breaking news
Nandyal District News
-
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
● వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభంనంద్యాల(న్యూటౌన్): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఎంఎంఏసీ) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆయా కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లాలో 39 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీలో అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు వారి పరిశీలనకు హెల్పలైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29వ తేదీ అవకాశం ఉంటుంది. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకొనే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలలో తరగతి విద్యాబోధన అన్ని కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్లు ఉన్నాయి. –డాక్టర్ శశికళ, ప్రిన్సిపాల్, నంద్యాల -
శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్డ్రిల్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ బృందం మాక్డ్రిల్ నిర్వహించింది. ముందుగా డ్యాం పరిసర ప్రాంతాలను, తర్వాత కుడి, ఎడమగట్టు ప్రధాన ద్వారాలు, గ్యాలరీ, క్రస్ట్గేట్ల బ్రిడ్జి తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం డ్యాం వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తి, డ్యాం ఈఈ వేణుగోపాల్రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్పీఎఫ్ ఆర్ఐ రాజేష్, హెల్త్ విభాగం, ఫైర్ విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం డ్యాం గురించిన విషయాలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఆక్టోపస్ బృందం డ్యాం, వ్యూ పాయింట్, డ్యాం పరిసర ప్రాంతాల వద్ద ఉగ్రవాదులు అనుకోని విధంగా దాడులకు ప్రయత్నిస్తే ఏవిధంగా దాడులను తిప్పికొట్టాలనే విషయాలపై మాక్డ్రిల్ నిర్వహించింది. -
నాడు 85.. నేడు 40లోపు శాతం
ఈమె పేరు పద్మావతి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారపేటలో నివాసం. జనవరి 1, 2011న సదరం క్యాంపునకు హాజరైంది. అప్పటి ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించి 85 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఏడాది మార్చి 6న రీ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే వికలత్వం 40 శాతంలోపే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తే ఈ ప్రక్రియ ఎంత గందరగోళంగా సాగుతుందో అర్థమవుతోంది. పోలియోతో ఒక కాలు పనిచేయని ఈమె వైకల్యం ఎలా తగ్గుతుందో వైద్యులకే తెలియాలి. -
సీఎం అండతోనే బుడ్డా బరితెగింపు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అండతో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి బరితెగించి అధికారులు, ప్రజలను వేధిస్తున్నాడని మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా పాల్గొన్నారు. సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి విధుల్లో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని కిడ్నాప్ చేసి దాడి చేయటం దారుణమన్నారు. అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి తప్ప తాగి శ్రీశైల శిఖరం చెక్పోస్ట్లో విధుల్లో ఉన్న చెంచు కులానికి చెందిన గురువయ్య, గిరిజన కులానికి చెందిన రాములు నాయక్, మైనార్టీ వర్గానికి చెందిన కరిముల్లాను దుర్భాషలాడరన్నారు. అటవీ ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకుని రాత్రంతా శ్రీశైలం మొత్తం కారులో తిప్పి కులం పేరుతో దుర్భాషలాడి మంత్రి గొట్టిపాటి రవికి చెందిన గెస్ట్హౌస్లో బంధించి దాడి చేయడం ఆటవిక చర్యఅన్నారు. ఇంత జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికల్లో ఎమ్మెల్యే తీరుపై సీరియస్.. ప్రచారం చేసుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంత సీరియస్గా సీఎం చర్యలు తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్యేపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయ త్నం కేసులు నమోదు చేయించాలి కానీ అన్నీ చిన్నపాటి సెక్షన్లు మాత్రమే నమోదు చేయించడం దేనికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ధర్మాన్ని కాపాడాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులు హత్యకు గురయ్యారన్నారు. ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యేను బూతు రాజా, వసూల్ రాజాగా పిలుస్తున్నారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. శ్రీశైలం ఆలయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రెడ్బుక్ పాలనకు ఇదే నిదర్శనం.. రెడ్బుక్ పాలనలో టీడీపీ నేతల మాట వినని అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే బుడ్డా చేసిన దాడినే నిదర్శనమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సోదరుడు ఒక ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేస్తే తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారని గుర్తు చేశారు. కనీసం మంత్రి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడుతున్నారంటే ఇది ఎటువంటి ప్రభుత్వమో ప్రజలే తేల్చాలన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఫారెస్ట్ అధికారులను కిడ్నాప్ చేసి దుర్భాషలాడినా ఆయనపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించి జైలుకు పంపి వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారు రాష్ట్రంలో టీడీపీ నేతలు సుపరిపాలన అంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాట వినని వారిని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్యెల్యే అర్ధరాత్రి అటవీ సిబ్బందిని కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేయడం దారుణమన్నారు. అటవీ సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన ఎమ్మెల్యేనే కిడ్నాప్ చేసి వేధించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీడీపీ నేతల అరాచకాలను ప్రజలే అడ్డుకుంటారన్నారు. అధికారులకే రక్షణ లేదు..కూటమి ప్రభుత్వంలో ప్రజలతో పాటు అధికారులు, పోలీసులకు కూడా రక్షణ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో నాయకులు చెప్పిన మాట వినని వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్నా నలుగురు అటవీ ఉద్యోగులను తన కారులో కిడ్నాప్ చేసి కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఎమ్మెల్యేనే వారిని కారులో తీసుకెళ్లి గెస్ట్హౌస్లో బంధించటం సరైంది కాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ ద షిప్ అంటూ డైలాగ్లు చెప్పడం కాదని, రేషన్ దందా నడుపుతున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు పుష్కలంగా ఎరువులు సరఫరా చేశారని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కనీసం రైతుకు యూరియా బస్తా దొరకని పరిస్థతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అందిస్తామని నమ్మించిన చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోరా? గెస్ట్హౌస్లో బంధించి, కులం పేరుతో దూషిస్తే తూతూ మంత్రంగా కేసు నమోదా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని వైభవంగా ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించింది. ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించిన వ్రతాలకు చెంచు ముత్తైదువులను ప్రత్యేకంగా ఆహ్వనించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని దాదాపు 90గూడేలకు చెందిన సుమారు 650మంది చెంచు ముత్తైదువులు, 950 మందికి పైగా ఇతర భక్తులు వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.వెంకట శివప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఆలయ సహా య కార్యనిర్వహణాధికారి హరిదాసు పర్యవేక్షించారు. వత్రంలో పాల్గొన్న భక్తులకు వస్త్రం, పూలు, గాజులు, కై లాస కంకణాలు, వృక్షప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, శ్రీశైలప్రభ మాసపత్రిక అందజేశారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో చివరి సోమ, గురువారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలకు శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,08,04,708 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. వెండి 22.500 కేజీలు, బంగారం 1.950 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. మద్యం మత్తులో అర్చకుల గొడవ మహానంది: మద్యం మత్తులో మహానంది దేవస్థానానికి చెందిన ఇద్దరు అర్చకులు గొడవకు పాల్పడిన సంఘటన సోషల్ మీడియాలో రావడంతో చర్చనీయాంశమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అర్చకుల మధ్య గొడవ చోటు చేసుకోగా ఓ అర్చకుడు మరో అర్చకుడిని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
నంద్యాల: గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలపవచ్చన్నారు. విధినిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి గోస్పాడు: ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి అన్నారు. నంద్యాల పట్టణంలోని తేజస్వి హోటల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు హనుమ న్న, జయరాముడు ఆధ్వర్యంలో నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకే విక్రయించాలన్నారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొనుగోలు, అమ్మకాలపై దుకాణ యజమానులు రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, మెడికల్ ఏజెన్సీల సంఘం నాయకులు బొబ్బిటి దామోదర్ రెడ్డి, మెడికల్ షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల ● 24 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ మెరిట్ జాబితాలను శుక్రవారం విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 53,733 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణ గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజులపాటు నిర్వహించడంతో అభ్యర్థులకు అనేక అనుమానాలు తలెత్తి ఆందోళనతో నెల రోజులుగా తృతీయ ఫలితాలకు మెరిట్ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానాలు కల్పించుకొని డీఎస్సీ మెరిట్ జాబితాలపై ఇచ్చిన ఆదేశాల మేరకు మెరిట్ జాబితాలను విడుదల చేసింది. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు ఒక్కో పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసి మొదటగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అభ్యర్థులు మెరిట్ జాబితా విడుదల చేయకుండా సర్టిఫికెట్ల పరిచశీన ఎలా చేస్తారో అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల కోర్టు తీర్పుతో ఎట్టకేలకు మెరిట్ జాబితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 24 నుంచి టీచర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు జిల్లాలో మూడు కేంద్రాలను ఎంపిక చేశారు. రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బీఈడి కాలేజీ, రాఘవేంద్ర బీఈడి కాలేజీల్లో సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు 60 కమిటీలను ఏర్పాటు చేశారు. -
