Nandyal District News
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బేతంచెర్ల: మండలపరిధిలోని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం ఈ ఘటన వెలుగుచూసింది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన వడ్ల రామ్మోహన్ గురువారం సాయంత్రం ఇంటి నుంచి పని నిమిత్తం బుగ్గానిపల్లె తండాకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం బుగ్గానిపల్లె తండా సమీపంలో ఓ వ్యక్తి మృత దేహం కనిపించడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సిమెంట్ నగర్కు చెందిన వడ్ల రామ్మోహన్దిగా గుర్తించారు. వడదెబ్బకారణంగా మృతి చెందాడా లేక మరి ఏదైనా జరిగిందా అన్న అనమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య రుద్రవరం: మండలంలోని మాచినేనిపల్లెకు చెందిన మాబ్బాషా(35) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు..మృతుడు మద్యానికి బానిస కావడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన మొత్తం కలిపి రూ.14లక్షల వరకు అప్పు అయ్యింది. ఆ అప్పు తీర్చలేక ఈ నెల 18వ తేదీన మద్యంలోనే పురుగుల మందు కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి అబ్దుల్ బీబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్రూసెల్లోసిస్ ప్రాణాంతకం కాదు ఎమ్మిగనూరు సెంట్రల్: బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రాణాంతకం కాదని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని డీఎస్వో డాక్టర్ విశేశ్వరరెడ్డి, ఎపడమాలజిస్టు వేణుగోపాల్, పీహెచ్సీ వైద్యులు హరీష్కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలో సిబ్బందికి, కుటుంబసభ్యులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. కోడుమూరు రూరల్: గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు బండగట్టు నడిపి మిన్నెల్ల, రాముడు, నాగన్నకు చెందిన నాలుగు గడ్డివాములకు అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడుతుండటంతో గ్రామస్తులు గమనించి ఆర్పేందుకు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కోడుమూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో నాలుగు గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. కాగా రెండు వారాల క్రితం ఇదే రైతుల పొలాల్లోని డ్రిప్ పైపులు, మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జై చిరంజీవా! ఆదోని అర్బన్: హనుమంతుడి నామస్మరణతో ఆదోని రణమండలకొండ మారుమోగింది. శనివారం 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కనుల పండువ గాసాగింది. ఓ వైపు పూజలు, అభిషేకాలు.. మరో వైపు హోరెత్తిన భక్తి గీతాలు, మహిళ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తజ నంభారీగా తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. -
చిన్నారులకు తియ్యని బాధ
● పుట్టుకతోనే వస్తున్న మహమ్మారి ● వంశపారంపర్యం, పలు రకాల ఇన్ఫెక్షన్లే కారణంటైప్–1 డయాబెటీస్ చిన్నారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఎండోక్రైనాలజీ విభాగానికి ఓపీకి వచ్చే వారిలో ఒకప్పుడు వీరి సంఖ్య 5 శాతం ఉండగా ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. కోవిడ్–19 తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధికి గురైన పిల్లలకు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స, మందులు ఇస్తున్నాం. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. –డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు తల్లిదండ్రుల్లో ఎవరికై నా షుగర్ ఉన్నా, గర్భస్థ సమయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా అలాంటి వారికి జన్మించే పిల్లలకు షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు పిల్లలను గమనిస్తూ ఉండాలి. షుగర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి సలహా తీసుకోవాలి. వైద్య పరీక్షల్లో షుగర్ నిర్దారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఏమీ కాదు. ఇలాంటి పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియంత్రణ తప్పనిసరి. ఈ మేరకు పిల్లలకు వారి తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తూ ఉండాలి. – డాక్టర్ కె.అమరనాథ్రెడ్డి, చిన్నపిల్లల వైద్యులు, కర్నూలు ● నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి కుమారునికి టైప్–1 డయాబెటీస్ ఉంది. ఆయన వైద్యుడు కాబట్టి కుమారుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి, జాగ్రత్తలు పాటించి, అవసరమైన మందులు వాడుతూ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దవాడై ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 లక్షల జనాభాలో దాదాపు 20 శాతం వరకు షుగర్ బాధితులు ఉన్నారు. ఇందులో పెద్దలకు వచ్చే టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం (9 లక్షలు) ఉంటే టైప్–1 బాధితులు 10 శాతం (ఒక లక్ష) వరకు ఉన్నారు. టైప్–2 షుగర్కు ప్రారంభ దశలో మందులతో నియంత్రణలో ఉంటుంది. కానీ పిల్లలకు వచ్చే టైప్–1 షుగర్ వ్యాధికి మాత్రం తప్పనిసరిగా ఇన్సులిన్ మందులు వాడాల్సిందే. ఈ మందును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. కానీ నెలకు ఒకటి, రెండు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. అవి వారం, పది రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. మిగతావి మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. చిన్నారులకు వచ్చే షుగర్ అంటే..! శరీరంలో ఉండే క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కొందరికి కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా సెల్స్) కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే నాశనం చేస్తుంది. అలాగే క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు/గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్నే టైప్–1 డయాబెటీస్ అంటారు. ఇలాంటి పిల్లలకు క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా ఆకలి, నోరు తడి ఆరిపోవడం, కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ఆహారం తింటున్నా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గడం, శ్వాస తీసుకోవడానికి కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నిద్రలో మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉంటాయి. షుగర్ వ్యాధి పెద్దలనే కాదు పిల్లలనూ వేధిస్తోంది. కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే ఈ వ్యాధి కనిపిస్తోంది. వంశపారంపర్యంతో పాటు గర్భంలో కలిగే ఇన్ఫెక్షన్లు వారిని షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుస్తున్నాయి. ఈ వ్యాధిపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటే ఆ చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. -
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
కర్నూలు (హాస్పిటల్) : గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ చెప్పారు. శనివారం ఇ.తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకేసుల గ్రామంలో నిర్వహిస్తున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి, అందుకు సహకరించిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారన్నారు. కూతురు అంటే భారం కాదని, వరమని చెప్పారు. ఆడ అయినా, మగ అయినా ఇద్దరూ ఒకటేనని మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి వివాహాలు బాలికల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మంజూష, సచివాలయ ఆరోగ్య కార్యకర్త లక్ష్మీప్రసన్న, ఆశా కార్యకర్తలు నారాయణమ్మ, జ్యోతి, ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్
ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు పదేళ్లు దాటితే గోడలకు నెర్రలు కనిపిస్తుంటాయి. అలాంటిది బేతంచెర్ల పట్టణంలో వందేళ్లైనా చెక్కు చెదరని ప్రభుత్వం భవనం ఉంది. పట్టణంలోని అంగళ్ల బజారులో స్వాతంత్య్రానికి మునుపు బ్రిటీష్ హయాంలో కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం 1999 వరకు పోలీస్ స్టేషన్గా కొనసాగింది. తర్వాత తహసీల్దార్ కార్యాలయంగా మార్చారు. 2014లో నూతనంగా నిర్మించిన భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం మార్పు చేయడంతో తర్వాత కొంత కాలం పాటు గ్రామ రెవెన్యూ కార్యాలయంగా కొనసాగింది. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడంతో 3వ సచివాలయం ఏర్పాటు చేశారు. 2023లో డ్రైవర్స్ కాలనీలో గ్రామ సచివాలయ భవనం నిర్మించడంతో తదనంతరం సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని ఇందులోకి మార్పు చేశారు. కలప, పెంకులతో నిర్మించిన ఈ భవనం వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటమే గాకుండా ఆవరణలో పెద్ద చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో స్వాగతం పలుకుతూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఠీవీగా నిలుస్తోంది. – బేతంచెర్ల -
దెబ్బతిన్న కేసీ లైనింగ్ బెడ్
పగిడ్యాల: ఆయకట్టు రైతులకు జీవానాధారమైన కర్నూలు–కడప కాలువ లైనింగ్ బెడ్ శిథిలమై దెబ్బతింది. పగిడ్యాల నేలగండి సమీపాన మట్టి కట్ట బలహీనపడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. సిమెంట్ బెడ్ పూర్తిగా దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే వర్షాకాలంలోగా కేసీ లైనింగ్ పనులు చేపట్టకపోతే కాలువ మరింత కోతకు గురై తెగిపోయే ప్రమాదం ఉంది. ఇంకా పగిడ్యాల దుంకుడు తూము (90 కి.మీ. స్లూయిస్) నుంచి 91 కి.మీ. స్లూయిస్ మధ్యలో కూడా కేసీ లైనింగ్ బీటలు వారి దెబ్బతింది. కేసీ కాలువ పరిరక్షణ నిమిత్తం పనిచేసే లష్కర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లైనింగ్ దెబ్బతిని ఏళ్లు కావొస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి దెబ్బతిన్న కేసీ లైనింగ్ బెడ్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
చక్కనమ్మకు ముక్కెరందం
ఆడపిల్ల పుట్టగానే చాలా మంది తమ పాపకు చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కు పుడక పెట్టి అందంగా అలంకరించి చూడచక్కని చిలకమ్మలా చూడాలనుకుంటారు. బుడిబుడి నడకలు వేసే సమయంలో గాజులు, కడియాలు, గజ్జలు కట్టి ఆనందిస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత చెవులు, ముక్కు కుట్టించి తమ బాధ్యతను ప్రారంభిస్తారు. చెవులు, ముక్కు కుట్టించడం ఇప్పటికీ సాంప్రదాయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో అధునిక పద్ధతులతో కుట్టిస్తున్నారు. కానీ పల్లెల్లో మాత్రం వరుసకు అమ్మమ్మ మాత్రమే బాలికలకు చెవులు, ముక్కు కుట్టిస్తారు. అందుకు ఆమెకు కానుకగా తాంబూలం, కొబ్బెరిగిన్నె, జాకెట్ పీస్ ఇస్తారు. తుమ్మ ముళ్లుతో ఎంతో చాకచక్యంగా కుట్టడం వీరి పనితనం. ఇక్కడ చిత్రంలో బాలికకు వరుసకు అమ్మమ్మ అయిన మరియమ్మ క్రిష్టిపాడు గ్రామంలో శనివారం చెవులు, మక్కు కుడుతుండగా చిన్నారులు, పెద్దలు ఇలా చూస్తూ ఉండిపోయా రు. ఈ దృశ్యం చూడముచ్చటగా కనిపించింది. – దొర్నిపాడుతుమ్మ ముళ్లుతో ముక్కు కుడుతూ.. -
వావ్.. ఆల్చిప్పలు!
దొర్నిపాడు: సముద్రాలు, పెద్ద పెద్ద నదుల్లో కనిపించే ఆల్చిప్పలు కుందూనదిలో దర్శనమిచ్చాయి. వేసవిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నది అడుగంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నది వెంట ఆల్చిప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మొలస్కా జాతికి చెందిన ఇవి రెండు గట్టి కర్పరాల (షెల్స్) మధ్య తమ శరీరాన్ని రక్షించుకుంటూ జీవిస్తాయి. నీటిలోని నాచు, సూక్ష్మక్రిములను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే ఈ ఆల్చిప్పలను సహజ వడపోత యంత్రాలుగా పిలుస్తారు. శనివారం మండలంలోని క్రిష్టిపాడు గ్రామం వద్ద ఇవి కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అలాగే పారే నీటిలో బతికే గుర్రపు డెక్క కూడా నదిలో నీరు లేకపోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోయింది. -
ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
పగిడ్యాల: నీటి మునక ప్రాంతమైన మూర్వకొండ సమీపంలో జరుగుతున్న పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనుల వద్ద ప్రమాదవశాత్తు ఓ వృక్తి మృతి చెందాడు. ముచ్చుమరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జౌకుపల్లె గ్రామానికి చెందిన చౌడప్ప(50) ఎల్ఎన్టీ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తాడిపత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వరకు పవర్ గ్రిడ్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దక్కించుకున్న ఎల్ఎన్టీ కంపెనీ కొద్ది నెలల క్రితం మూర్వకొండ నీటి మునక భూముల్లో టవర్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. ఎలక్ట్రికల్ పనులను పర్యవేక్షించే సమయంలో స్పేస్ డాంపర్ (రింగ్) సూపర్వైజర్పై పడింది. 60 మీటర్ల ఎత్తులో నుంచి పడటంతో తల పగిలిపోయింది. తోటి వర్కర్లు గమనించి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య జీవమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె సంగీత ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జెడ్పీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన లిఫ్ట్ కర్నూలు (అర్బన్) : జిల్లాపరిషత్ కార్యాలయంలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రూ.25 లక్షలతో మరో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా జిల్లాపరిషత్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ డీఈఈ కర్రెన్న తెలిపారు. -
చీకట్లో నగరం
కర్నూలు(హాస్పిటల్): నగరంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రజలు అల్లాడిపోయారు. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. రాత్రి 12 గంటల వరకు పనులు కొనసాగుతుండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించ లేకపోయారు. అర్ధరాత్రి వరకు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడారు. ఆసుపత్రుల్లో రోగులు అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు కల్లూరు మండలం పందిపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడటంతో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ దుర్మరణం చెందాడు. ఆటోలో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్నూలు నగరంలో కురుస్తున్న వర్షం -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఐ సొసైటీ డీసీఓ ఎంఈ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ – 2 బాలురకు 180 స్టేట్ ర్యాంకు నుంచి 2893 వరకు, ఎస్సీ – 3 బాలురకు 821 స్టేట్ ర్యాంకు నుంచి 10,152 వరకు, ఎస్టీ బాలురకు 506 నుంచి 6119 వరకు, బీసీ బాలురకు 23 నుంచి 304 వరకు, ఓసీ బాలురకు 86 నుంచి 1023 వరకు ఈ నెల 26వ తేదిన చిన్నటేకూరులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఎస్సీ – 2 బాలికలకు స్టేట్ ర్యాంకు 593 నుంచి 7014 వరకు, ఎస్సీ –3 బాలికలకు 1038 నుంచి 13,366 వరకు, ఎస్టీ బాలికలకు 2167 నుంచి 10,205 వరకు, బీసీ బాలికలకు 33 నుంచి 609 వరకు, ఓసీ బాలికలకు 80 నుంచి 3063 వరకు ఉన్న వారికి ఈ నెల 27న దిన్నెదేవరపాడులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందన్నారు. వివరాలకు 08518– 295601 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘మద్దిలేటయ్య’ క్షేత్రం కిటకిట బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు మొక్కుబడుల కార్యక్రమాలు ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. ఇంధన పొదుపునకు సమష్టి ప్రయాణం నంద్యాల: ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు సమష్టిగా బస్సుల్లో ప్రయాణించి ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్లో నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సందేశం ఇచ్చే ముందు అధికారులే ఆచరణలో చూపించాలని, జిల్లా, డివిజనల్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ తమ వ్యక్తిగత వాహనాలలో కాకుండా, సమష్టిగా మూడు బస్సుల్లో ప్రయాణించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమం కింద ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే ఇంధనాన్ని వినియోగిస్తూ వృథా ఖర్చులను తగ్గించుకునే దిశగా ముందుకు రావాలన్నారు. ఎంబీబీఎస్ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థుల ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2021–22 బ్యాచ్కు చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో కర్నూలు మెడికల్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఎస్.శషింద్ర 77 పర్సెంట్, సయ్యద్ ఫైజ సుల్తానా 75 పర్సెంట్తో డిస్టింక్షన్ సాధించగా, 135 మంది ఫస్ట్ క్లాస్, 78 మంది సెకండ్ క్లాస్ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు. -
బాల్య వివాహాలు జరిపిస్తే రెండేళ్ల జైలు
కర్నూలు: నూతన చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కర్నూలు కోర్టు కాంపౌండ్ ఆవరణలోని న్యాయ సేవా సదన్లో శనివారం బాల్య వివాహ నిరోధక చట్టంపై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, ఎన్జీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎవరైనా బాల్య వివాహాలు చేయాలని మీ దగ్గరకు వస్తే సంబంధిత శాఖలకు కానీ, 15100 లేదా 1098 టోల్ఫ్రీ నంబర్స్కు సమాచారం అందించాలన్నారు. ఐసీడీఎస్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయని, బాల్య వివాహాలపై వారికి సమాచారమిస్తే వెంటనే ఆ వివాహాన్ని ఆపేస్తారన్నారు. కార్యక్రమంలో కర్నూలు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన తదితరులు పాల్గొన్నారు. -
‘బ్లాక్ మనీ’ మోసగాడు అరెస్ట్
● రూ.2 లక్షలు రికవరీ, నిందితుడి రిమాండ్వెల్దుర్తి: బ్లాక్ మనీ పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వెల్దుర్తి సర్కిల్ కార్యాలయంలో సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. ఈనెల 15వ తేదీన కృష్ణగిరి మండల పరిధిలోని ఆగవేళి గ్రామానికి చెందిన వీరేశ్కు సి.బెళగల్ మండలం బాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు రూ.లక్షకు రూ. మూడు లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. ట్యాక్స్ ఇతరత్రా ఎగ్గొట్టిన వాళ్లు వైట్ మనీగా మార్చుకునేందుకు దండిగా ఇస్తారని, బ్లాక్ మనీ అంటే నిజంగానే నిజమైన నోట్లను బ్లాక్ కలర్లో ఇస్తానని నమ్మించాడు. అతని ఎదురుగానే కొన్ని బ్లాక్ కలర్లో ఉన్న పేపర్లను కెమికల్లో ముంచి తీశాడు. బ్లాక్ కలర్ పోయి అసలైన రూ.500 నోట్లు తేలడంతో వీరేశ్ నమ్మి రూ.లక్ష అప్పజెప్పాడు. నిందితుడు బ్లాక్ కలర్ పేపర్ల కట్టలను ఆరింటిని (రూ.500ల నోట్లుగా తెలుపుతూ), తన వద్ద ఉన్న కెమికల్ను వీరేశ్కు అప్పజెప్పి, ఇంటికెళ్లి అన్ని కెమికల్లో అద్ది చూసుకో అని వెళ్లిపోయాడు. తీరా వీరేశ్ చూసుకోగా కేవలం పైన, కింద కొన్ని పేపర్లు నోట్లుగా మారి, మిగితావి నల్లరంగు పేపర్లు అని తెలిసి మోసపోయానని గ్రహించి కృష్ణగిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకులపాడు రస్తాలోని రైస్మిల్ గుడి వద్ద ఉన్న నిందితుడు గొల్ల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మానేసి బ్లాక్ మనీతో బురిడీ కొటిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, సాధారణ నోట్లను నల్లగా మార్చిన కట్టలు, నల్లరంగు కాగితాల కట్టలను స్వాధీనం చేసుకున్నామన్నారు. డోన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసిన వెల్దుర్తి సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తిని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
కులగణన సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలి
● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రానంద్యాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టే కులగణన సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలని రిటైర్డ్ ఐఏఎస్, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన ఆధారంగానే భవిష్యత్లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీలు సహా వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ అయ్యాయి, వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి, అలాగే అన్ రిజర్వడ్ కేటగిరీల్లో బీసీలు ఎంతమంది ఎన్నికయ్యారు? అనే వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. కులగణనకు సంబంధించిన డేటా మైగ్రేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు వివరించగా.. సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే వారం రోజుల్లో సూపర్ చెక్ నిర్వహించి, తనిఖీ నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించాలన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బీసీ కులాల కవరేజ్ ఎలా ఉందన్న అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ కులాలకు చెందిన విద్యార్థుల నమోదు వివరాలు (ఎన్రోల్మెంట్) సేకరించాలన్నారు. పేర్లు, విద్యార్హతలు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకునే అవకాశం కల్పించి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డెడికేటెడ్ కమిషన్ కార్యదర్శి డీసీఎస్. రాజు, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కమిషన్కు అందిన వినతులు... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలో వాల్మీకులు మొదటి స్థానంలో ఉన్నారని, వారిని ఎస్టీ లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి నాయకులు కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్ శాతం పెంచి రాజకీయంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కాంట్రా క్టుల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ (భక్తజన) సేవా సంఘం నాయకులు కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు. -
జొన్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ● సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు నంద్యాల(అర్బన్): రాజకీయాలకు అతీతంగా జొన్నలు కొనుగోళ్లు జరగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ టీడీపీ అనుకూల రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద జొన్న కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు ఇచ్చారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గోడౌన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ వద్ద ఉన్న జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం ట్రక్ షీట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా అధికారులు స్పందించలేదని వాపోయారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్నలన్నింటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జొన్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి రాజకీయ ఒత్తిడితో కొందరు రైతులకు మాత్రమే అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రతి రైతు వద్ద ఉన్న జొన్న పంటను కొనుగోలు చేసి ట్రక్షీట్ ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న చంద్రబాబు ఆరుగాలం కష్టించి పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కన్నీరు పెడితే ఏ రాష్ట్రం సుఖంగా ఉండదని గుర్తు చేశారు. అనంతరం మొత్తం పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కాటసాటని రాంభూపాల్రెడ్డి, నాయకులు కలెక్టర్ కార్యాలయ ఏఓ సుభాకర్కు వినతి పత్రం అందజేశారు. వీరి వెంట వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంకండి
● ఓటర్ల జాబితా సర్వేపై బీఎల్ఏలు నిఘా పెట్టాలి ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. తన స్వగృహంలో శనివారం డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణ, మండల బీఎల్ఏలతో బుగ్గన సమావేశమయ్యారు. పార్టీ వ్యవసాయ విభాగం కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో సర్ పేరుతో చేపడుతున్న ఓటర్ల సర్వేపై కార్యకర్తలు గట్టి నిఘా ఉంచాలన్నారు. డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు తొలగింపు పేరిట అధికార పార్టీ నేతలు సర్వే అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు. అర్హులైన విపక్ష పార్టీ కార్యకర్తల ఓట్ల తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల జాబితాను నిరంతరం పరిశీలిస్తుండాలన్నారు. అర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడంతో పాటు ఫారం 6 ద్వారా తిరిగి వారిని ఓటర్ల జాబితాలో చేర్పించాలన్నారు. అక్రమాలకు పాల్పడడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిన వారనే విషయాన్ని ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తతో పాటు బీఎల్ఏలు గుర్తుంచుకోవాలని బుగ్గన హెచ్చరించారు. కష్టపడి పని చేసే వారికే గుర్తింపు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యకర్తలను, బీఎల్ఏలను పార్టీ గుర్తించి భవిష్యత్త్లో తగిన విధంగా పదవులతో గౌరవింస్తుదని బుగ్గన అన్నారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మర్చిపోయి వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఎవైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వంతో పాటు తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొరెడ్డి పుల్లారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రరెడ్డి, నాగభూషణం రెడ్డి, మండల బూత్ కమిటీ కన్వీనర్ విఘ్నేశ్వరరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, బాలయ్య, నేరడుజర్ల చంద్రశేఖర్రెడ్డి, శ్వామ్ప్రసాద్రెడ్డి, బోరెడ్డి రామచంద్రారెడ్డి, రామకృష్ణ, కొండయ్య, బోరా మల్లికార్జునరెడ్డి, రజినీకాంత్రెడ్డి, రాఘవా, మద్దయ్య, రంగస్వామి, మోహన్, రంగనాయకులు, శ్రీనివాసులు, రసీల్, కొండారెడ్డి, రాచర్ల దివాకర్రెడ్డి, కంబగిరి, తులసిరెడ్డి, శంకర్రెడ్డి, ఓబుల్రెడ్డి యాదవ్, జమాల్, వెంకటేష్ నాయక్, భాస్కర్ నాయుడు, రఘునాథ్రెడ్డి, కృష్ణారెడ్డి, చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడో రోజూ రైతులకు అన్నదానం
వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ గోడౌన్ వద్ద జొన్న విక్రయాల కోసం వచ్చిన రైతన్నలకు మూడో రోజు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. శనివారం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డిలు రైతులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గుండం నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. తిండి తిప్పలు మాని గోదాముల వద్ద బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో ఉంచుకొని జొన్న కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, జిల్లా కార్యదర్శి సద్జల చంద్రశేఖర్రెడ్డి, గోపవరం జయప్రకాష్, నారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కర్నూలులోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. క్యాన్సర్ వ్యాఽధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అతిగా బరువు తగ్గడం, జ్వరం, అలసట, శరీరంలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, మలమూత్ర విసర్జనలో మార్పులు, మానని పుండ్లు, రుతుక్రమంలో మార్పులు, రొమ్ములో గడ్డలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చలలో మార్పులు, బొంగురు గొంతు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి తెలపాలని, ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు, 30 ఏళ్లు దాటిన వారందరికీ రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చేస్తారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి ముందస్తు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, నర్సులు జయమ్మ, సాయికుమార్, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. -
పంచాయతీల్లో నిలిచిన బిల్లుల చెల్లింపు
● ఆగిన అభివృద్ధి పనులు ● ఆందోళనలో ప్రత్యేక అధికారులుజూపాడుబంగ్లా: సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికార పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి నెలరోజులపాటు చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయకపోవటంతో ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మంజూరు చేసే విషయమై ప్రత్యేక అధికారులకు డిజిటల్ కీ ఇచ్చి లాగిన్ ఇవ్వకపోవటంతో నిధులు మంజూరు చేసుకునే అవకాశం లేకపోవటంతో అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య కేవలం నంద్యాల జిల్లాలోని 489 పంచాయతీల్లో నెలకొనడంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్య, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు సీఎఫ్ఎంఎస్ ఐడీద్వారా థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్ నమోదు చేసి వారి పేరున నిధులు మంజూరు చేసేవారు. ప్రస్తుతం స్వర్ణపంచాయతీ యాప్లో థర్డ్పార్టీ వెండర్స్ డిటెయిల్స్ డిస్ప్లే కావటం లేదు. థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్ ఏవిధంగా నమోదు చేయాలనే విషయమై కంప్యూటర్ ఆపరేటర్లకు వివరించకపోవటంతో ఏవిధంగా బిల్లులు మంజూరు చేయాలో అర్థంకాక కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామపంచాయతీలో చేసిన అభివృద్ధి పనులపై తీర్మానం, థర్డ్పార్టీ వెండర్ డిటెయిల్స్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు వాటిని అప్రూవల్ చేస్తే బిల్లులు మంజూరమవుతాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధుల్లోంచి కంప్యూటర్ ఆపరేటర్లకు, వాటర్మెన్లకు, గ్రీన్అంబాసిడర్లకు, థర్డ్పార్టీ వెండర్స్కు నిధులు స్పెషల్ అధికారుల లాగిన్లో మంజూరు చేయాల్సి ఉంది. సర్ణ పంచాయతీ యాప్లో కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల వివరాలు డిస్ప్లే అవుతుండటంతో వారికి మాత్రమే వేతనాలు మంజూరు చేసే వెసలుబాటు ఉండగా గ్రీన్అంబాసిడర్ల వేతనాలు, థర్డ్పార్టీ బిల్లులు చెల్లింపుచేసుకోలేని దుస్థితి నెలకొందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మాసాల నుంచి బిల్లులు మంజూరు కాకపోవటంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన వారికి బిల్లులు మంజూరు చేయకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బిల్లుల చెల్లింపు నెమ్మదిగా జరుగుతుంది. త్వరలో సమస్యలు క్లియర్ అవుతాయి. గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు నిలిచిపోలేదు. – గోపికృష్ణ, ఎంపీడీఓ, జూపాడుబంగ్లా -
ఉరిమిన పెనుగాలులు
● నందవరంలో 68 మి.మీ వర్షపాతంకర్నూలు(అగ్రికల్చర్): పెనుగాలులు ఉమ్మడి కర్నూలు జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన గాలుల తీవ్రత శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. పలు మండలాల్లో వర్షాలు కూడా కురిశాయి. ఒకవైపు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుండటం గమనార్హం. నందవరంలో 68 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. కర్నూలు జిల్లాలో సగటున 11.8 మి.మీ, నంద్యాల రూరల్లో 10.4 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో చెట్లు విరిగిపడగా, మామిడి పంట భారీగా నేల రాలింది. విద్యుత్ శాఖకు రూ.90 లక్షల నష్టం గాలుల తీవ్రత విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.90 లక్షల నష్టం వాటిళ్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మండలం వర్షపాతం(మి.మీ) హొళగుంద 40.2 పెద్దకడుబూరు 26.4 హాలహర్వి 26.2 కొలిమిగుండ్ల 24.8 ఎమ్మిగనూరు 23.2 కోడుమూరు 22.6 దేవనకొండ 22.4 నందికొట్కూరు 20.2 కౌతాళం 18 ఆదోని 16.8 అవుకు 15.4 బనగానపల్లి 12.6 -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బందార్లపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు (53) గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడి నాపరాతి గనిలో నిల్వ ఉన్న నీటిలో బట్టలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఉతుక్కోవాలనే ఉద్దేశంతో బట్టల డ్రమ్మును తీసుకొని వెళుతుండగా కాలికి రాయి తగిలి సమీపంలో ఉన్న మోటర్పై పడటంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. పక్కనే ఉన్న కుమారుడు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు చాకలి వెంకట ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మామిడిని రసాయనాలతో మాగబెట్టొద్దు కర్నూలు(హాస్పిటల్): మామిడి కాయలను రసాయన పదార్థాలతో మాగబెట్టి వాటిని విషపూరితం చేయవద్దని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపు రైతుబజార్లో మామిడి పండ్లను విక్రయించే రైతులు, వ్యాపారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ మేరకు 9 మామిడి పండ్లను, ఒక సాధారణ బఠానీ, ఒక గ్రీన్ బఠానీ శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామిడి పండ్లను సహజ పద్ధతిలోనే మాగబెట్టాలని, త్వరగా మాగించేందుకు రసాయనాలు వాడి విషపూరితం చేయవద్దని చెప్పారు. ఇలా చేసి మాగించిన పండ్లను తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పద్ధతుల్లో పండ్లను మాగించాలన్నారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాముడు, డిస్ట్రిక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సెక్రటరీ శివమోహన్రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి కళ్యాణి ఉన్నారు. మద్యం మత్తులో కారు ఢీ..ముగ్గురికి గాయాలు ఆదోని అర్బన్: ఫుల్గా మద్యం తాగి కారు నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కడితోట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోసిగి గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు, భార్య షాబేరీ, షబ్బీర్, షహిత్తా అంజుమ్ ఆదోనిలో పని ముగించుకుని స్వ గ్రామానికి కారులో తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో ఆదోని వైపు వస్తున్న పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి మద్యం సేవించి రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న షాబేరీ, షహిత్తా అంజుమ్, షబ్బీర్కు గాయాలయ్యాయి. వెంటనే ఆ రహదారిలో వెళ్తున్న వారు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం షాబేరీ, షహిత్తాఅంజుమ్ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఈ విషయంపై పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ దృష్టికి తీసుకెళ్లగా... పెద్దకడబూరు ఫారెస్ట్ అధికారి షమీవుల్లా పూర్తిగా అలసిపోయి కారును ఢీకొట్టారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తగ్గేదే లే!
