్యూటరీ పనులను తొలగిస్తూ 2015 ఫిబ్రవరి 23న చంద్రబాబు జీఓ నంబరు 22 ను జారీ చేశారు. దీంతో జిల్లాతో పాటు, సీమలోని మిగిలిన జిల్లాల్లోనూ డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టు కాకుండా కేవలం చెరువులను నింపేందుకు మాత్రమే హంద్రీ–నీవాను వినియోగించుకుంటున్నారు. ● టీడీపీ పాలనా కాలంలో 2017–18లో ప్రధాన కాలువను 3,850 క్యూసెక్కులకు విస్తరించేందుకు చేపట్టిన మట్టి పనుల్లో భారీగా అవినీతి జరిగింది. లైనింగ్ చేసి చోట సైతం నాణ్యత పాటించకపోవడంతో కంకర తేలింది. అప్పట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రెండు ప్యాకేజీల్లో రూ.385.59 కోట్లతో విస్తరణ పనులు చేశారు. ఆలస్యంగా పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రీ– నీవా కాలువ విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగాయి. జూన్ 10 నాటికే విస్తరణ పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేయలేకపోయారు. ఈ నెల మొదటి వారంలో విస్తరణ పనులపై జరిగిన సమీక్షలో 12వ తేదీకి ఓ కాంట్రాక్టర్, 14వ తేదీకి మరో కాంట్రాక్టర్ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. మొదటి ప్యాకేజీలో కల్లూరు మండలం వామసముద్రం దగ్గర, సఫా ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఇంకా పూర్తి కాలేదు. సెకండ్ ప్యాకేజీలోను పనులు పూర్తి కాలేదు. అయితే నీటి విడుదలపై ఒత్తిళ్లు ఉండడంతో పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. కాల్వ విస్తరణ పనులు ఒక్కో చోట ఒక్కో కొలతతో చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం తగ్గడంతో చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ఆశించిన స్థాయిలో చేరడం లేదు. శ్రీశైలం డ్యాం వెనుక జలాలను తక్కువ రోజుల్లోనే ఎక్కువ తరలించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంచనాలు వేసింది. కాల్వ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు విస్తరించే పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మొదటి ఫేజ్ పరిధిలో రెండు ప్యాకేజీలుగా రూ.687 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలిచింది. ఎన్నికల కోడ్ రావడంతో గతేడాది పనులు మొదలు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలస్యంగా పనులు మొదలు పెట్టారు. -
త్వరలో రెండో విడత నాబార్డు పనులు
నాబార్డు ద్వారా 2వ విడత కూడా పనులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున ప్రస్తుతం రూ.3 కోట్ల పైచిలుకు విలువ చేసే పనులకు ఆమోదం లభించింది. ఈ పనులకు టెండర్లు పిలవడం పూర్తయింది. పనులు కూడా పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ వారోత్సవాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో కర్నూలు జిల్లాలో దాదాపు రూ.26 కోట్ల మేర విడుదలయ్యాయి. మిగిలిన బిల్లులను కూడా నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది. – వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ ● -
తెలుగుగంగకు నీరు విడుదల
రుద్రవరం: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి తెలుగుగంగ ప్రధాన కాల్వలకు అధికారులు 3,000 క్యూసెక్యుల సాగునీరు విడుదల చేశారు. ఆ నీరు బుధవారం నాటికి రుద్రవరం మండలానికి చేరుకుంది. ఆ నీరు ప్రధానకాల్వలో పాటు రుద్రవరానికి సమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న తుండ్లవాగు( గండ్లేరు) రిజర్వాయర్లోకి చేరుతోంది. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు వర్షం కురవక వాడు ముఖం పట్టాయి. అలాంటి పంటలకు తెలుగుగంగ నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు వందశాతం సబ్సిడీ కోవెలకుంట్ల: ఉద్యాన పంటలకు సాగుకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తోందని డ్వామా పీడీ సూర్యనారాయణ తెలిపారు. కోవెలకుంట్ల మార్కెట్యార్డులో బుధవారం ‘ఉపాధి’ ఏపీఓలు, టెక్నికల్, ఫీల్ట్ అసిస్టెంట్లు ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. మామిడి, సపోట, చీని, జామ, నిమ్మ, కొబ్బరి తదితర రకాల పండ్ల తోటల సాగుకు మొక్కల సరఫరా చేస్తామన్నారు. మొక్కల సంరక్షణకు మూడేళ్లపాటు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆర్అండ్బీ కర్నూలు ఈఈగా సునీల్రెడ్డి కర్నూలు(అర్బన్): రోడ్లు భవనాల శాఖ కర్నూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా సీవీ సునీల్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన బి.సురేష్బాబును ప్రభుత్వం ఎస్ఈగా పదోన్నతి కల్పించి చిత్తూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సునీల్రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేశారు. ఈఈగా బాధ్యతలు చేపట్టిన సునీల్రెడ్డికి ఈఈ సిద్దారెడ్డి, కార్యాలయ డీఏఓ ఓ పురుషోత్తంరెడ్డి, హెచ్డీ చంద్రశేఖర్బాబు, డివిజన్ పరిధిలోని డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది పూలబోకేలు అందించి అభినందనలు తెలిపారు. 28న షూటింగ్బాల్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): నగరంలోని గుడ్ షప్పర్డ్ స్కూల్ మైదానంలో ఈనెల 28న జిల్లా స్థాయి జూనియర్స్ షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో విజేత జట్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు వచ్చే నెల మొదటి వారంలో నె ల్లూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ షూటింగ్బాల్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
● నారుమడికి రక్షణ ‘వల’యం
కేసీ కెనాల్కు సాగు నీరు విడుదల కావడంతో మండలంలోని రైతులు వరినాట్లు వేసుకొనే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాటుకు ముందుగా రైతులు నారుమళ్లను పొలంలో సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. నారుమడిని 25 రోజులపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే వరి పంటకు నాటు వేసేందుకు అవకాశం ఉటుంది. మండల పరిధిలోని నిడ్జూరు, జి.సింగవరం, ఆర్. కొంతలపాడు, సుంకేసుల, పడిదెంపాడు, ఆర్.కె.దుద్యాల, ఎదురూరు, తులశాపురం గ్రామాల్లో రైతులు అధికంగా వరి పంటను సాగు చేస్తారు. ఈ క్రమంలో జి.సింగవరంలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి వరి నారుమడిని పక్షులు, జంతువులు నాశనం చేయకుండా చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. నారుమడి చుట్టూ కర్రలు పాతి 5 అడుగుల ఎత్తులో వల ఎర్పాటు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. – కర్నూలు(రూరల్) -
పాముకాటుతో మహిళ మృతి
రుద్రవరం: మండలంలోని ఎర్రగుడిదిన్నెకు చెందిన నాగలక్ష్మమ్మ (54) పాము కాటుకు గురై మృతి చెందింది. ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో రైతు పెద్ద నరసింహులు కుటుంబం పాడి గేదెలను మేపుతూ జీవనం సాగిస్తోంది. భార్య నాగలక్ష్మమ్మ రోజూ గేదెలను మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో పొలం గట్లపై గడ్డి కోసి తీసుకొచ్చేది. బుధవారం ఉదయాన్నే వెళ్లి గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. అక్కడున్న పాడి రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగింపు కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.జయమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ నంబర్ 77 విడుదల చేసిందన్నారు. అయితే డబ్ల్యూజేహెచ్ఎస్ను సద్వినియోగం చేసుకోవడానికి రూ.1,250 ప్రీమియం చెల్లించాలని సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, దరఖాస్తు, రెన్యూవల్ చేయించుకున్న అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీలను కలెక్టరేట్లో ఉన్న సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. -
కోర్టు కానిస్టేబుళ్ల పైసా వసూల్ !
● పెట్టి కేసుల్లో చేతివాటం ● వందల్లో ఫైను ఉంటే వేలల్లో వసూలు చేస్తున్న వైనం ● న్యాయవాదులతో ఒప్పందం కుదుర్చుకుని బేరసారాలు ● సొంత పొలాల్లో, ఇంటి ఆవరణలో మద్యం సేవిస్తున్నా వదలని పోలీస్ బృందాలు ● అధికారులకు కూడా వాటా ఉందంటూ గుసగుసలు ఆళ్లగడ్డ: కోర్టు కానిస్టేబుళ్లు కొందరు వసూల్ రాజాలుగా మారిపోయారు. నిత్యం వేల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నారు. తెలిసో తెలియక చిన్నపాటి పొరపాటుతో దొరికిన నిందితులే టార్గెట్గా ఇష్టారీతిన డబ్బు గుంజుతున్నారు. పెట్టి కేసులకు సెక్షన్ల ప్రకారం న్యాయమూర్తులు విధించే ఫైన్ల కంటే కొందరు కానిస్టేబుళ్ల ‘పైసా వసూలే’ ఎక్కువవుతోంది. ఈ వ్యవహారం అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ తెలిసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే పెట్టి కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు పెట్టి కోర్టుకు హాజరు పరుస్తారు. నిందితులందరినీ కోర్టు కానిస్టేబుల్ ద్వారా కోర్టుకు పంపుతారు. జడ్జి వారిని నేరుగా విచారించి రూ.100 నుంచి రూ.10 వేల వరకు జరి మానా విధిస్తారు. ఆ జరిమానాను అక్కడే కోర్టులో చెల్లించి రసీదు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యవర్తుల అవతారం కోర్టు కానిస్టేబుళ్లు కొందరు కేసులను అమ్ముకునే వ్యాపారం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, హత్య, హత్యాయత్నం, ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితలను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో దూరప్రాంతాలకు చెందిన వారు నిందితులుగా ఉంటే కోర్టు కానిస్టేబుళ్ల దందా మూడు పూవ్వులు.. ఆరు కాయలే. ఇతర ప్రాంతాలకు చెందిన నిందితులకు ఇక్కడి న్యాయవాదుల గురించి అవగాహన ఉండదు. దీంతో కోర్టు కానిస్టేబుళ్లే మధ్యవర్తులుగా మారిపోతున్నారు. ఇందుకోసం ఇటు నిందితుల నుంచి అటు లాయర్ల నుంచి డబుల్ బొనంజా పొందుతున్నారు. రోజుకు 10 కేసులు.. ఒక్కొక్కరి నుంచి రూ.1,600 ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రతి రోజు 10 పెట్టి కేసులు తేవాల్సిందే అని సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఇందుకోసం రెండు టీంలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు సాయంత్రం గ్రామాల్లో తిరుగుతూ ఉండాలి. ఎవరూ దొరక్కపోతే పొలాల్లో కూర్చుని మద్యం తాగుతున్న వారినైనా పట్టుకుని పెట్టి కేసు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సంబంధిత కోర్టు కానిస్టేబుల్ కోర్టుకు వచ్చే సమయంలో ఒక్కొక్కరు రూ.1600 తెచ్చుకోవాలని నిందితులకు చెబుతాడు. వారు ఆ మొత్తాన్ని కానిస్టేబుళ్కు ఇవ్వడం జరుగుతోంది. అతను వారిని కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.500 జరిమానా పడుతుంది. మిగతాది ఒక్కొక్కరికి రూ.1,100 చొప్పున 10 మందికి రూ.11 వేలు ఆ కానిస్టేబుళ్ జేబులో వేసుకుంటున్నారని సహచర కానిస్టేబుళ్లే ఆరోపించడం గమనార్హం. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 3.30 లక్షలు అవుతుందని, అంటే ఎడాదికి ఎంత అవుతుందో అని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రసీదు రూ.600 వసూలు రూ.10 వేలు శిరివెళ్ల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ సిబ్బంది కొంత కాలం క్రితం వాహనాల చెకింగ్ చేస్తుండగా రుద్రవరానికి చెందిన ఓ డ్రైవర్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. మరుసటి రోజు అతనితో పాటు సుమారు 20 మందిని కలిపి కోర్టులో హాజరు పరచగా జడ్జి జరిమానా విధించారు. జరిమానా చెల్లించేందుకు వెళ్లిన నిందితులతో సంతకం మాత్రం తీసుకున్నారు. సంతకం చేసే సమయంలో చూస్తే అందులో రూ.600 మాత్రమే రాసి ఉందని, తమతో మాత్రం ఒక్కొక్కరితో రూ.10 వేలు తీసుకున్నారని నిందితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే కేసులో కాస్త పలుకుబడి ఉన్న కొందరిని కోర్టుకు హాజరుకాకపోయినా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేస్ క్లోజ్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెట్టి కేసుల్లో కోర్టు కానిస్టేబుళ్లు గూగుల్ పే, ఫోన్ పే కాకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటుండటం గమనార్హం. -
గ్రామీణ వైద్యుల గుర్తింపునకు కృషి
కర్నూలు (హాస్పిటల్): గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్ చెప్పారు. స్థానిక కృష్ణా నగర్లోని బిర్లాగేట్ వద్ద ఉన్న లక్ష్మీ కళ్యాణ మండపంలో బుధవారం ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి టీజీ భరత్, టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆర్ఎంపీల సేవలు ఉపయోగించుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ.. వైద్యుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సమస్యలపై మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి ఎంఎన్ రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పర్ల దస్తగిరి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొకై న్ స్వాధీనం
కృష్ణగిరి: మండల పరిధిలోని హైవే – 44పై అమకతాడు టోల్ప్లాజా వద్ద మంగళవారం రాత్రి పోలీసుల తనిఖీలో మాదకద్రవ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై బుధవారం పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, వెల్దుర్తి సీఐ మధుసూదన్రావ్ స్థానిక సీఐ కార్యాలయంలో నిందితుడి అరెస్ట్ చూపా రు. డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ.. కృష్ణగిరి ఎస్ఐ జి.కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీ చేయగా ప్రయా ణికుడు బెల్లం అఖిల్ చౌదరి వద్ద రూ.80 వేలు విలువైన 10 గ్రాముల కొకై న్ లభించిందన్నారు. ఒంగోలు కు చెందిన అఖిల్చౌదరి హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ అలవాటు ఉండటంతో బెంగుళూరులోని తన స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నట్లు చెప్పాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అభిషేకం చేయిస్తానని మోసం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేయిస్తానని భక్తుల నుంచి డబ్బులు వసూ లు చేసి మోసగించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బుధవారం శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన 3 కుటుంబాల వారు ఈ నెల 14న శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. పవన్ అనే వ్యక్తి వారికి గర్భాలయ అభిషేకం చేయిస్తానని చెప్పి రూ.15 వేలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దేవస్థానం సీఎస్ఓ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేయగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకుని చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు పరిహారం కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం మంజూరైంది. కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో తెలుగు ఆశోక్ ఏప్రిల్ 27న పిడుగుపాటుకు మరణించాడు. అదే నెల 30న ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన కోతిరాళ్ల రవి అలియాస్ బోయరవి పిడుగుపాటుతో మరణించాడు. మరణించిన వీరి కుటుంబాలకు రూ.4 లక్షల ప్రకారం ఎక్స్గ్రేషియా మంజూరైంది. కాగా 2024 ఆగస్టు నెలలో కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న 47 ఇళ్లకు రూ.1.88 లక్షలు డ్యామేజీ కింద మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
క్షణ క్షణం.. భయం భయం
ఉన్నతాధికారులకు నివేదిక పంపాం బ్రిడ్జి గోడలు సగానికి పైగా కూలిపోయిన మాట వాస్తవమే. మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక పంపాం. అక్కడి నుంచి అనుమతులు రాగానే మరమ్మ తు పనులు చేపడతాం. అంతవరకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భారీ వాహనాలు తిరగకుండా చర్యలు చేపడతాం. – అల్లాబకాష్, ఎంపీడీఓ చిప్పగిరి: మండలంలోని ఆరు గ్రామాలతో పాటు హాలహర్వి మండలంలోని నాలుగు గ్రామాలకు ఏకై క మార్గమైన ఆ ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి సంగం కూలి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. మండల కేంద్రం చిప్పగిరి నుంచి ఏరూరు,డేగులహాలు,బంటణాహాలు,గుమ్మనూరు,కాజీపురం,కొట్టాల,గ్రామాలతో పాటు హాలహర్వి మండలంలోని చింతకుంట,సిరిగాపురం,కొక్కర చేడు,మల్లికార్జున పల్లి గ్రామాలకు వెళ్లాలంటే చిప్పగిరి సమీపంలో ఉన్న ఏబీసీ కెనాల్ దాటడానికి వంతెన నిర్మించారు. అయితే ఇది శిథిలావస్థకు చేరింది. కింద భాగంలో సగానికి పైగా గోడలు కూలిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే వారితో ఈ దారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూలుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే కూలిపోయే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. -
కేంద్ర పథకాలపై ప్రత్యేక బృందం తనిఖీ
ఎమ్మిగనూరురూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బుధవారం మండల పరిధిలోని కె.తిమ్మాపురం గ్రామంలో సెంట్రల్ టీమ్ సభ్యులు పర్యటించి, తనిఖీలు ినిర్వహించారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు, చెక్ డ్యామ్ల పనితీరును పరిశీలించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు సంతోష్ పరీద్, సూర్యకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం అమలు, పెన్షన్లు, గృహ నిర్మాణాలతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తోందని, అవన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయా, వాటి వల్ల ఉపయోగం పొందారా? అనే అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. పథకాల అమల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏపీడీ అల్లీపీరా, హౌసింగ్ డీఈ ప్రసాద్, సీఎల్ఆర్సీ కోర్సు డైరెక్టర్ ప్రదీప్కుమార్, ఈఓఆర్డీ విజయలక్ష్మి, ఏపీఓ విజయమోహన్, ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ, టీఏలు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించాలి
బనగానపల్లె: ఖరీఫ్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను కత్తెర (గొంగలి) పురుగు ఆశించిందని, దీని వల్ల పంటకు నష్టం వాటిళ్లుతుందని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కత్తెర పురుగు నివారణ చర్యలను వివరించారు. కత్తెర పురుగు మొదటి దశలో ఆకులపై పత్ర హరితాన్ని గీకి తింటూ రంద్రాలను చేస్తుంది. పురుగు పెరిగే కొద్ది ఆకుల చివర నుంచి తింటూ కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తుంది. దీన్నుంచి పంటను కాపాడుకునేందుకు పంట చుట్టూ నాలుగు వరసలు నేపియర్ గడ్డిని ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాన్ని గుర్తించి ఏరి నాశనం చేయాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకో గ్రామ బదనికలను ఎకరానికి 20 వేలు చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి ఒక లీటరు వేప నునెను 5 శాతం వేపగింజల కాశాయాన్ని పిచికారీ చేయాలని చెప్పారు. తొలి దశ గొంగలి పురుగులను నివారించేందుకు ఎకరానికి 500 మి.లీ. క్లోరోఫైరోఫాస్ లేదా 400 మి.లీ. క్వినల్పాస్ మందును పిచికారీ చేయాలని, ఎదిగిన గొంగలి పురుగు నివారణకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, రెండులీటర్ల నీరు కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమానికి 100 గ్రాములు థయోడికార్బ్ మందును జోడించి సాయంత్రం వేళ చుడుల్లో వేయాలన్నారు. ఈ పద్ధతి వల్ల పంటకు జరిగే నష్టాన్ని నివారించవచ్చని వివరించారు. -
9 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): సీపీఐ 24వ జిల్లా మహాసభలను ఆగస్టు 9, 10, 11 తేదీల్లో కర్నూలులో నిర్వహించనున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె.జగన్నాథం, ట్రెజరర్ ఎస్.మునెప్ప తెలిపారు. స్థానిక సీఆర్ భవన్లో బుధవారం ఉదయం 11 గంటలకు మహాసభల కరపత్రాలను సీపీఐ నాయకులు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక కుట్రలను ఎదుర్కొని పోరాటాలు చేసిందన్నారు. భూపోరాటాలు చేసి పేదలకు గూడు కోసం ఉద్యమించిన ఘన చరిత్ర పార్టీకి ఉందన్నారు. కర్నూలులో జిల్లాలోనూ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. జిల్లా మహాసభల్లో భాగంగా మొదటి రోజు వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. మహాసభల విజయవంతానికి పార్టీ శ్రేయోభిలాషులు, పెద్దలు, దాతలు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నగర సహాయ కార్యదర్శులు మహేష్, శ్రీనివాసరావు, జి.చంద్రశేఖర్, నాయకులు బీసన్న, నల్లన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీలో తగ్గిన నీటి నిల్వ
గోనెగండ్ల: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురువక పోవడంతో గాజులదిన్నె ప్రాజెక్టులో నీరు అడుగంటి పోతుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా బుధవారం నాటికీ జీడీపీలో 1.65 టీఎంసీల నీటి నిల్వ (గ్రాస్) మాత్రమే ఉంది. డోన్, పత్తికొండ, క్రిష్ణగిరి మండలాల తాగునీటి పథకాలకు నీరు సరఫరా అవుతుంది. దీంతో జీడీపీలో రోజురోజుకు నీరు అడుగంటిపోతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో అశించినంత వర్షాలు కురువకపోవడంతో జీడీపీలోకి వరద నీరు చేరలేదు. గతంలో జూన్ చివరి నాటికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరేది. ఈ ఏడాది వర్షాలు కురువకపోవడంతో జూలైలో సగం రోజులు గడిచినప్పటికీ ప్రాజెక్టులోకి వరద నీరు చేరలేదు. దీంతో ప్రాజెక్టులో నీరు లేక వెలవెలబోతుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితేనే ఆయకట్టు భూములు పంటల సాగుతో కళకళలాడుతాయి. సాగుచేసిన పంటలు కళకళలాడాలంటే వర్షం కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపర్చుకోవాలి బండి ఆత్మకూరు: ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి సూచించారు. మండలంలోని పార్నపల్లి ప్రభాత్ కాలేజీలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల హెడ్ మాస్టర్లకు జరుగుతున్న జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లీడర్గా ఎదగాలి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో ఎలా మెలగాలన్న విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సంతజూటూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నంద్యాల జిల్లా ఆల్టర్నేట్ కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి, మండల విద్యాశాఖాధికారి యశోధ, సమగ్ర శిక్ష అభియాన్ డీటీపీ గాయత్రి, ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు, పీఆర్టీలు మస్తానయ్య, భానుబీ పాల్గొన్నారు. -
అట్టెకల్లు కొండల్లో చిరుత
ఆస్పరి: అట్టెకల్లు కొండల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళ న చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీను అనే రైతు ఇంటి దగ్గర కట్టేసి న గొర్రె పిల్లపై చిరుత దాడి చేసి గాయపరిచింది. గాయపడిన గొర్రె పిల్ల కొద్ది సేపటికి మృతి చెందింది. చిరుత సంచారంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు చిరుతను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థి ఆత్మహత్య ఆళ్లగడ్డ: కళాశాలకు వెళ్లి చదవడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లగట్ల గ్రామానికి చెందిన వీరయ్య కుమారుడు యశ్వంత్ (17) పట్టణంలోని ఓ ప్రైవేటు కళా శాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదవడం ఇష్టం లేదని కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. చదివితే భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులు నచ్చజెప్పినా కళాశాలకు వెళ్లలేదు. కనీసం ఇంటర్ అయినా పూర్తి చేయాలని సోమవారం రాత్రి మందలించారు. ఈ క్రమంలో యశ్వంత్ మనస్తాపంతో పురుగు మందు తాగి మృతి చెందాడు. మృతుని తండ్రి వీరయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్లుప్తంగా -
● మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని దారుణం
ఇష్టం లేని పెళ్లి నిశ్చయించారని బలవన్మరణం పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో మానస (20) అనే యువతి ఇష్టం లేకుండా వివాహం నిశ్చయించారని మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సురేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వరలక్ష్మి కూతురు మానస ఇంటర్మీడియెట్ వరకు చదువుకుంది. తండ్రి మల్లయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నారు. పెద్ద కూతురు మానసకు ఇటీవల వివాహం నిశ్చయించారు. నెల రోజుల్లో వివాహం చేసేందుకు తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని మానస మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తాతను చంపిన మనుమడు బనగానపల్లె: పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం మధ్యహ్నం దారుణం చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. పట్టణానికి చెందిన షేక్ కోట్ల ఉశేన్ సా (75) పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోవడంతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమై ఉన్నాడు. ఈ స్థితిలో మంగళవారం అతని మనుమడు షేక్ ఉశేన్ బాషా మద్యం మత్తులో తాతను డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లేడ్తో తల, గొంతు ఇతర శరీర భాగాలపై కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి కుమార్తె షేకున్ బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లకు చెందిన పసుపుల వెంకటేశ్వర్లు (55) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్కానిస్టేబుల్ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశ్వర్లు లోడింగ్ కార్మికుడిగా పని చేస్తుండేవాడు. తరచూ మద్యం సేవిస్తూ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది పేడ రంగు నీటిలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
అవినీతి రయ్.. రయ్..!
● అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాలపై నిఘా పెట్టి వసూళ్లు ● ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్న అధికారులు ● అడిగినంత ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరింపు ● నమ్మకస్తులైన లారీ ఓనర్లతో వసూళ్లకు ప్రత్యేక వ్యవస్థ కర్నూలు: వాహన సామర్థ్య పరీక్షల (ఎఫ్సీ) సర్టిఫికెట్ల జారీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆయా సేవల నుంచి వచ్చే మామూళ్లు నిలిచిపోయాయి. దీంతో రవాణా శాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ పేరుతో నిత్యం రోడ్లపై తిష్ట వేసి నయా దందాకు తెర లేపారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కర్నూలు మీదుగా వాహనాలు వెళ్తుంటాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ మార్గంలో గంటకు వెయ్యికి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సరుకు రవాణా చేసే వాహనాలకు సంబంధించి వే బిల్లులు, అంతర్రాష్ట్ర పర్మిట్లు, ఇతర అనుమతుల పేరుతో అధికారులు ప్రతిరోజూ తనిఖీలు చేస్తుంటారు. అక్రమ రవాణా, ఓవర్ లోడ్తో వెళ్తుంటే సదరు వాహనాలకు జరిమానా విధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జరిమానాలు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరగాలి. భౌతికంగా ఒక్క రూపాయి వసూలు చేసేందుకు వీలు లేదు. అయితే వాహనంలో ఉన్న సరుకు, సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లారీ నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల ద్వారా వసూలవుతున్నట్లు ఆ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు చర్చించుకుంటున్నారు. 5వ తేదీలోపే మామూళ్లు ఎర్రమట్టి, ఇసుక, కంకర, గ్రానైట్ తరలించే లారీలు, టిప్పర్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం చైన్నె – సూరత్ హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులకు ఇసుక, ఎర్రమట్టిని టిప్పర్లలో సామర్థ్యానికి మించి తరలిస్తుండటంతో వారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. క్రిష్ణగిరి, తాడిపత్రి, బేతంచెర్ల, డోన్ ప్రాంతాల నుంచి కర్నూలు మీదుగా ఇతర ప్రాంతాలకు గ్రానైట్, చిప్స్, బండలు, సిమెంటు, మైనింగ్ మెటీరియల్, పౌడర్ వంటివి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. వాటిపై కూడా నిఘా వేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో 400కు పైగా వాహనాల నుంచి నెలకు ఒక్కో వాహనానికి రూ.8 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా 5వ తేదీలోపు ఆయా ప్రాంతాల్లోని నమ్మకస్తులైన లారీ యజమానులు మామూళ్లు వసూలు చేసి అధికారులకు ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలులోని ఓ ట్రాన్స్పోర్టు నిర్వాహకుడిని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకుని మామూళ్లు దండుకుంటున్నట్లు సమాచారం. గొర్రెలు, బర్రెలు తరలించే లారీలు కూడా మామూళ్లు ఇవ్వాల్సిందే. ఔటర్ రింగ్రోడ్డు, వెంగన్న బావి, నన్నూరు టోల్ ప్లాజా ప్రాంతాల్లో తిష్ట వేసి మామూళ్లు వసూలు చేస్తున్నారు. అలాగే కోడుమూరు రోడ్డులో తిష్ట వేసి ఈర్లదిన్నె ప్రాంతం నుంచి వచ్చే ఇసుక లారీల నుంచి, నాగలూటి నుంచి కర్నూలుకు నాపరాయి రవాణా చేసే ట్రాక్టర్ల నుంచి మామూళ్లు దండుకుంటున్నారు. ఇలా నెలకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వసూలు చేసి, కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు వాటాలు వేసి పంచుకుంటున్నట్లు ఆ శాఖలోని కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చేతికి అంటకుండా.. హైదరాబాదు – బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అధిక సామర్థ్యంతో వెళ్తుంటాయి. ఎన్ఫోర్స్మెంట్ పేరుతో రోడ్లపై తిష్ట వేసి అక్రమ, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధించి తర్వాత బేరం కుదుర్చుకోవడం లేదా కేసుల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి కర్నూలు మీదుగా మరో ప్రాంతానికి బొగ్గుల లారీ ఓవర్ లోడ్తో వెళ్తోంది. టోల్గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి కేసు రాస్తే రూ.50 వేలు అవుతుంది. అందులో సగం ఇస్తే వదిలేస్తామంటూ బేరం కుదుర్చుకుని వదిలేశారు. తెలంగాణ వైపు నుంచి 62.5 టన్నుల గ్రానైట్ లోడుతో వస్తున్న ఓ లారీని రవాణా శాఖ అధికారులు కర్నూలు శివారులో ఆపారు. 35 టన్నులతో వెళ్లాల్సిన లారీలో 27.50 టన్నులు అదనంగా ఉన్నందున రూ.73 వేలు జరిమానా విధించాలి. అయితే రూ.15 వేలు తీసుకుని లారీని వదిలేశారు. తమ చేతికి మట్టి అంటకుండా నమ్మకస్తులైన ఆర్టీఏ ఏజెంట్లు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇచ్చి ఫోన్పే ద్వారా మామూళ్లు ముట్టిన తర్వాతనే వాహనదారులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాహన రికార్డులు సక్రమంగా లేవనో, లోడ్ ఎక్కువగా ఉందనో, పర్మిట్ లేదనో? ఇలా ఏదో ఒక సాకు చూపి అడిగినంత ఇచ్చిన తర్వాత కానీ వాహనం ముందుకు కదలనివ్వరు. అక్రమ వసూళ్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రోజుకు కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గండి పడుతున్నట్లు సమాచారం. రవాణా శాఖ అధికారుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ టోల్ఫ్రీ నంబర్కు జిల్లా నుంచి తరచూ ఫిర్యాదులు వెళ్తున్నట్లు సమాచారం. రవాణా శాఖకు అన్నిటికంటే ఎన్ఫోర్స్మెంట్ కీలకం. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగే వాహనాలను తనిఖీ చేసే అధికారం వీరికి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
ఆదోని టౌన్: మండలంలోని పెద్దతుంబళం గ్రామం నుంచి దాదాపు 50 కుటుంబాల వారు మంగళవారం స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. నాయకులు హుసేన్పీరా, షేక్అహ్మద్ రఫిక్ ఆధ్వర్యంలో జాకీర్, జహీర్, అబ్దుల్అజ్పూర్, షేక్షావలి, ఫిరోజ్, ఖాజా, జాఫర్, అన్వర్, బుడ్డా కాశీం, మహమ్మద్బాషా, ఖాదర్, ఫిరోజ్తో పాటు మరికొంతమంది పార్టీలో చేరగా వారికి ఆదోని వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి పార్టీ కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీతో సంబంధం లేని యువత ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్సీపీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలను చూసి ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పుడు హామీలను ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, పట్టణాధ్యక్షుడు బి.దేవా, మండల యూత్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కేశవరాయుడు, రహమాన్, ఫయాజ్, చిన్న ఈరన్న, బీమా, సాంబ, వీరంజి తదితరులు పాల్గొన్నారు. -
రైతులు రోడ్డేశారు!
నాడునేడు‘సార్.. రోడ్డుకు మరమ్మతులు చేయండి’ అంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకెన్నాళ్లు ఈ దార్రిద్యం అంటూ మదనపడ్డారు. చివరకు చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకున్నారు. పేరూరు పంచాయతీకి మజరా గ్రామమైన బి.నాగిరెడ్డిపల్లెకు వెళ్లాలంటే గుంతల దారిలో వెళ్లాల్సిందే. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి వాహనాలు ముందుకు వెళ్లని పరిస్థితి దాపురిస్తుంది. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో గ్రామంలోని రైతులందరూ ఒక్కటయ్యారు. తోచినంతగా చందాలు వేసుకున్నారు. పోగైన సొమ్ముతో మట్టి తోలించి రోడ్డుపై గుంతలను పూడ్చి చదును చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించారు. – రుద్రవరం -
● ఆమె భర్తకు తీవ్రగాయాలు ● బైక్పై వెళ్తుండగా మినీలారీ ఢీకొట్టడంతో ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పాణ్యంకు చెందిన శ్రీనివాసులు, భార్య భారతి (48) దంపతులు. శ్రీనివాసులుకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో మంగళవారం డయాలసిస్ చేయించేందుకు ఏపీ 39 క్యూడీ 9469 నంబర్ గల స్కూటీలో కర్నూలు బయలుదేరారు. తమ్మరాజుపల్లె ఘాట్ వద్ద పెద్దమ్మ గుడి సమీపంలో కర్నూలు వైపు వెళ్తున్న ఆర్జే 17 జీఏ 9255 నంబరు గల మినీలారీ స్కూటర్ను ఢీకొట్టింది. దంపతులు కిందపడగా భారతి పైనుంచి మినీలారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో నంద్యాలకు తరలించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో నివాసముంటున్న వీరు ఇటీవలే పాణ్యం వచ్చి స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. -
నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల
● రూ.5.40 కోట్లతో నిర్మించిన రెండు నెలలకే ఛిద్రంపది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఊరికి కొత్త రోడ్డు వేశారనే ప్రజల సంతోషం రెండు నెలలకే మాయమైంది. కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డులో నాణ్యత డొల్ల కావడంతో రోడ్డంతా గుల్లగా మారుతోంది. పాణ్యం – దుర్వేశి మెట్ట వరకు దాదాపుగా 13 కిలో మీటర్ల డీఎంఎఫ్ కింద రూ. 5.40 కోట్లతో బీటీ రోడ్డు వేశారు. మే నెలలో వేసిన ఈ బీటీ రోడ్డు పట్టుమని రెండు నెలల పూర్తి కాకముందే నాణ్యత బట్టబయలైంది. గోరుకల్లు – పాణ్యం వరకు గుంతలు పడడంతో అధికారులు ప్యాచ్లు వేసి అక్రమాలను కప్పేశారు. మరో చోటా రోడ్డు సైడ్ దెబ్బతిని వాహనాలు అదుపు తప్పేలా మారింది. రోడ్డు సైడ్కు గ్రావెల్ వేయాల్సి ఉండగా గోరుకల్లు వద్ద లభించే సుద్దను తెచ్చి వేయడంతో ప్రజలు అడ్డుకున్నారు. ఆ తర్వాత గ్రావెల్ వేసి రోలర్తో తొక్కించారు. ఇప్పటికీ పాణ్యం సమీపంలో సైడ్కు సుద్ద ఉంది. రోడ్డు నాణ్యత పరిక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు పట్టించుకోకపోవడంతో రహదారి ఛిద్రమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. – పాణ్యం -
ఆశలు ‘వరి’ంచేనా!
కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వ భరోసా లేక, ప్రకృతి కరుణించక గతేడాది నష్టాలు మూటగట్టుకున్న వరి రైతు ఈ ఏడాది ఖరీఫ్లో మళ్లీ అదే పంట సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. బోరుబావుల కింద నారుమళ్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలే రు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా 65,276 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల, షుగర్లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో బండి ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,507 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 6,064, శిరివెళ్ల 5,694, నంద్యాల 4,671, గోస్పాడు 4,227, బనగానపల్లె 3,637, పాణ్యం 3,559, మహానంది 3,478, వెలుగోడు మండలంలో 3,056 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో వరిసాగు విస్తీర్ణం మరింత పెరిగే ఆస్కారముంది. ఇప్పటికే కుందూ నది, వాగులు, బోర్ల కింద నారు మడులు సిద్ధంగా కాగా ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది కలిసిరాని వరిసాగు.. జిల్లాలోని గతేడాది 1.65 లక్షల ఎకరాల్లో కర్నూలు సోనా, నంద్యాల సోనా, 555 రకానికి చెందిన వరి సాగు చేశారు. ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. కౌలు రైతులు ఎకరాకు ఖరీఫ్లో 10 బస్తాలు, రబీలో మూడు బస్తాల వడ్లు చెల్లించేలా వరిమడులను కౌలుకు తీసుకున్నారు. పైరు వివిధ దశల్లో అధిక వర్షాలు కురియడంతో వరిని దోమపోటు, అగ్గి తెగులు ఆశించడంతో తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పడరానిపాట్లు పడ్డారు. అక్టోబర్ నెలలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. మార్కెట్లో గిట్టుబాటు ధర అంతంత మాత్రంగానే పలికింది. బస్తా రూ. 1,490తోనే విక్రయించి భారీగా నష్టపోయారు. కర్నూలు, నంద్యాల సోనాపై ఆసక్తి.. జిల్లాలో ఈ ఏడాది రైతులు కర్నూలు, నంద్యాల సోనాపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో ఈ ఏడాది వరికి గిట్టుబాటు ధర ఉండటంతో రైతులు వరిసాగుపై దృష్టి సారించారు. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో ఎస్సార్బీసీ, కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయడనుండటంతో వరిసాగుకు సాగునీరు పుష్కలంగా అందనుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సాగునీటి వనరుల ఆధారంగా ఇప్పటికే వరినారుమడులు పోసి వరినాట్లకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 65,276 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కర్నూలు, నంద్యాల సోనారకం సాగుపై ఆసక్తి గతేడాది ఖరీఫ్లో దిగుబడులు అంతంత మాత్రమే మద్దతు ధర లేక రైతులు అప్పులపాలు 25 ఎకరాలు సిద్ధం చేశా ఈ ఏడాది నాకున్న ఐదు ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరాకు 13 బస్తాలు వడ్లు చెల్లించేలా మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని కర్నూలు సోనా రకానికి చెందిన వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాను. గతేడాది వరి సాగలో నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్ వరిసాగు అన్ని విధాలా కలిసోస్తుందని భావిస్తున్నాను. – వెంకటేశ్వర్లు, రైతు, కోవెలకుంట్ల అధికారులు సూచనలు ఇవ్వాలి గత ఏడాది వరిసాగు తో అన్ని విధాలా నష్టా లు చవిచూశాం. ఈ ఏడాది నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సన్నద్ధమవుతున్నాను. నారుమడితోపాటు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు సిద్ధం చేసుకున్నాను. వ్యవసాయ అధికారులు వరిసాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు సలహాలు అందజేయాలి. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం -
శ్రీశైలండ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో తెరచి ఉంచిన ఒక రేడియల్ క్రస్ట్గేటును మంగళవారం ఉదయం మూసివేశారు. జలాశయానికి భారీగా వరద వస్తుందని ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగులకు తెరచి నాగార్జునసాగర్కు నీటి విడుదల ప్రారంభించారు. కృష్ణా బేసిన్లో వారం రోజులపాటు వరద ప్రవాహం భారీగా ఉండడడం, తర్వాత రోజురోజుకు తగ్గిపోతుండడంతో తెరచి ఉంచిన మూడు గేట్లలో రెండింటిని గత శనివారం ఉదయం రెండు గేట్లను మూసివేశారు. సోమవారం నుంచి మంగళవారం వారం వరకు ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 70,111 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,17,102 క్యూసెక్కులను వదిలారు. నాగార్జునసాగర్కు స్పిల్వే ద్వారా 27,127 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,375 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులను వదిలారు. మంగళవారం సాయంత్రానికి జలాశయంలో 200.1971 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 882.20 అడుగులకు చేరుకుంది. ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు గడువు పొడిగింపు నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో రెండో విడత ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు iti. ap. gov. in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూలై 22వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీఐలోనే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 23వ తేదీన ఉదయం 10గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఒక సంవత్సరం కోర్స్లు మెకానికల్ డీజిల్, వెల్డర్, రెండేళ్ల కోర్సులు డ్రాఫ్ట్మెన్ సివిల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, రెఫ్రిజేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ టెక్, కోర్స్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరింత సమాచారం కోసం 9866022451ను సంప్రదించాలన్నారు. చైన్నె కాలువకు నీరు విడుదల వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మంగళవారం చైన్నె కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.75 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 13,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. వెలుగోడు రిజర్వాయర్ నుం,ఇ కింది ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లతో పాటు చైన్నె వాసులకు తాగునీటి కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. రుద్రవరం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రుద్రవరం: మేజర్ పంచాయతీ రుద్రవరం గ్రేడ్–1 కార్యదర్శి సుబ్బారావుపై వేటు పడింది. మేజర్ పంచాయతీకి సంబంధించిన రూ.2.13 కోట్లకు లెక్కలు లేక పోవడంతో పంచాయతీ రాజ్శాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మంగళవారం తెలిపారు. ఆ నిధులకు సంబంధించి పంచాయతీ తీర్మానాలు, ఎంబుక్కులు, ఇతర రికార్డులు ఏవీ లేకుండా ఫేక్ ఓచర్లు చూపించడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రేపు సీఎం చంద్రబాబు రాక నందికొట్కూరు: హంద్రీనీవా కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన మల్యాలకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. మల్యాల ఎత్తిపోతల వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు మోటార్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యే జయసూర్య, జేసీ విష్ణుచరణ్, ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీపై కూటమి నేతల ఒత్తిడి.. ఈఈని పక్కకు పెట్టిన సీఈ
● విజిలెన్స్ తనిఖీ నివేదిక ఆధారంగా ఏ మేరకు ఆ ప్రాంతంలో పనులు చేయలేదో గుర్తించేందుకు హంద్రీనీవా డివిజన్–3 ఈఈ పర్యవేక్షణలో ఏజెన్సీ, ఇంజినీర్లు చేస్తున్న కొలతలపై తనకు ఏ రోజుకా రోజు నివేదిక ఇవ్వాలని ఏజెన్సీకి ఈఈ సూచించారు. ● దీనిపై ప్యాకేజీ–2 ఏజెన్సీ వీపీఆర్–డీఎస్ఆర్ (నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి సంబంధించినది) జల వనరుల శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి చేయడంతో డివిజన్–3 పరిధిలోని పనుల బాధ్యతల నుంచి ఈఈని తొలగించి, డివిజన్–4 ఈఈకి అప్పగించారు. ● ఈ విషయంలో హంద్రీనీవా–1 ఎస్ఈ అభ్యంతరం చెప్పినా కూడా సీఈ వినిపించుకోలేదని సమాచారం. ● జల వనరుల శాఖలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇదే మొదటిసారిగా ఆ శాఖ ఇంజనీర్లలో చర్చ జరుగుతోంది. -
చేప కోసం ఘర్షణ
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల డ్యామ్ దిగువన మంగళవారం కృష్ణానదిలో రెండు వర్గాల మత్స్యకారులు ఒక చేప కోసం ఘర్షణ పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లింగాలగట్టు వైజాగ్ క్యాంపులోని మత్స్యకారులు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు వర్గాలు టీడీపీకి చెందినవి. ఈ రెండు వర్గాలు చేప కోసం పడవ తెడ్లతో కొట్టుకున్నారు. డ్యామ్కు వరద ప్రవాహం తగ్గడంతో మంగళవారం గేట్లు మూసివేశారు. దీంతో మత్స్యకారులు డ్యాం ముందుభాగంలో వలలు వేశారు. ఇరువర్గాలకు చెందిన వలల మధ్యలో ఓ చేప చిక్కింది. ఆ చేప తమదంటే తమదని ఒక వర్గంలోని పోలయ్య, బుజ్జి, నూకరాజు, గొందీశ్వరరావు, మరో వర్గంలోని నామరాజు, పి.శ్రీను, సీహెచ్ రమణలు ఘర్షణ పడ్డారు. నదిలోనే పడవలపై తెడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 8 తెడ్లు విరిగిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాయపడిన వారికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా ఇరు వర్గాలు టూటౌన్ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై టూటౌన్ సీఐ చంద్రబాబును వివరణ కోరగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ● పడవ తెడ్లతో కొట్టుకున్న మత్స్యకారులు -
సైబర్ వలలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి
● మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావంటూ బెదిరించి రూ.15 వేలు కాజేత ఆదోని అర్బన్: మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.15,625 కాజేశారు. వివరాలు.. ఆదోని త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బాబు రాజేంద్రప్రసాద్ కుటుంబం నివాసం ఉంటోంది. మంగళవారం రాజేంద్రప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఫోన్కాల్ రాగా ఆయన కుమారుడు సాయికృష్ణ లిఫ్ట్ చేశారు. అవతలివైపు వారు మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 2024 మార్చిలో అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని చెప్పి బెదిరించారు. కేసు నకిలీ పత్రాలు, రాజేంద్రప్రసాద్ డెబిట్ కార్డు ఫొటోను వాట్సాప్లో పంపి భయబ్రాంతులకు గురి చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేస్తామని, అలా గాకుండా ఉండాలంటే రూ.15625 ఫీజు మొత్తాన్ని ఫోన్పే చేయాలని హెచ్చరించారు. సాయిక్రిష్ణ భయాందోళనతో వణికిపోతూ ఫోన్ మాట్లాడుతుండగా ఇంట్లోకి వచ్చిన తండ్రి జరిగిన విషయం తెలుసుకున్నారు. కుమారుడి భయాన్ని చూసి ఒత్తిడితో దుండగులు చెప్పిన నంబర్కు రూ.15,625 ఫోన్పే చేశారు. తర్వాత ఆ నంబర్కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన రాజేంద్రప్రసాద్ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. -
అక్రమంగా తరలిస్తున్న రూ.37.9 లక్షలు పట్టివేత
డోన్ టౌన్: ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.37.9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్బాషా, సీఎం రాకేష్ వివరాలు వెల్లడించారు. మంగళవారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కర్నూలు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అన్వర్ అనే వ్యక్తి వద్ద రూ. 37.9 లక్షల నగదు లభించింది. పోలీసులు ఆరా తీయగా వ్యాపారం నిమిత్తం నగదుతో బెంగళూరు వెళుతున్నట్లు తెలిపినా, నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూప లేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకోని సీజ్ చేసినట్లు సీఐలు తెలిపారు. వ్యాపారి నగదుకు సరైన రుజువులు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తామని, లేదంటే ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు అప్పగిస్తామన్నారు. తనిఖీల్లో పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి, మమత, సిబ్బంది పాల్గొన్నారు. -
స్క్వాడ్ వస్తోంది.. జాగ్రత్త !