నాలుగో విడత 508 సెల్ఫోన్ల రికవరీ
నంద్యాల: జిల్లాలో నాలుగో విడత మొబైల్ రికవరీలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత 2023 ఏప్రిల్లో రూ.1.52 కోట్ల విలువ చేసే 847 సెల్ ఫోన్లు, రెండో విడత 2023 అక్టోబర్లో రూ. 86.57 లక్షల విలువ చేసే 510, మూడవ విడత 2024లో రూ.2.43 కోట్ల విలువ చేసే 1,066 సెల్ ఫోన్లు, నాలుగో విడతలో రూ.83.82 లక్షల విలువ చేసే 508 సెల్ఫోన్లు రికవరీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వరూ 5.68 కోట్లు విలువ చేసే 2,934 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల నుంచి రికవరీ చేశామన్నారు. -
ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేదు
మేం రాయలసీమ విత్తన సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి చిరుధాన్యాల సాగును ప్రత్యేకంగా చేపట్టాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. 2023–24 వరకు చిరుధాన్యాలను విదేశాలకు ఎగుమతులకు అవకాశం ఉండేది. మేం ప్రతి నెలా 2–4 క్వింటాళ్ల వరకు విదేశాలకు ఎగుమతి చేశాం. అయితే 2024–25 నుంచి విదేశాలకు ఒక్క కిలో కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేవు. ఇప్పటికై న రాయితీలు ఇవ్వాలి. – వేణుబాబు, మిల్లెట్ రైతు, కర్నూలుఈ ఏడాది కొర్రసాగుపై రైతులు ఆసక్తి చూపలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొర్ర సాగు తగ్గింది. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కొర్ర విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టినప్పటికీ తీసుకునేందుకు ముందుకు రాలేదు. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
నీటి కుంటలో మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వా లని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి బుధవారం రాత్రి చిగిళి గ్రామానికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించా రు. విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే గ్రామానికి చెందిన, ఒకే తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే చోటకు చేరి మృతిచెందడం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు ము న్ముందు జరగరాదన్నారు. బాధిత కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఒక్కో విద్యార్థి కుంటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. -
యూరియా అక్రమ రవాణా చేస్తే చర్యలు
● రెతులకు ఇచ్చే రాయితీ యూరియా పరిశ్రమలకు వాడరాదు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల: జిల్లాకు మంజూరైన రాయి తీ యూరియా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో యూరియా అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, పోలీస్, సివిల్ సప్లై, ఇండస్ట్రీస్, విజిలెనన్స్, పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల సాగు విస్తీర్ణం మేరకు రాయితీ యూరియా జిల్లాకే మంజూరవుతుందన్నారు. జిల్లాలో రైతులకిచ్చే రాయితీ యూరియాను కొందరు దారి మళ్లించి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని యూరియా అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. పట్టణంలో రాయితీ యూరియాను వివిధ రకాల పరిశ్రమలైన పౌల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్, ఆల్కహాల్, ఫ్లై వుడ్ ఇండస్ట్రీస్, ప్లేట్, వస్త్ర పరిశ్రమ, సోప్స్ తయారీ వంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. రైతులకు ఇచ్చే రాయితీ యూరియా పంట పొలాలకు మాత్రమే వాడాలని, ఇతర అవసరాలకు ఉపయోగించడం నేరమన్నారు. యూరియా అక్రమ రవాణా నివారణకు సంబంధించి మండల స్థాయిలో ఒక టీం వేసి తనిఖీ చేసి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా యూరియా కొరత తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. -
చిన్నారులకు కన్నీటి వీడ్కోలు
● చిగిళిలో మిన్నంటిన రోదనలు ● ముగిసిన విద్యార్థుల అంత్యక్రియలు ● ఆలూరు రూరల్/ఆస్పరి: ఆడుతూ పాడుతూ అందరినీ నవ్వించే విద్యార్థులు ఆకస్మికంగా మృతి చెందడం.. వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో చిగిళి గ్రామంలో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లతోనే చిన్నారులకు తుది వీడ్కోలు పలికారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంత్యక్రియల్లో అందరూ పాల్గొన్నారు. విద్యార్థుల మృతదేహాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మౌనం పాటించారు. విషాద ఛాయలు చిగిళి గ్రామ చరిత్రలో ఎన్నుడూ లేని విధంగా బుధవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వినయ్, గొల్ల భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం ఎర్రకొండ వద్ద ఉన్న గరుసు కుంటకు వెళ్లారు. దుర్గా ప్రసాద్ తప్ప మిగతా అందరూ ఈతకు కుంటలో దిగి నీటిలో మునిగి మృతిచెందారు. దుర్గా ప్రసాద్ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతిచెండంతో గ్రామం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. గురువారం రోజు గ్రామస్తులంతా తమ పనులకు సెలవు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి దహన సంస్కారాలకు హాజరయ్యారు. మహిళలు రోదనలతో గ్రామం దద్దరిల్లింది. విద్యార్థుల మృతితో గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ గ్రామానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు నివాళులర్పించారు. పత్తికొండ డీఎస్పీ వెంటకరామయ్య రాత్రి గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్, తిరుమల రావు, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం రంగప్ప.. పాఠశాలలో ఐదు నిమిషాలు మౌనం పాటించి విద్యార్థులకు సంతాపాన్ని తెలియజేశారు. కుంటలో విద్యార్థులు మృతిచెందడంపై అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. -
సార్.. మా పింఛన్లు పునరుద్ధరించండి
కొలిమిగుండ్ల: ప్రభుత్వం తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. గురువారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వరగౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నామని, కూటమి ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా తమ పేర్లను తొలగించిందని మండిపడ్డారు. పర్మినెంట్ సదరం సర్టిఫికెట్లు ఉన్నా రీవెరిఫికేషన్కు అంటూ వైకల్య శాతం తక్కువ చూపడం పేదలను మోసం చేయడమే నన్నారు. యథావిధిగా వచ్చే నెల 1వ తేదీ పింఛన్ సొమ్ము అందించాలని డిమాండ్ చేశారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి శిరివెళ్ల: విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈఓ జనార్దనరెడ్డి అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, వంట గదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నా కొందరు విద్యార్థులు ఎందుకు తినడం లేదని, వారి జాబితా తయారు చేసి తల్లిదండ్రులతో మాట్లాడాలని హెచ్ఎం గోవిందరాజును ఆదేశించారు. స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ప్రతి పాదనలు పంపాలని హెచ్ఎం తేజోవతమ్మను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఈఓ శంకరప్రసాదు, సీఆర్పీ అన్సర్ ఉన్నారు. ఆత్మకూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆత్మకూరు ఏడీఏ హేమలత అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నిపుణులు అశోక్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త పుల్లీబాయ్, సీనియర్ శాస్త్రవేత్త నజీరుద్దీన్తో కలసి గురువారం ఆమె నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలకు మొక్కజొన్న, పత్తి, మెట్ట వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటలలో నిలిచిన నీటిని తొలగించిన అనంతరం హెక్టారుకు పది కిలోల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ఐదు కేజీల చొప్పున లేదా 19.19.19 స్పేర్ రూపంలో నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల పంటను తేమ, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చన్నారు. -
సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో, ఆదే విధంగా దిగువ ప్రాజెక్ట్లకు నీటిని విడుదల చేస్తున్నారు. తెరచి ఉంచిన 10 రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి 4,20,370 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుండి శ్రీశైలంకు 4,68,273 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 4,99,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రస్ట్గేట్ల ద్వారా 3,97,962 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 68,831 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. -
సాగు భూముల్లో సోలార్ పనులు ఎలా చేస్తారు
నందికొట్కూరు: సాగు భూముల్లో సోలార్ పనులు అడ్డుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామ పొలిమేరలో జరుగుతున్న సోలార్ పనులపై రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. తమ పంట పొలాలను కాపాడాలని తహసీల్దార్ కాళ్లపై పడి రైతన్నలు వేడుకున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రహదారులు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేసినా ఎందుకు స్పందించడం లేదని తహసీల్దార్ను రైతులు నాగేశ్వరరావు, జగన్మోహన్రెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, స్వామన్న, శివమూర్తి, మాలిక్బాషా ప్రశ్నించారు. సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే గ్రామాన్నే వదిలేస్తామన్నారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్ఐ ఓబులేసు, మండల సర్వేయర్ కృష్ణుడు, తదితరులు ఉన్నారు. -
ఇంకెప్పుడు న్యాయం చేస్తారు?