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్ర పరిధిలో తలనీలాల సేకరణకు శుక్రవారం నిర్వహించిన వేలం పాట మరోసారి వాయిదా పడింది. 2026–27 సంవత్సరానికి సంబంధించి తలనీలాల వేలం పాటలు ఇప్పటివరకు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. ఎలాగైనా తక్కువ ధరకు కొట్టేయాలన్న తెలుగు తమ్ముళ్ల దురాశకు దేవస్థాన నిర్వాహకులు తలొగ్గడం లేదు. ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా.. బెదిరింపులకు పాల్పడ్డా అధికారి ఏమాత్రం తలొగ్గలేదు. ఎన్నిసార్లయినా వాయిదా వేసుకుంటాం. అవసరమైతే సొంతంగా సేకరించుకుని విక్రయించుకుంటాం తప్ప రూ.1.50 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఇచ్చేది లేదని చెబుతూ వేలం పాట రద్దు చేశారు. ఉద్రిక్తత మధ్య వేలంపాట రద్దు అహోబిలంలో తలనీలాల వేలంపాట శుక్రవారం జరుగుతుందని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎలాగైనా దాన్ని అడ్డుకుని తాము చెప్పినట్లు రాసివ్వాలని తీవ్రస్థాయిలో అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అయినా లెక్కచెయ్యని అధికారి గుడి ఆదాయం పెంచడమే తన కర్తవ్యమని వేలం పాట నిర్వహించేందుకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ శుక్రవారం అహోబిలానికి అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాంతి భద్రతలు లోపిస్తాయని వేలంపాట వాయిదా వేసుకోవాలని సూచించారు. అయినా లెక్క చేయకుండా వేలం పాట నిర్వహించి తీరుతామని చెప్పడంతో ఒకానొక సమయంలో దేవస్థానం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎట్టకేలకు వేలం పాటను రద్దు చేయడంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై అహోబిలం సీఏఓ పార్థసారథి మాట్లాడుతూ.. నిర్ణయించిన కనీస ధర (రూ.1.50 కోట్లు)కు వేలం పాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగిందని, త్వరలో మరోసారి వేలం నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు.రూ.2 కోట్లు వస్తుందని అంచనా..గత రెండేళ్ల క్రితం వరకు (వైఎస్సార్సీపీ హయాంలో) అహోబిలం దేవస్థానంలో ఏటా తలనీలాల వేలం పాట ద్వారా రూ.2 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక గతేడాది అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అప్పటి అధికారులు వేలం పాట నిర్వహించకుండా నేతలు చెప్పిన ధరలకు, వారు సూచించిన వారి పేరిట హక్కులు రాసిచ్చారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా గతేడాది కంటే తక్కువకు హక్కులు రాసివ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికారి నేతల ఒత్తిడికి తలొగ్గలేదు. తలనీలాల హక్కులను నామినేషన్ పద్ధతిలో రహస్యంగా రాసిచ్చే ప్రసక్తే లేదని, వేలం పాట నిర్వహించి ఎవరు ఎక్కువ పాడితే వారికే ఇస్తామని తేల్చిచెప్పారు. కనీస ధర రూ.1.50 కోట్ల కంటే తగ్గించబోమని చెబుతూ, వేలంపాట అక్కడి నుంచే మొదలు పెట్టారు. నిర్ణయించిన ధర వచ్చే వరకు ఎన్నిసార్లైనా వేలం పాటను రద్దు చేస్తూనే ఉంటామని ఖరాకండిగా చెప్పారు. అహోబిలంలో తలనీలాల వేలం పాట మరోసారి రద్దు నామమాత్రపు రేటుకే కొట్టేయాలని తెలుగు తమ్ముళ్ల విశ్వప్రయత్నం రూ.1.50 కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఇచ్చేది లేదన్న నిర్వాహకులు -
అర్ధరాత్రి మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేత
● ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిబనగానపల్లె: అవుకు మెట్ట సర్కిల్లో వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ అర్ధరాత్రి కూల్చి వేశారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందనే సాకు చూపుతూ జేసీబీతో నేలమట్టం చేసి ఉదయానికంతా ఆనవాళ్లు లేకుండా చేశారు. ఇది ముమ్మాటికీ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి కక్ష సాధింపేనంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోపించారు. రోడ్డు అభివృద్ధికి వాటర్ ప్లాంట్ ఏమాత్రం అడ్డురాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్లాంట్ను కూల్చివేయించారని, ఏడాది క్రితం పాత బస్టాండ్లోని కూలింగ్ మినరల్వాటర్ ప్లాంట్ను కూడా ఇలాగే కూల్చివేయించారన్నారు. తన హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు నీళ్లు ఇవ్వడం మంత్రి బీసీకి ఇష్టంలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాటిని తొలగించడం తగదని, ప్రజలలో పేరు రావాలంటే అభివృద్ధి పనులు చేయాలి కానీ ఇలా ఉన్నవాటిని తొలగించడం కాదని హితవు పలికారు. కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకుంటారో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతారో చూద్దామని రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు 2020 జూన్ 28న అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజల తాగునీటి సమస్యను గుర్తించి అవుకుమెట్ట సర్కిల్ వద్ద కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్మించి ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ పక్కనే మార్కెట్ యార్డుకు వెళ్లే రహదారి, అతి సమీపంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, హిందూ ఆలయం, రాంభూపాల్ నగర్, గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం తదితర కాలనీల ప్రజలకు ఐదేళ్లపాటు వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ పాంట్ను ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. చివరకు రోడ్డు అభివృద్ధి పనులకు అడ్డుగా ఉందంటూ వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్అండ్బీ నేషనల్ హైవే ఇంజినిరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. -
ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలి
కర్నూలు(సెంట్రల్): ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఏఆర్టీ సేవలను మరింత బలోపేతం చేసి రోగులకు అండగా నిలవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు చికిత్సను మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టిగ్మా కారణంగా బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా కలిసి అవగాహన కల్పించాలన్నారు. మందుల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంద సస్థలు, ఏఆర్టీ సిబ్బంది గ్రామీణ స్థాయి ఆరోగ్య సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. హెచ్ఐవీ నియంత్రణలో మొదటి 95 లక్ష్యాల సాధనలో జిల్లా ఇప్పటికే మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. ఇంకా పురోగతి అవసరమని సూచించారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రగ్నెన్సీని నివారించాలి జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇంకా బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయని, వాటిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసు, ఏఎన్ఎం, ఆశా సిబ్బందితో కౌమార దశలో ఉన్న బాలికలు, వారి తల్లిదండ్రులకు టీనేజ్ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వైద్య విద్యార్థులతో పాఠశాలల్లో అవగాహన సదస్సులను నిర్వహించాలని డీఎంహెచ్ఓ వై.కామేశ్వర ప్రసాదు, కేఎంసీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మను ఆదేశించారు. కళాజాతా బృందాలు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథం, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఐసీడీఎస్ పీడీ విజయను ఆదేశించారు. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా పాల్గొన్నారు. -
పంచగవ్యంతో సర్వ పాప హరణం
కర్నూలు కల్చరల్: గోవులు సంచరించిన ప్రదేశం పవిత్రమైనదని, గోవును స్మరిస్తే మనసు ఉత్సాహంగా ఉంటుందని ప్రవచన చక్రవర్తి, వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గాయత్రీ గోశాల, గాయత్రీ గో సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారు సుంకేసుల రోడ్లోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘గోమాత వైభవం’ అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. గోసేవ ఎంతో గొప్పదని, గోమాత ముక్కోటి దేవతల స్వరూపమని చెప్పారు. గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేస్తే గోవు దానికి రుద్దుకున్నప్పుడు ఎన్ని కేశాలు రాలుతాయో అన్ని సంవత్సరాలు గరుకు స్తంభం ఏర్పాటు చేసిన వారి పితృ దేవతలకు పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని వివరించారు. గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి కలిపితే పంచగవ్యం అవుతుందని, దీన్ని స్వీకరించిన వారికి సమస్త పాపాలు తొలగిపోవడమే గాకుండా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. గోవులను పోషించాలని, గోశాలలకు సహకరించి అనుగ్రహం పొందాలన్నారు. -
దెబ్బతిన్న లైనింగ్
ఈ ఏడాది కాల్వల అభివృద్ధికి ఎస్సార్బీసీ అధికారులు రూ.31.64 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో కాల్వల్లో పూడికతీత, దెబ్బతిన్న ప్రాంతాల్లో లైనింగ్ పనులు, ముళ్లపొదల తొలగింపు, కాల్వగట్లును బాగుచేయడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో కాల్వల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాల్వల మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ప్రధాన కాల్వలు సైతం ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. పదోబ్లాక్ కాల్వ బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలో పలుచోట్ల లైనింగ్ దెబ్బతిని అధ్వానంగా ఉంది. సంబంధిత అధికారులు వచ్చే ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని కాల్వలకు మరమ్మతులు చేపట్టి పంటలకు పుష్కలంగా సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు, లొద్దిపల్లె గ్రామాల మధ్య ప్రధాన రోడ్డు పక్కన గుర్తు తెలియని మగ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడి వయస్సు 35–40 ఏళ్ల మధ్య ఉంటుందని, శరీరంపై నలుపు, బూడిద వర్ణం గీతలు కలిగిన ఫుల్ టీషర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01067 సెల్ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళ దారుణ హత్య ● ఆస్థి తగాదాలే కారణం ● కేసు నమోదుహొళగుంద: ఆస్తి తగాదాల కారణంగా గురువారం అర్ధరాత్రి మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని సుళవాయి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన గాదిలింగప్పకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న హరిజన యల్లమ్మ (45) పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా నరికిన స్థితిలో దారుణహత్యకు గురైంది. ఆమెను మొదటి భార్య కుమారుడు హరిజన శేఖన్న నరికి చంపాడని మృతురాలి కుమార్తె గుండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆలూరు ఇన్చార్జ్, ఆస్పరి సీఐ శ్రీనివాసనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు హొళగుంద పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలుండగా అందరికీ వివాహాలయ్యాయని, మోదటి భార్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నట్లు వారు తెలిపారు. గుండెపోటుతో ఉపాది కూలీ మృతి ఆలూరు: మండలంలో అరికెర గ్రామానికి కామవరం తిమ్మప్ప (52) ఉపాధి పనికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. గ్రామ చెరువులో శుక్రవారం ఉపాధి కూలీలకు పని కల్పించారు. అందరితో పాటు తిమ్మప్ప పనికి వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఇంటికి చేరుకుని ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటి ఆవరణలో ముఖం కడుక్కుంటూ కుప్పకూలి మృతి చెందాడు. కళ్లెదుటే తిమ్మప్ప మృతిచెందడంతో భార్య ఉలిగమ్మ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఏపీఓ శ్రీనివాసులు తదితరులు తిమ్మప్ప భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూలీ మృతి విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లు ఏపీఓ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలంలో వ్యక్తి ఆత్మహత్య శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం ఉచిత వైద్యశాల పక్కన అంబులెన్స్ నిలిపే స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. దేవస్థానం వైద్యశాల పక్కన ఉన్న షెడ్లో వాటర్ పైకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి (50) శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. -
మోసపోయానమ్మా.. ఇక బతకలేను!
ఆళ్లగడ్డ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. అహోబిలంలో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ నాయకుడి భార్య మోజు తీరాక మరో వివాహితతో సహజీవనం ఇద్దరు బిడ్డలతో అవస్థలు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య -
ఓట్ల తొలగింపు కుట్రను తిప్పికొడదాం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిడోన్: ఓటర్ల సర్వే పక్రియ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు ముస్టిం మైనారిటీ, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించేందుకు చేస్తున్న అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీఎల్ఏలకు సూచించారు. తన స్వగృహంలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన డోన్ మండల బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ)సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రలకు జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు సర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సర్వే సందర్భంగా అర్హులైన లక్షలాది మంది ఓటర్లను తొలగించడం చూస్తే తమ వాదనలకు మరింత బలం చేకురుతుందన్నారు. వచ్చే స్థానిక, సాధారణ ఎన్నికలకు ముందే మన రాష్ట్రంలో కూడా అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లును జాబితా నుంచి తొలగించేందుకు ఇప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయని, అప్రమత్తంగా ఉండి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సామాస్య, మధ్యతరగతి ప్రజలతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లను తొలగించే కుట్రను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతి బీఎల్ఏకు పార్టీ నాయకులతో పాటు స్థానిక నాయకుల సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జరిగే ఓట్ల తొలగింపు ఎన్ని రూపాల్లో ఉంటుందనే విషాయాన్ని మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు వివరించారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, బీఎల్ఏ నియోజకవర్గ కమిటీ కన్వీనర్ దొరపల్లి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు తురుమాంపల్లె తిరుమల్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణంరెడ్డి, మల్యాల భాస్కర్రెడ్డి, బుగ్గన జయచంద్రరెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లాలోని పుట్లంపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర క్రీడాపాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎస్ రాజు తెలిపారు. 4వ తరగతిలో బాలబాలికలకు 40 సీట్లు ఉన్నాయన్నారు. అలాగే 5వ తరగతిలో ప్రవేశానికి 23 సీట్లు, 6వ తరగతిలో 8, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 8, 9 వతరగతిలో 26 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చేనెల 2వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం క్రీడా శాఖ వెబ్సైట్ https://apsportsschool.ap. gov.in/.ను సంప్రదించాలని చెప్పారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 2567 మంది ఫీజులు చెల్లించగా 2420 మంది హాజరయ్యారు. సెకెండియర్ పరీక్షలకు 1,309 మంది ఫీజులు చెల్లించగా 1,217 మంది హాజరై పరీక్షలు రాశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి ప్యాపిలి: మండల పరిధిలోని కొమ్మేమర్రి గ్రామానికి చెందిన పూసలపాటి నారాయణ (59) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. రో జూ లాగే గురువారం ఉద యం ఇంటి నుంచి ఉపాధి పనికి బయలుదేరిన నారాయణ మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని డోన్ ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేశారు.అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. మృతుడికి భార్య రమాదేవి, ఒక కుమార్తె ఉన్నారు. మహిళా ఉద్యోగులపై వేధింపులు ● పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆరా తీసిన డీఎల్డీఓ శివారెడ్డి కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె స్వర్ణగ్రామం (గ్రామ సచివాలయం)లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులపై పంచాయితీ కార్యదర్శి సుధాకరరెడ్డి వేధింపులు అధికమయ్యాయని ఇటీవలనే ఉన్నతాధికారులతో పాటు మంత్రి బీసీ జనార్ధనరెడ్డికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం డీఎల్డీఓ శివారెడ్డి గ్రామానికి చేరుకొని మహిళా సిబ్బందిని విచారించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శి తమ పట్ల అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఈయన సంజామల మండలంలో పని చేసే సమయంలో కూడా మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెండ్కు గురయ్యాడని డీఎల్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. సదరు పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. -
ఓట్ల తొలగింపునకు కుట్ర
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: వచ్చే స్థానిక ఎన్నికలలోపు తమకు వ్యతిరేకమైన వారి ఓట్లు తొలగించేందుకు అధికారపార్టీలు కుట్ర పన్నుతున్నాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి తన స్వగృహంలో పట్టణ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఎ) సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 10 రాష్ట్రల సాధారణ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకొని సర్ పేరుతో ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓట్లను జాబితా నుండి తొలగించినట్లు అరోపణలు వచ్చాయాన్నారు. మన రాష్ట్రంలో కూడా బోగస్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని ప్రతి బీఎల్ఎ తన బూత్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు బూత్ పరిధిలో ఓటరుజాబితాపై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కొన్ని పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయన్నారు. వాటి కుట్రలను భగ్నం చేసేందుకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త బీఎల్ఎలతో కలిసి సైనికుల వలే పని చేయాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు బదిలీలకు బయపడి, ప్రలొభాలకు లొంగి అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారన్నారు. రాత్రికి రాత్రే నిజమైన ఓటర్ల పేర్లను మాయం చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మీట్ మాజీ చైర్మెన్ శ్రీరాములు, మాజీ మున్సిపల్ చైర్మెన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మెన్ జాకీర్ హుసేన్, ముస్లిం మైనారిటీ నాయుకులు అక్బర్ బాషా,షేట్లతో పాటు పట్టణ బీఎల్ఎలు పాల్గొన్నారు. -
యువకుడిపై టీడీపీ రౌడీషీటర్ల దాడి
● కేసు నమోదు చేయని పోలీసులుసాక్షి టాస్క్ఫోర్స్: అధికారం మనదైతే అన్యాయానికి, అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకు అడ్డేముందన్నట్టు డోన్ తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. రౌడీ షీటర్లను వెంటేసుకొని అమాయక యువకులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా డోన్ తారకరామనగర్కు చెందిన గొల్ల సుధాకర్ అనే యునికుడిపై జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనం. బాధిత యువకుడు తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా లెక్క చేయకుండా తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు స్పందించకపోగా ఫిర్యాదు కూడా స్వీకరించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. చివరకు సుధాకర్ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా పలుకుబడి ఉపయోగించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబం వాపోతుంది. ఇదిలా ఉండగా తమకు గొల్ల సుధాకర్ నుంచి ఫిర్వాదు అందలేదని డోన్ పోలీసులు చెప్పడం గమనార్హం. తనపై హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఎరుకలి పవన్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరికొందరు రౌడీషీటర్లు ఉన్నారని, వెంటనే వారిని అరెస్టు చేయకపోతే తనను చంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తగ్గిన ఉష్ణోగ్రతలు! కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉన్నాయి. పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పటికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అదుపులో ఉండటం ప్రజలకు ఊరటనిస్తోంది. నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. సంజాలమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దొర్నిపాడులో 42.9, పాణ్యంలో 42.6, కొత్తపల్లిలో 42.4, గోస్పాడు, ఆళ్లగడ్డ, రుద్రవరంలలో 42.2, గడివేములలో 42.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
బిల్లలాపురం వద్ద యథేచ్ఛగా మట్టి తవ్వుతున్న దృశ్యంట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యంనంద్యాల(అర్బన్): మట్టి మాఫియా చెలరేగిపోతుంది. అధికార పార్టీ అండదండలతో చెరువులు, వాగులు, వంకలను వదలడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల మండలంలో నంద్యాల చిన్న చెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో గత రెండు మూడు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్వుతున్నారు. నంద్యాల చిన్న చెరువు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ బిల్లలాపురం గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతుండగా, 856 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కానాల నాగమ్మ చెరువు చిన్న తూము వద్ద చాబోలు గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు మట్టి దందా సాగిస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు.. తవ్విన చెరువు మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లతో బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి 800 నుంచి రూ.1000 చొప్పున, అదే టిప్పర్ మట్టి అయితే రూ. 3వేల నుంచి 4వేల వరకు వెంచర్ల నిర్వాహకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే రైతుల పొలాలకు మట్టిని తోలుతున్నామంటూ బుకాయిస్తున్నారు. మట్టి కోసం లోతుగా తవ్వడం వల్ల చెరువు గర్భం లోతు పెరిగిపోయి పంట పొలాలకు సాగు నీటి సరఫరా జరిగే పరిస్థితి ఉండదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక మంత్రి తనయుల అండదండలతోనే మట్టి దందా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు నంద్యాల చిన్నచెరువు, కానాల నాగమ్మ చెరువుల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నా అందులో ఎలాంటి వాస్తవం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. మట్టి దందాపై మూడు రోజుల క్రితం సంబంధిత రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కానాల నాగమ్మ చెరువులో మట్టి తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదని, విచారించి తగు చర్యలు తీసుకుంటామని కేసీ కెనాల్ ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలు వెంచర్లు, పొలాలకు విక్రయం చోద్యం చూస్తున్న అధికారులు -
ఉపాధి పనుల్లోనూ రాజకీయమే
ఉయ్యాలవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పేదలకు సంబంధించిన ఉపాధి పనుల్లోనూ రాజకీయం చేస్తున్నారు. నచ్చిన వారికి పని కల్పించి మిగతా వారికి మొండిచేయిచూపుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మండలంలోని నర్సిపల్లె గ్రామంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఈ గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే అధికారపార్టీ నాయకులు పనులు కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది కూలీలు ఇళ్ల వద్దే ఖాళీగా ఉన్నారు. అధికారంలోకి రాగానే తమకు అనుకూలంగా ఉన్న ఉపాధి మేటి, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించుకుని, వారి ద్వారా తమను పనుల్లోకి రానివ్వడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం గ్రామానికి చెందిన కూలీలు హుసేన్సాహెబ్, షరీఫ్, సుభద్ర, శివమ్మ, చాంద్బీబీ, దస్తగిరి, జైనాబీతో పాటు మరి కొందరు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీఓ లేకపోవడంతో కార్యాలయ సీనియర్ అసిస్టెంటు శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ఉపాధి పనులు చూపడం లేదని, పాత ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించి కొత్త వారిని కేటాయించడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కొత్తగా మేటిని నియమించి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బరితెగించిన అధికారపార్టీ నాయకులు నర్సిపల్లె గ్రామంలో నచ్చినవారికే ఉపాధి పనులు నిజమైన కూలీలకు రెండేళ్లుగా మొండిచేయి -
అహోబిలేశునికే శఠగోపం!
