breaking news
Nandyal District News
-
● బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరుకు చెందిన దంపతుల దుర్మరణం ● భార్య గర్భంలోని శిశువు కూడా మృతి ● అనాథగా మిగిలిన బాలుడు
పచ్చని కుటుంబంపై మృత్యుపంజా పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టింది. జీవితాంతం కలిసి ఉండాలని కలలుగన్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో భార్య గర్భిణి కాగా ఇంకా లోకాన్ని చూడని ప్రసి ప్రాణం కూడా వారితోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బెంగళూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. పెద్దకడబూరుకు చెందిన గుమ్మల చార్లెస్, మేరమ్మ దంపతులకు నలుగురు సంతానం. మొదటి కుమారుడు గుమ్మల వినోద్ (32) దాదాపు పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం కడప పట్టణానికి వలస వెళ్లాడు. అక్కడ పని ప్రదేశంలో జుబేద (ముస్లిం యువతి)ని నాలుగున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత భార్యను తీసుకొని బెంగళూరుకు వలస వెళ్లాడు. వారికి కుమారుడు గుమ్మల ఇషాక్ (3) ఉన్నాడు. ఈ క్రమంలో పెద్దకడబూరులో నూతన చర్చ్ ప్రారంభోత్సవంలో భాగంగా రెండు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చారు. 15 రోజుల క్రితం ఇషాక్ను తన తల్లిదండ్రుల వద్ద తిరిగి బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం భార్య 6 నెలల గర్భిణి. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం బైక్పై ఇద్దరు బయలుదేరారు. కేజీ నేలగులి (హోసపాడు వద్ద) ట్రక్ ఢీకొని వినోద్ అక్కడికక్కడే చనిపోగా జుబేదాను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గర్భంలోని శిశువుతో సహా ఆమె చనిపోయింది. దీంతో చిన్నారి ఇషాక్ అనాథగా మిగిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వై.బాలనాగిరెడి రోడ్డు ప్రమాదంలో వినోద్ దంపతుల దుర్మరణం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి అండగ ఉంటామని భరోసా ఇచ్చారు. బెంగళూరు నుంచి మృతదేహాలను తీసుకొనిరావడం, ఇతర ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. తక్షణమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. -
దేవుని సొమ్ము దోచుకుంటున్నారు
భూమా వారసులు నంద్యాల: అహోబిలం దేవుని సొమ్మును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి దోచుకుంటున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమా వారసులు అహోబిలం టోల్గేట్లలో అక్రమ వసూళ్లతో పాటు తలనీలాల కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తలనీలాల కమీషన్లు రావడం లేదని భూమా జగత్ విఖ్యాత్రెడ్డి తలనీలాల వాహనాన్ని అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గత ఏడాది తలనీలాల వేలం రూ.1.50 కోట్లకు పాడుకొని అందులో రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి రూ.కోటి చెల్లించలేదన్నారు. ఈ ఏడాది అహోబిల మఠం వారు టెండర్లు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ఎవరైనా టెండర్లు వేయడానికి వస్తే భయపెడుతున్నారన్నారు. ఇటీవల టెండర్ల కోసం రూ.2 లక్షలు డీడీలు తీసిన వ్యక్తిని అఖిలప్రియ అనుచరులు ప్రాణం మీద ఆశ ఉంటే వచ్చి చేసుకో అంటూ భయపెట్టారని, అందుకు సంబంధించిన వీడియోను విలేకరుల ముందు ప్రదర్శించారు. అహోబిలం తలనీలాలు చైన్నెకి చెందిన కాంట్రాక్టర్కు అహోబిలం మఠం వారు తీసుకొని వెళ్తుంటే అడ్డుకొని హంగామా సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక వేళ తలనీలాలు దొంగతనంగా తీసుకెళితే మఠం అధికారులు కేసు పెడతారు కదా.. మీకేంటి అంత తొందర అంటూ ప్రశ్నించారు. అహోబిలం దేవుని సొమ్ము దోచుకుంటూ మళ్లీ మీరే సిగ్గు లేకుండా దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు మాపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్కల్యాణ్లకు అహో బిలం దోపిడీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి భూమా వారసుల అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేసిన ఉచిత విద్యుత్
ఉచిత విద్యుత్ రైతుల పాలిట వరంగా మారింది. 2004 ముందు రైతుల పరిస్థితి దయనీయం. అప్పట్లోనే వ్యవసాయ విద్యుత్ రైతులకు పెనుభారంగా మారింది. నాటి పాలకులే వ్యవసాయం దండగని ప్రకటించడంతో రైతులకు చేయూత కరువైంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతులకు ఊపిరి పోశారు. వైఎస్ఆర్ మరణించే నాటికి ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 2018–19 నాటికి 1.64 లక్షల కనెక్షన్లకు చేరాయి. అంటే వైఎస్ఆర్ తర్వాత ఇచ్చిన కనెక్షన్లు 14వేలు మాత్రమే. అప్పట్లోనే వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ విజయవంతంగా అందించి రైతులకు దేవుడయ్యారు. -
వరుణదేవా.. కరుణించవా..
● బోడబండలో వర్షం కోసం 24 గంటల భజన భజన చేస్తున్న భక్తులు మండలంలోని బోడబండ గ్రామంలో వర్షం కోసం 24 గంటల పాటు భజన చేపట్టారు. ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు భక్తి పాటలతో ‘వరుణ దేవా.. కురియరావా’ అంటూ వరణుడిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి, ఈశ్వరస్వామి దేవాలయాల్లో అభిషేకం, అలంకరణ తదితర పూజలు నిర్వహించారు. అలాగే అన్నదానం చేపట్టారు. – ఎమ్మిగనూరుసెంట్రల్ -
నేటి నుంచి న్యాయవాదులు విధుల బహిష్కరణ
నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మూడు రోజులపాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకు నిరసనగా ఈనెల 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం చేపడుతామని నాయకులు తెలిపారు. కేజీబీవీలో మరో బాలికకు గొంతు వ్యాధి రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం కేజీబీవీలో కొద్ది రోజుల నుంచి బాలికలు గొంతు వ్యాధి బారిన పడుతున్నారు. శ్వాస ఆడక మాటలు సరిగా రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సోమవారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టి .. కాఫ్, కోల్డ్ (దగ్గు, జలుబు) కారణమంటూ వెళ్లిపోయారు. వారు వెళ్లిన మరుసటి రోజు మంగళవారం 9వ తరగతి విద్యార్థిని సుస్మితకు గొంతు వ్యాధి సోకింది. స్థానిక పీహెచ్సీ వైద్యులు పరిశీలించి నంద్యాలకు రెఫర్ చేయగా నంద్యాలలోని ఓ వైద్యశాలలో చికిత్సలు చేయించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇలా వరుసగా బాలికలు అస్వస్థతకు గురి కావడతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేజీబీవీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి డోన్ టౌన్: జైల్లో ఉన్న ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఆయన మంగళవారం డోన్ పట్టణంలోని సబ్ జైల్ను తనిఖీ చేసి ఖైదీలతో సమావేశమయ్యారు. ఆర్ధిక పరిస్థితులతో న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 11వ తేదీ జరిగే జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూసించారు. కార్యక్రమంలో డోన్ న్యాయమూర్తులు వినోద్, జ్యోతి, న్యాయవాది మాధవస్వామి, సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకుంటారా?
డోన్: టీడీపీ నేతలు కమీషన్ల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రూ. 50 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన కొట్రాయి గ్రామం నుంచి లక్ష్మీ చెన్న కేశవ స్వామి కొలువైన ఎస్. గుండాల గ్రామం వరకు 3 కి.మీ పాదయాత్ర చేపట్టారు. కొత్తకోట, తిరునాంపల్లి, నక్కలవాగుపల్లి, కొట్రాయి, గుండాల, చను గొండ్ల గ్రామాల ప్రజలు అడుగడునా బుగ్గనకు ఘన స్వాగతం పలికారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్న కేశవ స్వామి గర్భగుడిని ఆయన నిశితంగా పరిశీలించారు. గత వైభవం ప్రాచీన శిల్పకళా సంపద దెబ్బతినకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర చేసిన అనంతరం చెన్న కేశవ స్వామి ఆలయం వద్ద పాత్రికేయులతో మాట్లాడారు. టీడీపీ నేతలు.. అభివృద్ధి నిరోధకులు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని తిరిగి ప్రారంభించాలంటే టీడీపీ నాయకులకు కాంట్రాక్టర్లు కప్పం ముట్టజెప్పాల్సిందేనని విమర్శించారు. రూ.400 కోట్లతో ప్రారంభించిన గోరుకల్లు వాటర్ గ్రిడ్ పథకం, రూ.220 కోట్లతో హంద్రీ నీవా కాలువ నుంచి చెరువులను నింపే పథకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేశారన్నారు. రూ.50 కోట్లతో చేపట్టిన ఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లో వాటా కావాలని అధికార పార్టీ నేతలు వేధించడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపేసి ఆజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. వీటితో పాటు ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే డ్రైవర్ల శిక్షణా కేంద్రం, పలు కళాశాలలు, వసతి గృహాలు, పాఠశాలల నూతన భవనాలు నిర్మించే కాంట్రాక్టర్లను సైతం కమీషన్ల కోసం వేధించడంతో పనులన్నీ మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజల ఆగ్రహం రూ.5 కోట్లతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాన్ని మాజీ మంత్రి బుగ్గన తమ పర్యటనలో భాగంగా పరిశీలిస్తారని ముందుగానే పసిగట్టిన అధికార పార్టీ నేతలు ప్రధాన గేటుకు తాళం వేయాలని ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రజలు అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కల్యాణ మండపంలోనే సీఎం కొత్త బురుజు గ్రామ పర్యటన సందర్భంగా అధికారులు బస చేసిన సంగతిని మాజీ మంత్రి గుర్తు చేశారు. మారుమూల ప్రాంతం అయిన గుండాల గుడి జీర్ణోద్ధరణ పనులు, కల్యాణ మండపం, అందమైన రహదారులు, కనీస సౌకర్యాలు గత ప్రభుత్వ హయాంలో కల్పించడంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని బుగ్గన అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు డోన్: ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడడమే కాక హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో టీడీపీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో టీడీపీ, కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ప్రజల నోట్లో మట్టి కొట్టారని బుగ్గన ఎదేవా చేశారు. ఆకర్షణీయమైన అబద్ధ్దాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. అమాయకులపై రౌడీషీటర్ల ముద్ర వేసి స్టేషన్లోనే దారుణంగా హత్య చేసి అనవాళ్లు లేకుండా చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, కూటమి నేతల ముసుగులోని అరాచక నేతలకు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. -
ఐడియా అదుర్స్ !
వ్యవసాయంలో యాంత్రీకరణలో భాగంగా రైతాంగం పొలం పనులను సులభంగా, వేగంగా పూర్తి చేసుకుంటున్నారు. మండల కేంద్రం సి.బెళగల్కు చెందిన తెలుగు వీరేష్ పొలంలో మంగళవారం కూలీలు ట్రాక్టర్ ద్వారా పత్తి పంటలో దెంతలు పట్టారు. కాడెద్దులతో ఐదు ఎకరాలలో దెంత పట్టేందుకు రోజంతా సమయం పడుతుండగా, ట్రాక్టర్ ద్వారా మధ్యాహ్నానికి పూర్తవుతుందని, పైగా మొక్కలను ఎద్దులు తొక్కడంతో నలిగేవని, వ్యవసాయ ట్రాక్టర్తో అలాంటి సమస్యలు లేవని రైతులు అంటున్నారు. గతంలో వ్యక్తులను అనుసరించడంలో గొర్రు వెంట గుంటిక అనే నానుడి గ్రామాల్లో ప్రాచూర్యంలో ఉంది. అయితే ఇప్పుడు అలా కాకుండ ట్రాక్టర్ వెంట దెంతలుగా మారనుందా అని పల్లె జనం చమత్కారించుకుంటున్నారు. – సి.బెళగల్ -
● ధర్మ విజయ యాత్రలో పాల్గొన్న పలువురు రాజకీయ నేతలు ● భక్తులను ఆశీర్వదించిన విధుశేఖర భారతీ మహాస్వామి
వేద పాఠశాలకు భూమిపూజ ఓర్వకల్లు: మండల కేంద్రానికి సమీపాన వేద పాఠశాల నిర్మాణానికి శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి భూమిపూజ నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి శిష్యులు, విద్యాభారతి వేద పీఠం వ్యవస్థాపకులు, గ్రామానికి చెందిన విరివింటి ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విధుశేఖర భారతీ మహాస్వామితో పాటు, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి, జిల్లా న్యాయమూర్తి కబర్ది దంపతులు హాజరయ్యారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా విధుశేఖర భారతీ మహాస్వామి మంగళవారం ఉదయం స్థానిక జీవేశ్వ ర స్వాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలభారతి పాఠశాల సమీపంలో విద్యాభారతి వేద పీఠం పేరుతో నూతనంగా నిర్మించనున్న వేద పాఠశాలకు శాస్త్రోక్తంగా విశిష్ట పూజలు జరిపి, భూమిపూజ నిర్వహించారు. మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య స్వా ముల వారి ధర్మవిజయ యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. అనంతరం బాలభారతి పాఠశాలలో జగద్గురువుల దర్శనం, పాదుకా పూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, తీర్థప్రసాదాల వితరణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాధ్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్రెడ్డి, స్థానిక నాయకులు శంకర్రెడ్డి, రాజేంద్రారెడ్డి, జికె.వెంగన్న తదితరులు స్వాముల వారి ఆశీస్సులు పొందారు. స్థానిక ఎస్ఐ సునీల్కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
మహానేతకు చిత్రాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి పురస్కరించుకొని పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ 8 పొట్రెయిట్ చిత్రాలను గీశారు. ప్రజలు వైఎస్సార్ను స్మరించుకుంటున్నట్లు చిత్రంలో చూపించారు. బాల్యంలో, ఎన్సీసీ విద్యార్థిగా, వైద్య విద్యార్థిగా, డాక్టర్గా, రాజకీయ ప్రవేశం, రాజసమైన చిరునవ్వు, ప్రజలకు నమస్కారం చేస్తున్న చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కోటేష్ కొనియాడారు. -
ఒక్క ఓటు తొలగిపోకూడదు
నంద్యాల: వైఎస్సార్సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదని, సర్ కార్యక్రమం పట్ల బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, నియోజకవర్గ పరిశీలకులతో సర్ సర్వే తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. సర్ కార్యక్రమంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా పార్టీ నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లు తీసివేయడానికి టీడీపీ నాయకులు కుట్రపన్నే అవకాశం ఉందని, ప్రతీది గమనిస్తూ ఉండాలన్నారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 14వ తేదీలోపు ప్రతి ఓటరు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఓటు హక్కు పొందాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో పూర్తి కావడం కష్టమవుతుందని, కావున ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించేందుకు కేటాయించిన గడువును అధికారులు పొడిగించాలన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని కూటమి నాయకులు ధ్వంసం చేశారని, ఈ స్థానంలో కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, భూమా కిశోర్రెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ముందు చూపు లేకనే నీటి కష్టాలు!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లను నింపుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఏడాది సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయన్నారు. 2025–26లో కురిసిన వర్షాల వల్ల 1651.380 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందన్నారు. వరద నీటిని నింపుకునేందుకు అవసరమైనన్ని రిజర్వాయర్లు లేకపోవడం, అధికారులు ముందుచూపుతో ఆలోచన చేయకపోవడం వల్ల ఈ ఏడాది ప్రజలు సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 9.725 టీఎంసీలు మాత్రమే నీరు ఉందన్నారు. ఖరీఫ్లో ఎల్ఎల్సీ కింద నీటిని ఇవ్వలేమని టీబీ బోర్డు అధికారులు ప్రకటించారన్నారు. అలాగే ముందు నుంచి జెడ్పీ సమావేశాల్లో చెప్పడం వల్ల జీడీపీలో 4.5 టీఎంసీలకుగాను ఇప్పటికీ 2.67 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిగిలిన రిజర్వాయర్లలో నీరు అడుగంటాయన్నారు. సుంకేసులలో 0.881 టీఎంసీలు, క్రిష్ణగిరిలో 0.013, జుర్రేరులో 0.11, అలగనూరులో జీరో, శ్రీశైలంలో 42.21 టీఎంసీలు, వెలుగోడులో 1.857, గోరుకల్లులో 2.605 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్లో 0.788, వీఆర్ఎస్పీలో 0.027, పందికోనలో 0.67, పులికనుమలో 0.14 టీఎంసీలు ఇలా.. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కు చేరుకుందని ఛైర్మన్ పాపిరెడ్డి వివరించారు. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, మరోవైపు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ‘జలధార ● జల హారతి’ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ● కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం సొసైటీలో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని దీనికి రసీదులు కూడా ఉన్నాయని చైర్మన్ అన్నారు. యూరియా బస్తా రూ.267కు అమ్మాల్సి ఉండగా రూ.290లకు అమ్ముతున్నారని, పైగా నానో డీఏపీ కొంటేనే యూరియా ఇస్తామని షరతు విధించడంతో విధి లేని పరిస్థితుల్లో లీటర్ నానో డీఏపీకి రూ.500 చెల్లించి రైతులు యూరియాను తీసుకువెళ్తున్నారన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ● జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాల ప్రాధాన్యతను అధికారులు గుర్తించాలని చైర్మన్ అన్నారు. మొక్కుబడిగా ద్వితీయ శ్రేణి అధికారులు, కార్యాలయ పర్యవేక్షకులను సమావేశాలకు పంపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ● బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల పేదలకు సబ్సిడీపై అందాల్సిన అనేక పథకాలు అందడం లేదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. జిల్లాలో 25 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగడంచె చెరువు పునరుద్ధరణ పనులను మైనర్ ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు కేటాయించారని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి లేవనెత్తారు. చెరువు పనులకు అధికారులు రూ.42 లక్షల అంచనాతో టెండర్లు పిలవగా మూడు ఏజెన్సీలు పాల్గొన్నాయన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుభవం లేని సుజిత్రెడ్డి ఏజెన్సీకి పనులు అప్పగించేందుకు ఎల్ఓఏ (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) ఇచ్చారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ● గూడురు మండలంలో గత మూడు దఫాలుగా 286 మంది అర్హులైన రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ కాలేదని జెడ్పీటీసీ మౌలాలి లేవనెత్తారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు. ఆర్అండ్బీ మంత్రి ఉన్నా రోడ్లు అధ్వానం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఉమ్మడి జిల్లాకు చెందిన వారైనా జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కోడుమూరు, జూపాడుబంగ్లా జెడ్పీటీసీలు బీ.రఘునాథరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కోడుమూరు – వెల్దుర్తి రోడ్డు పనులు నెలల తరబడి నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. కోవెలకుంట్ల పట్టణంలో నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డాయన్నారు. ఆలూరులో రోడ్డుపై ప్రమాదకర గుంత ఉందని ఎర్రజెండాను పెట్టారన్నారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
‘జల’హో రాజన్న
కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగు నీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401 కోట్లతో 12 కిలోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను నిర్మించి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞం పనులను నిర్లక్ష్యం చేయడంతో పదిశాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. శ్రీశైల జలాశయం నుంచి వరద జలాలను మళ్లించేందుకు వీలుగా రెండు సొరంగ మార్గాలు ఉండగా మూడో సొరంగ నిర్మాణ పనులు చేపట్టింది. రూ. 300 కోట్లతో 5.9 కి.మీ పొడవునా నిర్మాణ పనులకు నిధులు కేటాయించింది. అలాగే పాణ్యం మండలం గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు లైనింగ్ పనులకు రూ. 950 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయా ప్రాంతాల్లో లైనింగ్ పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్ కల సాకారమై అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. అవుకు రిజర్వాయర్ -
బల్లలున్నా.. కిందనే చదువులు!
హత్యకేసు నిందితుల అరెస్ట్ రుద్రవరం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బల్లలున్నా వారి చదువులు నేలపైనే కొనసాగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మన బడి నాడు–నేడు పేరుతో పాఠశాలల రూపు రేఖలు మార్చారు. విద్యార్థులకు అవసరమైన వసతులన్నీ కల్పించారు. అయితే ఆ వసతులను కూడా సరిగా వినియోగించుకోలేక పోతుండటం గమనార్హం. మండల పరిధిలోని కే.కొత్తూరులో ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు హెచ్ఎం, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. హెచ్ఎం వెంకటరెడ్డి వరండాలో అటు ఇటు తిరుగుతుండగా ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకే గదిలో కొందరిని బల్లలపై, కొందరిని కింద కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. దీంతో మిగిలిన గదుల్లో బల్లలు ఖాళీగా ఉంటున్నాయి. మరో గదిలో ఫ్యాన్ కింద బల్లపై పడుకొని ఏజెన్సీ నిర్వాహకురాలు సేదదీరుతోంది. అయినా హెచ్ఎం నిమ్మకుండిపోయారు. అలాగే ఢీ.కొట్టాల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు గాను ఒక్కరే విధుల్లో ఉండటంతో విద్యార్థులను బండలపై కూర్చోబెట్టారు. రెండు పాఠశాలల్లోనూ మెనూ ప్రకారం రాగి జావా ఇవ్వలేదు. ఇదేమని అడగ్గా పొడి అయిపోయిందని చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మిని అడగ్గా.. విచారించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను మందలించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు: కల్లూరు ఎస్టేట్ చింతలముని నగర్కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు హత్య కేసులో మౌలాలి, యువరాజ్ అలియాస్ అభి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మే 13 నుంచి శ్రీనివాసులు అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాల్ డేటా ఆధారంగా విచారించగా శ్రీనివాసులు అదే ప్రాంతంలో మేసీ్త్ర పని చేసే మౌలాలి గతంలో స్నేహితులని తెలిసిందన్నారు. మౌలాలి కొంత డబ్బును శ్రీనివాసులుకు అప్పుగా ఇచ్చాడని, డబ్బు తిరిగివ్వమని అడిగిన సందర్భంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. ఈ విషయంలో శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి రెండు సార్లు మౌలాలిని కొట్టాడన్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న మౌలాలి తనతో పాటు సెంట్రింగ్ పనిచేసే అదే ప్రాంతానికి చెందిన యువరాజ్ అలియాస్ అభి సహాయంతో మే నెల 13న శ్రీనివాసులుకు ఫోన్ చేసి చెన్నమ్మ సర్కిల్లో మద్యం కొనుగోలు చేసి కల్లూరు ఎస్టేట్లోని శ్రీగోడ ఆంజనేయస్వామి ఆలయం శివారులో మద్యం సేవించారు. ఈ సమయంలో మాటామాటా పెరగడంతో మౌలాలి, అభి కలిసి బండరాయితో శ్రీనివాసులు తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. విచారణ జరిపి నిందితులిద్దరినీ ఈనెల 6న అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
మహానేత పచ్చని అడుగులు
ఆత్మకూరు: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జలసిరి ప్రదాతగా రైతన్నల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. జలయజ్ఞంలో భాగంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో లింగాల, ఇస్కాల, చెలిమిల్ల, సిద్ధ్దాపురం, శివపురం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి రైతుల మోములో చిరునవ్వులు చిగురింపజేశారు. ఒకప్పుడు కరువుతో బీటలు బారిన బీళ్లు ఎత్తిపోతల పథకాలతో ఆయకట్టుగా మారాయి. దాదాపు 30 వేల ఎకరాలు ఆయకట్టుగా మారి రైతుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వైఎస్సార్ మరణించినా ఆయన పచ్చని అడుగు జాడలు ఇప్పటికీ బంగారు భూముల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడి రైతులు మహానేత చేసిన మేలును నిత్యం తలుచుకుంటూ స్మరించుకుంటున్నారు. ఎత్తిపోతలతో సస్యశ్యామలం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయకపోతే మా ప్రాంతం నిత్యం కరువుతో అలమటించేది. ఏటా వలసలు వె ళ్లి జీవించాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చొరవతో రైతుల పరిస్థితి మారింది. పొలా లకు సాగునీరు అందుతుండటంతో నీటి కష్టాలు తొలగిపోయాయి. మహానేత రైతుల కోసం ఎంతో కృషి చేశారు. – విష్ణువర్ధన్రెడ్డి, సిద్ధాపురం -
గొర్రెలను కాపాడబోయి యువకుడి మృతి
డోన్ రూరల్(ప్యాపిలి): మండలంలోని నల్లమేకలపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం గ్రామ సమీపంలోని కుంటలో గొర్రె పిల్లలను కాపాడేందుకు వెళ్లి చిన్న నాగన్న (23) నీట మునిగి మృతి చెందారు. జలదుర్గం ఎస్ఐ అనిల్కుమార్, అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో మోటారు సాయంతో నీటిని బయటకి పంపేలా చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతదేహం నీటి కుంటలో చిక్కుకొని ఉండగా గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు జలదుర్గం ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. జలపాతం వద్దకు వెళ్లి మృత్యువాత సి.బెళగల్: మండల కేంద్రానికి చెందిన యువకుడు తాడా జలపాతం (ఉబ్బల మడుగు జలపాతం)లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సి.బెళగల్లో నివాసం ఉంటున్న కేశవులు, జయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు నరేష్ (25) కొన్నేళ్లుగా తిరుపతిలోని ప్రైవేట్ హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. నరేష్ ఆదివారం ఆరుగురు మిత్రులతో కలిసి తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో వరదయ్యపాలెం గ్రామ సమీపంలో ఉన్న తాడా జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడిన నరేష్ను మిత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం తిరుపతిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సి.బెళగల్కు తీసుకవచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఓర్వకల్లు: శృంగేరి జగద్గురువులు విద్యాశంకర భార తీ మహాస్వాముల వారు ఖమ్మం నుంచి బయలు దేరి సోమవారం సాయంత్రం ఓర్వకల్లుకు చేరుకున్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా ముందుగా స్వాముల వారు స్థానిక జీవేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక బాలభారతి వద్ద భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. వేదపండితులు ఫనిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో స్వాముల వారికి పొదుపు మహిళలు, రాజకీయ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మొదటి రోజున పాదపూజ, ఆశీర్వచనం, ధార్మిక ప్రవచనాలు, భక్తులతో సమావేశం, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థప్రసాదాల వితరణ నిర్వహించారు. స్వాముల వారి విజయ యాత్ర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండల సమైఖ్య గౌరవ సలహాదారులు విజయభారతి, జెడ్పీటీసీ సభ్యుడు రంగనాథ్గౌడ్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు: కర్నూలు గణేష్ నగర్ ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్నట్లు మహిళ రాజేశ్వరి ఇచ్చిన సమాచారంతో గస్తీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బుధవారపేటకు చెందిన షేక్ ఖాజా, షేక్ ఆలం హుసేన్గా గుర్తించి వారిని మూడో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సమయ స్ఫూర్తితో పోలీసులకు సమాచారం అందించిన మహిళ రాజేశ్వరిని, వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ ధన్రాజ్ను పోలీసు అధికారులు అభినందించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కనిపిస్తే 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నీతి ఆయోగ్ అధికారి పరిశీలన
హొళగుంద: మండలంలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ అధికారి బంగార్రాజు పర్యటించారు. గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువైద్య కేంద్రం, కేజీబీవీతో పాటు పలు శాఖలకు చెందిన కార్యాలయాలు తిరిగి అక్కడ సంపూర్ణ అభియాన్ (నీతి అయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ )–2.0 కార్యక్రమం అమలు, రికార్డులు, కేపీఐ సూచికలను సమీక్షించి ఇతర అంశాల పై ఆరా తీశారు. గ్రామాలలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో టీచర్ల కొరత, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం, పొదుపు మహిళలకు స్వయం ఉపాధి కల్పన ఇలా అనేక అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి, ఎదురవుతున్న సవాళ్లపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ఎంపీడీఓ సయ్యద్ఉమర్, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో రవిశంకర్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు (టౌన్): నగరంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునగాలపాడు రోడ్డు, సంపత్ నగర్, సంతోష్ నగర్, బళ్లారి చౌరస్త, కృష్ణా నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా పి.ఆర్ వైన్స్ వద్ద అపరిశుభ్ర వాతవరణం ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన కమిషనర్ రూ.10 వేలు జరిమానా విధించారు. -
వర్షాభావం.. వెల్లివిరిసిన మత సామరస్యం
ఆత్మకూరురూరల్: వర్షకాలం ప్రారంభమై నెల దాటినా చినుకు రాలక రైతులంతా ఆందోళనలతో ఆకాశం వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుణు డు ముఖం చాటేయడంతో రైతులు వరుణాధి దేవతలను ఆదేశించగలిగే దైవాలకు కొలుపులు మొదలు పెడుతున్నారు. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామ రైతులు మతాలకతీతంగా ఏకమై సోమవారం గ్రామ సమీప నల్లమల అడవుల్లో వెలసిన జడలయ్య (శివుడు) స్వామి వద్దకు వెళ్లి పూజల అనంతరం వనభోజనాలు చేశారు. ముందుగా జడలయ్య స్వామి విగ్రహానికి అక్కడి పవిత్ర కోనేరు నీటితో అభిషేకాలు నిర్వహించారు. ఈ కోనేరులో మండు వేసవిలోనూ, నిండు వర్షాకాలంలోనూ భూమి ఉపరితలానికి సమానంగా నీరు ఉండటం గమనార్హం. అనంతరం స్వామి సన్నిధిలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులంతా కలిసి వనభోజనాలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలను పాటించే రైతులంతా ఒక చోట చేరి సమష్టిగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అ‘ధనం’గా దోపిడీ!