కోవెలకుంట్ల: ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న సుగాలి ప్రీతి కుంటుంబానికి ఇంకెప్పుడు న్యాయం చేస్తారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూటమి సర్కారును ప్రశ్నించారు. 2017లో ఒక ప్రైవేట్ రెసిడెన్సియల్ పాఠశాలలో హత్యకు గురైన సుగాలి ప్రీతి కేసులోని దోషుల్ని శిక్షించాలని ఆ బాలిక తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘14 ఏళ్ల బిడ్డ ప్రీతి స్కూల్కెళితే 10 మంది కలిసి నాశనం చేస్తే ఎవరూ పట్టించుకోలేదని, సగటు మనిషికి కష్టమొస్తే తనకు ఏడుపొస్తోంది’ అని అప్పట్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ ఏవేవో మాటలు చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసును స్వీకరిస్తామని పవన్ గొప్పలు చెప్పారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా ఆ కేసు విషయం అతీగతి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ప్రీతి తల్లి పార్వతీదేవి విజయవాడకు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కలిసిందన్నారు. హోమంత్రి అనితను కలవాలని ఉచిత సలహా ఇవ్వగా హోమంత్రితోపాటు మరో మంత్రి నాదేండ్ల మనోహర్ను కలిసినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మరోవైపు ప్రీతి తల్లి అంగవైకల్యంతో బాధపడుతూ తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కారు సుగాలి ప్రీతి కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా సుగాలి ప్రీతి కుటుంబం పోరాటం వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వెలుగోడు: యూరియా కోసం రైతులు రోడ్డెక్కా రు. వెలుగోడు మండల కేంద్రంలో ఆత్మకూరు– నంద్యాల ప్రధాన రహదారిలో రైతులు బైఠాయించి రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆకలి దప్పులు మానుకొని రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదన్నారు. వరినాట్లు వేసి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా యూరియా వేయలేదని, ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నా ..యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని పలువురు హెచ్చరించారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీల గ్రామాల వివరాలు సేకరించి అక్కడ జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించి దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసుకోకుండా చూడాలన్నారు. జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, డీఎస్పీలు, డీవీఎంసీ సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలి
నంద్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వారి వారి పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేర పరిశోధన, న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. రాబో యే వినాయక చవితి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నిఘా పెంచాలన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పాత నేరస్తులను బైండోవర్ చేయాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీ, పీస్ కమిటీతో సమావేశాలు నిర్వహించి శాంతియుత వాతావరణం కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల సమాచారం తప్పక ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పా టు చేయాలన్నారు. అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీలు ప్రమోద్ కుమార్, రామంజి నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ ఆలయాల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణ రూ.4,51,62,522 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం చంద్రవతి కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. బంగారం 164.500 గ్రాములు, వెండి 5.840 కిలోలు లభించాయి. అలాగే యూఎస్ఏ డాలర్లు 598, న్యూజిలాండ్ డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 100, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, ఈరోస్ 100, ఓమన్ బైసా 300, కెనడా డాలర్లు 20, కువైట్ దినార్ 1, సౌదీ అరేబియా రియాల్ 115, కత్తార్ రియాల్స్ 102 మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించినట్లు ఈఓ పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
పదోన్నతులకు గ్రహణం
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతి ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో రెండు జిల్లాల పరిధిలో 469 మంది గ్రేడు–2 వీఆర్వోలను నియమించారు. వీరికి 2023 ఆఖరిలోనే గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని అప్పటి ప్రభుత్వం యోచించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2023 ఏప్రిల్ 3వ తేదీన పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 2024 ఆక్టోబర్ 10వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చాయి. మే 9న తుది జాబితా పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు రెండు నెలలు, తుది జాబితా తయారీకి మరో నెల సమయం పట్టింది. మొత్తంగా 2025 జనవరి ఏడో తేదీ నాటికి పదోన్నతులకు అర్హత ఉన్న జాబితాను తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం 150 ఖాళీలకు రోస్టర్ రూపొందించడానికి మార్చి 25వ తేదీ వరకు సమయం పట్టగా...దానిపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు విధించారు. అయితే తరువాత ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆలస్యం చేయడంతో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు రావడంతో దాని ప్రకారం రోస్టర్ తయారు చేయడానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం తీసుకుని మే 9వ తే దీన పూర్తి స్థాయి తుది జాబితాను రూపొందించారు. అధికారుల అలసత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అలసత్వంతోనే గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆశావాహక ఉద్యోగులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ఆగస్టులో ఆదేశాలు ఇచ్చినా రోస్టర్తో కూడిన అర్హుల జాబితాను తయారు చేయడానికి 8 నెలలు తీసుకోవడం..అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ రావడంతో ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 19వ తేదన విడుదలైంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతులను పూర్తి చేశారు. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యంతో తుది అర్హత జాబితాను రూపొందించకపోవడమే ఈపరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఏడాదిగా ముందుకు సాగని ప్రక్రియ ఎదురు చూస్తున్న 150 మంది గ్రేడు–2 వీఆర్వోలు కొందరు డబ్బులు వసూలు చేసిన వైనం! పదోన్నతుల పేరిట వసూళ్లు 2024 ఆగస్టు నుంచి గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ మొదలు కావడంతో అప్పట్లో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ఆశావాహుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జాబితాలో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్లో పని చేసే కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చినా పదోన్నతి రాకపోవడం..ఇటు డబ్బులు వసూలు చేసిన అధికారులు బదిలీపై వెళ్లడంతో వారికి దిక్కుతోచడంలేదు. తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నా వసూలు చేసిన అధికారులు ఇవ్వడంలేదనే వాదన ఉంది. -