తలనీలాలు చోరీకి గురైన మాట వాస్తవమే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీ వేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి, అహోబిలం దేవస్థానం అహోబిలం క్షేత్ర ప్రతిష్టను కాపాడాలి. గతంలో ఎప్పునడూ లేని విధంగా నిర్వాహకులు టీడీపీ నేతలకు భయపడొద్దు. రెండేళ్లుగా క్షేత్రానికి రావాల్సిన రూ. కోట్ల ఆదాయాన్ని దోచు కున్నారు. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. టీడీపీ నాయకుల అండ చూసుకుని కొందరు సిబ్బంది చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలతో పాటు తలనీలాలు సైతం దోచుకుంటున్నారు. అహోబిలేశునికే శఠగోపం పెడుతున్న సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానుక.. దేవుడికే ఎరుక! ఇలపై ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల్లో అహోబిలం ప్రముఖమైనది. క్షేత్రంలో వెలసిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారు తమకు శక్తి మేరకు హుండీలో కానుకలు వేయడం ఆనవాయితీ. విలువైన బంగారు కానుకలతో పాటు హుండీలో వేసిన నగదును సైతం గత రెండేళ్లుగా చోరీ చేశారు. రూ.లక్షలు కొట్టేస్తూ సీసీ కెమెరాల్లో దొరికి, పోలీసులు కేసు నమోదు చేసి, సొమ్ములు తిరిగి ఇచ్చిన వారిని సైతం మళ్లీ విధుల్లోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. దొంగను వదిలి.. భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు టిక్కెట్ తీసుకుంటున్న సమయంలో అసలు ధరపై అదనంగా రూ.10 నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. గత శనివారం పావన క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రూ. 3 లక్షల విలువ చేసే 10 కిలోకు పైగా తలనీలాలు దొంగలించారు. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందే దేవస్థాన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరో తెలిసి కూడా పిలిచి వివరణ కూడా తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారు. మెమో తయారు చేసినా దానిని ఇచ్చేందుకు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. దొంగతనం చేసిన వ్య క్తులు, ఇందుకు సహకరించిన వారిని వదిలిపెట్టి దొంగతనం జరిగిందని బయటపెట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తికి మోమో ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు అహోబిల క్షేత్రంలో గత రెండేళ్లుగా భక్తులు సమర్పించే ఎంతో విలువైన కానుకలు, తలనీలాలు చోరీ అవుతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడేవారికి అక్కడే విధులు వేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే అహోబిలంలో ఏం చేసినా చెల్లుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అండ ఉన్న సిబ్బందికి ఇష్టమైన చోట (ఆదాయం వచ్చే) విధులు వేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. శనివారం వస్తే వారికి వసూళ్ల పండగే! టిక్కెట్ ధరపై అ‘ధనం’ వసూలు రూ. 3 లక్షల విలువైన వెంట్రుకలు చోరీ తస్కరులకు టీడీపీ నాయకుల అండ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం -
గోడౌన్ల వద్ద రైతులకు తప్పని నిరీక్షణ
నంద్యాల(అర్బన్): జొన్నల కొనుగోళ్ల అనంతరం నంద్యాల పట్టణంలోని సీడబ్ల్యూసీ గోడౌన్లలో నిల్వచేసే క్రమంలో హమాలీల కొరత కారణంగా రైతులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి తలెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి జొన్నలను రైతులు వాహనాల తెచ్చారు. కొనుగోళ్ల అనంతరం గోడౌన్ల వద్ద కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున ఐదెకరాల పంట దిగుబడులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగులు సరుకు దళారులకు అమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే క్రమంలో గోడౌన్లో నిల్వచేసేందుకు రైతులకు రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా 54 వేల ఎకరాల్లో పండిన జొన్న పంటను ప్రభుత్వం మద్దతు దరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ నాయకులు చెరువు మట్టిని కాజేస్తున్నారు! కొలిమిగుండ్ల: హనుమంతుగుండం పెద్దచెరువు చెరువు మట్టిని టీడీపీ నాయకులు కాజేస్తున్నారని గ్రామస్తులు సత్తిగారి రామిరెడ్డి, సంజీవరాయుడు, సుంకన్న, వెంకటేశ్వరరెడ్డి బుధవారం ఆరోపించారు. అక్రమంగా తవ్వకాలు చేస్తూ పొరుగు జిల్లాకు ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారని మండిపడ్డారు. జెసీబీలు, పొక్లెయిన్లను ఏర్పాటు చేసి చెరువు మట్టి పోసేందుకు ప్రతి ట్రాక్టర్కు రూ.150, టిప్పర్కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు స్వంతంగా జెసీబీలు ఏర్పాటు చేసుకొని మట్టి తరలించాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. సాధారణ రైతులకు, స్థానికులకు అన్యాయం జరగుతోందన్నారు. రెండు నెలల నుంచి మట్టి తవ్వకాలు చేపట్టడంతో చెరువు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదముందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు
● విపక్షపార్టీపై వేధింపులు, కక్ష సాధింపులు ● టీడీపీ నేత తిలక్ తీరుతో వైఎస్సార్సీపీ కార్యకర్త సతీశ్ ఆత్మహత్య ● సూసైడ్ నోట్లో తిలక్ పేరు రాసినా కేసు నమోదు చేయని పోలీసులు ● మంత్రి భరత్ అరాచకాలపై నిరసన చేపట్టిన వైఎస్సార్సీపీ ● మంత్రి టీజీ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.45కోట్లు తీసుకున్నారని బైరెడ్డి ఆరోపణ ● బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ ఫిర్యాదు.. కర్నూలు త్రీటౌన్లో కేసు నమోదు ● టీజీ అక్రమాలు, అరాచకాలపై ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రణాళికకర్నూలులో సమ్మర్హీట్ కంటే పొలిటికల్ హీట్ రెండింతలు ఉంది. టీడీపీ నేత, మంత్రి టీజీ భరత్, బీజేపీ నేత టీజీ వెంకటేశ్, వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి అవినీతిపై సిద్దార్థ ఆరోపణలు సంధిస్తే, ప్రతిగా మంత్రి సిద్ధార్థపై కేసు నమోదు చేయించారు. దీంతో కర్నూలులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలు ఏంటి? అందులో వాస్తవం ఏంటి? టీజీ భరత్, టీజీ వెంకటేశ్ల రాజకీయ, వ్యాపార, ఆర్థిక వ్యవహారాలేంటి? అనే చర్చ కర్నూలు, నందికొట్కూరుతో పాటు ఉమ్మడి జిల్లా మొత్తం జోరుగా జరుగుతోంది. అసలు ఈ వివాదం ఏంటి? పరస్పర ఆరోపణల్లో వాస్తవాలేంటి అనే అంశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం – సాక్షి ప్రతినిధి కర్నూలు ప్రశాంత వాతావరణం ఉన్న నగరం కర్నూలు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ రౌడీయిజం, ఫ్యాక్షన్, కక్ష సాధింపులు, వేధింపులు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రశాంతంగా ఉండేది. అయితే తొలిసారి మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే అయిన తర్వాత విపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. అధికార అండతో పోలీసులను అస్త్రంగా చేసుకుని ఈ వేధింపులకు దిగుతున్నారనేది విపక్ష పార్టీ ప్రధాన ఆరోపణ. మంత్రి టీజీ భరత్ వేధింపులు, అవినీతి ఆరోపణలపై మాత్రమే సిద్ధార్థ ఆరోపణలు చేశారు. టీడీపీ నేతగా మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. కానీ టీడీపీకి బీజేపీ వత్తాసు పలికినట్లు టీజీ వెంకటేశ్ పరోక్షంగా సిద్ధార్థపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా సిద్ధార్థ కూడా ఘాటుగా బదులిచ్చారు. ఈ దారుణాలకు సమాధానం ఏంటి టీజీ?! మంత్రి అనుచరుడు, టీడీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్నోట్ రాసి దళిత కార్యకర్త సతీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఉన్నా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? చిన్న పోస్టు పెడితేనే కేసు నమోదు చేసే పోలీసులు సూసైడ్ నోట్ ఉన్నా కేసు నమోదు చేయకపోవడానికి భరత్ కారణం అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ● వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు పార్టీలో చురుగ్గా ఉన్నారనే కారణంతో అతని వాహనంలో 20 లీటర్ల నాటుసారా ఉందని త్రీటౌన్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని విపక్షపార్టీ ఆరోపించింది. ● 10వ వార్డు మాజీ కార్పొరేటర్ యూనస్ ఆఫీసును భరత్ అనుచరుడు అయూబ్ఖాన్ ధ్వంసం చేశారు. విచిత్రమేంటంటే తిరిగి యూనస్పైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంత్రి అండదండలతో అయూబ్ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగసత్యమే. ● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం నేత తిరుమలేశ్వరరెడ్డి మంత్రి భరత్ ఇంటి సమీపంలో నివాసం ఉంటారు. ఇతని ఇంటివద్ద కార్లు అడ్డంపెట్టి రౌడీయిజం చేసి తిరిగి అతనిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ● బిజినేపల్లి సందీప్ అనే వ్యక్తి కార్పొరేషన్లో ఎవ్వరూ టెండర్లలో పాల్గొనవద్దని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఈ స్క్రీన్షాట్లతో సహా సాక్షి కథనం ప్రచురిస్తే సాక్షిపై కేసు నమోదు చేశారు. ● ఏ, బీ, సీ క్యాంపులు ఖాళీ చేయాలని అక్కడి నివాసితులను వేధించడం, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ప్రభుత్వ ఆస్తిని కూల్చేసి కాజేసే కుట్ర జరుగుతోందని కథనాలు రాస్తే సాక్షిపై మరో 4 కేసులు నమోదు చేశారు. ● డోన్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాండ్రపాడులో నివాసం ఉంటున్నారు. భరత్ సోషల్ మీడియా అకౌంట్లో ‘జై జగన్’ అని కామెంట్ చేస్తే అతన్ని పట్టుకుని వచ్చి భరత్ కాళ్లు పట్టించుకుని ‘అయ్యా క్షమించండి’ అని చెప్పించుకుని వదిలేశారని నాగరాజు, సిద్ధార్థ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. ● కిమ్స్ ఆస్పత్రిలో పని చేసే జొహరాపురం వాసి కూడా ‘జై జగన్’ అని కామెంట్ పెడితే అతన్ని కొట్టి మంత్రి కాళ్లు పట్టించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఓ ఫార్మాకంపెనీ నుంచి రూ.45కోట్లు లోకేశ్కు తెలీకుండా భరత్ లంచం తీసుకున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. అలాగే ఓర్వకల్లు వద్ద మంత్రికి 1,100 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీటిపై మంత్రి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసుస్టేషన్లో పరువునష్టం దావా కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వైఎస్సార్సీపీ ఘాటుగానే స్పందిస్తోంది. ఫార్మా కంపెనీ పేరు చెబితే వారితో తిరిగి ప్రెస్మీట్ పెట్టించి ఖండించేలా చేస్తారని, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తానని సిద్ధార్థ చెబుతున్నారు. అలాగే మంత్రి బంధువు టీజీ విశ్వప్రసాద్కు 1,100 ఎకరాలు కట్టబెట్టింది నిజం కాదా? అని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. యువగళం పాదయాత్రలో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సుల్తానియా మసీదుకు చెందిన 1.5 ఎకరాల వక్ఫ్భూమిని కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారని, దానిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కడతారా? అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. ఆరోపణలకు సమాధానం చెప్పలేక కేసులతో భయపెట్టే చర్యలకు మంత్రి ఉపక్రమిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. -
కంపమల్ల కుంట పనుల్లో ఉద్రిక్తత
కోవెలకుంట్ల: కంపమల్ల కుంట పనుల్లో రెండు రోజుల నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కుంటలో మట్టి తవ్వక పనులు చేపట్టగా ప్రజలు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. గ్రామంలోని బీసీ కాలనీ సమీపంలో కుంటలో నీరు పుష్కలంగా ఉంది. గ్రామ టీడీపీ నాయకులు కుంటలో మట్టి తవ్వకాలు జరిపేందుకు ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. కుంటలో గుంతలు తవ్వడంతో అనేక సమస్యలు తలెత్తే అస్కారం ఉందని టీడీపీ నాయకులను కాలనీ వాసులు ప్రశ్నించారు. కట్ట తెగిపోయి నీరు బీసీ కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉందని నిలదీశారు. బీసీ కాలనీలో ఎక్కువశాతం కుటుంబాలు వైఎస్సార్సీపీ సానుభూతి పరులు ఉండటంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మట్టి తవ్వక పనులు చేపట్టేందుకు టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో మట్టి తవ్వక పనులు జరగనీవ్వబోమని కాలనీ వాసులు హెచ్చరించారు. దీంతో బుధవారం తహసీల్దార్ పవన్కుమార్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్నాయుడు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మండల సర్వేయర్ వీరన్న, మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు గ్రామాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాలనీ వాసులతో చర్చించి పనులను తాత్కాలికంగా నిలిపి వేయడంతో సమస్య సద్దుమణిగింది. -
టీజీ అక్రమాలు, అవినీతిపై పోరాటానికి వైఎస్సార్సీపీ నిర్ణయం
టీజీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీజీ ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా వారు చేపట్టే నిషేధిత రసాయనాల వాడకంపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అలాగే దీనిపై ఉద్యమం చేపట్టాలని భావిస్తోంది. అలాగే మంత్రి అవకతవక నిర్ణయాలపై కూడా పోరు తీవ్రతరం చేసేందుకు ఉపక్రమిస్తోంది. ఏ, బీ, సీ క్యాంపు క్వార్టర్ల విషయంలో స్టేడియం నిర్మిస్తున్నాం ఖాళీ చేయాలని ఆర్అండ్బీ అధికారులు నోటీసులు ఇవ్వడం, అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పడం చూస్తే రెండింటిలో వాస్తవం ఏంటని? క్వార్టర్లు కూల్చేయాలనేది ప్రభుత్వ నిర్ణయా? భరత్ వ్యక్తిగత నిర్ణయమా? ప్రభుత్వ నిర్ణయమైతే జీవో ఏది? భరత్ వ్యక్తిగతమైతే కూల్చేసే హక్కు ఎక్కడుందని ఆ ఆస్తులు కబ్జా చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ నేతలే ఏకమై ప్రణాళిక రచిస్తున్నారు. -
నంద్యాలలో అస్తవ్యస్తంగా వార్డుల విభజన
● ఎమ్మెల్సీ ఇసాక్బాషా నంద్యాల: కొందరి నాయకులను సంతృప్తి చేయడానికి నంద్యాల మున్సిపాల్టీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి స్వగృహంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో రామునాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 42 వార్డులను పునర్ విభజన చేస్తూ 52 వార్డులు చేశామని చెబుతున్న కమిషనర్ శేషన్న వాటి వివరాలు 20 వతేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎందుకు ప్రదర్శించలేదో ప్రజలకు తెలుపాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తునట్లు అనిపిస్తోందన్నారు. వార్డుల విభజన ఇంటి నంబర్లతో కాకుండా సర్వే నంబర్ల ప్రకారం చేస్తే సామాన్యులకు ఎలా అర్ధమవుతుందన్నారు. వార్డు విభజన అభ్యంతరాల గడువు పెంచాలని, ఇంటి నంబర్ల ప్రకారం వార్డుల విభజన చేయాలని, వార్డుల ప్రకారం మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, పార్టీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి అమతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, శాదిక్ బాషా, ఆరీఫ్ నాయక్, కలాం బాషా, సుబ్బరాయుడు, మేసా చంద్రశేఖర్, జాకీర్ హుస్సేన్, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు సాయిరాం రెడ్డి, పార్ధుడు, దండే సుధాకర్, భాస్కర్ రెడ్డి, రమేష్, కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వడగాడ్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రానున్న ఏడు రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. పీజీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఈనెల 20 నుంచి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. బహిరంగ పనుల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి ● ఈఓ ఎం.శ్రీనివాసరావు శ్రీశైలంటెంపుల్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సూచించారు. దేవస్థాన పరిపాలన భవనంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఉద్యోగి విధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వేసవి దృష్ట్యా ఇప్పటికే క్షేత్ర పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఆలయంలో, క్యూలైన్ల వద్ద మట్టి కుండలతో నీటిని భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద వితరణ భవనంలో శుభ్రత పాటిస్తూ భక్తులను అత్మీయంగా పలకరిస్తూ వడ్డన చేయాలని సూచించారు. చికెన్ వండమంటే పచ్చడి చేశాడని హత్య ● మద్యం మత్తులో దారుణం ● మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఆళ్లగడ్డ: చికెన్ వండమంటే పచ్చడి చేశాడనే కోపంతో స్నేహితుడిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన అహోబిలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం గ్రామానికి చెందిన శివ, బండిఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన శంకర్ స్నేహితులు. అహోబిలంలో ఒకే ఇంట్లో ఉండేవారు. వారం రోజుల క్రితం ఇద్దరు మద్యం తాగారు. మత్తులో ఉన్న శివ చికెన్ కూర చేయాలని శంకర్కు సూచించాడు. అయితే శంకర్ చికెన్ కూరకు బదులు చికన్ పచ్చడి చేశాడు. పచ్చడి ఎందుకు చేశావని ఆగ్రహానికి గురైన శివ పక్కనున్న పచ్చడి చేసిన రోకలిబండతో శంకర్ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన శంకర్ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు రోజులు ఎవరికీ చెప్పకుండా మద్యం తాగుతూ తిరుగుతుండే వాడు. ఇరుగు పొరుగు వారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని శివను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిజం ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. దరఖాస్తు గడువు పొడిగింపు నంద్యాల(అర్బన్): నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్లో చేరేందుకు దరఖాస్తు గడువు మే 31 వరకు పొడిగించినట్లు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www. angrau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయం పని వేళల్లో 9989625208 నంబరును సంప్రదించాలన్నారు. -
బ్రసెల్లోసిస్ వ్యాధి కలకలం
● బనవాసి కేంద్రంలో పశువులకు, ఇద్దరు కూలీలకు సంక్రమణ ● వ్యాధి సోకిన పశువులను సెమెన్ బ్యాంకుకు దూరంగా ఉంచిన డాక్టర్లు ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి సమీకృత వీర్య అబోతు కేంద్రంలోని పశువులకు ‘బ్రసెల్లోసిస్’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి పశువులతో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు కూలీలకు సంక్రమించడంతో అప్రమత్తమైన డాక్టర్లు వ్యాధి సోకిన పశువులను సెమెన్ బ్యాంక్ నుంచి దూరంగా పాతఫారం షెడ్స్లో ఉంచారు. ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు కలిసిపోవటం ద్వారా వ్యాప్తి చెందుతుంది. 15 రోజుల క్రితం సెమన్ బ్యాంకులో ఐదు జెర్సీ మేల్ బుల్స్, 3 ముర్రా బుల్స్ పశువులకు బ్రసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధి సోకినట్లు గుర్తించారు. అలాగే అందులో పనిచేసే బనవాసి, పరమాన్దొడ్డి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు శ్యాంపిల్స్లో పాజిటివ్ రావటంతో వారిని సెమెన్ బ్యాంక్లోకి రాకుండా దూరంగా ఉంచారు. సెమెన్ బ్యాంక్లో దాదాపు 250 నుంచి 300 వరకు పశువులు ఉంటాయి. ఒక్కో పశువు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుంది. పశువులకు ఈ వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే ప్రమాదం, పాల ఉత్పత్తి తగ్గుదల, పెయ్యదూడలు బలహీనంగా పుట్టడం, పునరుత్పత్తి సమస్యలు, వృషణాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయని, దీర్ఘకాలికంగా పశువు బలహీనపడుతుందని చెబుతున్నారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదకర వ్యాధి సంక్రమించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి సంక్రమణంపై సెమెన్ బ్యాంక్ ఏడీ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. వాధి సోకిన పశువులను మిగతా వాటికి దూరంగా ఉంచాం. అలాగే బాధిత కూలీలు మందులు వాడితే నెలల వ్యవధిలో తగ్గిపోతుంది. బ్యాక్టీరియా సోకిన పశువులను కేంద్రం బయటకు పంపుతాం. కూలీలకు నెగెటివ్ వచ్చే వరకు సెమెన్ బ్యాంకులోకి రావొద్దని చెప్పాం, వారి బ్లడ్ శ్యాంపిల్స్ను పరీక్షల కోసం పంపాం అని చెప్పారు. -
గోపవరంలో అస్సాం వాసి మృతి
మహానంది: మండలంలోని గోపవరం గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన బిస్వజిత్నాథ్ (42) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అస్సాం రాష్ట్రంలోని పలాన్ఘాట్ గ్రామానికి చెందిన బిస్వజిత్ గత కొంత కాలం క్రితం ఇంటి నుంచి గోవా వెళుతున్నట్లు చెప్పి వచ్చాడు. గోవా వెళ్లి వచ్చిన ఆయన ఇంటికి వెళ్లకుండా నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరించేవాడని, మానసిక స్థితి సరిగా లేక గోపవరం వద్దకు వచ్చినట్లు చెప్పారు. ఈ స్థితిలో ఎండవేడికి గురవడంతో పాటు ఆహారం సరిగా లేక మృతి చెందినట్లు సమాచారం. మృతుడు బిస్వజిత్ వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా పోలీసులు ఆయన తల్లి నందరాణినాథ్, భార్య జయంతిరాయ్లకు సమాచారం అందించారు. బిస్వజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదోని సెంట్రల్: ఒడిశా రాష్ట్రానికి చెందిన అర్జున్గండ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని రైల్వే పోలీస్స్టేన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మంగళవారం ట్రైన్ నంబర్ 16382 కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు ఒడిశా రాష్ట్రంలోని గంజాపర్ర, మరంగపల్లి నబరంగాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. బోర్వెల్ పనిచేసేవాడని, ఎక్కడా పని దొరకకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. బైక్లు ఢీ.. నలుగురికి గాయాలు కోసిగి: మండల పరిధిలోని నేలకోసిగి గ్రామ క్రాస్ రోడ్డులో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మంగళవారం కోసిగికి చెందిన గిడ్డయ్య, నాగేష్లు వందగల్లు గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు చేసుకుని గ్రామానికి బైక్పై బయలు దేరారు. అదే సమయంలో జంపాపురం గ్రామానికి చెందిన సీమోను, భీమేష్లు బైక్పై వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ను ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నారు. రెండు బైక్లపై నుంచి నలుగురు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు నంద్యాల(అర్బన్): భూగర్భ జలాల పెంపున కు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు భూగర్భ జల శాఖ డీడీహెచ్ఎం రఘురాం తెలిపారు. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనుల ప్రభావాన్ని శాసీ్త్రయంగా అంచనా వేస్తున్న ట్లు వెల్లడించారు.మంగళవారం కలెక్టరేట్ సమీ పంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్ద క్షేత్రస్థాయి సిబ్బందికి భూగర్భ జలమట్టాలను కొలిచే విధానంపై అవగాహన కల్పించారు.భూగర్భ జల మట్టాల్లో మార్పులను అధ్యయనం చేయడానికి పనులు జరిగిన ప్రాంతాల్లో ‘అబ్జర్వేషన్ వెల్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు, డ్వామా పీడీ సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
సుగంధ సిరి ‘నన్నారి’
సుగంధ పాలవేర్లతో చేసే నన్నారి (షర్బత్) అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగిన షర్బత్ ను వేసవి కాలంలో ఎక్కువగా తాగుతుంటా రు. అడవుల్లో లభించే సుగంధి పాల వేర్ల గురి ంచి ఆయుర్వేదంలో మంచి ఔషధంగా పేర్కొన్నారు. దీన్ని తాగడం ద్వారా వేడిని తగ్గించి చలువ చేయడంతో పాటు జీర్ణక్రియలకు సంబంధించి వ్యాధులు తగ్గుతాయి. మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలో నన్నారి షర్బత్ తయారు చేస్తున్న దృశ్యమిది. – మహానంది -
దేవరగట్టు హుండీ ఆదాయం రూ.4.50 లక్షలు
హొళగుంద: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కించగా రూ.4.50 లక్షలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప, వైస్ చైర్మన్ లోక్యానాయక్ తెలిపారు. మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. గత ఐదున్నర నెలల కాలంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించినట్లు చైర్మన్ చెప్పారు. వచ్చిన ఆదాయాన్ని నెలవారి ఆలయ ఖర్చులు, అమావాస్య, ఆదివారాలలో అన్నదానం, ఇతర ఖర్చులకు వెచ్చించి, మిగతా మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఎస్ఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి రామ్నాయక్, కానిస్టేబుల్ రాజగోపాల్ బందోబస్తు చేపట్టారు. -
పెళ్లి వద్దని యువతి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెల్ల గ్రామంలో ఎం.పుష్పాంజలి (19) అనే యువతి తనకు ఇప్పుడే వివాహం వద్దంటూ పేడరంగు ద్రావ కం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై ఎస్ఐ భూపాలుడు తెలి పిన వివరాల మేరకు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన మేకల వీరాంజనేయులు, సరోజమ్మ దంపతుల కూ తురు పుష్పాంజలి ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో సంబంధాలు చూస్తున్నారు. తన కు ఇంకా చదువుకోవాలని ఉందని, ఇప్పుడే పెళ్లి వద్దని పుష్పాంజలి తల్లిదండ్రులకు చెప్పింది. అయినా వారు వినలేదు.ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పే డరంగు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అవస్థలు ఫ్రీ!
చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ గత ఆగస్టు 15న సీ్త్రశక్తి పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సు సర్వీసులు పెంచలేదు. దీంతో ప్రయాణికులకు నిత్యం ఇక్కట్లే ఎదురవుతున్నాయి. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 74 బస్సులు, 12 హైర్ బస్సులు ఉన్నాయి. రోజు 25 వేల మందికి పైగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సీ్త్రశక్తి పథకం ప్రారంభించాక ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. దాదాపు అన్ని బస్సులు కెపాసిటీకి మించి ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. బస్టాండులోనే బస్సు నిండటంతో తర్వాతి స్టాప్లలో బస్సులను నిలపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, నిత్యం శాపనార్థాలు పెడుతూ అలాగే అవస్థల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నారు. ‘ఆర్టీసీ బస్సులోప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం’ ఈ నినాదం బస్సులో రాసేందుకే పరిమితమైంది. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటేనే జనం హడలిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా మండుటెండలో గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించడం, ఎప్పుడో ఒక బస్సు వస్తే ఎక్కేందుకు గుంపులుగా తోపులాటలు, సీట్ల కోసం వాగ్వాదాలు, దూషణలు, తీరా బస్సు ఎక్కాక సీటు దొరక్క అవస్థలు, కెపాసిటీకి మించి కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ఇవన్నీ ప్రతి ప్రయాణికుడికి నిత్యం ఎదురయ్యే అనుభవాలే. – ఎమ్మిగనూరు రూరల్సీ్త్రశక్తి పథకంతో బస్సుల్లో మహిళల ప్రయాణాలు గతం కన్నా రెట్టింపయ్యాయి. ఉన్న బస్సులను రూట్లలో తిప్పతున్నాం. వేసవి సెలవులు, పెళ్లిళ్లు, దైవ దర్శనాలకు మహిళలు వెళ్తుండటంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కర్నూలు, ఆదోని, ఇతర ప్రాంతాల రూట్లలో బస్సు సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. బస్సుల్లో నిలబడేందుకు కూడా స్థలం ఉండటం లేదు, కండక్టర్ టికెట్ కొట్టే పరిస్థితి లేకుండా తయారైంది. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలి. – మద్దిలేటినాయుడు, డిపో మేనేజర్, ఎమ్మిగనూరు -
● యూరియా అందిస్తూ, అవసరం లేనివి అంటగడుతూ దోపిడీ ● గతేడాది కష్టాలు తలచుకుని కొనేందుకు ఎగబడుతున్న రైతన్నలు ● అధికారి కనుసన్నల్లోనే వ్యాపారమా?
కౌతాళం: మండలంలో ఎరువుల దందా యథేచ్ఛగా నడుస్తోంది. గతేడాది యూరియా కోసం రైతులు పడిన పాట్లను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సరికొత్త దందాకు తెరలేపారు. యూరియా ఇవ్వాలంటే అనుబంధంగా కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిందేనని నిబంధన పెట్టి, రైతులకు అవసరం లేనివి అంటగడుతూ దోచుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునుపే స్టాక్ మొత్తం రైతులకు అంటగట్టి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గతేడాది భయంకర అనుభవాలను తలచుకుంటూ మళ్లీ యూరియా దొరుకుతుందో? లేదోనని రైతులు సైతం ఎగబడి కొనడం వ్యాపారులకు వరంగా మారింది. దోపిడీని నిరోధించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ధరకే యూరియా అంటూ బురిడీ యూరియా ధర బస్తా రూ.266 ఉంది. బాడుగతో కలిపి కౌతాళంకు రూ.290, హాల్వికి రూ.300 వరకు పడుతుంది. స్థానిక వ్యాపారస్తులు రూ.350 వరకు అమ్ముతారు. అయితే కొత్త దందా ప్రకారం హాల్విలో బస్తా యూరియా రూ.250, డీఏపీ రూ.1380 ప్రకారం రైతు నుంచి బయోమెట్రిక్ తీసుకొని బిల్లు ఇస్తారు. దీనికి లింక్గా 10–26–10 కాంప్లెక్స్ త్రిశక్తి పేరిట ఉన్న నకిలీ (ఆర్గనిక్) ఎరువు బస్తా రూ.1500కు తీసుకోవాలన్న షరతు పెట్టారు. 20 బస్తాల యూరియా ఇస్తే 10 కాంప్లెక్స్ బస్తాలు తీసుకోవాలని, 40 బస్తాల యూరియా ఇస్తే 15 నుంచి 20 బస్తాల కాంప్లెక్స్ తీసుకోవాలన్న నిబంధనలతో దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర రూ.600 వరకు ఉండగా రైతులకు మాత్రం రూ.1500కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మండల అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహరమంతా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాల్విలో ఓ షాపు యాజమాని ఏకంగా 6 వేల బస్తాల యూరియా అమ్మినట్లు సమాచారం. సీజన్ ప్రారంభం గాక మునుపే ఇంత పెద్దస్థాయిలో యూరియా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. గతేడాది రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. యూరియా లోడ్లను కర్ణాటకకు అమ్ముకున్నారని, దీనికి ఏఓ శేషాద్రి కారణం అంటూ ఒక లాయర్ ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జనవరిలో అగ్రానమి ఏడీఏ రాజశేఖర్ విచారణ చేపట్టారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక మునేపే అధికారుల ఇండెంట్ లేకుండా వ్యాపారులకు యూరియా ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎరువుల దందాపై ఏఓ శేషాద్రిని వివరణ కోరగా.. హాల్విలో అమ్మింది 2500 బస్తాలే, గత మార్చిలో అమ్మారు, బిల్లు ఇప్పుడు వేశారు. కాంప్లెక్స్ త్రిశక్తి నకిలీ ఎరువు కాదు అర్గానిక్ అంటూ సమాధానమిచ్చారు. ఎరువుల దందా! -
ఆటో బోల్తా: మహిళ దుర్మరణం
గోనెగండ్ల: మండలంలోని చిన్నమరివీడు గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బెళగల్ గ్రామానికి చెందిన వరలక్ష్మి (56) మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. వివరాలు.. గూడూరుకు చెందిన వరలక్ష్మి భర్త చనిపోవడంతో గత కొన్ని రోజులుగా సి.బెళగల్లో తమ్ముడు తెలుగు శ్రీనివాసులు వద్ద ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజూమున కూరగాయలు కొనుగోలు చేసేందుకు సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన మద్దిలేటి ఆటోలో ఎమ్మిగనూరుకు బయలుదేరారు. చిన్నమరివీడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. కిందపడిన వరలక్ష్మిపై ఆటో పడటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆటో డ్రైవర్ మద్దిలేటితో పాటు మరో మహిళకు స్పల్ప గాయాలయ్యాయి. మృతురాలి తమ్ముడు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. మహిళ మృతి పాణ్యం: మండల పరిధిలోని ఆలమూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. వివరాల మేరకు.. మంగళవారం బనగానపల్లె మండలం పసుపల గ్రామానికి చెందిన రాచర్ల సావిత్రి (50) కుమారుడు రామకృష్ణతో కలిసి ఆటోలో ఆలమూరుకు వస్తుండగా గ్రామం మలుపు వద్ద వేగంగా స్పీడ్ బ్రేకర్ను ఎక్కించడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కిందపడిన సావిత్రిపై ఆటో పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్కు, రామకృష్ణకు గాయాలయ్యాయి. సావిత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
బేతంచెర్ల: పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామం సమీపంలోని మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం వెంకట సుబ్బారెడ్డి (56) బేతంచెర్ల పట్టణంలో బంధువుల శుభకార్యానికి వచ్చి తిరిగి బుగ్గానిపల్లె గ్రామంలో జరిగే సుంకులమ్మ జాతరకు బైక్పై వెళ్లాడు. అక్కడ సుంకులమ్మ జాతర చూసుకొని కందికాయపల్లె మీదుగా సొంత గ్రామానికి వెళ్తుండగా బుగ్గానిపల్లె సమీపంలో మలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కనున్న రాళ్లల్లో పడిపోయాడు. తలకు, కాలికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని వగరూ రు గ్రామంలో కురువ బజారి (50) అనే ఉపాధి కూ లీ వడదెబ్బకు గురై మృతి చెందాడు. సోమవారం ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి రాగానే బజారి తీవ్ర అస్వస్తతకు గురయ్యా డు. కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించినా కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వహక కమిటీ సభ్యుడు వై.సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండల జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి ఎమ్మెల్యే తరఫున రూ.10 వేలు సాయం అందించారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని కోరారు. -
● భయాందోళనలో గ్రామస్తులు
చిరుత దాడిలో ఆవు మృతి వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పట్టణ శివారులోని అబ్బిరాజుకుంట సమీపంలోని బొందెలకుంట ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెడ్యా నాయక్కు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి సమయంలో పశువుల అరుపులు వినిపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా చిరుత ఆవుపై దాడి చేసినట్లు గుర్తించారు. గ్రామస్తుల రాకను గమనించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా రేంజర్ తహేరా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత అడుగు జాడలను గుర్తించి వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో పశువులను ఒంటరిగా వదిలేయవద్దని, రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. కాగా చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో రాత్రి పహారా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మహానంది కిటకిట
మహానంది: వేసవి సెలవులు కావడంతో మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో ఒకే రోజు 30కి పైగా అభిషేకాలు, 40కి పైగా క్షీరాభిషేకాలు జరగగా ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయాలు, వసతి గృహాలు, తదితర విభాగాల ద్వారా ఆలయానికి ఒకే రోజు లక్షల్లో ఆలయం సమకూరింది. మహానంది మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ప్రభాకర్రెడ్డి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద విభాగానికి రూ.10,116 విరాళం చెల్లించారు. -
‘బాతు’కు పోరాటం
ఎండలు భగ భగ మండుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు బయటకు అడుగు పెట్టేందుకు భయపడుతున్నారు. పశుపక్ష్యాదులకు మండుటెండలోనూ ఆహారాన్వేషణ తప్పదు. తమిళనాడు నుంచి కొందరు బాతుల పెంపకందారులు రుద్రవరానికి చేరుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో ప్రస్తుతం రబీలో సాగు చేసి వరి కోతలు పూర్తయ్యాయి. ఆ పొలాల్లో బాతులను వదలుతున్నారు. అయితే నీటి వసతి అంతంత మాత్రంగా ఉండటంతో ఎండలకు బాతులు అలమటిస్తున్నాయి. ఆర్.కొత్తూరు సమీపంలోని వంకలో అరకొరగా ఉన్న నీటిలో దిగి సేద దీరుతూ ఉపశమనం పొందాయి. – రుద్రవరం -
టీడీపీ నాయకుడిపై కిడ్నాప్ కేసు నమోదు
ఆదోని అర్బన్: రెవెన్యూ అధికారి(వీఆర్వో) అయిన సురేష్ను ఆదివారం రాత్రి టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుబేర్నాథ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. వీఆర్వో సురేష్ భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుబేర్నాథ్, మరికొందరి హమాలీలపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కుబేర్నాథ్కు వీఆర్వో లక్షల్లో అప్పు ఉందని, దీంతో ఆదివారం హమాలీలు వెళ్లి మాట్లాడి ఆయనను పిలుచుకుని పరిశ్రమలో ఉంచారని తెలిపారు. ఎంతసేపటికీ రాకపోవంతో భార్య జయలక్ష్మి భయాందోళన చెంది వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వో నంబర్ను తీసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వీఆర్వో సురేష్ను భార్యకు అప్పగించామన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుబేర్నాథ్, మరికొందరి హమాలీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. మహిళ ఆత్మహత్య బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల మేరకు గ్రామానికి చెందిన కిరణ్ భార్య లక్ష్మి (23) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. పలుచోట్ల వైద్యం చేయించుకున్నప్పుటికీ నయం కాలేదు. అలాగే కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు గుర్తించి 108లో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి కుమారులు దిలీప్, ధీరజ్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టరు..కారు ఢీ ● నలుగురికి తీవ్ర గాయాలు చాగలమర్రి: మండలంలోని పెద్దబోధనం గ్రామం సమీపంలో 40వ నెంబరు జాతీయ రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న స్వి్ఫ్ట్ డిజైర్ కారు అదే రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మున్సీర్ బేగం, సమీర్, అప్జల్, సిద్దీఖ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను టోల్ప్లాజా అంబులెన్స్లో సిబ్బంది ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అలాగే క్రేన్ సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
న్యాయం చేయమంటే బెదిరింపులా?