కర్నూలు(అగ్రికల్చర్): ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలకు వచ్చిన టీమ్లు వివిధ మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే సంబంధిత వ్యవసా య సిబ్బంది ముందుగానే ‘స్క్వాడ్ వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలని ఉప్పందిస్తుండటంతో డీలర్లు, అక్రమార్కులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు రెండు బృందాలు వచ్చాయి. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఏడీఏలు, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఆకస్మికంగా తనిఖీలకు వెళితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. జిల్లాలో కొన్ని మండలాల్లో ప్రైవేటు డీలర్లు యూరియాను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కౌతాళంలోని ఓ ఆర్బీకేలో 600 బస్తాల యూరియా ఉంది. ఆర్బీకేకు వచ్చిన యూరియాపై ఓ ప్రైవేటు డీలరు పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిసై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మా షాపులో మందులు, విత్తనాలు తీసుకోవడం లేదు. అలాంటప్పుడు మీకు యూరియా ఎందుకివ్వాలంటూ రైతులపై రుసరుసలాడుతుండటంతో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేక స్క్వాడ్లు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. అప్పుడు అక్రమ నిల్వలు బయటికి వస్తాయి. రైతులకు మేలు జరుగుతుంది. ముందస్తు సమాచారం ఇచ్చి తనిఖీలకు తీసుకెళుతుండటం వల్ల తనిఖీలు నామమాత్రం అయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక బృందం ఆదోని, కౌతాళం మండలాల్లో తనిఖీలు జరిపి రూ.48.5 లక్షల విలువచేసే రసాయన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసింది. స్క్వాడ్ బృందం కౌతాళంలో తనిఖీలు నిర్వహించినా, ఆర్బీకేల్లోని ఎరువులపై ప్రైవేటు పెత్తనం చెలాయించడాన్ని గుర్తించలేదు. మరో బృందం గూడూరు, ఎమ్మిగనూరు, గోనెగండ్లలో తనిఖీలు నిర్వహించింది. ఈ బృందం రూ.38.29 లక్షల విలువ చేసే ఎరువులు, పురుగు మందుల అమ్మకాలను నిలిపివేసింది. -
రూ.120కోట్ల విలువైన స్థలంలో టీడీపీ కార్యాలయం
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాలను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్ రంజిత్బాషాకు లేఖకు రాశారు. బీక్యాంపు మెయిన్రోడ్డులోని స్థలం టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60లక్షలు ఉంది. ఈ లెక్కన 2 ఎకరాల విలువ రూ.120కోట్లు పైనే. కొన్ని పార్టీలు 33 ఏళ్లకు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకుంటే టీడీపీ నేతలు నానా యాగీ చేశారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసుకు విలువైన స్థలాన్ని 99 ఏళ్లపాటు లీజు కోసం కలెక్టర్కు లేఖ రాశారు. టీడీపీ ఆఫీసు ప్రతిపాదన తర్వాతే ఈ స్థలంలోని క్వార్టర్లను కూల్చేసి అభివృద్ధి కార్యాక్రమాల పేరుతో కొన్ని నిర్మాణాలు చేపట్టి స్థలాలను లీజుకు తీసుకోవచ్చనే ఆలోచన కూటమి నేతలు చేసినట్లు తెలుస్తోంది. -
ముగ్గురికి కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ సీ నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందించారు. పీఎండీ ఇంతియాజ్ను నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిషత్ కార్యాలయానికి, ఎం విద్యుల్లతను కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్ జెడ్పీ హైస్కూల్కు, ఎస్ రిజ్వానాను నంద్యాల జిల్లా శిరివెళ్ల జెడ్పీ హైస్కూల్కు నియమిస్తూ ఉత్తర్వులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి పాల్గొన్నారు. చట్ట పరిధిలో న్యాయం చేయండి నంద్యాల: ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకుండా చట్టపరిధిలో వారికి న్యాయం చేయాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అడిషనల్ ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్లో 130 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంపామన్నారు. లెక్చరర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి పరీక్షలు నంద్యాల(అర్బన్): పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 15 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ బేస్డ్ అబ్జెక్టివ్ పరీక్షలను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు, మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలోని పాణ్యం రాజీవ్గాంధీ మెమోరియల్ కళాశాల, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల, శ్రీనివాసనగర్లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాల, అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ పరీక్షలు జరుగుతాయి. పది పీఏసీఎస్లకు పాలకవర్గాల నియామకంకర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల పాలకమండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 5, నంద్యాల జిల్లాలో 5 సంఘాలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. చైర్మన్గా ఒకరు, సభ్యులుగా ఇద్దరు నియమితులయ్యారు. కర్నూలు జిల్లాలో కడిమెట్ల సొసైటీ చైర్మన్గా విరుపాక్షి రెడ్డి, మదిర (దామోదర్ చౌదరి), పెద్దతుంబలం (అన్వర్ బాషా), పెద్ద హరివణం (ఆదిశేషారెడ్డి), గోనెగండ్ల (ఎన్వీ రామాంజనేయులు), నంద్యాల జిల్లాలోని కానాల సొసైటీ చైర్మన్గా ప్రేమనాథ్ రెడ్డి, పోలూరు (చంద్రమౌలీశ్వర్ రెడ్డి), గడివేముల (సత్యనారాయణ రెడ్డి), గోస్పాడు (వీరసింహా రెడ్డి), దీబగుంట్ల సొసైటీ చైర్మన్గా ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు. గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 10వ తరగతి, సీనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో హాజరు కావాలన్నారు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామన్నారు. బీఆర్ఏజీసీఈటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం అరికెరలో సీఈసీ (మిగిలిన సీట్లకు) చదివేందుకు ఆసక్తి కలిగిన జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరు గురుకులంలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయాధికారులు సోమవారం దాడులు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు.. రాష్ట్రస్థాయి తనిఖీ బృందంలో భాగంగా కమలాపురం ఏడీఏ నరసింహారెడ్డి, విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణంలా ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పురుగు మందు లు, ఎరువుల దుకాణాలతో పాటు విత్తన దుకాణాలు, విత్తనశుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వలు, స్టాక్ రిజిస్టార్లు, అనుమతి పత్రాలను పరిశీలించిన అనంతరం వసువాహిణి ఆగ్రో ఏజెన్సీస్లో రూ.84 వేలు, శివసంతోష్రెడ్డి ఏజెన్సీస్లో రూ.70 వేలు విలువ గల ఎరువులకు సరైన ధ్రువపత్రాలు చూపకపోవడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఏడీఏ నరసింహారెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం అనుమతి ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మాత్రమే విక్రయించాలన్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం
నందికొట్కూరు/కొత్తపల్లి: కోటి ఆశలతో ఖరీఫ్ను ప్రారంభించిన రైతుల ఆశలు ఎండిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయే తప్ప వర్షం జాడలేదు. 20 రోజులుగా వానల్లేక పంటలు ఎండిపోతున్నాయి. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా పొలాలు తడవని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వరి 15,910 హెక్టార్లలో, మొక్కజొన్న 38,749, కంది 26,990, వేరుశనగ 9,240, పత్తి 24,951, ఉల్లి 3,008, మిరప 5,972, కొర్ర 1,099, సన్ప్లవర్ 397, పెసరపప్పు 136, పసుపు 526 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. తొలకరి వర్షాలకు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుము, సోయాబీన్స్, పెసర, కంది తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఎండుతున్న పంటలను రైతులు విధిలేని పరిస్థితుల్లో తొలగించారు. కూత వేటు దూరంలో పుష్కలంగా కృష్ణమ్మ ప్రవహిస్తున్నా రైతుల పొలాలు తడవని పరిస్థితి నెలకొంది. ముసలమడుగు గ్రామ సమీపంలో ఉన్న శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలకు నీరు పుష్కలంగా ఉన్నా ఎత్తిపోయడంలో జాప్యం జరుగుతోంది. పంటలు ఎండిపోతున్నా అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండుతున్న పంటలను కాపాడుకోలేక రైతులు తొలగిస్తున్నారు. పెట్టుబడి మట్టిపాలు కావడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. 20 రోజులుగా జాడ లేని వరుణుడు ఎండుతున్న పంటలు పని చేయని ఎత్తిపోతలు పంటలను తొలగిస్తున్న రైతులు -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
నంద్యాల(వ్యవసాయం): రాజీ అయ్యే కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి అన్నారు. సోమవారం స్థానిక కోర్టు ఆవరణలో బ్యాంకు, ఇన్సురెన్స్ అధికారులకు ‘మీడియేషన్–వన్నేషన్’ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో డబ్బు ఆదాతో పాటు కేసులు పరిష్కారమవుతాయని అధికారులకు సూచించారు. మీడియేషన్పై శిక్షణ తీసుకున్న సీనియర్ న్యాయవాదులు బ్యాంక్ అధికారులకు, ఇన్సురెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామచంద్రారావు, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్బాషా, సుబ్బరాయుడు, రామచంద్రారెడ్డి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం అందించాలి
ముందస్తు వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే మూడు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం వేశాను. ఎకరాకు రూ. 15 వేల మేర పెట్టుబడి పెట్టా ను. దాదాపు నెల రోజులుగా పెద్దగా వానల్లేవు. ఇప్పుడు వర్షాలు కురిసినా ఫలితం ఉండదు. దిగుబడి రాక నష్టపోవాల్సిందే. కష్టమంతా వృథా అవుతుంది. అందుకే పంటను తొలగించాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. – లింగస్వామి పెద్దగుమ్మాడాపురం రైతు, కొత్తపల్లి మండలం నష్టాలు తప్పవు మొక్కజొన్న పంటను ఐదు ఎకరాల్లో సాగు చేశాను. ఇప్పటికే రెండు సార్లు మందులు వేశాను. పంటలో కలుపు కూలీలతో తీయించాను. మొక్కజొన్న పంట ఎదిగే సమయంలో వానదేవుడు ముఖం చాటేశాడు. వర్షాలు పడితేనే కాని పంటలు పండని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా నష్టాలు తప్పవు. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – శెట్టి భాస్కర్ రైతు దామగట్ల గ్రామం, నందికొట్కూరు మండలం -
ప్రభుత్వ క్వార్టర్లపై కూటమి నేతల కన్ను
● రాజధానిగా ఉన్నపుడు ఏ, బీ, సీ క్యాంపుల్లో క్వార్టర్లు నిర్మాణం ● స్టేడియం నిర్మాణం పేరిట 39 క్వార్టర్ల కూల్చివేతకు నోటీసులు ● లీజు పేరుతో స్థలాన్ని కాజేసేందుకు ప్రజాప్రతినిధుల కుట్ర ● బీ, సీ క్యాంపులో సెంటు స్థలం రూ.25లక్షల నుంచి రూ.30లక్షల పైనే ● ఈ లెక్కన 1,090 క్వార్టర్ల విలువ రూ.వేల కోట్లు ● మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే చరిత దంపతుల కనుసన్నల్లో కూల్చివేతలు ● 2 ఎకరాల్లో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్కు టీడీపీ లేఖ ● ఈ స్థలం విలువ రూ.120కోట్లు ఇదో భారీ ‘గూడు’ పుఠాణి. కర్నూలు నడిబొడ్డున వేలకోట్ల విలువైన వందల ఎకరాల స్థలాన్ని అభివృద్ధి ముసుగులో కొన్ని నిర్మాణాలు చేపట్టి తక్కిన స్థలాన్ని లీజు పేరుతో ఆక్రమించేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తొలి పావు కదిలింది. మినీ క్రికెట్ స్టేడియం పేరుతో 1,090 క్వార్టర్లలో 39 క్వార్టర్ల కూల్చివేతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తక్కిన వాటిని కూల్చనున్నారు. ఈ స్థలంలో కొంత ప్రభుత్వ అవసరాలకు వినియోగించి, ఆ ముసుగులో లీజు పేరుతో టీడీపీ నేతలు, ప్రధాన అనచరులు మిగిలిన స్థలం పాగా వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరవాసులు, విపక్ష పార్టీలు మేల్కొనకపోతే విలువైన స్థలం లీజు పేరిట నేతల వశం కానుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు సీ క్యాంప్లో విలువైన స్థలంతమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్టర్లను ప్రభుత్వం నిర్మించింది. బి, సి క్యాంపు పరిధిలో 1,090 ప్రభుత్వ నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ రెండూ కర్నూలుతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. వీటిలో సింహభాగం ఉద్యోగులు కాకుండా ఇతరులు అక్రమంగా నివాసం ఉంటున్నారు. సిటీ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని.. అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారు. వైఎస్ మృతితో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. సర్కారు స్థలంపై ఇద్దరు నేతల కన్ను బీ, సీ క్యాంపులోని క్వార్టర్లపై మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత వర్గీయులు కన్నేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పేరుతో 1,090 క్వార్టర్లను తొలగించి ఇక్కడ మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని భరత్ భావించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు కాజేసే కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని అందులో మల్లీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలుత 39 క్వార్టర్ల కూల్చివేతకు ఆర్అండ్బీ అధికారులు భవనాల్లో నివాసం ఉంటున్నవారికి నోటీసులు ఇచ్చారు. ఈ స్థలం పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి కూడా రావడంతో తమకు తెలీకుండా ప్రతిపాదనలు రూపొందించడం, లీజు పేరుతో స్థలాలు కాజేస్తున్నట్లు తెలియడంతో ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలివిడతలో 39 క్వార్టర్లు తొలగించిన స్థలంలో స్టేడియం నిర్మాణం పోనూ, మరింత స్థలం మిగులుతుందని, మొత్తం 1090 క్వార్టర్లు తొలగిస్తే వందల ఎకరాల స్థలం ఉంటుందని భావించారు. దీంతో వారు కూడా లీజు పేరుతో స్థలం తీసుకోవాలని భావించినట్లు సమాచారం. రూ. వేలకోట్ల విలువైన స్థలం కాజేసేందుకు కుట్ర బీ, సీ క్యాంపు పరిధిలోని 1,090 క్వార్టర్లు, ఖాళీ ప్రదేశాలు మొత్తం ప్రభుత్వ ఆస్తులే. ఇందులో ఈ స్థలాల ను ఆక్రమించి కొందరు ప్రైవేటు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ సెంటు స్థలం రూ.25లక్షల నుంచి 30లక్షల వరకూ ఉంది. కొన్ని చోట్ల రూ.50లక్షలు కూడా పలుకుతోంది. ఈ లెక్కన మొత్తం భవనాలు తొలగిస్తే ఆ ప్రదేశం కర్నూలు సిటీలో అత్యంత విలువైన స్థలం అవుతుంది. అప్పడు దీని విలువ వేల కోట్లు ఉంటుంది. ఓ పథకం ప్రకారం అభివృద్ధి పేరు తో తొలివిడతలో ఓ మినీ క్రికెట్ స్టేడియం, మలి విడతలో ఇంకొన్ని నిర్మాణాలు ప్రజాప్రతినిధులు చేపడతారు. అయినప్పటికీ భారీగా స్థలం మిగిలే ఉంటుంది. ఈ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేయాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలోని కొందరు బడానేతలు లీజు పేరుతో ప్రభుత్వ స్థలాలను తీసుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టి లీజు ముగిసినా రాజకీయ, ఆర్థిక బలంతో లీజు పొడిగిస్తూ ఆర్థికంగా ఎలా అర్జిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు బీ, సీ క్యాంపు నిర్మాణాలపై కూడా టీడీ పీ నేతలు కన్నేశారు. ఈ క్వార్టర్లు కూల్చేసి నిర్మాణా లు చేపడితే కర్నూలులోనే అత్యంత విలువైన ప్రాంతంగా మారుతుంది. ఇలాంటి స్థలాన్ని లీజు పేరుతో చిల్లర ప్రభుత్వ ఖజానాకు విదిల్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు పథకం రచించారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంపై అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెవె న్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతి రోజూ తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ముగ్గురు సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో 326 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎల్కు ఆలూరుకు కుర్రాడు
ఆలూరు రూరల్: ఆంధ్రా ప్రీమియర్ క్రికెట్ లీగ్ (ఏపీఎల్)కు ఆలూరుకు కుర్రాడు కమరుద్దీన్ ఎంపికయ్యాడు. సోమవారం వైజాగ్లో నిర్వహించిన ఏపీఎల్ వేలాల్లో కాకినాడ కింగ్స్ టీం కమరుద్దీన్ను రూ.5.20 లక్షలకు కొనుగోలు చేసింది. 2023 ఏడాది సెప్టంబర్ నెలలో విశాఖపట్నంలో జరిగిన ఏపీల్లో టోర్ని ఫైనల్లో 13 వికేట్లు తీసి..185 బంతుల్లో 38 పరుగులు చేసి ఆల్రౌండర్ ప్రతిభ చాటి పర్పూల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. క్రికెట్పై ఆసక్తితో 13 ఏళ్ల నుంచే శ్రమించాడు. 20 ఏళ్ల వయసులో ఆంధ్ర, సౌత్జోన్ జట్టులో చోటు సంపాదించాడు. అప్పట్లోనే ఆల్ రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో మరో సారి ఏపీఎల్కు ఎన్నికయ్యానని, దేశం కోసం ఆడాదలన్నదే తన ఆశయమని కమరుద్దీన్ తెలిపారు. ‘బీమా’కు నేడు తుది గడువు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి,వేరుశనగకు వాతావరణ ఆధారిత పంటల బీమా కోసం ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల 15వ తేదీ తో ముగియనుంది. బీమా చేసుకోవడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది. పత్తికి హెక్టారు కు రూ.లక్ష విలువకు బీమా చేస్తారు. ప్రీమియం హెక్టారుకు రూ.5వేలు చెల్లించాల్సి ఉంది. వేరుశనగ హెక్టారుకు రూ.70 వేల విలువకు బీమా చేస్తారు. రైతులు ప్రీమియం రూ.1400 చెల్లించాల్సి ఉంది. -
ఆరోగ్యమిత్రల మెడపై కత్తి
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ అనేంతగా ప్రాచుర్యం పొందిన పథకం ఇది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి.. ఎన్నిసార్లు పేరు మార్చినా ఇప్పటికీ ఈ పథకాన్ని ప్రజలు ఆరోగ్యశ్రీగానే పిలుస్తుండటం విశేషం. ఈ పథకానికి వైఎస్సార్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత మెరుగులుదిద్ది ప్రజల అభిమానం చూరగొన్నారు. ఇక వీరిద్దరి పేర్లను ఆ పథకం నుంచి దూరం చేయలేమని భావించిన కూటమి ప్రభుత్వం.. ఏకంగా పథకం రద్దు దిశగా పావు కదుపుతుండటం గమనార్హం. ఆరోగ్యశ్రీకి మంగళం..! ● ఆయుష్మాన్ భారత్కు రంగం సిద్ధం ● ఇప్పటికే ఐదుసార్లు ఉద్యోగులకు శిక్షణ ● నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం ● మెడికోకు ప్రీ ఆథరైజేషన్ అధికారం ● ప్రశ్నార్థకంగా ఆరోగ్య మిత్రల భవిష్యత్ కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఎంతటి కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా దర్జాగా ఉచిత వైద్యం చేయించుకునే హక్కును ఆయన పేదలకు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పథకాన్ని మరింత మెరుగుపరిచారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1800లోపు ఉన్న చికిత్సలను వైఎస్ జగన్ 3,255కు పెంచారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లోనూ వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పథకానికి ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చింది. అయినప్పటికీ ప్రజలు ఆరోగ్యశ్రీగానే పిలుస్తుండటాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పథకాన్ని ఎలాగైనా తొలగించాలనే కుట్రకు ప్రభుత్వం పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ను తెరపైకి తీసుకొస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఐదు విడతల శిక్షణ కూడా పూరి చేయడం గమనార్హం. మరో నెల రోజుల్లో పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇకపై జిల్లా కలెక్టర్ నుంచి నిధులు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రులకు క్లెయిమ్ అమౌంట్ విడుదలవుతోంది. ఆయుష్మాన్ భారత్ అమలులోకి వస్తే క్లెయిమ్ అప్రూవల్ ఇచ్చాక నిధులను జిల్లా కలెక్టర్ నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం. నెట్వర్క్ ఆసుపత్రులపై ఏవైనా ఫిర్యాదులు వచ్చినా జిల్లా కలెక్టర్ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తేనే నిధులు ఇస్తామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఏడాది కాలంగా కేంద్రం ఇస్తున్న నిధులను ఇతర పథకాలకు వాడుకుంటున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయుష్మాన్ భారత్ అమలుకు ప్రత్యేకంగా ఒక మెడికోను ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రైవేటు ఆసుపత్రులు ఒప్పుకుంటాయా...! ● ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ● ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉంది. ● కాగా ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్భారత్లో వ్యాధుల సంఖ్య 1900లోపే ఉండటం, ప్యాకేజి కూడా తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రు లు దీనిపై నిరాసక్తి చూపుతున్నట్లు సమాచారం. ● ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసి 1900 వ్యాధులపైబడిన వ్యాధులను బీమా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ● ఈ మేరకు నూతన ఆరోగ్య పాలసి రూపొందించే పనిలో కూటమి పెద్దలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ కియోస్క్ట్రస్ట్నే నమ్ముకున్నాం ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలోని మెడికో ద్వారా లాగిన్ చేపట్టనుండటంతో వైద్యమిత్రల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 165 మంది పనిచేస్తుండగా, చాలా మంది 17 సంవత్సరాలుగా ట్రస్ట్నే నమ్ముకున్నారు. ఇప్పటి వరకు మాకు జాబ్సెక్యూరిటీ, కనీస వేతనం కూడా లేదు. ట్రస్ట్లో జరుగుతున్న పరిమాణాలతో వైద్యమిత్రల్లో ఆందోళన నెలకొంది. – కె.దేవేంద్రనాయక్, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరి, ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగుల్లో ఆందోళన ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్ తెస్తారని మాకూ సమాచారం వస్తోంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగులకు సైతం ఎలాంటి సమాచారం అందడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందా, లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ పథకానికై తే ప్రస్తుతం హెచ్హెచ్ఆర్, పీఆర్ లాగిన్ ఐడీలు చేయిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. – సి.కంబగిరి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ యూనియన్, కర్నూలు ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్భారత్ను తీసుకొచ్చి లాగిన్ అవకాశాన్ని సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలోని మెడికో ద్వారా చేపట్టనుండటంతో ఆరోగ్యమిత్రల ఉనికి ప్రశ్నార్థకం కానుంది. ఒకవైపు పథకాన్ని మార్చే పనులు వేగవంతంగా చేస్తున్నా మిత్రల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 98 మంది వైద్యమిత్రలు.. నంద్యాల జిల్లాలో 67 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా ఇందులో చాలా మంది ఉద్యోగులు ట్రస్ట్ను నమ్ముకుని పనిచేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వీరి మెడపై కత్తి వేలాడ తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఆన్లైన్లో మల్లన్న స్పర్శ దర్శనం టికెట్లు పొందినభక్తులు మూడు విడుతలుగా దర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. మరో వైపు శ్రీశైలం డ్యామ్ గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండంతో తిలకించేందుకు పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. -
నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
● రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికృష్ణగిరి: మరో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన శిరోల్ల రవితేజ(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇతనికి కల్లూరు మండలం చిన్నటేకూరులో ఓ అమ్మాయితో వివాహ నిశ్చయం జరిగింది. మరో నెల రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఆదివారం రవితేజ తన బంధువు అయిన మరో వ్యక్తితో బెంగళూరులో బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా కారు వచ్చి ఢీకోట్టింది. దీంతో తలకు హెల్మెట్ ఉన్న రవితేజతోపాటు మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీరని శోకంతో బెంగళూరుకు వెళ్లారు. -
రైతులు వేసే ప్రతి పంటకూ బీమా
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రైతులు వేసే ప్రతి పంటకూ తప్పనిసరిగా బీమా చేయించాలని వ్యవసాయాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో క్రాప్ ఇన్సూరెన్స్పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బీమా చేయిచేస్తే ప్రకృతి వైపరీత్యాలతో పంటలను నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వాతావరణ అంశాల ఆధారంగా బీమా పరిహారం చెల్లిస్తారన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సమస్య రానీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ ఏడీ నాగరాజు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, అగ్రికల్చర్ ఏఓలు, ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పచ్చి మిర్చి కిలో రూ.120 జూపాడుబంగ్లా: ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జూపాడుబంగ్లాలో వారాంతపు సంత నిర్వహించారు. పచ్చిమిర్చి కిలో ధర రూ.120 పలికింది. కిలో టమాటా రూ.40, కిలో వంకాయ, ఆలుగడ్డ రూ.40 ప్రకారం అమ్మారు. మిగతా కూరగాయల ధరలు రూ.40 అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసేందుకు రూ.300 నుంచి రూ.400 వెచ్చించాల్సి వచ్చిందని ప్రజలు పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు గోస్పాడు: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. శుక్రవారం పీసీ అండ్ పీయన్ డీటీ యాక్టు 1994 సలహా కమిటీ జిల్లా స్థాయీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు జరిపి నివేదికలు అందించాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అన్న సమాచారం అందించాలని, అలాంటివారు పేర్లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. అలాంటి సెంటర్లు గుర్తిస్తే, వారిపై నేరం రుజువైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ సుదర్శన్ బాబు, డెమో రవీంద్ర నాయక్, వైద్యాధికారులు పద్మజ, అరుణజ్యోతి, శ్రావణ్ కుమార్, ఎన్జీఓస్లు పాల్ రాజారావు, రామారావు, న్యాయవాది మోతీలాల్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం మూడు రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి కృష్ణా జలాలు దిగువకు పరుగులు పెడుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి శ్రీశైలానికి 1,75,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,69,859 క్యూసెక్కుల నీరు విడుదలైంది. నార్జునసాగర్కు విద్యుత్ ఉత్పత్తి అనంతరం, క్రస్ట్ గేట్ల ద్వారా 1,48,259 క్యూసెక్కులు, బ్యాక్వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులను వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 17.264 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.397 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 203.8904 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.90 అడుగులకు చేరుకుంది. -
తడవని పొలాలు.. తొలగని రైతుల కష్టాలు
గోరుకల్లు రిజర్వాయర్ మట్టి ఆనకట్ట రాతి పరుపు కుంగిపోతుంది. దీని పూర్తి సామర్థ్యం 12.4 టీఎంసీలు. కట్టను 265.6 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఇప్పటి వరకూ 262 మీటర్లు ఎత్తు నిర్మించారు. గత ప్రభుత్వం 11.2 టీఎంసీల నీరు నిల్వ చేసింది. రిజర్వాయర్ భద్రత, పూర్తి స్థాయి సామర్థ్యం నీటి నిల్వకు అయ్యే పనుల కోసం రూ.99.22కోట్లతో గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ప్రస్తుతం పక్కన పెట్టేశారు. రిజర్వాయర్ను కూటమి ప్రభుత్వం ఏడాదిగా పట్టించుకోకపోవడంతో మట్టి కట్ట రాతి పరుపు కుంగిపోయింది. పనులకు రూ.58.6 కోట్లతో చేసిన ప్రతిపాదనలు చేసినా స్పందన లేదు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి డీఎంఎఫ్ నుంచి రూ.2.50 కోట్లతో తాత్కలికంగా చేపట్టిన పనులు సైతం పూర్తి కాలేదు. ఆయకట్టుకు సాగు నీరు అందేనా? నంద్యాల జిల్లాలో తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాల్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, వరదరాజుల శివ భాష్యం ప్రాజెక్టు, చిన్న నీటిపారుదల శాఖ చెరువుల కింద 5 లక్షలకుపైగా ఆయకట్టు ఉంది. ఇందులో చెరువులు మినహా మిగిలిన ప్రాజెక్టులకు కృష్ణా జలాలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయకట్టుకు పూర్థి స్థాయిలో నీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు. ● ఎస్ఆర్బీసీకి విడుదల కాని నీరు ● నిలిచిపోయిన అవుకు మూడో టన్నెల్ పనులు ● రాజోలి, జొళదరాశి ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం ● ‘గోరుకల్లు’కు శాశ్వత మరమ్మతులు లేనట్టే! ● ఏడాదిగా నిలిచిపోయిన రాయలసీమ లిఫ్ట్ పనులు ● అటకెక్కిన ‘అలగనూరు’ ● నేడు నంద్యాల జిల్లా ఐఏబీ సమావేశం కర్నూలు సిటీ: రాయలసీమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించలేదు. దీంతో పంట పొలాలన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే త్వరలో రాయలసీమ ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉందని మేధావులు విమర్శిస్తున్నారు. ఇందుకు వర్షాభావ పరిస్థితులు దోహదం చేస్తాయని చెబుతున్నారు. సాగు నీటి కాలువలకు నీటి విడుదలపై చర్చించేందుకు నేడు(శనివారం) మధ్యాహ్నం నంద్యాలలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి నంద్యాల జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ జిల్లాకు చెందిన నేతలు సైతం హాజరుకానున్నారు. స్పందించని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురువడం లేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్కు జలకళ వచ్చింది. రెండు వారాల క్రితమే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మే నెల చివరిలోనే వర్షాలు రావడంతో నంద్యాల జిల్లాలోని కేసీ ఆయకట్టుదారులు ముందుగా పంటలు సాగు చేశారు. కాలువలకు నీరు రాకపోవడం, వర్షాలు కురవకపోవడంతో మొలకొచ్చిన పైర్లన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసినా..ఆ నీటిని తెలుగుగంగ ద్వారా వెలుగోడుకు వదులుతున్నారు. ఎస్ఆర్బీసీకి విడుదల చేయడం లేదు. ఇదీ నిర్లక్ష్యం శ్రీశైలం నుంచే ముందుగానే నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఎస్ఆర్ఎంసీతో పాటు, ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ, గాలేరు–నగరి కాలువలకు లైనింగ్ పనులు చేయించింది. రాయలసీమ లిఫ్ట్పై ఉన్న కేసు విషయంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఆ స్కీమ్ పనులు ఏడాది నిలిచిపోయాయి. ● కేసీ కెనాల్ చివరి ఆయకట్టు కోసం నిర్మించాల్సిన రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులను, ఆలగనూరు రిజర్వాయర్ పనులను సైతం కూటమి ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ● కర్నూలు–కడప కాలువ నీటిని తాత్కలికంగా నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవు. చివరి ఆయకట్టుకు స్థీరికరించేందుకు ఉన్న ఏకై క రిజర్వాయర్ అలగనూరు రిజర్వాయర్(2.95 టీఎంసీలు). అలగనూ రు రిజర్వాయర్ 1985లో రూ.3.06 కోట్లకు కేవలం పరిపాలన ఆమోదం పొందింది. 1993లో కేసీ కెనాల్ను జైకా నిధులతో ఆధునీకరించే పనుల్లో భాగంగా రూ.59.90 కోట్లతో రిజర్వాయర్ను చేపట్టి.. 2004లో పూర్తి అయ్యాయి. ఈ రిజర్వాయర్ పను లు జరుగుతున్న సమయంలో గడివేముల నుంచి రోళ్ళపాడు గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును తొలగించకుండా, ఎలాంటి ట్రెంచెస్ వేయకుండానే నిర్మాణం చేపట్టడంతో 2017లో కట్ట కుంగింది. శాశ్వత పనులు చేసేందుకు మొదటగా రూ.26 కోట్లతో అంచనా వేశారు. తాజాగా అది రూ.36.26 కోట్లకు అంచనాలు పెరిగాయి. ఈ రిజర్వాయర్పై సీఎంతో పాటు, మంత్రి సైతం అసెంబ్లీలో హామీనిచ్చినా ప్రకటనకే పరిమితం అయ్యింది. ‘ఘోర’కల్లు -
బానకచెర్ల నుంచి నీరు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి శుక్రవారం 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్ఆర్ఎంసీ ద్వారా 20,000 క్యూసెక్కుల నీరు బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు ఇన్ఫ్లో ఉందన్నారు. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. తెలుగుగంగ(వీబీఆర్)కు 14,000, కేసీసీ ఎస్కేప్ చానల్కు 6,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని, జీఎన్ఎస్ఎస్కు నీటి విడుదల చేయలేదని చెప్పారు. వీబీఆర్లో 6 టీఎంసీల నీరు వెలుగోడు: తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుత జలశాయంలో 844.585 మీటర్ల వద్ద 6.811టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఏఈఈ శివనాయక్ తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
పాలనలో ‘కూటమి’ విఫలం
ఆత్మకూరు: సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ అనే క్యూఆర్ కోడ్ ఉండే పోస్టర్లను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. అక్రమ అరెస్టులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే ప్రజలు మోసపోయారని, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీ చేస్తామన్నారు. పార్టీ నమ్ముకుని పనిచేసే వారికి మంచి పదవులు కట్టబెడతామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కార్యకర్తలకు ఫుల్ పవర్ ఇస్తామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం నియోజకవర్గంలో శనివారం వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో సమావేశాలు నిర్వహించి శ్రీశైలంలో 14న మండల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్ని మోసగించి టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. భయపడే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టీడీపీ నాయకులకు, పోలీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రజల సహాయ సహకారాలతో ముందుకు సాగాలన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేస్తున్నారని, అభిమానం మరువలేనిదన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే సమావేశాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్రెడ్డి, అహ్మద్హుసేన్, మహానంది, ఆత్మకూరు మండలాల పార్టీ నాయకులు పాల మహేశ్వర్రెడ్డి, సయ్యద్మీర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వెలుగోడు, బండిఆత్మకూరు మండలాల అధ్యక్షులు అంబాల ప్రభాకర్రెడ్డి, భాస్కర్రెడ్డి, పార్టీ నాయకులు సుజాతమ్మ, దర్గమ్మ, దేశం తిరుపంరెడ్డి, విజయ్చౌదరి, విజయ్, ఒట్టి వెంకటరెడ్డి పాల్గొన్నారు. హామీల అమలులో మోసం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
రోగాలు పెరిగాయి
గ్రామాల్లో కాలువలు ఉన్నా పూ డిక తీయడం లేదు. చెత్తాచెదారం కుళ్లి దుర్వాసన వస్తుంది. దోమలు పగలు కూడా కుడుతున్నాయి. రోగాలు పెరుగుతున్నాయి. వైద్యం అరకొర అందుతోంది. చానా ఇబ్బందిగా ఉంది. – మద్దిలేటి, జిల్లెల్ల అవస్థలు పడుతున్నాం చిన్న పాటి వర్షం వస్తే చాలు మా కాలనీ అంతా కుంటను తలపి స్తోంది. రోజలు తరబడి మురు గు నీరు ఉంటుంది. కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. ము రుగు నీటిలోనే వెళ్లాల్సి వస్తోంది. తరుచూ రోగాల బారిన పడుతూ అవస్థలు పడుతున్నాం. – మహేశ్వరి, గోస్పాడు -
వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలంలో లక్ష కుంకుమార్చన శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబాదేవికి గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్రనామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్షసేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పరోక్షసేవలో పాల్గొన్నారు. ముద్దచర్మ వ్యాధి నివారణకు నేటి నుంచి టీకాలు కర్నూలు(అగ్రికల్చర్): ముద్ద చర్మవ్యాధి( లంపిస్కిన్ డిసీజ్) నివారణకు శుక్రవారం నుంచి ఈ నెల చివరి వరకు టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆవులు, గేదెల్లో ముద్ద చర్మ వ్యాధి ప్రధానంగా కనిపిస్తుందన్నారు. వ్యాధితో పశువులు మరణించే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధని ఆయన పేర్కొన్నారు. ముద్దచర్మ వ్యాధి నివారణ కోసం కర్నూలు జిల్లాకు 2,19,100, నంద్యాల జిల్లాకు 95,600 డోసుల వ్యాక్సిన్ వచ్చిందని, అన్ని వెటర్నరీ హాస్పిటల్స్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అప్పీలుకు అవకాశం ఉండదు కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులకు అప్పీలు అవకాశం ఉండదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం న్యాయ సదన్లో మధ్యవర్తిత్వంపై వారం రోజులపాటు జరిగే అవగాహన సదస్సులో మొదటి రోజు బ్యాంకు, చిట్ఫండ్, ఇన్సూరెన్స్ విభాగాల మేనేజర్లకు మధ్యవర్తిత్వం కేసులను త్వరగా ఎలా పరిష్కరించుకోవచ్చో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు ఉమాదేవి, ఆశాభాయ్ హాజరైన వివిధ సంస్థల మేనేజర్లకు అవగాహన కల్పించారు. ఎల్లెల్సీకి నీటి విడుదల హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర రిజర్వాయర్ నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం ఉదయం 9 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. టీబీ బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణనాయక్, ఎల్లెల్సీ ఈఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో జిల్లా సరిహద్దులోని ఎల్లెల్సీకి చేరనున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది టీబీ డ్యాం నుంచి ఒక పంట (ఖరీఫ్)కు మాత్రమే నీరు ఇవ్వనున్నారు. టీబీ డ్యాం గేట్లు మార్చాలని నిపుణులు సూచనలు చేయడంతో ఈ నిర్ణయించారు. జలాశయంలో 80 టీఎంసీల వరకు మాత్రమే నిల్వ చేసి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. డిసెంబర్ నెలలో కొత్త గేట్లను బిగించేందుకు పనులు మొదలు పెడ్తారు. జిల్లాలో ఎల్లెల్సీ కింద ఖరీఫ్లో 43 వేలు, రబీలో లక్షా 7 వేల ఎకరాలకు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. -
ప్రతిభకు మార్కులు కొలమానం కాదు
వెలుగోడు: విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చని సూచించారు. వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్ 2.0 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని సూంచారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాలలో మెట్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్కు పూర్వ విద్యార్థులు విన్నవించారు. -
అందరూ విద్యార్థులే..