ఆశలు గల్లంతు
రాజు, మారుతమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. రాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కుమారుడు సంపత్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు కారుణ్య కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. కిన్నెర సాయి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడిపై తండ్రి రాజు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. అయితే కిన్నెర సాయి మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మాకు ఎవరు దిక్కు? మమత, మహారాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయి కిరణ్ (10) ఐదో తరగతి, కుమార్తె అశ్రిత ఒకటో తరగతి చదువుతోంది. మమత, మహారాజు బెల్దారు కూలీగా పనిచేస్తూ బిడ్డలను చదివించుకుంటున్నారు. అయితే సాయి కిరణ్ నీటి కుంటలో మునిగి మృతిచెందాడు. ‘ఉన్న ఒక్క కొడుకును బాగా చదివించాలని కలలుగన్నాం. మాకు ఎవరు దిక్కు’ అంటూ వారు రోదించారు. -
చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం
ఆస్పరి/ఆలూరు రూరల్: రోజు మాదిరిగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి యూనిఫాం తొడిగించి పాఠశాలకు పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆ చిన్నారులు సరదాగా ఈత కోసం గ్రామ సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు. ఈత రాక మునిగి ప్రాణాలు వదిలారు. పొలం పనులకు వెళ్లి తిరిగిగొచ్చిన ఆ తల్లిదండ్రులు.. విగతజీవులైన పిల్లలను చూసి గుండెపగిలేలా రోదించారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వినయ్, భీమేష్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, శశి కుమార్, కిన్నెర సాయి, దుర్గా ప్రసాద్లు కలిసి బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. పక్కనే ఇటీవల నిర్మించి ఆగస్టు 15న ప్రారంభించిన ఉన్నత పాఠశాల గురించి చర్చించుకున్నారు. ‘మనం ఏడో తరగతికి ఇక్కడికే రావాలి’ అనుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటి కుంటలో దిగారు. దుర్గా ప్రసాద్ ఒడ్డున ఉండగా మిగిలిన ఆరుగురు విద్యార్థులు ఈత రాక నీటి కుంటలో మునిగి పోయారు. గమనించిన దుర్గాప్రసాద్ అక్కడి నుంచి పరుగుపెడతూ గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామ యువకులు కుంట వద్దకు చేరి విద్యార్థులను వెలికి తీశారు. ఇందులో కిన్నెర సాయి కొన ఊరితో ఉండగా ఆదోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మిగిలిన ఐదుగురు విద్యార్థులు కుంటలోనే ప్రాణాలు వదిలారు.పేదింటికి మరింత కష్టంగడ్ల పెద్ద ఈరన్న, మల్లమ్మలు ప్రతి రోజూ కొండకు వెళ్లి రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె గాయత్రి, రెండో కుమారుడు వినయ్ (10), మూడో కుమారుడు అభి ఉన్నారు. ఇద్దరు కుమారులను బాగా చదివించి ప్రయోజకులని చేస్తే తమకు కష్టాలు తీరుతాయనుకున్నారు. బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ పాఠశాలకు పంపించేవారు. పదేళ్ల వయస్సులోనే వినయ్ ప్రాణం పోవటంతో వారి రోదనలు స్థానికులకు కంట తడిపెట్టించాయి.ఎవరి కోసం జీవించాలో..రాముడు, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి మూడు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె మహాదేవి ఆస్పరిలో పదవ తరగతి చదువుతోంది. రెండో కూతురు రేష్మా చిగిలిలో 8వ తరగతి చదువుతోంది. ఏకై క కుమారుడు భీమేష్ (11)పై ఆశలు పెట్టుకున్నారు. అయితే నీటి కుంటలో పడి భీమేష్ మృతిచెందడంతో ‘ఎవరి కోసం జీవించాలో’ అని వారి రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది.ఆరిపోయిన కలల దీపంపీరావలి, జిలేఖా బీ దంపతుల కూతురు పర్విన్ కూలీ పనికి వెళ్తోంది. పీరా వలి ఆదోనిలో గౌండపనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకు ఉన్న ఏకై క కుమారుడు మహబూబ్ బాషా (10)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. అయితే కుమారుడు నీటి కుంటలో పడి మృతిచెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.విషాదమే మిగిలిందినాగవేణి, కిష్టప్ప దంపతులకు ముగ్గురు కుమారులు. కిష్టప్ప ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కిరణ్ కుమార్ పదో తరగతి, రెండవ నితీష్ కుమార్ 9వ తరగతి చదువుతున్నారు. చివరి కుమారుడు శశి కుమార్ మృతిచెందడంతో వారింట్లో విషాదమే మిగిలింది. -
మిగిలిన స్థానాలకే ఆప్షన్లు
కూటమి ప్రభుత్వంలో చేయి తడపనిదే ఏ పనీ జరగని పరిస్థితి. సామాన్య ప్రజలే కాదు, అధికారులు సైతం తమ పని కావాలంటే నేతల వద్ద చేతులు కట్టుకోవాల్సిందే. ఇక బదిలీల విషయానికొస్తే సిఫారసు లేఖలు లేనిదే ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులనుపరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ లేఖల కోసం నాయకుల చుట్టూ పనులు వదలుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కొందరైనా లేఖల కోసం పోస్టును బట్టి డబ్బు వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అంతోఇంతో ఇచ్చి కోరుకున్న పోస్టులు దక్కించుకున్న అధికారుల్లో నిజాయితీ ఎంతమాత్రం ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో అర్హతలను అనుసరించి గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వీరు తాము కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకులు ఇచ్చే సిఫారసు లేఖలకే బదిలీలు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పచ్చ నేతల సిఫారసు లేఖలు ఉంటే కోరుకున్న చోటుకు, లేదంటే జిల్లా సరిహద్దులకు బదిలీ చేస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి రాజకీయ పరిచయాలు లేని వారు, సిఫారసు లేఖలు తెచ్చుకోని వారిని నంద్యాల జిల్లా నల్లమల సరిహద్దు ప్రాంతాలకు, కర్నూలు జిల్లాలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పోస్టింగ్స్ ఇస్తున్నట్లు పదోన్నతి పొందిన సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో చేపట్టిన పదోన్నతుల పోస్టింగ్స్కు రెండు జిల్లాల నుంచి వందల సంఖ్యలో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 403 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 120 గ్రేడ్ –4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు 120 మంది గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. గతంలో వారికి వచ్చిన మార్కులు (ర్యాంకింగ్), రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్స్ విషయంలో ర్యాంకింగ్, రిజర్వేషన్ ఉన్నా.. పచ్చనేతల సిఫారసు లేని కారణంగా వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు జారీ చేసి న సిఫారసు లేఖల ఆధారంగా ఖాళీలను భర్తీ చేసి, మిగిలిన ఖాళీల్లో ఎక్కడికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండని పదోన్నతి పొందిన వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఫారసు లేఖలతో కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్స్ ఇప్పించుకున్న వారు సంతోషంగా ఉండగా, ఎలాంటి రాజకీయ సిఫారసు లేకపోవడ ంతో సరిహద్దు ప్రాంతాల గ్రామాలకు పోస్టింగ్స్ అందుకున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన కార్యక్రమాలకు అసోసియేషన్ నేతలను ఆహ్వానించే వారని, ప్రస్తుతం ఆ సంప్రదాయం కొనసాగడం లేదనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సిఫారసులకే పెద్దపీట -
నేత్ర పర్వం..