కర్నూలు (టౌన్): ‘కర్నూలులో సతీష్ కుటుంబానికి న్యాయం చేయమంటే బెదిరింపులకు పాల్పడతారా?’ అని టీడీపీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. పోలీసుల వేధింపులు భరించలేక తమ పార్టీకి చెందిన యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై, మూడో పట్టణ సీఐ వేధింపులపై ఈనెల 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశామన్నారు. మంత్రి టీజీ అనుచరులు పోలీసులతో ఒత్తిడి చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు చేశామన్నారు. దీనిపై టీడీపీ నేతలు ఎందుకంత ఆందోళన పడుతున్నారని ప్రశ్నించారు. కర్నూలు కిసాన్ నగర్లోని తన స్వగృహంలో పార్టీ నందికొట్కూర్ నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్తో కలిసి సోమవారం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాటల్లోనే.. ‘మంత్రి హోదాలో టీజీ భరత్ కర్నూలులో అభివృద్ధి చేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. దీన్నే మేం ప్రశ్నించాం. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, రౌడీషీటర్ల వరకు రోజూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా విమర్శిస్తే రూ.10 వేలు, గట్టిగా మాట్లాడితే స్టోర్ బియ్యం వంటి పనులు అప్పగిస్తున్నారేమో! ప్రజలకు సేవ చేయమని అడిగితే ‘సిద్ధార్థ రెడ్డి నీవు.. ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకో’ అని మంత్రి చెబుతున్నారు. నా కంటే ఆయనే నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. ఫార్మా కంపెనీ ముడుపుల మాట వాస్తవమే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తుంగభద్ర కాలుష్యంపై పోరాటం కర్నూలులోని అల్కాలీస్ ఫ్యాక్టరీతో తుంగభద్ర కాలుష్యం అవుతోంది. నా దగ్గర లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు, ఆధారాలు ఉన్నాయి. కలుషితంతో పశువులు చనిపోతున్నాయి. వక్ఫ్, చుక్కల భూములు అన్యాక్రాంతమయ్యాయి. గోశాల ఆక్రమణలు, లీజుల వ్యవహారంపై పోరాటం చేస్తాం. పెద్దలు టీజీ వెంకటేష్ నాపై ఆరోపణలు చేయడం బాధాకరం. శబరమ్మా.. వాస్తవం తెలుసుకో అమెరికాలో ఉన్నా ఆగమేఘాల మీద నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరమ్మ కర్నూలు వచ్చి నాపై ఆరోపణలు చేశా రు. ఇదంతా మంత్రి టీజీ కార్యాలయ స్క్రిప్ట్ అని తెలు సు. నందికొట్కూరులో టీడీపీ నేతలు గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని దూషించలేదా? ఎమ్మెల్యే జయసూర్య సైతం బైరెడ్డి చెబితే పనులు చేయాల్సిన అవసరం లేదని బహిరంగంగా మాట్లాడలేదా? మరి మీ నాన్నను అవమానించినప్పుడు ఎక్కడికి పోయావు శబరమ్మా! నీవు కావాలంటే ఎంబీబీఎస్ సీటు, పీజీ సీటు, నంద్యాల పార్లమెంట్ సీటు ఇప్పించారు. తండ్రిని విమర్శించినప్పుడు నోరు మెదపని మీరు.. ఇప్పుడు నాపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కిడ్నాపర్లు, గంజాయి బ్యాచ్ మీ పక్కనే ఉన్నారనే సంగతి తెలుసుకో’. అన్నారు. అభివృద్ధిని విస్మరించి అక్రమ కేసులా? మీ నాన్నను మాండ్ర, గౌరు దూషిస్తే శబరమ్మా స్పందించవా? విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి -
ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి మృతి
ఆలూరు రూరల్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన డిగ్రీ విద్యార్థి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో ఈ విషాద ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన శివమ్మ, వీరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఉపేంద్ర (18) సోమవారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతిచెందాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో నీటి కుంటలో దిగి ఉపేంద్ర మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఆలూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యమంలా ‘బడి పిలుస్తోంది’
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను భారీ స్థాయిలో చేపట్టేందుకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముందుగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి చేరికలను పెంచడం ప్రధాన లక్ష్యంగా మంగళవారం అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో, మున్సిపల్ ప్రత్యేక అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో, ఆర్డీవోలు తమ నియోజకవర్గ పరిధిలో ప్రత్యక్షంగా పర్యటించి విద్యార్థుల చేరికల పురోగతిని సమీక్షించాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దాదాపు 10 వేల మంది పిల్లలు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 6,500 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరారన్నారు. మిగిలిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను సీజ్ చేయడంతో పాటు, అక్రమ అనుమతులు మంజూరు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విధుల్లో అలసత్వం వీడండి
బొమ్మలసత్రం: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అలసత్వం వీడాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్బీ, డీసీఆర్బీ, పాస్పోర్ట్, సైబర్క్రైమ్, ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయం కోసం ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించటమే కాకుండా త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్బీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీఆర్బీ సిబ్బంది నేరస్తుల రికార్డులను ఎప్పటికప్పుడూ కొత్త సమాచారాన్ని నమోదు చేస్తుండాలన్నారు. పాస్పోర్టు విభాగంలో పనిచేసే సిబ్బంది వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత సైబర్క్రైమ్ పోలీసులపై ఉందన్నారు. సోషల్ మీడియాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక పోస్టుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు సూర్యమౌళి, మల్లికార్జునగుప్తా, ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. పీజీఆర్ఎస్కు 114 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్షెరాన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 114 వినతులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి వారి సమస్యను వివరించారన్నారు. సమస్యల్లో చట్టపరమైన వాటిని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్ పరిధిలోని అధికారులకు పంపామన్నారు. ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను సూచించామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని తిరిగి పీజీఆర్ఎస్కు అదే వినతులు రాకుండా చూడాలని ఆదేశించామన్నారు. -
ఊరు పొమ్మంటుందా?
● సున్నిపెంట వాసులకు నోటీసులు ● ప్రజల్లో అయోమయ పరిస్థితులు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట గ్రామ ప్రజలు అక్రమంగా నివాసముంటున్నారంటూ రెవెన్యూ అధికారులు ఇస్తున్న నోటీసులతో ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నివశిస్తున్నది జలవనరుల శాఖ భూములు. నోటీసులిస్తున్నది మాత్రం రెవెన్యూ శాఖ అధికారులు. ఇవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి నిమిత్తం వచ్చి 1963 సంవత్సరం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. సున్నిపెంటనే తమ స్వగ్రామంగా భావిస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు ఇక్కడ లేకపోయినా శ్రీశైలం దేవస్థానంపై ఆధారపడి చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము నివశిస్తున్న ఇంటికి పట్టాలు ఇచ్చి జీవించే, నివసించే హక్కును ప్రసాదించమని ప్రజలు వేడుకుంటున్నారు. వరం ఇచ్చిన వైఎస్సార్ ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించి 2008 జనవరి 01న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీఓ నం02 ఇచ్చి సున్నిపెంటను గ్రామపంచాయతీగా ప్రకటించారు. ప్రభుత్వ గృహాల్లో నివశిస్తున్న అన్నిశాఖల రిటైర్డ్ ఉద్యోగులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లను సొంతానికి ఇవ్వాలని నిర్ణయిస్తూ 2009 ఫిబ్రవరి 05న జీఓ నం21 విడుదల చేశారు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 10న గ్రామపంచాయతీగా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని వసతులు 2023 మేనెల 11న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నిపెంట గ్రామపంచాయతీకి 208.74 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రత్యేక చొరవ తీసు కుని సున్నిపెంటకు నాలుగు సచివాలయాలను తీసుకువచ్చి పరిపాలన ప్రారంభించారు. తాగునీటి సరఫరా కోసం రూ. కోట్లు వెచ్చించి ఆరు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మి ంచారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, వీధిలైట్లకు నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా నూతన సబ్ స్టేషన్ను నిర్మించారు. నాడు–నేడులో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనులు చేయించారు.టీడీపీ పాలనలో.. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 2014 ఆగస్టు 14న జీఓనం 37 తీసుకువచ్చి ఇకపై గ్రామపంచాయితీ చెల్లదని, పరిపాలన జలవనరుల శాఖ వారిదేనని స్పష్టం చేసింది. సున్నిపెంటలో భూమి, గృహాల ఆక్రమణలపై జిలెన్స్ అండ్ ఎన్ఫోర్సమెంట్ 2014 నవంబర్ 26న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలయ్యింది. అధికారుల ఉదాశీనతతో మరి కొన్ని ఎకరాల భూమి 12 ఏళ్లలో కబ్జాకు గురయ్యింది. ఇక్కడి ప్రజలకు ఎవరి ఇళ్లు వారికి ఇవ్వాలంటే జీఓ నం21ని అమలు చేయాలి. అలాగే 2025 ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద నివాశితులకు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఇస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి ఇంటిని వారికి రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియను చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు చెబుతున్నారు. లేదంటే ప్రతి కుటుంబానికి 2 బీహెచ్ కె ఇళ్లు, ఐదు ఎకరాల భూమి, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, అన్ని వసతులతో కూడిన కాలనీని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
నీళ్లు లేవు.. నీడ లేదు!
వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. పనుల వద్ద నీడ వసతి లేకపోవడంతో మండుటెండలకు పనులు చేయాలంటే అల్లాడిపోతున్నాం. ఉదయం 9 గంటలకే ఎండలు అధికమవుతుండటంతో ఇబ్బంది పడుతున్నాం. పనుల వద్ద నీడ ఏర్పాటు చేయడంతోపాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసి కూలీల ఆరోగ్యాన్ని కాపాడాలి. – రాములమ్మ, ఉపాధి కూలీ, కోవెలకుంట్ల మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పేరును ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వీబీజీ రామ్జీగా మార్చింది. పథకం అమలులో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి కూలీలకు ప్రతి రోజు రూ. 307 సగటు వేతనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశం నీడవసతి, మజ్జిగ, ప్రథమచికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శికోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక కూలీలు భానుడు సెగకు విలవిలలాడుతున్నారు. నెలన్నర నుంచి రోజు రోజుకు సూర్యు డు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పొట్టకూటి కోసం ఎర్రటి ఎండలో శ్రమిస్తున్న ఉపాధి కూలీలకు వేసవి సెగ తప్పడం లేదు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.60 లక్షల జాబ్కార్డులుండగా ఆయా జాబ్కార్డుల్లో 3.72 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. ఆయా మండలాల్లో ప్రతి రోజు 79,898 మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. ఇందులో ప్యాపిలి మండలంలో అత్యధికంగా 5,577 మంది, పాములపాడు మండలంలో 5,083 మంది, గోస్పాడు మండలంలో 4,125 మంది, రుద్రవరం మండలంలో 3,719 మంది, బనగానపల్లె మండలంలో 2,785 మంది, సంజామల మండలంలో 2,638 మంది, అవుకు మండలంలో 2.,162 మంది, కోవెలకుంట్ల మండలంలో 1,951 మంది, కొలిమిగుండ్ల మండలంలో 1,936 మంది పనులకు వెళుతున్నారు. ఆయా మండలాల్లో ముళ్లపొదల తొలగింపు, కుంటలు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర పంట కాల్వల్లో పూడిక తొలగింపు, ఫీల్డ్ చానల్స్, కొండ ప్రాంతాల్లో ఫెన్స్, జలధార, జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల పెంపు, ఫీడర్చానల్స్, ఫారంపాండ్స్, తదితర పనులు చేపడుతున్నారు. వేసవికాలం పనుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించపోవడంతో కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. ఉపాధి కూలీలపట్ల ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పనుల వద్ద మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చేతులెత్తేశారు. వాటర్ బెల్ వినబడదు.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వరు పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఈ నెల 1వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. కాని క్షేత్రస్థాయిలో ఎక్కడా తాగునీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలు లేవు. కూలీలు ఇంటి వద్ద నుంచి బాటిళ్ల ద్వారా తాగునీటిని తీసుకెళ్లి పని ప్రదేశంలో దాహార్తి తీర్చుకుంటున్నారు. కూలీలు ఎండతీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడకుండా ప్రతి గంటకు నీరు తాగేలా వాటర్బెల్ పద్ధతి అమలు చేయాలి. ఇది కూడా కాగితాలకు మాత్రమే పరిమితమైంది. ● పనిచేసి అలసిసొలసిపోయిన కూలీలు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు పనిప్రదేశంలో టెంట్లు, తాటాకు, ఈతాకు పందిళ్లు వేయాలి. జిల్లా లో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించక పోవడంతో కూలీలు ఎండలో ఆపసోపాలు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా కొందరు కూలీలు పని ప్రదేశాల్లోని కంప, ఇతర చెట్ల నీడన సేద తీరుతున్నారు. ● పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలి. కాని ఎక్కడా ఆ పరిస్థితులు కన్పించడం లేదు. ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని తిరిగి 11 గంటలకు ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు పనులు చేసుకునేలా వెసలుబాటు కల్పించాలి. దాదాపు రెండు నెలల నుంచి జిల్లాలో ఉదయం 9 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. అయినప్పటికి ఉపశమన చర్యలు చేపట్టడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనుల వద్ద మౌలిక వసతులు కల్పించడంతోపాటు కూలీలకు మజ్జిగా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి ఉపాధి కూలీలకు అండగా నిలిచింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటికి మంగళం పాడి కూలీల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు కరువు 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గూడారాలు లేక తప్పని అవస్థలు బడ్జెట్ లేదంటున్న అధికారులు వడదెబ్బ బారిన పడుతున్న కూలీలు -
మహిళల జీవనోపాధులకు కృషి
శిరివెళ్ల: పొదుపు సంఘాల మహిళల జీవనోపాధులకు కృషి చేస్తున్నామని వెలుగు సీ్త్ర నిధి ఏజీఎం నాగభూషణం అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సీ్త్ర నిఽధి రుణాల పంపిణీ, వసూళ్లపై ఏపీఏం రాజశేఖరరెడ్డితో చర్చించారు. ఆయన మాట్లాడుతూ మహిళల జీవనోపాధులకు ఎంత నిధులు అవసరం, ఏ నిధులను ఏఏ విభాగాల నుంచి మంజూరు చేయాలనే అంశంపై మహిళలతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, సీ్త్ర నిధి రుణాల మంజూరుకు యాక్షన్ ప్లాన్ ఉందన్నారు. 2026–26 ఆర్థిక సంఘానికి జిల్లాలో 40 వేల మంది మహిళలకు రూ. 377 కోట్ల సీ్త్ర నిధి రుణాల పంపిణీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు పాల్గొన్నారు.మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు సోమవారం శ్రీగిరికి తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్మెంట్లలో వేడిపాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణి చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర పరిధిలో పలుచోట్ల దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాలలో మంచినీటితో పాటు మజ్జిగను కూడా భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం డోన్ టౌన్: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్పాల్ ప్రసాద్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పాస్, ఫెయిల్ ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి జూన్ 30వ తేదీ వరకు itiadmissions. ap.gov.in/iti వెబ్ సైటులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన కాపీలను జూలై 2వ తేదీ లోపల సమీప ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెళ్లి పరిశీలించుకోవాలన్నారు. వారికి మెరిట్ లిస్ట్ జాబితాలో పేర్లు పొందుపరుస్తామన్నారు. మరిన్ని వివరాలకు సమీప ఐటీఐ కళాశాలలను సంప్రదించాలన్నారు. 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ జి.లాలెప్ప తెలిపారు. కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీలో సోమవారం ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు 25,819 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 57 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బంగారంపై రుణాల కోసం... పత్తికొండ: పాసు పుస్తకంపై తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు ఇచ్చే సౌలభ్యం ఉండటంతో రైతులు భారీగా బ్యాంకులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయమే పత్తికొండ పట్టణంలోని స్టేట్బ్యాంక్కు పెద్ద ఎత్తున వచ్చారు. బ్యాంక్ సిబ్బంది వారిని క్యూ పద్ధతిలో లోపలకి పంపారు. పట్టాదారు పాసుబుక్లను తీసుకుని టోకెన్ విధానం ద్వారా లోపలకి పిలిచి రుణం మంజూరు చేశారు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ
కల్లూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పెంచి పేదలపై భారం మోపడాన్ని నిరసిస్తూ కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసం నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేస్తారు. పాణ్యం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
కర్నూలు సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దుపాడు దగ్గర ఉన్న ఐయాన్ డిజిటల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయ ంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్ట్రేషన్ చేసుకుంటే, 4వ తేదీన పరీక్ష నిర్వహించి, 7వ తేదీ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. అడ్వాన్డ్స్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ 21న వెబ్సైట్లో ఉంచి 25వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 1వ తేది ఉదయం 10 గంటలకు తుదికీ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్–1, పేపర్–2 రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ ఆథారిటీ–జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జాతీయ పోటీలకు ‘ౖసైసెరా’ కర్నూలు కల్చరల్: తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు ‘ౖసైసెరా నరసింహారెడ్డి’ నాటకం ఎంపికై ంది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కై వసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయస్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబులయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్స్ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
మంత్రి ఇలాకాలో మూత‘బడి’
మూతపడిన బ్రాహ్మణపల్లె ఎంపీపీ పాఠశాలనిరుపయోగంగా ఉన్న సంస్కృతోన్నత పాఠశాల నంద్యాల(అర్బన్): పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్య ప్రశ్నార్థకంగా మారింది. బడిఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ నియోజకవర్గమైన నంద్యాల మండలంలో జెడ్పీహెచ్ఎస్ 9, 3 ఎంపీయూపీ, 39 ఎంపీపీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సంస్కృతోన్నత పాఠశాలలు ఉండగా అందులో నంద్యాల మండలం కానాల గ్రామ మజరా హైస్కూల్ కొట్టాల గ్రామంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ పాఠశాలను మూసివేశారు. సంస్కృతం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అయోమయాలకు గురయ్యారు. మామూలు విద్య అయితే ఏదో ఒక పాఠశాలలో చదివేవారు. కాని సంస్కృత పాఠశాల కావడంతో విద్యార్థులు కొంత మంది బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా బ్రాహ్మణపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో మూతవేశారు. అక్కడ విద్యాభాస్యం చేసే చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక బాల కార్మికులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. పాండురంగాపురం మజరా సుబ్బారెడ్డి పాలెం ఎంపీపీ పాఠశాల కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మూత దశకు చేరుకుంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాల మండలంలోని పాఠశాలలు మూతపడి విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నా మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకొని మూత పడిన పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుతున్నారు. విద్యార్థులు లేక మూడు ప్రభుత్వ పాఠశాలల మూత సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పేద విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులు -
చింతకుంటలో భారీ చోరీ
● 30 తులాల బంగారు, కేజీ వెండి అపహరణ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటలో భారీ చోరి జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చింతకుంట గ్రామానికి చెందిన వలి కుటుంబీకులు శనివారం రాత్రి ఇంటి తలుపులు వేసుకుని ఇంటి ముందు నిద్ర పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇంటి వెనుక తలుపులు తీసి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగలు, కేజీ వెండి ఆభరణాలతో పాటు రూ. లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఇటీవల వలి రెండో కూతురు వివాహం జరిగింది. పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతురుతో పాటు పెద్ద కూతురుకు సంబంధించిన బంగారు ఆభరణాలు అన్నీ బీరువాలోనే ఉంచారు. బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అధికారులు కావలెను!
కొలిమిగుండ్ల: మండల స్థాయిలో కీలకమైన తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమైన పోస్టుల్లో అధికారులు లేక సేవలు జాప్యమవుతున్నాయి. గ్రామాల నుంచి ఏదో ఒక పని మీద కార్యాలయానికి చేరుకున్నా అధికారులు లేక సకాలంలో పనులు కాక నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోంది. రెగ్యులర్ తహసీల్దార్ లేక డీటీ విశ్వతేజకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెండు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూముల రీసర్వే కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడున్న ఇద్దరు అటెండర్లను సైతం డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఒక్కరు మాత్రమే అటెండర్ మిగిలారు. అధికారులకు ఫైల్స్ కావాలంటే వాళ్లే స్వయంగా వెతికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కార్యాలయంలో ఇన్చార్జ్ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రైతులు పలు రకాల సమస్యల పరిష్కారం కార్యాలయానికి వస్తుంటారు. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు ముందుగానే సర్టిఫికెట్లు సిద్ధం చేసుకునేందుకు కార్యాలయానికి వెళ్తారు. ఈ సమయంలో అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతుంది. ఆ వీఆర్వో పోస్టు మాకొద్దు తహసీల్దార్ కార్యాలయంలో పలు పోస్టులు ఖాళీ కారణంగా మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో వైపు పలు గ్రామాలకు వీఆర్వోలు లేక సకాలంలో పనులు కాక సతమతమవుతున్నారు. ప్రధానంగా మండల కేంద్రానికి పక్కనే ఉన్న ఇటిక్యాలకు వీఆర్వో పోస్టు దాదాపుగా రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంటుంది. గతంలో ఇక్కడి విధులు నిర్వహించే వీఆర్వో కొంత మంది వ్యక్తులతో చేతులు కలపడంతో వాళ్లకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాల కోసం ఎన్ఓసీలను ఇష్టానుసారంగా మంజూరు చేయడంతో ముఠా సభ్యులు సెంట్ల ప్రకారం లక్ష లాది రూపాయలకు విక్రయించేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టి సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తు తం ఇక్కడికి వీఆర్వోగా వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న వీఆర్వోలు సైతం ఇటిక్యాలకు ఇన్చార్జ్గా వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయ డం లేదు. ఇటిక్యాలతో పాటు మీర్జాపురం, తిమ్మనాయినపేట గ్రామాలకు ఖాళీగా ఉండటంతో ఇతరులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి సకాలంలో సేవలు అందేలా చూడాలని మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 18వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నా రు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా తాలీం–ఏ–హునర్ పరీక్ష నంద్యాల(అర్బన్): పట్టణంలోని నేషనల్ డిగ్రీ కళాశాల, బైర్మన్ వీధిలోని మున్సిపల్ హైస్కూల్లో ఆదివారం జరిగిన తాలీం–ఏ–హునర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 671 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 611 మంది హాజరయ్యారు. కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీ డియెట్, ఐఐటీ, జేఈఈ, నీట్ శిక్షణ కోసం పేద ముస్లిం విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను డీఆర్ఓ రామునాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబిహాపర్వీన్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెస్టులో ఎంపికై న వారికి కార్పొరేట్ కళాశాలల్లో వంద శాతం ఉచిత ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యలవాడల్లో 42.5, చాగలమర్రిలో 42.4, పగిడ్యాల, జూపాడుబంగ్లా, సంజామలల్లో 42.3, మహనందిలో 42.2. కౌతాళంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మద్దికెరల్లో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నందికొట్కూరు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి లలిత వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం డీసీహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులతో మర్యాదగా మెలగాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రెండేళ్లు అయినా లోకేష్ హామీకి దిక్కేలేదు నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని యువగళం సభలో లోకేష్ ఇచ్చిన హామీకి రెండేళ్లు అయినా దిక్కు లేదని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారానికి 53వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘం నాయకుడు జయన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూటమి నేతలు నమ్మించి వంచించారన్నారు. నీటిముంపు నిరుద్యోగులను చంద్రబాబు పట్టించుకోకపోవడం మోసం చేయడేమనన్నారు. దీక్షలో నాగేంద్రుడు, రాజారావు, నారాయణ, రవి, మహమ్మద్ రఫి, తదితరులు కూర్చున్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం డోన్ టౌన్: ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి పోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం యాడికికి బయలుదేరింది. మార్గమధ్యంలో గోసానిపల్లె గ్రామ సమీపంలో స్టీరింగ్ రాడ్ విరిగి పోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లగా డ్రైవరు చాకచక్యంగా వ్యహరించి ప్రమాదాన్ని తప్పించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డోన్ డిపోలో ఎక్కువగా పాత బస్సులు ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని కార్మికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ పరిస్థితిని సమీక్షించి ప్రయాణికులను అదే రూట్లో వెళ్లే రాచర్ల బస్సులో తరలించారు. -
ఇస్తారో..లేదో?
మేం ప్రతి ఏటా వేరుశనగ సాగు చేస్తాం. ఈ సారి కూడా రెండు ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో భూములను సిద్ధం చేసుకున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే 15 నుంచే వేరుశనగతో సహా అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరస్థితులు లేవు. ఈ సారి సబ్సిడీపై విత్తనాలు ఇస్తారో..లేదో? మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే బ్లాక్లో కొనాల్సి వస్తుంది. – బీమా నాయక్, మీటేతండా, తుగ్గలి మండలం మాకు నీటి వసతి ఉంది. బోరు కింద మూడు ఎకరాల్లో వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాం. ఈ నెల 20వ తేదీలోపు నీటి వసతి కింద వేరుశనగ వేసుకుంటే బాగా కలసి వస్తుంది. సకాలంలో సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలస్యం అయితే బ్లాక్లో కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వేరుశనగతో పాటు ముందస్తుగా కంది కూడా సాగు చేస్తాం. వేరుశనగతో పాటు కందులు, ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలి. – నరసింహులు, బైన్దొడ్డి గ్రామం, కోడుమూరు మండలం ఖరీఫ్ సీజన్కు సంబంధించి సబ్సిడీపై వేరుశనగ పంపిణీకి చర్యలు చేపట్టాం. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల వారీగా వేరుశనగతో పాటు పచ్చి రొట్ట, ఇతర విత్తనాల అలాట్మెంటు కూడా ఇచ్చింది. వేరుశనగ ధర, సబ్సిడీలు కూడా ఖరారయ్యాయి. వేరుశనగను సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీసీడ్స్కు ఆదేశాలు ఇచ్చాం. మరో పది రోజుల్లో వేరుశనగను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. చిన్న సమస్యలు ఉంటే అన్ని మూడు రోజుల్లో సర్దుకుంటాయి. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
ఇదీ దుస్థితి..