ఈ దృశ్యం కోటకందుకూరు స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్లో కనిపించింది. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. వస్తామని చెప్పి వారు రాలేదు. విద్యార్థులను కూర్చోబెట్టి తల్లిదండ్రులకోసం ఉపాధ్యాయులు ఎదురుచూశారు. ‘పది’నిసలు ఇది కోటకందుకూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో 146 మంది తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటలైనా 10 మంది కూడా రాలేదు. దీంతో చేసేది లేక వచ్చిన వారితోనే విద్యార్థులను కలిపి సమావేశం ఏర్పాటు చేసి మమ అని పించారు. -
గురు పౌర్ణ్ణమి.. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును రాజకీయ సమా‘వేషాల’కు ఉపయోగించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా.. పేద విద్యార్థులకు ఎలాంటి సహకారం అంద
వచ్చారు.. వెళ్లారు! ఇది ఆర్. కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల. ఇందులో 82 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం నిర్వహించిన సమావేశానికి 42 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారని రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకే సమావేశాన్ని ముగించినట్లు చెప్పారు. మళ్లీ భోజనానికి వస్తామని తల్లిదండ్రులు అంతా వెళ్లి పోయినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. ‘తల్లికి వందనం’ రాలేదు ఆర్కృష్ణాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులను తమకు తల్లికి వందనం రాలేదని విద్యార్థుల తల్లులు నిలదీశారు. సమావేశానికి వచ్చిన 6వ తరగతి విద్యార్థిని రమణమ్మ తల్లి సుబ్బలక్షమ్మ, 7వ తరగతి విద్యార్థిని జ్యాన్సి తల్లి లావణ్య తమ పిల్లలకు తల్లివందనం రాలేదని ఉపాధ్యాయున్ని నిలదీశారు. త్వరలోనే రెండో విడత విడుదల చేస్తారని ఉపాధ్యాయుడు సముదాయించారు. కాగా 130 పేరెంట్స్ హాజరు కావల్సిన ఈ మీటింగ్కు కనీసం పది మంది కూడా హాజరు కాలేదు. -
విద్యార్థులకు సరిపడా రేషన్ ఇవ్వడం లేదు
పాణ్యం: పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరిపడా రేషన్ ఇవ్వడం లేదని జేసీ విష్ణు చరణ్కు వంట ఏజెన్సీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. బలపనూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. సమావేశం జరుగుతుండగానే రేషన్ ఇవ్వడం లేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు జేసీకి ఫిర్యాదు చేయడంతో స్టాక్ రూమ్కు వెళ్లి పరిశీలించారు. రెండు బ్యాగ్ల రేషన్ ఉండడంతో హెచ్ఎం నారాయణపై జేసీ మండిపడ్డారు. పాతవి 25 బస్తాల వరకు బియ్యం నిల్వ ఉన్నాయని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. తమ్మరాజుపల్లె పాఠశాలలో, ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత హాజరయ్యారు. -
బాబు పాలన ‘సూపర్’ ఫ్లాప్
● హామీలు అమలవుతాయన్న గ్యారెంటీ లేదు ● ప్రజలు నిలదీస్తారనే భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ ● రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బుగ్గన, పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని ధ్వజం ● విజయవంతమైన వైఎస్సార్సీపీ డోన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం డోన్ టౌన్: రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలన ‘సూపర్’ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం డోన్ పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పార్టీ డోన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త పింఛన్ల మంజూరు తదితర హామీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది అన్నారు. హామీలు నీటిమూటలేనా? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూ అదనంగా ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, త్వరలోనే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. హామీలు అమలు కాకున్నా జనసేన, బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం విచారకరం అన్నారు. వీరందరిదీ మోసగాళ్ల కూటమి అనే విషయం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. భయపడేవారు ఎవరూ లేరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీస్తారనే భయంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. అధికారం శాశ్వతం అనే భ్రమలో కూటమి నాయకులు ఉండటం విచారకరం అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు తెరతీసి ప్రజాస్వామాన్ని మంటగలిపారని విమర్శించారు. -
‘గురు’ వైభవం
గురు పౌర్ణమి కావడంతో శ్రీమఠంలో గురువారం భక్తుల రద్దీ కనిపించింది. రాఘవేంద్రుల మూల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమఠంలో వెండి రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. – మంత్రాలయం రూరల్వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిల్లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతకు మించి పథకాలను ప్రజలకు అందించారన్నారు. పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు అని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారన్నారు. కొత్త పింఛన్ల మంజూరు విషమే మరచిపోయారన్నారు. సమావేశంలో నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీలు రేగటి రాజశేఖర్రెడ్డి, బుగ్గన నాగభూషణంరెడ్డి, గోకుల లక్ష్మి, మున్సిపల్ చైర్మన్లు సప్తశైల రాజేష్, చలంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బద్దల రాజకుమార్, శివలక్ష్మీ, వలంటీర్ జిల్లా విభాగం అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతం -
తూతూ మంత్రంగా..
కొత్తపల్లి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ 2.0 తూతూ మంత్రంగా సాగింది. కొన్ని పాఠశాలలో తల్లిదండ్రులు రాగా, మరికొన్ని పాఠశాలలో అరకొర మందితోనే సమావేశాలు నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో సెమియానాలు, రంగుల జెండాలు కట్టి ప్రజాథనం వృథా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కార్యక్రమం మధ్యలోనే కొంతమంది తల్లిదండ్రులు ఇళ్లకు వెళ్లిపోయారు. తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకు పోయేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. గువ్వలకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జీవనోపాధి కోసం వలస వెళ్లారని, సీజనల్ హాస్టల్ వసతి కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వెళ్తున్న విద్యార్థుల తల్లులు -
● శ్రీశైలంలో భక్తులకు భారమైన వసతి గదుల అద్దె ● ఇబ్బందులు పడుతున్న సామాన్య భక్తులు ● రద్దీ రోజుల్లో ఆరుబయట సర్దుకోవాల్సిందే
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర సందర్శనకు రోజురోజుకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సామాన్య భక్తుడు కుటుంబ సభ్యులతో రెండు రోజుల పాటు క్షేత్రంలో విడిది చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అంతేకాకుండా వసతి గదులు తక్కువ, రద్దీ రోజుల్లో భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో క్షేత్రానికి విచ్చేసిన భక్తులందరికీ వసతి గదులు లభించడం కష్టతరంగా మారింది. క్షేత పరిధిలో దేవస్థానం తరఫున వీఐపీ కాటేజీలు 33, గంగా, గౌరీ సదన్ 140, పాతాళేశ్వర సదన్ 50, మల్లికార్జున సదన్ 65, గణేశ సదన్ 224, అంబాసదన్, కుమార సదన్ 80, డార్మెంటరీలు 2, సిద్దిరామప్ప షాపింగ్ కాంప్లెక్స్లో సూట్ రూమ్స్, హాల్స్ (100మంది వసతి పొందే) 10 ఉన్నాయి. దేవస్థానం వసతి గదుల్లో సుమారు 6 వేల మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. అలాగే క్షేత్ర పరిధిలో 55 కుల సంఘాల చెందిన అన్నతాన సత్రాలు ఉన్నాయి. అన్ని సత్రాలను కలుపుకుంటే సుమారు 5 వేల వసతి గదులు ఉంటాయి. సత్రాల ద్వారా 20 వేల మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. దేవస్థానం, సత్రాల వసతి గదులను కలుపుకుంటే సుమారు 25 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 20వేల మంది భక్తులు, శని, ఆది, సోమవారాల్లో 20 వేల నుంచి 35 వేల మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. ముఖ్యమైన పర్వదినాల్లో 40వేల నుంచి 60వేల మంది భక్తులు క్షేత్రానికి తరలివస్తారు. రద్దీ రోజుల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులకు వసతి కష్టాలు తప్పడం లేదు. క్షేత్ర పరిధిలో ఉన్న వసతి గదుల కంటే రెండు రెట్లు అధికంగా భక్తుల రాక ఉండడంతో భక్తులకు వసతి కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఇతర దేవస్థానాల మాదిరి కాకుండా శ్రీశైల యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా వసతి సౌకర్యానికి శ్రీశైలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో భక్తులకు వసతి కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. రద్దీ రోజుల్లో ఆరుబయట సేద తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం.. శ్రీశైల యాత్రకు విచ్చేసిన భక్తులను వసతి కష్టాల నుంచి గట్టెకించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. అదనంగా వసతి గదులు నిర్మించేందుకు బోర్డులో చర్చించి రూ.52 కోట్ల అంచనా వ్యయంతో 200 గదుల వసతి సముదాయాన్ని నిర్మించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం పంపారు. అయితే ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గణేశ సదన్ సామాన్యులకు దూరం.. క్షేత్ర పరిధిలో సందర్శనీయ స్థలాలు ఉండటంతో భక్తులు కనీసం ఒక రోజు ఇక్కడే ఉండాల్సి వస్తుండటంతో వసతి కోసం గదులు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైల యాత్రకు విచ్చేసిన ఓ కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) క్షేత్రంలో విడిది చేయాలంటే ఒక్క రోజు ఎంత తక్కువ అద్దె అయినా కనీసం రూ.800 పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ మంది ఉంటే రెండు రూములు తీసుకోవాల్సిందే. మల్లికార్జునసదన్లో వసతిగది అద్దె రూ.1,200, సూట్రూము రూ.1,700, గణేశసదన్లో రూ.2000, వీఐపీ కాటేజీలు రూ.5 వేల నుంచి 10వేల వరకు ఉన్నాయి. శ్రీశైలంలో రెండు, మూడు రోజుల పాటు బస చేసి స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు చుట్టుపక్కల ఉన్న సందర్శనీయ స్థలాలను సందర్శించాలంటే ఆర్థిక భారమవుతోంది. ఈశ్వరా.. భక్తులకు వసతి కష్టాలు ఇంకెన్నాళ్లు! టీటీడీ తరహాలో వసతి కల్పనకు ప్రణాళికలు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానంలో కూడా సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశాం. అమెరికాకు చెందిన ఓ డోనర్ సామాన్య భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాతల సహకారంతో వసతి సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. పెద్ద డార్మెంటరీలను నిర్మించి రూ.100కే బెడ్, లాకర్, స్నానానికి, బాత్రూం సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన ఈఓ -
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దు
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెపాపరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీచౌక్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజులు మాట్లాడారు. కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చెయ్యాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. – అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మలమ్మ, నాయకురాలు సునీత, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, కార్మిక, రైతు, వామపక్ష పార్టీల నాయకులు తోట మద్దులు, మహమ్మద్గౌస్, ప్రసాద్, శ్రీనివాసులు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే పెద్ద ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ఉన్నామని హెచ్చరించారు. వామపక్ష ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్, వెంకటలింగం, పుల్లా నరసింహులు, లక్ష్మణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలదుర్గన్న, శ్రీనివాసులు, ఓబులేసు తదితురులు పాల్గొన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి సార్వత్రిక సమ్మెలో కార్మిక, రైతు సంఘాల నాయకులు -
ఆరు నెలల్లో రూ.1.30 కోట్లు
● ఇదీ మద్యం బాబులు చెల్లించిన జరిమానా ● డ్రంకెన్ డ్రైవ్లో ఈ ఏడాది 4,123 మందిపై కేసులు నమోదు కర్నూలు: మద్యం బాబులు ఆరు నెలల్లో అక్షరాలా రూ.1.30 కోట్లు జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధికో మద్యం దుకాణం... అడుగుకో బెల్టు షాపును ఏర్పాటు చేసి ప్రజల ఒళ్లు, ఇళ్లను గుల్ల చేస్తోంది. మనిషి బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యాన్ని వాడవాడలా ఏరులై పారిస్తోంది. చాలామంది యువకులు మద్యం మత్తులో వాహనాలు తోలుతూ కొందరు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడుతుండగా, మరికొందరు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కూడా జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. గత ఆరు నెలల్లో జిల్లాలో 4,123 మంది డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేసి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా అక్షరాలా రూ.1.30 కోట్లు జరిమానా రూపంలో చెల్లించారు. మద్యం బాబులపై నెలవారీగా నమోదైన కేసులు జనవరి 142 ఫిబ్రవరి 1011 మార్చి 694 ఏప్రిల్ 756 మే 636 జూన్ 884 మొత్తం 4123 -
‘సంక్షేమం’ కంటే కోతలే అధికం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పాణ్యం: రాష్ట్ర ప్రజలకు కొత్తగా సంక్షేమ పథకాలు ఇవ్వడం కంటే ఉన్న పథకాల్లో కోతలు కోయడమే ఎక్కువ అయ్యిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. భూ పనపాడు గ్రామంలో ‘‘బాబుషూరిటీ.. మోసం గ్యా రెంటీ’’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల పింఛన్లకు కోత పెట్టి ఆ సొమ్ముతో పింఛన్ పెంచినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఖరీఫ్ ప్రారంభమై నా పొలాలకు ఇంకా సాగునీరు ఇవ్వలేదని, రైతులకు యూరియా కూడా అందడం లేదన్నారు. చంద్రబాబు హామీలు అమలు కాక రాష్ట్రంలో ప్రతి కుటుంబం రూ. లక్షకుపైగానష్టపోయిందన్నారు.అక్కచెల్లెమ్మలకు ఒక్క పైసా అందించలేదన్నారు. కాగా.. గ్రామంలో ప్రతి గడప వద్దకు వెళ్లి చంద్రబాబు మెనిఫెస్టో చూపించగా మహిళలు, వృద్ధులు మోసపోయామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. దారుణం భూపనపాడు గ్రామంలో పర్యటిస్తున్న కాటసాని రాంభూపాల్రెడ్డికి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్లను చూపించారు. బ్యాగులు చినిగిపోతున్నా యని, చాలా సార్లు కుట్టించినా నిలబడడం లేదని చె ప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల క్రితం ఇచ్చిన బ్యాగులను, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన బ్యా గులను కాటసాని పరిశీలించారు. జెట్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి , ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, సర్పంచ్ జనార్దన్, శేషిరెడ్డి, శ్రీనాథ్రెడ్డి, మహీధర్రెడ్డి , వైఎస్సార్సీపీ పంచాయతీ విభాగం జిల్లా అధ్యక్షులు రామలక్ష్మయ్య, మాజీ సర్పంచ్ క్రిష్ణమోహన్, సుధీర్, శివ, వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు. -
శుభంకరి..శాకంబరీ
● ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని నేడు శాకంబరీ ఉత్సవం శ్రీశైలంటెంపుల్: మహాక్షేత్రంలో ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజున శాకంబరీ ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో అమ్మ వారి మూలమూర్తిని పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలు, ఫలాలతో అలంకరిస్తారు. శాకాలంకరిణి అయిన అమ్మవారి దర్శనంతో భక్తులు పులకించి పోతారు. ఈ ఉత్సవం రోజు న అమ్మవారి ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగాణంలోని రాజరాజేశ్వరీ అమ్మవారిని, సప్తమాతృకలను, గ్రామదేవత అంకాళమ్మను కూడా వివిధ రకాల కూరగాయలతో అలంకరించి విశేషపూజలు జరిపిస్తారు. ఇందుకోసం మూడు వేల కేజీలకు పైగా వివిధ రకాల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేలకు పైగా నిమ్మకాయలు, 600 వివిధ రకాల అకుకూర కట్టలు, వివిధ రకాల ఫలాలను తెప్పించారు. బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగాణాన్ని వివిధ రకాల కూరగాయలు, అకుకూరలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవం రోజున భ్రమరాంబాదేవి వారిని దర్శించడంతో దారిద్య్రం తొలగి, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా పాడిపంటలకు లోటుండదని భక్తుల విశ్వాసం. ఆకలి తీర్చిన శాకంబరీ పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గమడు అనే రాక్షసుడు తన తపశక్తితో వేదాలను అంతర్థానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్రమైన క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్హులందరూ గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరిశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి, వైదికకర్మలను పునరుద్ధరించారు. ఆ సందర్భంలోనే జగన్మాత తన నుంచి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన వాటిని సృష్టించి జీవుల ఆకలి తీర్చారు. -
బడి బ్యాగ్ చిరిగిపోతుంది!
శిరివెళ్ల: సర్వేపల్లి రాధా కృష్ణ విద్యా కిట్టు కింద కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం 25 కేజీల పుస్తకాల బరువును కూడా తాళలేకపోతున్నా యని వాపోతున్నారు. పాఠశాలలో బ్యాగులు పంపిణీ చేసి నెల తిరగక ముందే వాటి లాడలు తెగిపోవడం, కుట్లు ఊడిపోవడంతో టైలర్లను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన చాంద్బాషా మనుమళ్లు అస్లాం, అక్రంలు ఉర్దూ బాలుర ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వారికిచ్చిన బ్యాగ్లు కుట్లు ఊడిపోవడంతో బడికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, టైలర్ వద్ద కుట్టించిన తర్వాత తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. ఏడాదంతా నాసిరకం బ్యాగులతో విద్యార్థులు ఎలా చదువులు సాగించాలని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. -
మాట తప్పిన నాయకులను నిలదీద్దాం
● చంద్రబాబు మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దాం ● సూపర్ సిక్స్ అమలులో కూటమి వైఫల్యం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసానినందికొట్కూరు: ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి మొహం చాటేసిన కూటమి నేతలను నిలదీద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ సమీపంలోని చాముండి ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం క్యూఆర్ కోడ్ను కాటసాని, పార్టీ జిల్లా పరిశీలకురాలు కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, డాక్టర్ దారా సుధీర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూపర్సిక్స్ పథకాలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కూటమి గెలిచి చివరకు ప్రజలు మోసపోయారన్నారు. సూపర్ సిక్స్లో చెప్పినట్లుగా అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ సీ్త్రనిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు పథకాలు ఏడాది పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై హత్యాచారాలు జరుగుతున్న కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. ముచ్చుమర్రిలో చిన్నారి ఆచూకీ ఇంత వరకు కనిపెట్టలేదంటే ఎంత దారుణమన్నారు. చంద్రబాబు మోసాలను ఇంటింటికీ తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ కుటుంబానికి వీడదీయలేని బంధం ఉందని గుర్తు చేఽశారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు సాగు, తాగు నీరు అందుతుందంటే వైఎస్సార్ చలవేనన్నారు. ● ఎమ్మెల్సీ ఇసాక్బాషా, జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. సూపర్సిక్స్ పథకాలు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, జడ్పీటీసీలు యుగంధర్రెడ్డి, పుల్యాల దివ్య, జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్రెడ్డి, కౌన్సిలర్ మంగళి కృష్ణ, సర్పంచులు జనార్దన్గౌడ్, నాగార్జునరెడ్డి, నాయకులు శివరామకృష్ణారెడ్డి, లోకేష్రెడ్డి, రమేష్నాయుడు, పుల్యాల నాగిరెడ్డి, కోకిల రమణారెడ్డి, నాగభూషణంరెడ్డి, లడ్డూ, అబుబక్కర్, రాజు, జబ్బార్, తిరుమల్లేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, స్వామిదాసు, మాధురి, సురేష్, ఉపేంద్రారెడ్డి, సులోచన, శ్రీకాంత్, జగన్ రఫి, బంగారు, శివ, సుధాకర్రెడ్డి, మాసుంబాషా, మల్లయ్య, విజయకుమార్, రమణ, భాస్కరరెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘పోతిరెడ్డిపాడు’ నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,86,079 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 882 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 881 అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్రెగ్యులేటర్ 2,4,5,6 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. నేడు పీఏసీఎస్ల సీఈఓలకు అవగాహన సదస్సు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓలు, సిబ్బందికి ఈ నెల 9న బనవాసిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పీఏసీఎస్ల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. అదే విధంగా సహకార సంఘాల బలోపేతంపై కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సుల్లో బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాఘవేంద్ర కూడా పాల్గొంటారన్నారు. సమ్మెకు బ్యాంకుల మద్దతు కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 9న జరిగే సార్వ త్రిక సమ్మెలో బ్యాంకులు కూడా పాల్గొననున్నా యి. ఏఐబీఈఏ, ఏఐబివోఏ, బీఈఎఫ్ఐ, ఎల్ఐ సీ,జిఐసీ ట్రేడ్ యూనియన్లు బ్యాంకులు, బీమా కంపెనీల సమ్మెకు పిలుపు నిచ్చాయి. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కో–ఆపరేటివ్ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.కొన్ని కార్పొరేట్ బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకులు కూడా సేవలు అందించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సహా మిగిలిన బ్యాంకులు, ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీలు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాయని యుఫ్ బీయు జిల్లా కన్వీనర్ ఇ.నాగరాజు తెలిపారు. -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వెసులుబాటు లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్లో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులు, ఎన్జీఓలకు ఒక్కరోజు వర్క్ షాపు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు విచారణ వరకు వెళ్లకుండా త్వరగా పరిష్కారం అవుతాయన్నా రు. రానున్న 90 రోజులపాటు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు అన్ని కోర్టుల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనుజ సక్సేనా, నీనా కరే న్యాయవాదులకు, ఎన్జీఓలకు శిక్షణ ఇచ్చారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అన్నారు. దీనివల్ల కోర్టుల్లో కేసులు విచారణకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసో సియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి పాల్గొన్నారు. -
నందుల కోటతో అభివృద్ధి అనుబంధం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నంద్యాలతో ఎనలేని అనుబంధం ఉంది. నంద్యాల నియోజకవర్గానికి దాదాపు రూ. 250 కోట్లకుపైగా నిధులను అందజేశారు. రూ. 4.24 కోట్లతో నందమూరి నగర్, వైఎస్ నగర్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు వేశారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వైఎస్సార్ పర్యటించి శ్యామకాలువ, కుందూ నది, మద్దిలేరులను విస్తర్ణకు రూ. 92 కోట్లను మంజూరు చేశారు. అలాగే అప్పటి మంత్రి శిల్పా మోహన్రెడ్డి నందమూరి నగర్ పక్కన వైఎస్ నగర్ పేరుతో మోడల్ కాలనీ ఏర్పాటు చేశారు. -
మెట్టకు ప్రాణం పోసిన అపర భగీరథుడు
ఆత్మకూరు: వర్షాధార పంటలు పండే మెట్ట భూములకు మహానేత వైఎస్సార్ ప్రాణం పోసి అపరభగీరథుడుగా మారారు. ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఒకే సారి ఐదు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములను ఆయకట్టుగా మార్చారు. జలయజ్ఞంలో భాగంగా సిద్దాపురం, చెలిమెళ్ల, లింగాల, శివపురం, ఇస్కాల ఎత్తిపోతల పథకాలతో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా నీరందించారు. 2006లో ఈ పథకాలకు నిధులు మంజూరు చేయడంతో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తూ నేటికీ మహానేత మేలును తలుచుకుంటున్నారు. -
మాటలకందని అభిమానం..