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద 69 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నమోదయ్యాయి. వీటితో పాటు ప్రభుత్వ పలు ఆస్పత్రులను సైతం ఇందులో కొనసాగిస్తున్నారు. రోగికి వచ్చిన వ్యాధి, చికిత్సను బట్టి ప్రభుత్వం ప్యాకేజీలను నిర్ణయించింది. మార్కెట్కు అనుగుణంగా ఐదారేళ్లకు ఒకసారి ధరలను సవరిస్తూ వస్తున్నారు. అయితే చిన్న పట్టణా ల్లో ఉండే ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ప్యాకేజీలు సరిపోతాయని, తమ ఆసుపత్రులకు సరిపోవని కర్నూలు లాంటి నగరాల్లో ఉండే ఆసుపత్రుల యాజమాన్యాలు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. రోగి చికిత్స కోసం రాగానే, ఆరోగ్యశ్రీ కింద వచ్చే ప్యాకేజీ సరిపోదని అదనంగా ఇంత ఇస్తేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఇష్టమంటే ఇక్కడ చేయించుకోవాలని, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని మరీ సూచిస్తున్నారు. అలాగే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన విషయం చెప్పకూడదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. దీంతో తనిఖీల సమయంలో రోగులు ఫిర్యాదు చేయడం లేదు. అయితే ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించి పలువురు ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. గత మే, జూన్ నెలల్లో జిల్లాలో 30కి పైగా ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. ఈ అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలంటే అధికారులు డెకాయిట్ ఆపరేషన్ చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఈహెచ్ఎస్, జర్నలిస్ట్ హెల్త్కార్డులకు నో ట్రీట్మెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ కార్డులపై తాము చికిత్స అందించలేమని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. తాము చికిత్స చేసినా ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి డబ్బులు రావడం లేదని ఆయా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు వెళ్లి స్కీమ్లు వర్తించక ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అనీల్కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కొందరు దళారులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీతో పాటు అదనంగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పి మరీ వసూలు చేశారు. కర్నూలు మండలం రుద్రవరానికి చెందిన రాముడుకు కడుపునొప్పి తీవ్రం కావడంతో వారం రోజుల క్రితం కొత్తబస్టాండ్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్యులు పరీక్షించి అపెండిక్స్ పగిలిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా రూ.30 వేలు వసూలు చేశారు. వీరిద్దరూ కాదు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టు కుని ఏ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లినా ఇదే తంతు నడుస్తోంది. ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు బాహాటంగా వసూలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోదంటూ దాదాపుగా అన్ని ఆసుపత్రులు రోగుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. -
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సకు ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా విచారణ చేసి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం. గత రెండేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలకు భారీగా జరిమానా విధిస్తున్నారు. అయినా కూడా కొంత మంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదు లు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ భాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్, కర్నూలు -
హమ్మయ్య.. నీటి రాక మొదలైంది
● టీబీ డ్యాంకు చేరుతున్న వరద ● 10 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ హొళగుంద: ఇన్నాళ్లు ప్రవాహం లేక వెలవెలబోయిన కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఎట్టకేలకు సోమవారం ఇన్ఫ్లో నమోదు కావడంతో రైతుల మోములో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది ఇదేరోజున డ్యాంలో 78 టీఎసీంల నీరుండగా ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన తర్వాత సోమవారం ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో రైతులు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాలో వర్షాలు కురిసినా తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (తుంగ ప్రాజెక్ట్) నిండేంత వరకు దిగువకు నీరు పారలేదు. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ఠ మట్టానికి చేరడంతో అక్కడి ఇంజినీర్లు 22 క్రస్ట్ గేట్లలో దాదాపు 15కు పైగా గేట్లను ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. ఆ నీరు దిగువన హోస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర డ్యాం వైపు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఇన్ఫ్లో జీరో ఉండగా సోమవారం ఉదయం 2 వేల క్యూసెక్కులకు పైగా నమోదైంది. మంగళవారం ఉదయం నాటికి 10 నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరే అవకాశాలున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
వెల్దుర్తి: మండల పరిధిలోని కసాపురం వద్ద రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెర్లకొత్తూరు గ్రామ యువకుడు చంద్రమోహన్ (25) మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మే రకు.. మోహన్ ఫోటోగ్రాఫర్, పెయింటర్గా జీవిస్తూ ఇటీవల ఓ ప్రైవేట్ సోలార్ కంపెనీలో పనికి కుదిరాడు. సోమవారం బొమ్మిరెడ్డిపల్లె వద్ద కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్పై బయలుదేరా డు. మార్గం మధ్యలో మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా దూసుకొన్చిన గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడికి తల్లి లక్ష్మీదేవి,భార్య రూత్, ఏడాది లోపు వయసున్న కుమారుడు ఉన్నా రు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబసభ్యులు నిరాకరించారు. తమకు న్యా యం జరగాలంటూ భీష్మించారు.రహదారిపై బైఠాయించారు. ఎస్ఐ నరేశ్ ఘటనాస్థలికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
జంతువుల నుంచి సోకే వ్యాధులపై అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ సూచించారు. సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని కర్నూలులోని బహుళార్థ పశువైద్యశాల, అన్ని ఏరియా పశు వైద్యశాలల్లో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. బహుళార్థ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రాజశేఖర్ ప్రారంభించారు. శిబిరంలో 600 పెంపుడు కుక్కలు, పిల్లులకు టీకాలు వేశారు. వాటి యజమానులు, పశుపోషకులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రేబిస్కు మందు లేదని నివారణే మార్గమన్నారు. ఒకేరోజు 7500 డోసుల రేబిస్ టీకాలు వేయడం జరిగిందని మంగళవారం కూడా టీకాల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వసంతలక్ష్మి, జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవి, వీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుధాకర్, గిడ్డయ్య, చంద్రలీల, పలువురు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల స్థలం కబ్జాపై నిరసన గళం
ఆదోని: మండలంలోని దొడ్డనగేరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 11.38 సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కురువ శివప్ప కబ్జా చేసిన నేపథ్యంలో సోమవారం ఉదయం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి పాఠశాలను మూసివేసి నిరసన తెలిపారు. తమ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై గత నెల 27వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘పచ్చ నోట్లకు రిజిస్ట్రేషన్’ శీర్షికతో వార్తా కథనం ప్రచురించి వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి విచారణ కమిటీలు వేయడం జరిగింది. అయితే విచారణల పేరిట కాలయాపన జరుగుతుందే తప్పా తమ పాఠశాల స్థలాన్ని కాపాడటంలో అధికారులకు చిత్తశుద్ధి లేదని పూర్వ విద్యార్థులు ధ్వజమెత్తారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులంతా ముక్త కంఠంతో ‘మా పాఠశాల స్థలాన్ని కాపాడండి.. ఆక్రమణలను అడ్డుకోండి.’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం హెచ్ఎంకు వినతిపత్రం అందజేశారు. స్పందించాలని డిమాండ్ -
రాజకీయ చైతన్యంతోనే బలిజల అభ్యున్నతి
నంద్యాల(వ్యవసాయం)/పాణ్యం: రాజకీయ చైతన్యంతోనే బలిజ సమాజం అన్ని విధాలుగా అభ్యున్నతి చెందుతుందని గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, శాంతిరాం మెడికల్ కాలేజ్ అధినేత డాక్టర్ మిద్దె శాంతి రాముడు పేర్కొన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కాలేజీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ రాయలసీమ పరిధిలోని జిల్లాల నుంచి బలిజ నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బలిజ సమాజం ప్రస్తుతం రాజకీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఐక్యత, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, యువత పాత్ర, మహిళల భాగస్వామ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఒకప్పుడు బలిజలకు రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉండేదని, తిరిగి ఆ గుర్తింపు, గౌరవం సాధించుకోవాలన్నారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ ఎం. శాంతిరాముడును వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో బలిజ మహా సంకల్పం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ సోమశేఖర్, పరమేశ్వర రాజశేఖర్, పడకండ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జా రామకృష్ణ, గాజుల విజయభాస్కర్, సమతం రాము, అడ్వకేట్ శివప్రసాద్, జనార్దన్ పాల్గొన్నారు. -
రేబిస్ అత్యంత ప్రమాదకరం
ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. కుక్కల నుంచి ఈ వ్యాధి సోకుతుంది. నేడు జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుక్కలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా యాంటి రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టాం. బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీలలో కుక్కలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తాం. ఈ అవకాశాన్ని కుక్కలు పెంచే వారు వినియోగించుకోవాలి. – డాక్టర్ రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్. జిల్లా పశుసంవర్ధకశాఖ, కర్నూలు -
టెండర్దారుడికి లబ్ధి చేకూరేలా..
మల్లికార్జున సదన్ వద్ద ఉన్న డార్మెంటరీ టెండర్ కాలపరిమితి పూర్తవడంతో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడి తమ అనుచరులతో టెండర్ వేయించారు. వారికే టెండర్ దక్కేలా గిమ్మిక్కులు చేశారు. గతంలో మల్లికార్జున సదన్లో దిగే భక్తుల వాహనాల డ్రైవర్లు, ఇతర వ్యక్తులు డార్మెంటరీ ద్వారా వసతి పొందేవారు. అయితే మల్లికార్జున సదన్ వద్ద డార్మెంటరీ టెండర్ దక్కించుకున్న కూటమి నాయకులు అంతటితో ఆగకుండా వసతి విభాగాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మల్లికార్జున సదన్లో ఉన్న డార్మెంటరీ మొత్తం క్షేత్రంలో విధులకు వచ్చే పోలీసులకు ఉచితంగా అప్పగించారు. తద్వారా పరోక్షంగా కూటమి నాయకులు దక్కించుకున్న డార్మెంటరీలో వ్యాపారం జరిగేలా అధికారులు లోపాయికారీగా వారికి మేలు జరిగేలా పనిచేసినట్లు తెలుస్తోంది. మల్లికార్జున సదన్ డార్మెంటరీకి వచ్చిన భక్తులు చేసేదేమిలేక ప్రైవేట్ డార్మెంటరీని అశ్రయిస్తున్నారు. అంతటితో ఆగకుండా డార్మెంటరీ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా టీ, కాఫీ, బిస్కెట్లు, టూత్ పేస్టు, బ్రష్లు, షాంపులు, వాటర్బాటిల్స్, కూల్డ్రింక్స్ ఇలా అన్ని సరుకులతో కూడిన ఓ ప్రైవేట్ దుకాణాన్ని సైతం ఏర్పాటు చేశారు. -
వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివా రం స్వామి అమ్మవార్లకు పల్లకోత్సవం నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సే వగా) చేపడుతారు. ఇందులో భాగంగా ఆదివా రం ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం జరిపారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 6వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కబడ్డీ సంఘం ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): నంద్యాల జిల్లా కబడ్డీ సంఘం ఎన్నికలకు క్రీడాకారుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సుబ్రమణ్యం, అధ్యక్షుడు మోహన్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ క్రీడా పరిపాలన చట్టం– 2025 ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు, కమిటీలను ఏర్పాటు చేయా లని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కబడ్డీ సంఘాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయాలనుకున్న క్రీడాకారులు సర్టిఫికెట్లు, సహాయ పత్రాలతో ఈనెల 20లోగా కబడ్డీ జిల్లా సంఘం కార్యదర్శికి సమర్పించాలన్నారు. తీవ్ర గాలులు.. నేలతో తేమ ఆవిరికర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో పశ్చి మం దిశగా గాలులు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో వీస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు వేయగా వచ్చిన మొలకలు గాలుల తీవ్రతకు లేచిపోతున్నాయి.గాలుల ప్రభావంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోతోంది. దీంతో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొ న్న, సజ్జ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. గాలుల ప్రభావం ఈ ఏడాది పెరగడానికి ఎల్నినో ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. దాదాపు 25 రోజులుగా అక్కడక్కడ జల్లులు మినహా వర్షాలు లేవు. దీంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు విత్తనం పనులు కూడా నిలిచిపోయాయి. అలరించిన నృత్య ప్రదర్శన శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాడ వీధుల్లోని నిత్య కళా వేదికపై హైదరాబాద్ కు చెందిన శ్రీహరి ఆర్ట్స్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో భో..శంభో, వినాయకకౌత్వం, అయిగిరినందిని, కాలభైరవాష్టకం, శివతాండవం, శివస్తుతి తదితర గీతాలకు విజయమాధవి, అభిన్య, సింధుజ, మేఘన, తేజస్విని, నిత్య శ్రీలక్ష్మి, వైదసంహిత, భవిష్య, నందిని, నిత్యశ్రీ తదితరులు ప్రదర్శించిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫ్యాప్టో నంద్యాల జిల్లా ఇన్చార్జ్ హృదయరాజు, అధ్యక్షుడు రామచంద్రారెడ్డితో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలు పరిష్కారంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 14వ తేదీన నంద్యాల కలెక్టరేట్ ముట్టడించనున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో 12వ పీఆర్సీని సకాలంలో అమలు చేస్తామని, ఐఆర్ను ప్రకటిస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డీఏ చెల్లిస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని నమ్మంచి మోసం చేశారన్నారు. కూటమి సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు 12వ వేతన సవరణ కమిషన్ నియమించలేదు, పెండింగ్ డీఏలు ఇవ్వలేదన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారుపై నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేయనున్నామన్నారు. కార్యక్రమానికి ఫ్యాప్టో కో చైర్మన్లు, ప్రసాద్, చంద్రశేఖర్, స్వామిశేఖర్, శ్రీనివాసులు, శివయ్య, లక్ష్మీనాయక్, జాకీర్హుసేన్, సైఫుల్లా, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఎమ్మిగనూరురూరల్: నవోదయ కోచింగ్ సెంటర్లో ఉండటం ఇష్టం లేక నిశాంత్ అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో కలక లం లేపింది. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తన కుమారుడి నిశాంత్(12)ను పట్టణంలోని గుడేకల్ రోడ్డులో ఉండే గురు నవోదయ కోచింగ్ సెంటర్లో ఐదు రోజుల క్రితం వదలివెళ్లాడు. ఆదివారం కుమారుడిని చూడటానికి తండ్రి వచ్చాడు. తనకు ఇక్కడ ఉండలేనని కుమారుడు చెప్పడంతో తండ్రి మందలించి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన నిశాంత్ కోచింగ్ సెంటర్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మోటార్బైక్ీసీటుపై పడ్డాడు.అక్కడ ఉన్న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే కింద పడిన విద్యార్థి నిశాంత్ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిందకు దూకినప్పుడు మో టర్ బైక్ సీటుపై పడటంతో ఊపిరితిత్తుల భాగంలో ఒత్తిడికి గురైనట్లు వైద్యులు చెప్పారు. నిశాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడో అంత స్తు నుంచి కింద దూకినప్పుడు రోడ్డుపై పడింటే విద్యార్థి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని ప్ర త్యక్ష సాక్షలు చెప్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సాయంత్రం తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు చేరిన విద్యార్థి
హొళగుంద: ఇంగళదహాళ్ బీసీ హాస్టల్లో 8వ తరగతి చదువుతూ శనివారం సాయంత్రం అదృశ్యమైన హొళగుందకు చెందిన హరివాణం గోవర్ధన్ను హొళగుంద పోలీసులు ఆదివారం తల్లిదండ్రలుకు అప్పగించారు. ఈ విద్యార్థి శనివారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత స్నేహితులతో కలిసి బయటకెళ్లి వస్తానని హాస్టల్ సిబ్బందికి చెప్పి రాత్రయినా తిరిగి రాలేదు. వార్డన్, వాచ్మన్ హొళగుంద పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ దిలీప్కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది రాత్రంతా గాలించారు. అలాగే విషయాన్ని సోషియల్ మీడియాలో వైరల్ చేసి విద్యార్థి ఆచూకీని కనుగొన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర సిరుగుప్ప నియోజకవర్గం కె.బెళగల్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి విద్యార్థి గోవర్ధన్ను హొళగుందకు తీసుకొచ్చి తల్లిదండ్రలుకు అప్పగించారు. -
జంతు ప్రేమికా..జాగ్రత్త సుమా!
మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది పశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని వృత్తిగా పెట్టుకున్నారు. ప్రతి మనిషి పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు,గుడ్లు, మాంసం తదితర వాటిపై ఆధారపడి ఉన్నాడు. ఇదే సమయంలో ఇంటి రక్షణ కోసం మొదలైన కుక్కల పెంపకం క్రమంగా హాబీగా మారింది. ఇలా మనుషులు, జంతువులు నిరంతరం కలసి పోతుండటం వల్ల తెలియకుండానే వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణే లక్ష్యంగా పరిశోధనలు పెంచడం, పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేయించేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఏడాది జూలై 6న జూనోసిస్ డే నిర్వహిస్తారు. కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు ఇటీవల వ్యాధులు పెరుగుతున్నాయి. పందుల ద్వారా మెదడువాపు, కుక్కకాటు వల్ల రేబిస్, గొర్రెలు, మేకల ద్వారా ఆంత్రాక్స్, ఆవులు, గేదెల నుంచి క్షయ, పాల ద్వారా బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తోంది. ఇవే కాకుండా పక్షుల వల్ల సిటాకోసిస్, ఎలుకలతో ప్లేగు, పిల్లుల ద్వారా పాగ్సోప్లాస్మోక్రాండై, కోళ్ల ద్వారా బ్లడ్ఫ్లూ, కుందేళ్ల నుంచి టాక్సోప్లాస్మోసిన్, కోతుల ద్వారా లెప్రసీ, ఇతరాత్ర జంతువులు, పక్షుల ద్వారా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం, వైద్యపరీక్షలు చేయించడం, పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల సంక్రమణను అడ్డుకోవచ్చు.అయితే ఆ దిశగా వైద్య సేవలు అందించడంలో, ప్రజలను చైతన్య పరచడంలో పాలకులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు రేబిస్, మరోవైపు బ్రూసెల్లోసిస్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీధి కుక్కలను నియంత్రించడంతో ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి కోరలు చాస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీగా శస్త్రచికిత్సలు ( ప్యామిలీ ప్లానింగ్) నిర్వహించడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత శస్త్రచికిత్సలు చేసే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కుక్కల సంతతి పెరిగిపోవడంతో వీధుల్లోకి చిన్నారులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు పశువులు, గొర్రెలు, మేకల నుంచి బ్రూసెల్లోసిస్ సోకుతోంది. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధి సోకిన వారు దాదాపు 100 మందికిపైగా ఉన్నారు. నేడు పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు లూయిస్పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి వ్యాధి రాకుండా వ్యాధినిరోధక టీకా మందు విజయవంతంగా ఇచ్చారు. ఆ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. చికిత్స కన్నా– నివారణే మిన్నగా భావించి పశుసంవర్ధకశాఖ నేడు (సోమవారం) కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీల్లో పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 37,810 డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ వచ్చింది. ఇందులో కర్నూలు జిల్లాకు 13,060 డోసులు, నంద్యాల జిల్లాకు 24,750 డోసుల వాక్సిన్ సరఫరా అయ్యింది. ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు మూగజీవాలతో మనుషులకు అవినాభావ సంబంధం -
తుంగ నిండా బెంగ!
● నిండని తుంగభద్ర డ్యామ్ ● వెలవెలబోతున్న ఎల్లెల్సీ ● ప్రశ్నార్థకంగా మారిన వరి సాగు హొళగుంద: వరి సాగుకు సిద్ధం కావాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నారు మళ్లతో పచ్చగా కళకళలాడాల్సిన ప్రాంతాలు ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. పంట కాల్వలు నీరు లేక వెలవెలబోతున్నా యి. ఎల్లెల్సీ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయిని అయిన తుంగభద్ర జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 27 వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదై 79 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఈ ఏడాది ఒక చుక్క నీరు కూడా ఇన్ఫ్లో లేక 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లా ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీ తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే దిగువ కాలువ (ఎల్లెల్సీ)నే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటుతు న్నా, జూలై మొదటి వారంలో అడుగు పెట్టినా నేటికి టీబీ డ్యాంలో చుక్క నీరు చేరకపోవడంతో ఎల్లెల్సీ కింద వరి, ఇతర పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర జలాశయంలో ఆంధ్ర కోటాలో కర్నూలు జిల్లాకు దాదాపు 24 టీఎంసీల నీటిని కేటాయించారు. నీటి లభ్యత తగ్గడంతో 17 లేదా 18 టీఎంసీల వరకు కుదిస్తూ వస్తున్నటు్ల్ సమాచారం. ఆ నీటితో ఖరీఫ్లో 43,413, రబీలో 1.07 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితో పాటు దాదాపు 140 గ్రామాలకు తాగునీరు నీరందించాలి. ఆగస్టు వరకే అవకాశం.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నెలలో వర్షాలు ప్రారంభమై వరద జలాలతో ఆగస్ట్ 15 నాటికి పూర్తిస్థాయిలో నిండిపోతుంది. అయితే ఈ ఏడాది జూలై నెల మొదలైనా చినుక జాడా లేక చుక్క ఇన్ఫ్లో లేదు. దీంతో మూడు రాష్ట్రాలకు సాగు, తాగునీటి గండం నెలకొంది. తుంగభద్ర జలాశయం 70 ఏళ్ల చరిత్రలో నీటి లభ్యత తగ్గిన దాఖలాలో ఈ ఏడాది కూడా చేరుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తుంగభద్ర జలాశయం పైభాగంలోని ఆగుంబే, వరనాడు, శివమొగ్గ, తీర్థనహళ్లీ, శృంగేరి తదితర ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టులు నిండిన తర్వాతే టీబీ జలాశాయానికి జలాలు చేరుతాయి. వానలు ఆలస్యం అయితే వర్షాకాలం ముగుస్తుంది. ఆగస్ట్ 15లోగా జలాశయం నిండితేనే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఏడాది గత ఏడాది కన్నా భిన్నమైన వాతావరణం కనబడుతుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాగునీటికి ప్రమాద ఘంటికలు.. ప్రస్తుతం డ్యాంలో నిల్వ ఉన్న 9 టీఎంసీలు గత రబీకి విడుదల చేయకుండా నిల్వ చేశారు. అదే నీరు నేడు తాగునీటి అవసరాలకు వస్తున్నాయి. ఒకవేళ రబీలో నీరు వదిలి ఉంటే ఈ ఏడాది జలాశయం పూర్తి డెడ్ స్టోరేజ్లోకి చేరి ప్రమాద ఘంటికలు వినిపించేవి. అయినా వర్షాలు కురువక డ్యాంలో నీరే చేరకపోతే రాబోయే రోజుల్లో భారీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి కర్నూలు జిల్లా ప్రజలతో పాటు వైఎస్సార్ కడప, అనంతపురం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. -
సమావేశాలు గోప్యం.. వసూళ్ల బాగోతం!
కర్నూలు కల్చరల్: టీడీపీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) బీఈడీ కళాశాలల యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కో కళాశాల నుంచి ఇంటేక్ సీట్ల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.2లక్షల చొప్పున వసూలుకు రంగం సిద్ధమైంది. ఓ మంత్రి వద్ద అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ రంగంలోకి దిగిందని, వసూలు చేసిన మొత్తాన్ని సదరు మంత్రికి అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర నాయకులు ముగ్గురు యూనివర్సిటీ ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బు వసూ లు బాధ్యతను ప్రతి జిల్లాలో ఒకరికి కట్టబెడుతుండటం గమనార్హం. గత నెల నుంచి రహస్య సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో గత వారంలో సమావేశం పూర్తయింది. రిజిస్ట్రేషన్కు ఆదేశాలు ఎఫ్ఆర్ఎస్ అమలుకు గత నెల 29 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు.. ఈనెల 6 నుంచి డిగ్రీ, 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 20 నుంచి బీఈడీ కళాశాలలు, 27 నుంచి లా, బీపీఈడీ కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా కళాశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం. ఎఫ్ఆర్ఎస్కు సంబంధించి ప్రతి కళాశాల ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. అయితే ఆ ఊసే కరువైంది. కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు కళాశాలల్లో ఉద్యోగులు, సిబ్బందితో పాటు విద్యా ర్థుల ముఖ ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి చేయడంపై కూటమి అనుకూల కళాశాలల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఎఫ్ఆర్ఎస్ను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ వసూళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళాశాలల నుంచి కార్పస్ ఫండ్ పేరిట వసూళ్లు చేసి ముట్టజెప్పేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 శాతం సీట్లు భర్తీ? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీలు ఉన్నా.. ఆర్యూ పరిధిలో మాత్రమే బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 50 కళాశాలల్లో గత విద్యా సంవత్సరంలో 4,773 అడ్మిషన్లు చేపట్టారు. ఇంకా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కొన్ని కళాశాలలు అనుమతులకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించి వెసులుబాటు తీసుకున్నారు. అయితే వాస్తవ వివరాలతో కోర్టుల్లో కౌంటర్ వేయడానికి వర్సిటీలు ముందుకు రాకపోవడం కుమ్మక్కు వ్యవహారానికి బలం చేకూరుస్తోంది. బీఈడీ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా సీట్లను భర్తీ చేసుకోవడం.. ఈ విషయాన్ని ప్రభుత్వం, వర్సిటీలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముడుపులు దండుకోవడమే ఎజెండా ఎఫ్ఆర్ఎస్ వద్దంటున్న బీఎడ్ కళాశాలలు కూటమి ప్రభుత్వం కొత్త విధానాల పేరుతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి భారీగా ముడుపులు దండుకోవడమే ప్రధాన ఎజెండాగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీఈడీ కళాశాలల్లో అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం.. పారదర్శకత పేరిట ఎఫ్ఆర్ఎస్ను తెరపైకి తీసుకొస్తోంది. దీనిని ఎలాగైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తాయని తెలిసి.. వారిని దారికి తెచ్చుకోవడం ద్వారా భారీగా దండుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నాయకులు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ఎఫ్ఆర్ఎస్ నిలుపుదలకు కోర్టుల్లో సైతం కేసులు వేయించడం గమనార్హం. -
జలకళ ఏదీ!