● ఖరీఫ్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు 50 వేలకు పైగా హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. ● మొత్తం 30 వేల క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ● ప్రభుత్వం కర్నూలు జిల్లాకు 10,723, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ● బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన క్వింటా వేరుశనగ ధర రూ.7,500 ఉంది. ● ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే క్వింటా వేరుశనగ ధరను రూ.10,200గా నిర్ణయించింది. ● కిలో ధర రూ.102 ఉండగా అందులో రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ● బకాయిలు చెల్లిస్తేనే వేరుశనగతో సహా పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. -
వేరుశనగ ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఎల్నినో భయపెడుతోంది.. మరో వైపు ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది.. రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచే ఆర్బీకేల వారీగా విత్తన పంపిణీ జరిగేది. వర్షాలు పడిన వెంటనే రైతులు విత్తుకునే అవకాశాన్ని లభించేది. చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విత్తన పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ కంపెనీలపై ఆధారం సబ్సిడీపై వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. వేరుశనగ సరఫరాకు టెండర్లు నిర్వహించినా ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు అన్ని రకాల విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్) సరఫరా చేస్తోంది. విత్తనోత్పత్తికి ఏపీ సీడ్స్ స్వస్తి పలికి వివిధ ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. ప్రస్తుతం విత్తనాలు లేక కర్నూలులోని ఏపీ సీడ్స్ గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే రైతులు పచ్చిరొట్ట విత్తనాలతో పాటు కంది, వేరుశనగ విత్తుకుంటారు. అవి లేకపోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ.350 కోట్ల వరకు బకాయిలు రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రం కేవలం ఒక కంపెనీ మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో కూడా వేరుశనగ అరకొరగా ఉంది. ఖరీఫ్ సీజన్లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో సరఫరా చేసిన వేరుశనగ, ఇతర విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఏపీ సీడ్స్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీసీడ్స్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో వేరుశనగ ఇవ్వలేమని విత్తన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ భీష్మించుకూర్చున్నాయి. దొరకని పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంది. ఫలితంగా పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి ఎక్కువగా సాగు చేస్తారు. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడటానికి జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఫలితంగా భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి జిల్లాకు కనీసం 9,232 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ దగ్గర ఒక్క క్వింటం కూడా విత్తనాలు లేవు. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు జిల్లా: ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల నంద్యాల జిల్లా: డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు -
బౌండరీలు దాటిన క్రీడోత్సాహం!
● కర్నూలు, నంద్యాల పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ● ఇరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన ఎస్పీలు కర్నూలు: విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న పోలీసు అధికారులు ఆటవిడుపుగా కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇరు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్కు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బందిని ఉత్సాహపరుస్తూ సాగిన ఈ మ్యాచ్లో నంద్యాల జిల్లా పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచుతాయన్నారు. నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల పోలీసుల మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు. క్రీడలు శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాసులుతో పాటు సీఐ, ఆర్ఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
రూ.కోటి విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత
కర్నూలు: నిషేధిత కూల్ లిప్ అనే గుట్కా నిల్వలపై నాలుగో పట్ట ణ పోలీసులు దాడులు చేసి రూ.కోటి విలువ చేసే నిల్వలను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చి స్థానిక హనుమాన్ కాటా వెనుక ఓ గో డౌన్లో నిల్వ చేసి కర్నూలు నగరంతో పాటు చుట్టుముట్టు పల్లెలకు గుట్కా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో శనివారం గోదాముపై దాడులు నిర్వహించారు. ఒక్కొక్క సంచిలో రూ.50 విలువ చేసే 193 బ్యాగులలో గుట్కా నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటితో పాటు గోడౌన్ను సీజ్ చేశారు. ఇవి చూయింగ్ గమ్ తరహాలో ఉంటాయి. వ్యాపారి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. తన వ్యాపారం సక్రమమే అని వెంకటేశ్వర్లు తెలపడంతో అందుకు సంబంధించిన రికార్డులను తెప్పించి పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా కిరాణం అంగళ్లు, బీడీ బంకులకు సరఫరా చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. -
రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత
● కట్టడాల కూల్చివేత చేపట్టిన కాంట్రాక్టర్ ● అడ్డుకున్న ప్రజలు ● తాత్కాలికంగా నిలిపివేత కోవెలకుంట్ల: గుళ్లదూర్తిలో ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనుల్లో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల– జమ్మలమడుగు ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రామం నుంచి వివిధ కాలనీల మీదుగా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి మరో ఆర్అండ్బీ రహదారి ఉంది. ఈ రహదారి విస్తరణ పనులకు ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోడ్డుకు ఇరువైపులా ఆయా కాలనీలకు చెందిన పలువురు ఇళ్లు, గుడిసెలు, ఇతర కట్టడాలు ఏర్పాటు చేసుకుని కొన్ని ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. రోడ్డు నిర్మాణాల్లో వాటిని తొలగించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ ఇచ్చి ఇళ్లు, ఇతర కట్టడాలను కూల్చివేసేందుకు ప్రొక్లెయిన్తో పనులు చేపట్టారు. ఇట్టె బాల చెన్నయ్య ఇంటిని పూర్తిగా కూల్చివేసి ఇతర కట్టడాలను పడగొట్టే క్రమంలో ప్రజలు అక్కడికి చేరుకుని నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని అధికారుల సమక్షంలో వాటిని పరిశీలించిన తర్వాత కూల్చివేత పనులు చేపట్టాలని అడ్డుకున్నారు. ఒకానొక దశలో కాంట్రాక్టర్, ప్రజల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్ కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆయా కాలనీల ప్రజలు కోవెలకుంట్ల తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు చేరుకుని కూల్చివేత సంఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
స్వచ్ఛ జిల్లాలో భాగస్వాములుకండి
నంద్యాల (న్యూటౌన్): స్వచ్ఛ జిల్లాలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. వ్యాపారులు రాత్రివేళల్లో దుకాణాల చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల కాలువలు మూసుకుపోయి డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితులను నివారించేందుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి, ట్రాఫిక్, సివిల్ పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు మున్సిపల్ కార్యాలయం, జీజీహెచ్ ఆసుపత్రి, గాంధీచౌక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ‘వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి’ కేంద్రాల్లో ప్రజలు కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే కిలో చక్కెర లేదా కిలో సేమియా లేదా ఆరు కోడి గుడ్లను ప్రోత్సాహకంగా ఇస్తారన్నారు. దుకాణాదారులు, వ్యాపారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టిగా ముందుకు వస్తే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించగలమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపరేషన్ ● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రేడియోథెరపీ ● కోలుకున్న ముగ్గురు చిన్నారులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూడు నుంచి 9 ఏళ్ల వయస్సున్న ముగ్గురు చిన్నారులకు రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యులు సంక్లిష్టమైన, అత్యాధునిక రాపిడ్ ఆర్క్ థెరపి ద్వారా వైద్యం చేసి ప్రాణాలు పోశారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... అత్యాధునిక పరికరాల సాయంతో.. ‘దేవనకొండ మండలానికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి, ఆదోనికి చెందిన మూడేళ్ల పాపకు, కర్నూలు శివారులోని ఓ గ్రామానికి చెందిన బాలికకు బ్రెయిన్ స్టెమ్, మెడుల్లా అబ్లాంగేట, సెరిబెల్లం అనే చిన్న మెదడుకు సంబంధించిన భాగాల్లో క్యాన్సర్ ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టే స్థోమత లేక వీరు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు వీరి పరిస్థితి దృష్ట్యా సాధ్యమైనంత వరకు తలలో ఏర్పడిన కణితులను తొలగించి, మిగిలిన కణితులను తొలగించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యులు ప్రపంచ స్థాయి అత్యాధునిక పరికరాల సాయంతో చిన్నారులకు ప్రెసిషన్ రేడియోథెరపీ, రాపిడ్ ఆర్క్ థెరపీ ద్వారా చికిత్స అందించారు. వీరందరూ సాధారణంగా తమ తోటి వయస్సు పిల్లలు చేసే పనులు చేయగలుగుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో వ్యాధిని నియంత్రించడమే గాకుండా జీవనశైలిలో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చెయ్యడం ఇప్పుడు ఉన్న అత్యాధునిక పరికరాలతో, నిష్ణాతులైన వైద్యలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉండటం వల్ల సాధ్యమైంది. లక్షల రూపాయల ఖర్చు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టనవసరం లేకుండా, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడే మంచి వైద్యసేవలను పొందే అవకాశం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉంది’ అని ఆయన వివరించారు. చికిత్స అందించిన వారిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూరోసర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రాంబాలాజీ నాయక్, డాక్టర్ పుండరీకాక్షయ్య, డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, డాక్టర్ అచ్యుత్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ జి.ఆశాలత, డాక్టర్ కె.సంధ్యారాణి, డాక్టర్ ఏంజిలీనా షైని, డాక్టర్ శ్వేత, డాక్టర్ మోహన్కృష్ణ, డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శివశంకర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల తలలో క్యాన్సర్ -
గ్యాస్ కష్టాలు తీరేదెన్నడూ!
బనగానపల్లె: పట్టణంలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులు సిలిండర్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. శనివారం పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ల పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు నాలుగు రోజుల క్రితం ఆందోళన చేశారు. ఈ మేరకు గురువారం డీఎస్వో రవిబాబు, ఆర్డీవో నరేంద్రనాథ్రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి ఏజెన్సీ కార్యాలయం, గోడౌన్ తనిఖీ చేశారు. గోడౌన్లో 499 సిలిండర్లు ఉండాల్సి ఉండగా 11 ఉన్నట్లు నిర్ధారించారు. గ్యాస్ గోడౌన్ వద్దనే వినియోగదారులు సిలిండర్ల తీసుకెళ్లడం చూసి అవాక్కయ్యారు. బుకింగ్ చేసిన తరువాత 40 – 60 రోజుల వరకు కూడా సిలిండర్ల ఇవ్వడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అయితే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల పంపిణీలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కేవలం జరిమానాతో సరిపెట్టే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని గ్యాస్ వినియోగదారులకు నిబంధనల మేరకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
భూగర్భ జలాల పెంపునకు చర్యలు
శిరివెళ్ల: చెరువులు, కుంటలలో భూగర్భ జలాల పెంపునకు జలధార– జలహారతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. శనివారం యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన జలఽధార– జలహారతి, స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి నిధులతో జిల్లాలో 2,216 చెరువులు, కుంటలలో జలాల పెంపునకు పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చిందన్నారు. అందులో 2001 చెరువులు, కుంటలలో పనులు మొదలయ్యాయన్నారు. అలాగే జిల్లాలో 82 వేల మంది వ్యవసాయ కూలీలు పనులకు వస్తున్నారన్నారు. రోజుకు రూ. 288 వేతనం పడుతుందన్నారు. జూన్ వరకు పాత విధానం అమలవుతుందన్నారు. జూలై నుంచి కొత్త ఉపాధి చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాడకం వలన పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఈఓఆర్డీ శ్రీనివాసశర్మ, మాజీ సర్పంచు కమతం పుల్లారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు కమతం లక్ష్మీరెడ్డి, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు బండిఆత్మకూరు: ఎరువులు, యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఆయన మండలం కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, రశీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల సాగు లేని సమయంలో డీలర్లు యూరియా, డీఏపీ విక్రయాలు చేపట్టకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియాను అధికంగా విక్రయించిన మూడు దుకాణాల లైసెన్సులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. స్థానిక ఓంకారేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో సుమారు రూ.11 లక్షల విలువైన 65 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ ఉంచాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఓ పవన్కుమార్, వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఆళ్లగడ్డ: అహోబిలంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. బండిఆత్మకూరు మండలం కడుమకాలువ గ్రామానికి చెందిన శంకర్ (54) కొంత కాలంగా అహోబిలం గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు పగలంతా ఏదో ఓ పనిచేసుకుని రాత్రికి శివ ఇంట్లోనే ఉంటూ మద్యం సేవించే వారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరు మద్యం సేవిస్తూ ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్న క్రమంలో శివ ఆవేశంతో రోకలి బండ తీసుకుని శంకర్ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా శివ మద్యం మత్తులో తిరుగుతూ ఉండేవాడు. ఇరుగుపొరుగు వారు శివ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో వెళ్లి చూసే సరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్లో అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. మొదటి, రెండు విడతల్లో మెయిన్స్లో అర్హత పొందిన జిల్లాకు చెందిన 1,080 మంది విద్యార్థులు అడ్వాన్డ్న్ పరీక్షకు హాజరుకానున్నారు. కర్నూలు నగర శివారులోని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఐయాన్ డిజిటల్లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2, రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. -
పావన క్షేత్రంలో తలనీలాలు చోరీ
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిల లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అఽధికార టీడీపీ అండ ఉన్న కొందరు సిబ్బంది యథేచ్ఛగా అవినీతికి పాల్పడి దేవుడి సొమ్ము దోచుకుంటున్నారు. తాజాగా శనివారం పావన క్షేత్రంలో సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 10 కిలోల మేరకు తలనీలాల చోరీకి గురికావడం పలు విమర్శలకు తావిస్తోంది. నవనారసింహ క్షేత్రంలో ప్రధానమైన పావన నరసింహస్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తుల రద్దీ ఉంటుంది. మొత్తం 9 క్షేత్రాల్లో ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారో.. పావన క్షేత్రంలోనే అంత మంది తలనీలాలు సమర్పిస్తారు. అటువంటి ఈ క్షేత్రంలో శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలు కల్యాణ కట్టలో భద్రపరిచారు. మధ్యాహ్న సమయంలో కల్యాణ కట్టను శుభ్రం చేస్తున్న సమయంలో అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా అప్పటి వరకు అక్కడ ఉన్న తలనీలాల మూటలు కనిపించ లేదు. ఈ విషయం అక్కడ ఉన్న సిబ్బంది నాయీ బ్రాహ్మణులను అడిగితే ‘ఇక్కడే ఉంచాం మాకేమి తెలియదు’ అని చెప్పడంతో తలనీలాలు మాయమైన విషయం బయటకు పొక్కింది. విషయం తెలిసిన వెంటనే దిగువ అహోబిలం కార్యాలయం నుంచి అక్కడికి వెళ్లిన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినా ఎటువంటి ఫలితం లేదు. అంతవరకు వందలాది మంది భక్తు లు, పదుల సంఖ్యలో సిబ్బంది, 20 మంది నాయీబ్రాహ్మణులు ఉండగానే తలనీలాలు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న వారందరినీ అధికారులు పిలిచి విచారించగా నాయీ బ్రాహ్మణులు, సిబ్బంది తమకు తెలియదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పావన క్షేత్రంలో తలనీలాలు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే పూర్తి స్థాయిలో విచారణకు కమిటీ వేశాం. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన సిబ్బందికి మెమోలు జారీ చేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలతో పాటు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. – పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి, అహోబిలం దేవస్థానం -
హడలెత్తిస్తున్న బ్లాక్ స్పాట్లు
● ఆయా ప్రాంతాలను పరిశీలించిన జిల్లాస్థాయి భద్రత కమిటీ ● పంచలింగాల చెక్పోస్టు వద్ద జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ కర్నూలు : జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ ఆయా ప్రాంతాలను పరిశీలించింది. ప్రధానంగా శనివారం పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్రను కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు. పంచలింగాల టోల్గేట్ నుంచి వెల్దుర్తి వరకు కలెక్టర్, ఎస్పీ, పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలసి బస్సులో ప్రయాణించి బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 44వ జాతీయ రహదారిలో 9, 40వ నంబర్ జాతీయ రహదారిపై 2 బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 19 బ్లాక్ స్పాట్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు జిల్లాస్థాయి భద్రత కమిటీ నిర్ధారించింది. ప్రమాదకర మలుపులు, సరైన సూచిక బోర్డులు, తగిన కాంతి లేకపోవడం, గుంతలు, రోడ్ల ఆకృతిలో లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ శాఖలు సమన్వయంగా వ్యవహరిస్తేనే వాహనదారులకు రక్షణ ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం... గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్స్, లైటింగ్, నో పార్కింగ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్, సర్వీస్ రోడ్ల వద్ద రైలింగ్ ఏర్పాట్లు వంటి షార్ట్ టర్మ్లో చేయదగిన పనులను నెల లోపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. సంతోష్ నగర్ వద్ద పారిశుద్ధ్య లోపం... సంతోష్ నగర్ వద్ద రహదారిపై పారిశుద్ధ్యం లోపించిందని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నగరపాలక కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. కృష్ణానగర్ హంద్రీ బ్రిడ్జి, ఐటీసీ బ్రిడ్జి ప్రాంతాల్లో సోలార్ వీధి లైట్లు ఏర్పాటుకు నిర్ణయించారు. బళ్లారి చౌరస్తా సమీపంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ సూచించారు. ఉల్లంఘనలపై తనిఖీలు విస్తృతం చేసేందుకు ప్రణాళిక కర్నూలు నగరంలో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఉల్లంఘనల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు రోడ్డు భద్రత కమిటీ నిర్ణయానికి వచ్చింది. దీర్గకాలం విరామం లేకుండా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. జిల్లా ప్రవేశ ప్రాంతాల్లో వాహనదారులను ఆపి ముఖాన్ని నీటితో కడిగించి టీ, నీరు తాగించే చర్యల ద్వారా ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో అవగాహన పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఇన్చార్జి ఆర్డీఓ అనురాధ, రవాణా శాఖ ఉప కమిషనర్ శాంతకుమారి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, నేషనల్ హైవేస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, రవాణా శాఖ మోటర్ వాహన తనిఖీ అధికారులు పాల్గొన్నారు. నగర పరిధిలో 8 బ్లాక్స్పాట్లు... కర్నూలు నగర పరిధిలో 8 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికతో అక్కడున్న లోపాలను సరిచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పోలీసు శాఖ అధికారులతో కలసి సంయుక్తంగా పరిశీలన నిర్వహించి తక్షణ ప్రమాద నివారణ చర్యలతో పాటు వంతెనలు, ఫ్లై ఓవర్ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రివేళల్లోనే నగర ప్రజలను బ్లాక్ స్పాట్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా గుర్తించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగించకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం, నిద్రమత్తులో డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అభిప్రాయపడ్డారు. బ్లాక్ స్పాట్లు అంటే... తరచూ ఒకే చోట ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తారు. వీటి సంఖ్య తగ్గించడాని కి ప్రధానంగా ఎన్హెచ్, ఆర్అండ్బీ, రవాణా, పో లీసు, ట్రాఫిక్, స్థానిక సంస్థలు సంయుక్తంగా పనిచేయాలని అధికారులు నిర్ధారించారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీలో వీటిపై సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకుని అమలు చేసేలా ప్రణాళిక రూ పొందించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. -
యువకుడిపై హత్యాయత్నం
● పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం ● ప్రేమ వ్యవహారమే కారణం మధ్యాహ్నం వరకు ఎండలు.. సాయంత్రానికి వానలు కర్నూలు(అగ్రికల్చర్): ఉదయం నుంచి మధ్యా హ్నం 4 గంటల వరకు బానుడి భగభగలు కొనసాగాయి.. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలులో దాదా పు ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. గాలుల తీవ్రతకు మామిడి పంటకు అపార నష్టం వాటిళ్లింది. శనివారం చిప్పగిరిలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కౌతాళలో 42.8, మంత్రాలయంలో 42.5, బండిత్మకూరులో 42.5, పెద్దకడుబూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లాల్లో 42.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముగ్గురు ఏడీఏలకు పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ముగ్గురు ఏడీఏలకు పదోన్నతులు లభించా యి.ఈ మేరకు డీపీసీ ఖరారు అయింది. రాష్ట్రం మొత్తం మీద 64 మంది ఏడీఏలకు పదోన్నతులు లభించగా.. ఇందులో కర్నూలు జిల్లాలో ముగ్గురు ఏడీఏలు ఉన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, భూ సంరక్షణ విభాగం ఆదోని ఏడీఏగా పనిచేస్తున్న సంధ్యారాణి, పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్ లకు డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ నెల చివరిలోగా పదోన్నతి పొందిన ఏడీఏలకు పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. ● చానళ్లు రావడం లేదని నిరసన ఆదోని అర్బన్: ఏపీ ఫైబర్లో ఇంటర్నెట్ మాత్రమే వస్తుందని, చానళ్లు రావడం లేదని శనివారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి ఏపీ కేబుల్ ఆపరేటర్ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, గోపాల్, యువరాజ్, మధు, ప్రకాష్, మల్లికార్జున, బాబా వినతి పత్రం అందించారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఏపీ ఫైబర్లో ఇంటర్నెట్ మాత్రమే వస్తుందని, చానళ్లు రాకపోవడంతో ఫైబర్ కేబుల్ వినియోగదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈరోజు, రేపు అని వినియోగదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని, ఇప్పటికై నా ప్రభుత్వం ఫైబర్లో చానళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిడుగుపాటుతో మహిళ మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరి ధిలోని పి.రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహి ళ శనివారం సాయంత్రం పిడుగుపాటు కు గురై మృతిచెందారు. మాబు ఉన్నిసా(48) అనే మహి ళ తన ముగ్గురు పిల్లలతో కలసి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులు, వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడింది. ఘటనలో మాబు ఉన్నిసా అక్కడికక్కడే మృతిచె ందారు. మిగిలినవారికి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆసుప త్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి మాయలూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో ఇమ్రాన్కు ప్రేమ వ్యవహారం వుండేది. వీరిద్దరూ తరచుగా ఫోన్లలో మాట్లాడుకునే వారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రితో పాటు మరో ఐదుగురు కలిసి తుడుమలదిన్నె గ్రామంలోనే ఇమ్రాన్పై క్రికెట్ బ్యాట్తో దాడి చేయడానికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని మాయలూరు వైపు పరుగులు తీశాడు. రైల్వే ట్రాక్ సమీపంలోకి రాగానే వెంబడిస్తున్న యువతి కుటుంబసభ్యులకు పట్టుబడ్డాడు. వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను అతడిపై పోసి నిప్పంటించారు. శరీరంపై మంటలకు తాళలేక రోడ్డు పక్కన సమీపంలో ఉన్న నీటిగుంతలోకి ఇమ్రాన్ దూకాడు. కేకలు వేస్తుండడంతో అటుగా వెళ్తున్న వారు గమనించి పైకి తీసుకొచ్చి 108లో కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. విష యం తెలిసిన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ ఆసుపత్రికి చేరుకుని బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ ప్రతాప్రెడ్డిని సీఐ ఆదేశించారు. -
పిల్లలకు మంచిచెడులను వివరించండి
పాములపాడు: పిల్లలకు మంచిచెడుల గురించి తల్లిదండ్రులు వివరించాలని డీసీపీఓ స్వప్న అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలకు కిశోర వికాసం, వేసవి సెలవులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులని, పిల్లల స్వభావం గురించి తెలుసుకొని అందుకు తగ్గట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కమిటీలు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో చిన్న పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు, అబ్బాయిలు చిన్న వయస్సులో చేసిన తప్పులను పలు ఉదాహరణలతో వివరించారు. విద్య కెరీర్, మార్గదర్శకత్వం, స్మార్ట్ ఫోన్ వినియోగం, పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండటం, పిల్లలకు గ్రామ సభ, చట్టల పై అవగాహన, ప్రాముఖ్యతల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ సులోచన, ఎస్ఐ తిరుపాలు, హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున, ఐసీడీఎస్ సూపర్వైజర్ లలిత ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
మోసం కేసులో నిందితుడి అరెస్ట్
నందికొట్కూరు: అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన నిందితుడు లొద్దిపల్లి శివకుమార్ను అరెస్టు చేసినట్లు మిడుతూరు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. మండలంలో ప్రజల నుంచి దాదాపు రూ.15.50 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మిడుతూరు గ్రామ శివారులోని బ్రహ్మంగారి మఠం వద్ద ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బైక్, రూ.2.90 లక్షల నగదు సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు. వ్యక్తి ఆత్మహత్య బేతంచెర్ల: కొలుములపల్లె గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రా మానికి చెందిన పెద్ద కొక్కల్ల నాగేంద్ర బాబు(37).. భార్య సావిత్రి సొంత గ్రామమైన కొలుములపల్లెలో మూడు నెలలుగా ఉంటున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న నాగేంద్రబాబుకు ఎక్కడ చూపించినా నయం కాలేదు. మనసాప్తం చెందిన అతను శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మద్దిలేటయ్య క్షేత్రం కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించుకున్నారు. -
గడువులోగా జన గణన పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో చేపట్టిన జన గణన (ఎన్యూమరేషన్) ప్రక్రియను వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జన గణన పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన జన గణన ప్రక్రియను ఈనెల 19వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా జాప్యం లేదా లోపాలు కనిపిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హెచ్ఎల్బీ (హౌస్ లిస్టింగ్ బ్లాక్) పనుల అమలులో బేతంచెర్ల, డోన్ అర్బన్, రూరల్, బనగానపల్లె మండలాలు, అలాగే బేతంచెర్ల నగర పంచాయతీ ప్రాంతాలు పనితీరులో వెనుకబడి ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా పరోక్ష సేవలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో మల్లన్న స్పర్శదర్శనం, పలు ఆర్జిత సేవలతో పాటు, పరోక్షసేవలను సైతం మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్ ద్వారా భక్తులు పొందవచ్చునని శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఈఓ మాట్లాడుతూ దర్శనాలతో పాటు మొత్తం 18 ఆర్జిత సేవా టికెట్లు, విరాళాలు కూడా మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్పై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్త్రతంగా ఫ్లెక్సీ బోర్డులతో పాటు అవగాహన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేరం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 18 రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
రెప్పపాటులో విషాదం!
● రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ముగ్గురు మృతి ● 8 మందికి తీవ్ర గాయాలు ● ప్రమాదానికి నిద్రమత్తే కారణంకర్నూలు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన కృష్ణ (68), కోడళ్లు రమ్యశ్రీ (35), హేమలత (31) మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా అరుణాచలం శివపార్వతి స్వామివార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్తుండగా చవటపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు వెళ్తున్న జైలో కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో కృష్ణ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు నుంచి అరుణాచలానికి చేరుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన కృష్ణ కుమారుడు మనోజ్ కుమార్ విశ్రాంతి లేకుండా వాహనం నడుపుతుండటంతో చవటపల్లి సమీపంలో నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో జైలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, విజయలక్ష్మి, హేమంత్, చిన్నారులు లోహిత్ చార్మి, కళ్యాణ్, సుహస్రలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని 108 అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అదనపు తూకం.. ఆగని మోసం
వరి ధాన్యం బస్తా 75 కిలోలు, మొక్కజొన్న, మినుము, జొన్న అయితే 100 కిలోలు లెక్కన తూకం వేస్తారు. అయితే తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరగు కింద 2 కిలోలు, తేమ శాతం కింద మరో 2 కిలోలు లెక్కన దోచుకోవడం ఒక ఎత్తైతే ఎలక్ట్రానిక్ కాటాలో టెక్నిక్గా 4 నుంచి 5 కిలోలు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బస్తాకు 6 నుంచి 10 కిలలో వరకు అదనంగా లాగుతున్న విషయం బహిరంగగానే సాగుతోంది. రవాణా చార్జీలు, హమాలీ కూలీల ఖర్చు నిమిత్తం బస్తాకి మరో రూ. 60 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు. వీటన్నింటి మూలంగా రైతన్నకు ఈ ఏడాది రమారమి బస్తాకు రూ.350 నుంచి రూ.550 వరకు కోల్పోవాల్సి వస్తోంది. పొలాల్లోనే ధాన్యం నిల్వ చేసుకున్న దృశ్యం పంట మద్దతు ధర దళారుల ధర క్వింటాకు నష్టం వరి 2,461 1,900 560 మొక్కజొన్న 2,400 1,600 800 కందులు 8,450 7,900 550 మినుములు 8,200 6,900 1,300 కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు అన్నదాతలకు లభించని కనీస మద్దతు ధర పాలకవర్గం లేని ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డు పట్టించుకోని పాలకులు, అధికారులు దళారుల బారిన పడుతున్న రైతులు -
యూరియా క్రయవిక్రయాలపై నిఘా
కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే యూరియా క్రయవిక్రయాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈనెల 14న ‘సాక్షి’లో ‘లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసా య శాఖ కమిషనరేట్ స్పందించింది. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి యూరియాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెప్పించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతానికి యూరియాకు ఎలాంటి సమస్య లేదని, డిమాండ్కు తగ్గ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. -
రెండేళ్లుగా చైర్మన్ లేని మార్కెట్ యార్డు..