నంద్యాల పట్టణం పప్పుల బట్టి ప్రాంతంలోని నామలయ్య బడి దగ్గర వీడియో గేమ్స్ షాప్ యజమాని పేరు కృష్ణమూర్తి. భార్య పుష్పలత దేవి గృహిణి. వీరికి 2006లో కొడుకు శబరీష్ పుట్టాడు. ఏడాదిన్నర తర్వాత ఆ బాలుడికి సైగలు చేసినా స్పందించకపోవడం, మాటలు రాకపోవడంతో వైద్యుడిని సంప్రదించి, పరీక్షలు చేయించారు. పుట్టుకతో మూగ, చెవిటి వాడిగా తేలింది. దీంతో కృష్ణమూర్తి దంపతులు కృంగిపోయారు. చిన్న వయస్సులోనే సర్జరీ చేస్తే మాటలు, వినికిడి శక్తి వస్తుందని స్నేహితులు సలహానివ్వడంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని 2009 ఫిబ్రవరిలోగుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. శబరీష్కు అదృష్టవశాత్తూ ఆరోగ్యశ్రీ పథకం కింద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడానికి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సర్జరీ చేయడంతో వినికిడి, మాటలు వచ్చాయి. తమ కుమారుడు శబరీష్కు బంగారు భవిష్యత్తునిచ్చిన మహానేత వైఎస్ను వారు దైవంలా భావిస్తున్నారు. కృష్ణమూర్తి తనషాపులో దేవుళ్ల చిత్ర పటాల మధ్య మహానేత చిత్రాన్ని పెట్టి పూజిస్తున్నారు. తల్లిదండ్రులతో శబరీష్ (ఫైల్) -
ప్రజల అర్జీలపై దృష్టి సారించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజల వినతుల పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతి రోజూ తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్, గడువులోపల అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో 221 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రాణదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు సోమవారం హైదరాబాద్కు చెందిన లక్ష్మీప్రసన్న కాంట్రాక్టింగ్ ఎల్ఎల్పీ వారు రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకురాలు టీ.హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. 10న శ్రీశైల భ్రామరికి శాకంబరీ ఉత్సవం శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం అషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 10న భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతో, అకుకూరలతో, పలు రకాల ఫలాలతోవిశేషంగా అలంకరిస్తారు. దేవాలయ ప్రాంగణాన్ని పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరిస్తారు. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవికి, గ్రామదేవత అంకాలమ్మ వారికి ప్రత్యేక పూజలు, విశేషంగా శాకాలంకరణ చేస్తారు. అమ్మవారికి శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. -
నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే
నేను ఒకటవ తరగతి నుంచి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి 10వరకు కంబాలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నా. 2001–08లో పదో తరగతిలో 510 మార్కులు సాధించా. అప్పుడే కొత్తగా ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంటర్, బీటెక్ పూర్తయింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. గత ఐదేళ్లుగా నెరోలాక్ పెయింట్స్లో ఇంజనీరుగా పనిచేస్తున్నా. ఇదంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. – కె.లక్ష్మీకాంతరెడ్డి, బోయబొంతిరాళ్ల భూమి ఉన్నంత వరకు వైఎస్సార్ గుర్తుంటారు హంద్రీనీవా కాలువ ద్వారా రిజర్వాయర్లోకి నీరు వస్తుంది. అక్కడి నుంచి మా గ్రామంలోని పొలాలకు నీరు అందుతుంది. ఒక్కప్పుడు నిత్యం కరువుతో అల్లాడుతున్న సమయంలో వైఎస్సార్ దేవుడిలా వచ్చారు. ఎక్కడో ప్రవహించే కృష్ణజలాలు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకరావడంతో మంచి పంటలు పండించుకుని అప్పుల నుంచి గట్టెక్కాం. ఈ భూమి ఉన్నంత వరకు వైఎస్సార్ ఇక్కడి ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. – కురువ నాగరాజు, రైతు, పుట్లూరు రెండు పంటలు పండిస్తున్నాం సిద్దాపురం చెరువు కింద రెండు పంటలు పండిస్తున్నాం. ఎత్తిపోతల పథకం మంజూరు కాకపోయుంటే కరువు కాటకాలతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ఎత్తిపోతల పథకంతో సిద్దాపురం చెరువులో పూర్తి స్థాయిలో నీరు ఉంది. ఈ నీటితో రెండో పంటకు కూడా నీరందుతోంది. ఈ పథకం మంజూరు చేసిన దివంగత నేత వైఎస్ రాజశే ఖర్రెడ్డిని నిత్యం స్మరించుకుంటున్నాం. – యేసేబు, ఆత్మకూరు 4 శాతం రిజర్వేషన్తో డాక్టర్ అయ్యా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దే. ఈ రిజర్వేషన్ మాలాంటి వారికే ఎంతో ఉపయోగపడింది. వైద్యవిద్యను అభ్యసించేందుకు అవకాశం కలిగింది. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో (ఎమర్జెన్సీ మెడిసిన్), డీఎన్బీ విద్యను బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో పూర్తి చేశా. మెడిసిన్ విద్యను పూర్తి చేయడంతోనే నా కల సాకారమైంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ వంటి వాటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్సార్ అప్పట్లో అమలు చేశారు. ఎంతో మంది సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చి ప్రస్తుతం ఉన్నతంగా జీవిస్తున్నారు. – మహమ్మద్ రఫీ, చాబోలు, నంద్యాల మండలం ● -
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
నంద్యాల: ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ హోటల్లో బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ను వైఎస్సార్సీపీ నాయకులు విడుదల చేశారు. ఈ సమావేశానికి జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, రాష్ట మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. సూపర్సిక్స్ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసగించిన తీరును ఇంటింటికీ వైఎస్సార్సీపీ క్యాడర్ వెళ్లి వివరించాలన్నారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని కాట సాని భరోసా ఇచ్చారు. గ్రామ, పట్టణ వార్డు స్థాయిలో వైఎస్సార్సీపీని సంస్థాగతంగా పునర్ నిర్మాణం చేపట్టాలన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ప్రతి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో స్కాన్ చేయించి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషాలు మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు గురించి కార్యకర్తలు, నాయకులు వివరించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ● కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మాజీ చైర్పర్సన్ దేశం సులోచన, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ మాజీ సలహాదారుడు డీఎస్ హబీబుల్లా, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్బాషా, సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పురుషోత్తమరెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, రాకేష్రెడ్డి, విజయశేఖర్రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, నెరవాటి సత్యనారాయణ, బసవేశ్వరరెడ్డి, అనిల్అమృతరాజ్, రామసుబ్బయ్య, రసూల్ ఆజాద్, కారురవికుమార్, రమణ, గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, సాయిరాంరెడ్డి, మాధవరెడ్డి, ప్రతాపరెడ్డి, సైమాన్, శెట్టిప్రభాకర్ పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి క్యూఆర్ కోడ్తో వివరిద్దాం రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం
● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు. ● దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55కోట్లతో తాగునీటిని అందించారు. ● వెల్దుర్తి మండలం మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో రిజర్వాయర్ నిర్మించి 5,100 ఎకరాలకు సాగునీటిని అందించారు. -
‘జల’హో రాజన్న!
కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న మహానేత సంకల్పం జలయజ్ఞంతో సాకారమైంది. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401కోట్లతో 12కి లోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞ పనులను నిర్లక్ష్యం చేయడంతో పది శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. జిల్లాతోపాటు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు శాశ్వితంగా తాగునీరు, సాగునీటి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంలో అవుకు రిజర్వాయర్కు అనుసంధానంగా గత ప్రభుత్వం రూ. 300 కోట్లతో 5.9 కిమీ పొడవునా మూడో సొరంగం నిర్మాణం చేపట్టింది. అవుకు రిజర్వాయర్ -
‘కూటమి’ మాట.. నీటి మూట!
● సాగునీటి కాలువలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● ఎన్నికల్లో హామీలను గాలికి వదిలేసిన టీడీపీ నేతలు ● హంద్రీ–నీవా నీటి వాటాపై గందరగోళం ● 68 చెరువులకు నీటి విడుదలకు నిధులేవీ? ● నేడు సాగు నీటి సలహా మండలి సమావేశం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) సాగునీటి వనరు విస్తీర్ణం కేసీ కెనాల్ 3,763 ఎల్ఎల్సీ 1,51,134 ఆలూరు బ్రాంచ్ కెనాల్ 14,255 హంద్రీనీవా 60,000 జీడీపీ 24,372 చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 27,707, లిఫ్ట్ల కింద 20 వేల ఎకరాల ఆయకట్టు ఉందికర్నూలు సిటీ: ‘ తాము అధికారంలోకి వస్తే సాగు నీటి ప్రాజెక్టులు చేపడతాం...పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..స్థీరికరించిన ఆయకట్టుకు సమృద్ధిగా సాగు నీటిని అందిస్తాం’ అని ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాట ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి ఏడాది దాటినా సాగునీటి కాలువల మరమ్మతులు చేయలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టులు అడుగు ముందుకు పడడం లేదు. జిల్లాలోని పశ్చిమ పల్లెల గొంతెండుతోంది. పంటలకు సాగు నీరు లేకపోవడంతో ఇప్పటికే వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలస వెళ్లాయి. నేడు(సోమవారం) ఖరీఫ్లో ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించేందుకు సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు, ఆయా సాగునీటి ప్రాజెక్టు కమిటీల చైర్మెన్లు హాజరుకానున్నారు. రైతుల కష్టాలు, ప్రజల ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవీ సమస్యలు.. ● టీబీ డ్యాం గేటు గతేడాది కొట్టుకపోవడంతో జలాశయం సామర్థ్యాన్ని 105.6 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గించారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా డ్యాం నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అదే నీరు తుంగభద్ర దిగువ కాలువకు విడుదల చేస్తే జిల్లాలోకి పశ్చిమ పల్లె ప్రాంతంలోని ఆయకట్టుకు ప్రయోజనం ఉంటుంది. ● ప్రస్తుతం తుంగభద్ర నదికి వరద నీరు వస్తోంది. నదీ తీరంలో ఉన్న ఎత్తిపోతల పథకాల లిఫ్ట్లు పనిచేయడం లేదు. ● జిల్లాలోని సాగు నీటి కాలువలు, ఎత్తిపోతల పథకాలు, మేజర్ చెరువుల తూములను ఏటా ఖరీఫ్కు ముందే మరమ్మతులు చేయాలి. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పైసా కూడా ఇవ్వలేదు. ● చెరువులు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు, ఎల్ఎల్సీ నిర్వహణకు ఈ ఏడాది రూ.11.65 కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు సగం కూడా మొదలు కాలేదు. జీఎస్టీ కారణంతో టెండర్ పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ● హంద్రీ– నీవా పరిధిలో జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది సగం ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు. ఈ ఏడాదైనా హంద్రీ–నీవాలో జిల్లా వాటా నీరు ఎంతో కూడా స్పష్టత లేదు. మొత్తం 68 చెరవులకు నీరిచ్చేందుకు చేపట్టిన పథకం నిర్వహణకు నిధులు కేటాయింపే లేదు. కరువు కనిపించదా? తుంగభద్ర, హగేరి నదులపై గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. గుండ్రేవులపై గతేడాది అసెంబ్లీలో చర్చించినా హామీ మాత్రం ప్రభుత్వ నుంచి రాలేదు. హహగేరి నదిపై గత ప్రభుత్వం చేపట్టిన వేదావతి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పెండింగ్లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలి. గతేడాది కేటాయించిన తాత్కాలిక, ఈ ఏడాది కేటాయించిన వార్షిక బడ్జెట్లో పైసా నిధులు కేటాయించలేదు. ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయలేదు. -
పొగాకు రైతులను ఆదుకోవాలి
నంద్యాల(అర్బన్): జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు కోరారు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం వారు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్కు వినతిపత్రం పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో రైతులను మోసం చేసిన ప్రయివేట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నెలఖరులోగా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చిన వ్యవసాయాధికారులు మాట మార్చడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇతర జిల్లాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ల ద్వారా కొనుగోలు జరిపిస్తున్నారన్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక పోవడం అన్యాయమన్నారు. మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వమే రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును క్వింటా రూ. 15 వేలుతో కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నాయకులు సుబ్బరాయుడు, సురేష్ ,నరసింహ పొగాకు రైతులు వెంకటేశ్వర గౌడ్, నారాయణ, శ్రీరాములు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం అడ్డుకట్టగా మారి!
జూపాడుబంగ్లా: అధికారుల నిర్లక్ష్యం నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా మారింది. సాగునీటి కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ‘గేట్లెత్తాం.. మా పనైపోయింది’ అన్నట్లుగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పర్యవేక్షణ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆదివారం హెడ్రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యాంలో 878.40 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ఐదో గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు 2, 4, 5, 6, గేట్లను అడుగు మేర ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 9వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం పెరిగేకొద్ది పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను పెంచే అవకాశాలున్నాయి. అయితే హెడ్రెగ్యులేటర్ దిగువన సమీపంలోనే నీటి ప్రవాహానికి మట్టికట్ట అడ్డుగా మారింది. పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఎస్సారెమ్సీ లైనింగ్ పనులను పీఎన్సీ కంపెనీ దక్కించుకోగా.. వారు వ్యామ్ కంపెనీ వారికి సబ్కాంట్రాక్టు అప్పగించారు. హెడ్రెగ్యులేటర్ సమీపంలో మట్టికట్టను వేసి వేసవిలో లైనింగ్ పనులు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు మట్టికట్టను తొలగించకపోవటంతో పోతిరెడ్డిపాడు నుంచి విడుదలయ్యే నీటిప్రవాహానికి మట్టికట్ట అడ్డంకిగా మారింది. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు తొలగించకపోవడంతో నీటి విడుదలకు హాజరైన ప్రజా ప్రతినిధులు, రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. వీబీఆర్కు చేరిన కష్ణా జలాలు వెలుగోడు: కృష్ణా జలాలు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు చేరాయి. ఎగువ నుంచి వరద నీరు కష్ణానదిలోకి వచ్చి చేరడంతో పోతిరెడ్డిపాడు వద్ద ఆదివారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా 5 వేల క్యూసెక్కుల నీటిని వీబీఆర్కు మళ్లించారు. వెలుగోడు జలాశయం గరిష్ఠ నీటిమట్టం 16.95 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.8 టీఎంసీలు ఉన్నాయి. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందిన సేవలు...
మంచానికే పరిమితమైన కుమార్తె స్వరూపకు నీళ్లుతాపుతున్న సారమ్మది దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామం. పుట్టుకతోనే మస్థిస్కా వ్యాఽధితో బాధపడుతున్న స్వరూపను వారానికికో పది రోజులకో ఒక సారి 40 కిలో మీటర్ల దూరం ఉన్న నంద్యాల ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి. ప్రత్యేకంగా ఆటో బాడుగకు తీసుకోవాల్సి ఉండటంతో పేద కుటుంబమైన వీరికి ఆర్థిక భారంగా మారేది. అయితే గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో స్పెషలిస్ట్ డాక్టర్ ఇంటి దగ్గరకే వచ్చి ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చేవారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇంటి దగ్గరకు కాదు కదా గ్రామానికి కూడా డాక్టర్ రాకపోవడంతో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ప్రతి నెలా రూ. 5వేల నుంచి రూ. 10 వేలు వరకు ఖర్చు వస్తోంది.. ఎలా బతకాలి’ అంటూ వృద్ధురాలు సారమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.నాడు చిన్నారి స్వరూపకు ఇంటి వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ (ఫైల్)● ఫ్యామిలీ డాక్టర్ సేవలను నీరుగార్చిన రాష్ట్ర ప్రభుత్వం ● కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ ● గ్రామాల్లో నిలిచిపోయిన వైద్య శిబిరాలు ● కార్పొరేట్ వైద్యసేవలకు దూరమైన గ్రామాలు ● ఇబ్బందులు పడుతున్న రోగులు ● ఆరోగ్య శిబిరాల్లో క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్, మొదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధులు సోకిన రోగులు లక్షలాది మందికి వైద్యసేవలు అందించారు. ప్రజలకు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసమైన 120 రకాల మందులు ఉచితంగా అందజేశారు. ● ఫిజీషియన్ ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడంతో పాటు తగు సూచనలు, సలహాలు ఇస్తుండటంతో రోగులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసేవారు. ● జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని 104 వాహనాలతో నిర్వహించారు. ● జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 2023 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు 478 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో 2.95 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. 2.70 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు 10,542 మందిని రెఫర్ చేశారు. 20,541 మందికి కేటరాక్ట్ శస్త్ర చికిత్సలు చేశారు. సుమారు 30 వేల మందికి కళ్లద్దాలు అందజేశారు. ● 2024 జనవరి నుంచి మే వరకు రెండో విడతలో 368 వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో సుమారు 2.60 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. 1,79,456 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 2,341 మందిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రెఫర్ చేశారు. 193 కేటారాక్ట్ శస్త్రచికిత్సలు చేసి, 9,547 మందికి కళ్లద్దాలు అందించారు. ఆళ్లగడ్డ: సంపన్నులకే పరిమితమైన ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మారుమూల పల్లెలకు వచ్చాయి. నిరుపేదలు సైతం ఇంటి వద్దే ఉచితంగా స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు అందుకున్నారు. నడవలేని వృద్ధులు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు సైతం ఇంటి దగ్గరకే ఉచితంగా మందులు పొందారు. అనేక రకాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో త్వరగా నయమయ్యేవి. రూపాయి ఖర్చు లేకుండా, దూర ప్రాంతాల్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే మెరుగైన వైద్య సేవలు అందేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ పథకాలపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మళ్లీ పట్టణాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. భరోసా ఏదీ? సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలోఏ ఒక్కరికి జబ్బు చేసినా ఒకే వైద్యుడి వద్దకు ఆనవాయితీ. క్రమం తప్పకుండా ఒకే డాక్టర్ వద్దకు వెళ్తుండటంతో పేషెంట్పై ఆ డాక్టర్కు ఆవగాహన ఏర్పడుతుంది. రోగుల సమస్యలు తక్షణమే తెలుసుకుని త్వరితగతిన చికిత్స అందించే వీలుంటుంది. ఇలాంటి విధనంలానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘‘ ప్యామిలీ ఫిజీషియన్’’ విధానాన్ని అమల్లోకి తీసుకు రావడంతో బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన రోగులకు ఎంతో లబ్ధి చేకూరింది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలు లేదు. దీంతో దీర్ఘకాలిక రోగులకు భరోసా దక్కడం లేదు. మంచానికే పరమితమైన వారు వైద్యం అందక దీనంగా చూస్తున్నారు. పనిచేయని విలేజ్ హెల్త్ క్లినిక్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విలేజ్ హె ల్త్ క్లినిక్స్ పట్ల చిన్నచూపు చూస్తోంది. అక్కడ పనిచేసే ఎంఎల్హెచ్పీ/సీహెచ్ఓలకు జీతభత్యాలు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఎంఎల్హెచ్పీల సమ్మె కారణంగా గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్లు మూతపడ్డాయి. దీంతో రోగం వచ్చిన ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా పీహెచ్సీల్లోని ఇద్దరు వైద్యాధికారుల్లో ఒకరు ప్రతి నెలా రెండుసార్లు 104 వాహనంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్కు వెళ్లి రోగులను పరీక్షించాలి. నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఆరోగ్య సురక్షపై కక్ష ‘ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఫలితంగా పేదలకు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందడం లేదు. ప్రతి రోజు ఆయా మండలంలోని ఒక సచివాలయంలో ఇద్దరు స్షెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాన్ని ఏర్పాటు చేసేవారు. వివిధ రకాల వ్యాధులతో శిబిరానికి వచ్చే వారికి వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందజేసేవారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి అక్కడ శస్త్రచికిత్సలు చేయించేవారు. అదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు చేయించడం, కళ్లద్దాలు కూడా అందజేసేవారు. ఆసుపత్రులకు వెల్లాల్సిన పనిలేకుండానే లక్షలాది మందికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాల ద్వార సేవలు అందాయి. కూటమి ప్రభుత్వంలో ఈ సేవలు అందడం లేదు. ప్రజలు వ్యయప్రయాసలతో ప్రాణాలను చేతులో పెట్టుకుని దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ ప్రైవేటు వైద్యమేఅనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లి రాళ్ల నన్నెబుకు సేవలు చేస్తున్న కుమారుడి పేరు యూసుఫ్. చాగలమర్రి బుగ్గరస్తాకు చెందిన నన్నెబూకు మూడేళ్ల క్రితం పక్షవాతం సోకింది. దీంతో అప్పటి నుంచి కేవలం మంచానికే పరిమితమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకు ఒకటి రెండుసార్లు ఇంటి దగ్గరకే స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి వైద్యం చేసేవారు. మధ్యలో అవసరమైతే ఫోన్ చేస్తే వైద్య సిబ్బంది వచ్చి సేవలు అందించేవారు. ప్రభుత్వం మారడంతో ఏడాదిగా వైద్యులు, సిబ్బంది ఎవరూ రావడం లేదు. దీంతో నెలనెలా ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని యూసుఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అశ్వంపై అలీ అక్బర్ పీరు ఊరేగింపు
చాగలమర్రి: మొహర్రం వేడుకల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం రాత్రి చిన్నమకానం వీధిలో కొలువైన అలీ అక్బర్ పీరును అశ్వంపై ఊరేగించారు. ఈ పీరును వివాహం కాని యువకులు ఊరేగించడం సంప్రదాయం కావడంతో యువత భారీగా తరలివచ్చింది. సంప్రదాయ మేళతాళాలతో చిన్నమకానంలో ప్రారంభమైన ఊరేగింపు లాల్ స్వామి మకానం మీదుగా పెద్దమకానం, మొయిన్ బజారు, పాతబస్టాండులోని నిర్వాహకుల ఇళ్ల వరకు కొనసాగి తిరిగి చిన్నమకానంలోని పీర్ల చావిడి వద్దకు చేరుకుంది. ఊరేగింపులో అడుగడుగునా భక్తులు పీరుకు మొక్కులు చెల్లించారు. దారివెంట స్వామి వారికి ప్రత్యేక ఫాతేహలు నిర్వహించారు. -
సీమపై చంద్రబాబుది కపట ప్రేమ
జూపాడుబంగ్లా: రాయలసీమ రైతాంగంపై సీఎం చంద్రబాబునాయుడు కపట ప్రేమ చూపుతున్నారని ప్రజా సంఘాల నాయకులు, రైతులు విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలలో జాప్యం కావడంతో ‘చలో పోతిరెడ్డిపాడు’కు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని నంద్యాల, గోస్పాడు, రుద్రవరం, ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు, రైతులు 80 బన్నూరు నుంచి పోతిరెడ్డిపాడు వరకు ర్యాలీగా బయలుదేరారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం అధ్వర్యంలో ఎస్ఐలు ఓబులేసు, లక్ష్మీనారాయణతో పాటు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, రైతుసంఘం జిల్లా సెక్రటరీ సుధాకర్ తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో 875.90 అడుగుల నీటిమట్టం చేరినా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా కొందరిని జీపులో ఎక్కించి తరలిస్తుండగా నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి సాగునీటిని విడుదలచేసే దాకా వెళ్లేదేలేదని భీష్మించి కూర్చొన్నారు. దీంతో సీఐ పోతిరెడ్డిపాడు ఈఈ నాగేంద్రకుమార్ను సంఘటనా ప్రాంతానికి రప్పించి సీఈ కబీర్బాషాతో మాట్లాడించారు. వారంలోగా నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినా వారు శాంతించలేదు. ఈనెల 6తేదీలోగా నీటిని విడుదల చేయకపోతే తామే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుబ్బరాయుడు, వీరన్న, సురేష్,రామకృష్ణ, రాముడు, కర్ణ, వాలయ్య, రంగమ్మ, ఈశ్వరమ్మ, సుధాకర్, సోమన్న, రామసుబ్బారెడ్డి, రణధీర్ రైతులు పాల్గొన్నారు. శ్రీశైలం డ్యామ్ నిండుతున్నా నీళ్లు ఇవ్వరా? చలో పోతిరెడ్డిపాడు ఉద్రిక్తత 80 బన్నూరు వద్ద రైతులు, ప్రజా సంఘాల నాయకుల అడ్డగింత -
అఖిలా.. చౌకబారు విమర్శలు మానుకో!