స్వర్ణ రథోత్సవం స్వర్ణరథోత్సవ పూజల్లో పాల్గొన్న దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు భక్తజనం మధ్య స్వర్ణరథోత్సవ దృశ్యం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. స్వర్ణ రథోత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఏఈవో హరిదాసు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గుంతలు ఉన్నాయ్ జాగ్రత్త!
గుంతల్లేని రహదారులను అందుబాటులోకి తెస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు కనీసం శిథిల రోడ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ చిత్రాల్లో కనిపించే గుంతలు ఎక్కడివో కాదు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారుల పరిస్థితి ఇది. అడుగడుగున గుంతలు ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. నూనెపల్లె, నందమూరినగర్ రోడ్డు, ఎన్కేరోడ్డు తదితర ప్రధాన రహదారుల్లో గుంతలు పడ్డాయి. అదే విధంగా ఎన్జీఓస్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్బోర్డు, హనీఫ్నగర్, ఎంఎస్నగర్, సలీంనగర్, బైటిపేట తదితర ప్రాంతాల్లో అధిక రహదారులు గుంతల మయంగా మారాయి. నూనెపల్లె కోవెలకుంట్ల జంక్షన్ వద్ద లోతైన గుంతలు పడటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నందమూరినగర్కు వెళ్లే రహదారిలోని కుందూ పాత వంతెనపై ఉన్న గుంతలను తప్పించేందుకు వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రోడ్లు ఈ వర్షాలకు మరింత శిథిలమవుతున్నాయి. అధికారులు యుద్ధ ప్రాతి పదికన రహదారుల అభివృద్ధి చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – నంద్యాల(అర్బన్) కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రహదారిలో భారీ గుంతలు ఆళ్లగడ్డ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఏర్పడిన నీటి మడుగు -
రూ. 15 వేల పింఛన్ రూ.6 వేలు చేశారు
●చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాధవరెడ్డి. పదేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబసభ్యుల సహాయం లేకపోతే కూర్చోలేడు.. పడుకోలేడు. ఇతనికి గతంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. 90 శాతం వికలత్వం ఉన్నట్లు గతంలో డాక్టర్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రీ రెఫికేషన్ పేరుతో 70 శాతానికి తగ్గించి ఈ నెల నుంచి రూ.6 వేల పింఛన్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఇంట్లో వాళ్లు ఆఫీసు చుట్టూ తిరిగినా తమకేమి తెలియదు అని జవాబు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. -
ప్రభుత్వానికి కనికరమేదీ?
● ఈ చిత్రంలో మంచంపై పిల్లాడిలా కనిపిస్తున్న దివ్యాంగుడు పేరు సూరపురెడ్డి వెంకటరమణారెడ్డి. స్వగ్రామం కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె. వయస్సు 34 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగుడు. మూడు పదుల వయసున్నా చిన్న పిల్లాడి తరహాలో చూసుకోవాల్సి వస్తుంది. రెండు కాళ్లు పూర్తిగా సహకరించవు. గతంలో సదరం క్యాంపుకు వెళ్లినపుడు 90 శాతం ఉన్నట్లు గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం ప్రభుత్వం రీవెరిఫికేషన్ నిర్వహించింది. ఇటీవల గ్రామ సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికెట్లో 74 శాతం ఉన్నట్లు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసమని రమణారెడ్డి ప్రశ్నిస్తున్నాడు. 90 శాతం వైకల్యం ఉంటే రూ.15వేల పింఛన్ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆదిశగా లేకుండా ఏకంగా దివ్యాంగుల వైకల్యంలోనూ మార్పులు చేయడం గమనార్హం -
కూటమి మోసం.. దివ్యాంగులకు శాపం
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమైంది. సామాజిక పింఛన్ లబ్ధిదారుల జాబితాలో అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను తొలగిస్తుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగులకు పింఛన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ.. 15 వేలు’, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు అంటూ ఊరించారు. ఏరివేతలో భాగంగా వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. వచ్చే నెల నుంచి పింఛన్ రాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. – సాక్షి, నెట్వర్క్ మాటలకందని ఆవేదన.. ● గతంలో అధికారులు ఇచ్చిన 98 శాతం వికలత్వం సర్టిఫికెట్ చూపుతున్న ఈ మహిళ పేరు గొల్ల అరుణ. కోసిగి మండలం వందగల్లు సొంతూరు. పుట్టుకపోతోనే చెవిటి, మూగ. తన బాధ, సంతోషాన్ని ఇతరులతో పంచుకునే భాగ్యం లేదు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినిపించలేని పరిస్థితి. గతంలో ఇచ్చే దివ్యాంగుల పింఛన్ను కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలిపేస్తామని నోటీసు ఇవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం, అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తమలాంటి వారికి సాయం చేసి ఆదుకోవాలే తప్ప.. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అంటూ గొల్ల అరుణ మూగ సైగలతో వాపోతోంది. -
25 ఏళ్ల చంటి బిడ్డ.. అయినా అనర్హుడే
● మంచంపై కూర్చున్న యువకుడికి 25 ఏళ్లు. పేరు షమీవుల్లా. అతడికి అన్నం తినిపిస్తున్నది తల్లి జమాల్బీ. పాతికేళ్ల వయస్సులో కూడా చంటి బిడ్డలా తల్లి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు, కుడి చేయి, కుడి కాలు పని చేయవు, ప్రతి క్షణం వెంట ఓ మనిషి ఉండాల్సిందే. స్వతహాగా ఏ పని చేసుకోలేడు. 2011లో వంద శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చారు. రూ.200 నుంచి ఇప్పటి వరకు పింఛన్ తీసుకుంటున్నాడు. అన్నం కూడా వేరే వారే తినిపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటి పింఛన్దారుడికి ఇటీవల నంద్యాలలో నిర్వహించిన సదరం క్యాంపులో 40 శాతం కంటే తక్కువ వికలత్వం ఉందని, ఇక నుంచి పింఛన్ తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసు అందజేశారు. చూసిన వారంతా ‘ఇతనికి పింఛన్ తొలగించడమేమిటీ’ అని చర్చించుకుంటున్నారు. -
90 శాతాన్ని 50కి తగ్గించారు
● మంచానికి పరిమితమైన 88 ఏళ్ల షేక్ అబ్దుల్గఫార్ పక్షవాతం బాధితుడు. బనగానపల్లె పట్టణం ఈద్గా నగర్లో నివాసముంటున్నాడు. 2014 నుంచి పక్షవాతంతో ఇతను మాట్లాడలేడు, జ్ఞాపక శక్తి కూడాలేదు. నంద్యాల సదరన్ క్యాంప్లో 2014 ఫిబ్రవరి 14న 90 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ పొందారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది రూ.15వేల పింఛన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంపులో వికలాంగుడిగా 50 శాతం మాత్రమే ఉన్నట్లు సచివాలయ అధికారులు అతనికి రెండు రోజుల క్రితం నోటీసు ఇచ్చారు. ఇక నుంచి రూ.6వేలు మాత్రమే పింఛన్ వస్తుందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి 50 శాతం మాత్రమే వికలత్వ సర్టిఫికెట్ ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. మహానందిలో అత్యధికంగా 20.4మి.మీ, డోన్లో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 17.2, నంద్యాల అర్బన్లో 15.8, రూరల్లో 15.6, బండిఆత్మకూరులో 15.2, రుద్రవరం 14.6, పగిడ్యాల 14.4, వెలుగోడు 14.0, గడివేముల 12.2, ఆత్మకూరు 11.2, ఆళ్లగడ్డ, గోస్పాడులలో 11.0, కొత్తపల్లి 10.8, నందికొట్కూరు, పాణ్యంలలో 9.8, జూపాడుబంగ్లా, దొర్నిపాడు 9.2, కోవెలకుంట్ల 8.4, శిరివెళ్ల 8.2, మిడుతూరు 8.0, పాములపాడు 6.4, చాగలమర్రి 5.2, సంజామల 4.2, కొలిమిగుండ్ల, అవుకులలో 3.6, బనగానపల్లె 3.4, ఉయ్యాలవాడ 3.0, బేతంచెర్ల 2.2 మి.మీ వర్షం కురిసింది. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. పలు సమస్యలపై బాధితులు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్లో కొన్ని దరఖాస్తులు ● తనకు ఇల్లు లేదని, ఇంటి స్థలం మంజూరు చేయా లని కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామా నికి చెందిన ఎస్.పెద్దశేఖర్ వినతి పత్రం ఇచ్చారు. ● తన పేరు మీద ఎకరా భూమి ఉండగా రీ సర్వేలో తక్కువగా చూపిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పి.మద్దయ్య అర్జీ సమర్పించారు. ● తనకు వస్తున్న వికలాంగుల పింఛన్ తొలగించారని, పునరుద్ధరించాలని గడివేముల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసులు అర్జీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్టులు పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నంద్యాలకు చెందిన ఎస్హెచ్జీ మహిళలకు ఎగ్ కార్టులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్టులను ఇస్తోందన్నారు. ఇవి జిల్లాకు 100 రాగా.. మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన 40 మందికి ఉచి తంగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 10 ఎగ్ కార్టులు వచ్చాయని చెప్పారు. ఒక్కొక్క ఎగ్ కార్టు రూ.50వేలు విలువ చేస్తుందని తెలిపారు. -
