హామీలను అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ అన్నట్లు ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కొన్నింటికి అరకొర నిధులను కేటాయించి మరికొన్నిటికి నిధులను కేటాయించక పోవడం దారుణం. సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ సక్సస్ అంటున్నారే గానీ లబ్ధిదారులకు మాత్రం అరకొరగానే అందుతున్నాయి. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టి పథకాలను నీరుగార్చడం సరికాదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
– వీరారెడ్డి, సీఐటీయూ
మండల కార్యదర్శి,ఆదోని