ఆళ్లగడ్డ: ‘ఎమ్మెల్యేగా ఉంటూ చౌకబారు విమర్శలు చేయడం సరికాదు.. నోటికి వచ్చింది మాట్లాడటం ఎంత వరకు సమంజసం. హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో’ అంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హితువు పలికారు. అహోబిలం క్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అహోబిలం టోల్గేట్ వేలంపాటల్లో తాను రూ. 25 లక్షలు డిమాండ్ చేశా నని అఖిలప్రియ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏదైనా రుజువులు ఉంటే చూపించాలన్నారు. రూ. 20 లక్షలు పాటపాడిన దానికి రూ. 25 లక్షలు తాను వాటా ఇవ్వాలని అడిగానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఇదే గేట్ వసూలుకు ఇప్పుడే రూ. 45 లక్షలు కట్టిస్తా.. అధికారులతో వేలంపాట రద్దు చేయించే సత్తా ఉందా’ అని సవాల్ విసిరారు. గతంలో రూ. 45 లక్షలు పాడిన సమయంలో రూ. 100 నుంచి రూ.150 వసూలు చేస్తే ఇప్పుడు రూ. 20 లక్షలకు పాట దక్కించుకున్న వారితో అంతకంటే తగ్గించి వసూలు చేయాలి కదా.. అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో బీ ట్యాక్స్కు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నా యన్నారు. అధికార పార్టీ నేతలు కేజీకి అదనంగా ఇవ్వాలని బెదిరిస్తున్నారని చాగలమర్రి చికెన్ సెంటర్ నిర్వాహకులు ఎస్పీకి ఫిర్యాదు చేయలేదా అంటూ గుర్తు చేశారు. అఖిలప్రియ డబ్బులకు పదవు లు అమ్ముకుంటుందోని ఆమె సొంత బాబాయ్ ఫిర్యాదు చేయలేదా.. ఇంతకంటే సాక్ష్యాలు కావాలా.. అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతల అరాచకాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు గంగుల విజయసింహారెడ్డి, కేకే రెడ్డి, సుధాకర్రెడ్డి, నరసింహారెడ్డి, నాసారి ప్రసాద్, పత్తి నారాయణ, రామచంద్రుడు, మధు, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకో అరాచకాలు ఆపకపోతే ప్రజలే తిరగబడతారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
అమ్మా వెళ్లొస్తా..!
● చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు ● తల్లి కళ్ల ముందే విషాదం ఆళ్లగడ్డ: ‘అమ్మా.. బాయ్.. బాయ్..’ అంటూ ఉదయం స్కూల్ బస్సులో వెళ్లిన చిన్నారి సాయంత్రం అదే బస్సులో తిరిగి వచ్చింది. బస్సులో బిడ్డను చూసి ఆ తల్లి కళ్లలో ఆనందం మెరిసింది. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైంది. కళ్ల ముందే బిడ్డపై బస్సు చక్రాలు వెళ్లడంతో ఆ తల్లి తల్లడిల్లింది. ఉదయం బడికెళ్తూ తన బిడ్డ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుండెలు బాదుకుంది. రక్తపుమడుగులో తడిసి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. బడి బస్సు ఆ చిన్నారి పాలిట మృత్యుశకటమైంది. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎంవీనగర్కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కూతురు హరిప్రియ (4) స్థానిక కీర్తన స్కూల్లో యూకేజీ చదువుతోంది. సోమవారం నుంచి స్కూల్కు వెళ్తుండగా రోజూ తండ్రి శ్రీధర్ వదిలి, తిరిగి తీసుకొచ్చేవారు. అయితే శుక్ర వారం నుంచి స్కూల్ బస్సులో పంపడం మొదలు పెట్టారు. స్కూల్ ముగించుకుని మొదటిసారిగా బస్సులో వస్తున్న కూతురుని దించుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయిబాబా గుడిదగ్గర తల్లి వనజ వేచి ఉంది. బస్సులో నుంచి అమ్మను చూసిన ఆ చిన్నారి ‘అమ్మా నేను దిగుతున్నా.. అని చెయ్యి ఊపుతూ’ ఇవతలి వైపున దిగింది. ఆ తర్వాత అవలి వైపున ఉన్న తల్లి దగ్గరకు వెళ్లేందుకు అడుగు ముందుకు వేసింది. అంతలోనే డ్రైవర్ బస్సు కదిలించడంతో చిన్నారి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డ మృతితో ఆ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణ సీఐ యుగంధర్, ఎస్ఐ నగీన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూఎల్బీల ఎంపికలో ప్రభుత్వం వివక్ష
డోన్: యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీ) బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లను స్థానిక సంస్థల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన, ఆర్థికంగా బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో హర్యానా రాష్ట్రంలోని గుర్గ్రామ్లో రెండు రోజులపాటు జాతీ య స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే 643 జీవో జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలకు చోటు కల్పించి ఉమ్మడి జిల్లాలను పూర్తిగా విస్మరించడంపై డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణకు లేఖ రాశారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నా రు. స్థానిక సంస్థల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ఎంతో కృషి చేస్తుందన్నారు.కేవలం రాజకీయం కోణంలో ఈ ప్రభుత్వం యుఎల్బీలను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు చేయకుండా స్థానిక సంస్థల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతటి వివక్ష చూపడం మూలంగా స్థానిక సంస్థలు ఎలా బలోపేతమవుతాయని ఆయన మంత్రి నారాయణను లేఖలో నిలదీశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క మున్సిపాలిటీకీ దక్కని అవకాశం మున్సిపల్ శాఖ మంత్రికి లేఖ రాసిన డోన్ మున్సిపల్ చైర్మన్ -
సర్కారు భూమి భళే చవక!
నంద్యాల(అర్బన్): పచ్చ నేతలు భూ బకాసురులుగా మారుతున్నారు. అక్రమార్జనకు మరిగిన వీరు ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాత్రికిరాత్రే కబ్జా చేస్తున్నారు. ఇక ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములపై కనిపిస్తే ఇక ఊరుకుంటారా.. దర్జాగా రాళ్లు పాతి ‘రండి బాబూ రండి.. ప్లాట్లు చవక.. చవక’ అంటూ బేరం పెట్టారు. మంత్రి అనుచరులు కొందరు తలా కొంత పంచుకునేందుకు భూ దందాకు తెరలేపారు. ప్రభుత్వ భూము లను ఏకంగా విక్రయానికి పెట్టారు. నంద్యాల మండలం చాబోలు గ్రామ సమీపంలోని ఇందిరా కాలనీ వద్ద సీలింగ్ యాక్టు ప్రకారం అప్పటి ప్రభుత్వం అయ్యలూరుకు చెందిన నందిరెడ్డి రైతు వద్ద నుంచి సర్వే నెం.109/1ఏలోని 1.84 ఎకరాల సీలింగ్ ల్యాండ్ను అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1982లో స్థానిక పేదలకు ఇళ్ల స్థలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆ భూములు సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్కు అప్పగించింది. గ్రామానికి చివర్లో ఉండటంతో స్థలాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పొలాన్ని గుర్తించి ఆ భూముల్లో ఆర్బీకే సెంటర్, అంగన్వాడీ, హెల్త్ క్లీనిక్లతో పాటు 72 మంది లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయిస్తూ బుక్లెట్ పత్రాలను పంపిణీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదంటూ తమకు ఎక్కువ ప్లాట్లు కావాలని కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అప్పటి ఎమ్మెల్యే శిల్పామోహన్రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే స్థలాలు అంటూ తేల్చి చెప్పడంతో కొందరు అసమ్మతి వాదులు మరికొంత మంది లబ్ధిదారులను కలుపుకొని తాత్కాలిక గుడిసెలు వేయించి కోర్టుకు వెళ్లారు. అయితే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఎన్నికల కోడ్ అడ్డురావడం, ఆ తర్వాత కూటమి నేతలు అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు రద్దు అయ్యాయి. అధికారులకు తెలిసినా చర్యల్లేవ్.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ ఇచ్చిన పట్టాలు రద్దు అయ్యాయి. కొత్త వారికి ఇస్తున్నామంటూ గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచా రం నిర్వహించారు. సెంటు రూ.1.50 లక్షలు తీసుకొని వస్తే పట్టాతో పాటు స్థలం కేటాయిస్తామంటూ నాయ కులు బేరం పెట్టారు. దాదాపు రూ.2కోట్ల విలువ చేసే సీలింగ్ ల్యాండ్ను ఆక్రమించుకోవడమే కాకుండా అమ్మకాలకు పెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నించా రు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీలింగ్ భూములను ఆక్రమించి లబ్ధిదారులకు కట్టబెట్టడంలో భారీ స్థాయిలో ముడుపులు అందడంతో పా టు అధికార పార్టీ పెద్దలు భరోసా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమి నాయకులు దర్జాగా సీలింగ్ భూముల ఆక్రమణలు చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో కూటమి నేతలకు అనుకూలమైన అధికారులను రప్పించుకుని యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. సీలింగ్ భూములు అమ్మినా..కొన్నా చర్యలు సీలింగ్ భూములను ఎవరూ అమ్మినా.. కొన్నా చర్యలు తప్పవు. గతంలో ఆ భూముల్లో లబ్ధిదారు ల ఎంపిక జరిగింది. ఆ భూముల అమ్మకాలు జరుగుతున్నాయ ని కొంత మంది మహిళలు మా దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అర్హులను గుర్తించి ఆ స్థలాల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశిస్తే స్థలం లేని పేదలందరి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. గతంలో ఎంపిక చేసిన వారికి సైతం ప్రాధాన్యతను ఇస్తాం. ఆ భూమి ఎవరూ అమ్మినా.. కొన్నా చట్టరీత్యా నేరమే. – శ్రీనివాసులు, తహసీల్దార్, నంద్యాల చాబోలులో అసైన్డ్ భూమి ఆక్రమణ కబ్జా చేసి విక్రయిస్తున్న టీడీపీ నేతలు సెంటు రూ.1.50 లక్షలుగా అమ్మకాలు అదే భూమిలో గత ప్రభుత్వంలో 72 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ స్థలాలు మాకే ఇవ్వాలంటూ పేదల ఆందోళన -
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం 875 అడుగులకు పైగా చేరుకుంది. తుంగభద్ర, హంద్రీ నది నుంచి వరదనీరు వస్తుండటంతో రిజర్వాయర్లో 167.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి వారం రోజుల క్రితమే సాగునీటిని విడుదల చేసే అవకాశం కలిగింది. శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీరిచ్చేందుకు అవకాశమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పక్క రాష్ట్రానికి చెందిన ప్రభుత్వానికి భయపడి, కేఆర్ఎంబీ నిర్ణయం సాకు చూపించి, ప్రజలకు కనీసం తాగునీటికి సైతం విడుదల చేయలేపోయింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
ఏడాది పాలనకే ప్రజలు విసుగెత్తిపోయారు
పాణ్యం: ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. గురువారం పాణ్యం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆక్రమణలు, అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోగా.. సుపరిపాలన తొలి అడుగు అంటూ ఊర్లకు వస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గొప్పగా రూ. 4 వేలు పింఛన్ ఇచ్చామని చెప్పి మరో వైపు 3 లక్షల పింఛన్లు కోత పెట్టడం చంద్రబాబుకు చెల్లిందన్నారు. తల్లికి వందనం అందక రోజూ ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం చేపట్టామన్నారు. ‘ప్రభుత్వం తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల బాండ్లను చూపి నిలదీయాలన్నారు. గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలకు రంగులు మార్చి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని హడావుడి చేస్తున్నారని విమర్శించారు. శ్రీశైలానికి వరద వచ్చినా పోతిరెడ్డిపాడు గేట్లు ఎందుకు ఎత్తడం లేదు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాటసాని -
విత్తన దుకాణాలపై దాడులు
● రూ.21 లక్షల విలువ చేసే విత్తన అమ్మకాలు నిలుపుదల నంద్యాల(అర్బన్): పట్టణంలోని పలు విత్తన దుకాణాలపై గురువారం వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు. ఏడీఏ ఆంజనేయ, ఏఓ ప్రసాదరావుల ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సాయి హిమవర్ష దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్, బిల్బుక్స్, విత్తన నిల్వలు, అనుమతి పత్రాలను పరిశీలించారు. రెండు దుకాణాలకు సంబంధించి దాదాపు రూ.21 లక్షల విలువైన విత్తనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేనందున తాత్కాలికంగా అమ్మకాలను నిలిపివేసినట్లు ఏడీఏ తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే అమ్మకాలు జరపాలని, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్.. తాగునీటి బావి కలుషితమవుతోంది! పాములపాడు: సుపరిపాలన – తొలి అడుగు అంటూ గ్రామీణ ప్రాంతాలకు వస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. గురువారం బానుముక్కల, వాడాల గ్రామాల్లో పర్యటించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యకు పలు చోట్ల ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. బానుముక్కల గ్రామంలో అపరిశుభ్రత తాండవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చెరువుకట్ట బావి వద్ద వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా మారుతుందన్నారు. ఆ నీరంతా బావిలోకి చేరి నీరు కలుషితమవు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆ బావి చుట్టు పక్కల 100 కుటుంబాలున్నాయని, వెంటనే మంచినీటి సౌకర్యం, నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. 26న రెడ్క్రాస్ జిల్లా సమావేశం నంద్యాల(వ్యవసాయం): జిల్లా రెడ్క్రాస్ సాధారణ సమావేశం ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక పీజీఆర్ఎస్ భవనంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు, ప్యాట్రన్లు, వైస్ ప్యాట్రన్లు, అసోసియేట్ సభ్యుల సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సొసైటీ మూడు సంవత్సరాల ఆడిట్ నివేదిక, నూతన కార్యనిర్వాహక కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. డోన్లో ఐదు డెంగీ కేసులు డోన్ టౌన్: పారిశుద్ధ్యం లోపించి డోన్లో ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని 1, 16వ సచివాలయం పరిధిలో ఇద్దరు వ్యక్తులతో పాటు ముగ్గురు చిన్నారులు డెంగీ జ్వరం బారిన పడ్డారు. స్థానిక శ్రీనివాస నగర్లో ఒకే ఇంటిలో ముగ్గరు చిన్నారులతో పాటు, ఓ వ్యక్తి, శ్రీనివాస థియేటర్ సమీపంలో ఒక ఇంటిలో మకొకరికి తీవ్రంగా జ్వరం ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని మలేరియా డోన్ యూనిట్ అధికారి రాజశేఖర్రెడ్డి ధ్రువీకరించారు. పట్టణంలో పారిశుద్ధ్యంలో లోపించి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇళ్ల మధ్య మురుగు కూపాలు ఉన్నా తొలగించడం లేదని ప్రజలు వాపోతున్నారు. కర్నూలు అర్బన్ బ్యాంక్ సీఈఓ తొలగింపు కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు అర్బన్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న ఎస్ఏ రఫీక్ను విధుల నుంచి తొలగించినట్లు అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ చైర్మన్ నాగరమణయ్య తెలిపారు. ఈ నెల 2వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రూ.2.42 కోట్ల ప్రజాధనం స్వాహా’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన సెక్షన్ 51 విచారణలో ఎస్ఏ రఫీక్ పేరు కూడా ఉన్నందున విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు నాగరమణయ్య తెలిపారు. సంఘంలోని సభ్యులు, డైలీ డిపాజిట్ చేసే వారు.. ఇతరులు ఎవ్వరైన ఈయనకు ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచించారు. శ్రీమఠంలో ప్రత్యేక క్యూలైన్ మంత్రాలయం: శ్రీమఠంలో సర్వదర్శనాలకు గురువారం ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేశారు. సెక్యురిటీ గార్డులు, ఇతర సిబ్బంది క్యూలైన్ల దరి దాపుల్లోకి రాకుండా అధికారులే ప్రత్యక్ష పర్యవేక్షణకు దిగారు. మఠం ప్రధాన ముఖ ద్వారం ముంగిట కారిడార్లో స్టాఫర్లతో క్యూలైన్ విధానం అమల్లోకి తెచ్చారు. మఠం మేనేజర్లు, సూపరింటెండెంట్స్ పర్యవేక్షణలో దర్శనాలకు అనుమతించారు. ఇక సేవా భక్తులు, గ్రామ భక్తులకు మాత్రం 6,7 నంబర్ల గేట్ల క్యూలైన్లలో దర్శనాల కు అవకాశం కల్పించారు. భక్తులు ఎవ్వరూ మోసపోకుండా ఉండేందుకు ఈ విధానం దోహ దపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. -
చుట్టూ నీరు ఉన్నా ‘చుక్క’ అందని దుస్థితి. బిరబిరా కృష్ణా నది పరుగులు తీస్తున్నా.. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతున్నా.. పంట కాలువలకు సాగునీరు అందని దౌర్భాగ్యం. రైతుకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం స్వప్రయోజనాలకు ‘గేట్లు’ ఎత్తింది. పొలాలను తడిపి పైర్లకు జ
తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు● సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అందని నీరు ● యథేచ్ఛగా దిగువకు వదిలేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ● శ్రీశైలం ప్రాజెక్టులో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ● గేట్ల భద్రత సాకుతో టీబీ డ్యాంలో తగ్గిన 80 టీఎంసీల నీరు ● టీబీడ్యాం 12 గేట్లు పైకెత్తిన ఇంజినీర్లు -
పల్లె విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో సరైన విద్య అందడం లేదు. కొన్ని పాఠశాలల్లో తరగతులను మరొక స్కూల్లో విలీనం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలు అంతదూరం వెళ్లలేక ధర్నాలు సైతం చేస్తున్నారు. ఐదు తరగతులకు ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంతో బోధన కష్
శిరివెళ్ల: ఒకటికాదు.. రెండు కాదు.. యాభై ఏళ్లుగా ప్రాథమిక విద్యను అందిస్తున్న పాఠశాల మూతబడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిరివెళ్ల మండలం మోత్కలపల్లెలో 435 ఇళ్లు ఉండా..1,200 మంది నివాసం ఉంటున్నారు. అందులో ఎస్సీ, బీసీలే అధికం. గ్రామంలో 50 ఏళ్ల క్రితం ఆర్సీఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాగా ..అందులో ఐదో తరగతి వరకు చదివి చాలా మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా వారిలో ఒకరు రెండేళ్ల క్రితం, మరొకరు ఈ ఏడాడి మే నెలలో పదవీ విరమణ పొందారు. మొత్తం 45 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను మూతవేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మహానంది మండలం మసీదుపురం, గోస్పాడు మండలం దీబగుంట్ల ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించారు. ప్రతి రోజు విద్యార్థులు ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రెండు నుంచి మూడు పాఠశాలు ఉన్నాయి. ఒక పాఠశాల మూత పడితే మరో పాఠశాలలో విద్యార్థులు చేరుతారు. మోత్కలపల్లె గ్రామంలో ఉన్న ఒక పాఠశాల మూతపడితే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని సర్పంచ్ భూమా వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
విలీనం వద్దు.. మా బడే ముద్దు
ఆళ్లగడ్డ: ‘విలీనం వద్దు.. మా బడే ముద్దు’ అంటూ విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం జి.జమ్ములదిన్నెలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం ఎస్సీకాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మోడల్ స్కూల్ పేరుతో కూటమి ప్రభుత్వం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 30 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులను గ్రామంలోని మెయిన్ ప్రథమిక పాఠశాలకు తరలించారు. దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పాఠశాలను విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలనీలోని ప్రధాన రోడ్డు నుంచి పాఠశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ‘మా బడి మాకు కావాలి’ అని విద్యార్థులు పలకలపై రాసుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రోజు వారి కూలి పనులు చేసుకునే తాము ఉదయాన్నే వెళ్లాలని, పిల్లలను దూరంగా ఉండే మరో పాఠశాలకు పంపాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి రావాలంటే మెయిన్ రోడ్డు దాటుకుని వెళ్లాలని, ఈ ఇరుకు దారిలో ప్రమాదకరమైన పాడుబడ్డ బావి కూడా ఉందని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను యథావిథిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలను యథవిథిగా కొనసాగించాలని హెచ్ఎంకు వితని పత్రం సమర్పించారు. విద్యార్థుల ఆందోళన -
ఒకే గదిలో మూడు తరగతులు
సంజామల: బెంచ్లు లేవు.. పాఠ్యపుస్తకాలు రాలేదు.. బ్యాగులు కూడా ఇవ్వలేదు.. పాత యూనిఫాంలు ధరించి కొందరు.. సాధారణ దుస్తులతో మరికొందరు.. ఒకే గదిలో ఇరుకు స్థలంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు మూడు తరగతుల విద్యార్థులకు ఒకే టీచర్ పాఠాలు చెప్పాల్సి ఉంది. సంజామల మండలం ఆకుమల్ల మోడల్ స్కూల్లో దుస్థితి ఇది. ఇక్కడ ఒకలో తరగతిలో12, రెండవ తరగతిలో 19, మూడో తరగతిలో 23, నాలుగవ తరగతిలో 24, ఐదో తదరగతిలో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలు ఒకటో, రెండవ, మూడవ తరగతి విద్యార్థులకు బోధిస్తుంటే మరో ఉపాధ్యాయురాలు నాలుగు, ఐదు తరగతులను బోధిస్తున్నారు. బుధవారం ఒకే గదిలో 1,2,3 తరగతులకు చెందిన విద్యార్థులు 44 మంది విద్యార్థులకు టీచర్ బోధించాల్సి వచ్చింది. -
ఆళ్లగడ్డ డీఈ రవికాంత్ చౌదరి అరెస్ట్
నంద్యాల: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆళ్లగడ్డ ఎలక్ట్రికల్ డీఈ రవికాంత్ చౌదరిని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న బుధవారం అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణంలోని రైతునగరంలో ఉన్న రవికాంత్ చౌదరి ఇంటితో పాటు వారి బంధువుల ఇళ్లు, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో ఏకంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు టీంలుగా ఏర్పడి సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 16వ తేదీన రుద్రవరం మండలం చిన్నకంబలూరుకు చెందిన రామకృష్ణాచారి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటున్న విషయంలో విద్యుత్ డీఈ రవికాంత్ చౌదరి, అతని ప్రైవేటు అసిస్టెంట్ ప్రతాప్లను అరెస్ట్ చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఇతనిపేరుపై ఉన్న లాకర్ నుంచి 2 కేజీల 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు జమ చేశామన్నారు. ఆ సమయంలో అతని ఇంట్లో సోదాలు చేయగా డాక్యుమెంట్లు కొన్ని లభించాయని, వాటిని పరిశీలించగా రవికాంత్ చౌదరికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దీంతో రవికాంత్ చౌదరిపై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు చేసి అతని ఇల్లు, వారి బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడి చేశామన్నారు. ఈ దాడిలో అనేక స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయన్నారు. డీఈ జీతం, ఇతడు సంపాదించిన ఆస్తులు పరిగణలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అరెస్ట్ చేశామన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు సోదాలు భారీగా స్థిరాస్తి పత్రాలు స్వాధీనం -
సమస్యల ‘తొలిఅడుగు’
కొత్తపల్లి: తొలిఅడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా గువ్వలకుంట్ల, జి.వీరాపురం గ్రామాలకు వెళ్లిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు సమస్యలు ఎదురయ్యాయి. పక్కా గృహాల్లేక కొట్టాల్లోనే నివాసం ఉంటున్నామని, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని పలు సమస్యలను ప్రజలు చెప్పారు. గువ్వలకుంట్ల ఎస్సీకాలనీలో రోడ్డు వెంట వర్షం నీరు నిలుస్తోందని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాలెంచెరువు గూడెంకు వెళ్లేందుకు రోడ్డు అధ్వానంగా ఉందని చూపించారు. బ్రహ్మంగారి నగర్లో విద్యుత్ స్తంభాలులేక ఇబ్బందులు పడుతున్నామని, జి.వీరాపురం గ్రామంలో ఎస్సీకాలనీ మొత్తం రోడ్లవెంట వర్షం నీరు నిలుస్తోందని.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. నందికొట్కూరు ఎమ్మెల్యేకు ప్రజల నుంచి సమస్యల వెల్లువ -
స్టాంపుల కొరత.. క్రయవిక్రయాలకు అవస్థ
కర్నూలు(సెంట్రల్: జిల్లాలో స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదే క్రమంలో ఈ–స్టాంపులకు డిమాండ్ ఉండడంతో వెండర్లు వాటిని మూడు, నాలుగు రెట్లు పెంచి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా రిజిస్ట్రేషన్ శాఖాధికారులు తమకేమి సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలకు వస్తున్నాయి. అధిక ధరలకు విక్రయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అందుబాటులోలేవు. ఇందుకు ప్రధాన కారణం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కావాల్సినన్నీ అందుబాటులో ఉంచకపోవడమే. దీంతో పూర్తిగా ఈస్టాంపులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెండర్లు రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపును రూ.40లకు, రూ.20 స్టాంపును రూ.50 లకు, రూ.50 స్టాంపును రూ.100, స్టాంపు రూ.160 వరకు అధికంగా అమ్ముకుంటున్నారు. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎవరైనా ఎక్కువ రేట్లకు ఎందుకు అమ్ముతున్నారంటే వారికి స్టాంపులు ఇవ్వడంలేదు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే జిల్లా రిజిస్ట్రార్ అందుబాటులో ఉండడంలేదు. ప్రస్తుతం రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్ లేకపోవడంతో నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ జానకీదేవి విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయించే బుకింగ్ పాయింట్ నాలుగైదు నెలల నుంచి మూత పడింది. ఇటీవల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని ఏసీబీ అక్రమ కేసులో ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నా ఎవరినీ నియమించకపోవడంతో ఏకంగా స్టాంపుల విక్రయ స్టాల్నే మూసివేశారు. మూతపడిన స్టాంపుల కౌంటర్ జిల్లాలో అన్ని రకాల స్టాంపుల కొరత నెలకొంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు అస్సలు అందుబాటులో లేకపోవడంతో ఈస్టాంపులతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే బ్యాంకులు వినియోగించే ఫ్రాంక్లిన్ స్టాంపులు, రెవెన్యూ, కోర్టు, స్పెషల్ అదెసివ్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. ఇందులో రెవెన్యూ స్టాంపులు పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. మిగిలిన అన్ని రకాల స్టాంపులను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయమే ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో ఉన్న వాటిని వెండర్లు అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ స్టాంపుల విక్రయాలకు సంబంధించిన కౌంటర్ను మూసి వేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అడిగితే మాత్రం తమ దృష్టి రాలేదని, పరిశీలన చేసి విక్రయదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్పడం విశేషం. కృత్రిమ కొరతకర్నూలు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం జిల్లాల(మార్కాపురం నియోజకవర్గం) కు సంబంధించిన ఈ–స్టాంపింగ్ స్టాక్ హోల్డర్ ఈస్టాంపులను సక్రమంగా సరఫరా చేయకుండా అప్పుడప్పుడు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. క్రయ, విక్రయాదారులకు అవసరమైన ఈ–స్టాంపులను గుర్తింపు పొందిన వెండర్లకు సరఫరా చేయాల్సి ఉన్నా చేయడంలేదు. ఇందుకు ఆయన వెండర్లకు ఓ షరతు పెడుతున్నారు. తన ఖాతాలో రిజిస్ట్రేషన్లకు వినియోగించే చలాన్లను వినియోగదారుల ద్వారా చెల్లించేలా చేస్తేనే ఈ స్టాంపులను ఇస్తానని చెబుతున్నట్లు వెండర్లు వాపోతున్నారు. ఫలితంగా ఆయన సమయానికి ఈస్టాంపులను ఇవ్వకపోవడంతో అనుకోకుండా కొన్ని సార్లు కొరత నెలకొంటోంది. ఆ సమయంలో స్టాంపులు ఉన్న వెండర్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అందుబాటులో లేని నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ, బ్యాంకు, కోర్టు స్టాంపులు ఈ–స్టాంపులను రేటు పెంచి అమ్ముతున్న వెండర్లు మూడు నెలలుగా స్టాంపుల విక్రయ కౌంటర్ మూసివేత పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు -
భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం
● దేవదాయశాఖ డీసీ గురుప్రసాద్ మహానంది: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు సంతృప్తికర, సులభతర దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ అన్నారు. మహానంది ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రసాదాల తయారీ, ఇతర విభాగాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠరాజు, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ గురుప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓ హోదా నుంచి ఆర్జేసీ హోదా కలిగిన ఆలయాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారని చెప్పారు. ఆర్జిత సేవలతో పాటు ప్రసాదం తయారీ, అన్నప్రసాదం పంపిణీ, క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారన్నారు. ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం లేకుండా చూ డాలన్నారు. మాడవీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. స్పౌజ్ పింఛన్ల పంపిణీలో చేతులెత్తేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): స్పౌజ్ పింఛన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం వితంతు మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. ముందుగా జూన్ 12న పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచా రం చేసుకుంది. నిధులు కూడా బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. జూలై నెల పింఛన్లతో పాటు స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే మంగళవారం పింఛన్ల పంపిణీ సమయానికి స్పౌజ్ పింఛన్ల పంపిణీని నిలిపేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి వేలాది మంది మహిళలను కూటమి ప్రభుత్వం ఊరిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,319, నంద్యాల జిల్లాలో 2,463 ప్రకారం స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినా, పంపిణీలో మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. పింఛన్ల పంపిణీలో 19వ స్థానం పింఛన్ల పంపిణీలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానం, నంద్యాల జిల్లా 16వ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లాలో 2,12,985 పింఛన్లకు గాను 1,99,705 పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. -
అత్యాధునిక సాంకేతికతతో కేసుల దర్యాప్తు
● ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా నంద్యాల: కేసుల దర్యాప్తులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల పెండింగ్కు కారణాలను, కేసుల దర్యాప్తులో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎస్పీ సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాల న్నారు. గ్రేవ్, యూఐ, పీటీ, మర్డర్, సైబర్ క్రైమ్, పోక్సో, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, సాయుధ బలగాల అదనపు ఎస్పీ చంద్రబాబు, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఖాళీ జాగా.. టీడీపీ నాయకుల పాగా!