దంపతులను రక్షించిన పోలీసులు
బనగానపల్లె రూరల్: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన దంపతులను పోలీసులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరిని కాపాడారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ది లేటి ఆయన భార్య శశికళ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే వారికి రూ.3 లక్షల అప్పులు ఉండడంతో, అప్పును తీర్చలేక మానసికంగా కుంగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బనగానపల్లెకు వచ్చారు. కుటుంబీకులు అనుమానంతో బనగానపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా రవ్వలకొండ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాల్వ వద్ద ఆత్మహత్య కు యత్నించేందుకు సిద్ధంగా ఉన్న దంపతులను ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది గుర్తించారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకునే ఆలోచన నుంచి విరమింపచేసినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జీవితం చాలా అమూల్యమైందని, చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోరాదని సీఐ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. దంపతులను రక్షించిన ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు. -
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
కర్నూలు: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి భారీగా జరిమానాలు విధించారు. దాదాపు 150 మంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పు న రూ.1.50 లక్షల అపరాధ రుసుం విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయమిచ్చి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వారికి రోజా పుష్పం ఇచ్చి వాహనాలను అప్పగించారు. ఇకపై హెల్మెట్ లేకుండా నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు. -
పంటలు వర్షార్పణం
● వరుస వర్షాలతో నీటమునిగిన పంట పొలాలు ● మినుము, మొక్కజొన్న పంటలు కుళ్లిపోతాయని రైతుల ఆందోళన ● ఉరకలేస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు నీటమునిగిన వరిపైరునంద్యాల(అర్బన్): రేయింబవళ్లు కష్టించిన సాగు చేసిన పంటలు వర్షార్పణం అవుతుండటంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మినుము, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మిరప, సాలు వరి, బెండ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల మినుము పూత, పిందె దశలో ఉండటంతో పంట నేలకొరిగి కుళ్లిపోయే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల మొక్కజొన్నకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. మిరప, వరి లేత దశలో ఉండటంతో నీట మునిగి కుళ్లు దశకు చేరే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వీధులు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులు సైతం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు ప్రశ్నార్థకంగా మారాయి. ఉద్ధృతంగా కుందూ, మద్దిలేరు వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కుందూనది, మద్దిలేరువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు, ప్రజలు అయోమయాలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పనులకు వెళ్లలేని కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నందికొట్కూరులో అత్యధికంగా.. జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం వరకు వర్షం కురిసింది. నందికొట్కూరు మండలంలో అత్యధికంగా 54మి.మీ. వర్షం కురియగా ప్యాపిలి మండలంలో అత్యల్పంగా 5.4 మి.మీ. నమోదైంది. కొత్తపల్లి 50.8, ఆత్మకూరు 47.8, మిడుతూరు 43.4, బండిఆత్మకూరు 38.0, వెలుగోడు 37.6, జూపాడుబంగ్లా, పగిడ్యాలలో 36.8, పాములపాడు 34.8, గడివేము ల, శ్రీశైలంలలో 31.4, మహానంది 29.4, రుద్రవర ం 27.2, నంద్యాల అర్బన్ 25.0, నంద్యాల రూరల్ 23.6, శిరివెళ్ల 20.2, సంజామల 19.8, చాగలమర్రి 19.2, పాణ్యం, ఉయ్యాలవాడ 18.0, ఆళ్లగడ్డ 17.6, దొర్నిపాడు 16.8, గోస్పాడు 16.2, కోవెలకుంట్ల 15.4, బనగానపల్లె, బేతంచెర్లలో 12.6, డోన్ 10.2, కొలిమిగుండ్లలో 8.6 మి.మీ. వర్షం కురిసింది. -
కళ్లుంటే ఈమెకేసి చూడండి..
బండి ఆత్మకూరు: ఈమె పేరు అంబటి చాముండేశ్వరి. బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం గ్రామం. 8 సంవత్సరాల క్రితం చిగురు కోసమని చింత చెట్టెక్కడంతో కాలుజారి కిందపడటంతో వెన్నుపూస విరిగింది. రెండు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. వైద్యులు .... వైకల్యం ఉన్నట్లు నిర్ధారించడంతో పింఛను అందుతోంది. అలనాపాలన చూసుకుంటున్న భర్త గోపాల్రెడ్డి(55) రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రీవెరిఫికేషన్ పేరిట ఈమె కు వికలత్వం 40శాతం లోపు ఉన్నట్లుగా నిర్ధా రించి పింఛను తొలగించారు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఈమె ప్రభుత్వ నిర్ణయం పట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
రూ.10 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తుడు రూ.10లక్షల విరాళాన్ని అందించారు. సోమ వారం కర్నూలుకు చెందిన పి.చిన్నశంకరప్ప శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అన్నప్రసాద వితరణకు రూ.5,00,116, గోసంరక్షణనిధి పథకానికి రూ.5,00,116.. మొత్తం రూ.10లక్షల విరాళ చెక్కును దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. విరాళాలను అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. పీజీఆర్ఎస్కు 66 ఫిర్యాదులు నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 66 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి సమస్యలు ఫిర్యాదుల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎస్పీ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యా దులపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్క రించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులలో కొన్ని.... ● బండిఆత్మకూరు మండలం చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి శాఖమూరి సుబ్బారెడ్డి రూ. 60 లక్షల విలువ చేసే 4000 వరి ధాన్యం బస్తాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నారాయణపురం గ్రామానికి చెందిన చిన్న మద్దిలేటి, రైతులు ఫిర్యాదు చేశారు. ● ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్పే ద్వారా రూ.99వేలు తీసుకుని లక్క హరిప్రసాద్ మోసం చేశారని పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన వినోద్ ఫిర్యాదు చేశారు. ఈనెల 20, 21 తేదీల్లో రీవెరిఫికేషన్కు మరో అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగుల పింఛను తీసుకుంటూ రీ వెరిఫికేషన్కు హాజరుకాని వారికి డీఆర్డీఏ మరో అవకాశం కల్పించింది. సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంలో జిల్లాలో 461 మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. వీరికి ఆగస్టు నెల పింఛను పంపిణీ చేయలేదు. రీ వెరిఫికేషన్కు హాజరు కాని 461 మందికి ఈ నెల 20, 21 తేదీల్లో సంబంధిత ఆసుపత్రుల్లో డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపి రమణారెడ్డి తెలిపారు. ఈ నెల 20న 370 మందికి, 21న 91 మంది దివ్యాంగులకు సంబందిత డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారన్నారు. -
హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేధించడం నిరంకుశత్వం
కర్నూలు (టౌన్): స్కూల్స్, హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కర్నూలు పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జీవో ప్రతులను ద హనం చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా జీవోను రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నా రు.స్కూళ్లు, హాస్టళ్లు సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు బబ్లు,చిన్నరాజు, మహేష్,వేణు,రాజుతదితరులు పాల్గొన్నారు. -
47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్
కర్నూలు: మూడేళ్ల కాల పరిమితితో నూతన మద్యం బార్ పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు నూతన పాలసీ అమలులో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 47 నూతన మద్యం బార్లకు కలెక్టర్ల అనుమతితో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు సుధీర్ బాబు, రవికుమార్ సోమవారం గజిట్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. ● ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా నూతన మద్యం బార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ● ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా కొనుగోలు చేయవచ్చు. ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. ● అందిన దరఖాస్తుల్లో ఒక్కొక్క బార్ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు గౌడ కులాలకు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 2, ఆదోని మున్సిపాలిటీలో 1, నంద్యాల మున్సిపాలిటీలో 1, డోన్ మున్సిపాలిటీ పరిధిలో 1 చొప్పున రిజర్వేషన్ ప్రాతిపదికన బార్లను కేటాయించనున్నారు. ● ఇందుకోసం గౌడ్, ఈడిగ కులాలకు సంబంధించిన వారు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పొడిగించిన వ్యాపార సమయాలు... బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు (14 గంటలు) అనుమతించబడతాయి. గతంలో 11 గంటల వరకే అనుమతి ఉండేది. అయితే ఒక గంట సమయాన్ని పెంచుతూ మందుబాబులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్ రుసుం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్కు సరిపడ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన విధించారు. బార్లకు కూడా ఏ4 దుకాణాల మాదిరిగానే ఏపీఎస్డీసీఎల్ నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్స్ పొందినవారు 15 రోజుల లోపు రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, కార్పొరేషన్ పరిధిలో 10 కిలోమీటర్లు నిడివిలో, మున్సిపల్ ఏరియాలో మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా బార్లు ఏర్పాటు చేసుకోవాలి. కర్నూలు జిల్లాలో బార్ల ఏర్పాటు ప్రాంతాలు... కర్నూలు కార్పొరేషన్లో 16 జనరల్ కేటగిరీ 2 గీత కులాలకు, ఆదోని మున్సిపాలిటీలో 4 జనరల్ కేటగిరీ 1 గీత కార్మికులకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరు నగర పంచాయతీలో 1 బార్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. జిల్లాలో బార్లకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల: జిల్లాలో 19 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవికుమార్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల 14, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు 1, డోన్ 1, బేతంచెర్ల 1 చొప్పున బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని కేటాయించిన బార్లకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చని, లైసెన్స్ కలిగి ఉండటంపై ఎటువంటి పరిమితి లేదన్నారు. 50 వేల జనాబా ఉంటే రూ.35 లక్షలు, 55 వేల నుంచి 5లక్షల జనాబా ఉంటే రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో, నంద్యాల ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈనెల 26వతేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు ఉందన్నారు. 28వ తేదీ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బార్లను లాటరీ పద్ధతి ఎంపిక చేస్తామన్నారు. -
శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం
ఆదాయాన్ని కోల్పోతూ..శ్రీశైలంటెంపుల్: సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, విద్యుత్ బిల్లులు తగ్గించుకుని, శ్రీశైలంలో భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దేవవస్థాన గత ట్రస్ట్బోర్డు సైతం ఆమోదం తెలిపింది. అయితే 14 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ఒక నెల విద్యుత్ బిల్లు రూ.70లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అలాగే సంవత్సరానికి రూ.8.40 కోట్లు విద్యుత్ ఖర్చు వస్తోంది. విద్యుత్ బిల్లు భారం తగ్గిస్తే, ఆ ఆదాయంతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయవచ్చని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యుత్ ఖర్చు ఇలా.. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో వీఐపీ కాటేజీలు, వసతి విభాగాలు, అన్నదాన భవనం, క్యూకాంప్లెక్స్, పరిపాలనా భవనం, దేవస్థాన స్టాఫ్ క్వాటర్స్, దేవస్థాన పరిపాలనా కార్యాలయాల్లో నిరంతరం విద్యుత్ వినియోగం ఉంటుంది. ఎల్టీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. అలాగే ఫిల్టర్హౌస్కు నీటి సరఫరా, ఉభయ దేవాలయాలు, గణేశ సదనం ఇలా పలు వాటికి హెచ్టీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. ఎల్టీ లైన్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్కు ప్రతి నెలా దేవస్థానం బిల్లుల రూపంలో ఏపీఎస్పీడీసీఎల్కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు చెల్లిస్తోంది. అలాగే హెచ్టీ లైన్ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్కు సుమారు రూ.30 నుంచి రూ.40లక్షలు బిల్లుల రూపంలో చెలిస్తోంది. హెచ్టీ, ఎల్టీ విద్యుత్ బిల్లుల రూపంలో దేవస్థానం సరాసరి నెలకు రూ.70లక్షలు చెల్లింపులు చేస్తోంది. అంటే ఈ లెక్కన ఒక సంవత్సరానికి రూ.8.40లక్షలు కేవలం విద్యుత్ బిల్లులకు మాత్రమే చెల్లిస్తోంది. రూ.40 కోట్లతో ప్రతిపాదనలు విద్యుత్ బిల్లులకు ఇంత సొమ్ము చెల్లించకుండా, ఆ సొమ్ము భక్తులకు ఉపయోగపడేలా చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సాధారణ రోజుల్లో దేవస్థానం మూడు మెగావాట్లు, మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో నాలుగు మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తుంది. ఈ క్రమంలో 7 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ట్రస్ట్బోర్డు భావించింది. అయితే విద్యుత్ శాఖ నియమ, నిబంధనల మేరకు 500 కేవీ ప్లాంట్కు మాత్రమే అనుమతులిస్తుంది. ఈ క్రమంలో దేవస్థానంలో 500 కేవీ సోలార్ ప్లాంట్లు రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక మెగావాట్ ప్లాంట్ కోసం దేవస్థాన డంప్యార్డ్ సమీపంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శ్రీశైల దేవస్థానంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నెడ్ క్యాప్ సంస్థకు లేఖ రాయడంతో సర్వే చేశారు. డంప్యార్డ్ సమీపంలో సోలార్ ప్లాంట్ను నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. టెక్నికల్ టీం పరిశీలించి నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక అందగానే టెండర్ పిలిచి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. దేవదాయశాఖ కమిషనర్కు సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అలాగే విండ్ ఎనర్జీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందా అని సర్వే చేయించాలని కూడా భావిస్తున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిశ్రీశైల దేవస్థానం విద్యుత్ బిల్లుల రూపంలో ఏటా రూ.8.40కోట్లు నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14నెలలు గడుస్తున్నా ఇంత వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టలేదు. తద్వారా దేవస్థానం ఆదాయాన్ని కోల్పోతోంది. కూటమి ప్రభుత్వం స్పందించి సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించి దేవస్థానం ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పుట్టుకతో చెవిటి, మూగ.. ఆపై మెదడులో సమస్య