● పోతిరెడ్డిపాడు వద్ద కానరాని నీటి జాడ ● గతేడాది జులై 6న గేట్లు ఎత్తి నీటివిడుదల నీటిప్రవాహం లేని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ జూపాడుబంగ్లా: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకున్నాయి. అరకొరగా కురిసిన వర్షాలకు సాగు చేసిన ఖరీఫ్ పంటలు వాడుముఖం పట్టాయి. కాలువల నీటితో పంటలను కాపాడుకుందామంటే జలాశయాల్లో నీళ్లు లేవు. గతేడాది జూన్ 15 తేదీ నుంచే శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం ప్రారంభం కాగా 21 తేదీ నాటికి జలాశయంలో 852 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జూలై 6వ తేదీ నాటికి 878.40అడుగుల నీటిమట్టం చేరుకోగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా డ్యాంలోకి వరద నీటిప్రవాహం జీరో. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ అప్రోచ్ కాల్వల్లో కనుచూపుమేరలో కూడా నీటిప్రవాహ జాడ కనిపించటం లేదు. ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో శ్రీశైలం డ్యాంలోకి వరదనీటి నీటిప్రవాహం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీరు విడుదలైతేనే వెలుగోడు, గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం, ఎల్లనూరు, పైడిపాలెం తదితర రిజర్వాయర్లలో జలకళ ఉంటుంది. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం
పాణ్యం/ఆళ్లగడ్డ: కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఏఎస్ఐ చిట్టెపు సురేష్రెడ్డి (56) మృతిచెందా రు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్ఐగా పనిచేస్తున్న చిట్టెపు సురేష్రెడ్డి, అతని భార్య ఉమాదేవి, నంద్యాల టూటౌన్ స్టేషన్లో ఎస్బీ హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రరెడ్డి, ఆయన భార్య జయమ్మ, కోడలు గేయారెడ్డి అనంతపురంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి నంద్యాలకు వస్తున్నారన్నారు. తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలోని ఉన్న ఘాట్రోడ్డు దాటుకొని వస్తుండగా పెద్దమ్మ గుడి వద్ద ఒక్కసారిగా కారు ఎడమ టైర్ పేలి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిట్టెపు సురేష్రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెండాడు. ఎస్టీ హెడ్కానిస్టేబుల్ నాగేంద్రరెడ్డికి కాలుకు తీవ్ర గాయం అయ్యింది. కారులో వెనుక సీట్లో కుర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హైవే, 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన సురేష్రెడ్డి మృతదేహాన్ని గ్యాస్ కట్టర్ సహాయంతో డోర్ను తొలగించి బయటకుతీశారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. దెబ్బతిన్న కారును తొగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. ఇటీవలే కుమార్తె వివాహం.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన చిట్టెపు సురేష్రెడ్డి కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిగింది. ఈయన 1993 నుంచి 1999 వరకు ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు. అనంతరం కర్నూలు, ఆదోని, పాణ్యం స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తూ 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొండారు. సురేష్రెడ్డి మృతి చెందిన వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందాం
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● ప్రతి ఓటరూ సరైన ధ్రువపత్రాలు సమర్పించాలి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి గడివేముల: ఓటరు జాబితా ’ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్)లో ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకుందామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గడివేములలోని పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియ జాతీయ ఎన్నికల కమిషన్ చేపట్టినా టీడీపీ నాయకుల కుట్రలు ఉంటాయన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఎలు గుర్తించుకోవాలన్నారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘సర్’ ప్రభావంతో సీఎం అభ్యర్థులు సైతం ఓటమి పాలైన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. టీడీపీ నాయకులు కుట్రలు పన్ని వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను సాంకేతిక కారణాలు చూపి తొలగిస్తున్నారనే వాదనలు ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించండి రెండేళ్ల కూటమి పాలనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంక్షేమాన్ని కొనసాగించలేని అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వేసుకున్నారన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లో భూములు కోల్పోయామని న్యాయం జరిగేలా చూడాలని కాటసాని రాంభూపాల్రెడ్డి దృష్టికి కొర్రపోలూరు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తీసుకువచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు చేద్దామని రైతులకు హామీ ఇచ్చారు. సోలార్లో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండంగా ఉంటుందన్నారు. ఏ పేద రైతు నష్టపోకుండా తాము పోరాటానికై నా సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మధుసూదన్, ఎంపీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి, నాయకులు దేశం నాగేశ్వరరెడ్డి, మాజీ మూలపెద్దమ్మ ఆలయ చైర్మన్ చిన్నన్న పాల్గొన్నారు. చంద్రబాబు ఎత్తుగడలు ప్రతి ఓటూ భవితకు మెట్టు అనే సంగతిని వైఎస్సార్సీపీ బీఎల్ఏలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆ తరహా సంకేతాలు గమనించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎత్తుగడలు అప్రజాస్వామికంగా ఉంటాయన్నారు. ఓటరు జాబితా తయారీలో అధికారులను ప్రలోభాలకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకునే కుట్రకు చంద్రబాబు దిగజారుతారన్నారు. అర్హుల ఓట్లను పరిరక్షించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు, పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తాయన్నారు. కూటమి నేతలు, వారికి కొమ్ముకాసే కొందరు ప్రభుత్వ సిబ్బంది పట్ల బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి వద్ద ఓటరు అందుబాటులో లేకపోతే ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 13 రకాల ధ్రువపత్రాలలో ఏదొకటి చూపించి ఓటు హక్కును పరిరక్షించుకోవచ్చన్నారు. ఫారం– 6 ద్వారా అర్హత గల వారికి కొత్తగా ఓటు హక్కును కల్పించాలని, ఫారం– 8 ద్వారా ఓటు హక్కును సవరించుకోవచ్చన్నారు. -
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మృతి
కర్నూలు(హాస్పిటల్): అనారోగ్య కారణాలతో ఆహార నియంత్రణ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు ఆదివారం ఉద యం మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన ఈయన ఫుడ్ఇన్స్పెక్టర్గా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా కడప, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో పనిచేశారు. పదోన్నతిపై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా కర్నూలు జిల్లాకు వచ్చారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా చికిత్స తీసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చారు. ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో సెలవుపై వెళ్లి వైద్యచికిత్స తీసుకుంటూ ఆదివారం మృతిచెందా రు. ఆయన మృతి పట్ల ఇన్చార్జ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజ గోపాల్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కార్మికులను రెగ్యులర్ చేయాలి కర్నూలు(సెంట్రల్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కార్మిక, కర్షక భవన్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జే.దివాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి కనీసం వేతనం రూ.48 వేలు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు నాలుగు డీ ఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పోస్టులను భర్తీ చేయాలని, కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ ఇచ్చి న హామీలను నెరవేర్చాలని కో రుతూ జూలై 15న తిరుపతిలో ఆందోళన చేపట్టనున్న ట్లు చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 10న విజయవాడలో ఆందోళన చేస్తామన్నారు. -
భార్య కాపురానికి రాలేదని..
● యువకుడు ఆత్మహత్య పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేంద్ర, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నెహ్రూనగర్ ఎల్లంబావి సత్రంలో నివసిస్తున్న రామచంద్రుడు కుమారుడైన బోయ మండ్ల స్వాములు అలియాస్ స్వామి అనే వ్యక్తి తెలంగాణలోని క్రిష్ణదొడ్డి గ్రామానికి చెందిన మద్దమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాములు మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం మద్దమ్మ లొద్దిపల్లెలో ఉన్న అక్క వద్దకు వెళ్లింది. తిరిగి రావాలని పలుమార్లు ప్రాధేయపడినా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్వాములు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి పగిడ్యాల– ముచ్చుమర్రి గ్రామాల మధ్య ఎల్లం బొట్లమ్మ గుడి వద్ద చెట్టుకు పంచతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పగిడ్యాల గ్రామ కావలి మనుషులు ఆదివారం మధ్యాహ్నం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముచ్చుమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుడి తండ్రి రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. -
శ్రీగిరిలో ‘కూటమి’ దందా!
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రంలో కూటమి నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా తమ అనుచరులతో అనధికారికంగా వ్యాపారం చేయిస్తున్నారు. శ్రీశైలంలో క్లాక్రూం వద్ద పంచెలు అమ్ము తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఉచిత కంపార్ట్మెంట్లలో టీ, కాఫీ వ్యాపారం చేయిస్తున్నారు. దుకాణాల సముదాయంలో తనకు అనుకూలమైన వారు ఏవిధమైన వ్యాపారం చేసినా అడ్డుచెప్పకుండా అధికారుల నుంచి గ్రీన్సిగ్నల్ ఇప్పించారు. కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేసి.. శ్రీశైలంలో సెల్ఫోన్లు, లగేజీ బ్యాగులు భద్రపర్చుకునే టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై భౌతికదాడులు చేశారు. ఎవరినీ టెండర్లో పాల్గొనకుండా చేసి కూటమి నేతలు తమ అనుంగ అనుచరులకు ఇప్పించుకున్నారు. క్లాక్రూం ఆదాయంతో పాటు ఇతర వ్యాపారం చేస్తే మరింత డబ్బు వస్తుందని భావించి అక్కడ పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. క్లాక్రూం వద్ద ఎటువంటి ఇతర వ్యాపారం చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే దేవస్థాన ఈఓతో అనుమతి తీసుకోవాలి. టెండర్ ద్వారా ఆ దుకాణాన్ని దక్కించు కోవాలి. ఇవేమీ లేకుండానే పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉచిత కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు కూటమి నాయకుల అనుచరులు టీ, కాఫీ విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. దేవస్థానం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు. బేరం కుదరడంతో.. తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఓ వ్యాపారి గతంలో వీడియో రిలీజ్ చేశారు. అయితే కొన్నిరోజులకు కూటమి నాయకులతో బేరం కుదరడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా సదరు వ్యాపారి దుకాణాలు ఉచిత దర్శనానికి వెళ్లే దారికి ఎదురుగా ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. కూటమి పెద్దల ఆశీస్సులతో దుకాణాల వద్ద మరో దుకాణాల మారిదిగా మెట్లు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారనే కోపంతో మరో మహిళా దుకాణం వద్ద దుకాణం కనపడకుండా సమాచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయిన వారికి అకుల్లో..కానీ వారికి కంచాల్లో అన్న చందంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆర్జిత సేవల క్యూలైన్ క్లాక్రూం వద్ద పంచెల విక్రయాలు ఉచిత కంపార్ట్మెంట్లలో టీ, కాఫీ బిజినెస్ మల్లన్న ఆదాయానికి భారీగా గండి చోద్యం చూస్తున్న దేవస్థాన అధికారులు -
ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి
కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీ దివిటి సోమన్నకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు ఎసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సోమన్నకు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ అమరావతిలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. 2025 ఏప్రిల్ 30న ఏసీబీ డీఎస్పీగా నియమితులై సుమారు 14 నెలల పాటు సేవలందించారు. కర్నూలు: సదరన్ రీజియన్ కర్నూలు హోంగార్డ్ కమాండెంట్గా అమిటి హనుమంతు నియమితులయ్యారు. రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఒక హోంగార్డు కమాండెంట్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్గా ఉన్న మేకల మహేష్ కుమార్ను తిరుపతిలోని పోలీస్ శిక్షణ కేంద్రం(పీటీసీ)కు బదిలీ చేసి.. గుంటూరు ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హనుమంతును కర్నూలు హోంగార్డ్స్ విభాగానికి బదిలీపై వస్తున్నారు. సోమన్న -
సీబీసీఐడీ దర్యాప్తు షురూ!
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీశాఖ డీడీ కార్యాలయంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించిన కేసును సీబీసీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చలపతిరావు ఈ మేరకు కేసును బదలాయించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే.. సీబీసీఐడీకి ఈ కేసును బదిలీ చేశారు. ఇంతవరకు అటవీశాఖ అంతర్గత దర్యాప్తు ద్వారా ఈ కేసులో సుమారు రూ.11 కోట్ల ప్రభుత్వం ధనం తప్పుడు మార్గాల ద్వారా ఇతరుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆత్మకూరు పోలీసులు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు ఆత్మకూరు డీడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి అని తెలుస్తోంది. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా డోన్ టౌన్: సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో డోన్ పట్టణంలో నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. స్థాని క డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూంను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతు ందన్నారు. డోన్ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిందితులను త్వరగా గుర్తించేందుకు 118 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డోన్ లో బందోబస్తు కోసం డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ డ్రోన్ను ఉపయోగించి పెట్రోలింగ్ చేస్తామన్నారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్, డోన్, ప్యాపిలి, బనగానపల్లె సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, వెంకట్రామిరెడ్డి ,ప్రవీణ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డి, నరేంద్రకుమార్, మమత పాల్గొన్నారు. ● జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు చూపిన తెగువ, చేసిన పోరాటం, త్యాగం తెలుగుజాతి మరువలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో అల్లూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు స్మరించుకోవాలన్నారు. జెడ్పీ ఇన్చార్జీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1897 జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించుకున్న అల్లూరి బ్రిటీష్ పాలనకు వ్యతి రేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత జూన్ 27న నిర్వహించిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదవ సెమిస్టర్ బీఏ కోర్సుకు 74, బీబీఏ ఒకరు, బీసీఏ నలుగురు, బీకాం 143 మందికి 139, బీఎస్సీ 174 మందికి 170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. -
రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారు
కొలిమిగుండ్ల(అవుకు): రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఓర్వలేకనే కుట్రతో అక్రమంగా అరెస్ట్ చేశారని అవుకు పట్టణానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీవింగ్ సెక్రటరీ కునుకుంట్ల రామన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామన్నపై పీడీ యాక్ట్ అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శనివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డితో కలసి అవుకు చేరుకొని రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు అరెస్ట్కు గల కారణాలను కాటసానికి రామన్న కుటుంబ సభ్యులు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతకేసులను తెరపైకి తీసుకొచ్చి ఉద్దేశ పూర్వకంగానే అరెస్ట్ చేశారని తెలిపారు. తెల్లవారు జామునే అందరూ నిద్రించే సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లారని చెప్పారు. ఏం నేరం చేశాడని పదుల సంఖ్యలో పోలీసులొచ్చి తీసుకెళ్లారని ప్రశ్నించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని వారికి కాటసాని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్ట్లపై వైఎస్సార్సీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
వరి సాగును తగ్గించుకోవాలి
నంద్యాల(అర్బన్): ఎల్నినో ప్రభావం జూలై, ఆగస్టు నెలల్లో అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ సూచించారు. నంద్యాలలోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో శనివారం ఎల్నినోపై అవగాహన–ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్నినోపై రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వారం ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను సమీక్షించుకుంటూ తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ సుమతి మాట్లాడుతూ.. తక్కువ వర్షపాత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలన్నారు. శాస్త్రవేత్త సుబ్బారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. సదస్సులో చర్చించిన అంశాలను రైతులకు తప్పక తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు రామచంద్రారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ చంద్రిక, వ్యవసాయ శాఖ తొమ్మిది జిల్లాల అధికారులు, వివిధ పరిశోధన స్థానాల అధిపతులు, కృషి విజ్ఞాన కేంద్రాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
అనుమతి లేని ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారు
● అధికారులపై మండిపడిన గ్రామస్తులు డోన్ (ప్యాపిలి): గార్లదిన్నె పంచాయతీ పరిధిలోని మాధవరం గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంకర పరిశ్రమను గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామ సభ ప్రారంభం కాగానే ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వే నంబర్ 691, 692 పరిధిలో 4.90 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామసభ అనుమతి లేకుండా ఎవరూ కేటాయించారన్నారు. పర్యావరణ అనుమతి ఉందా? యువతకు ఉపాధిపై లిఖిత పూర్వక హామీలు ఎమైనా ఇచ్చారా? పరిశ్రమ పేరు, ఉత్పత్తి వివరాలు గ్రామస్తులకు తెలపకుండా ఎలా అనుమతులు ఇచ్చారన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుమతులతో పాటు అన్ని చట్లబద్ధమైన అనుమతులు పొందిన తరువాతే పరిశ్రమ ఏర్పాటు చేయాలని అంత వరకు అనుమతి ఇవ్వొద్దని అధికారులను కోరారు. దీంతో అధికారులు గ్రామ సభను వాయిదా వేసి వెనుదిరిగారు. -
వంద రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా..
సీఎం చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో శ్రీశైలం నీటిముంపు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని పటేల్ సెంటర్లో వేలాది జనం మధ్యలో ఇచ్చిన హామీని విస్మరించడంతో బాధితులు మూడు నెలలుగా నందికొట్కూరు పట్టణంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారానికి 100 రోజుకు చేరుకుంది. అయినా అధికారులు కానీ.. కూటమి నేతలు అటు వైపు కన్నెత్తి చూడలేదు. నిర్వాసితులు ఆమరణ దీక్షకు కూడా సిద్ధం అంటున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
బడిలో ఒకరు.. హాజరులో 13
● పులిమద్ది ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థుల బోగస్ హాజరునంద్యాల(అర్బన్): స్థానిక పులిమద్ది గ్రామం ఎంపీపీఎస్ ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థుల బోగస్ హాజరు వెలుగు చూసింది. ఒకే ఒక్క విద్యార్థిని పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా 13 మంది విద్యార్థులు ఉన్నట్లు హాజరు పట్టికలో చూపుతూ హెచ్ఎం అవకతవకలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎంఈఓ బ్రహ్మంనాయక్ పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. రికార్డుల్లో 13 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించి తప్పుడు సమాచారం ఇచ్చిన హెచ్ఎం కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు నివేదిక పంపారు. బోగస్ హాజరు చూపుతూ వారికి వస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిధులు, గుడ్లు తదితరాలు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. అయితే గత నెలలో పాఠశాలలు పునః ప్రారంభమైన నాటి నుంచి ఈ తతంగం జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఆ పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. గత ఏడాది సైతం ఇదే తరహాలో విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా తగ్గిపోవడంతో పాఠశాలను డీ గ్రేడ్లో ఉంచారు. 2023–24లో దాదాపు 32 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 2026 నాటికి ఒకే ఒక్క విద్యార్థితో స్కూల్ నడుస్తూ వస్తోంది. సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరిన కొద్ది రోజులకే ప్రైవేటు పాఠశాలకు వెళ్లడంతో ఒకే విద్యార్థిని నిహారిక విద్య అభ్యసిస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, ప్రభుత్వ బడి నిర్వీర్యం అవుతుండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ వినియోగంపై ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి జిల్లాలో ఒక ఫీడర్లో విద్యుత్ వినియోగంపై సమగ్రంగా ఆడిట్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించారని విద్యుత్ శాఖ జిల్లా నోడల్ అధికారి ఆర్.పద్మ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులోని బళ్లారి రోడ్డు సెక్షన్న్లోని ఎస్ఏపీ క్యాంపు సబ్స్టేషన్ నందు 11 కేవీ ఆటోనగర్ ఫీడర్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఫీడర్ను ఆమెతో పాటు కర్నూలు సర్కిల్ ఎస్ఈ ప్రదీప్కుమార్, టౌన్ ఈఈ శేషాద్రి తదితరులు పరిశీలించారు. ఫీడర్ పరిధిలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు, సర్వీసులన్నింటికీ స్మార్ట్ మీటర్లు బిగించి ఆడిట్ చేసేందుకు వీలుగా పకడ్బందీగా మ్యాపింగ్ చేసేలా ఎన్నోవేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఫీడర్లో ఆడిట్ చేసిన తర్వాత జిల్లా అంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు. -
మోసం చంద్రబాబు నైజం
● ఉద్యోగాలు వచ్చే వరకూ పోరాడదాం ● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ప్రతి సారి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం, ఆ తర్వాత మోసం చేయడం సీఎం చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ విమర్శించారు. ఉద్యోగాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దారా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్ష శిబిరం నుంచి పటేల్ సెంటర్ వరకూ ముంపు బాధితులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధ్దాల హామీలైనా ఇస్తారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ముంపు బాధితుల సమస్యను ఏనాడైనా అసెంబ్లీ, పార్లమెంట్లో కానీ.. కనీసం తెలుగు దేశం మహానాడులోనైనా ఒక్క మాటనైనా మాట్లాడారా.. అని ప్రశ్నించారు. 2029లో జగనన్న సీఎం కావడం ఖాయమని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో వామపక్షాల పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహులు, రఘురామమూర్తి, నాగేశ్వరరావు, నీటిముంపు నిరుద్యోగుల సంఘం నాయకులు జయన్న, నాగశేనారెడ్డి, దరగయ్య, కిరణ్గౌడ్, వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ అధికారుల దాడులు
కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో శుక్రవారం మైనింగ్ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రామ సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వ వద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారనే నెపంతో తనిఖీలు చేశారు. గనుల్లో పనులు చేసేందుకు వచ్చిన ప్రొక్లెయినర్, మూడు టిప్పర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారులు ముందుగానే ఎంపిక చేసుకున్న యజమానుల గనుల్లో మాత్రమే దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీపంలో ఇతరులకు చెందిన గనులకు జోలికి వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. గనుల్లో పనులకు వెళ్లిన వాహనాలను ఎలాంటి సంబంధం లేక పోయినా స్టేషన్కు తరలించడంతో వాహనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి ● జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ మహానంది: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే స్పందించి చట్టపరిధిలో న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశించారు. మహానంది పోలీస్స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ రామ్మోహన్రెడ్డిలతో కలిసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, తగిన న్యాయం అందేలా చూడాలని సూచించారు. వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) కోర్సును ఉచితంగా అభ్యసించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ వైజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 సంవత్సరాలు దాటి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, వొకేషనల్, వన్ సిట్టింగ్ ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులన్నారు. దరఖాస్తులు ప్రభుత్వ వెబ్సైట్ http://cfw.ap.nic.in నుంచి లేదా ప్రభుత్వ ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) ట్రైనింగ్ స్కూల్, ప్రాంతీయ శిక్షణా కేంద్రం(సీ్త్రలు), కర్నూ లు వారి నుంచి పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా అక్కడే సమర్పించాలన్నారు. ఉచిత హాస్టల్ వసతితో పాటు నెలవారీ స్టైఫండ్ ఇస్తారన్నారు. వివరాలకు 85559 10104, 90593 27020, 99899 81266 సంప్రదించాలని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్థానానికి రూ.11లక్షల విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం గుంటూరుకు చెందిన పీవీ రమణమ్మ రూ.5 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి మరో రూ.5 లక్షలు మొత్తం రూ.10 లక్షల విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్కు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన కె.శంకర్ రూ.లక్ష విరాళాన్ని అందించారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామి వారి శేష వస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. నేడు జీపీడీపీపై ఎంపీడీఓలకు శిక్షణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ అధివృద్ధి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ నెల 4న శిక్షణను ఇస్తున్నట్లు డీపీఆర్సీ ప్రిన్సిపాల్, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. శిక్షణ స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ తప్పక హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శిక్షణ అనంతరం మండల స్థాయిల్లో ఈ నెల 7న ఇదే అంశంపై శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్ 41వ వార్డులో జరుగుతున్న ‘సర్’ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వార్డులోని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారాలను వీలైనంత త్వరగా సంబంధిత బీఎల్ఓలకు అందజేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలన్నారు. ఆదివారం కూడా బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకుని తమ ఓటును పరిరక్షించుకోవాలన్నారు. మన ఓటు – మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వార్డులో ని స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రానున్న రోజుల్లో జల్లులే..
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 20 రోజులకు పైగా వర్షాల జాడ లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 1.60 లక్షలకుపైగా హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు 50వేల హెక్టార్లలోని పంటల్లో ఎదుగుదల లోపించింది. మరో 25వేల హెక్టార్లలో అంతంతమాత్రం తేమలో విత్తనాలు విత్తుకోవడంతో మొలకలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతున్నా చినుకుజాడ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు జల్లులకే పరిమితం కానున్నాయి. దీంతో ఖరీఫ్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో పశ్చిమం దిశగా గాలులు గంటకు 15 కిలో మీటర్ల వేగంతో వీస్తుండటం గమనార్హం. ఇదిలాఉంటే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉద యం వరకు ఎమ్మిగనూరులో 3.4 మి.మీ, కర్నూలు రూరల్లో 3.2, మంత్రాలయంలో 3, కర్నూలు అర్బన్లో 2.6, కల్లూరులో 1.2, కౌతాళంలో 0.6 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో కలిపి నమోదైన వర్షపాతం 14 మి.మీ మాత్రమే. 7న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 7న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ఇన్చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు–ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష కొనసాగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశాలకు స్థాయీ సంఘాల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని కోరారు. ఇద్దరు ఎంపీడీఓలకు పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు ఎంపీడీఓలకు డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (డీడీఓ) గా పదో న్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం పీఆర్అండ్ఆర్డీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదించి విడుదల చేసిన జాబితాలో కల్లూరు ఎంపీడీఓ జి.నాగశేషాచలరెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న మంజులావాణి పేర్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఎంపీడీఓలకు డీడీఓలుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు పీఆర్అండ్ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్దండే జీఓ విడుదల చేశారు. -
పిల్లల కడుపు కొడితే ఇంటికే
● ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డిపగిడ్యాల: హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల కడుపు కొట్టి అక్రమాలకు పాల్పడితే ఇంటికి పోతారని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృత తనిఖీ లు చేపట్టారు. ఉదయం ఆయన లక్ష్మాపురం అంచె వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. బియ్యం నిల్వలు, నూనె, కూరగాయలు, కోడిగుడ్ల నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం పిల్లలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పిల్లల కోరిక మేరకు మెనూలో ఉప్మా స్థానంలో టమాట రైస్ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అక్కడి నుంచి లక్ష్మాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన స్టాక్ను, అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలోని మూడు రేషన్ దుకాణాలను తనిఖీలు చేపట్టారు. అనంతరం పగిడ్యాలలోని 7వ అంగ న్వాడీ కేంద్రం కార్యకర్త ప్రభావతి, ఎస్సీ హస్టల్ వార్డెన్ తిరుపాలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇచ్చే మెనూలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యా దులు ఉన్నాయని పద్ధతి మార్చుకోకపోతే ఇంటికి పోతారని మందలిచ్చారు. మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయం, పాలమర్రి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోప్యాయులు, ఉపా ధ్యాయ బృందం సన్మానించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ శంకర్ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెండో జాబితాలో పేరు ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు
మాది వీరాపురం గ్రామం. మా కుటుంబం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో 4.10 ఎకరాల భూమిని, ఇల్లును కోల్పోయాం. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఇచ్చిన జీవోతో ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశాను. రోజులు గడుస్తున్నా ఉద్యోగం కలగానే మిగిలింది. రెండోవ జాబితాలో నా పేరు ఉన్నా ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. నా వయస్సు 45 ఏళ్లు. ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తారో దిక్కుతోచడం లేదు. – ఎస్. జయన్న నెహ్రునగర్ గ్రామం, పగిడ్యాల మండలం రెండెకరాల భూమితో పాటు ఇళ్లు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో పోయాయి. 42 ఏళ్ల వయస్సు వచ్చినా ఉద్యోగం రాలేదు. దేశంలో ఎవరికీ జరగని అన్యాయం శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఇలా చేయడం నాలుగో సారి. నిర్వాసితులకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలి. – కొండ దరగయ్య, జూటూరు గ్రామం, పాములపాడు మండలం -
ఆంజనేయస్వామికి పాలతో అభిషేకం
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని రణమండల కొండ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహానికి గురువారం 2,001 లీటర్ల పాలతో భక్తులు అభిషేకాన్ని నిర్వహించారు. దాత మణికంఠ నూతనంగా ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి గురువారం వరకు 41వ రోజులు మండల దీక్ష సందర్భంగా 2,001 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ మేరకు ప్రతి భక్తునితో స్వామివారికి పాలాభిషేకం జరిపించారు. అంతేగాకుండా పాలాభిషేకం చేసిన వారి ఫొటోను తీసి ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకుడు టీజీ పాండురంగయ్యశెట్టి, ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
పుసులూరులో భారీ ఇసుక డంప్లు
● విషయం తెలిసి నోటీసులతో సరిపెట్టిన అధికారులు నంద్యాల(అర్బన్): కుందూ నది పక్కనే ఉన్న పుసులూరులో కూటమి నాయకులు భారీగా ఇసుక డంప్ చేశారు. పది.. ఇరవై.. కాదు వందల సంఖ్యలో ట్రిప్పుల ఇసుకను కుందూ నది నుంచి తోడేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఇసుక దందా దర్జాగా సాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి మొరసు ఇసుకను తరలించేందుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్ ఇసుక రూ.9 వేల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. భారీ ఇసుక డంప్ల సమాచారం రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కేసీ కెనాల్ శాఖల అధికారులకు తెలిసినా చర్యలకు వెనుకాడుతున్నారు. పుసులూరు గ్రామంలోనే రెండు మూడు ప్రాంతాల్లో వేలాది ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంప్ చేసినా అడిగేవారు లేరు. అలాగే చాపిరేవుల గ్రామంలో ఇసుక డంప్ చేసి రాత్రి వేళ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పుసులూరు గ్రామంలో ఇసుక డంప్లపై నంద్యాల రూరల్ తహసీల్దార్ను వివరణ కోరగా.. ఇసుక డంప్ చేసిన వారికి నోటీసులు పంపామని, ఇంత వరకు సమాధానం ఏదీ రాలేదన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకునేందుకు రెవెన్యూ శాఖ ప్రయత్నించిందని, అన్ని శాఖల సమన్వయంతో ఇసుక తరలింపును ఆపగలిగామన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లాలో సీసీఆర్ కార్డుల జారీ ఇలా..
నియోజకవర్గం మండలాలు ఆర్బీకేలు సీసీఆర్ కార్డుల ఇప్పటి వరకు శాతం ఆళ్లగడ్డ 6 67 5,208 361 6.93 పాణ్యం 2 23 2,340 535 22.86 బనగానపల్లె 5 54 4,268 469 11.11 నంద్యాల 2 23 2,340 374 15.98 డోన్ 3 52 1,969 318 16.15 శ్రీశైలం 5 36 3,559 1,022 28.71 నందికొట్కూరు 6 54 5,316 878 16.5 మొత్తం 29 309 25,000 3,957 15.83 -
బస్సు నిలుపలేదని..