రుద్రవరం: ఎక్కడైన ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నాయకులు పాగా వేస్తున్నారు. అది లే అవుట్ అయినా.. డీకేటీ భూములైనా.. వదలడం లేదు. రెవెన్యూ అధికారులు వారించినా.. వెనకడుగు వేయడం లేదు. రుద్రవరం మండలం చందలూరు, హరినగరం సమీపంలోని నవ అహోబిల వద్ద ఉన్న ఖాళీ భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా ట్రాక్టర్లతో సేద్యాలు చేసి పాగా వేశారు. చందలూరు గ్రామానికి చెందిన ఓ దాత దాదాపు 40 ఏళ్ల క్రితం గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం 7.75 ఎకరాలు కేటాయించారు. అప్పట్లోనే ఆ పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు మారాయి కానీ.. ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేక ఖాళీగా వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్థలాన్ని లే అవుట్గా మార్చి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ వాసులకు కొంత మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. కాలనీ లో మట్టి రోడ్లు వేశారు. అలాగే మల్టీ పర్పస్ గోదాము నిర్మించారు. అలాగే అదే స్థలంలో ఓ వైపు వాగు పక్కన కొత్తగా బోరు వేసి మోటార్ అమర్చి రజకులకు కేటాయించారు. అయితే ఎస్సీలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యే సమయంలో ప్రభుత్వం మారింది. దీంతో ఇళ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయో రావో అన్న భయంతో నిర్మాణాలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ లేఅవుట్ స్థలం ఖాళీగా ఉండటంతో గ్రామ టీడీపీ నాయకుడు చౌరెడ్డి ఇటీవల ట్రాక్టరుతో దున్నేసి ఆ స్థలం తమదే అంటూ పాగా వేశాడు. అలాగే నవ అహోబిలానికి సంబంధించి అప్పటి ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి దాదాపు వంద ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. అయితే అహోబిల ఆలయ నిర్వాహకులు 12 ఎకరాల్లో పలు నిర్మాణాలు చేపట్టి మిగిలిన పొలాన్ని ఖాళీగా వదిలేశారు. గతంలో కొందరు టీడీపీ నాయకులే ఆ పొలాలను ఎక్కడ బడితే అక్కడ ఆక్రమించుకున్నారు. ఇంకా కొంత పొలం మిగిలి ఉండగా మూడు రోజుల క్రితం ఆలమూరుకు టీడీపీ నాయకుడు ఆ ఖాళీ పొలాన్ని దున్నేసి ఆక్రమించేశాడు. ఆ ఆక్రమణలపై ఆయా గ్రామాల వీఆర్వోలు చంద్రమోహన్, పుల్లయ్యలను అడగ్గా విచారణ చేసి అక్కడ జరిగిన ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెల్దుర్తి: బైక్ను కారు ఢీకొనడంతో వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన బోయ మనోహర్(19) మృతి చెందాడు. ఈ దుర్ఘటన కల్లూరు మండలం కొంగనపాడు వద్ద హైవే 44 ఓవర్ బ్రిడ్జ్పై సోమవారం జరిగింది. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. చెరుకులపాడుకు చెందిన గౌండ, కూలీలైన రామకృష్ణ, బోయ మనోహర్ కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో ఇంటి పని చేస్తున్నారు. స్వగ్రామం నుంచి ఉదయం 7 గంటలకు బైక్పై బయలుదేరారు. ఉలిందకొండ సమీపంలోని హైవేలోని కొంగనపాడు బ్రిడ్జ్ దిగంగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. బైక్పై నుంచి కింద పడిన ఇద్దరూ గాయపడ్డారు. ఉలిందకొండ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక బోయ మనోహర్ మృతి చెందాడు. మృతుడు బోయ మనోహర్ తండ్రి నాగమద్దయ్య సైతం రెండేళ్ల క్రితం వెల్దుర్తి హనుమాన్ జంక్షన్లో లూనా మోటార్ సైకిల్ను లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శివలింగమ్మ కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చికిత్స పొందుతున్న రామకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కాగా..సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఢీకొన్న కారు నంబరును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
శిరివెళ్ల: నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్కు చెందిన బచ్చు రాఘవేందర్ (36) మృతి చెందాడు. ప్రకాఽశం జిల్లా గిద్దలూరులో ఉన్న తన బంధువులను చూడడానికి కారులో వెళ్తూ మార్గమధ్యలో పచ్చర్ల వద్ద మూత్ర విసర్జన కోసం కారు దిగాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాఘవేందర్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండంగా మృతి చెందాడు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యను చంపిన భర్త అరెస్ట్ మంత్రాలయం: అనుమానం పేరుతో తాగిన మైకంలో భార్యను హతమార్చిన భర్త హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ శివాంజల్ మాట్లాడుతూ.. సూగూరు గ్రామానికి చెందిన బోయ హనుమంతు ఆయన భార్య లక్ష్మిదేవి నిద్రిస్తున్న సమయంలో మేడిగుంజతో తలపై బాది హత్య చేశారని, అనుమానం పేరుతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నారన్నారు. చెట్నెహళ్లి గ్రామ మార్గంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో హనుమంతును అరెస్టు చేశామన్నారు. -
ప్రేమ పేరుతో రూ.35 లక్షల మోసం
కర్నూలు: ‘ ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గోల్డ్ కాయిన్స్ తీసుకుని.. రూ.35 లక్షలు నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకుని ఒక మహిళ మోసం చేసింది’ అని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కర్నూలు కొత్తపేటకు చెందిన మునీర్ అహ్మద్ ఖురేషి ఫిర్యాదు చేశారు. తాను లండన్లో హోటల్ మేనేజర్గా పనిచేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఇన్స్ట్రాగామ్లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తూ రెండున్నర సంవత్సరాల క్రితం పరిచయమై, చైన్నెలోని ఇన్ఫోటెక్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిందన్నారు. తాను లండన్ నుంచి జూన్ 4వ తేదీన కర్నూలుకు వచ్చానని, 5వ తేదీ నుంచి తన మొబైల్ నంబర్ను బ్లాక్ చేసి ఆ మహిళ మోసం చేసిందని మునీర్ అహ్మద్ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 135 ఫిర్యాదులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 135 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామి ఫిర్యాదు చేశారు. ● పూణెలోని జీకే వర్క్స్ అసోసియేషన్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని, సంవత్సరానికి రూ.5 లక్షలు ప్యాకేజీ ఉంటుందని కడప పట్టణానికి చెందిన అశోక్ కుమార్ రూ.1.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేశాడని కర్నూలు మాధవీ నగర్కు చెందిన చంద్రకళ ఫిర్యాదు చేశారు. ● ఇద్దరి పిల్లలకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జిషిత్ రాణి, శ్రేయస్ రూ.4.30 లక్షలు తీసుకుని బోగస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి మోసం చేశారని కర్నూలు ఉద్యోగనగర్కు చెందిన ఆర్.ప్రకాష్ రాజు ఫిర్యాదు చేశారు. ● పత్తికొండ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెండింగ్లో ఉన్నప్పటికీ తన పొలంలోకి అక్రమంగా చొరబడి కొందరు ఆటంకాలు కలిగిస్తున్నారని తుగ్గలి గ్రామానికి చెందిన మంగలి రంగమ్మ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు పీజీఆర్ఎస్కు 135 ఫిర్యాదులు -
అఖండ సౌభాగ్యం.. వారాహి అమ్మవారి దర్శనం
కర్నూలు కల్చరల్: ఓల్డ్సిటీలోని లలితా పీఠంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సోమవారం పురస్కరించుకొని వారాహి అమ్మవారికి అభిషేకం చేశారు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం కలగాలని పసుపు కొమ్ములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులను ఉద్ధేశించి మాట్లాడారు. లలితా పీఠం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆనందంతో గ్రామస్తులు సన్మానం చేశారు
తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్కు చెందిన శ్రీనివాసులు (65) గత మార్చిలో గుండె సమస్యతో మా వద్దకు వచ్చారు. అతనికి పరీక్షలు నిర్వహించగా గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళం 70 శాతం మూసుకుపోయిందని గుర్తించాం. ఎల్ఎన్సీఏ నుంచి ఎల్ఏడీకి స్టంట్ వేయడం కష్టంతో కూడుకున్న పని. దీంతో వెంటనే రోగిని హైదరాబాద్కు తీసుకెళ్లాలని, ఇలాంటి ఆపరేషన్లు అక్కడు చేస్తారని సూచించాం. కానీ మాపై ఉన్న నమ్మకంతో ఇక్కడే చికిత్స చేయాలని కుటుంబసభ్యులు కోరారు. రిస్క్ తీసుకుని అతనికి స్టంట్ వేశాం. అన్ని జాగ్రత్తలతో చికిత్స అందించడంతో ఆయన పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అలంపూర్ గ్రామస్తులు పెద్దఎత్తున వచ్చి నన్ను ఘనంగా సన్మానించి పొగిడారు. భావోద్వేగంతో ఆనందబాష్పాలు వచ్చాయి. –డాక్టర్ ఎన్.చైతన్యకుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, కర్నూలు -
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన పోతురాజు రతన్ కుమార్, పాలకీర్తి జశ్వంత్, పోతురాజు శాంతి పవన్కుమార్, కట్ట శ్రీకాంత్ అలియాస్ విశ్వనాథ్లను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పట్టణం సూర్యరావుపేట భద్ర హైట్స్ ఫ్లాట్ నెం.105లో నివాసముంటున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ కర్నూలులోని పావని లాడ్జిలో ఉండగా తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.7.32 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐలు శేషయ్య, నాగశేఖర్, ఎస్ఐ బాలనరసింహులుతో కలసి డీఎస్పీ బాబు ప్రసాద్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. వీరి నుంచి రూ.6.40 లక్షల నగదు, నాలుగు కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామగ్రితో పాటు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాకు ప్రధాన సూత్రధారులైన దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్రెడ్డిలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు -
‘ఉపాధి’లో అక్రమాలు
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని, విచారణ చేపట్టాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో జెడ్పీటీసీలు మౌలాలి, రామకృష్ణ, ఎంపీపీ వెంకటేశ్వరమ్మ తదితరులు జేసీ డాక్టర్ బి.నవ్యను కలసి వినతితపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిందని ఆరోపించారు. సర్పంచ్లకు తల్లికివందనం ఇవ్వాలని, ఆర్టికల్స్ 73,74 ప్రకారం పంచాయతీరాజ్ విభాగాలకు అధికారాలను బదలాయించాలని కోరారు. స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నులను ఆయా సంస్థల ఖాతాల్లో జమచేయాలని, ఉపాధి హామీ పనులను పంచాయతీల ద్వారానే జరిపించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలు ఇవీ.. ● కర్నూలులోని వైన్ షాపుల్లో సిట్టింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి బహిరంగ విక్రయాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ● శరీన్నగర్ గట్టయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులను అక్కడే కొనసాగించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు. ● వెల్దుర్తి మండలం పుల్లగుమ్మిలో ఐరన్ ఓర్తో పంటపొలాలను నాశనం చేస్తున్న సీతారామయ్యపై చర్యలు తీసుకోవాలని రైతులు అర్జీ ఇచ్చారు. ● రీడిప్లాయ్మెంట్ పేరుతో ఎంపీహేచ్ఏ ఫిమేల్, సెకండ్ ఏఎన్ఎంలను దూర ప్రాంతాలకు కేటాయించడం అన్యాయమని, పూర్వ స్థానాలకు కేటాంచాలని కోరుతూ జేసీకి వినతిపత్రం ఇచ్చారు. ● ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కేజీబీవీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకందరికీ కేటాయించాలని అర్జీ ఇచ్చారు. ● నందవరం మండలం హలహర్వి గ్రామంలో వేలంపాటలతో 5.71 లక్షలకు దక్కించుకున్నామని, జూలై 2వ తేదీన మళ్లీ వేలం వేయడానికి నిర్ణయించారని, దానిని తమకే అప్పగించాలని యాపిలయ్య అర్జీ ఇచ్చారు. విచారణ చేయాలని కోరిన జెడ్పీటీసీలు -
ధరణిలో దేవుళ్లు
పోయే చూపును తెప్పించాం కోడుమూరు మండలం వలుకూరుకు చెందిన హనుమన్న (48) 2009లో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చింది. ఒక కన్ను పూర్తిగా దెబ్బతినగా మరో కంటికి గాయం కారణంగా శుక్లం వచ్చి చూపు మందగించింది. అతనికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర చికిత్స అందించి ప్రాణం పోశాం. ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు 13 సార్లు దశల వారీగా ఆపరేషన్ చేసి ఛిద్రమైన ముఖాన్ని బాగు చేశారు. తర్వాత ఒక కన్ను కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ బతుకుతున్న అతన్ని ఆసుపత్రికి తీసుకురాగా శస్త్రచికిత్స చేసి చూపు తెప్పించాం. దీంతో అతడు భిక్షాటన మానేసి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. – డాక్టర్ పి.సుధాకర్రావు, కంటి వైద్యనిపుణులు, కర్నూలు ఆమె ధైర్యం, స్థైర్యానికి హ్యాట్సాఫ్ వైద్యులుగా ఎంతో మందికి చికిత్స చేస్తూనే రోగులు చేసే ప్రయాణంలో సహచరులుగా నిలుస్తున్నాం. ఒక రోగి క్లిష్టమైన దశలను దాటి కోలుకున్నప్పుడు వారి ముఖంలో కనిపించే చిరునవ్వు మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. ఆశలు లేవనుకుంటున్న ఓ వితంతువు స్ల్కెరోడెర్మా అనే వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం, జీవించాలనే తపన ఆమెను ముందుకు నడిపించాయి. ఆమెకు మేము అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేసుకుంటూ పిల్లలకు, కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. – డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత వ్యాధి నిపుణులు, కర్నూలు ● నమ్మకమే వైద్యులకు పునాది ● పెద్దాసుపత్రిలో అన్ని రకాల ఆధునిక సేవలు ● కార్పొరేట్ ఆసుపత్రుల రాకతో మెరుగైన వైద్య సేవలు ● హైదరాబాద్కు ధీటుగా సేవలందిస్తున్న కర్నూలు వైద్యులు ● నేడు జాతీయ వైద్యుల దినోత్సవంకర్నూలు(హాస్పిటల్): వైద్యో నారాయణ హరీః. అంటే వైద్యుడు దేవునితో సమానమని అర్థం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది వీరే. రోగుల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా ఎంతో మంది వైద్యులు పడుతున్న కష్టం వర్ణణాతీతం. ఇంజినీర్లు పెద్ద పెద్ద పరికరాలతో కుస్తీ పడుతుండగా వైద్యులు మాత్రం అతి సూక్ష్మంగా కనిపించే అవయవాలు, కణాలు, రక్తనాళాలను సైతం ఒడిసిపట్టి చికిత్స చేస్తూ ప్రాణాలను నిలుపుతున్నారు. ఇటీవల ఆత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు, సౌకర్యాల వల్ల ఎంతో క్లిష్టమైన చికిత్సలు కూడా సులభంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్తో సమానంగా కర్నూలులోనూ వైద్యులు అరుదైన చికిత్సలతో సత్తా చూపుతున్నారు. పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 36కు పైగా విభాగాలున్నాయి. 1956లో 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఈ బోధనాసుపత్రి ఇప్పుడు 250 సీట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఏకై క సువిశాలమైన ఈ ఆసుపత్రికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గాక అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, రాయచోటి, ప్రకాశం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధిక సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటుగా ఎన్ని ఆసుపత్రులు వచ్చినా ఓపీ రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 2 వేలకు పైగా రోగులు ఓపీ చికిత్స పొందుతున్నారు. నిత్యం అడ్మిషన్లో ఉన్న వెయ్యి నుంచి 1200 వరకు రోగులకు సేవలు అందుతున్నాయి. -
సైకిల్పై నుంచి కింద పడి విద్యార్థి మృతి
కోవెలకుంట్ల: స్థానిక సంతపేటకు చెందిన ఓ విద్యార్థి సోమవారం రాత్రి సైకిల్పై నుంచి కింద పడి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన చాకలి మధుసూదన్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రజకవృత్తి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నకుమారుడు చరణ్(11) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రాత్రి ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన చుట్టుపక్కలి వారు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్య సిబ్బంది నంద్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం తరలించే లోపే మృతి చెందటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సైకిల్ తొక్కుతూ కింద పడి తలకు బలమైన గాయమై మృతి చెందాడా, కింద పడటంతో భయానికి గురై మృత్యువాత పడ్డాడా అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. -
ఆ మానసిక రోగి నేడు అమెరికాలో ఐటీ ఉద్యోగి
నేను కర్నూలులో 1992 నుంచి మానసిక రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాను. 25 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ ఇంటర్ పూర్తయిన తన కుమారుడిని డిప్రెషన్, ప్రవర్తనా రాహిత్య రుగ్మతలతో నన్ను సంప్రదించారు. ఆ అబ్బాయికి నేనిచ్చిన ఔషధాలు, కౌన్సెలింగ్ వల్ల మానసిక రుగ్మతల నుంచి బయటపడి ప్రస్తుతం అమెరికాలో ఐటీ ఉద్యోగిగా స్థిరపడి సంతోషంగా జీవిస్తున్నాడు. అలాగే ఒక బ్రాహ్మణ వేద పండిత విద్యార్థి మంత్రోచ్ఛారణ సరిగ్గా చేయలేకపోతున్నానని, తీవ్రమైన డిప్రెషన్కు లోనై ఆత్మహత్య ఆలోచనలతో నన్ను సంప్రదించాడు. అతనికి అందించిన చికిత్స వల్ల ప్రస్తుతం కర్నూలులో ప్రముఖ బ్రాహ్మణోత్తముడిగా సేవలందిస్తున్నారు. – డాక్టర్ బి.రమేష్బాబు, మానసిక వ్యాధుల వైద్యనిపుణులు, కర్నూలు -
ఆలయ భూమిలో టీడీపీ నేత అక్రమ బోరు
ప్యాపిలి: టీడీపీ నాయకుల బరితెగింపునకు మరో నిదర్శనం ఇది. ఏకంగా ఆలయ భూమిలో బోరు వేసి తన ఫ్యాక్టరీకి నీటిని తరలిస్తున్న వైనమిది. గొల్లపల్లి బుగ్గలోని స్థానిక శివాలయం ఆవరణలో డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు మహేశ్ ఖన్నా అక్రమంగా బోర్ వేసి శివాలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సుద్ద ఫ్యాక్టరీకి పైప్లైన్ సౌకర్యం కల్పించుకున్నాడు. అధికారుల అనుమతి లేకుండా ఏకంగా శివాలయం ఆవరణలో బోర్ వేసుకోవడం స్థానికంగా విమర్శలకు దారి తీస్తోంది. అయితే ఈ బోర్ నుంచి పైప్లైన్ వేసుకుని తన ఫ్యాక్టరీకి నీటి సౌకర్యం కల్పించుకోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుకూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నాయకులు ఈ సంఘటనపై కొద్దిరోజుల క్రితమే తహసీల్దార్ భారతికి ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కేసీ మద్దిలేటి, ప్యాపిలి మండల బీజేపీ నాయకులు దామోదర్ నాయుడు తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ తహసీల్దార్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జడ్జి ఆకస్మిక తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్జైల్ను సోమవారం మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలు, వంట, స్నానపు, తదితర గదులు పరిశీలించి సూచనలు చేశారు. ఖైదీల ఆరోగ్య వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను వలన కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను కోల్పోతామని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఖైదీలకు సూచించారు. ఆయన వెంట జైలర్ గురు ప్రసాద్ రెడ్డి, న్యాయవాది నాయక్, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.సుబ్రమణ్యేశ్వరుడి హుండీ ఆదాయం రూ. 25 లక్షలుపాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 25 లక్షలు వచ్చింది. సోమవారం భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా..రూ. 25,03,320 నగదు, 8.600 గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి వచ్చింది. మార్చి 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన బియ్యానికి వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.అన్నప్రసాద వితరణకు విరాళంశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన దురుదుండప్ప మనూరు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు దేవికకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన బి.కృష్ణారెడ్డి రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు రవికుమార్కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతలను దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. -
చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వర న్యాయం
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన చట్ట పరిధిలో ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పీఆర్ఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 160 వినతులు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వినతులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. వినతుల్లో కొన్ని.. ● పాణ్యం మండలం తమ్మరాజులపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య, గురువయ్య, తదితర రైతులు 2024లో బేయర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్ విత్తనాలు సాగు చేశారు. క్వింటాల్కు రూ.3,500 ప్రకారం కొనుగోలు చేస్తామని, నష్టం వస్తే రూ.80 వేల వరకు పరిహారం ఇస్తామని ఏజెంట్లు నమ్మించారు. పంట నష్టం జరగడంతో కంపెనీ యాజమాన్యాన్ని నష్టపరిహారం ఇవ్వమని అడగగా కొన్ని నెలలుగా తిప్పుకుంటున్నారని, నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిన్న రవి రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.14 లక్షలు తీసుకొని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండలం కంబవారిపల్లె గ్రామానికి చెందిన శంకర్నారాయణ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● గత 60 సంవత్సరాలుగా చంద్రపాల్ పొలం మీదుగా ఉన్న రస్తాలో మా పొలానికి వెళ్తున్నానని, ఈ ఏడాది నుంచి అతని పొలం మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన బండిస్వామిదాసు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ -
బాధ్యతగా వినతులు పరిష్కరించండి
నంద్యాల: ప్రజా వినతులను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితి లోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్, ర్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారులు జరిపే ఉత్తర, ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గుర్తించిన 42 వేల మంది బంగారు కుటుంబాలు, 2800 చెంచు కుటుంబాలు ఉన్నాయని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బాత్రూమ్స్, మరుగుదొడ్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 284 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డెంగీ మాసోత్సవాలను విజయవంతం చేయండి జిల్లాలో జూలై 1 నుంచి నిర్వహించే డెంగీ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో డెంగీ మాసోత్సవాలకు సంబంధించిన ప్రచార పత్రాలను జేసీ విష్ణుచరణ్, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని...