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల నుంచి ఆళ్లగడ్డ మార్కెట్యార్డుకు పాలక మండలి కమిటీ నియమించ లేదు. గత సంవత్సరం జనసేన పార్టీకి చెందిన మైలేరు సురేఖను మార్కెట్యార్డు చైర్పర్సన్గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు తెలియకుండా చైర్మన్ను ఎలా నియమిస్తారు ? జీఓ తెచ్చుకోవడం కాదు? ఎలా బాధ్యతలు స్వీకరిస్తారో చూస్తా .. అని బెదిరించడంతో సురేఖ కనీసం మార్కెట్యార్డు వైపు కన్నెత్తిచూసే సాహసం కూడా చేయలేదు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి పోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం గడువు ముగిసేలోగైనా పాలక మండలి కొలువుదీరేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాలకమండలి ఏర్పడితే రైతుల కష్టాలు కాస్త అయినా తీరుతాయని ఆశిస్తున్నారు. ఆళ్లగడ్డ: వ్యవసాయోత్పత్తుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానం. నియోజకవర్గానికి తూర్పు దిక్కున తెలుగుగంగ, పడమర దిక్కున కేసీ కాల్వ ప్రవహిస్తుండటంతో రైతులు ప్రధానంగా వరి, మొక్క జొన్న, జొన్న, శనగ, మినుము సాగు చేస్తారు. ఈ పంటలపైనే రైతుల ఆర్థిక స్థితిగతులు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో మార్కెట్యార్డు సేవలు నిలిచిపోవడంతో రైతులకు శాపంగా మారింది. దీంతో రైతులు దళారులబారిన పడి నష్టపోతున్నారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, మినము, వరి, జొన్న పంట కోతలు పూర్తి కావస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అదిగో ఇదిగో అంటూనే సీజన్ ముగుస్తున్నా జాడ లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. నియోజవర్గానికి పక్కనున్న నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరులో కాస్త ఆలస్యంగా అయినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆళ్లగడ్డలో మాత్రం ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రకటిస్తే మార్కెట్లో 1,600 మాత్రమే లభిస్తోంది. ప్రతి రైతు ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున నష్టపోతున్నారు. అలాగే కేంద్రం ఇటీవల ధాన్యానికి ఏ – గ్రేడు క్వింటా రూ. 2,461, సాధారణ రకం రూ.2,441 మద్దతు ధర ప్రకటించింది. రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి దళారులు రూ.1,800 నుంచి రూ.1,900 మించి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ తీరుతో వరి రైతులు క్వింటాకు రూ. 600, మొక్కజొన్న రూ. 700, కందులు రూ. 500, మినుములు రూ. 1300 వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించడం లేదు. -
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
● న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కల్లూరు ముజఫర్ నగర్ సచివాలయంలో పోక్సో యాక్ట్పై శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాగృతి పథకం 2025 కింద సురక్షిత బచ్చన్ – సురక్షిత భవిష్యపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పోక్సో చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కిశోర వికాసం కింద బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద వివరించారు. అనంతరం బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞను పిల్లలతో చేయించారు. -
వైఎస్సార్సీపీలో జిల్లా నేతలకు రాష్ట్ర పదవులు
నంద్యాల: జిల్లాకు చెందిన పలువురు నేతలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామకాల ప్రకటన వెలువడింది. నంద్యాలకు చెందిన బిలావత్ శంకర్నాయక్ను రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా, పాణ్యంకు చెందిన ఎరుకల రాజును రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీగా, బనగానపల్లెకు చెందిన కాతా నిరంజన్ చంద్రమౌళీరెడ్డిని రాష్ట్ర వలంటరీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించింది. తిరుపతి క్రైం: తిరుపతి నగరంలోని గరుడ వారధి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరకంబాడి వైపు నుంచి లీలామహల్ సర్కిల్ దిశగా వస్తున్న ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. ఆమె, తన అన్నతో కలిసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం అనూహ్యంగా గరుడ వారధిపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. జూపాడుబంగ్లా: కర్నూలు – గుంటూరు పాత రహదారి విస్తరణ సర్వే మొదలైంది. జాతీయ రహదారి 340సీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కేజీ రోడ్డును కూడా డబుల్రోడ్డుగా విస్తరించాలని ముందుగానే నిర్ణయించారు. ఇప్పటికే బ్రాహ్మణకొట్కూరులో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా అన్ని మిగిలిన గ్రామాల్లో వారంలోగా పనులు ప్రారంభించనున్నారు. శుక్రవారం తంగడంచ గ్రామంలో రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్సీ కంపెనీ ఇంజినీర్లు సర్వే చేపట్టారు. కేజీ రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి కుడి, ఎడమ వైపు 11 మీటర్ల మేర స్థలం సేకరించి రోడ్డును విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపుల రహదారి వెంబడి డ్రైనేజీ కాల్వను నిర్మించనున్నారు. హైవే రోడ్డు నిర్మాణం పూర్తయి ఇప్పటికే రెండేళ్లు కావొస్తుంది. ఇప్పటికే గ్రామాల్లోని కేజీ రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్సీ కంపెనీ సిబ్బంది రెండు పర్యాయాలు సర్వేచేయగా ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. మూడో సారి సర్వే చేస్తుండగా త్వరగా పనులు ప్రారంభించి రోడ్డు విస్తరిస్తారా లేదా అనే ప్రశ్న గ్రామస్తులను వేధిస్తోంది. ఆత్మకూరులో మోస్తరు వర్షం ఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఆత్మ కూరు పట్టణంతో పాటు నల్లమల అటవీ పరిధిలోని సమీప గ్రామాల్లో గాలులతో కూడిన వర్షం పడింది. ఎండతో అల్లాడిపోయిన ప్రజల కు ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. -
హోటళ్లకు గ్యాస్ స్ట్రోక్
ఉద్యోగ రీత్యా, చదువుల కోసం బయట ఉండే బ్యాచ్లర్స్, హోటళ్లలో తినే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ భారం పడుతుంది. టీ, కాఫీ నుంచి బిర్యానీ వరకు అన్ని ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఇప్పటికే పెంచేశారు. హోటల్కు వెళ్లి తినాలంటేనే భయమేస్తుంది. – కమాల్బీ, గృహిణి, నంద్యాల కమర్షియల్ గ్యాస్పైన ఒకేసారి రూ.1000 పెంచితే మా లాంటి చిరు వ్యాపారులు ఎలా బతకాలి. కస్టమర్లు రేట్లు పెంచితే రారు. పెంచకపోతే మాకు పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి. తప్పని పరిస్థితిలో ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నాం. – రమణ, టిఫెన్ సెంటర్ నిర్వాహకులు, నంద్యాల నంద్యాల: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో హోటల్ రంగం కుదేలవుతోంది. ఈ క్రమంలోనే మధ్య, సామాన్య ప్రజలపై కూడా భారం పడుతోంది. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.993 పెంచేసింది. దీంతో గత నెలలో రూ.2,322 ఉన్న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.3,315కు చేరడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గతంలో ఎన్నడూ లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నెల రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడినప్పటికీ క్షేత్రస్థాయిలో కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అకస్మాత్తు గా చమురు ధరలు ఇప్పుడిప్పుడే పెరిగిపోయాయని, కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచారు. శుక్రవారం పెట్రోల్, డీజల్ ధరలు పెంచడంతో డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుతో చిన్న, మధ్యతరహా హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదు సార్లు ధరలు పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో ఇప్పటికే వ్యాపారులు వారి ఉత్పత్తుల ధరలు పెంచేశారు. ఈ ప్రభావం పరోక్షంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టిఫిన్లు, టీ, కాఫీలతో పాటు భోజనాలు సైతం 15 నుంచి 25 శాతం పెంచేశారు. బ్లాకుల్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు కొందరు అల్పాహారం ధరలను విపరీతంగా పెంచేశారు. వ్యాపారుల ఇబ్బందులు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో దాని ప్రభావం గొలుసు కట్టు చర్యలా అన్ని రంగాలపై పడింది. ధరల పెంపు వల్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ● గ్యాస్ ధర పెరగడంతో హోటళ్లలో టీ, కాఫీ నుంచిటిఫెన్లు, భోజనం ధరల వరకు అన్ని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ● ఒకే సారి రూ.993 పెరగడం వల్ల ధరలు పెంచితే కస్టమర్లు రారని, పెంచకపోతే పెట్టుబడి కూడా రాదని హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ● అద్దె, కరెంట్ బిల్లులు, కూరగాయల ధరలతో పాటు ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా తోడవడటంలో చిన్నపాటి మెస్లు, టిఫెన్ సెంటర్లు నడపలేక చాలా మంది వ్యాపారాన్ని మూసివేసే పరిస్థితి నెలకొంది. ● రేట్లు పెంచితే కస్టమర్లు రారనే భయంతో కొందరు వ్యాపారులు ధరలు పెంచకుండా దోసె, వడ తదితర పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం వంటివి చేస్తున్నారు. ● ఖర్చు తగ్గించుకోవడానికి కొందరు నాణ్యత లేని నూనెలు, తక్కువ ధరలకు దొరికే ముడి పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ● గ్యాస్ భారం భరించలేక మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిల వైపు వెళ్లాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. దీపం 1,56,945 పీఎంయూ 13,589 సీఎస్కే 4313 జనరల్ 3,14,320 కమర్షియల్ 24,300 నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేట్ సమీపంలోని ప్రధాన హోటళ్లలో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్లో నేడు భోజనం రూ.140 నుంచి రూ.160 ధరలు పెంచారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్లో భోజనం రూ.120 నుంచి రూ.160కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 25 శాతం పెంచేశారు. సామాన్యులు తినే మెస్ల్లో భోజనం రూ.80 ఉండేది. ఈ హోటళ్లలో భోజనం రూ.130కి పెంచేశారు. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ప్లేట్ ఇడ్లీ మొన్నటి వరకు రూ.30 నుంచి రూ.40 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ రూ.50కి విక్రయిస్తున్నారు. దోశ, పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. ఒకేసారి రూ.993 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,315కు చేరిన 19 కేజీల సిలిండర్ ధర ఆహార పదార్థాల ధరలు పెంచిన హోటళ్ల నిర్వాహకులు చిన్న చిన్న హోటళ్లు మూత -
పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
మంత్రి టీజీ భరత్ అనుచరులు ప్రతి డిపార్టుమెంట్లో కలెక్షన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపాల్టీలో, మద్యం, బియ్యం, తదితర వాటిల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కర్నూలు అభివృద్ధిని మంత్రి పూర్తిగా విస్మరించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ పాలనలో ఏమీ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశాం. పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. – హఫీజ్ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే -
వైభవంగా నందీశ్వర ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందీశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వర స్వామికి బహుళ త్రయోదశి, మహా ప్రదోషం సందర్భంగా గురువారం ప్రదోషకాలంలో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ రవి శంకర్ అవధాని, ఆలయ అర్చకులు మూల స్థానం సుబ్బయ్య శర్మ, హనుమంతు శర్మ ముందుగా గణపతి పూజ, పీఠార్చన, ద్రవ్య పూజలు చేశారు. నందీశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతంతో పాటూ జలాభిషేకం, పాలాభిషేకం పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వర అభిషేకం తిలకించి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఆళ్లగడ్డలో పీజీఆర్ఎస్ నంద్యాల: ప్రజా వినతులను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీన ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పబ్లిక్ గ్రీవెన్స్ వినతుల పరిష్కారానికి పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు నేరుగా అధికారులను కలిసి తమ అర్జీలు అందజేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు బాలల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికార అధికారిణి లీలావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, దైర సాహసాలు, క్రీడలు, కలల సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, పెయింటింగ్ తదితర అంశాల్లో ప్రతిభ చూపిన వారు జూలై 31వ తేదీలోపు వెబ్సైట్ https://awards.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏడాది డిసెంబర్ 26వ బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకుంటారన్నారు. ట్రాఫిక్ సీఐపై చర్యలు తీసుకోవాలి నంద్యాల(న్యూటౌన్): ఆటో కార్మికులను వేధిస్తున్న పట్టణ ట్రాఫిక్ సీఐ చాంద్బాషాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నంద్యాల పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ధనంజయుడు, శ్రీనివాసులు కోరారు. సీఐ తీరును నిరసిస్తూ గురువారం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐ చాంద్బాషా ఆటో కార్మికులపై దాడులకు పాల్పడుతూ, అధిక మొత్తంలో చలానాలు వేస్తున్నారన్నారు. సీఐను సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రోడ్డు సైడు ఉండే చిరు వ్యాపారులను బెదిరిస్తున్నారన్నారు. ఆందోళనలో ఏఐటీయూసీ నంద్యాల పట్టణ డిప్యూటీ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆటో యూనియన్ నాయకులు బండి శ్రీను, నాగార్జున, రహీమ్, ఏడుకొండలు, రమణారెడ్డి, శ్రీనివాసులు, మధు, నాగేంద్ర పాల్గొన్నారు. వంద పడకల ప్రభుత్వాసుపత్రి తనిఖీ డోన్ రూరల్: స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో గురువారం వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుజాత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను తనిఖీ చేసి వసతులు, వైద్య సౌకర్యాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని వారు సూచించారు. ఆమె వెంట, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనీఫ్, డాక్టర్ గౌస్, డాక్టర్ శిల్ప, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
అధైర్యపడకండి నేనున్నాను..
● సున్నిపెంట ప్రజలకు శిల్పా చక్రపాణి అభయం ● అఖిలపక్షాలతో ఈనెల 20న సమావేశం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలంప్రాజెక్ట్ (సున్నిపెంట)లో ప్రభుత్వ గృహాల్లో నివశిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు చెల్లవని, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, అండగా తానుంటానని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిలా చక్రపాణిరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. సున్నిపెంటలో నివాసితులకు గతంలో ఇంటి పట్టాలు ఇచ్చింది రెవెన్యూ అధికారులని, అలాట్మెంట్ చేసింది జలవనరుల శాఖ అధికారులు అని, అప్పుట్లో జారీ చేసిన ఉత్తర్వులు కాదని వారే ఇప్పుడు ప్రజలు ఆక్రమణలకు పాల్పడ్డారని నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గుడ్డిగా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఏమీ తెలియని వాడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 30వేలపైనే జనాభా కలిగిన సున్నిపెంట ప్రజలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20వ తేదీ ఉదయం 9లకు సున్నిపెంటలోని రెడ్ల కళ్యాణమండపంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు శిల్పా తెలిపారు. సమావేశంలో అందరి అభిప్రాయాలతో సున్నిపెంట ప్రజలు నివాస గృహాలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నివశించే హక్కును కలిగి ఉన్నారన్నారన్నారు. -
కర్నూలులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
● కలెక్టరేట్ వద్ద మూడు గంటల పాటు ధర్నా ● చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● పోలీస్ స్టేషన్ల వద్ద టీడీపీ నాయకులు అంగడి పెట్టారని విమర్శ ● పోలీసుల పేరుతో కలెక్షన్లు ఎక్కువయ్యాయని ఆరోపణ ● ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నేతలు -
తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజాభిప్రాయ సర్వేలు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నీటి వనరులు, ఓవర్ హెడ్ ట్యాంకు లు, బోర్వెల్స్, పైప్లైన్ల పరిస్థితిని స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. నీటి వనరుల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. యాగంటి, మహానంది, ఓంకారం, శ్రీశైలం, నందవరం, అహోబిలం, ఆత్మకూరు వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీడీఎస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను స్వచ్ఛ రథాలుగా వినియోగిస్తూ గ్రామాల్లో చెత్త సేక రణ చేపడుతున్నామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద జిల్లాలో దాదాపు 36 వేల ఇళ్లు పూర్తయినా, అందులో సుమారు 4,500 ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
ఎల్హెచ్ఎంఎస్తో చోరీలకు అడ్డుకట్ట
బొమ్మలసత్రం: లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్)పై ప్రజలకు అవగాహన కల్పిస్తే చోరీల కు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ జావలి ఆల్ఫోన్స్ అన్నారు. గురువారం స్థాని క కార్యాలయంలో సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇళ్లలో ఎవరూ లేనప్పుడు ఎక్కువగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లు వదిలి వెళ్లే యజమానులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎల్హెచ్ఎంఎస్ ఏపీ పోలీసు యాప్ను ఎలా వినియోగించాలో పోలీసులు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ యాప్ ద్వారా ఇల్లు వదలి బయటకు వెళ్లేప్పుడు రిక్వెస్ట్ పంపితే కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బందికి చేరడంతో ఇంటి వద్దకు వచ్చి అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కెమెరాలకు మోషన్ డిటెక్షన్ సెన్సార్లు ఉండటంతో ఇంటి వద్ద ఏ చిన్న అలజడి వచ్చినా పోలీసు కంట్రోల్ రూంలకు అలర్ట్ మెసేజ్ వెళ్తుందన్నారు. సమావేశంలో సీఐలు సుధాకర్రెడ్డి, గోపాలకృష్ణ, అస్రార్బాషా, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెమిడియల్ క్లాస్ను సద్వినియోగం చేసుకోండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెమడియల్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గుర్సాలపేటలో ఉన్న కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ రెమిడియల్ క్లాసులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతి, సబ్జెక్టుల వారీగా ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ్యంగా తెలుగు, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణ అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3,375 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదన్నారు. ఈ విద్యార్థులంతా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, ఇంటి పనులు చెప్పకుండా చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్
కోవెలకుంట్ల: అధికారపార్టీ రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ లింగాల గ్రామంలో రెండో సారి విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో సోమేశ్వర, రామాలయం, చెన్నకేశవ స్వామి ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో రూ. 1.14 కోట్లు వెచ్చించి ఆలయాలను పునర్నిర్మించి 2024 ఫిబ్రవరి 19వ తేదీన విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఆలయాల జీర్ణోద్ధరణ గావించి రెండు సంవత్సరాలు దాటింది. అయితే సోమేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలు కదిలాయని వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పునఃప్రతిష్టాంచాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పట్టుబట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర గ్రామ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు. వీరి మాటలు లెక్కచేయకుండా టీడీపీ నాయకులు విగ్రహాలను తొలగించి పునఃప్రతిష్టకు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాల్లో ఎలాంటి పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్ట వద్దని కోర్టు దేవాదాయశాఖకు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదే రోజు రాత్రి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఈఓ మోహన్ పోలీసుల సహకారంతో గ్రామాన్ని చేరుకుని కోర్టు ఉత్తర్వుల మేరకు ఎలాంటి పునఃప్రతిష్ట చేయవద్దని కోర్టు ఇచ్చిన ఉత్తర్వు నోటీసులను ఆలయం వద్ద అంటించారు. దీంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చేసేదిలేక దేవదాయ శాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి బుధవారం సాయంత్రం ఆలయ తలుపులు తెరిచి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేయడంతో గ్రామ పెద్దలు తిరిగి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లతో రెండోసారి విగ్రహాల పునఃప్రతిష్టకు ఏర్పాట్లు -
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న పంచాయతీలు: 490
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన రైతు గజ్జల శేఖర్రెడ్డి. గతేడాది జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద 72 కొబ్బరి మొక్కలు నాటాడు. ఇప్పటి వరకు సుమారు రూ. 40 వేల వరకు ఖర్చు అయ్యింది. అయితే మొక్కలు నాటిన వెంటనే మొక్కల కొనుగోలు, రవాణా, నాటేందుకు గుంతలు తవ్వడం వంటి ఖర్చులతో పాటు మెయింటెనెన్స్ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు ఏడాదికి రూ. 25 చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. రైతు నాలుగు ఎకరాల పొలం చుట్టూ టెంకాయ మొక్కలు నాటాడు. అయితే ఇంతవరకు రూపాయి కూడా అందలేదు. బిల్లుల కోసం 6 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిమ్మ చెట్టుకు బిందెతో నీళ్లు పోస్తున్న ఈ రైతు మర్రిపల్లె గ్రామానికి చెందిన పత్తి శివరాముడు. ఇతను గత సంవత్సరం క్రితం 2 ఎకరాల్లో 130 నిమ్మ మొక్కలు నాటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చెట్లను బతికుంచుకున్నాడు. అయితే ఇప్పటి వరకు గుంతల, ఎరువులు, మొయింటినెన్స్ తదితరాల ఖర్చులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎండ లకు మొక్కలు ఎండి పోతుండటంతో రోజు బిందెలతో నీళ్లుపోస్తూ బతికుంచుకుంటున్నాడు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. ఇదిగో అదిగో అంటూనే ఏడాది దాటిపోయింది. బిల్లులు వచ్చే వరకై నా మొక్కలు బతికించుకునేందుకు కష్టాలు పడుతున్నాడు.ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోతున్న వారిలో రైతులు ముందుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం కరువై ఉద్యాన రైతులు మొక్క దశలోనే అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నారు. పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన తోడ్పాటు అందజేస్తామని అధికారులు రైతులు వెంటపడ్డారు. పండ్ల మొక్కలు నాటుకుంటే మొక్కల ధర, రవాణా, గుంతలు తీసి నాటే కూలీలతో పాటు వాటి సంరక్షణకు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ఉపన్యాసాలు ఇచ్చారు. పాలకులు, అధికారుల మాటలు నమ్మిన రైతులు విరివిగా నిమ్మ, చీనీ, మామిడి, సపోట, జామ, దానిమ్మ వంటి పలు రకాల పండ్ల మొక్కలతో పాటు కొబ్బరి, మునగ, ఆయిల్ పామ్ వంటి మొక్కలు నాటుకున్నారు. మొక్కలు నాటుకునేంత వరకు ఒత్తిడి చేసిన అధికారులు ప్రతి నెలా ఇస్తామన్న ప్రోత్సాహ నగదు పైసా ఇవ్వలేదు. ఏడాదికి పైగా రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఈ వారం, వచ్చే వారం అంటూ అధికారులు సమాధానం చెబుతూ ముఖం చాటేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీరుగారిపోతోంది. బిల్లులు దూరమై.. సంరక్షణ భారమై పండ్ల మొక్కలు సాగు చేస్తే.. మొక్క ఎంపిక నుంచి నాటుకుని పంట చేతికొచ్చే వరకు (3 ఏళ్లు ) అయ్యే ఖర్చు పూర్తిగా (వంద శాతం) ప్రభుత్వమే ఏ నెలకు ఆ నెలలోనే ఇస్తుందని అధికారులు చెప్పారు. దీంతో అన్నదాతలు రూ.లక్షలు ఖర్చు చేసి పండ్ల మొక్కలు నాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల పరిధిలో 1,472 మంది రైతులు 2.65 లక్షల పండ్ల మొక్కలను సాగు చేశారు. మొక్కలు కొనుగోలు చేయడం, రవాణా, నాటించడం, నీరందించడం, ఎరువులు, మందుల పిచికారీ చేయడం, సంరక్షణకు అన్నింటికీ రైతులే ఖర్చు భరించారు. బిల్లుల గురించి అడుగుతుంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేక పోతుండటంతో గంపెడాశతో పండ్ల మొక్కలు నాటుకున్న రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఏవైనా వంద మొక్కలు నాటుకుంటే వాటి సంరక్షణకు ప్రతి నెల ఒక్కో మొక్కకు మెయింటెనెన్స్కు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు రూ. 25 లు చొప్పున రైతులకు అందించాలి. ఏడాదిగా ఈ బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో 1,472 మంది రైతులకు సుమారు రూ. 54 కోట్లకు పైగానే రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. అప్పులు చేయలేక.. సాధారణంగా ఏ పండ్ల తోటలు సాగు చేసినా ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. నెలనెలా ఉపాధి పథకం బిల్లులు అందుతాయని రైతులే సొంతంగా పెట్టుబడులు పెట్టుకున్నారు. అనేక మంది అప్పులు చేసి మొక్కలు నాటుకున్నారు. నెలనెలా వస్తుందనుకున్న బిల్లు ఏడాది దాటినా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు నీటి తడులకు పక్కనున్న బోర్లపై ఆధారపడాల్సి ఉంది. వీరు నీళ్ల బాడుగ చెల్లించక పోవడంతో నీళ్లు వదలడం లేదు. దీంతో అనేక మంది బిందెళతో నీళ్లు పోసుకుంటూ మొక్కలను పెంచుకుంటుండటంతో తేమ సరిపోక మొక్కలు ఎండిపోతున్నాయి. ఖర్చులు భరించలేకుంటున్నామని, మరి కొద్ది రోజులు చూసి పంటలను తొలగించుకోవడం జరుగుతుందని అధికారులతో వాపోతున్నారు. ఉద్యాన పంటలు సాగుచేసిన రైతులకు అందని బిల్లులు ఏడాదిగా చెల్లించని మెటీరియల్ బకాయిలు అప్పులు చేసి సంరక్షిస్తున్న రైతులు జిల్లాలో రూ. 54 కోట్లు పెండింగ్ -
లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో యూరియా కొరత వెక్కిరిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక యూరియా కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటల సాగు, డిమాండ్, సప్లై ప్లాన్ ప్రకారం ఎరువులు సరఫరా చేయకపోవడం, అంతంతమాత్రం వచ్చిన యూరియా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో సాధారణ రైతులకు దిక్కులు చూడాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలన్నీ బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంది. అయితే ప్రయివేటు డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆన్లైన్ లెక్కల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎరువులు దొరకని పరిస్థితి. ముందస్తు పత్తి సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ఆదిలోనే యూరియాకు కటకట నీటి వసతి కింద మే నెల మొదటి నుంచే రైతులు సాగుకు సిద్ధమవుతారు. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద పత్తి ఇప్పటికే 1,000 హెక్టార్లలో సాగయింది. కూరగాయల పంటల సాగు కూడా చేపట్టారు. ప్రధానంగా యూరియా అవసరం ఎంతో ఉంది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. డీసీఎంఎస్ బ్రాంచీలు 18 ఉండగా.. రైతుసేవా కేంద్రాలు 689. వీటిల్లో ఎక్కడా ఒక్క బస్తా యూరియా లేకపోవడం గమనార్హం. మామూలుగా వ్యవసాయానికి మే నెల అన్ సీజన్. ఇప్పుడు ఎరువులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో నీటి వసతి కింద పత్తి సాగు చురుగ్గా సాగుతున్నా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం బస్తా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ యూరియా ఎక్కువగా వాడితే అనర్థాలు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే ప్రచారానికి తెగబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువుల ధరకు రెక్కలు ఇప్పటికే అన్ని రకాల రసాయన ఎరువుల ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి రైతులు ఒక బస్తా ఎరువు కూడా కొనలేని పరిస్థితి. ఇక చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల భారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. 28–28–0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.2,300లకు చేరిందంటే ఎలా కొనాలనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20–20–0–13, 14–35–14, 19–19–19, 10–26–26 తదితర కాంప్లెక్స్ ఎరువుల ధరతో పాటు పొటాష్ ఎరువు ధర అడ్డగోలుగా పెరిగాయి. 2026–27లో ఖరీఫ్ ప్రారంభానికి ముందే యూరియా కొరత ఏర్పడటం గమనార్హం. ఎరువులు కర్నూలు నంద్యాల యూరియా 58,872 54,458 డీఏపీ 15,408 30,023 ఎంవోపీ 2,516 3,617 ఎస్ఎస్పీ 2,220 3,176 కాంప్లెక్స్ 1,28,029 81,841గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొరత మాటే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్బీకేల వారీగా ఏఏ పంటలు సాగు చేస్తున్నారు. ఎరువుల డిమాండ్ ఎంత అనే వివరాలు పక్కాగా సేకరించింది. ఇందుకు అనుగుణంగా ఆర్బీకేల్లో యూరియూ, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచింది. ఎరువుల పంపిణీలో పక్కా ప్లాన్ ఉండటంతో ఐదేళ్లు కొరత మాటే వినిపించలేదు. నీటి వసతి కింద ముందస్తుగా ముమ్మర పత్తి సాగు ఉమ్మడి జిల్లాలో ఒక్క బస్తా యూరియా లభించని పరిస్థితి లెక్కల్లో మాత్రం 37,496 మెట్రిక్ టన్నుల యూరియా అన్ సీజన్ అయినప్పటికీ రైతులకు చుక్కలు ఇప్పటికే అడ్డగోలుగా పెరిగిన ఎరువుల ధర 37,496 మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ? వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కనిపించని పరిస్థితి. 2026 ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 3,72,946 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారం కర్నూలు జిల్లాకు 2,07,029 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా.. యూరియా 58,872 టన్నులు అవసరం. నంద్యాల జిల్లాలో 2,52,444 హెక్టార్లలో వివిధ పంటల సాగుకు అవకాశం ఉండగా 54,458 టన్నుల ఎరువులు సిద్ధం చేయాల్సి ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 62వేల టన్నుల ఎరువులు ఉండగా.. ఇందులో యూరియా 14,400 టన్నులు ఉన్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో బస్తా కూడా లభించని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల సిఫారసు ఉంటేనే యూరియా సహా ఇతర ఎరువులు లభిస్తుండటం గమనార్హం. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం చింతకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయుడు హనుమంతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం డీఈఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవడం అభినందనీయమన్నారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవనాల శ్రీనివాసులు, పిట్టల శ్రీనివాసులు, కల్లె మద్దిలేటి, గని శ్రీనివాసులు, చక్రధర్, జనార్ధన్న్, కుంపటి రమణయ్య, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ
● అదుపులో మరో వ్యక్తి ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఓ నరసింహులు, కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ వ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఈడిగ రంగన్న గౌడ్ అంబేద్కర్ సర్కిల్ మహలక్ష్మీ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ను నిర్వహిస్తున్నాడు. షాప్ లైసెన్సు కు రెన్యూవల్తో పాటు ఇదే షాప్లో ఫెస్టిసైడ్స్ విక్రయించేందుకు కొత్తగా లైసెన్స్ కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని ఏఈఓ నరసింహులు.. డీలర్ రంగన్నగౌడ్కు చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్లాన్తో బుధవారం సాయంత్రం ఏఈఓకు రూ. 30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఓతో పాటు కార్యాలయంలో పనిచేసే అనధికార వ్యక్తి మోహన్ దగ్గర రూ. 73,600ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఏ కార్యాలయంలోనైనా పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదింవచ్చునని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడుతోపాటు సిబ్బంది ఉన్నారు. అయితే ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఏడీఏ, ఏవో కార్యాలయాల్లో లేకపోవటం గమనార్హం. -
ఏపీవీఏ ఫోర్త్ ఉపాధ్యక్షుడిగా రవిబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ (ఏపీవీఏ) ఫోర్త్–4 ఉపాధ్యక్షుడిగా సహాయ సంచాలకులు గుండంపాటి రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామానికి చెందిన వారు. కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వెటర్నరీ అసిస్టెంటు సర్జన్గా, సహాయ సంచాలకులుగా దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫోర్త్–4 (రాయలసీమ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ స్థాయిలో పశువైద్యులు ఎదుర్కొంటున్న వివిద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
నాడు ఘన కీర్తి.. నేడు మూతబడి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు నిర్వీర్యమైంది. పంటల సాగులో రైతులకు విత్తనాలు,ఎరువుల నాణ్యత పరీక్షలు, పాడి రైతులకు అన్ని రకాల పరీక్షలు అందించి ఘనకీర్తి గడించిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు మూతపడింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి ఒక సమగ్ర వ్యవసాయ పరీక్ష కేంద్రం మంజూరు చేశారు. ఇందులో భాగంగానే ఆలూరులోని ఎల్లార్తి రోడ్డులోనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.57 లక్షల వ్యయంతో 2021 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. గతంలో రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి విత్తనాలు,ఎరువుల పరీక్షలు, పశువుల రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన అగ్రిల్యాబ్ ప్రభుత్వ మార్పు తర్వాత ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారి మూత పడింది. దీంతో రైతులకు ఆయా పరీక్షలు అందడం లేదు. – ఆలూరు రూరల్ -
నాటి దానం నేటికీ పదిలం
● అహోబిలం ఆలయ కుడ్యంపై 500 ఏళ్ల క్రితం నాడు కురుకుంద వాసి దానంపై శాసనంఆత్మకూరురూరల్: కృష్ణా తీరం వెంట ఉన్న ప్రాంతాలను వేల సంవత్సరాలుగా బాదామి చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు పాలించినట్లు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ధనవంతులు ధర్మవితరణ చేసేవారనే సత్యం ఇటీవల బయల్పడిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దిగువ అహోబిలం ఆలయ గోపురం కుడివైపు గోడపై ఉన్న శాసనాలను స్పష్టంగా చదవడం కోసం రసాయనాలతో శుద్ధీకరణ జరిపారు. అందులో ఒక శాసనంలో ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ ప్రసక్తి ఉండడమే ఈ వార్తాంశం అయ్యింది. కన్నడ భాష లిపి ఉన్న ఈ శాసనం క్రీ.శ 1553 జులై 2న శనివారం వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహా అరసు పుణ్యం కోసం అహోబిల నరసింహుడికి ప్రతిరోజు సహస్త్రనామ పూజ నిర్వహించేందుకు 12 వరమా – గద్వాణాలను దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. దీన్ని భారత పురావస్తు శాక సర్వేక్షణ శాఖ డైరెక్టర్ (ఎఫిగ్రఫి) పరిష్కరించారు. కురుకుంద గ్రామంలో 500 ఏళ్ల నాటి గురుతులు ఏవీ ఇప్పుడు కనిపించక పోయినా ఈ గ్రామంలోనూ, పరిసరాల్లో ఉన్న రెండు చెరువులకు మాచా వీరప్ప చెరువులుగా పేరుండటం అవి ఎప్పటివో ఎవరు చెప్పలేకపోవడం, ఇప్పటికీ ఇవి వందల ఎకరాలకు జీవనాధారంగా ఉండడం వంటివి గ్రామ ప్రాచీనతను చాటుతున్నాయి. -
సెక్యూరిటీ గార్డు నిజాయితీ
శ్రీశైలం: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ప్రైవేటు భద్రతా విభాగంలో పనిచేస్తున్న రామ్ లాల్ తనకు దొరికిన బంగారు పుస్తెల హారాన్ని తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు గంజి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం దాదాపు రెండు తులాల బంగారు పుస్తెలతాడు సెక్యూరిటీ గార్డుకు దొరకడంతో కమాండ్ కంట్రోల్ రూమ్కు అప్పగించారు. దేవస్థానం మైకుల ద్వారా బంగారు చైన్ పోగొట్టుకున్న వారు ఆధారాలతో వచ్చి తీసుకోవచ్చని ప్రకటించగా హైదరాబాద్లోని సైదాబాద్ సరస్వతి నగర్ కాలనీకి చెందిన కే.ధాత్రి రెడ్డి అక్కడికి వచ్చి హారం గురించి పూర్తి వివరాలు తెలపడంతో పుస్తెల హారాన్ని తిరిగిచ్చినట్లు చెప్పారు. పోగొట్టుకున్న హారం తిరిగి దక్కడంతో సదరు మహిళ దేవస్థానం పర్యవేక్షకులు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటో బోల్తా – వృద్ధురాలి దుర్మరణం బనగానపల్లెరూరల్: మండలంలోని యాగంటి క్షేత్రం సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో జ్ఞానేశ్వరమ్మ (74) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు మంగళవారం యాగంటి క్షేత్రానికి వచ్చారు. యాగంటి స్వామి దర్శనం అనంతరం జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు బనగానపల్లెకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. క్షేత్రం సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న జ్ఞానేశ్వరమ్మ అక్కడిక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ ప్రవీణ్కుమార్తో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పి.వి.ఎస్.నాయుడు నిర్వహించారు. జిల్లాలోని సంక్షేమ అధికారులకు సహాయ సంక్షేమ అధికారులుగా పనిచేయాలని, అలాగే జిల్లా కలెక్టర్ పరిధిలో కూడా విధులు నిర్వర్తించాలని పీఓ సూచించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణత, సంప్లిమెంటరీ విద్యార్థుల కోచింగ్పై దృష్టి సారించాలన్నారు. ఆర్టికల్ 275, పీఎంజేయూజీఏ పథకాల ద్వారా వచ్చిన నిధులను పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి, వేసవి సెలవుల్లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. చెంచులకు సంబంధించిన ప్రజా విజ్ఞప్తులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల డీటీడబ్ల్యూఓలు, ఎడ్యుకేషన్ ఏపీఓ రామాంజనేయులు, ఆఫీస్ మేనేజర్ సీమోను తదితరులు పాల్గొన్నారు. కోనేరులో జారిపడి వ్యక్తి మృతి బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్ కడప పట్టణంలోని అంగన్ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
లేబర్ కోడ్ల రద్దుకు పోరాటాలు
కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్ల రద్దుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం నేషనల్ డిమాండ్స్ డేలో భాగంగా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునెప్ప, జిల్లా కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, ఏఐయూటీయూసీ జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ.. సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కార్పొరేటర్లకు అనువుగా తీసుకొచ్చారని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. వామపక్ష, కార్మిక సంఘాల నాయకులు ఎన్.కృష్ణయ్య, పీఎస్ రాధాకృష్ణ, నరసింహులు, నగేష్, టి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు తనఖా పెట్టించి ఘరానా మోసం
వెల్దుర్తి: పలు ప్రైవేట్ బ్యాంకులలో గ్రామస్తుల ఇళ్లు తనఖా పెట్టించి లోన్ మంజూరు చేయించాడు. అందులో సగం తీసుకుని, మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ జూపి మొత్తం కాజేశాడు. లోన్కు సంబంధించి పూర్తి ఈఎంఐ తానే కట్టేస్తానని నమ్మబలికి చివరకు పత్తా లేకుండా పోయాడు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు వారు ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై బాధితులు పాండు, మల్లయ్య, గిడ్డయ్య, ఎల్లయ్య, రాజు, రామాంజనేయులు, మాదన్న, మనోహర్, రామలింగం తదితరులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెపల్లె గ్రామానికి చెందిన ఏజెంట్ బురకల శాంతకుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి డోన్కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకులో, మరిన్ని బ్యాంకులలో ఇళ్లు తనఖా పెట్టి లోన్ ఇప్పిస్తానని, అందులో సగం తాను తీసుకుని, లోన్ మొత్తం కంతుల వారీగా బ్యాంకుకు చెల్లిస్తానని ఆశ చూపాడు. దీంతో మల్లెపల్లెలోని దాదాపు 70 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లు, ఇతర ఆస్తి పత్రాలు శాంతకుమార్కు అప్పగించారు. వాటిని ప్రైవేట్ బ్యాంకులలో తనఖా పెట్టించి (మార్టిగేజ్ చేయించి) దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ మంజూరు చేయించాడు. సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ కాగానే ఒప్పందం ప్రకారం సగం తీసుకున్నాడు. మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి మొత్తం కాజేశాడు. మొదట్లో లోన్ ఈఎంఐ సక్రమంగా కడుతూ ఇతరుల నమ్మకం పెంచుకున్నాడు. నమ్మకం మరింత పెరిగేలా ఇళ్లు తనఖా పెట్టిన వారికి బాండ్ సైతం రాసిచ్చాడు. దీంతో వందల సంఖ్యలో మల్లెపల్లెతో పాటు మండల పరిధిలోని చెరుకులపాడు, రామళ్లకోట, కలుగొట్ల, పుల్లగుమ్మి, బుక్కాపురం ఇలా పలు గ్రామాల వాసులు ఇతని ద్వారా హోమ్లోన్ తీసుకుని నగదు సమర్పించుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం ధ్రువపత్రాలను చూసి లోన్ మంజూరు చేయడంపై ఈ స్కామ్లో బ్యాంకు వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పత్రాలు లేకపోయినా ఏజెంట్ శాంతకుమార్ అధికారుల వద్దకు తిరిగి మరీ ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో ఈ తరహాలో రూ.కోట్లలో స్కామ్ జరిగినట్లు చెప్పారు. ఈ స్థితిలో శాంతకుమార్ పత్తా లేకుండా పోవడంతో గత వారం నుంచి తమకు బ్యాంకుల నుంచి ఈఎంఐ కట్టాలంటూ ఒత్తిడి ఎక్కువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబంలో ఒకరు పేడ రంగు తాగి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ పరిస్థితీ అదేనని, అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వందల మందికి రూ.కోట్లలో కుచ్చుటోపీ పరారీలో ఏజెంట్ ఈఎంఐ కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి -
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ కీలకం
కర్నూలు(హాస్పిటల్): నేర పరిశోధనల్లో ఫోరెన్సిక్ విభాగం వైద్యులు ఇచ్చే నివేదికే కీలకమని కేఎంసీ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ చెప్పారు. జాతీయ ఫోరెన్సిక్ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం పోస్టుమార్టం చేయడంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేసేలా సేవలందించాలని, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే పోస్టుమార్టం చేయాలని జూనియర్ వైద్యులకు సూచించారు. ఫోరెన్సిక్ వైద్యులు సాహిల్, హరీష్, సురేఖ, పీజీలు పాల్గొన్నారు. -
పండ్ల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగిస్తున్న దుకాణాలపై మంగళవారం ఆహార భద్రత విభాగం (ఫుడ్ సేఫ్టీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మండిబజార్లో ఉన్న గౌస్ ఫ్రూట్స్ కంపెనీ, షమీవుల్లా ఫ్రూట్ మర్చంట్ దుకాణాల్లో తనిఖీలు చేసి అరటి, మామిడి పండ్లు మాగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇథలిన్ గ్యాస్ను గదిలోకి పంపి పండ్లను మాగించకుండా ఇథలిన్ పౌడర్ను నీళ్లలో కలిపి అందులో పండ్లను మాగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా మాగించిన పండ్లను తినడం వల్ల వ్యాధులు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ చెప్పారు. ఈ మేరకు అరటి, మామిడి పండ్లను శాంపిల్ తీసి ల్యాబోరేరీకి పంపించారు. డిస్ట్రిక్ట్ కన్జూమర్ సెక్రటరీ శివమోహన్రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. -
కొండలు పిండి.. సంపద కొల్లగొట్టి
చిన్న మల్కాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న దృశ్యంకొచ్చేర్వు, కన్నపకుంట గ్రామల మధ్య అక్రమ మైనింగ్ డోన్ రూరల్: నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పచ్చని కొండల్ని అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఇమిడి ఉన్న విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి నయాపైసా రాయాల్టీ, వే బిల్లుల రూపంలో చెల్లించకుండానే యాథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మండలంలోని కన్నపకుంట, కొచ్చెర్వు, మల్కాపురం, పరదేశిబావి, పెద్ద మల్కాపురం, డోన్ శివారులోని వెంకటనాయునిపల్లె, గుడితిప్ప ప్రాంతాల్లోని అ టవీ, రెవెన్వూ భూముల్లో ప్రభుత్వం నుంచి ఎలా ంటి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు సా గిస్తూ విలువైన ఖనిజాలను కొల్లగొడుతున్నారు. కళ్లు మూసుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) సర్టిఫికెట్ పొందకుండా, ఏడీఎంజీకి రాయల్టీ బిల్లులు చెల్లించకుండా, సేల్ ట్యాక్స్ నుంచి వే బిల్లులు లేకుండానే ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొచ్చెర్వు, కన్నపకుంట అటవీ భుముల నుంచి డోలమైట్, వైట్ సెల్, లైమ్ స్టోన్లతో పాటు వివిధ రంగుల రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పలు ప్రాంతాల్లో లైసెన్స్లు పొందకుండానే గనుల్లో బ్లాస్టింగ్ (పేల్లుళ్లు)కు పాల్పడుతున్నారు. అటవీ, రెవెన్యూ, ఎడీఎంజీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మారడంతో అధికార పార్టీ నేతల అక్రమార్జనకు అంతులేకుండా పోతోంది. ఈ విషయంపై నోరు మెదిపేందుకు కుడా సంబంధిత అధికారులు ఇష్టపడటం లేదు. ఖనిజాల అక్రమ తవ్వకం ద్వారా కోట్లు గడిస్తున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మొద్దు నిద్రలో ఏడీఎంజీ, అటవీ, రెవెన్యూ అధికారులు -
హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం
● రూ.15లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి వెలసిన ప్రాంతాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదామని మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. డీజీవీ అతిథి గృహం వద్ద హైవే రోడ్డులో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు మంగళవారం పీఠాధిపతులు శ్రీకారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు మఠం అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్ గార్డెన్, సుశమీంద్రతీర్థుల పార్క్, గురునివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత పీవీ బద్రినాథ్ రావు తీసుకున్నారు. ఈ పనులకు రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆయనను పీఠాధిపతి శాలువ, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. -
కఠిన చర్యలు తీసుకోవాలి
కష్టపడిన చదివిన విద్యార్థుల ఆశల్లో ఎన్టీఏ నీళ్లు పోసింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకుండా పేపర్ లీకేజీ అంటూ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల్లో ఆందోళన పుట్టించింది. కేవలం నీట్ పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఈ పేపర్ లీక్ల వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత కోల్పోతే ప్రతిభా వంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. – రాజు నాయుడు, ఆర్వీఎఫ్ అధ్యక్షుడు, నంద్యాల -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,78,19,526 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు సంబంధించి 20 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 2,69,28,176, నాణేలా రూపంలో రూ.8,91,350 వచ్చిందన్నారు. అలాగే 15 గ్రాముల బంగారం, 751గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్ పాల్గొన్నారు. కొత్తిమీర ధరకు రెక్కలు ● ఒక మడి ధర రూ.1600 గోనెగండ్ల: కొత్తిమీర ధరకు రెక్కలు వచ్చాయి. ఒక మడి ధర రూ. 1500 నుంచి రూ.1600 వరకు పలుకుతోంది. ఎండలు ఎక్కువకావడం, బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో ప్రస్తుతం బోర్లు, బావుల కింద 100 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఒక ఎకరా సాగుకు రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల నుంచి కొత్తిమీరకు ధర పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై కేసు వెల్దుర్తి: మల్లెపల్లె వైఎస్సార్సీపీ కార్యకర్త వీరేశ్ ఆచారిపై సోమవారం దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామదుర్గనాయుడు, అయ్యన్న, చంద్రారెడ్డి, మాధవ్పై కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ నరేశ్ మంగళవారం తెలిపారు. హైవే 44 పక్కన మల్లెపల్లె స్టేజ్ సమీపంలో వీరేశ్ ఆచారి, భార్య గాయత్రి, ఇద్దరు పసిపిల్లలతో కలిసి బైక్పై వస్తుండగా నిందితులు దారికాచి బైక్ను అటకాయించి వీరేశ్ ఆచారిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. జరిగిన సంఘటనపై గాయత్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
జిల్లాలోకి తెలంగాణ, కర్ణాటక విత్తనాలు
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్ల బీటీ–2 పత్తి విత్తనాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా.. వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాకు 11 లక్షల ప్యాకెట్లు, నంద్యాల జిల్లాకు 50 వేల ప్యాకెట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖను కోరారు. దీంతో జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు తెలంగాణ, కర్ణాటక నుంచి అనధికార బీటీ–2 విత్తనాలను జిల్లాలోకి డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, క్రిష్ణగిరి మండలాల్లోకి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున డంప్ అయినట్లు సమాచారం. వందల కంపెనీలు, అనేక రకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
నాణ్యతగా ఉన్న జొన్నలనే కొనుగోలు చేస్తాం
పాములపాడు: నాణ్యతగా ఉన్న జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై డీఎం అశ్వర్ధ నారాయణ నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆయన రైతులతో మాట్లాడారు. మహేంద్ర జొన్నలు మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు. పలువురు రైతులు తెచ్చిన జొన్నలను పరిశీలించారు. క్వింటా రూ.6,699 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. కొన్ని కారణాల చేత కొనుగోలు ఆలస్యమైందన్నారు. వెంటనే రైతుల నుంచి జొన్నలు సేకరించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి మహేశ్వరరెడ్డి, ఏపీఎం ఉమామహేశ్వరమ్మ ఉన్నారు. 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం తన చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 10,115, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,928 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షల నిర్వహణకు 43 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెఆప్పరు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్స్ మూసి ఉంచేలా చూడాలన్నారు. వీరహనుమాన్ శోభాయాత్ర నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో వీరహనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. తొలుత ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా వీరాంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర టెక్కె మార్కెట్యార్డు నుంచి బైర్మల్ వీధి గుండా ప్రశాంతంగా సాగింది. శోభాయాత్రలో కోలాటాలు, చెక్కభజనలు అలరించాయి. పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం కాకుండా మరో రహదారి గుండా వాహనాలు తరలించారు. శోభాయాత్ర బైటిపేటలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకుంది. విశ్వహిందూ పరిషత్ నాయకులు రావినూతల శశిధర్, ఆచార అభినవ శంకరానందస్వామి, బుగ్గన చంద్రహౌలీశ్వరరెడ్డి, ఎర్రం విష్ణువర్ధన్రెడ్డి, పోలేపల్లి సందీప్, చిలుకూరి శ్రీనివాస్, తులసిరెడ్డి, రామచంద్రారెడ్డి, మేడా మురళీధర్, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి పాములపాడు: వడదెబ్బతో కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విజయానందం సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. అనంతరం మొక్కజొన్న మిషన్ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో త్వరగా ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
కస్తూర్బా టీచర్లకు ‘వాట్సాప్’ బదిలీలు!
జూపాడుబంగ్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు తొలుత జిల్లా ఉన్నతాధికారులు పత్రికా ప్రకటన ఇవ్వాలి. లేదంటే రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల్లో ఇవేమీ జరగలేదు. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నరీతిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో కాంట్రాక్టు బేసిక్ మీద విధులు నిర్వహిస్తున్న ఎస్ఓ(స్పెషల్ ఆఫీసర్)టీచర్లు, పీఈటీలకు పదేళ్ల నుంచి సాధారణ బదిలీలు చేపట్టలేదు. దీంతో వారు తమకు బదిలీలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా వాట్సాప్లో దరఖాస్తులు పంపించింది. వాటిని పూర్తి చేయాలని జిల్లా అధికారులు వాట్సాప్ కాల్ ద్వారా ఉపాధ్యాయులను ఆదేశించారు. ఫోన్ కాల్ చేస్తే రికార్డు చేస్తారేమోననే భయంతో వాట్సాప్ కాల్ చేశారని విమర్శలు వచ్చాయి. రహస్యంగా బదిలీలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 కస్తూర్బాగాంధీ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో ఎస్ఓలతో కలిపి తొమ్మిది మంది చొప్పున 477 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల 2, 3 తేదీల్లో కర్నూల్లోని సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో రహస్యంగా బదిలీలు నిర్వహించారు. వాట్సాప్లో వచ్చిన దరఖాస్తులు పూరించి ఈ బదిలీల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రక్రియ జరిగి పదిరోజులు గడిచినా ఇప్పటిదాకా బదిలీపై వెళ్లిన వారికి ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు మంజూరు చేయలేదు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు జిల్లా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి.. ఎలాంటి పత్రికా ప్రకటన, నోటిఫికేషన్, గైడ్లెన్స్ లేకుండా బదిలీలు చేపట్టి తమకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన కస్తూర్భాగాంధీ పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు చేపట్టిన బదిలీలపై స్టే మంజూరయ్యే అవకాశాలున్నాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇదేమాదిరిగా బదిలీలు చేపట్టడంతో ఆగ్రహించిన ఆ జిల్లా కస్తూర్బా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలపై స్టేను విధించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కస్తూర్భా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్కాల్స్ చేసి విషయం తెలిపిన వైనం వాట్సాప్లో చేరిన దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలోని 53 కస్తూర్బా పాఠశాలల్లో బదిలీలు ఇప్పటిదాకా అందని ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు కోర్టుకు వెళ్లిన ఎస్ఓలు, ఉపాధ్యాయులు -
ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు
● 2025 ఖరీఫ్లో 2,86,622 హెక్టార్లలో పత్తి సాగు ● ఈ సారి సాగు మరింత పెరిగే అవకాశం ● కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా పత్తి విత్తన ప్యాకెట్లు డంప్ ● గుట్టుచప్పుడు కాకుండా హెచ్టీ పత్తి సాగు ● సొంత ధృవీకరణతోనే మార్కెట్లోకి బీటీ పత్తిన ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): 2025 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో పత్తి 2,86,622 హెక్టార్లలో సాగయింది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీటి వసతి కింద ముందస్తు ఖరీఫ్లో పత్తి సాగు చేయడం విశేషం. 2026లో కర్నూలు జిల్లాలో 3 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా అధికం. బీటీ–2 పత్తి విత్తనాల మార్కెటింగ్కు రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే ఉమ్మడి జిల్లాలో జరిగే మార్కెటింగ్ మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు 9 మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఇప్పటికే ప్యాకింగ్ కూడా పూర్తయింది. అయితే జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. తెలంగాణా కేంద్రంగా ఉన్న వందలాది కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాను మార్కెటింగ్కు కల్పతరువుగా వినియోగించుకుంటున్నాయి. గుజరాత్ కంపెనీలతో కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ లైసెన్స్ పేరుతో వందలాది కంపెనీలు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. గుజరాత్ కంపెనీలకు రాయల్టీ చెల్లిస్తూ.. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. నాణ్యత దేవుడికెరుక పత్తి విత్తన నాణ్యతతో వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధృవీకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు, నాలుగేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలతో వేలాది మంది రైతులు నష్టపోయారు. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ కంపెనీలు చేతులెత్తేశాయి. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ పెద్దలు వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. పత్తిలో కలుపు సమస్య అధికం. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలేదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పాటు తర్వాత అనుమతి లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీలు రైతులతో హెచ్టీ పత్తి సాగు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన హెచ్టీ పరీక్షల్లో గ్లైపోసేట్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2500 బీటీ–2 విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేశారు. కర్నూలులోని వివిధ కంపెనీల్లో హెచ్టీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పత్తిలో నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో ఆరు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. కర్నూలు, ఆదోనిల్లో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. విత్తన దుకాణాల్లో ఇంటర్నల్ స్క్వాడ్లతో తనిఖీలు చేయిస్తున్నాం. హెచ్టీ పత్తి సాగును నియంత్రించేందుకు 175 శాంపుల్స్ సేకరించి పరీక్షించాం. కల్లూరులో రెండు, ఆదోనిలో నాలుగు హెచ్టీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
మళ్లీ ‘నీట్’గా రాస్తామో.. లేదో!
నంద్యాల: రాత్రింబవళ్లు కష్టపడి చదివి డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకునేందుకు నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) రాసిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఫలితాల కోసం వేచి చూస్తున్న వేళ నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం జిల్లాలో వేలాది మంది విద్యార్థులపై పిడుగులా పడింది. పేపర్ లీక్ పాపం ఎక్కడో జరిగితే దానికి తామెందుకు శిక్ష అనుభవించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి తమ పిల్లలను డాక్టర్గా చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. నిన్నటి వరకు ఆనందంగా ఉన్న విద్యార్థుల ఇళ్లలో ఇప్పుడు నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. దిక్కుతోచని స్థితి నంద్యాల జిల్లాలో ఈ ఏడాది మే 3న నీట్ నిర్వహించారు. నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, పీఎస్సీ, కెవీఎస్సీ డిగ్రీ కాలేజ్, ఎస్వైవిసీపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బస్టాండ్ సమీపంలోని గవర్నమెంట్ హైస్కూల్లలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 1,434 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన పది రోజుల తర్వాత రాజస్థాన్, మరికొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యిందన్న సమాచారంతో నీట్ను ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ పెడతామని, తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దరఖాస్తు కూడా కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు సంవత్సరాల పాటు కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితి ఉన్నారు. పరీక్ష బాగా రాశామని సంతోషపడే లోపే రద్దు వార్త వినాల్సి రావడం బాధాకరమని విద్యార్థులు వాపోతున్నారు. నీట్ పరీక్ష రాసి మానసికంగా రిలాక్స్ అయ్యాం. ఇప్పుడు మళ్లీ పరీక్ష అంటే ఆ ప్రశ్నపత్రం స్థాయి ఎలా ఉంటుందో? ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో? ఒక వేళ ఇప్పుడు రాసిన పరీక్షకంటే కఠినంగా వస్తే మా ర్యాంకులు దెబ్బతినే అవకాశం ఉంది. –మౌనిక, నీట్ విద్యార్థిని, నంద్యాల పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్టీఏ స్పష్టత ఇవ్వలేదు. రీ ఎగ్జామ్, ఫలితాలు, కౌన్సెలింగ్ ఇవన్నీ జరిగే సరికి విద్యా సంవత్సరం సగం గడిచిపోతుందేమోనని భయంగా ఉంది. ప్రభుత్వం వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించి విద్యాసంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి. పరీక్ష రద్దు చేయడం నిజాయితీగా చదివిన మాకు అన్యాయం జరిగింది. –కె.భరత్, నీట్ విద్యార్థి, నంద్యాల నీట్ రద్దుపై విద్యార్థుల్లో ఆందోళన జిల్లాలో పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,434 మంది -
జిల్లా కలెక్టర్కు గజమాలతో సన్మానం
పాణ్యం: జిల్లా కలెక్టర్ రాజకుమారిని భూపనపాడు గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు సోమవారం గజమాలతో ఘనంగా సత్కరించారు. మహిళలు పసుపు, కుంకుమ, చీర అందజేసి కృతజ్ఞలు తెలిపారు. నంద్యాలలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ముందు మోకాల్లోతులో మురుగునీరు నిల్వ ఉండి రోగాల బారిన పడేవారమన్నారు. జిల్లా కలెక్టర్కు విషయాన్ని తెలపగా గ్రామానికి వచ్చి అన్ని శాఖల అధికారులను కాలనీకి రప్పించి అక్కడే సమస్యకు పరిష్కారం చూపారన్నారు. కాలనీలో డ్రైనేజీ వెళ్లేందుకు రెండు వైపులా కాల్వలు తీసి కొత్త సీసీ రోడ్డు వేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి రూ.65లక్షల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారన్నారు. అధికారులూ.. పనితీరు మెరుగుపర్చుకోవాలి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి శాఖలో నెలకు కనీసం 1.5 శాతం చొప్పున ప్రగతి కనిపించాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఈపీటీఎస్ (ఎలక్ట్రానిక్ పాస్బుక్ ట్రాకింగ్ సిస్టమ్) డాక్యుమెంట్ల అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 20న మెడికల్ షాపుల బంద్ నంద్యాల(వ్యవసాయం): మెడికల్ షాపులను ఈ నెల 20న బంద్ చేయనున్నట్లు నంద్యాల జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి బైసాని రమేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ను, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను ఒక్కరోజు బందుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ముందుగానే తమకు అవసరమైన మందులను కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్టపరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా పోలీస్స్టేషన్ అధికారులకు పంపించామన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించామన్నారు. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి (మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా లో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క ని మిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్ కన్వీనర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. -
అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే!
● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలో ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని అందులో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సున్నిపెంట ప్రభుత్వ గృహాల ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 కింద 2,163 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. జలవనరులశాఖ, గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి తహసీల్దార్ ఇంటింటికి వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. నివాసితులు అందుబాటులో లేనిపక్షంలో గృహాలకు నోటీసులు అంటిస్తున్నారు. ఈనెల 17వ తేదీలోగా తహసీల్దార్ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. సంజాయిషీ సంతిృప్తకరంగా లేకుంటే చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నోటీసులో సూచించారు. అధికారులు జరిపిన సర్వేల ఆధారంగా రికార్డుల్లో 2,260 ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. వీటిలో 82 మంది జలవనరులశాఖ ఉద్యోగులు నివాసం ఉంటుండగా 247 గృహాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ గృహాలు, నివాస యూనిట్టు 428కి పట్టాలు మంజూరు చేయగా వాటిలో నాలుగు పట్టాలు సక్రమమైనవి కావని అధికారులు తేల్చారు. 277 మంది ప్రభుత్వ గృహాలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. -
బాదం పప్పుపై బాల హనుమాన్
నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ చిత్రకారుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం సోమవారం ‘బాదం పప్పుపై బాల హనుమాన్ ‘అనే సూక్ష్మ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అష్టసిద్ధి ప్రదాత, నవ వ్యా కరణ పండితుడు అయిన శ్రీ హనుమంతుని ఆరాధన వల్ల బుద్ధి, బలం, ఆరోగ్యం, యశస్సు, ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయని చిత్రకారుడు తెలిపారు. అర్జునుడు తన రథం పైన హనుమద్ ధ్వజాన్ని స్థాపించడం వల్ల మహాభారత యుద్ధంలో తిరుగులేని విజయాన్ని సాధించారన్నారు. -
ప్రారంభించారు.. వదిలేశారు!
కోసిగి: దాదాపు 45 రోజుల క్రితం ‘ఊరికి రోడేస్తున్నాం’. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఆర్భాటంగా పూజలు చేసి రోడ్డు పనులకు టెంకాయ కొట్టారు. త్వరలో పనులు పూర్తయి రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సంతోషపడ్డారు. అయితే నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు అడుగు కూడా కదలలేదు. తుంబిగనూరు గ్రామ శివారు నుంచి సాతనూరు, అగసనూరు గ్రామాల మీదుగా కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటర్లు సీసీ, బీటీ రోడ్డు పనులు చేసేందుకు రూ.5.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తుంబిగనూరు గ్రామ మధ్యలో 25/6 కిలో మీటరు నుంచి కందుకూరు శివారు 33/4 కిలో మీటరు వరకు ఆర్అండ్బీ కింద నిధులు కేటాయించారు. ఇందులో అగసనూరు, సాతనూరు గ్రామాల్లో 900 మీటర్లు సీసీ రోడ్డుకు రూ.2.5 కోట్లు, మిగిలిన 8.1 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆయా గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి గుంతలు గుంతల మయంగా తయారైంది. ఏళ్ల తరుబడి రోడ్డు వసతి లేక ప్రయాణికులు , వాహనదారులు రోడ్డు పై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి నాయకులు భూమి పూజ చేయడంతో రోడ్డు ఏర్పాటు చేస్తారని సంతోషపడ్డారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు వేస్తారా లేదా కేవలం ఆర్భాటమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్అండ్బీ ఏఈ నరేష్ను వివరణ కోరగా.. తుంబిగనూరు – కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటరుల రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, రోడ్డు అడుగు భాగాన వేసేందుకు గ్రావెల్ లభించడం లేదన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొరత ఉందని, తవ్వకాలకు మైనింగ్ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు. 21 మందికి కారుణ్య నియామకాలు కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. జేసీ నూరుల్ ఖమర్, ఇన్చార్జ్ డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన పాల్గొన్నారు. -
వ్యవసాయానికి గడ్డుకాలం
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి మే నెలలో గాలుల తీవ్రత ఉన్నా.. చినుకు జాడ కరువైంది. ఎల్నినో ప్రభావం మొదలు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2026–27 సంవత్సరంలో ఎల్నినో ప్రభావంతో కరువు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి తొలకరి మొదలవుతుంది. నైరుతి రుతుపవనాలు మే నెల చివరికే విస్తరించాల్సి ఉంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా చురుగ్గా ఉండే అవకాశం లేదు. ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే నీటి వసతి కింద ఉల్లి, పత్తి, వరి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, మిర్చి, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ప్రధాన పంటలు. ఎల్నినో కారణంగా వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొడి వాతావరణం, అధిక వేడి వల్ల కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సోకి పంటలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగు పడిపోయే ప్రమాదం 2025 ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 4,49,858 హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 2,78,204 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సీజన్లోనూ ఇదే స్థాయిలో పంటలు సాగవుతాయి. నంద్యాల జిల్లాలో నీటి ఆధారం పంటలే ఎక్కువ. ఎల్నినో ప్రమాదం వల్ల నంద్యాల జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థకమవుతోంది. ఈసారి సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు పడుతాయా లేదోన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంటలు జూలై చివరి వరకు, మరికొన్ని ప ంటలు ఆగస్టు చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం మేరకు ఆగ స్టు వరకు ఎల్నినో ప్రమాదం ఉండటం వల్ల వివిధ పంటల సాగుకు అవకాశమే లేనట్లు తెలుస్తోంది. నీటి వసతి పంటలు కూడా కష్టమే.. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులు నిండాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. ఎల్నినో ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైనా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నీటి ఆధారిత పంటలు వద్దు.. తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. అంటే ఈ ఖరీఫ్లో నీటి ఆధారం కింద వరి, ఇతర పంటలకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకే రోజు కనీసం 40 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడే పత్తి, ఇతర పంటలు సాగు చేసుకోవాలి. జిల్లాలో ప్రధాన పంట పత్తి అయినందున ఈ పంటలో జొన్న, సజ్జ, ఆముదం వంటి అంతర పంటలు సాగు చేయాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దని రైతులకు చెబుతున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది సాగు చేస్తుంటా. ఈసారి వర్షాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు లేదు. ఉచిత పంటల బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వల్పకాలిక పంటల సాగుకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలి. – ఎంబాయి రామాంజనేయులు, అమీనాబాద్, తుగ్గలి మండలంముంచుకొస్తున్న ఎల్నినో కర్నూలు జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) పత్తి 280086 కంది 68854 ఉల్లి 24810 మిర్చి 17998 వేరుశనగ 44541 నంద్యాల జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) వరి 95031 మొక్కజొన్న 98171 కంది 47691 మినుము 11134 నందికొట్కూరు సమీపంలో పొలంలో పంట వ్యర్థాలను తొలగిస్తున్న కూలీలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల బీమా, ఉచిత పంటల బీమాకు మంగళం పలకడంతో కరువు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎల్నినో ప్రమాదం పొంచి ఉండటం రైతులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మామూలుగా ఈ సమయానికి రైతులు పత్తి, ఉల్లి తదితర విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పత్తి విత్తనాలు కొంటున్నారు తప్ప వర్షాధారం కింద సాగు చేసే రైతులు విత్తన సేకరణకు ఆసక్తి చూపని పరిస్థితి. ఎల్నినో సమయంలో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రత నేలలోని తేమను త్వరగా ఆవిరి చేస్తుందనే ఆందోళన నెలకొంది. -
కరువు శాసనం.. కన్నీటి పయనం!
● ‘ఉపాధి’కి టీడీపీ నాయకుల అడ్డుకట్ట ● వలసబాట పట్టిన జగదుర్తి గ్రామస్తులు డోన్: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమేనని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
అకాల వర్షం .. రైతులకు నష్టం!
బనగానపల్లె రూరల్/కొలిమిగుండ్ల/వెల్దుర్తి: మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం 6 గంటల సమయంలో బనగానపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాలు మోస్తరు వర్షం కురిసింది. గాలీవానకు వరి పైర్లు నేలవాలాయి. ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. అవుకు ప్రాంతంలో వరి పంట కాలం పూర్తి కావడంతో చాలా మంది రైతులు కోత కోసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఈదురు గాలులు, వర్షంతో రైతులు నష్టపోయారు. వెల్దుర్తి మండలంలో ఆదివారం రాత్రి గాలీవాన భీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈదురుగాలులతో పట్టణానికి తాగునీరందించే పథకం రామళ్లకోట రోడ్డులోని పార్వతయ్య బావి వద్ద ఉన్న సంప్పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా సంప్ నుంచి పట్టణానికి సరఫరా చేసే పైప్లైన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్, విద్యుత్ ఏఈఈ వెంకటేశ్వర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి సరఫరాను సోమవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద, మరోచోట రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈదురుగాలులకు గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, ఎల్ నగరం, లక్షుంపల్లె, చెర్లకొత్తూరు, బోగోలు, తదితర ప్రాంతాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి రైతులు నష్టపోయారు. -
ప్రయాణికుల కోసం..
● రూ. 10 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తోలు బొమ్మలాట ప్రదర్శన గడివేముల: ప్రజలకు ఉపయోగపడేలా.. పది కాలా ల పాటు గ్రామంలో గుర్తుండేలా ఓ వ్యక్తి బస్షెల్ట ర్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గని గ్రామంలో రిటైర్ ఉపాధ్యాయుడు వెంకటరమణ, భార్య కళ్యా ణి రూ.10 లక్షలతో వెచ్చించి గ్రామస్తుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సు బ్బమ్మ, చిన్న మల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ను మంగళవారం ప్రారంభిచనున్నారు. కాగా అంతరించి పోతున్న ప్రాచీన కళను ప్రోత్సహించేందుకు తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన ప్రాచీన జానపద కళారూపం. రాత్రి వేళల్లో, తెర వెనుక నుంచి దీపాల వెలుగులో బొమ్మలను ఆడిస్తూ, రామా యణ, మహాభారత వంటి పురాణ కథలను కళాకారులు వినోదాత్మకంగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా ఉన్న ఈ కళారూపం, నేడు సాంకేతికత పెరగడంతో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కొంతమంది కళాకారులు మాత్రమే ఈ కళను బతికించుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం సత్య సాయి జిల్లా లేపాక్షి చెందిన సిండే రామ్మూర్తి గ్రూపు వారు రామాయణం తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై వీక్షించాలని వెంకటరమణ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
ఓర్వకల్లు: జాతీయ రహదారిపై కాల్వబుగ్గ వద్ద సోమవారం రాత్రి హైవే పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కాల్వబుగ్గలో భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయయ్యాడు. సోమవారం సాయంత్రం వ్యక్తితో ఆమె గొడవ పడింది. అతను దాడి చేయగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రోడ్డు దాటుతుండగా హైవే పెట్రోలింగ్కు చెందిన బొలెరో వాహనం మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతిచెందిన మహిళ, ప్రమాదానికి కారణమైన హైవాహనం -
ఉచిత ఇసుక పేరుతో నిల్వ కేంద్రంలో అక్రమాలు
ఆళ్లగడ్డ: ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతూ ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్రమాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక నిల్వ కేంద్రం నుంచి ప్రజలకు ఇసుమంత కూడా ఇవ్వలేదన్నారు. ఒక ధర నిర్ణయించి అమ్ముకుంటూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఆళ్లగడ్డ మార్కెట్యార్డ్లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యాన్ని మద్దతు ధరతో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. తాను గెలిస్తే ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చి రెండేళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని నిలదీశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ కర్నూలు: జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీగా ఉన్న రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
‘పీడీ’స్తున్న సమస్య!
నంద్యాల(న్యూటౌన్): జూనియర్ కాలేజీల్లో క్రీడా శిక్షణకు సరైన వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులు కళాశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది కళాశాలలకు పీడీ పోస్టులను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జారీ చేశారు. వీటిల్లో ప్రస్తుతం ఒక్క కళాశాలకు మాత్రమే పీడీ పోస్టు ఉంది. దీంతో వేలాది మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. జీతాల ఖర్చును తగ్గించుకునేందుకే! జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కళాశాలలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పీడీ గత నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. దీంతో ఆ పోస్టుకు మంగళం పలికారు. విశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పటికీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉన్న పోస్టులను పక్కదారి మళ్లించి జీతాల ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది. వ్యాయామ విద్య అందని ద్రాక్ష ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డిగ్రీ కళాశాలల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడా మైదానాలు ఉన్న జూనియర్ కళాశాలల్లోనే పీడీ పోస్టులు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్ష మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోంది. జూనియర్ కళాశాలల్లో వ్యాయామ విద్యా అధ్యాపకుల పోస్టులకు ఇతర సబ్జెక్టులను మార్పు చేయడం తగదు. ఎంపీఈడీ అర్హతతో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్యోగ పదోన్నతి ద్వారా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. జూనియర్ కళాశాలలో పీడీలను నియమించకపోతే ఆందోళనలు చేస్తాం. – ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం
పాణ్యం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి కర్నూలు పట్టణానికి చెందిన యశ్వంత్, తేజస్విని దంపతులు రూ. 2.64 లక్షలు విరాళంగా అందజేశారు. స్వామివారికి కేజీ వెండి విలువైన డబ్బులను ఏపీజీపీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఈఓ రామకృష్డుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్శర్మ, పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
స్వాభిమానం.. సహస్ర కలశాభిషేకం
● శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ● కలశయాత్రలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు శ్రీశైలంటెంపుల్: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని సోమవారం శ్రీశైల దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో సహస్ర కలశారాధన చేశారు. భక్తులందరూ కలశాలను తలపై ధరించి ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం, నందిగుడి, మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామికి విశేషపూజాదికాలను జరిపి వెయ్యి మంది భక్తులు ఆలయానికి వెళ్లి వృద్ధమల్లికార్జున స్వామివారికి కలశాభిషేకం చేశారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జున స్వామివారికి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం అందించిన పుస్తకాలు, పెన్నులతో శివపంచాక్షరీ నామ లేఖ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే గంగాధర మండపం వద్ద సాయంత్రం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వనపర్తికి చెందిన సత్యంస్వామి, బృందం వారిచే శివభజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్శర్మ వారిచే ఓంకారం ప్రాశస్త్యంపై ప్రవచనం నిర్వహించారు. విజయనగరానికి చెందిన సుప్రియ బృందం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
నందికొట్కూరు: ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం సామేలు(71) పట్టణంలోని వేలాంగిణి మాత తిరునాలకు వచ్చాడు. రాత్రి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఎదురుగా బైకు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున సామేలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐచర్ వాహనం దగ్ధం పత్తికొండ రూరల్: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్ వాహనం సిమెంట్ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్ లోడింగ్ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ సంభవించి ఇంజన్లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది. -
హైకోర్ట్ ఎస్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ మృతి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెనుమాక శివారు వద్ద సీడ్ యాక్సెస్ రోడ్లో సోమవారం స్కూటీపై వెళుతున్న హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ను వెనుక నుంచి అతివేగంగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు (49) హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్న శ్రీనివాసరావు ఉదయం 7 గంటల సమయంలో తన స్కూటీపై సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం రోగానికి మందులు బూడిద
పాములపాడు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన మందులు, సూదులు బూడిదపాలయ్యాయి. మద్దూరు గ్రామంలోని సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది సోమవారం గుట్టుగా విలువైన మందులకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వేల రూపాయల ప్రజా ధనం బూడిదపాలైంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు స్టాక్ లేవు.. బయటకొనుక్కోండి.. అని సలహాలు ఇచ్చే సిబ్బంది విలువైన మందులను ఆసుపత్రి వెనుక కుప్పగా పోసి తగలబెట్టారు. ఆ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాల్సి ఉండగా, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టాక్ ఉన్నప్పుడే రోగులకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవి గడువు ముగిసే వరకు ఎందుకు నిల్వ చేశారు? అనే ప్రశ్నలకు సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
25 ఏళ్ల తర్వాత..!
నందవరం: దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఆ పాఠశాలలో ఆనందాలు విరబూశాయి. స్థానిక నాగలదిన్నె జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. స్థానిక పాఠశాలలో 2000–2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పాతికేళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నా రు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరునొకరు పిలుచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమంలో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన గురువులు షాజహాన్, నరసింహులు, రంగస్వామి, ఉస్సేన్ తదితర ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. -
శ్రీగిరిలో వేసవి రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్రంలో వేసవి రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్ర పురవీధుల్లో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు. -
వామ్మో.. వంతెన
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందరవాగుపై ఏర్పాటు చేసిన వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిటీష్కాలంలో 1932లో వాగుపై ఇరుకై న వంతెన ఏర్పాటు చేశారు. వంతెన నిర్మించి 94 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఏర్పాటు చేసిన కడ్డీలు ఒకవైపు వంగిపోవడంతోపాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనకు సైడ్వాల్స్ లేకపోవడంతో గతంలో వాహనాలు వాగులో పడి ప్రయాణికులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై ప్రయాణసమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా వాహనాలు వాగులోపడి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు దెబ్బతిన్న వంతెన స్థానంతో కొత్తగా వంతెన ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
విముక్తి కల్పించండి
నానాటికి పెరుగుతున్న పట్టణ జనాభా, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో రైల్వే గేట్లు పడటంతో గంటల పాటు అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ చిక్కుముడిని శాశ్వతంగా ఎప్పుడు పరిష్కరిస్తారని వేచిచూస్తున్నాం. – బాలతిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, ధర్మవరం మూడు ప్రధాన రైల్వే గేట్ల మధ్య ఉన్న పాతపేట టీడీపీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మాజీ మంత్రి బుగ్గన చొరవతో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడినా కూటమి ప్రభుత్వంలో పనులు సాగడం లేదు. ఇది ముమ్మాటికీ టీడీపీ పాలకుల వైఫల్యమే. – ఆర్ఈ రాజవర్దన్, స్థానికుడు, పాతపేట అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన చేయడం మూలంగా ప్రజల విలువైన సమయం, డబ్బు వృథా అవుతోంది. ట్రాఫిక్లో ఒక్కసారి వాహనం చిక్కుకుంటే బయటపడేందుకు గంటల సమయం పడుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్యను టీడీపీ పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. అభివృద్ధిని అడ్డుకునే వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. – బాషా, ఆటోడ్రైవర్, డోన్ -
బాలుడి అదృశ్యంపై ‘సిట్’ విచారణ
కౌతాళం: బాలుడి అదృశ్యంపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణ చేపట్టింది. ఇందుకోసం సిట్ సభ్యులు ఆదివారం బదినేహాల్ గ్రామానికి వెళ్లారు. పొలానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లి బాలుడు మాల రవీంద్ర (17) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 2024 నవంబర్ 13న కౌతాళం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన కుమారుడి మిస్సింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేదని రవీంద్ర తల్లి మాల గంగమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 13 మంది అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు ఆదివారం బదినేహాల్కు వచ్చి గంగమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అలాగే తుంగభద్ర దిగువ కాలువ వద్దకు కూడా వెళ్లి విచారణ చేపట్టారు. -
అందరిపై ఆరోగ్యమాత కరుణ
నందికొట్కూరు: ఆరోగ్యమాత కరుణ అందరిపై ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్సీఎం చర్చి మేత్రాసన బిషప్ గోరంట్ల జ్వానేష్ అన్నారు. ఆదివారం పట్టణంలో వేలంగణి మాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి, పురవీధుల వెంట మేరీమాత విగ్రహాన్ని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా మేరీమాత ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేరీమాత వద్ద జ్యోతులు వెలిగించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. జిల్లా వాసులకు నాగపట్నం తరహాలో మేరీమాతను నందికొట్కూరులో ప్రతిష్టించడం విశేషమన్నారు. ఉత్సవాల్లో ఫాదర్ కేడీ జోసెఫ్, సహాయక ఫాదర్ బాల ఏసు తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. -
మిత్రుడి మరణం తట్టుకోలేక..
ఉరేసుకుని ఆత్మహత్యబేతంచెర్ల: ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన బేతంచెర్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన యువకులు షేక్షావలి, ట్రాక్టర్ డ్రైవర్ కొడిగంటి చిన్న స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరు కలసిమెలసి ఉండేవారు. షేక్షావలి శనివారం రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మిత్రుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి చెందిన డ్రైవర్ చిన్న (25) అనురాధ థియేటర్ సమీపంలోని తన ఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య చిలకమ్మతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
దేవస్థానం అధికారిక వైబ్సైట్ను వినియోగించాలి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులను ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్సైట్ www.aptemples.ap.gov.in, దేవస్థానం అధికారిక వెబ్సైట్ www. srisaila devasthanam. org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. -
ఆరోగ్యంపై రంగు పడుద్ది!
వాటిని చూడగానే నోరూరిస్తున్నాయని ఆబగా తింటున్నారా...అయితే కాస్త ఆగండి. మీరు తినే రంగులు కలిపిన ఆహార పదార్థాలలో పరిమితికి మించి, నిషేధిత సింథటిక్ కలిపి ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు జీర్ణకోశవ్యాధులు, భవిష్యత్లో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. లాభాపేక్ష కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ● ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రంగుల వినియోగం ● నిషేధిత రంగులూ యథేచ్ఛగా వాడుతున్న వ్యాపారులు ● హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో అధికం ● జీర్ణకోశవ్యాధులు, క్యాన్సర్కు అవకాశం ● దాడులు చేస్తున్నా మారని వైనం కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడ్ తోపుడు బండ్లు, టీ దుకాణాలు, మొబైల్ క్యాంటీన్లు, డాబాలు, చాట్బాండార్, నూడుల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 15 వేలకు పైగా ఉంటాయి. కర్నూలు నగరంలో మాత్రమే 4 వేల దాకా హోటల్స్, దుకాణాలు, రోడ్డుసైడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయా వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా వీటిలో జీఎస్టి చెల్లించేది కేవలం 5 శాతంలోపు వ్యాపారులే ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, జంక్ఫుడ్ కేంద్రాలు, కూల్డ్రింక్స్ దుకాణాలలో పరిమితికి మించి ప్రాణాంతక బుష్పౌడర్ అనే సింథటిక్ కలర్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక కిలో ఆహార పదార్థానికి 0.001మి.గ్రా వాడాలి. అయితే వ్యాపారులు వారు విక్రయించే ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న ఉద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా ఫుడ్కలర్ వాడుతున్నారు. ఇలా పరిమితికి మించి వాడితే ఆ పదార్థాలను తిన్న వారికి జీర్ణకోశవ్యాధులు, కాలేయ వ్యాధులు, కడుపులో అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ రంగులను ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా, కచోరి, కట్లెట్, రెస్టారెంట్లలో బిర్యానీలు, గ్రేవీ ఐటమ్స్, పలు రకాల ఫ్రై ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు, కేక్లు, కూల్డ్రింక్లలో ఎక్కువగా వాడుతున్నారు. లెక్కచేయని వ్యాపారులు ఆహార భద్రత అధికారులు ఇటీవల కాలంలో కల్తీ పదార్థాలు, నిషేధిత రంగులు కలిపిన పదార్థాలను విక్రయించే వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా వారు ఆహార పదార్థాల్లో నిషేధిత సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరైనా దాడులు చేస్తే వెంటనే వ్యాపారులు వారికి పరిచయం ఉన్న వారితో ప్రజాప్రతినిధులతో అధికారులకు ఫోన్ చేయించి ‘మా వాడే వదిలేయండి’ అని చెప్పిస్తున్నారు. నూటికి 70 శాతం మంది ఇలాగే చేస్తుండగా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలోని పలువురు వ్యాపారులస్తులపై దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయినా కూడా ఇతర వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది. రంగులు కలిపిన బెల్లంరంగులు కలిపిన బఠానీలురంగులు కలిపిన కివీ డ్రై ఫ్రూట్ ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీమంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్లో ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్డ్రింక్స్లోనూ పరిమితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నాం. – కూర్మా నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఉమ్మడి కర్నూలు జిల్లా -
అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి
కర్నూలు(సెంట్రల్): అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్కుమార్, ఈడుపుగంటి మోహన్రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్గా శివప్రసాద్ ఎన్నికయ్యారు. -
అల్లా మార్గంలో నడవాలి
రుద్రవరం: ముస్లింలు అల్లా మార్గంలో నడవాలని మత పెద్దలు అన్నారు. రుద్రవరంలో ఆదివారం ఇస్తెమా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఐదు మార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి రోజు నమాజ్ చేయాలని, అలాగే సంపాదనలో జకాత్ తీసి పేదలకు పంచాలని చెప్పారు. శాంతి మార్గంలో నడుస్తూ అందరితో మంచిగా మెలగాలని వివరించారు. ఇస్తెమాకు వచ్చిన వారికి స్థానిక ముస్లింలు తగిన వసతులు కల్పించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహాయంతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. గడ్డి వాము, ట్రాక్టర్ దగ్ధం బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి దగడ సురేంద్రనాథ్ రెడ్డి గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోగా , పక్కన్న ఉన్న ట్రాక్టర్ ఇంజన్కు సైతం మంటలు వ్యాపించి దగ్ధమైంది. సుమారు గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమై రూ.6.50 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో గడ్డివాము దగ్ధం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామ సీపీఐ నాయకులు శ్రీరాములు, సోమన్న, నాగేశ్వరరావు, చంద్రమోహన్ డిమాండు చేశారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు (టౌన్): కర్నూలు – గుంటూరు రహదారిలో నందనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆదివారం వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కుంభకోణం కాఫీ హోటల్ దగ్గరలో గార్గేయపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కంకర మిక్చర్ వాహనం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్ఓ ఖాజామియ్య కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆనవాళ్లు సేకరించారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. వివరాలు తెలిస్తే 91211 01063 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా ● ప్రాణభయంతో కిందకు దూకి మృతి చెందిన క్లీనర్ మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో అదుపు తప్పిన లారీ కొండచరియను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. ఒంగోలు నుంచి బళ్లారికి ఐరన్ షీట్లతో వెళ్తున్న లారీ పాత బొగద దొరబావి వంతెన మలుపు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండ చరియను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో డ్రైవర్తో పాటు ఉన్న క్లీనర్ ప్రసాద్ ప్రాణభయంతో కిందికి దూకడంతో తలకు దెబ్బలు తగిలి మృతి చెందాడు. లారీ వెనుకే వస్తున్న ఓ స్కార్పియో వాహన దారులు అప్రమత్తమై వెనుకకు వెళ్తుండగా లారీ వెనుక భాగం నుంచి ఐరన్ షీట్లు పడటంతో వాహనం ముందు భాగం దెబ్బతినింది. సుమారు మూడు గంటలకు పైగా వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రోడ్సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రోడ్డుపై బోల్తాపడిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. క్లీనర్ ప్రసాద్ విజయవాడ నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి, మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. -
‘బండ’డు కష్టాలు
ఇండియన్ గ్యాస్ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆదివారం ఆస్పరిలో బస్టాండ్ దగ్గర సిలిండర్లును క్యూలో పెట్టి ఉంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గరకు గ్యాస్ సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆస్పరిలో మాత్రం జరగడం లేదని వినియోగదారులు అవేదన చెందుతున్నారు. ఆదివారం 250 మంది గ్యాస్ కోసం సిలిండర్లు క్యూలో పెట్టి వేచి ఉండగా గ్యాస్ ఏజెన్సీవారు 80 మందికి మాత్రమే ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు. –ఆస్పరి -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
పాణ్యంలో ఆరబెట్టిన మొక్కజొన్నలో నీటిని తోడుతున్న రైతులునెరవాడ మెట్ట వద్ద ధాన్యంపై పట్టలు కప్పడంతో నిలిచిన వర్షపునీరుపాణ్యం: మద్దతు ధర లేక కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షంతో నీటిపాలైంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పాణ్యం, నెరవాడ, బలపనూరు, కొండజూటూరు, భూపనపాడు, కొణిదేడు గ్రామాల్లో వర్షం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోసుకోగా అకాల వర్షం కురియడంతో మొత్తం నీట తడిసి పోయింది. వర్షం తగ్గిన తర్వాత రైతులు వర్షపునీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాణ్యంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్లలో వర్షపునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నెరవాడ మెట్ట వద్ద సర్వీసు రోడ్లపై వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకోగా దిగుబడులు మొత్తం నీట తడిసి పోయాయి. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 11వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు బాషా ప్రాముఖ్యతను వివరించండి నంద్యాల(వ్యవసాయం): తెలుగు బాషా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని 2026 ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి అన్నారు. విద్యార్థులలో తెలుగుపై మక్కువ పెంచడం ఎల్ఙా అనే అంశంపై ఆదివారం ఓ ప్రైవేటు కళాశాలలో చర్చా గోష్టి నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, తెలుగు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో తెలుగు వాతావరణాన్ని సృష్టించాలన్నారు. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలన్నారు. సోషల్ మీడియాలో తెలుగుకు ప్రాధాన్యం ఉండాలని, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించాలని, విద్యాలయాల్లో తెలుగు పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో ప్రతినెల సాహితీ సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, రచయి మాబు బాషా, అధ్యాపకులు కొప్పుల ప్రసాదు, మురళీధరరెడ్డి, ప్రసాద్, మహామ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు. మీరాపురం వాసి ఐఎఫ్ఎస్కు ఎంపిక బనగానపల్లె రూరల్: మీరాపురం గ్రామానికి చెందిన బండి ఉమామహేశ్వరరెడ్డి, వందన దంపతుల కుమారుడు బండి జయఅశ్వర్థరెడ్డి ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. తండ్రి ఉమామహేశ్వరరెడ్డి ప్రస్తుతం విజయవాడలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. జయఅశ్వర్థరెడ్డి విద్యాభ్యాసం బనగానపల్లె, కర్నూలులో, ఇంటర్, బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) హైదరాబాద్లో పూర్తి చేశారన్నారు. అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతూ గత సంవత్సరం జరిగిన యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా జయఅశ్వర్థరెడ్డి ఇండియన్ ఫారెస్టు సర్వీస్కు ఎంపికై నట్లు కుటుంబీకులు తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,200 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు.