బనగానపల్లె: నందవరం గ్రామంలో ఆర్టీసీ బస్సును నిలుపలేదని అదే గ్రామానికి చెందిన ప్రయాణికుడు శేషుకృష్ణ ఆందోళనకు దిగాడు. నందివర్గం ఎస్ఐ భూపాలుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బస్సు స్టేజీ వద్ద గురువారం ప్రయాణికులు బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ ముందుకు కదిలించాడు. బస్సును ఆపాలంటూ ప్రయాణికుడు శేషుకృష్ణ అడిగినా నిలుపలేదు. అతను బస్సును వెంబడించి ఎక్కి డ్రైవర్ బాలయ్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బస్సు దిగిన శేషుకృష్ణ బస్సు ముందుకు వెళ్లకుండా అడ్డుగా పడుకున్నాడు. దాదాపు అర గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నందివర్గం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పి శాంతింపజేశారు. ఇరువురు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పాముకాటుతో విద్యార్థి మృతి కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామ పంచాయతీ మజారా గ్రామమైన పాత మాడుగులలో ఓ విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామచంద్రుడు, శివపార్వతి దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రామ్చరణ్ (13) ముసలిమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం అతని పెద్దనాన్న కుమార్తె పెళ్లి ముహూ ర్తం కావడంతో ఇంటివద్ద ఉన్నాడు. మధ్యాహ్నం ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ఇంట్లో పొదిగిన కోడి గట్టిగా అరవడం గమనించాడు. మంచంపై నుంచే కోడిని నివారించేందుకు చేయి ఊపాడు. అప్పటికే అక్కడ ఉన్న పాము రామ్చరణ్ బొటన వేలుపై కాటువేసింది. కుటుంబీకులు వెంటనే ఎర్రమఠం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రామ్చరణ్ మృతితో పెళ్లింట విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం పరిధిలో ఇద్దరు సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఇన్చార్జి సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సి.బెళగల్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డి.జయప్రకాష్ను దొర్నిపాడుకు, వెల్దుర్తిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఎండీ ఉమైర్ అహ్మద్ను నంద్యాల ఎస్జీఎస్డబ్ల్యూ కార్యాలయానికి పదోన్నతి కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి ఉత్తర్వులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అందజేశారు. హొళగుంద: సబ్సిడీ వేరుశనగ, యూరియా వస్తోందని, ముందుగా డబ్బులు చెల్లించిన వారికే ఇస్తామని చెప్పి వీఏఏ పరమేశ్ నాయక్ మోసం చేశారని నెరణికి గ్రామానికి చెందిన రైతులు గురువారం ఏఓ ఆనంద్ లోకాదళ్కు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి అదృశ్యమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని నెరణికి చెందిన రైతులు సదాశివ, లింగప్ప, మల్లికార్జున, మాలింగ్సాబ్, మలకన్న, శేక్సాబ్ తదితరులు తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందక, డబ్బులు కూడా తిరిగి రాక ఏమి చేయాలో తోచడం లేదన్నారు. వీఏఏపై చర్యలు తీసుకుని తమకు డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇదిలా ఉండగా నెరణికి రైతులతో పాటు నెరణికి తండా, కొత్తపేట రైతులు కూడా వీఏఏపై ఆలూరు సీఐకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ఇద్దరు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి
గోనెగండ్ల: స్థానిక సంతమార్కెట్లో గురువారం ఇద్దరు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి చేసింది. తొలుత సోహెల్ను వీపు కింద భాగంలో కరిచింది. అనంతరం పాఠశాల నుంచి బయటకు వచ్చిన అన్సర్ అనే విద్యార్థిపై దాడి చేయడంతో ఎడమ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. గమనించిన స్థానికులు కుక్క దాడిలో గాయపడిన విద్యార్థులను సమీపంలోని మెడికల్ షాపు దగ్గర ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య గుంపు గుంపులుగా తిరిగే కుక్కలను బంధించి అడవుల్లో వదిలివేయాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాక్టర్ ఇంజిన్కు నిప్పు బేతంచెర్ల: పట్టణంలోని దుర్గాపేట సమీపాన బలపాలపల్లె రహదారిలో ట్రాక్టర్ ఇంజిన్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. దుర్గాపేట కాలనీకి చెందిన ఉయ్యాలవాడ మద్దయ్య తన ట్రాక్టర్ను డోన్ రహదారిలోని నయారా పెట్రోలు బంక్ వద్ద బుధవారం రాత్రి ఉంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ను అక్కడ నుంచి తీసుకెళ్లి బలపాలపల్లె రహదారి పక్కన ఉంచి ఇంజిన్పై డీజల్ పోసి అంటించడంతో ముందు టైర్లతో పాటు ఇంజిన్ దెబ్బతింది. ఈ ఘటనలో రూ. 4 నుంచి 5 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు మద్దయ్య వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ మంత్రాలయం రూరల్: అనుమతి లేకుండా మంత్రాలయంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం సీజ్ చేసినట్లు మైనింగ్ టెక్నికల్ అధికారి హాసీనాభాను తెలిపారు. ఇసుకను విచ్చలవిడిగా తోలడంతో భూగర్భ జలాలు ఇంకిపోతాయన్నారు. ఇసుక ట్రాక్టర్లతో మంత్రాలయం వచ్చే భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సీజ్ చేసిన రెండు ట్రాక్టర్లను పోలీసుస్టేషన్ తరలించామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష డోన్ టౌన్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు మందు బాబులకు జైలు శిక్షపడింది. సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండపేటకు చెందిన కె.మల్లేష్, బి మహేష్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా గురువారం జడ్జి ఎస్.నూరుల్లా విచారణ చేసి మల్లేష్కు మూడు రోజులు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా, మహేష్కు మూడు రోజులు రిమాండ్కు ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. బాలికను రక్షించబోయి.. డోన్ టౌన్: తాడిపత్రి నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డోన్ వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం డోన్ ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న బస్సు అనంతరం కర్నూలుకు బయలుదేరింది. ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద వెళ్తుండగా ఒక అమ్మాయి అకస్మాత్తుగా రోడ్డుదాటేందుకు ప్రయత్నంచగా బస్సు డ్రైవర్ అప్రమత్తమై పక్కకు తిప్పడంతో కల్వర్టును ఢీకొని నిలిచిపోయింది. త్రుటిలో బాలిక ప్రాణాలతో బయటపడింది. బస్సు ఎడమ భాగం దెబ్బతినడంతో ప్రయాణికులను మరో బస్సులో కర్నూలుకు తరలించారు. గాయపడిన విద్యార్థులు అన్సర్, సోహెల్కు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది -
దోమలు పుట్టకూడదు.. కుట్టకూడదు
కర్నూలు(హాస్పిటల్): దోమలు పుట్టకూడదని, ఒకవేళ పుట్టినా అవి కుట్టకుండా వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ చెప్పారు. జాతీయ డెంగీ మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను గురువారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి నిల్వ ఎక్కడుంటే అక్కడ వివిధ రకాల దోమలు పెరుగుతాయని, వీటి ద్వారా డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటిలోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో మలేరియా నియంత్రణాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉమ, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శైలేష్కుమార్, డాక్టర్ మహేశ్వరప్రసాద్, డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, సహాయ మలేరియా అధికారి విజయ్కుమార్, డీపీఓ విజయరాజ్, డీపీహెచ్ఎన్ఓ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
కుందూను కొల్లగొడుతున్నారు
బండిఆత్మకూరు: మొరసు మాఫియా కుందూనదిని కొల్లగొడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టపగలు యంత్రాలతో తవ్వేస్తోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మండల పరిధిలోని భోజనం గ్రామ వంతెన సమీపంలో గురువారం జేసీబీతో భారీ ఎత్తున మొరసు తవ్వి ట్రాక్టర్ల ద్వారా రామాపురం వైపు తరలించారు. రోజూ బహిరంగంగానే ఈ తంతు సాగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మొరసు అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. -
కుందూ నది.. రేనాటి గడ్డకు జీవ నాడి. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ కుందూ రిజర్వాయర్ల హామీని నెరవేర్చలేదు. కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులు నిర్మించాలి. వీటి నిర్మాణ పనులు రద్దు
అగ్రిమెంట్లు రద్దు అలగనూరు రిజర్వాయర్ పనులు చేయిస్తే సరిపోతుందని, రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. రిజర్వాయర్ల పనులు 25 శాతంలోపే జరిగాయనే ఇటీవల సాకు చూపారు. ఈ మేరకు పనులను నిలిపివేసేందుకు ప్రభుత్వానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయంపై జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషాను వివరణ కోరగా.. రాజోలి, జోళదరాశి రిజర్వాయర్ల పనులు 14 శాతం కూడా జరగలేదన్నారు. 25 శాతంలోపు పనులు జరిగిన వాటిని ఏజెన్సీలతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు జూన్ నెలలోపంపించామని చెప్పారు. కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర జలాలు ప్రధాన వనరు. బ్రిటీష్ నాటి కాలంలో నిర్మించిన కేసీ కెనాల్ నీరే ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జల్లాలకు జలాధారం. సుంకేసుల బ్యారేజీ నుంచి కడప జిల్లాలోని కృష్ణాపురం వరకు 305.6 కి.మీ వరకు ఈ కాలువ ప్రయాణిస్తుంది. రెండు ఉమ్మడి జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు ఆయకట్టు, 260 గ్రామాలకు సాగు, తాగు నీటిని అందిస్తుంది. కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 39.9 టీఎంసీల నీటి వాటా ఉంది. ఇందులో 29.9 టీఎంసీలు నది ప్రవాహ నీటి నుంచి, 10 టీఎంసీల నీరు టీబీ డ్యాం నిల్వ నుంచి వాడుకునేలా కేటాయింపులు ఉన్నాయి. అయితే తుందభద్ర నదికి వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అలగనూరు రిజర్వాయర్(2.95 టీఎంసీలు)మాత్రమే ఉంది. ఈ రిజర్వాయర్ నీరు తాగు నీటికి కూడా సరిపోవడం లేదు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని చివరి ఆయకట్టుకు సాగు, తాగు నీరు అందడం లేదు. ప్రతి ఏటా ఈ ఆయకట్టుదారులు సాగు నీటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు. ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే దశలో నీటి కష్టాలతో రైతులు నష్టపోయేవారు. కేసీ రైతుల కన్నీటి కష్టాలు తీర్చేందుకు 2008 డిసెంబరు 23న రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులు నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.407.06 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ జీఓ ఎం.ఎస్ నంబరు 244ను జారీ చేశారు. ఆ రిజర్వాయర్ల నిర్మాణాలకు సిద్ధం అవుతున్న సమయంలో ఎన్నికల కోడ్ రావడం, ఆ తరువాత 2009లో వైఎస్సార్ హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టుకుంది. ఆ తరువాత ఆ రిజర్వాయర్ల గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక 2015–16 ఎస్ఎస్ఆర్ ప్రకారం రూ.697 కోట్లకు అంచనాతోనే వంచించారు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు కుందూనదిపై రాజోలి, జోళదరాశి రిజర్వాయర్ల కోసం 2019 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జోళదరాశి(2.95టీఎంసీలు) నిర్మాణానికి రూ.207.95 కోట్లు, రాజోలి(0.8 టీఎంసీలు)నిర్మాణానికి రూ.1,357 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట కుందునదిని విస్తరించే పనులు సైతం చేపట్టారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణాలకు భూసేకరణ జరుగుతున్న సమయంలో అధిక రేటు చెల్లించాలని పనులకు అడ్డుపడ్డారు. రాజోలి జలాశయంలో ఆరు గ్రామాలు 9,938 ఎకరాలు, జోళదరాశికి ఒక గ్రామం 2,157 ఎకరాలు ముంపుకు గురవుతోంది. ఇందులో కొంత భూసేకరణ పూర్తయింది. ఆలోపు ఎన్నికల రావడం.. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో ఆ రిజర్వాయర్ల పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. మేం అధికారంలోకి వస్తే రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులు నిర్మిస్తాం. భూములు కోల్పోయే రైతులకు రెట్టింపు పరిహారం చెల్లిస్తాం. – ‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేష్ రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లు నిర్మిస్తాం. కడప జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగు నీరు ఇస్తాం. – 2025 జనవరి 18న మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లు ఇక లేనట్లే! రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు తాజాగా వాటిని రద్దు చేయాలని ప్రతిపాదనలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,758 కోట్ల మంజూరు 2019లో శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం వైఎస్ నేడు రిజర్వాయర్ల కింద 84,686 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం -
గుడ్డు సైజు తగ్గితే బ్లాక్ లిస్టులోకి కాంట్రాక్టర్
హొళగుంద: ‘‘కోడిగుడ్ల సైజు మరీ చిన్నగా ఉంటోంది. 50 గ్రాములు పైగా ఉండాల్సిన బరువు 30–40 గ్రామాలు దాటడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతాం.’’ అని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన హొళగుంద మండలంలోని హెబ్బటం, హొళగుందలో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, రేషన్షాపులతో పాటు హొళగుందలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) తనిఖీ చేశారు. కేజీబీవీ, ఉన్నత పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లను పరిశీలించిన ఆయన సైజు చిన్నగా ఉండడాన్ని గమనించి సంబంధిత ఎస్ఓ, ఎంఈఓ–2 కబీర్సాబ్లను ప్రశ్నించారు. టెండర్దారుడి దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం మంచి గుడ్లను అందించేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్కు స్వయంగా ఫోన్ చేసి పెద్ద సైజు గుడ్లను పంపించాలని ఆదేశించారు. కేజీబీవీలో విద్యార్థినీలతో ముచ్చటిస్తూ వసతి కేంద్రంలో సమస్యలు, వంటలు ఇతరత్రాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫిర్యాదు బాక్స్లోని లెటర్లను పరిశీలించి చికెన్ను తక్కువ ఇస్తున్నారని, ఎక్కువ ఇవ్వాలని సూచించారు. అలాగే ఉప్మా వద్దన్న బాలికలకు ఎగ్ రైస్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక తహసీల్దారు లక్ష్మిరాజు తదితరులు ఉన్నారు. -
నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించాలి
● వ్యవసాయ విశ్వ విద్యాలయం డీఎస్ఏ డాక్టర్ సంపత్కుమార్మహానంది: ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించా లని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీఎస్ఏ డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. మహానంది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో గురువారం రాత్రి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్యామ్రాజ్ నాయక్ ఆధ్వర్యంలో కాలేజ్ డే, హాస్టల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలేజ్ సావనీర్ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. మహానంది వ్యవసాయ కళాశాల అభివృద్దికి రూ. కోటి నిధులు కేటాయిస్తున్నామని, రూ. 75 లక్షలతో ఎగ్జామినేషన్ హాలు, రూ. 25 లక్షలతో బాలికల హాస్టల్ నిర్మిస్తామన్నారు. నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ వి. జయలక్ష్మీ మాట్లాడుతూ.. వ్యవవసాయ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. క్రమశిక్షణతో చదువుతూ మంచి గుర్తింపు పొందాలని సూచించారు. కళాశాల బెస్ట్ స్టూడెంట్గా నిలిచిన వి.నిఖిలతో పాటు మంచి మార్కులు పొందిన వారు, క్రీడల్లో రాణించిన వారికి సర్టిఫికెట్స్తో పాటు మెమెంటోలు అందించి అభినందించారు. వేడుకల్లో మహానంది కళాశాల ఓఎస్ఏ వీరయ్య, వార్డన్ విజయభాస్కర్, సీనియర్ ఫ్రొఫెసర్ జాన్సన్, అధ్యాపకులు డాక్టర్ గీతా శిరీష, డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ త్రివిక్రమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తనే ముంచారు.. ప్రజలకు ఏం చేస్తారు?
● డబ్బులు తీసుకుని మోసం చేశారు ● టీడీపీ కార్యకర్త వాల్మీకి నరసింహుడు దేవనకొండ: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని టీడీపీ నేతలు ప్రజలకు ఇంకేమి చేస్తారని నల్లచెలిమల గ్రామానికి చెందిన వాల్మీకి నరసింహుడు ప్రశ్నించారు. తాను 35 ఏళ్ల నుంచి టీడీపీలోనే ఉన్నానని, తనను నమ్మించి డబ్బులు వసూలు చేసుకుని నట్టేట ముంచారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి పోస్టు చేశాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా కుమారుడు డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉండడంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇప్పించాలని మండల కన్వీనర్ను అడిగా. నా వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఆ పోస్టు ఇప్పించారు. దీనిపై అడిగితే ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతికి డబ్బులు ఇచ్చామన్నారు. ఆమెనే అడిగితే ఇదిపై నుంచి వచ్చిందని, మేం ఏమీ చేయలేనని చెప్పారు. ఇదే విషయంపై మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడిని అడిగినా ఏమీ స్పందించ లేదు. అప్పు చేసి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి?’ అని అన్నారు. తన కుమారుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని వైకుంఠం జ్యోతి ఇచ్చిన లెటర్ పాడ్ను చూపారు. ఇప్పటికై నా స్పందించి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరారు. -
దళిత జెడ్పీటీసీ సభ్యునికి అవమానం
వెల్దుర్తి: అధికారిక కార్యక్రమంలో వేదికపైకి పిలువకుండా దళితుడైన వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న మాదిగపై వివక్ష చూపారు. వీబీ–రామ్జీ పథకాన్ని జిల్లా స్థాయిలో ప్రారంభించి గురువారం వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేదికపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, అధికారులు ఉన్నారు. వారితో పాటు ముందు వరుసలో టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు, ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, బొమ్మన రమాకాంత్ రెడ్డి, వెనుక వరుసలో రామకృష్ణ ఆచారి, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్, ఐజయ్య కనిపించారు. ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కావలన్న పిలుపుతో అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న మాదిగను కనీసం వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆయన ప్రజలతో పాటు షామియానా కింద కుర్చీలో కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న సందర్భంలో జెడ్పీటీసీ సభ్యునికి జరుగుతున్న అవమానంపై మీడియా చేస్తున్న హడావుడిని ఏపీఓ లక్ష్మన్న గుర్తించారు. వెంటనే జెడ్పీటీసీ సభ్యుడిని స్టేజ్పైకి పిలుచుకుని వెళ్లారు. దళిత ప్రజాప్రతినిధికి జరిగిన అవమానంపై ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రయాణికురాలి మెడలోని నెక్లెస్ చోరీ
కర్నూలు: కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళ మెడలోని బంగారు నెక్లెస్ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేసి పారిపోయాడు. వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన ఈశ్వరమ్మ దంపతులు కర్నూలులో వివాహ వేడుకలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు 6వ నంబర్ ప్లాట్ఫారం వద్ద బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని యువకుడు బస్సు డోర్ వద్దకు వచ్చి ఈశ్వరమ్మ మెడలో ఉన్న ఒకటిన్నర తులం బంగారు నెక్లెస్ను లాక్కుని పారిపోయాడు. ఆమె అప్రమత్తమై కేకలు వేసేలోగా దొంగ కనిపించకుండా పారిపోయాడు. ఘటనపై బాధితురాలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ వెంటనే స్పందించి బస్టాండ్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. నెక్లెస్ చోరీ జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో పక్కనున్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. -
రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత
కర్నూలు: రహదారి భద్రత ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్ వి.మదనమోహన్ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ రహదారులు రవాణాకు కీలక మార్గాలుగా ఉంటూనే మరోవైపు చిన్నపాటి అజాగ్రత్తల వల్ల ప్రమాద క్షేత్రాలుగా మారుతున్నాయని, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడిసిన రోడ్లు, అకస్మాత్తుగా తగ్గే విజిబులిటీ, వాహన సాంకేతిక లోపాల కారణంగా వర్షాకాలంలో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. వాహన టైర్లపై ఉండే స్పీడ్ రేటింగ్ అనే ఒక్క అక్షరం ప్రయాణించాల్సిన గరిష్ట సురక్షిత వేగాన్ని నిర్దేశిస్తుందన్నారు. ప్రమాదకరమైన రీతిలో ఓవర్ టేకింగ్ చేయడం, పరిమితికి మించిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం తగదన్నారు. భక్తితో మొక్కలు నాటి.. బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైణ శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో పర్యావరణ పరిరక్షణకు ఓ భక్తుడు తనవంతు సేవగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచా డు. నంద్యాల పట్టణానికి చెందిన మెకానిక్ చాకలి సోమన్న కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షలు వెచ్చించి కాకినాడ నుంచి 140 మొక్కలను తెప్పించి నాటా రు. మర్రి, జువ్వి, మామిడి, రావి తదితర వృక్షాలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వయంగా చేపట్టారు. తరచూ ఆలయానికి వచ్చి మొక్కలను పరిశీలిస్తూ, అవసరమైన ఎరువులు వేయడం, నీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు. పచ్చదనమే భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి సంరక్షించాలని సోమన్న పిలుపునిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేందుకు ఆయన చేస్తున్న సేవను భక్తులు, స్థానికులు అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉయ్యాలవాడ: కొండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాతలు ఆటోను విరాళంగా అందజేసినట్లు ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు విప్రనారాయణాచారి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారు రూ. 7 లక్షలు విలువ చేసే టాటా మ్యాక్స్ ప్యాసింజర్ ఆటోను అందజేశారు. ఈ ఆటో ద్వారా తమ పాఠశాలలో చదువుతున్న సర్వాయిపల్లె, ఆర్.పాంపల్లె గ్రామాలకు చెందిన 25 మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకు వచ్చేందుకు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా బాలిక విద్య ప్రోత్సాహం కోసం ఆటో ఉపయోగపడుతుందన్నారు. ఆటో నిర్వహణ బాధ్యత కొండుపల్లె గ్రామానికి చెందిన విద్యాభివృద్ధి కమిటీ చూసుకుంటుందని వెల్లడించారు. చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
మూడు నెలలుగా తిరుగుతున్నా
చాలా సంవత్సరాలుగా మా గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కౌలు కార్డు ఇవ్వడంతో ఐదేళ్లు వరుసగా రైతు భరోసా వచ్చింది. రెండు సార్లు ఇన్ఫుట్ సబ్సిడీ, పంటల బీమా కూడా రావడంతో ఆర్థికంగా నిలబడగలిగాం. ఈ ఏడాది ఎకరా రూ. 60 వేల చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మూడు నెలల నుంచి కౌలు కార్డు కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – చంద్ర, క్రిష్టిపాడు, ఎస్సీ కాలనీ (దొర్నిపాడు మండలం) ఈ ఏడాది 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, బొప్పాయి, మల్లె తోటలు సాగు చేస్తున్నా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏప్రిల్, మే నెలలోనే కౌలు కార్డులు ఇచ్చి ఉంటే బ్యాంకులో రుణాలు, ఎరువులు తీసుకునే వాళ్లం. ఈ ఏడాది జూలై వచ్చినా కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇదిగో.. అదిగో అంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా ఏం ఉపయోగం. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తోంది. – గేట్ల మాబుసాహెబ్, చాగలమర్రి సీసీఆర్ కార్డుల పంపిణీ కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం వెయ్యి కార్డులు జారీ చేసేందుకు పొలం యజమానులతో అగ్రిమెంట్ చేయించడం జరుగుతోంది. వాతావరణం అనూకూలంగా లేకపోవడం, వరి సాగు చేస్తే కాలువల్లో నీరు వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీంతో కౌలుకు తీసుకునేందుకు రైతులు వెనుకంజ వేయడంతో సంఖ్య తగ్గింది. కార్డుల జారీ లక్ష్యం పూర్తి చేస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి -
భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
● నిజమైన రైతులకు నష్టపరిహారం అందాలి ● పార్టీలకు అతీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి ● తహసీల్దార్ను కోరిన కాటసాని రాంభూపాల్రెడ్డిగడివేముల: సోలార్లో భూములు కోల్పోయిన రైతులకు కాకుండా అనర్హులకు నష్టపరిహారం అందిస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. గడివేముల మండలం చెనకపల్లె, గడిగరేవుల గ్రామాల పొలిమేరలో నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టును బుధవారం కాటసాని పరిశీలించారు. నష్టపరిహారం అందించకుండా సోలార్ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని రైతులు చెప్పడంతో కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ వెంకట్తో మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతుల ఇంట్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఒండుట్ల, పైబోగుల గ్రామాలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగం, పనులు కల్పించాలన్నారు. రెండు గ్రామాల్లో ఉన్న యువకులకు, ప్రజలకు పార్టీలకు అతీతంగా కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఒకే పార్టీకి చెందిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చి, ఇతర పార్టీలకు చెందిన వారికి అవకాశం కల్పించకపోతే వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. అనంతరం జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించి రైతులను సమస్యలను ప్లాంట్హెడ్కు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలునాయక్, వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రారెడ్డి, అనిల్ కుమార్రెడ్డి, మేఽఘనాథరెడ్డి, అనంద్రెడ్డి, గని రాము, రఘమాధవరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, పరమేశ్వరరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజమైన రైతులకు పరిహారం ఇవ్వండి సోలార్లో భూములు కోల్పోయిన నిజమైన రైతులకు పరిహారం అందించాలని తహసీల్దార్ వెంకటరమణను కాటసాని కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలపై తహసీల్దార్కు వివరించారు. మండలంలో ఉన్న రైతులకు మాత్రమే పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ జిల్లాలో ఉన్న వారికి పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పరిహారం జాబితాలో అవకతవకలకు దారితీయకుండా చూడాలని తహసీల్దార్కు సూచించారు. పార్టీలు అతీతంగా పరిహారం అందేలా చూడాలన్నారు. అనర్హులకు పరిహారం అందిస్తే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పెద్దఎత్తున అందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖరరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
ఏపీ ఈఏపీసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
నంద్యాల(న్యూటౌన్): ఏపీ ఈఏపీసెట్లో నంద్యాల జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో నంద్యాల పట్టణానికి చెందిన పి.అక్షిత 86.52 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ ర్యాంకు, స్టేట్లో 33వ ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ ఫార్మసీ విభాగంలో నంద్యాలకు చెందిన జి.జయవర్ధన్రెడ్డి 86.03 మార్కులతో జిల్లాలో ప్రథమ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో జిల్లాకు చెందిన నరాల హర్ష అశ్వని రాష్ట్రస్థాయిలో 82వ ర్యాంకు, యశోద హారిక చైత్ర 116వ ర్యాంకు, భువనేశ్వర్ 151వ ర్యాంకు, సుబ్బతేజ మనోజ్ఞ 173వ ర్యాంకు, ప్రకాష్రెడ్డి 177వ ర్యాంకు, సుజితారెడ్డి 263వ ర్యాంకు, నాగ విష్ణుప్రియ 335వ ర్యాంకు, బి.నమర్థ్ 343, హర్షితయాదవ్ 435 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ ఫార్మసీలో రుత్విక 59, తేజసాయి 197, శ్రీవర్ధన్రెడ్డి 213, విద్యశ్రీ 228, సాల్మన్వెస్లీ 377, జగదీశ్వర్ 399, నాగ విఘ్నేష్ 414, సాయి షశాంత్ 506, శివచక్రదర్ 588 ర్యాంకులు సాధించారు. -
కొండంత భక్తి
కొండపైకి చేరుకుంటున్న అశేష భక్తజనం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. రెండో రోజు మంగళవారం మండల కేంద్రం కోసిగి కొండపై వెలసిన శ్రీ తిమ్మప్ప (ఆంజనేయ)స్వామికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తండోప తండాలుగా కొండపైకి చేరుకుని స్వామికి నారికేళలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కొండంత భక్తిని చాటారు. ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. స్వామి దర్శనం అనంతరం కొండపై విహరిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. కోసిగిలో కొండ దిగువ భాగాన ఆదోని రోడ్డులోని బాపులదొడ్డి క్రాస్ రోడ్డు నుంచి కోసిగి వరకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. – కోసిగి -
మామయ్య కానుకే మన్నిక
చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగ్లలో డొల్లతనం విద్యార్థులకు శాపంగా మారింది. బ్యాగ్లు ఎక్కడికక్కడ చిరిగి పీలికలు కాగా విద్యార్థులు వాటితోనే అవస్థలు పడుతూ సి.బెళగల్ జెడ్పీ హైస్కూల్కు వెళుతూ కనిపించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై 18 రోజులు గడిచినా విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వం అందించకపోవడంతో విద్యార్థులు పాత బ్యాగులతోనే స్కూళ్లకు వెళుతున్నారు. కొందరు విద్యార్థులు రెండేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన బ్యాగులను వినియోగిస్తుండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్లు పూర్తిగా చిరిగిపోగా, విద్యార్థుల గురించి ఆలోచించి వారికి మామయ్యగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల క్రితం అందించిన బ్యాగ్లు నేటికీ పటిష్టంగా ఉండటం ప్రజలను ఆలోచింపజేస్తోంది. నాణ్యత గురించి డప్పాలు చెప్పుకునే టీడీపీ నేతల పాలనలో డొల్లతనాన్ని బ్యాగులను చూస్తేనే బయటపెడుతోందని స్థానికులు అంటున్నారు. చిరిగిన బ్యాగులలో పుస్తకాలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. – సి.బెళగల్ -
వెండి నాగాభరణం సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి రంగారెడ్జి జిల్లా నాదర్గుల్కు చెందిన పి.రవీందర్ కుటుంబ సభ్యులు 416 గ్రాముల ఐదు శిరస్సులతో కూడి న వెండి నాగాభరణాన్ని, వెండి చెంబును విరాళంగా సమర్పించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వెండి వస్తువులను అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవికి అందజేశారు. దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. మూడేళ్లకే నూరేళ్లు ! ● డ్రైనేజీ కాల్వలో పడి బాలుడి మృతి జూపాడుబంగ్లా: బుడి బుడి అడుగులు వేస్తూ.. బోసి నవ్వులు నవ్వుతూ అప్పటి వరకు తల్లిదండ్రులను ఆనంద పరిచిన కుమారుడు అంతలోనే దూరమయ్యాడు. ప్రమాదవశాత్తూ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖలీల్, ఉమామహేశ్వరి దంపతులు మంగళవారం రాత్రి ఇంటి పనుల్లో నిమగ్నమయై ఉండగా.. పెద్ద కుమారుడు కిఫాయత్ (03) ఇంటి వద్ద ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాల్వలో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లేకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇంటివద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో బాలుడి పడినట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని వెలికి తీసి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే బాలుడు మృతి చెందాడు. -
బాలల రక్షణ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి
నంద్యాల: పల్లెలు, పట్టణాల్లోని బాలల రక్షణ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. పట్టణంలోని ‘వందేమాతరం సమావేశ మందిరం‘లో బాలల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు అధికారులు మెరుగుపరచుకోవాలన్నారు. బాలలపై జరిగే అన్యాయాలు, పోక్సో కేసులు, జేజే యాక్ట్ కేసులకు సంబంధించి పోలీస్, ఐసీడీఎస్, లేబర్, ఎడ్యుకేషన్ శాఖల వద్ద ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లో చార్జ్షీట్ ఫైల్ అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పై స్థాయిలో జరిగే సైద్ధాంతిక చర్చలకు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నా రు. బాలికకు వివాహం జరగాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, ఐసీడీఎస్, పోలీస్, లేబర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెల పింఛన్ల పంపిణీ బుధవారం చేపట్టనున్నా రు. ఇందుకోసం రూ.194.43 కోట్లు విడుదలయ్యాయి. వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు నేడు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జూలై నెలలో పింఛన్లు 4,44,853 ఉన్నాయి. -
బస్సులు లేక అవస్థలు
హొళగుంద: మండల కేంద్రంలో బస్టాండు నుంచి సినిమా టాకీస్ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు కారణంగా ముద్దటమాగి, కోగిలతోట గ్రామాలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయి విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. ఆయా గ్రామాలతో పాటు సుళువాయి, పెద్దహ్యాట, సమ్మతగేరి, ముగుమానుగుంది తదితర గ్రామాలకు కూడా ఇదే మార్గం కావడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం కాకుండా వేరేవి ఉన్నా డ్రైవర్లు ఆ రూట్లో తిప్పేందుకు ఇబ్బందిగా ఉందని చెబుతూ కొన్నిసార్లు బస్సులను నడపడం లేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు రోజూ హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లబండ్లు, ఆటోలు, బైకులు ఏది దొరికితే వాటిపై ఎక్కి పాఠశాలకు వెళుతున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు బడికి వెళ్లేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యామ్నయ మార్గంలో బస్సులు నడపాలని ఆయా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
శభాష్ మారెప్ప
పెద్దకడబూరు: మండల కేంద్రానికి చెందిన మారెప్ప (దివ్యాంగుడు) తన నిజాయితీ చాటుకొని శభాష్ అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే.. పెద్దకడబూరుకు చెందిన చాకలి మధు సోమవారం తన ద్విచక్ర వాహనంలో బట్టల బ్యాగ్తో పాటు పైన పర్స్ పెట్టుకొని వెళుతున్నాడు. మెయిన్ రోడ్డులో పర్స్ కింద పడిపోయింది. ఇంటికి వెళ్లి చూసుకోగా పర్స్ లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ దారిలో తన త్రిచక్ర వాహనంలో వెళుతున్న మారెప్పకు పర్స్ కనపడింది. దాన్ని తీసి చూడగా రెండున్నర తులాల బంగారు నెక్లెస్తో పాటు రూ.1300 నగదు ఉన్నాయి. దీనిపై మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్ఐ మారుతికి విషయం చెప్పాడు. ఎస్ఐ బాధితులను పిలిపించి బంగారంతో పాటు నగదును అప్పజెప్పారు. మారెప్ప నిజాయితీని మెచ్చుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాలని పొగడ్తలతో ముంచెత్తారు. ఏఎస్ఐ ఆనంద్ ఉన్నారు. 1,58,375 హెక్టార్లలో పంటల సాగు కర్నూలు(అగ్రికల్చర్): జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైనప్పటికీ సాగులో పురోగతి కరువైంది. దాదాపు 20 రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. ఖరీఫ్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా.. జూన్ చివరిలోపు 50 శాతం వరకు సాగు పూర్తి కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 1,58,375 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా 102.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ 20 రోజులుగా వర్షాలు కనుమరుగవడంతో సాగు మందగించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో పత్తి సాగు పెరుగుతోంది. ఇప్పటి వరకు 1,30,662 హెక్టార్లలో సాగయింది. నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల పత్తి సాగు పెరుగుతోంది. మిగిలిన అన్ని పంటలు 27,713 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. కర్నూలు: కల్లూరు ఎస్టేట్ మహాలక్ష్మి నగర్కు చెందిన కొండపల్లి శ్రీను మే 13 నుంచి కనిపించడం లేదని, అదే నెల 27న నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొండపల్లి శ్రీను ట్రాన్స్పోర్టు కార్యాలయంలో డెలివ రీ బాయ్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే కాలనీకి చెందిన మౌలాలికి స్నేహితుడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలసి ఉండేవారు. కొంతకాలం క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మౌలాలే కొండపల్లి శ్రీనును మద్యం సేవించేందుకు తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని మాయం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆ చూకీ లభించకపోవడంతో మంగళవారం సా యంత్రం కుటుంబ సభ్యులు కాలనీ ప్రజలతో కలిసి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఫోన్ కాల్ డేటాను పరిశీలించి శ్రీను ఆచూకీ కనుగొనాలని సీఐను వే డుకున్నారు. సీఐ విక్రమసింహా స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కర్నూలు(అర్బన్): ఆలూరు మండలం పెద్ద హోతూరుకు చెందిన అంగన్వాడీ టీచర్పై టీడీపీ కార్యకర్త వేధింపులకు పాల్పడటం అమానుషం అని జిల్లా కురువ, బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వేధింపుల కారణంగా బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడికి కఠినంగా శిక్షించాలని కోరారు. -
అక్రమ వెంచర్ తొలగింపు
● ఏమైనా జరిగితే మీరే బాధ్యులంటూ యజమాని హల్చల్ ● బిత్తరపోయిన అధికారులు, సిబ్బంది నందికొట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల పక్కన వెలసిన అక్రమ వెంచర్ను మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి రంగస్వామి జేసీబీతో మంగళవారం తొలగించారు. ల్యాండ్ ఓనర్ బద్రిశెట్టి రంగయ్యకు చెందిన సర్వే నంబరు 790లో మూడెకరాల భూమిని నహిమూన్ రహిమాన్ అగ్రిమెంట్తో కొనుగోలు చేశాడు. తన వెంచర్ను తొలగిస్తే మా నాన్నకు ఏమైనా జరిగితే మీరే బాధ్యులు, ముందే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని, సిబ్బందిని బెదిరించాడు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాల యం చేరుకొని ఇస్టానుసారంగా బెంచీలపై పిడిగుద్దులు గుద్దుతూ అధికారులను నానా దుర్భాషలాడారు. దీంతో కార్యాలయంలో పని చేసే ఉద్యో గులు అర్థం కాక బిత్తరపోయ్యారు. అంతేగాకుండా నా వెంచర్ గురించి పత్రికల్లో రాస్తే పాత్రికేయులపై కూడా కేసులు పెడతానని బెదిరించారు. -
గుప్తనిధుల వేట
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని కోటేకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన కలకలం రేపింది. గ్రామంలోని కొండ మీద బసవేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. కార్తీకమాసం, శ్రావణ మాసంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలుగకుండా, పురావస్తు సంపదకు నష్టం జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడిగా శ్రీహరి
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర యాంటీ క్వాకరీ (నకిలీ వైద్యుల నిరోధక) కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా కోడుమూరుకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ నియమితులయ్యారు. ఈ నూతన సబ్ కమిటీ.. చైర్మన్ డాక్టర్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో నేరుగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నకిలీ వైద్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం రావాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తు న్న వైద్యవర్గాల్లో ఈ కమిటీ ఏర్పాటు సరికొత్త ఆశలను రేకెత్తించిందని ఆయన అన్నారు. గతంలో ఇలాంటి కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈసారి నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ కూడా పక్కాగా అమలు చేస్తామన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● ఒకరికి గాయాలు వెల్దుర్తి: జాతీయ రహదారి 44పై అల్లుగుండు పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. తమిళనాడుకు చెందిన డ్రైవర్ శక్తి తన లారీని రోడ్డు పక్కన నిలిపి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టినప్పటికీ, ముందు సీట్లలోని ఎయిర్బ్యాగ్లు తెరుచుకోవడంతో డ్రైవర్, మరో యువకుడు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్కు చెందిన వెంకటరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపండి
బొమ్మలసత్రం: సుధీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన సిబ్బంది శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. మంగళవారం పదవీ విరమణ పొందిన ఎస్ఐలు గోపాల్, నజీర్హుస్సేన్, హుస్సేన్బాషా, రంగయ్యతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు షేక్షావలి, తమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డిని ఎస్పీ ఆయన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దాదాపు 40 ఏళ్ల పాటు పోలీస్శాఖకు సేవలందించటం అభనందనీయమన్నారు. ఇప్పటి నుంచి ఆరోగ్యంపై దృష్టి నిలిపి సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పరిపాలన విభాగం అధికారులు వీరన్న, ఖాదర్బాషా, పోలీస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో మందకొడిగా ఎన్యుమరేషన్ ఫారాల ఆన్లైన్ నమోదు ● ఫారాల పంపిణీ 98 శాతం.. డిజిటలైజేషన్ 24.47 శాతం మాత్రమే ● అధికారుల పర్యవేక్షణా లోపంపై సర్వత్రా విమర్శలు
నంద్యాల(అర్బన్): ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్–2026) జిల్లాలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేయడంలో చూపిన ఉత్సాహం... వాటిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు (డిజిటలైజేషన్) చేయడంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా విస్మరించారు. జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు అందిన అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఫారాలు సేకరించి కార్యాలయాల్లో మూలనపడేసేశారు కానీ.. వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ మాత్రం దారుణంగా వెనుకబడింది. దాదాపు 14 రోజుల క్రితం ప్రారంభమైన సర్ కార్యక్రమం కేవలం 24.47 శాతానికే పరిమితమైంది. ఇదే అలసత్వం కొనసాగితే రాబోయే ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,629 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నా రు. మొత్తం 14,05,443 మంది ఓటర్లు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 13,80,388 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, రికార్డు స్థాయిలో 98.22 శాతం పూర్తి చేశారు. అయితే, సేకరించిన ఫారాలను కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియలో యంత్రాంగం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3,43,904 ఫారాలు మాత్రమే ఆన్లైన్ అయ్యాయి. అంటే దాదాపు 10.61 లక్షల మంది ఓటర్ల డేటా ఇంకా కార్యాలయాల్లోని ఫైళ్లలోనే మగ్గుతోంది. జిల్లా కేంద్రంలో 19.39 శాతమే.. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా అందులో జిల్లా కేంద్రం నంద్యాలలో డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,76,813 మంది ఓటర్లు ఉండగా 2,75,307 ఫారాలను పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ కేవలం 19.39 శాతంతో 53,677 ఫారాలు మాత్రమే పూర్తయ్యాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత దారుణంగా ఉంది. అందులో 2,20,814 మంది ఓటర్లు ఉండగా 2,14,730 మందికి ఫారాలు పంపిణీ జరిగితే... ఆన్లైన్ నమోదు కేవలం 19.05 శాతం మాత్రమే కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముంచుకొస్తున్న గడువు.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆళ్లగడ్డ నియోజవర్గంలో కూడా కేలవలం 34.08 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 14వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. సర్వేల పేరుతో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోకతే, అర్హులైన ఓటర్ల పేర్లు, ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి కేవలం ఫారాల పంపిణీ టార్గెట్లకే పరిమితం కాకుండా. ప్రత్యేక సిబ్బందిని (డేటా ఎంట్రీ ఆపరేటర్లను) నియమించి యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అసవరం ఉంది. లేని పక్షంలో సామాన్య ఓటరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్.. డిజిడల్ జిల్లాలో సర్ సర్వే పరిస్థితి ఇలా.. -
పురోహితుల మధ్య రగడ
● కొలనుభారతి దేవి ఆలయంలో పూజల అడ్డగింత కొత్తపల్లి: మండలంలోని ఏకై క సరస్వతీ క్షేత్రం శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి దేవి ఆలయంలో పురోహితుల మధ్య రగడ మొదలైంది. ఈ నెల 23వ తేదీన కొంత మంది వ్యక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా కొలనుభారతి క్షేత్రంలో నవ చండీయాగం నిర్వహించారు. ఈ విషయమై శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ను ప్రత్యేక అధికారిగా నియమించి విచారణ జరిపించారు. ఆలయ సిబ్బంది ఇద్దరు, పురోహితులను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈఓ ఆదేశాలతో పూరోహితులు అమ్మవారి క్షేత్రంలో పూజలు చేసేందుకు వచ్చారు. అయితే స్థానిక పురోహితులు శ్రీశైలం నుంచి వచ్చిన పురోహితులను అడ్డుకోవడంతో పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో మంగళవారం ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ కొలనుభారతి క్షేత్రాన్ని చేరుకొని శ్రీశైలం పూజారులతో పూజలు చేయించేందుకు సహకరించాలని స్థానిక పురోహితులను కోరాగా వారు లెక్కచేయలేదు. ఈ విషయమై పురోహితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థానం ఈఓకు ఫిర్యాదు చేస్తామని ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ వెల్లడించారు. యువకుడి ఆత్మహత్య కొత్తపల్లి: క్షణికావేశంలో యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా డు. ఘటనపై కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ మంగళవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెంది న సంజపో గు కళ్యాణ్ (20)కు దైవభక్తి ఎక్కువ. మరికొద్ది రోజుల్లో అతని అక్క వివాహం జరిపించేందుకు కుటు ంబీకులు నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లి పత్రికలపై తనకు ఇష్టంలేని దేవుడి బొమ్మ ముద్రించారని, ఎలాగైనా తొలగించాలని కల్యాణ్ తండ్రితో చిన్న వాగ్వాదం చేశారు. తండ్రి కురుమయ్య పత్రికలను ముద్రించాం ఇప్పుడు తీసివేయడం కుదరదని చెప్పడంతో యువకుడు మన స్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయమై తండ్రి కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్కు చెందిన ఆర్టీసీ బస్సు కోడుమూరు మీదుగా కర్నూలుకు వెళుతుండగా, పెద్దపాడు సమీపాన అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సులోని ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. కర్నూలు: ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులు, బాధ్యతలపై న్యాయ సేవా సదన్లో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. కక్షిదారులకు సత్వరమే సేవలు అందించడం, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహకారం అందించాలని వారికి సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు పాల్గొన్నారు. -
సర్వేపై ఆందోళన
సర్ ప్రక్రియపై ఓటర్లలో ఆందోళన నెలకొంది. అధికారులు టీడీపీ కార్యాలయాలు, సచివాలయాలు, దేవాలయ ఆవరణాలకు వెళ్లి మ్యాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూన్ 15న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతుందోననే ఆందోళ న అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఓటర్లలో మొ దలైంది. ప్రక్రియ మొదలైన నాటి నుంచి బీఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తర్వాత ఓటరు ఉన్నాడా.. లేదా అని విచారించాలి. అనంతరం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకొని ఇంటిపేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్ఏలు చెప్పినవి మ్యాపింగ్ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్ జైల్ను మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్నరాజ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని పరిసరాలను, వంట, స్నానపు గదులను పరిశీలించి, అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ పేద, వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. అదేవిధంగా ఖైదీల హాజరు పట్టిని పరిశీలించి వారి ఆరోగ్యం, కేసులు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు న్యాయ సహాయం కోసం 15100కు సమాచారాన్ని అందజేయాలని, ఉచితంగా న్యాయవాది కోర్టులో వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయ వాది బాలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): 2026 ఏడాదికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయా లు, జవహర్ నవోదయ విద్యాలయాలు, అటామిక్ ఎనర్జీ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండి, సివిల్, క్రిమినల్ కేసులు, ఆరోపణలు, క్రమశిక్షణ చర్యలు లేని ఉపాధ్యాయులు అనర్హులన్నారు. జూలై 15లోగా https:// national awardstoteachers. education.gov.in/ nominations వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
తీరని యూరియాతన
నందవరం: కూటమి పాలనలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. పొలాల్లో సాగు పనులు వదులుకొని వ్యవసాయ కార్యాలయాలు, సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం మండల పరిధిలోని హాలహర్వి గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో యూరియా పంపిణీకి చర్యలు చేపట్టారు. వందలాది మంది రైతులు ఉదయమే అక్కడి చేరుకొని బారులు తీరారు. తీరా ఓటీపీ చెప్పేందుకు మొబైల్ఫోన్ తప్పనిసరి అని లేకపోతే ఎరువులు ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో చాలా మంది తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. గత ప్రభుత్వ హయాంలో అడగగానే అవసరమైన ఎరువులు ఇచ్చే వారని, ఇప్పుడేందుకు కొత్తకొత్త రూల్స్తో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ
శ్రీశైలం టెంపుల్: పౌర్ణమి సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం గిరిప్రదక్షిణను నిర్వహించారు. క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయించి భక్తిభావాలను పెంపొందించారు. సోమవారం సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహామంగళహారతులు ఇచ్చిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలై గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయరహదారి, సారంగధర మఠం మీదుగా హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి మహిషాసురమర్దిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం, నందిమండపం వద్దకు రావడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. దేవస్థాన అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అహోబిలంలో పౌర్ణమి పూజలు ఆళ్లగడ్డ: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం అహోబిలంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి దూపదీపాలతో మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. పీజీఆర్ఎస్కు 105 ఫిర్యాదులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ సునిల్షెరాన్ మాట్లాడుతూ.. ఫిర్యాదుల్లో చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు. కొన్ని సమస్యలను బాధితుల స్టేషన్ పరిధి అధికారులకు బదిలీ చేశామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని, ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించామన్నారు. డీసీసీబీ సీఈఓగా బాలాజీరావు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఇవో)గా సీహెచ్ఆర్సీఎస్ బాలాజీరావు నియమితులయ్యారు. సీఈఓ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. డీసీసీబీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న పి.రామాంజనేయులు ఇన్చార్జి సీఇవోగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ సీఇవో నియమితులయ్యే వరకు ఇన్చార్జి సీఇవోను నియమించాలని ఆప్కాబ్ ఎండీకి డీసీసీబీ నుంచి లేఖ రాసినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఆప్కాబ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అయిన బాలాజీరావును కర్నూలు డీసీసీబీకి ఇన్చార్జి సీఇవోగా నియమిస్తూ ఆప్కాబ్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన సీఇవోగా బాధ్యతలు చేపట్టిన బాలాజీరావును జనరల్ మేనేజర్లు పి.రామాంజనేయులు, శివలీల, డీపీడీఎం రంగనాథ్, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, ఏజీఎంలు త్రినాథ్రెడ్డి, గీత, సరోజమ్మ, రాఘవేంద్ర తదితరులను అభినందించారు. -
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
శ్రీశైలం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ఆటపాటలతో విద్య బోధించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ సూర్యనారాయణ రాజు సూచించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆయనకు డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరమ్మ, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలిదేవిలు భ్రమరాంబ అతిథి గృహంలో ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాల)ను పరిశీలించారు. అక్కడినుంచి సున్నిపెంటలోని ప్రతిభ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్ను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. శ్రీశైలంలోని మేకలబండలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ సభ్యులు మధుసూదన్ రావు, వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తదితరులు ఉన్నారు. -
వసతుల్లో వెనుక‘బడి’
కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ గాడి తప్పింది. దేశానికి ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఓ మోడల్గా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన విద్యాశాఖ మంత్రి చేతల్లో చూపించడంలో విఫలమయ్యారు. ఇందుకు గత నెలలో ఆ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో జిల్లాకు దక్కిన స్థానమే ఉదాహరణ. జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 1,445 ప్రభుత్వ యాజమాన్య స్కూల్స్ ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు జరిగాయి. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ.166.25 కోట్లు ఖర్చు పెట్టి 9 రకాల మౌలిక సదుపాయాలు కల్పించే పనులు పూర్తి చేశారు. రెండో విడతలో 1051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల పనులను పూర్తిగా నిలిపి వేసింది. 1310 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పనులు మొదలు పెట్టగా వాటికి ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అదే విధంగా 685 స్కూళ్లలో రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్ల ఫినిషింగ్, 701 స్కూళ్లలో విద్యుత్ సరఫరా పనులు, 714 స్కూళ్లలో తాగు నీటి కల్పన పనులు, 694 బడుల్లో మైనర్, మేజర్ పనులు, 380 స్కూళ్లలో కాంపౌండ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో మౌలిక సదుపాయాల్లో జిల్లా చిట్టచివరి (28జిల్లాల్లో 28వ స్థానం) స్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రవేశాల్లో 11, విద్యార్థులు, టీచర్ హాజరులో 22, నిపున్ భారత్ మిషన్ కింద కేంద్రం చేపట్టిన ఎఫ్ఎల్ఎన్లో 27, విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో 22, డ్రాపౌట్స్లో 24వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ నెల 13వ తేదీన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారీయా హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మెన్గా, పాఠశాల విద్య అడిషనల్ డైరెక్టర్ వైస్ చైర్మెన్గా, పాఠశాల విద్య కడప ఆర్జేడీ, ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు గ్రేడ్ హెచ్ఎంలు, ఇద్దరు ఎన్జీఓలు సభ్యులుగా, డీఈఓ మెంబరు కన్వీనర్గా, కేపీఎంజీ అనే కన్సల్టెంట్ సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ హైలెవల్ కమిటీ జిల్లాలో పర్యటించనుంది. గాడి తప్పిన విద్యావ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో అట్టడుగున జిల్లా నేడు జిల్లాలో పర్యటించనున్న హైలెవెల్ కమిటీ -
ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమం
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై నెలలో ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.చంద్రశేఖర్, అజాంబేగ్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలన్నారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ గురించి, సరెండర్ లీవ్ గురించి స్పందించడం లేదన్నారు. నాయకులు నాగేంద్ర కుమార్, మౌలాలి, జీవీ రమణ, నూరుల్లా, అమీర్, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, నరసింహారావు సుధాకర్, షరీఫ్ పాల్గొన్నారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు దీరారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగు ణంగా దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద దర్శనానికి వెళ్లే పలువురు ఐదేళ్ల లోపు చిన్నారులకు దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు పోలియో చుక్కలు వేశారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 29వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బీసీ హాస్టళ్లలో ప్రవేశాలు పెంచాలి కర్నూలు(అర్బన్): బీసీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని వసతి గృహ సంక్షేమాధికారులను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన ఆదేశించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమైనా నేటి వరకు జిల్లాలోని రెండు, మూడు వసతి గృహాలకు రెన్యువల్ విద్యార్థుల హాజరు జీరో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు బీసీ వసతి గృహాల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల డిమాండ్ చాలా ఉందన్నారు. అయితే ఆయా వసతి గృహాలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో హెచ్డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహించి సమస్యను జిల్లా కలెక్టర్ ద్వారా డీఈఓ దృష్టికి తీసుకుపోతామన్నారు. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం తెలిపారు. వినియోగదారులు 8977716661కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 7382614308కు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
పెళ్లి చేయకుండానే.. పండుగ చూడకుండానే!
ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు. కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ.. పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చియం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్లు మోటార్ సైకిల్పై పెద్దకడుబూరుకు బయలుదేరారు. బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు. పౌర్ణమి పండుగకు వెళ్తూ.. చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుదాస్, బోయ రవి (ఫైల్)రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం బనవాసి సమీపంలో దుర్ఘటన గాయాలతో బయటపడ్డ బాలుడు -
రాక్గార్డెన్లో ‘రణబాలి’
● సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నఓర్వకల్లు: రాక్గార్డెన్లో ఆదివారం సినిమా సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రప్మిక మందన్న కథానాయకులుగా నటిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న విలన్కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్కు అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. సినిమా షూటింగ్ను తిలకించేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన రాక్గార్డెన్లో మరోసారి సినిమా సినిమా షూటింగ్తో సందడిగా మారింది. -
శ్రీశైల శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, దేవస్థాన కీర్తి ప్రతిష్టలను పెంచేలా కృషి చేయాలని దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేవస్థాన
దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని తెలుసుకున్నాడేమో కానీ.. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడేమో.. శ్రీశైలం దేవస్థానం సభ్యుల్లో ఒకరు. ఓ వైపు దేవస్థానం అభివృద్ధిని విస్మరిస్తూ.. మరో వైపు ఉద్యోగులను అగౌరపరుస్తూ.. అందని కాడికి దోచుకుంటున్న ఓ సభ్యుడి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో అన్ని విభాగాలపై పట్టు సాధించేందుకు ఒక్కొ విభాగానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు కన్వీనర్గా, మరో ఇద్దరిని సభ్యులుగా ఉంటారు. ఆ విభాగంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతాయని ఆ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్షేత్రంలో అనునిత్యం పలు అభివృద్ధి పనులు చేపట్టే విభాగంలో తనకి అనుభవం ఉందని, సబ్ కమిటీ కన్వీనర్గా పట్టుబట్టి మరి ఆ అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి కన్వీనర్గా నియమించుకునేలా చేశాడట. సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అ విభాగపు అధికారులు, సిబ్బందితో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నాడని తెలుస్తుంది. దేవస్థాన ట్రస్ట్బోర్డు సమావేశాల్లో సదరు సభ్యుడు అధికారులను నిలబెట్టి మరీ ప్రశ్నించడం, దేవస్థాన అధికారులకు కనీస మర్యాద కూడా ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల చర్చనీయాంశమైన ఓ విషయంపై బల్లలు గుద్ది ప్రశ్నించడం, ఇకపై ‘మీ జాతకం అంతా చెబుతా’ అంటూ అధికారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి సభ్యుడి వ్యవహారంతో ట్రస్ట్బోర్డు అభాసుపాలవుతోంది. కాటేజీ కేటాయించాల్సిందే.. ట్రస్ట్బోర్డు చైర్మన్కు మాత్రమే దేవస్థాన కాటేజీ కేటాయిస్తారు. సభ్యులకు మల్లికార్జున సదన్, గణేశసదన్ కేటాయిస్తారు. అయితే సదరు సభ్యుడు తాను ఎప్పుడు వచ్చిన చైర్మన్కు కేటాయించినట్లే తనకి కూడా కాటేజీ కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేవాడని సమాచారం. చేసేదేమి లేక అధికారులు కాటేజీ కేటాయించేవారట. అయితే ఉచితంగా కాటేజీ కేటాయించడంపై సభ్యుల్లో చర్చ జరగడం, ఉచితంగా కాటేజీ తీసుకుంటే మిగతా సభ్యులందరూ కూడా కాటేజీ కావాలని తమని అడిగితే సమస్య వస్తుందని, ట్రస్ట్బోర్డుపై కూడా విమర్శలు వస్తాయని సున్నితంగా ఆ సభ్యుడిని హెచ్చరించినట్లు సమాచారం. ఆతర్వాత ఉచితంగా తీసుకోకుండా నెల్లూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించిన కాటేజీలో డోనర్ కూపన్ తీసుకుని సగం అద్దె చెల్లిస్తూ అదే కాటేజీలో బస చేస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రూటే సప‘రేటు’..దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టే ఓ విభాగానికి సబ్ కమిటీ కన్వీనర్ కావడంతో ఏ పని చేయాలన్న తనకు చెప్పాలని అధికారులకు హుకుం జారీ చేశాడట. అంతేకాకుండా ఆ విభాగంలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసే ఓ అధికారిని తన అనుచరుడిగా చేసుకుని, వసతి ఉంటున్న కాటేజీకి అతనిని పిలిపించుకుని దేవస్థానంలో ఏమి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటిలో లోపాలు ఏంటని సమాచారం రాబట్టుకుని సదరు పని పర్యవేక్షిస్తున్న అధికారిని పిలిపించుకుని అతడిని బెదిరించడం పరిపాటిగా మారిందని సమాచారం. అలాగే ఆయా పనులు పర్యవేక్షిస్తున్న అందరి నుంచి అమ్యామ్యాలు వసూలు చేసి తనకు ఇవ్వా లని తన అనుచరుడిగా ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించి అల్టిమేటం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. పెద్దాయనది ఏమీ లేదు.. ట్రస్ట్బోర్డుకు పెద్దదిక్కుగా ఉన్న ఆయనకు ఇటీవల ఓ శస్త్ర చికిత్స జరిగి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనారోగ్య కారణాలతో రెండు ట్రస్ట్బోర్డు సమావేశాలకు శ్రీశైలానికి వచ్చి ప్రత్యక్షంగా హాజరుకాలేక వర్చువల్గా హాజరయ్యారు. దీంతో ఇంకా ఆ పెద్దాయనది ఏమి లేదు..అంత మనం ఎలా చెబితే ‘అలా’ అంటూ, ట్రస్ట్బోర్డును నేనే నడిపిస్తా.. మీరు సహకరించాలంటూ సభ్యులతో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. తాను సభ్యుడిని అని మరచిపోయి దేవస్థాన అన్ని విభాగ అధికారులను కూడా చైర్మన్ హోదా తరహాలోనే ఆదేశాలు జారీ చేస్తారని దేవస్థాన అధికారులు గుసగులాడుకుంటున్నారు. శ్రీశైలం ట్రస్ట్బోర్డులో చర్చనీయాంశమైన ఓ సభ్యుడి వ్యవహరశైలి సభ్యుడి ప్రవర్తనతో అభాసుపాలవుతున్న ట్రస్ట్బోర్డు అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి పట్టుబట్టి కమిటీ కన్వీనర్గా ఎప్పుడు వచ్చినా కాటేజీ కేటాయించాల్సిందేనని హుకుం -
తుంగభద్రలో ఇసు‘కాసు’రులు
రాత్రి వేళ తెలంగాణకు ఇసుకను తరలించడానికి జేసీబీతో టిప్పర్కు లోడ్ చేస్తున్న దృశ్యం, తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక టిప్పర్లునందవరం: ఉచిత ఇసుక అంటూనే టీడీపీ నేతలు ఇసుకాసురులుగా అవతారమెత్తారు. తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటించి రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు.అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నందవరం మండలంలో నాగలదిన్నె, గంగవరం గ్రామాల్లో రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. నాగలదిన్నె గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. రీచ్ను తలపించేలా నాగలదిన్నె గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సాయి బాబ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం ఇసుకను డంప్ చేసి రాత్రివేళ్లల్లో జేసీబీలతో తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ మొత్తంలో ఇసుకను నాగలదిన్నె వంతెన మీదుగా తెలంగాణాకు తరలిస్తున్నారు. జేసీబీలతో నదిలో ఇసుకను పోగుచేసి తీరంలో భారీ డంప్ ఉంచారు. అక్కడి నుంచి రాత్రి కాగానే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక అక్కడి నుంచి తరలుతున్నట్లు అంచనా. నిద్రపోతున్న నిఘా నదికై రవాడి, నాగలదిన్నె గ్రామాల సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం లేదు. కనీసం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో కూడా తనిఖీలు లేవని తెలుస్తోంది. మైనింగ్, విజులెన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో టీడీపీ నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక దందా చేస్తున్న టీడీపీ నాయకులు నాగలదిన్నె బ్రిడ్జి మీదుగా రాత్రి సమయంలో తరలింపు చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం -
రెండు చుక్కలతో బంగారు భవిత
● కలెక్టర్ రాజకుమారినంద్యాల: రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుంచి పిల్లలను రక్షించడానికి ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకు 0–5 సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 1,320 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. అత్వవసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో మాప్–అప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడీ వెంకట దాసు, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యూనెజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు శారద బాయి, లక్ష్మీప్రసన్న, ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ ఎంపిక
ఆత్మకూరు: వైఎస్సార్సీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కమిటీ సభ్యులుగా కాటసాని రాంభూపాల్రెడ్డి (వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు), హరికట్ల శివరామిరెడ్డి (డిస్ట్రిక్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే), కో ఆర్డినేటర్గా పీపీ నాగిరెడ్డి (మార్క్ఫెడ్ మాజీ చైర్మన్)ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్వం త్యాగం చేస్తే విస్మరించడం తగదు నందికొట్కూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయకుండా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని నీటిముంపు నిరుద్యోగుల సంఘం నాయకులు జయన్న ప్రశించారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి పక్కన శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారం 95వ రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు న్యాయం చేసినప్పుడు తమకెందుకు న్యాయం చేయలేరన్నారు. తాము నష్టపోయి 45 ఏళ్లు దాటినా పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. దీక్షలో నారాయణ, మురళి, జమ్మన్న, నాగసుంకన్న, నాగరాజు, నాగేంద్ర తదితరులు కూర్చొన్నారు. -
మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆ
● కర్నూలు నగరంలోని గణేష్నగర్కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు. ● ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిద్ర పట్టక..నిద్ర సరిపోక! పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలు యువత..పెడదోవ ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సంవత్సరం ఓపీ ఐపీ 2020 10,451 -- 2021 15,942 92 2022 19,475 175 2023 23,992 608 2024 26,803 758 2025 28,062 698 2026 13,127 272 మొత్తం 1,37,852 2,603 పెరుగుతున్న మానసిక ఆందోళన బాధితులు యువతలో సొమటోఫాం డిజార్డర్ కేసులు గాంబ్లింగ్, బెట్టింగ్, నెట్ అడిక్షన్తో సమస్యలు ఇతరుల్లో పలు కారణాలతో ఆందోళన కర్నూలు పెద్దాసుపత్రిలో రోజూ 120 మంది దాకా చికిత్స ప్రైవేటులోనూ రెట్టింపు స్థాయిలో వైద్యం -
నానాజీ.. నాలుక చీరేస్తాం!
● స్థాయి తెలుసుకొని మాట్లాడు ● ఎమ్మెల్సీ ఇసాక్బాషా నంద్యాల(అర్బన్): స్థాయి తెలుసుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడితే బాగుంటుందని, లేదంటే నాలుక చీరేస్తామని ఎమ్మెల్సీ ఇసాక్బాషా హెచ్చరించారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్సీపీ నాయకులు శనివారం టూటౌన్ ఎస్ఐ కృష్ణారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు సహజమని, విజ్ఞత మరిచి మాట్లాడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల అనుభవం, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓ పార్టీ నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పంతం నానాజీ నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గమైన మాటలు పలికే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర స్పాక్ పర్సన్ రవికుమార్, స్టేట్ ఎస్టీసెల్ సెక్రటరీ ఆంజనేయులు, కార్యదర్శి శంకర్నాయక్, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్సార్సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రమణ, అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నాయకులు సాయిరాంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతా శ్రీనివాసులు, మేస చంద్రశేఖర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
12 గంటల నరకయాతన
● సీఎం పర్యటనతో ప్రయాణికుల అగచాట్లుమహానంది: ఎక్కడో సీఎం పర్యటిస్తుంటే 12 గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లా కృష్ణంశెట్టిపల్లెలో సంజీవని లబ్ధిదారులతో సమావేశంతో పాటు అభివృద్ధి పనులకు శనివారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలతో నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు, గుంటూరు, విజయవాడ వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చివరికి అంబులెన్స్ను సైతం పంపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపేయడంతో అన్నమో రామచంద్రా, దాహమో దేవా అంటూ ప్రజలు అల్లాడిపోయారు. గుంటూరు వైపు వెళ్లే వారిని మైదుకూరు మీదుగా, శ్రీశైలం వైపు వెళ్లే ప్రయాణికులను ఆత్మకూరు, దోర్నాల మీదుగా పంపించేశారు. -
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్
నంద్యాల: పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతపై సమీక్షించారు. గోదాము పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ పాల్గొన్నారు. లింక్తో ఎరువులు విక్రయించరాదు ● జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ నంద్యాల: యూరియా, డీఏపీ ఎరువులతో ఎటువంటి లింక్ ప్రొడక్టులను జతచేసి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. తన కార్యాలయంలోని వీసీ హాల్లో జిల్లాలోని ఎరువుల తయారీ సంస్థల అధికారులు, హ్యాండ్లింగ్ ఆపరేటర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేక్ పాయింట్ నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎమ్మార్పీ ప్రకారమే డీలర్లు ఎరువులను విక్రయించాలన్నారు. రైతులకు అవసరమైన మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా ఎరువుల సరఫరా చేయాలన్నార. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ఎరువులను అవసరమైన ప్రాంతాలకు మాత్రమే డీలర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, మార్క్ఫెడ్ అధికారి హరినాథ్ రెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి కల్యాణ్ కుమార్, ఏఈఓ కవిత పాల్గొన్నారు. దేవస్థాన చిరుద్యోగిపై ‘ఇంటెలిజెన్స్’ ఆరా శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో తన హవా కొనసాగిస్తున్న చిరుద్యోగిపై ఇంటెలిజెన్స్ అంతర్గతంగా పూర్తిస్థాయిలో విచారించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘పలుకుబడే పెట్టుబడి..పరిచయాలే ఆదాయం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అసలు ఆ చిరుద్యోగి విధులు ఎక్కడ, ఏమి విధులు నిర్వహిస్తున్నాడు.. శ్రీశైలంలోని కొత్తపేటలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు.. చిరుద్యోగి వెనక ఉన్న అధికారులు ఎవరు.. ఇతర విషయాలపై ఇంటలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పీఓఎస్ పరికరాల బహూకరణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు 50 పీఓఎస్ పరికరాలను బహూకరించారు. శనివారం దేవస్థాన పరిపాలన భవనంలో బ్యాంకు అధికారులు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావును కలిసి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. వీటితో భక్తులు ఆయా కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.టోల్గేట్, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం, ప్రసాదాల కౌంటర్లలో వీటిని వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాసకుమార్, కర్నూలు రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్ డి.అనిల్కుమార్, శ్రీశైలం బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
రెండు చుక్కలు.. జీవితానికి వెలుగు
● నేడు పల్స్పోలియో కార్యక్రమం ● జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల గుర్తింపు గోస్పాడు: చిన్నారులకు రెండే రెండు చుక్కలు పోలియో బారిన పడకుండా చేస్తాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో తమ పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. చిన్నారులకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన 24 గంటల లోపు హెపటైటిస్–బి జీరో డోస్, బీసీజీ, ఆ తర్వాత ఆరు, పది, 14 వారాలకు, ఆ తర్వాత వివిధ రకాల వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ వారికి ప్రమాదకరమైన జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల గుర్తింపు జిల్లాలో ఐదేళ్ల లోపు ఉన్న 2,38,404 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా అధికారులు గుర్తించారు. ఇందుకోసం 1,313 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,626 టీములను ఏర్పాటు చేశారు. 67 మొబైల్ టీమ్లు, 5,252 మంది సిబ్బంది పనిచేయనున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్లకు 46 టీమ్లు వెళ్లి, అక్కడ ఉంటే చిన్నారులకు వాక్సిన్ వేస్తాయి. 26 హైరిస్కు ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం వ్యాక్సినేషన్తో పాటు సోమ, మంగళ వారాల్లో మాపింగ్ ప్రోగ్రామ్లో భాగంగా హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్లో కవర్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 51 పీహెచ్సీలు, 16 యూపీహెచ్సీల పరిధిలో నిర్వహంచనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొంటున్నారు. -
ఖరీఫ్ ఆశలు కరిగిపోతున్నాయ్..!
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు వారాలుగా వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. వర్షాలు తగ్గిపోగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలి తీవ్రత ఎక్కువైంది. దీంతో నేలలోని తేమ త్వరగా ఆవిరై పోతోంది. ఈ నెల మొదటి 10 రోజుల్లో ఆశాజనంగా వర్షాలు పడటంతో మొన్నటి వరకు ఖరీఫ్ పంటల సాగు జోరుగా సాగింది. దీంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అయితే పలు మండలాల్లో అంతంత మాత్రం తేమలో విత్తనం వేయడం వల్ల మొలకలు రాక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 1,08,349 హెక్టార్లలో సాగు అయ్యాయి. ఇందుల్లో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో కంది 5,990 హెక్టార్లు, వేరుశనగ 4,938, ఆముదం 1,970, సజ్జ 285, మొక్కజొన్న 93, కొర్ర 63 హెక్టార్ల ప్రకారం సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 99 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంలో 90 శాతం ఈ నెల 10వ తేదీలోపే నమోదైంది. అంటే రెండు వారాలకుపైగా వర్షాలు లేవు. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమై ఖరీఫ్ సాగుతుందా అనే అనుమానం రైతుల్లో నెలకొంది. పత్తిని కాపాడుకునేదెలా....! పత్తి సాగు చేయాలంటే కనీసం 75 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అప్పుడే విత్తనానికి తగిన తేమ ఉంటుంది. నెల మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. అయితే నల్ల రేగడి నేలల్లో అంతంత మాత్రం తేమలోనే పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల దాదాపు 25 వేల హెక్టార్లలో మొలకలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. 50 శాతం కూడా విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. పత్తి ప్రధానంగా ఆదోని, పెద్దకడుబూరు, మంత్రాలయం, హొళగుంద, దేవనకొండ, ఆస్పరి, మద్దికెర, పత్తికొండ, సీ.బెళగల్, హాలహర్వి, కల్లూరు మండలాల్లో ఎక్కువగా సాగైంది. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో ఇది వరకు సాగు చేసిన పత్తిని ఎలా కాపాడుకోడం ఎలా.. అనేది ప్రశ్నార్థకమైంది. నీటితడి ఇచ్చేందుకు కాలువల్లో చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటకు బిందు సేద్యం సదుపాయం కల్పించుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయితే సూక్ష్మ సేద్యం మంజూరు ప్రక్రియను ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. -
పెరిగిన కోడిగుడ్ల ధరలు
గోస్పాడు: కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు ఒకలా, మారు మూల గ్రామాల్లో మరోకంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల నుంచి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. జనవరి దాటాక నెలరోజుల పాటు 30 గుడ్ల ధరలు రూ. 120 నుంచి రూ. 130 వరకు ఉన్నాయి. నిలకడ లేకుండా ప్రతిరోజూ ఒక్కో గుడ్డు ధర 5 పైసల నుంచి 15 పైసల వరకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వందగుడ్ల ధర రూ. 675 నుంచి రూ.685 వరకు ఉంది. హైదరాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్లను, గుడ్లను దిగుమతులు చేసుకోవాల్సి వస్తుండటంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లో వ్యాపారులు ఒక్కొక్కటి రూ.8 వరకు విక్రయిస్తుండగా మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క గుడ్డు ధర రూ.9 వరకు ఉంది. పెరిగిన ధరతో హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అక్షరాలు నేర్పిన టీచరమ్మకు అ‘పూర్వ’ సన్మానం మహానంది: అక్షరాలు నేర్పి తమను ఉన్నతులు గా తీర్చిదిద్దిన టీచరమ్మకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. టీచరమ్మ 75వ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1979 నుంచి 1984 వరకు ఉపాధ్యాయురాలు దండు హేమలతమ్మ పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించి చదువులు చెప్పారు. ఆమె వద్ద చదువులు నేర్చుకున్నవారిలో జడ్జీలు, ఉపాధ్యాయులు, బ్యాంకు మేనేజర్లు, పశుపరిశోధనా స్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. హేమలతమ్మ 75వ పుట్టినరోజు సందర్భంగా నల్లమలలోని పచ్చర్ల వద్ద ఉన్న జంగిల్ క్యాంపులో కలిసి వేడుకలు వైభవంగా చేశారు. రాజంపేట జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష, వ్యవసాయ కళాశాల ఏఈఓ డక్కా స్వామిదాసు, పశుపరిశోధనా స్థానం లైవ్స్టాక్ సిబ్బంది డక్కా ఎర్రన్న, కోటక్ బ్యాంకులో పనిచేస్తున్న డక్కా మాచర్ల, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్నాయక్, పొదిలి శ్రీనివాస్, న్యాయవాది డక్కా శరత్కుమార్, శ్యాంసన్, తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ఐటీడీఎంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం కోర్సులు కర్నూలు సిటీ: ట్రిపుల్ఐటీడీఎంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఏఐసీటీఈ–క్యూపీ–పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో–ఆర్డినేటర్ నరేష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ ఫ్యాకల్టీ బోధన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశించిన ప్రోగ్రాంకు వచ్చే నెల 5లోపు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 200 గంటల వ్యవధితో హైబ్రిడ్ విధానంలో(ఆన్లైన్, ప్రత్యక్ష తరగతులు) నిర్వహిస్తామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో 50 మంది, డ్రోన్ టెక్నాలజీపై 50 మంది అధ్యాపకులకు శిక్షణనిస్తామన్నారు. ప్రత్యక్ష తరగతులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఏఐసీటీఈ క్యూఐపీ పోర్టల్ https://qippg.aicte.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఏఎస్పీ అడ్మిన్గా ఖాదర్బాషా బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా ఖాదర్బాషా శుక్రవారం పదవీ భాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు కొనసాగిస్తున్న అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబును కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఖాదర్ బాషాను నంద్యాలకు బదిలీ చేశారు. ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా కాగా.. 2012లో డీఎస్పీగా పదవీ భాధ్యతలు స్వీకరించి డోన్, రంపచోడవరం, చిత్తూరు, విజయవాడ పట్ట ణాల్లో డీఎస్పీగా పనిచేశారు. అనంతంతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది కోనసీమ జిల్లా, ఇంటలిజెన్స్ విభాగాల్లో విధులు నిర్వసి స్తూ నంద్యాల జిల్లాకు బదిలీపై వచ్చారు. -
పలుకుబడే పెట్టుబడి.. పరిచయాలే ఆదాయం
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడి పేరు పెట్టుకున్న ఓ చిరు ఉద్యోగి శ్రీశైల దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నా అడిగేవారు లేరు. అటెండర్ విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ అతనిది అంతా హై రేంజ్ అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తనకు ఉన్న పలుకుబడి, రాజకీయ పరిచయాలతో దేవస్థానానికి ఉన్నతాధికారిగా వచ్చిన అధికారిని ప్రసన్నం చేసుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. శ్రీశైల దేవస్థానంలో అటెండర్ స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి ఎప్పుడు కూడా తన విధుల నిర్వర్తించకుండా బయట తిరుగుతుంటాడని సమాచారం. ముఖచిత్ర హాజరుకు మాత్రం వస్తాడని తెలుస్తోంది. మిగతా సమయాల్లో దేవస్థాన పరిపాలన కార్యాలయంలో, దర్శనాల కోసం ఆలయంలో తిరుగుతుంటాడని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదరు ఉద్యోగిని టోల్గేట్కు బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడి సతీమణితో సిఫార్స్ చేయించుకోవడంతో కూటమి నేతలు కూడా కంగుతిన్నారు. తన బదిలీని నిలుపుదల చేసుకుని, తనకు నచ్చిన చోట, విధులకు హాజరుకాకపోయిన పట్టించుకోని ఓ విభాగంలో బదిలీ చేయాలని ఇతనే అధికారులకు చాయిస్ ఇవ్వడంతో అతనికి నచ్చిన విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. తనకు పలుకుబడి ఉన్న ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు శ్రీశైలానికి వస్తే వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలు చేయించే పనిలో నిమగ్నం అయి ప్రైవేట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంలో తనకు పలుకుబడి ఉందని ఎవరికై నా దర్శనం కావాలంటే తనని సంప్రదించాలని చెబుతుంటాడని సమాచారం. శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి తనకు సన్నిహితంగా ఉంటాడని, ముఖ్య అధికారి ఆశీస్సులు తనకు పుష్కలంగాా ఉన్నాయని, తాను ఏది చెబితే అది జరుగుతుందని దేవస్థాన అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తాడని తెలుస్తోంది. భవనం అధికారులకు కనిపించదు.. దేవస్థాన కాంట్రాక్ట్ ఉద్యోగి దేవస్థాన స్థలాన్ని కబ్జా చేసి భవనం నిర్మిస్తుంటే అ వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేని పరిస్థితిలో దేవస్థాన రెవెన్యూ విభాగం ఉంది. అంటే సదరు ఉద్యోగి పవర్ ఎంత ఉందొ ఇట్లే అర్థమవుతుంది. సదరు చిరు ఉద్యోగికి ఉన్నతాధికారి ఆశీస్సులు కూడా ఉండడంతో ఆ ఉద్యోగి నిర్మాణం నిలుపుదల చేసేందుకు రెవెన్యూ విభాగ అధికారులు సాహసించలేక పోయారు. చిన్నపాటి వ్యక్తి ఏదైనా మరమ్మతులు చేసుకుంటే మాత్రం ముప్పతిప్పలు పెట్టే రెవెన్యూ విభాగ అధికారులు భారీ భవంతి నిర్మిస్తుంటే మాత్రం పట్టింకోకపోవడంపై ఆ మర్మం ఆ మల్లన్నకే ఎరుకా..!. ఉన్నతాధికారి అభయం..రెండు సెంట్ల స్థలం కబ్జా శ్రీశైలంలోని కొత్తపేట కాలనీలో సదరు చిరు ఉద్యోగి తన పలుకుబడిని ఉపయోగించి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ దేవస్థాన ఉన్నతాధికారి అభయంతో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడు. కబ్జా చేయడంతో పాటు ఆ స్థలంలో విశాలవంతమైన భవంతిని సైతం నిర్మిస్తున్నాడు. దేవస్థాన ఉన్నతాధికారి నుంచి అనుమతులు ఉన్నాయంటూ అధికారులను బెదిరిస్తూ అధ్యాత్మిక క్షేత్రాన్ని కబ్జాల మయం చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన నెలవారి వేతనం సుమారు రూ.20 వేలు ఉంటుంది. అయితే అతను మాత్రం సుమారు రూ.20 లక్షల పైబడి భవంతిని నిర్మిస్తుండడంపై స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఎంతటి వారైన ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. దేవస్థానం స్థలంలో ఇంటి నిర్మాణాల కోసం ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. తిరుమల తిరుపతి తరహాలోనే శ్రీశైల దేవ స్థానంలో కూడా వైదిక సిబ్బంది మాత్రమే స్థానికంగా ఉంటారు. మిగిలిన ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సున్నిపెంటకు తరలివెళ్లాల్సిందే. క్షేత్ర పరిధిలో సుమారు 3,600 మందిని సున్నిపెంటకు తరలించే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎవరు ఎంతటి నిర్మాణం చేసిన కచ్చితంగా తొలగిస్తాం. – శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
భక్తిశ్రద్ధలతో మాతం
● బనగానపల్లెలో షియాల ప్రదర్శన బనగానపల్లె: మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రంను శుక్రవారం బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరువాత ఏపీలో ఆ స్థాయిలో ఇక్కడ మాతం నిర్వహించడం ప్రత్యేకత. ఊరేగింపులో బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజలే అలిఖాన్, ఆయన కుమారుడు గూలంఅలిఖాన్తో పాటు ఎక్కువ సంఖ్యలో షియా మతస్తులు పాల్గొన్నారు.నల్లటి వస్త్రాలు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా శోకగీతాలు అలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎదలు, వీపు పైనా మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాంఖాసీం పీరు జుర్రేరువాగు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను అలింగనం చేసుకుంది. పీర్లన్నింటినీ పట్టణంలోని జుర్రేరు వాగులో శుద్ధి చేసి అనంతరం వాటిని తీరిగి చావిళ్లకు తీసుకెళ్లారు. పలువురు దాతలు రస్నా, పానీయాలు, మంచి నీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉరేగింపునకు బనగానపల్లె పరిసర గ్రామాల నుంచి వేలాది మంది హిందూ, ముస్లింలు వచ్చి మాతం పీర్ల నిమజ్జనాన్ని చూశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మొహర్రం పదో రోజును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి సంతాప సూచకంగా వ్యాపార దుకాణాలు, సినిమా హాల్స్ మూసివేయగా, వీధిలైట్లను ఆర్పివేశారు. బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కేజీబీవీ విద్యార్థినులకు కుళ్లిన అరటి పండ్లు
గోనెగండ్ల: గోనెగండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు గురువారం రాత్రి భోజ నం అనంతరం కుళ్లిన అరటి పండ్లను పంపిణీ చేశారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థిను లు తినకుండా పాఠశాల బయట డబ్బాలో పడేశారు. అయితే మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రు లు గురువారం పాఠశాలకు వెళ్లడం, అక్కడ డబ్బాల లో కుళ్లిన అరటి పండ్లను చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. వీటిని కొందరు ఫొటోలు, వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అవుతోంది.గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థి నులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్ విద్యావతిని ప్రశ్నించగా బుధవారం రాత్రి మంచి అర టి పండ్లనే ఇచ్చామన్నారు. అరటి తొక్కలను సమీపంలోని బర్రెల పెంపకందారులు తీసుకెళ్తుండటంతో బ యటి డబ్బాలో పడేస్తామన్నారు. వీటిని బాలికల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. -
కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇచ్చేందుకు వస్తూ
పాములపాడు: గుంటూరు నుంచి కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇవ్వడానికి వస్తున్న ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన శుక్రవారం కర్నూలు – గుంటూరు హైవేలో యర్రగూడరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు సొనాలిక షోరూం నుంచి నాలుగు ట్రాక్టర్ ఇంజిన్లు కర్నూలు జిల్లా ఆదోనిలో డెలివరీ ఇచ్చేందుకు డ్రైవర్లు బయల్దేరారు. మార్గమధ్యలో యర్రగూడూరు సమీపంలో కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన డ్రైవర్ తిరుపతయ్య(33) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంట వచ్చిన మరో ట్రాక్టర్ ఇంజిన్ డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్లో డౌన్ లైన్ ట్రాక్పై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, ఎడమ చేతిపై ‘అమ్మ ’అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆకుపచ్చని ఫుల్ టీషర్ట్, గులాబీ, నలుపు, తెలుపు రంగుల పూల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉందని, మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్లు ఆదో ని రైల్వే స్టేషన్లో పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు -
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం
ఆదోని అర్బన్: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాటును తనకు తెలియకుండా ఇతరులకు అమ్మేసిన వ్యక్తి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కార్వన్పేటకు చెందిన దంపతులు రామచంద్ర, సంధ్య హెచ్చరించారు. ఈ మేరకు వారు గంగపుత్ర సంఘం సభ్యులతో కలసి అక్రమంగా ప్లాట్ అమ్మేసిన వ్యక్తి ఇంటి ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 2014లో నాన్ లేఅవుట్ కింద ఉన్న 348, 349/3 సర్వేలో ఉన్న మూడున్నర సెంట్ల ప్లాట్ను శివప్రసాద్ నుంచి కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి ఆ ప్లాట్లో బండలు పాతుకుని ఉన్నామన్నారు. అయితే 2025లో లే–అవుట్ చేసి తన ప్లాట్ను వేరే వ్యక్తికి అమ్మేయడంపై శివప్రసాద్ను నిలదీశామన్నారు. డబ్బులు కానీ, ప్లాట్ కానీ తిరిగి ఇవ్వాలని కోరితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు శివప్రసాద్ ఇంటి ముందు ధర్నా కూర్చొంటామని, లేదంటే అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు గంగపుత్ర సంఘం కులస్తులు కోదండ, ప్రకాష్, శ్రీనివాసులు, దీపక్, వీరేష్, వై.పి.నాగరాజ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు రాయండి!