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా 5 కళాశాలలను ప్రారంభించారు. 2024లో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాలేజీలపై కక్ష కట్టింది. నిధులు కూడా మంజూరు చేయడం లేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినా విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. ఏపీలో అందుకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు ఆలోచనధోరణి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుర్దేశంతో వైద్య విద్యను పూర్తిగా పక్కన పెట్టారు. – డాక్టర్ శశికళ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ, నంద్యాల వైద్య విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోంది. 2024లో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తయినా ప్రారంభించ లేదు. దీంతో విద్యార్థులు 750 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరంలో మిగిలిన కాలేజీలను కూడా పక్కన పడేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క కళాశాలను నిర్మించలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నతంగా ఆలోచించి 17 కళాశాలల నిర్మాణం చేపడితే వాటిని కూడా అడ్డుకోవడం హేయం. – ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
అభ్యంతరాలు.. ఆందోళనలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యంతరాలు, ఆందోళనల మధ్య గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్ఎంలకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో ఉదయం 7.30 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 750 మందికి పైగా ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ, ఏవో అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వచ్చాయి. వందకు పైగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు రావడం, అందులోనూ కొన్ని సచివాలయాలకు ఎక్కువ మందికి లేఖలు ఇవ్వడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ లేఖలతో పలు సంఘాల లేఖలను సైతం పక్కన బెట్టి ర్యాంకు ఆధారంగా సాయంత్రం 200 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగించి, మిగిలిన వారికి మంగళవారం కూడా కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు ఏఎన్ఎంలు ఇతర పీహెచ్సీలకు గాకుండా పక్క పీహెచ్సీలోని సచివాలయాలకు బదిలీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు భోజన విరామాన్ని ప్రకటించి ఉన్నతాధికారుల వివరణ తీసుకుని పక్క పీహెచ్సీలకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించారు. గందరగోళంగా ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ -
పెట్టుబడి ‘మట్టి’పాలు
రుద్రవరం: ముందస్తు వర్షాలు మిరప రైతులను నట్టేట ముంచాయి. ఊరించిన వరుణుడు మొహం చాటేయడంతో పెట్టుబడి నేలపాలైంది. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, తిప్పారెడ్డిపల్లె, ఆలమూరు, చిత్రేనిపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 800 ఎకరాల్లో పచ్చి మిర్చి పంటను సాగు చేశారు. ఒక్కో ఎకరానికి రూ. లక్ష చొప్పున పెట్టుబడి పెట్టారు. నారు వేసిన నాటి నుంచి 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే 60 రోజులు దాటినా పూత, పిందె రాక ఎదుగుదల లేక పోవడంతో కొందరు రైతులు మిర్చి పంటను దున్నేసి తిరిగి మొక్క జొన్న పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్. నాగులవరం గ్రామానికి చెందిన సుబ్బ నర్సయ్య ఐదు ఎకరాల్లో మిరప సాగు చేయగా.. వర్షాలు లేక పంట పూత లేకపోవడంతో ఆదివారం తొలగించాడు. -
ఒకటి మంత్రికి.. రెండోది ఎమ్మెల్యేకు!
కర్నూలు(సెంట్రల్): సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు పాతరేసి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్న వారికి అనువైన స్థానాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆ స్థానాలను కోరుకుంటే వాటిలో మంత్రి చెప్పిన వ్యక్తి ఉన్నారని, ఎమ్మెల్యే సూచించిన వారికి ఇవ్వాల్సి ఉందని, మరో స్థానం కోరుకోవాలని నేరుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం చేపట్టిన వీఆర్వోలు, సర్వేయర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇందులో కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడంతోనే జరుగుతోందని చెబుతున్నారు. అధికారుల తీరుపై సర్వేరయర్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు, నంద్యాల డీఆర్వోలు సి.వెంకటనారాయణమ్మ, రామునాయక్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల సర్వే ఏడీలు మునికన్నన్, జయరాముడు ఆధ్వర్యంలో సర్వేయర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ముందుగా స్పౌజ్, అరోగ్యం, ఒంటరి మహిళ, మ్యూచ్వల్ విభాగాల్లో ర్యాంకుల ఆధారంగా వీఆర్వోలు, సర్వేయర్లను కౌన్సెలింగ్ పిలిచారు. వచ్చిన వారిలో ర్యాంకుల ఆధారంగా పిలిచి...మూడు ఆప్షన్లు ఇచ్చిన అధికారులు.. ‘మూడింటిలో ఒక స్థానం మంత్రి సిఫారసు ఉంది.. మరొక స్థానం ఎమ్మెల్యే మనిషికి ఇవ్వాలి.. ఇంకో స్థానం కోరుకో’ అని చెబుతుండడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖల పేరిట ఫోకల్ స్థానాలను రిజర్వ్ చేసినట్లు చేయడం అన్యాయమని వాపోయారు. సిఫార్సు అంటే ఒకటో..రెండో ఉండాలి తప్ప.. ఎక్కువ స్థానాలను వారికే కేటాయించేలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు లేని వారికి నాన్ఫోకల్ పోస్టులను ఇస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. ఎవరికీ కావాల్సిన స్థానాలు వారికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు.. సర్వేయర్లలో బదిలీల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 800 మందిలో 294 మందికి ఐదేళ్ల సర్వీ సు పూర్తి కాగా...మిగిలిన వారు రిక్వెస్టు జాబితాలో దరఖాస్తు చేసుకున్నారు.అలాగే వీఆర్వోల్లో గ్రేడు–2లో మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకొగా ఇద్దరు హాజరు కాలేదు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తైన వారు 30మంది ఉన్నారు. గ్రేడు–1 వీఆర్వోలో 14 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అయితే సర్వేయర్లు భారీ సంఖ్యలో ఉండడంతో రాత్రి వరకు కొనసాగింది. కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిఫార్సు లేఖల నేపథ్యంలో సర్వేయర్లు కౌన్సెలింగ్ను బహిష్కరించారు. దీంతో అధికారులు వారికి సర్దిచెప్పి నిబంధనలకు మేరకు ఖాళీలను చూపుతామని చెప్పి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. ముగిసిన కౌన్సెలింగ్ కర్నూలు (టౌన్): ఉమ్మడి జిల్లాకు సంబంధించి సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ప్లానింగ్ కార్యదర్శులు 155 మంది, ఎమినీటీస్ కార్యదర్శులు 170 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చి వీఆర్వో, సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ లేఖలు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్వేయర్ల బదిలీల ప్రక్రియ -
ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పింఛన్లు తప్పించి ఏ పథకం పూర్తిగా అమలు చేయకపోయినా అన్ని చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఈ మోసాన్ని ప్రజలు ఏడాది లోపే గమనించారన్నారు. -
సెలవు రోజూ తప్పని తిప్పలు
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవు అయినా సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్ ) బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మొత్తం డిజిటల్ అసిసెంట్లు 375 మంది ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సర్వీసును పూర్తి చేసుకున్న వారు 207 మంది, రిక్వెస్ట్ బదిలీలు కోరుతు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టీ లక్ష్మి, కార్యాలయ ఏఓ ప్రతిమ కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్లు ) మొత్తం 404 మంది ఉండగా, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 258, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా వారు 30 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కౌన్సెలింగ్కు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన నంద్యాల జిల్లా ఉద్యోగుల కౌన్సిలింగ్ డీపీఓ లలితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ స్థానిక జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 570 మంది, రిక్వెస్ట్ బదిలీలను కోరుతు 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కే తులసీదేవి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో సండే సందడి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. రేపటి నుంచి ఇష్టకామేశ్వరీ దర్శనం నిలిపివేత శ్రీశైలంప్రాజెక్ట్: నల్లమలలో వెలసిన ఇష్టకామేశ్వరీ అమ్మవారి దర్శనం మంగళవారం నుంచి నిలిపేస్తున్నారు. పెద్దపులుల సంయోగ సమయంగా కావడంతో జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మూడు నెలల పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదని నెక్కంటి అటవీక్షేత్రాధికారి ఆరీఫ్ఖాన్ ఆదివారం తెలిపారు. శ్రీశైలం శిఖరేశ్వరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవన్నారు. నెక్కంటి జంగిల్ రైడ్గా పేర్కొనే ఇష్టకామేశ్వరీ మాత ఆలయ దర్శనాన్ని నిలిపివేస్తున్న విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. తిరిగి అక్టోబర్ నెల ప్రారంభంలో అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఉండే జంగిల్ రైడ్లు, పుణ్యక్షేత్రాల దర్శనాలను నిలిపి వేశారు. 67 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): డీఎస్సీ పరీక్షల్లో భాగంగా ఆదివారం రాజీవ్గాంఽధీ మెమోరియల్ కాలేజీలోని పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు 67 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 85 మంది అభ్యర్థులకు గాను 53 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన డీఎీస్సీ పరీక్ష ఐదు కేంద్రాల్లో జరిగిందన్నారు. 790 మంది అభ్యర్థులకు గాను 755 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 35 మంది గైర్హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ జనార్ధన్రెడ్డి తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశ లో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. -
దర్శనం దందా!
అమాయక భక్తులు దొరికితే చాలు.. ఇక్కడి దళారులకు పండగే. అడ్డదారుల్లో దర్శనాలు చేయించి అందినకాడికి దోచుకోవడం వీరికి అలవాటే. ఏకంగా శ్రీ మఠం అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఇంతటి అపచారం రాఘవేంద్రుని సన్నిధిలో కొంతకాలంగా జరుగుతుండటం మహా అపచారం. – మంత్రాలయం ● దర్శనం పేరుతో భక్తులకు గాలం ● అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్న దళారులు ● ఆలస్యంగా మేలుకున్న శ్రీ మఠం అధికారులు మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో పేరెన్నిక గన్నది. ఇక్కడ కొలువుదీరిన శ్రీరాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కొంత మంది ప్రైవేటు వసతి గృహాలను లీజుకు నడుపుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో గదులు కేటాయించే సమయంలో గదుల అద్దెతో పాటు దర్శన సౌకర్యం, పరిమళ ప్రసాదం ప్యాకేజీగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే బుధ, గురు, శని, ఆది వారాల్లో లక్షకు పైగా భక్తులు మంత్రాలయం దర్శన నిమిత్తం వస్తుంటారు. తమ వసతి గృహాల్లో బస చేసిన వారు శ్రీ మఠం చేరుకోగానే 6, 7 గేటు నెంబర్ల వద్దకు వెళ్లి మన వారే అంటే చాలు క్షణాల్లో దర్శనం అయిపోతుంది. సాధారణ భక్తులకు మాత్రం గంటల కొద్ది సమయం పడుతుంది. అంతేగాకుండా ఇక్కడ లభించే పరిమళ ప్రసాదం తరహాలోనే కొంత మంది వ్యాపారులు కొన్ని రకాల మిఠాయిలను తయారు చేసి ప్రసాదం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ తంతు ఇటీవల కాలంలో శ్రీ మఠం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆలస్యంగా స్పందించిన అధికారులు శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి దర్శన దందా బాగోతంపై శ్రీ మఠం అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, శ్రీపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లో ఏర్పాటు చేశామని, ఎవ్వరూ కూడా డబ్బు కట్టి మోసపోవద్దని మైకుల ద్వా రా సూచనలు చేయించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లైతే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిమళ ప్రసాదం తరహాలోనే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రాగానే విజిలెన్స్ విభాగం వారు తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక మీదట ఎవరైనా నకిలీ పరిమళ ప్రసాదం విక్రయిస్తే షాపు లీజు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బదిలీల కౌన్సెలింగ్ గందరగోళం
● సచివాలయాల ఉద్యోగుల్లో ఆందోళన ● టీడీపీ నేతల సిఫార్సులకే అధికారుల మొగ్గుకర్నూలు (టౌన్): సచివాలయాల ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ‘టిక్ పెట్టండి.. వెళ్లిపోండి’ అంటూ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు అవాక్కుయ్యారు. ‘ఇదేం కౌన్సెలింగ్ తీరు’ అంటూ వాగ్వావాదానికి దిగారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు శనివారం సుంకేసుల రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఉమ్మడి జిల్లాలో 308 సచివాలయాలు ఉన్నాయి. ఒకే చోట పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో 173 ఆడ్మిన్ కార్యదర్శలు, 235 ఎడ్యుకేషన్ కార్యదర్శులు, 248 వెల్ఫేర్ కార్యదర్శులు, 208 మంది శానిటేషన్ కార్యదర్శులు ఉన్నారు. వీరందరికీ రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. మొదటి రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వార్డు శానిటేషన్ కార్యదర్శులకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులకు, సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు వెల్ఫేర్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వచ్చిన వారు మూడు ఆప్షన్లు ఎంచుకొని వెళ్లాలని కమిషనర్ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కౌన్సెలింగ్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్లానింగ్ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ బహిష్కరణ ఈనెల 29వ తేదీ ఆదివారం వార్డు ప్లానింగ్, ఎమినిటీ స్ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్, ఆలీ, భాస్కర్, జ్యోత్న్స, తారకేశ్వర్ రెడ్డి, అమర్ నాథ్, ప్రసాద్ తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు అన్యాయంగా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయాల ఉద్యోగులు శనివారం రాత్రి భారీగా కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన చేశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓవెంకట నారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అయితే జర్నలిస్టులు రావడంతో ‘మీడియాకు ఎందుకు చెప్పారు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల సిఫార్సులకే మొగ్గు..ఎక్కడా లేని విధంగా కర్నూలులో బదిలీల కౌన్సెలింగ్ గుట్టుగా చేయడం ఏంటని కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారు మాత్రమే కర్నూలు అర్బన్, పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్లో కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు వచ్చాయి. సిఫార్సు లేని వారికి ఎక్కడ పడితే అక్కడ బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరం
● న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల(న్యూటౌన్): జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరమని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫ రూక్ అన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం క్రీడా కోటలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు.అనంతరం జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్ను అసోసియేషన్ నాయకులతోపాటు మంత్రి ఫరూక్ అభినందించారు. పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
839 మంది మహిళా పోలీసులకు స్థానచలనం
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 839 మంది గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు స్థానచలనం కలిగింది. ర్యాంకింగ్ ఆధారంగా మహిళా పోలీసులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 839 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ర్యాంకింగ్ ఆధారంగా ఖాళీ ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ తెరపై చూపి కోరుకున్న స్థానానికి బదిలీ చేశారు. దృష్టి లోపం, అంధత్వం ఉన్నవారికి (విజువల్ ఛాలెంజ్), మేధో వైకల్యం (మెంటల్లీ డిసేబుల్డ్), ట్రైబ్స్ దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్ కేటగిరీల కింద ఉన్నవారిని వరుస క్రమంలో వ్యాస్ ఆడిటోరియంలోకి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కంప్యూటర్ తెరపై ప్రదర్శించిన ఆప్షన్లకు అనుగుణంగా కోరుకున్న స్థానానికి నియమించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ జులై 1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు అక్కడే కొనసాగి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీ ప్రొసీడింగ్స్ విడుదల చేస్తామన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు తేజమూర్తి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. ‘కౌన్సెలింగ్’ పాట్లు! ఆదోనికి చెందిన లక్ష్మీదేవి మహిళా పోలీస్గా పనిచేస్తోంది. ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్లో ఉంది. మూడు రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇదే సమయంలో శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండటంతో ఏకంగా తన చంటిబిడ్డను తీసుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్కు హాజరైంది. అలాగే మరికొంత మంది కడుపుతో ఉన్న ఉద్యోగినులు, ఇంకొందరు చంటిబిడ్డలతో వచ్చి అక్కడే ఊయలలు కట్టిన దృశ్యాలు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడంలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఏఎన్ఎంల జాబితాపై గందరగోళం
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు. తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలినంద్యాల(న్యూటౌన్): ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలని ఫుట్సేఫ్టీ అధికారి వెంకటరాముడు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బజ్జీల బండ్ల నిర్వాహకులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాచిన నూనెను మరలా కాయడం, కాలం చెల్లి న ఆహార పదార్థాలు వాడటం వంటి 8 కేసులకు సంబంధించి రూ.1.80 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. హోటల్, డాబాలలో కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చిన్నారిపై కుక్కదాడికొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. -
చెత్త రహిత జిల్లాగా మార్చాలి
నంద్యాల: అధికారులు నిబద్ధతతో పని చేసి చెత్త రహిత జిల్లా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2025పై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శిలకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను పారిశుద్ధ్యపరంగా పరిశుభ్రంగా ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ రావడం జరుగుతోందన్నారు. అకడ మిక్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గ్రామాలను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తారని చెప్పారు. వైద్య సహాయం, ఆర్థిక సహాయం కోసం ప్రజలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పించారు. సమావేశంలో డీపీఓ లలితా బాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి డీఎల్పీఓ మంజుల వాణి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
కూటమి పాలనలో శాంతి లేదు.. భద్రత లేదు
● రామసుబ్బారెడ్డిది ముమ్మాటికీ హత్యే ● కేసు నీరుగారిస్తే ఆందోళన చేస్తాం ● ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం టీడీపీ బాండ్లతో త్వరలో ఇంటింటికీ.. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీల బాండ్లతో త్వరలో ఇంటింటికీ తిరగను న్నామని శిల్పా స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు, యువతపోరు కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, ప్రజలు, యువకులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా హాజరు కావడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కూటమి నేతలు ఇచ్చిన బాండ్లు తీసుకుని వెళ్లి ఎవరికి ఏ ప్రయోజనం చేకూరిందో తెలుసుకుని కూటమి ప్రభుత్వం దుర్మార్గాన్ని ఎండగడతామన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ వాహనం కింద పడి ఒకరు మృతి చెందిన విషయంపై విలేకరులు ప్రస్తావించగా.. కూటమి నేతలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మహానంది: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు శాంతి, భద్రత లేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. మసీదుపురం గ్రామానికి చేరుకుని రామసుబ్బారెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న ఆయన శుక్రవారం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. మృతుడి భార్య తులశమ్మ, సోదరుడు బుగ్గారెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి పార్టీలకు అతీతుడని, సౌమ్యుడైన ఆయనను కూటమి నేతలు చంపేశారని, ఈత వచ్చినోడు ఎలా చస్తాడు, శరీరంపై గాయాలెందుకు ఉంటాయని, ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి హత్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించాలని చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో శ్రీశైలం నియోజకవర్గంలో బండిత్మకూరు మండలం లింగాపురంలో ఒకటి, మహానంది మండలం సీతారామపురంలో మరొకటి, ఇప్పుడు మసీదుపురంలో ఇది మూడో హత్య అన్నారు. మద్యం డోర్ డెలివరీ కూటమి నేతలు కమీషన్ల కోసం గ్రామాల్లో మద్యం సీసాలను డోర్ డెలివరీ చేస్తున్నారని శిల్పా విమర్శించారు. పాల ప్యాకెట్లు దొరకని పల్లెల్లో 24 గంటలూ మద్యం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగ పాలన ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొమ్మా పాలమహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, మసీదుపురం సర్పంచ్ కాకనూరు లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ మునగాల నాగమల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
గోస్పాడు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని పార్వతీపురం హైస్కూల్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడి పాఠశాల యూపీ వరకు కొనసాగుతుండేదని, ప్రస్తుతం హైస్కూల్గా మార్పు చేసి 9వ తరగతి కొనసాగుతుందని, ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అదనంగా ఉపాధ్యాయులు పెంచేలా చూడాలన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. 54,784 మందికిఇంటి వద్దనే రేషన్ పంపిణీ నంద్యాల(అర్బన్): జిల్లాలోని వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న 54,784 మందికి జూలై నెలకు సంబంధించి ఇళ్ల వద్దనే రేషన్ పంపిణీ జరుగుతోంది. కార్డు కలిగిన వయస్సు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న వారు జిల్లాలో దాదాపు 54,784 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డీలర్లు, వీఆర్ఓల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ పంపిణీ ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తారు. జాబితా ప్రకారం డీలర్ వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ అందించాలని, అలా ఇవ్వని డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 26, 27వ తేదీల్లో 7,604 మందికి 13.88 శాతంతో రేషన్ పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డీఏఓ బాధ్యతల స్వీకరణ నంద్యాల(అర్బన్): జిల్లా వ్యవసాయాధికారిగా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీఏఓగా ఉన్న మురళీకృష్ణ విజయవాడ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుంటూరు డీడీఏగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును వ్యవసాయాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అలాగే నంద్యాల ఏడీఏగా ఆంజనేయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏడీఏగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ కర్నూలుకు బదిలీ కాగా ఆత్మకూరు ఏడీఏగా పని చేస్తున్న ఆంజనేయ బదిలీపై నంద్యాల ఏడీఏగా బాధ్యతలు స్వీకరించారు. ఆశా కార్యకర్తల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం గోస్పాడు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల ఉద్యోగ భర్తీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 24, పట్టణ ప్రాంతాల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత దరఖాస్తు నమూనాలను https://nandyal.ap.gov.in వెబ్సైట్లో పొందు పరిచారన్నారు. దరఖాస్తులను ఈనెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ లోపు పట్టణాల్లో వారు వార్డు సచివాలయాల పరిధిలోని యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు, గ్రామీణ ప్రాంతాల వారు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు అభ్యర్థులు స్వయంగా తమ దరఖాస్తులను అందజేయాలన్నారు. నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ మహానంది: మహానందిలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద పథకానికి అవసరమైన మేరకు కూరగాయలను ఉచితంగా పంపించేందుకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మార్కెట్కు చెందిన వ్యాపారులు ముందుకు వచ్చారని ఏఈఓ ఎరమల మధు, ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు వేదపండితులు రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, అన్నప్రసాద పథకం ఇన్చార్జ్ రామశివలు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి మార్కెట్లోని వ్యాపారులను కలిశారు. మార్కెట్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్రారెడ్డి, జయప్రకాష్రెడ్డిలతో పాటు సభ్యులైన బుచ్చయ్య, శ్రీశైలం నరసింహులు, భాస్కర్రెడ్డి, రాకేష్ రెడ్డి, తదితరులను కలిసి విన్నవించగా వారు ఒప్పుకున్నారని వివరించారు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికై న వారిని జెడ్పీ స్థాయీ సంఘ కమిటీల్లో సభ్యునిగా నియమించేందుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అనంతరం వ్యవసాయం – అనుబంధ శాఖలు, వైద్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సమావేశాని కంటే ముందు ఉదయం 9 గంటలకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు. -
విధి ‘పరీక్ష’లో విగత జీవిగా..
● బైక్ చక్రంలో బురక ఇరుక్కుని కింద పడిన మహిళ ● వెనక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో దుర్మరణం పాణ్యం: టీచర్ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల. ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కల సాకారం చేసుకునేందుకు పరీక్షకు సైతం హాజరైంది. విధి ఆ కలతో పాటు ఆమెను ఛిద్రం చేసింది. పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన షబానా (30) పాణ్యం సమీపంలో ఆర్జీఎం కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత భర్త ఇద్రూస్బాషాతో కలసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఎస్సార్బీసీ కాల్వ దాటగానే షబానా ధరించిన బురక బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె కింద పడింది. అదే సమయంలో వారి వెనుక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ట్యాంకర్ వెళ్లడంతో షబానా శరీరం ఛిద్రమైంది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం కాగా.. ఇద్రూస్ బాషా పాలిష్ కటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
తొలగని
‘దారి’ద్య్రంగ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు పూర్తి స్థాయిలో ఛిద్రం అయ్యాయి. పల్లె ప్రజలు అవస్థల మధ్య ప్రయాణాలను సాగిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపణలు చేసిన కూటమి నేతలు నేడు పల్లె రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పల్లెలకు సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పలు బస్సు సర్వీసులు కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. కోడుమూరు నుంచి గూడురు వరకు (వయా చనుగొండ్ల ) రోడ్డు పూర్తి అయినా నేటికీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాల్లోని గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ● ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం – శిరివెళ్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఛిద్రమైంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై 15 గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థల ప్రయాణం చేస్తున్నారు. ● గ్రామాల్లో డ్రైనేజీలను ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లను నిర్మించడంతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జూపాడుబంగ్లాతో పాటు తంగడంచె ఎస్సీ, బీసీ కాలనీలు, పారుమంచాల ఎస్సీ కాలనీతో అంతర్గత రహదారులు నిర్మించినా డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
మండలాల వారీగా సమస్యలు ఇవీ..
● మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రజలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసి కృష్ణగిరి రిజర్వాయర్ ద్వారా రోజుకు 9 లక్షల లీటర్ల నీటిని మూడు సంపుల ద్వారా వెల్దుర్తికి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడంతో చుక్క నీరు రావడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, గోవర్ధనగిరి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. సొంత భవనాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలను నిర్మిస్తే దాదాపు 39 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ● కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 40 వేల ఎకరాలు ఎల్లెల్సీ ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం 400 ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి నెలకొనింది. అలాగే కోడుమూరు నుంచి పులకుర్తి, కల్లపరి మీదుగా సీ బెళగల్ వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు రద్దు కావడంతో ప్రజలు, ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● గాజులదిన్నె డ్యాం పక్కనే ఉన్నా మండల కేంద్రమైన గోనెగండ్లను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తుంగభద్ర కెనాల్లో నీటిని ఎస్ఎస్ ట్యాంకకు లిఫ్ట్ చేసి కుళాయిల ద్వారా నీటిని అందించాల్సి ఉంది. అయితే కెనాల్లో నీరు తగ్గిపోవడంతో రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ● పెద్దకడుబూరు మండలంలోని బసలదొడ్డి, గవిగట్టు, పీకలబెట్ట, కంబదహాల్ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. పులికనుమ రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బోర్లపైనే అధారపడి ఇబ్బందులు పడుతున్నారు. నెదర్ల్యాండ్ స్కీం ఉన్నా కోసిగి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు అందని పరిస్థితి నెల కొనింది. ఈ స్కీం నుంచి 16 గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగైదు గ్రా మాలకు మించి నీరు అందని పరిస్థితి నెలకొంది. ● మద్దికెర మండలం బరుజుల గ్రామ ప్రజలకు తాగునీరు అందడం లేదు. గ్రామంలోని బోర్లే వీరికి దిక్కవుతున్నాయి. తాగునీటిని 10 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండ నుంచి తెచ్చుకుంటున్నారు. గుంతకల్ నుంచి పెరవలి మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.