బకాయి ఫీజు కట్టండి.. ● మెస్ బకాయిలు కడితేనే పరీక్షలకు అనుమతి ● పీజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకుఆర్యూ అధికారులు నోటీసులు ● నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ● ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కూటమి ప్రభుత్వం కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. విద్యార్థుల అత్యుత్సాహం, అధికారుల పంతాలు వెరసి విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు వర్సిటీ ప్రతిష్టను మసక బార్చేలా మారుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం వర్సిటీ పునః ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. వర్సిటీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మెస్ బిల్లుల బకాయిలు కట్టకపోవడంతో అధికారులు భోజనం పెట్టకుండా నిలిపేశా రు. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉందని, దాని గురించి ఆలోచించకుండా వెనుకబడిన ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులను కక్ష పూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. వర్సి టీ అభివృద్ధికి వాడాల్సిన ఇంటర్నల్ ఫండ్స్ను వర్సిటీ అభివృద్ధికి వాడకుండా ఉద్యోగులకు జీతాలు అయితే చెల్లిస్తారు కానీ విద్యార్థులు మెస్ ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీ అధికారులేమో మెస్ బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లను నిర్వహించగలమని చెబుతున్నారు. నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వర్సిటీ పరిధిలో పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ 472 మంది, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు వర్సిటీ కళాశాల కేంద్రంతో పాటు నంద్యాల, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అధికారులు చెబుతున్న బకాయిల లెక్కలు ఇలా.. ● పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన బకాయి రూ. 20.70 లక్షలు ● విద్యార్థులు కట్టిన బకాయి రూ. 11.03 లక్షలు ● ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ. 9.66 లక్షలు ● ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 6.20 లక్షలు ● రీయింబర్స్ పోగా ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ.2.64 లక్షలు రాయలసీమ యూనివర్సిటీ పరిపాలన భవనం వర్సిటీలో నోటీసుల జారీతో కలకలం హాస్టల్ బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటేనే హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాయనిస్తామని వర్సిటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వని ఏ ఒక్క విద్యార్థికై నా హాల్ టికెట్లు జారీ చేయొద్దని అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నో డ్యూస్ నోటీస్తో వర్సిటీలో కలకలం రేగుతోంది. గత పది రోజుల నుంచి వర్సిటీలో హాస్టళ్ల బకాయిల గురించి ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసి హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాట కేసు నమోదైంది. వీరిలో నలుగురు విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గతంలో ఇద్దరు విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, ఒక విద్యార్థిపై కేసు నమోదు కావడం జరిగింది. వీరు ఇద్దరు సైతం పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటు చేసుకోడం పట్ల విద్యా వేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎక్కడో ఒక చోటు పుల్స్టాప్ పడకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశఽనం కావడంతో పాటు వర్సిటీ ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్ల మెస్ బకాయిలు చెల్లించాక నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే హాల్ టికెట్స్ ఇచ్చి పరీక్షలకు అనుమతిస్తాం. కొంత ఫీ రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది కాక ఇంకా సుమారు రూ. 2 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు మెస్ బిల్లులు క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాస్టళ్ల నిర్వహణ సులభమవుతుంది. బకాయిలు పేరుకుపోతే నిర్వహణ కష్టమవుతుంది. కొంత మంది విద్యార్థులు రీయింబర్స్మెంట్ వచ్చినా కట్టకపోవడం బాధాకరం. పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులు బకాయిలు చెల్లించి సహకరించాలి. – డాక్టర్ విజయ్కుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూ -
ప్రపంచంలో కర్నూలుకు గుర్తింపు తీసుకొస్తాం
కర్నూలు (టౌన్): జైరాజ్ ఇస్పాత్ కంపెనీ నుంచి అత్యుత్తమైన ఉక్కును ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే కర్నూలుకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తామని జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే గోయెంకా అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని సాయి శక్తి ఏజెన్సీ, నంద్యాల రోడ్డులోని శ్రీ సా యి బిల్డింగ్ మెటీరియల్స్, నందికొట్కూర్ రోడ్డులోని ఆర్థ ట్రేడర్స్లలో జైరాజ్ ఎటూట్ ఎఫ్ఈ 550డీ టీఎంటీ డీలర్ షిప్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. ఉక్కు తయారీ కేంద్రంగా ఉక్కు ప్రపంచ పటంలో కర్నూలు నిలిచిపోతుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో ఏటా మిలియన్ టన్నుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉక్కు పారిశ్రామికవేత్త విక్రమ్ సింహా రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. జిల్లాలో ఒక పెద్ద సమీకృత ఉక్కు తయారీ కేంద్రాన్ని స్థాపించాలన్న జైరాజ్ ఇస్పాత్ నిర్ణయం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశ్రీజైన్, వైస్ ప్రెసిడెంట్ రమ్య కోడాలి, డీలర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. -
40 ఏళ్లుగా..
చిత్రంలో సైకిల్పై కనిపిస్తున్న వ్యక్తి పేరు రఘు. స్థానిక కేడీసీసీ బ్యాంక్లో దాదాపు 25 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని వయస్సు ఇప్పుడు 50 ఏళ్లు కాగా.. 40 ఏళ్ల క్రితం తన నాన్న కొనిచ్చినా సైకిల్ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. ఇతను నివసించే చౌడమ్మ కాలనీలో ఉదయాన్నే ప్రతి ఒక్కరూ అతని సైకిల్ బెల్ చప్పుడు వినాల్సిందే. కుటుంబ అవసరాలకు, బ్యాంకుకు ఇదే సైకిల్పైనే వెళ్తున్నాడు. ఓ వైపు సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరో వైపు పెట్రోల్ ఖర్చులు ఆదా చేస్తున్న రఘు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. – పత్తికొండ -
వైద్యులు లేక.. 108 రాక.. వృద్ధుడి మృతి
హాలహర్వి: సమయానికి 108 అంబులెన్స్ రాక, ఆటోలో అష్టకష్టాలు పడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు లేక ఒక వృద్ధుడు మృతి చెందాడు. హాలహర్వి మండలం పచ్చారపల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీనారాయణ (74) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణను ఒక ఆటోలో పచ్చారపల్లి నుంచి హాలహర్వి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులోలేరు. డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్నర్స్ భోజనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో ఆలూరు అంబులెన్స్ హాలహర్వి ఆసుపత్రికి వచ్చింది. దానిలో బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో పరీక్షించిన ఆలూరు వైద్యులు లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. హాలహర్వి ఆసుపత్రిలో డాక్టర్లు లేక, 108 రాక వృద్ధుడు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈరన్న సన్నిధిలో పీర్ల దేవుడు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యకేత్రం అయిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో వందేళ్ల నాటి ఆచారం కొనసాగింది. మొహర్రం పండుగకు ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలోని పీర్ల దేవుడు మొహర్రం పదవ రోజు (సహదత్) తెల్లవారుజామున ఈరన్న స్వామి దేవాలయంలోకి ఊరేగింపుగా చేరుకుంటారు. పీర్ల దేవుడిరాకతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ కొనసాగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఈ సంప్రదాయం కొనసాగింది. పీర్ల దేవుడు దేవాలయం వద్దకు చేరుకోగానే కోలాహలం మొదలైంది. పీరును ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకులు పూజలు చేసి హారతి పట్టారు. సంప్రదాయ వేడుకను భక్తులు కనులారా తిలకించారు. పాతాళగంగలో గుర్తు తెలియని మృతదేహం శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పాతాళగంగలో శుక్ర వారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా అతని ప్యాంటు జేబులో రేపల్లె – గుంటూరు బస్ టికెట్ లభించిందన్నారు. మృతుని చొక్కాపై డీసెంట్ టైలర్స్ అని లేబుల్ ఉందని, మరే ఇతర ఎటువంటి ఆధారాలు లభించ లేదని తెలిపారు. మృతుడు రేపల్లెకు చెందిన వ్యక్తిగా భావించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9121101192, 9121110 1193కు సమాచారం ఇవ్వాలన్నారు. షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధం ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మైనార్టీ కాలనీ రోడ్డు ప్రాంతంలో కె.శ్రావ్య అనే మహిళకి చెందిన టాటా టియాగో ఈవీ కారు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. తమ ఇంటి ముందు ఉంచగా శుక్రవారం తెల్లవారుజామున కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులో తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. -
మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యాయమూర్తి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. – శ్రీశైలం టెంపుల్ -
పంట కాల్వకు అడ్డుకట్ట వేసిన టీడీపీ నాయకులు
● రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నాయకుడికి వేధింపులు ఆళ్లగడ్డ: టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే పనిగా వారు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్షతో ఏకంగా పంటకాల్వకు అడ్డుకట్ట వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. తన పొలంలోని నీరు కాల్వ ద్వారా వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని రామచంద్రాపురం మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు చౌడయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఉన్న పంటకాల్వ ద్వారానే నీరు వెళ్తుందని ఇప్పుడు ‘అది ప్రభుత్వ కాల్వ కాదని మా సొంత పొలాల ద్వారా వెళ్తుంది’ అని అడ్డుకట్ట వేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాల్వ పూడ్చడంతో ఎస్సీ కాలనీలోని మురుగునీరంతా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కూడా కాల్వను పూడ్చడంతో తన ఐదు ఎకరాల పొలంలో వర్షపు నీరు నిల్వ ఉండి సాగుచేసిన జొన్న పంట దెబ్బతినిందన్నారు. అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. -
ఆటో, బైక్ ఢీ
ఆదోని రూరల్: గణేకల్–పాండవగల్ గ్రామాల మధ్య ఉన్న పాతరయ్యస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఓ యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దతుంబళం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నెమలికల్లు గోవిందు ప్రయాణికులతో మాధవరం నుంచి ఆదోనికి వస్తుండగా, గణేకల్ గ్రామానికి చెందిన అయ్యన్న బైక్పై పాండవగల్లు వైపు వెళ్తుండగా పాతరయ్య దేవాలయ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయ్యన్న(26) తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు వన్నూర్బీ, రెహానా, అయసూన్బీలకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. మద్యం మత్తులో బస్సు నడుపుతూ.. పత్తికొండ: ఫూటుగా మద్యం సేవించి అతివేగంగా ప్రైవేటు బస్సు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తికొండ సీఐ జయన్న, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి శిశిర శుక్రవారం రాత్రి పత్తికొండ పట్టణ శివారులోని హోసూరు బైపాస్ దగ్గర బస్సు ఆపి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...శుక్రవారం సాయంత్రం మంత్రాలయం నుంచి బెంగళూరుకు శ్రీగురు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మంత్రాలయం నుంచే వేగంగా, అడ్డదిడ్డంగా బస్సు నడుపుతూ ప్రయాణికులను బెంబేలెత్తించారు. పలువురు ప్రయాణికులు భయపడి వెంటనే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పత్తికొండ పోలీసులను, ఆదోని ఆర్టీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెంబడించి పత్తికొండ పట్టణ శివారులో నిలిపివేశారు. అనంతరం బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతిగా మద్యం తీసుకున్నట్లు వెల్లడైంది. వెంటనే కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ప్రయాణికులను ఇతర బస్సులలో బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
నల్లమలలో అడవిదున్న
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో అడవిదున్న స్థానికుల కంటపడింది. దీంతో కొందరు యాత్రికులు తమ సెల్ఫోన్లలో అడవిదున్న సంచరిస్తున్న దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. 1870కు ముందు ఒక్కసారిగా మాయమైన అడవిదున్న 152 ఏళ్ల తరువాత 2022లో నల్లమల అభయారణ్యంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం అడవుల్లో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశఽమైంది. కొన్నేళ్ల తరువాత మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన అడవిదున్న.. కొన్ని రోజుల అనంతరం నల్లమల అభయారణ్యంలో స్థానికులకు తారసపడింది. ఇండియన్ గౌర్, ఇండియన్ బైసన్గా పిలుచుకునే అడవిదున్నలు నీలగిరి, మధ్యప్రదేశ్ అభయారణ్యాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని నల్లమల అభయారణ్యాలకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా, అడవిదున్న సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని సంప్రదించగా కొద్ది రోజులుగా గుండ్ల బ్రహ్మేశ్వరం, మార్కాపురం ఏరియాలో సంచరించిన అడవిదున్నే తిరిగి నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు. -
మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
నంద్యాల (న్యూటౌన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం(బాలురు, బాలికలు) మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ ర్యాంకు ప్రకారం ఎస్సీ–2 బాలికలకు 267–10,000, ఎస్సీ–3 వారికి 302 – 14,633, ఎస్టీ 947–14,678, బీసీ 02–2999 వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ–2 బాలురు 83–9996, ఎస్సీ–3 వారికి 3–14,504 వరకు, ఎస్టీ 656–14499, బీసీ 10–2500 వరకు మెరిట్ జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. బాలికలకు ఈ నెల 27న దిన్నెదేవరపాడులో ఉదయం 8.30 గంటలకు, బాలురకు ఈ నెల 29న చిన్నటేకూరులో ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 08518–295601 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి బొమ్మలసత్రం: పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి చేయాలని జిల్లా పోలీస్ పరిపాలన విభాగం సిబ్బందికి అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సీనియారిటీ, పదోన్నతలుకు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. సిబ్బందికి సకాలంలో రుణాలు పొందేలా అన్ని రకాల పత్రాలు నమోదు చేయాలన్నారు. ఇంక్రిమెంట్లు, మిస్సింగ్ క్రెడిట్ టీఏలు, శాలరీ పెండింగ్ తదితర అంశాలపై దృష్టి నిలపాలని సూచించారు. సమావేశంలో పరిపాలనా విభాగం అధికారులు వీరన్న, ఖాదర్వలి, కవిత, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 24 ఏళ్ల తర్వాత రేవనూరులో మొహర్రం కోవెలకుంట్ల: మండలంలోని రేవనూరులో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మొహర్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో గ్రామంలో రెండు దశాబ్దాలకుపైగా వేడుకలు జరపలేదు. గ్రామస్తులంతా కలసికట్టుగా ఐకమత్యంతో ఈ ఏడాది మొహర్రం జరిపేందుకు ముందుకొచ్చారు. గ్రామంలోని ఉసేన్వలిస్వామి దర్గా సమీపంలోని పీర్ల చావిడిలో బీబీఫాతిమా, ఇమాంకాశీం, పిల్లలపీరు, అలీ అక్బర్, దస్తగిరిస్వామి, హసన్, ఉసేన్ పీర్లను కొలువుంచారు. గురువారం పెద్ద సరిగెత్తును పురస్కరించుని భక్తులు పీర్లకు ఫాతేహాలు సమర్పించారు. పెద్ద సరిగెత్తు సందర్భంగా గ్రామంలోని భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇరవైనాలుగేళ్ల తర్వాత పీర్లపండుగ నిర్వహించటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అపరాల సాగు ఎంతో మేలు బండిఆత్మకూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నంద్యాల ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త మంజునాథ్ సూచించారు. ఈర్నపాడు గ్రామంలో గురువారం మండల వ్యవసాయాధికారి పవన్కుమార్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త మంజునాథ్, డీఆర్సీ ఏడీ చెన్నయ్య పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా మినుము, పెసర వంటి అపరాలు, కొర్ర, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలను సాగు చేయడం లాభదాయకమన్నారు. ఆత్మ బీటీఎం ఉమామహేశ్వరి, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మయ్య, వసుంధర, నాంకేబాయ్ పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం
● విచారణ జరుపుతున్న జిల్లా బాలిక సంరక్షణ అధికారి ఓర్వకల్లు: కొమ్ముచెరువు ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం జరిగింది. పోలీసులు, జిల్లా బాలిక సంరక్షణ అధికారి శారద తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుడుంబాయి తండాకు చెందిన బాలికకు అదే తండాకు చెందిన ప్రసాద్ నాయక్తో గురువారం వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొమ్ముచెరువు దేవాలయంలో వివాహం చేసేందుకు సిద్ధం అవగా.. వధువు తరఫున వచ్చిన సమాచారం మేరకు పోలీసులతో జిల్లా బాలికా సంరక్షణ అధికారిణి శారద అక్కడి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నాయకుల మధ్య వివాహం జరిపించారు. వధూవరులను అధికార పార్టీ నాయకులు ఆశీర్వదించారు. కాగా.. వధువు జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా వాస్తవం బయటకు వచ్చింది. పాఠశాలలో ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం బాలికకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగులో అక్కడి అధికారులు తప్పుడు తేదీతో ఇటీవల జన్మదిన ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇందులో ఏది నిజమైందో అధికారుల పరిశీలనలో తెలియాల్సి ఉంది. -
మొక్కజొన్న సాగుపై నీలినీడలు!
ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. సేద్యాలు, విత్తనాలు, కూలీల ఖర్చు రూపంలో ఇప్పటికే రూ. 40 వేల దాక పెట్టుబడి వెచ్చించాను. వర్షాలు కురిస్తేనే పంట చేతికందుతోంది. గత ఏడాది మార్కెట్లో ధర లేకపోవడంతో క్వింటా రూ. 1700లకే అమ్ముకోవాల్సి రావడంతో నష్టపోయాను. – బుజ్జి, పాలసాగరం, ఆళ్లగడ్డ మండలం గతేడాది మొక్కజొన్న సాగుతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. పైరు చేతికందే తరుణంలో భారీ వర్షాలు, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక పోవడంతో నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కజొన్న సాగు చేయడం లేదు. వరి, పచ్చజొన్న, హైటెక్ జొన్న పంటల సాగు చేసేందుకు విత్తనాలు సమకూర్చుకుంటున్నాను. – రాంభూపాల్రెడ్డి, రైతు, కోవెలకుంట్ల కోవెలకుంట్ల: ఎలినినో ప్రభావంతో మొక్కజొన్న సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈఏడాది ఖరీఫ్లో 61,615 హెక్టార్లలో సాగు సాధారణ విస్తీర్ణం. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో 7,501 హెక్టార్లలో, కొత్తపల్లి మండలంలో 6,461, జూపాడుబంగ్లా మండలంలో 6,195, నందికొట్కూరు మండలంలో 5,529, ఆత్మకూరు మండలంలో 5,085, రుద్రవరం మండలంలో 4,620, మిడుతూరు మండలంలో 4,345, పగిడ్యాల మండలంలో 3,024, బనగానపల్లె మండలంలో 2,980, ఆళ్లగడ్డ మండలంలో 2,705, చాగలమర్రి మండలంలో 2,010 హెక్టార్లలో మొక్కజొన్న సాగు కావాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో కేవలం 451 హెక్టార్లకే సాగు పరితమైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల్లో సాధారణ వర్షాపాతానికి 20 నుంచి 40 శాతం లోపే వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటీకీ ప్రభావం అధికంగానే ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో పంటలు సాగు చేయడం అసాధ్యమని, ఈ ఏడాది మొక్కజొన్న సాగు కష్టతరమేనని రైతులు వాపోతున్నారు. ఆగస్టులో సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్నది అంచనా వేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితులపై వాతావరణ నిపుణులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. గతేడాది వెంటాడిన కష్టాలు.. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. అయితే విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షా లు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. క్వింటా రూ. 2 వేల లోపే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. సన్నగిల్లుతున్న ఆశలు గతేడాది జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మే నెలలోనే విస్తారంగా వర్షాలు కురియడంతో రైతులు సకాలంలో మొక్కజొన్న పంట సాగు చేయగలిగారు. జూన్ రెండవ వారానికే 2,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాను కరువు, ఎల్నినో ప్రభావంతో వర్షాభావం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విత్తన పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందటంలేదు. జిల్లాలో 61,615 హెక్టార్లలో సాగు లక్ష్యం ఇప్పటి వరకు 451 హెక్టార్లకే పరిమితం గతేడాది ఇప్పటికే 2,700 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న ఈ ఏడాది వర్షాల్లేక ముందుకు సాగని విత్తన పనులు ఆందోళనలో అన్నదాత -
వైభవోపేతం.. గరుడోత్సవం
● నిజరూప దర్శనంతో భక్తులకు కనువిందు చేసిన ప్రహ్లాదవరదుడు ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా జ్యేష్ఠాభిషేకం (అభిద్యేయక అభిషేకం) వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో 108 కలశాలతో కూడిన విశేష తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించి జ్యేష్ఠాభిషేకం పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్వయం తిరుమేనితో (నిజరూప) దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. జ్యేష్ఠాభిషేకం విశిష్టత అహోబిలం ఆలయంలో స్వామికి ఏటా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన ఉత్సవమూర్తులు అభిషేకాలతో అరుగుదలకు లోనవుతాయి. అవిక్షయానికి గురికాకుండా పరిరక్షించేందుకు వాటికి బంగారు కవచాలు తొడుగుతారు. నిత్యాభిషేకాలు ఆ కవచాల మీదుగానే నిర్వహిస్తారు. దీంతో లోపల ఉన్న విగ్రహాలు అరుగుదలకు గురికావు. ఏడాదికి ఒకసారి ఆ కవచాలను తొలగించి, లోపల ఉన్న విగ్రహాలను శుభ్రం చేస్తారు. ఈ సమయంలోనే స్వామి స్వయం తిరుమేని (నిజరూప దర్శనం) తో భక్తులకు దర్శనం ఇస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామికి రోజుకో కవచం ధరింపజేస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు ముత్యాల కవచంతో స్వామిని అలంకరించారు. రెండో రోజు వజ్రకవచం, మూడో రోజు స్వర్ణకవచం ధరింపజేస్తారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వచ్చేంతవరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక పూజలు ప్రధానార్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పెట్టుబడి భారమాయె.. మద్దతు కరువాయె!
గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్లో ధర లేకపోవడంతో రూ. 70 వేల మేరకు నష్టపోయాను. ఈ ఏడాది ప్రభుత్వం వరికి పెద్దగా మద్దతు ధర ప్రకటించకపోవడంతో వరి సాగుపై ఆసక్తి లేదు. నాలుగు ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రభు త్వాలు రైతుల కష్టాన్ని గుర్తించి మద్దతు ధర పెంచాలి. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది ఖరీఫ్లో నాలుగున్నర ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 40 వేల చొప్పున మరో 4.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో మిరప, మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో విత్తన పనులు సాగడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాకు కేవలం రూ. 10 మాత్రమే పెంచడం విచారకరం. – రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: గత మూడేళ్ల నుంచి వ్యవసాయం కలసి రాకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. పెరిగిన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కలుపు నివారణ, ఇతర వ్యయసాయ ఖర్చుల కనుగుణంగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ పంటల సాగు, పంట దిగుబడులకు మద్దతు ధరకు ఏమాత్రం పొంతన లేకపోవడం అన్నదాతను నిరాశ పరుస్తోంది. ఆయా పంటలకు ప్రతి ఏటా మద్దతు ధర నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ)సాగు భారంతో పోలిస్తే నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 2.52 లక్షల హె క్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, జొన్న, పెసర, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, పొద్దుతిరుగుడు, ఉల్లి, సోయాచిక్కుడు, తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. 2026–27 ఖరీఫ్ సీజన్లోని 10 రకాల పంటలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది ఆయా పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఆశాజన కంగా లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 69,483 హెక్టార్లలో వరి, 61,615 హెక్టార్లలో మొక్కజొన్న, 10,138 హెక్టార్లలో మినుము, 38,102 హెక్టార్లలో కంది, 15,143 హెక్టార్లలో పత్తి, 12,078 హెక్టార్లలో మిరప, 8,694 హెక్టార్లలో వేరుశనగ పంటల సాగు లక్ష్యం. గతేడాది సీజన్కు ముందే భారీ వర్షాలు కురియగా జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వరికి ఏడేళ్లలో పెరిగింది రూ.100 ప్రతి ఏటా పంట ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నా అనుకున్న మేర పెంచకపోవడంతో అన్నదాతకు వ్యవసాయం భారంగా మారుతోంది. కంటి తుడుపుగా ధర పెంచుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. 2018–19 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సగటు వరి ధాన్యంపై సరాసరిన రూ. 100 లోపే మాత్రమే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా రెట్టింపవుతున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటకు గతేడాదికంటే ఈ ఏడాది కేవలం రూ. 72 ధర పెంచడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిపై 1.5 రెట్లు మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే పంట ఉత్పత్తులను విక్రయించి నష్టాల ఊబిలో కూరుకపోతున్నారు. పంటరకం 2025–26 2026–27 పెరిగిన ధర వరి సాధారణ 2,369 2,441 72 వరి ఏగ్రేడ్ 2,389 2,461 92 జొన్న హైబ్రీడ్ 3,699 4,023 324 జొన్న మాల్డాంని 3,749 4,073 324 సజ్జలు 2,775 2,900 125 రాగులు 4,886 5,205 319 మొక్కజొన్న 2,400 2,410 10 వేరుశనగ 7,263 7,517 450 పొద్దుతిరుగుడు 7,721 8,343 622 సోయాబీన్ 5,328 5,708 380 నువ్వులు 9,846 10,346 500 పత్తి(మీడియం) 7,710 8,267 577 పత్తి లాంగ్స్టేఫుల్ 8,110 8,667 557 కంటి తుడుపుగా మద్దతు ధర ప్రకటించిన కేంద్రం స్వల్ప పెంపుతోనే సరిపెట్టిన వైనం తడిచి మోపెడవుతున్న సాగు ఖర్చులు అన్నదాతను ఆదుకోని చంద్రబాబు సర్కార్ జిల్లాలో 2.52 లక్షల హెకార్ల ఖరీఫ్ పంటల సాగు లక్ష్యం వరి, మొక్కజొన్న, పంటలకు మద్దతు అంతంతే -
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం ఐటీడీఏ వెలుగు ఏపీడీ పీక్లా నాయక్, ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు మేనేజర్ కె.జి.నాయక్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ బల్మూరి పరమేశ్ ఆధ్వర్యంలో పల్నాడు, నంద్యాల, మార్కాపురం జిల్లాల నుంచి 250 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రమణీయం.. సుదర్శనమూర్తి జయంతి ఉత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ సుదర్శన మూర్తి జయంతి వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే దిగువఅహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ సుదర్శన మూర్తులను కొలువుంచారు. నవకలశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ సదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున సుదర్శన హోమం నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహించారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కలిగి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని భక్తుల విశ్వాసం. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. నేడు స్వాతి వేడుకలు స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు జేష్టాభిషేక వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభిషేకం, అర్చనలు చేస్తారు. అనంతరం గరుడ సేవ కార్యక్రమాలు ఉంటాయి. -
దినసరి కూలీలతో ఆర్భాటం
డోన్: తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రాక సందర్భంగా డోన్ రెవెన్యూ, పోలీస్ అధికారులు దినసరి కూలీలతో ఆర్భాటం చేశారు. కోడుమూరు, కర్నూలు నుంచి పలువురు మహిళలను, యవకులను దినసరి కూ లీపై డోన్కు తరలించారు. డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద గల షాదీఖానాలో వారికి వసతి ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పలు ప్రైవేట్ వాహనాల్లో వారిని జొన్నగిరికి తరలించారు. వీరికి ప్రతి ఒక్కరికి మైసూర్ గోల్డ్మైన్స్ అనే టీ షర్ట్లను, టోపీలను ఇచ్చారు. సీఎం కార్యక్రమానికి బౌన్సర్లు(రక్షణగా)గా పని చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ....800 వేతనం ఇస్తూ, భోజన వసతి కల్పిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు జొన్నగిరిలో పాల్గొనే సభకు తాము బౌన్సర్లుగా వెళ్లామన్నారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటేష్ శేషాద్రి తెలిపారు. న్నారు. నంద్యాల సబ్జైల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలను, స్నానపు గదులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైదీల ఆరోగ్య విషయాలు, వారి నేర ప్రవృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపైన అవగాహన కల్పించారు. ఖైదీలకు ఏదైనా అవసరం ఉంటే 15100కు సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. జైలు సూపరిండెంటెంట్ గురుప్రసాద్రెడ్డి, లోకదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయవాది బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్ధన్ రెడ్డి అన్నారు. గోపవరంలోని మండల పరిషత్ ప్రాధమిక, జిల్లా పరిషత్ పాఠశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఎంఈఓలు రామసుబ్బయ్య, విజయ్కుమార్ పాల్గొన్నారు. పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఉన్న పాలకవర్గంలో ఒకరిని మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న చింతల నాగకుమార్ స్థానంలో తోట రామభూపాల్ నియమితులయ్యారు. పాలకవర్గంలో మిగిలిన వారందరూ యథతథంగా కొనసాగుతారు. కేఎంసీకి 250 ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని 250 ఎంబీబీఎస్ సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్(పునరుద్ధరణ) చేసింది. 45 రోజుల్లోగా కళాశాలలో మౌలిక సదుపాయాలు, వైద్యపరమైన లోపాలను సరిదిద్దుకోవాలని షర తు విధించింది. ఎన్ఎంసీ పరిశీలనలో కళాశాలలో కనీస ప్రమాణాల ప్రకారం కొన్ని లోపాల ను గుర్తించారు. అయినప్పటికీ 2026–27 విద్యాసంవత్సరం కోసం అధ్యాపకుల లభ్యత, భౌతిక సౌకర్యాలను సరిదిద్దడంలో విఫలమైతే సీట్ల తగ్గింపు లేదా ప్రవేశాల నిలిపివేత సహా శిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సూచించింది. అయితే తాము కళాశాలకు సంబంధించి అన్ని వివరాలను ఎన్ఎంసీకి పంపించామని, వారు కేవలం ఆఖరి పేజీని చూసి లోపాలు ఉన్నట్లు పొ రపాటు పడ్డారని, ఈ మేరకు తిరిగి వివరాలను ఆధారాలతో సహా పంపిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేర్కొన్నారు. -
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంపై ప్రచురించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఫోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ 15100కు కాల్ చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్, లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జలధార పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
● మైనర్ ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ● ఆటోలో ప్రయాణించి చెరువుకు వద్దకు చేరుకున్న వైనం జూపాడుబంగ్లా: జలధార పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. రూ.60 లక్షల నిధులతో తంగ డంచ చెరువులో జరుగుతున్న జలధార పనులను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. చెరువు వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో కలెక్టర్ మూడు కిలో మీటర్ల మేర ఆటోలో ప్రయాణించి చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఆయకట్టు, ఎస్టిమేషన్ వివరాల గురించి మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పకపోవటంతో డీఈ మనోహర్, ఏఈ చిన్నమస్తాన్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువుకు సంబంధించిన సమగ్ర వివరాలతో నంద్యాలకు వచ్చి తనను కలవాలని ఆదేశించారు. జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతులకు గురవ్వటంతో పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో మోటార్ల మరమ్మతులకు రూ.10 లక్షలు, ఆయకట్టు రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల వద్దకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా కస్తూర్బా, గురుకుల పాఠశాలలను సందర్శించి ఎస్ఓ యశోద, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తిలకు పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రహరీ వెంట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ నాగేంద్రబాబు, ఏపీఓ రేష్మ పాల్గొన్నారు. -
దేవస్థానం చైర్మన్ ఆకస్మిక తనిఖీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్నాయుడు మంగళవారం కల్యాణకట్ట, కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్ద్య చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అందరూ కూడా సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు, కౌంటర్ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి ● ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు ఆత్మకూరు: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు సూచించారు. మండలంలోని బైర్లూటీ చెంచుగూడెంలోని ఆశ్రమ వసతి గృహాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల రిజిస్టర్ను పరిశీలించారు. విధుల్లో లేకున్నా సంతకం చేసి వెళ్లిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీరాములకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్లో వసతులు, భోజనం తదితర వివరాల గురించి విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అనునిత్యం విద్యార్థులు చదువుకునేలా చూడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం కరివేన గ్రామంలోని పీఎంవీడీవీకే (ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ యోజన) హబ్ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఆయన వెంట వెలుగు ఏపీడీ ఇట్లా నాయక్, సిబ్బంది ఉన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayala seemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలకు 463 మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారరు. సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్ పరీక్షలకు 48 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. 916 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో జూన్ నెల 4,45,769 పింఛన్లు ఉండగా.. జూలైలో 4,44,853కు తగ్గిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే 916 పింఛన్లపై కోతపడింది. ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వకపోవడం గమనార్హం. జూలై నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.194.43 కోట్లు బ్యాంకుల వారీగా నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 29 నుంచి సహకార వారోత్సవాలు కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ సహకార వారోత్సవాలు ఈ నెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమై సహకార శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై జూలై 6వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతి జిల్లాలో వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజీ ప్లాన్ స్కీమ్ కింద రూ.2 కోట్లతో గోదాము నిర్మించనున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,900 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి జూలై 6న భూమి పూజ నిర్వహించనున్నారు. -
ప్రవేశాల్లో వెనుక‘బడి’
● ప్రభుత్వ పాఠశాలపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు ● పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్న వైనందొర్నిపాడు: కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు చతికిల పడుతున్నాయి. నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలను పిల్లల తల్లిదండ్రులు నమ్మడం లేదు. దీంతో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. గుండుపాపల ఎంపీపీ (మెయిన్), అమ్మిరెడ్డినగరంలోని ఎంపీపీ స్కూళ్లలో ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్పించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ పాఠశాలలో మొదటి తరగతిలో చేరుందుకు నలుగురు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు అందరిని ప్రైవేటు స్కూళ్లో చేర్పించారు. దీంతో మొదటి తరగతిలో చేరుందుకు ఎవరూ లేరు. దీంతో ఉపాధ్యాయులు ఎలాగోలా ఒకరిని ఒప్పించి అన్సర్ అనే విద్యార్థిని మొదటి తరగతిలో చేర్పించారు. అప్పటికే ఆ విద్యార్థి ఓ ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ అడ్మిషన్ కావాలంటే ప్రైవేటు స్కూల్లో పేరు తొలగించేందుకు కాస్త ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. అలాగే వెల్దుర్తికి చెందిన మోక్షిత్ను కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకోవడంతో ఆ విద్యార్థి ఒకటవ తరగతిలో చేరారు. అయితే అప్పటికే ఓ ప్రైవేట్ స్కూ ల్లో చేర్పించడంతో ఇక్కడ అడ్మిషన్ కావడం లేదు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 20 మంది విద్యార్థులు ఉన్నారు. 5 తరగతులు.. 9 మంది విద్యార్థులు అమ్మిరెడ్డినగరంలో రోజూ పాతిక మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపుతారు. కానీ ఎంపీపీ స్కూల్లో మాత్రం కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఒకటవ తరగతిలో ఇద్దరు, రెండులో ఒకరు, మూడులో నలుగురు, ఐదులో ఇద్దరు ఉన్నారు. ఇక నాల్గవ తరగతిలో ఒక్కరూ కూడా లేక పోవడం గమనార్హం. అంతేగాక గ్రామంలో ఏకోపాధ్యాయుడు మస్తాన్వలి విద్యను బోధిస్తున్నాడు. -
దొంగలు దొరికారు!
● 195 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం బనగానపల్లె: అవుకు పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నవరం, సింగనపల్లి, లింగంబోడు గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన దొంగలు దొరికారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.26 లక్షల విలువైన 195 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన తోక మోసా, మిద్దె హుస్సేన్ వలి, తెలుగు వెంకటేశ్వర్లు చెడు వ్యసనాలకు బానిసై, ఈజీగా డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు పని మీద బయటికి వెళ్లే సమయంలో ఇంటి బయట, గూళ్లలో ఉంచిన తాళం చెవులు తీసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవుకు ఎస్ఐ అశోక్, పోలీ సు సిబ్బంది మంగళవారం స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో వాహ నాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన పై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల దొంగలు పట్టుబడ్డారు. చోరీ కేసులను త్వరితగతిన ఛేదించిన సీఐ మంజునాథ్రెడ్డి, ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్తో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జిల్లాలో మూడు రోజులు వర్షాలు ఎమ్మిగనూరు సెంటల్ర్: జిల్లాలో ఈ నెల 24, 26, 27వ తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ వయన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. -
వక్ఫ్ ఆస్తుల రక్షణలో మంత్రి ఫరూక్ విఫలం
● వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడం దారుణం ● ఎమ్మెల్సీ ఇసాక్బాషానంద్యాల: రాష్ట్ర మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కౌలూరు గ్రామం ఈద్గాకు చెందిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి, ఇలా కోర్టుల నిర్మాణానికి రాసివ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ‘ఒక్కసారి అల్లాకు ఇచ్చిన స్థలాలను కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం, దైవకార్యాల కోసమే ఉపయోగించాలని, వాటిని అమ్మడం, బదలాయించడం నిషిద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడలేని మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూనెపల్లి జామియా మసీదు ఆస్తులను కాపాడామన్నారు. కూటమి ప్రభుత్వం చాబోలు గ్రామం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల 14 సెంట్ల భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు కేటాయించడం దారుణమన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీ సా, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ దేవనగర్ బాషా వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు సలముల్లా, గన్నీ కరీం,ఎం.గౌస్, తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల ధ్వంసం!
పొలంగా మారిన లే– అవుట్కుప్పగా పడిన పాట్ల సరిహద్దు రాళ్లురుద్రవరం: అధికార దర్పంతో రెండేళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు. కొందరు వాగులు, వంకలు, చెరువులను చెరబట్టి ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ. లక్షలు సంపాదిస్తున్నారు. మరి కొందరు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఆక్రమించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా ప్రభుత్వ లేఅవుట్లను ఆక్రమించి పొలాలుగా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖలకు చెందిన అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా రుద్రవరం మండలంలోని హరినగరం గ్రామంలో గతంలో గిరిజనులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఓ టీడీపీ నేత ఆక్రమించేశాడు. రుద్రవరం మండలం హరినగరం వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లే – అవుట్గా మార్చింది. అందులో రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి నంబర్లతో కూడిన రాళ్లను పాతారు. ఆ లే – అవుట్లో హరినగరానికి చెందిన గిరిజనులతో పాటు చిత్రేనిపల్లె, నర్సాపురం గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. అనుకున్నట్లుగానే అప్పట్లో ముందుగా హరినగరంలోని గిరిజనులు 20 మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతుండగా పలు అనివార్య కారణాలతో లే –అవుట్లో గృహ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇంతలో సాధారణ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్క గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ లే –అవుట్పై కన్నేశాడు. గత కొద్ది రోజుల నుంచి అక్కడ రాళ్లను తొలగించి పక్కనే కుప్పగా పోశాడు. ట్రాక్టరు, డోజర్తో ముళ్ల కంప, పిచ్చి మొక్కలు వంటి వాటిని తొలగించాడు. రోడ్లను చదును చేసి పొలంగా మార్చేశాడు. ఇదేమని పలువురు లబ్ధిదారులు అడిగినప్పటికీ వారిని లెక్క చేయలేదు. వర్షం కురవగానే విత్తు విత్తేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఇంత సాగుతున్నా రెవెన్యూ శాఖ సిబ్బంది, ఉద్యోగులు తమకేమి తెలియదన్నట్లు నిమ్మకుండి పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై తహసీల్దారు నాగవీణను వివరణ కోరగా వీఆర్వోతో వివరాలు సేకరించి ఆక్రమణలు అడ్డుకుంటామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఇల్లు నిర్మించేందుకు స్థలం కేటాయిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నాయకులు కబ్జా చేస్తున్నా రు. సొంత ఇళ్లులేక, కట్టుకునేందుకు స్థలం లేక గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో స్థలం దక్కిందని సంతోష పడ్డాను. కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు. ఆ పార్టీ నాయకుడు ఏకంగా లే – అవుట్ స్థలాన్నే కబ్జా చేశాడు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ముత్యాలమ్మ, లబ్ధిదారు, హరినగరం ప్రభుత్వ లే – అవుట్ను ఆక్రమించిన టీడీపీ నేత పొలంగా మారిన గిరిజనుల ఇళ్ల ప్లాట్లు పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
మల్లన్న హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కి ంచగా నగదు రూపేణా రూ.5,45,55, 035 లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థానం అలంకార మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత 27 రోజులలో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. అలాగే బంగారం 127 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి–3కేజీల 680 గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. అలాగే 93రోజుల్లో అన్నదాన భవనంలోని అన్నప్రసాద వితరణ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.8,80,396 లభించిందన్నారు. -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డయేరియా నివారణ చర్యలు, వర్షాకాలంలో తలెత్తే అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నందున ప్రతి సంవత్సరం ప్రత్యేక రక్షణ చర్యగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ తేదీన 90 నుంచి 95 శాతం మంది పిల్లలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనంతరం జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు అందజేస్తామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డయేరియా నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో డైరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
డోన్ టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్పాల్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. itiadmissions.ap.gov.in/iti అనే వెబ్ సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని ప్రింట్ కాపీని తీసుకోని దీనితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల్లో జూలై 2 తేదీ లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా రు. వెరిఫికేషన్ చేయించకపోతే మెరిట్ లిస్ట్లో పేర్లు చేర్చబోమన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టు పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ నంద్యాల(అర్బన్): జిల్లాలోని ప్రైవేటు, కార్పొ రేట్ పాఠశాలల్లో అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తున్నా మని జిల్లా కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ మేరకు రాయితీకి సంబంధించిన జీవో కాపీని ఆమె జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. అహర్నిశలు సమాజ బాగు కోసం శ్రమించే జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో చేరికకు రాయితీని ప్రకటించామన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 128 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వివిధ సమస్యలను తనకు తెలియజేశారన్నారు. చట్టపరిధిలో సమస్యల ను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా స్టేషన్ల అధికారులకు బదీ లీ చేశామని, నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించేలా ఆదేశించామన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి నంద్యాల(వ్యవసాయం): రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం క్రెడిట్ ఔట్రీచ్ ప్రోగ్రాం ద్వారా రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.27.25 కోట్ల విలువ చేసే రుణాలను ఖాతాదారులకు అందజేశారు. అనంతరం ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమ బ్యాంకు ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా, ఆస్తి తనాఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి సుధాకర్, స్ఫూర్తి కిరణ్, అమిత్ కుమార్, శేషసాయి కిరణ్, సృజన్ సీనియర్ మేనేజర్లు రమణయ్య, శేఖర్, బ్రాంచ్ మేనేజ ర్లు రీజన్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్ సహాయకులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్కుమార్ను పీఆర్ క్యూసీ సబ్ డివిజన్ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యత ‘పగుళ్లు’బడి నవ్వుతోంది!
● నాసిరకంగా ఎస్సారెమ్సీ లైనింగ్ పనులు ● కనిపించని పర్యవేక్షణ అధికారులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వరకు చేపట్టిన లైనింగ్ పనుల్లో నాణ్యత మాయమవుతోంది. ఓ వైపు పనులు జరుగుతుండగా.. మరో వైపు పగళ్లు దర్శనమిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం దృష్ట్యా కృష్ణానది వరద సమయంలో నెల్లూరు, మద్రాసు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం వాటా నీటిని సకాలంలో వేగంగా తరలించాలనే లక్ష్యంతో ఎస్సారెమ్సీ (శ్రీశైలం రైట్బ్రాంచ్ మెయిన్ కెనాల్) లైనింగ్ పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నీటి విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80వేలకు పెంచారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల వరకు 16.5 కిలో మీటర్ల మేర కుడి, ఎడమ గట్లకు లైనింగ్ చేయటంతో పాటు నీరు దిగువకు వేగంగా ప్రవహించేలా కాల్వ అడుగున కాంక్రీట్ బెడ్డు నిర్మించతల పెట్టారు. 2020లో రూ.1,017. 22 కోట్లతో నిర్మాణం పనులను పీఎన్సీ కంపెనీ వారు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న ఈ కంపెనీ గుడ్విల్ తీసుకుని వ్యామ్ కంపెనీకి అప్పగించింది. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనులను వ్యామ్ కంపెనీ నత్తనడకన చేపడుతోంది. ఆరేళ్లు గడిచినా నేటికీ పనులు పూర్తిచేయకపోవటం గమనార్హం. జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటంతో ఓ వైపు పనులు చేస్తుండగానే మరో వైపు చేసిన లైనింగ్ పనులు బీటలు వారి కనిపిస్తోంది. దీంతో పనుల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పదికాలాల పాటు ఉండాల్సిన ఎస్సార్మ్సీ కాల్వ లైనింగ్ను నాణ్యతగా నిర్మించాల్సిన అవసరం ఉంది. -
కష్టం.. నష్టం
వాన జాడ లేక రైతుల్లో గుబులు మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కాస్త ముందస్తుగా మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. మండల కేంద్రమైన రుద్రవరం, రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, ఆలమూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు మే నెలలో మిర్చి సాగు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి మిర్చి నారు కొనుగోలు చేసి దాదాపు 600 ఎకరాల్లో నాటించారు. 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గింది. అలాగే ఎండలు అధికంగా ఉండటంతో ఆ మొక్కలకు బింగి తెగులు సోకింది. దీంతో మిర్చి మొక్కల ఆకులు ముడతలుగా చుట్టుకుని అలాగే ఉంటుండటంతో రైతులు చేసేదిలేక ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతుల చేతికి చిల్లి గవ్వ కూడా దిగుబడి రూపంలో రాకుండానే పూర్తిగా నష్టపోతున్నారు. కౌలు రైతులు మరింత అధికంగా నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిర్చి పైరును తొలగించి మొక్క జొన్న సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. – రుద్రవరం -
గతంలో పంపిణీ విధానమే మేలు
గతంలో రైతుల నుంచి పాసుపుస్తకం జిరాక్స్ ప్రతిని తీసుకుని వివరాలు రాసుకుని టోకన్ ఇచ్చేవారు. రైతులకు సమయం ఎంతో ఆదా అయ్యేది. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలకు వచ్చి పాసుపుస్తకం, ఆధార్కార్డు సమర్పించి వివరాలను నమోదు చేయించుకుని, మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాల్సి వస్తుంది. దీంతో రైతులు ఉదయం నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. – మహానంది, రైతు నేను 50 ఎకరాల్లో సోయాబీన్, ఆరు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు డీఏపీ ఒక బస్తా ఇస్తే ఏరకంగా పంట సాగు చేయాలి? నాకున్న సొంత భూమికి ఇచ్చారు. కౌలుకు వేసుకున్న 20 ఎకరాల పొలానికి ఎరువులు ఎట్లా? పొలం కౌలుకు ఇచ్చిన వారు ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చి యాప్తో వేలిముద్ర వేసి ఎరువులు ఇప్పించడం కుదురుతుందా? ఇప్పుడు నాకు సోయాబీన్కు డీఏపీ, యూరియా కావాలి. పంటను పండించాలా, నాశనం చేసుకోవాలా? ఇలాగైతే వ్యవసాయం చేయలేం! – శ్రీనివాసులు, రైతు పాములపాడు నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. కొన్ని రోజులుగా డీలర్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. వరి మడులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంటే బాగుంటుంది. యూరియా అత్యవసరమవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ మాకు యాప్ తెలియదు. ప్రభుత్వమే అర్హులైన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలి. – కురవ భీరప్ప, రైతు, జొహరాపురం -
ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో యోగా కీలకం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించామన్నారు. వృత్తి పరమైన, వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,700 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములై యోగాపై తమ ఆసక్తిని చాటుకున్నారన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమన్నారు. విద్యార్థులు రోజుకు 20 నుంచి 30 నిమిషాలు యోగా సాధన చేస్తే తమ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలరని చెప్పారు. ఆయుష్ యోగా థెరపిస్ట్ తదితర యోగాసనాలను వేసి ప్రాముఖ్యతను వివరించారు. పాణ్యం మండలం విద్యార్థులు సమన్వయ యోగా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. -
‘సర్ౖ’పె ఫిర్యాదు చేశారని..
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడిడోన్: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే గ్రామల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సర్ సర్వేలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. డోన్ మండలం కనపకుంట గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ కళ్యాణి ముఖ్య అనుచరులైన వెంకటేష్, భరత్ ఇంటిపై ఆదివారం ఉదయం టీడీపీ నాయకులు మధుసూదన్రెడ్డి, ఆయన కుమారుడు మాధవరెడ్డితో పాటు మరికొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్త వెంకటేష్కు రాయి తగిలి తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. డోన్ ప్రభుత్వాసుప్రతిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన భరత్ డోన్రూరల్ ఎస్ఐ మమతకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం.. ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ టీడీపీ నాయకులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆసిస్టెంట్ మాధవరెడ్డి గ్రామంలో బీఎల్ఓ వెంట తిరుగుతున్నారని, ఈ మేరకు ఫిర్యాదు చేశారనే అక్కసుతో వెంకటేష్, భరత్పై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ జాకీర్ హుసేన్, పార్టీ నాయకుడు వంశీ ఆదివారం స్థానిక రూరల్ స్టేషన్కు వెళ్లారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నిందితులను స్వేచ్ఛగా వదిలేసి గాయపడిన వారికి ఆసుప్రతిలో చికిత్స చేయించకుండా పోలీస్స్టేషన్లో ఉంచడం ఏమిటని ఎస్ఐ మమతను వారు నిలదీశారు. విచారణ కోసం పిలిపించామని, నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
‘నీట్’ రీ ఎగ్జామ్ ప్రశాంతం
● జిల్లాలో 1,401 మంది హాజరు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ నంద్యాల(న్యూటౌన్): వైద్య విద్య (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రీఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించి సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,521 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,401 మంది హాజరు కాగా 120 మంది గైర్హాజరయ్యారు. నంద్యాల పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా సందర్శించి పరిశీలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ బొమ్మలసత్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని నీట్ కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వరరావు తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం ఆన్సర్ షీట్లను నిర్దేశిత భద్రతా నిబంధనల ప్రకారం పోస్టల్ వ్యవస్థ ద్వారా సంబంధిత అధికారులకు పంపించే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. -
ఇప్పటి వరకు ఇవ్వలేదు
ఈ ఏడాది ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. మిరప, ఉల్లి సాగు చేయాలని పొలంలోనే నారు పోశా. మొక్కలు నాటుకొచ్చాయి కానీ అవసరమైన ఎరువులు లేవు. దీంతో నాటు వేయడం ఆపేశాను. రైతుకు ఇంట్లో ఎరువులు ఉంటేనే పంటలు సాగే చేసే ధైర్యం వస్తుంది. రైతుభరోసా కేంద్రాల దగ్గర సారోళ్ల అడిగితే ఎరువులు వస్తాయని చెప్పినారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా చాలా అవసరం. – రామాంజనేయులు, రైతు, పత్తికొండ చాలా ఏళ్లుగా పొలాలను కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నా. ఈ ఏడాది ఎరువులను తీసుకునేందుకు వీలుకుదరడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎరువులు లేకుండా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని రైతులందరికీ అవసరమైన ఎరువులను అందజేయాలి. – వెంకటేష్, కౌలు రైతు, సి.బెళగల్ పంటల సాగుకు సత్తువ ఎరువులు చాలా అవసరం. అలాంటి ఎరువులు ఏవీ అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే యూరియా, సత్తువ(డీఏపీ) ఎరువులు, పురుగు నివారణ మందులు అన్నీ ఆర్బీకేలో అందుబాటులో ఉండేవి. ఈ ప్రభుత్వ వచ్చాక ఆర్బీకేని ఆర్ఎస్కేగా పేరు మార్చారు తప్ప ప్రయోజనమేమీలేదు. ఇప్పుడు యూరియా తప్ప ఏవీ లేవు. ఎరువులు తెచ్చుకోవాలంటే డోన్కు 30 కిలోమీటర్లు, పత్తికొండకు 28 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. డోన్ నుంచి బస్తాకు ఆటో బాడుగ రూ.55. పత్తికొండ నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఆర్ఎస్కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు కూడా మూలనపడ్డాయి. ఏవీ పనిచేయడం లేదు. – ఈశ్వరరెడ్డి, రైతు, బొందిమడుగుల -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 22వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్ఎంపీ అదృశ్యం బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక విశ్వనగర్ వీధికి చెందిన ఆర్ఎంపీ నాగేశ్వరరావు గత వారం రోజులుగా అదృశ్యమైనట్లు పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. స్థానికుల వివరాల మేరకు గత 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే వారం రోజులుగా తన కుటుంబ సభ్యులతో సహా కనిపించడం లేదు. నాగేశ్వరరావు పట్టణంలోని కొందరి వద్ద రూ. 10 కోట్ల మేర అప్పు చేసి కనిపించకుండా వెళ్లాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. భక్తులకు బంకర్ బెడ్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లికార్జున, గణేశ సదన్ల వద్ద భక్తుల సౌకర్యార్థం బంకర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్బోర్డు నిర్ణయించినట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్నాయుడు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 45 అంశాలు చర్చించగా 34 అంశాలు ఆమోదించారు. ఏడు అంశాలు వాయిదా, 4 అంశాలు తిరస్కరించారు. క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో హైమాస్ట్ టవర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్ర పరిధిలో పలు ప్రదేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, డీసీ చంద్రశేఖర్, ఏఈవోలు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆది వారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్గా సేవలందించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్గా, చైర్మన్గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మద్దిలేటయ్య కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. యూనిఫైడ్ సర్వేపై అభ్యంతరాలను తెలపండి కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీల ద్వారా పోర్టల్లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్ చేస్తామన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఉల్లి సాగు చేసే రైతులకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద నాణ్యమైన విత్తనాల కోనుగోలుపై 50 శాతం సబ్సిడీ లేదా హెక్టారుకు గరిష్టంగా రూ.3వేలు (ఏదీ తక్కువైతే అది) అందివ్వనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జాతీయ ఉద్యాన పరిశోధన, అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఆర్డీఎఫ్) అగ్రిఫౌండ్ డార్క్రెడ్ ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్) కిలో విత్తనాలు రూ.1,600, సర్టిఫైడ్ లేదా ఫౌండేషన్ విత్తనాలు కిలో రూ.1800 ప్రకారం సరఫరా చేస్తోందన్నారు. కే.883 ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్)విత్తనాలు కిలో రూ.1800లకు పంపిణీ చేస్తోందన్నారు. ఎన్హెచ్ఆర్డీఎఫ్ విత్తనాలే కాకుండా ఇతర ఏ ప్రయివేటు విత్తనాలు కొనుగోలు చేసినా సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి దరఖాస్తుతో పాటు బిల్లులు, పట్టాదారు పాసు పుస్తకాల ప్రతులను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
గందరగోళం.. అయోమయం!
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల్లో నెలకొన్న గందరగోళంతో అందరూ అయోమయంలో పడ్డారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఆషీసర్లుగా, పీఈటీ, సీఆర్టీలుగా సుమారుగా 315 మంది పని చేస్తున్నారు. ఇందులో 250 మంది వరకు కచ్చితంగా బదిలీ కావల్సిన వారు ఉన్నారు. వారిలో 202 మంది, రిక్వెస్ట్ బదిలీకి 84 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 275 ఖాళీలు బదిలీలకి గత నెల డిస్ప్లే చేసి మౌఖికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బదిలీలు చేసి, బదిలీ అయిన వారిని కొత్త స్థానాల్లో చేరాలని కూడా సూచించారు. ఈ మేరకు చాలా మంది బదిలీ అయిన స్థానాల్లో చేరారు. అయితే జిల్లాలో సుమారుగా 46 మంది బదిలీలపై న్యాయస్థానాల్లో కేసులు వేసి వారిని యథాస్థానాల్లోనే కొనసాగేటట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరందరూ తిరిగి వారి స్థానాల్లోకి రావడంతో వారి స్థానాల్లో చేరిన వారు సైతం తిరిగి వాళ్ల స్థానాల్లో వెళ్లాలా? లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇస్తారా? అనే విషయం తెలియక చిరుద్యోగులు మానసిన ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది కేజీబీవీ కార్యదర్శికి పోన్లు చేసి తమ ఆవేదన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కర్నూలు నగరానికి సమీపంలో ఉండే ఇద్దరు, ముగ్గురు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. బదిలీల ప్రస్తావన వచ్చి ప్రతిసారి తమ ఆర్థిక బలంతో కేసులు వేయించి బదిలీలను నిలిపి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లకుపైగా చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు కుటుంబాలకు సూదురంగా పని చేయాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసిన ఓ కేసు విషయంలో హైకోర్టు మినిమం టైం స్కేల్తో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై సమస్యలను నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెలలో కేజీబీవీల్లో పని చేసే టీచర్లకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. చాలా మంది ఏళ్లుగా దూరం ఉన్న వారికి కూడా వారు అనుకున్న స్థానాలు రావడంతో చాలా సంతోష పడుతున్నారు. అయితే కొంత మంది కోర్టుకెళ్లడంతో వారిని కోర్టు ఆదేశాల మేరకు వారి స్థానాల్లోనే కొనసాగించి, అక్కడికి వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని స్థానాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. వారంలోగా కచ్చితంగా బదిలీలపై స్పష్టత రానుంది. – డా.ఎన్బీ లోకరాజు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ గత నెలలో కేజీబీవీ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ బదిలీలను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో 46 మంది కేసులు వారి స్థానాల్లోనే కొనసాగేలా తాత్కాలిక ఉత్తర్వులు అప్పటికే కొత్త స్థానాల్లో విధుల్లో చేరిన ఉద్యోగులు ఎక్కడ పని చేయాలా అర్థంకాక ఆందోళన -
ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి తారకనాథ్ కృషి
● డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ కర్నూలు(అగ్రికల్చర్): ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి దివంగత కార్మిక నాయకులు వై.తారకనాథ్ ఎంతో కృషి చేశారని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ అన్నారు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కర్నూలు మాడ్యుల్ ఆధ్వర్యంలో వై.తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా శనివారం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ఎస్బీఐ శాఖల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. కర్నూలులోని డాక్టర్ వైఎస్సార్ సర్కిల్లోని మెయిన్ బ్రాంచ్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ప్రారంభించారు. కర్నూలులో 70 మంది, ఎమ్మిగనూరులో 80 మంది, ఇతర పట్టణాల్లో 51 మంది ప్రకారం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ విద్యాసాగర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి.శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
బెల్టు షాపులపై దాడులు
కర్నూలు: అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎ కై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐలు రెహనా, మారుతీ ప్రసాద్, తేజ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన సుధాకర్ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు సిటీ: నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అయితే కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్నినో కారణంగా పచ్చిమేత కొరతతో పాటు పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 7 లక్షల యూనిట్ల పశువులు ఉన్నాయని, ఆగస్టు నెల వరకు 3 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 2.67 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 75 శాతం సబ్సిడీతో 46 టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా 946 టన్నుల సమీకృత దాణా కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమిని కప్పి ఉంచే నిరంతర పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.