తుగ్గలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న దివ్యాంగులుఈ బాలిక పేరు ఎస్.మెహతాజ్. కర్నూలు నగరంలోని చిత్తారివీధి. పుట్టుకతోనే చెవిటి, మూగ. 2011లో సదరం క్యాంపునకు హాజరు కాగా వైద్యులు పరీక్షలు నిర్వహించి 100 శాతం వైకల్యం ఉన్నట్లు సరిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత బాలికకు మెదడులోనూ సమస్య మొదలైంది. ఇటీవల సదరం రీ వెరిఫికేషన్కు హాజరు కాగా.. 40శాతం లోపే సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. అది కూడా తాత్కాలికమేనంటూ పింఛనుకు అనర్హురాలిగా తేల్చారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు శివరామ్ మధు. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామం. కొన్నేళ్ల కిత్రమే పక్షవాతంతో ఎడమ చేయి, కాలు పడిపోయాయి. 2010లో సదరం క్యాంపునకు హాజరు కాగా 94 శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇప్పటికీ ఒకరి సహాయం లేనిదే కదల్లేని పరిస్థితి. ఇటీవల నిర్వహించిన రీవెరిఫికేషన్లో అసలు వికలత్వమే లేనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పింఛనుకు అనర్హుడిగా నోటీసు అందించారు. ఈమె పేరు ఉప్పరి వెంకటలక్ష్మి. తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామం. చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. దీనికి తోడు కింద పడటంతో కాలు విరిగి రాడ్ వేయించుకుంది. సొంతంగా కూర్చోలేదు, నిలబడలేదు. గతంలో 72 శాతం వికలత్వం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల రీవెరిఫికేషన్కు హాజరు కాగా అసలు వికలత్వమే లేనట్లు పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగా ఆమె పింఛను కోల్పోయింది. కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వీధిన పడేసింది. ఉన్న కాస్త ఆసరాను కూడా దూరం చేసి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఊహించినట్లుగానే అనర్హత పేరిట పెద్ద ఎత్తున పింఛన్లను తొలగించడంతో దివ్యాంగులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద కాదు.. రెండు వందలు కాదు.. ఏకంగా వేలాది పింఛన్లను అనర్హత ముసుగులో అడ్డంగా తొలగించడం విమర్శలకు తావిస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో మొదలైంది. అప్పట్లో 100 శాతం వికలత్వం ఉంటే నేడు రీ వెరిఫికేషన్లో 40 శాతంలోపునకు తగ్గిపోయి పింఛను లేకుండా పోతోంది. సదరం క్యాంపుల్లో బేరసారాలు, రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేసినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం జరిగిన గ్రీవెన్స్కు పింఛన్లు పోయిన దివ్యాంగులు క్యూ కట్టారు. గతంలో వెరిఫై చేసి సర్టిఫికెట్లు ఇచ్చింది డాక్టర్లే.. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే ఇప్పుడు 40 లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తొలగింపులు దివ్యాంగుల పింఛను తొలగింపులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సచివాలయాలు తెరుచుకోలేదు. సోమవారం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ సదరం సర్టిఫికెట్, నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్కు, మండలాల్లో ఎంపీడీఓల వద్దకు చేరుకొని తమ గోడు వినిపిస్తున్నారు. అనధికార సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో 10,050 పింఛన్లను తొలగించారు. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. రోజురోజుకు పింఛన్లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు. సిఫారసులకు పెద్దపీట సరదం రీవెరిఫికేషన్లో రాజకీయాలు, సిపారసులు జోరుగా సాగినట్లు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సిపారసులు ఉన్న వారికి రూ.15వేల పింఛను వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం సమోదు చేయడం గమనార్హం. సదరం రీ వెరిఫికేషన్ జరిగే చోటుకు ఇతరులను అనుమతించడం లేదనేది ఉత్తుత్తిదేనని స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే తొలగింపులు తుగ్గలి: ఎన్నికల ముందు సంక్షేమ పథకాలతో ఊరించిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత కోతలు మొదలుపెట్టారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా అనర్హుల పేరిట ఎడాపెడా తొలగింపులకు పాల్పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత దివ్యాంగులు ప్రసన్న, రామాంజినేయులు, గోవిందరాజులు, వీరాంజినేయులు సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములుతో కలిసి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా వస్తున్న తమ పింఛన్లను తొలగించడం అన్యాయమని వాపోయారు. కాళ్లు లేని వారు, మాటలు రాని వారు, కళ్లులేని వారు సర్కారుకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరిఫికేషన్లో 70 శాతం వికలత్వం ఉన్నా పింఛన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కోడుమూరులోని 5వ సచివాలయం పరిధిలో ఓ వ్యక్తికి అన్ని అవయవాలు సవ్యంగానే ఉన్నాయి. అయితే రెండు వేళ్లు దెబ్బతిన్నాయి. ఇది వరకు ఈయనకు 50 శాతం వరకే వికలత్వం ఉంది. రూ.6వేల పింఛను తీసుకుంటున్నాడు. కాళ్లు, చేతులు బాగున్న ఇతను అన్ని పనులు సొంతంగానే చేసుకుంటున్నాడు. ఈయనకు సదరం రీ వెరిఫికేషన్లో ఏకంగా 90 శాతం వికలత్వం నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీ వెరిఫికేషన్ ‘లోప’భూయిష్టం! -
‘తల్లీబిడ్డ’కు అనారోగ్యం!
గోస్పాడు: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇళ్లకు చేర్చే వాహనాలకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. వివిధ సమస్యలతో వాహనాలు షెడ్లకు పరిమితమైనా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. అరకొర జీతాలు సరిపోక డ్రైవర్ల ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నంద్యాల జిల్లాలో 19 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి మాతా, శిశు విభాగానికి 6, డోన్కు 3, ఆళ్లగడ్డకు 2, శిరివెళ్ల, ఆత్మకూరు, బనగానపల్లె, వెలుగోడు, నందికొట్కూరు, బేతంచెర్ల, కోవెలకుంట్ల, శ్రీశైలం ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఇవీ ఇబ్బందులు.. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ (మెయిన్ంటెనెన్స్) సక్రమంగా లేదు. ఇంజిన్ ఆయిల్, బ్యాటరీలు తరచూ మార్చకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. టైర్లు అరిగిపోవడంతో పంక్చర్ అవుతూ ఎక్కడ నిలిచి పోతాయో తెలయక డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. వాహనంలో వైఫర్లు, బ్యాటరీలు, లైట్లు కూడా సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. సేవలు కుదింపు ● గతంలో ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు కూడా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల సేవలు అందించేవారు. రెండు నెలలుగా ఈ సేవలను ఆపేశారు. ● గతంలో 50 కిలోమీటర్ల నుంచి 100, 150 కిలోమీటర్ల వరకు తల్లీబిడ్డ వాహనం వెళ్లేది. ఇటీవల 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు కుదించారు. ● ఒక తల్లి, బిడ్డ, వారి సాయంగా ఉన్న ఒకరిని మాత్రమే గమ్య స్థానానికి తీసుకెళ్లాలి. ఫలితంగా తల్లులు అవస్థలు పడుతున్నారు. ● తల్లికి ఒక చోట, పుట్టిన బిడ్డకు మరో చోట చికిత్స అందించాల్సి ఉంటుంది. అత్యవసర చికిత్స అందించేందుకు దూరప్రాంతాల ఆసుపత్రులకు రెఫర్ చేస్తే అక్కడ కోలుకున్నాక డిశ్చార్జ్ చేసిని వారిని తిరిగి ఇళ్లకు చేర్చడం లేదు. దీంతో చేసేది లేక తల్లీబిడ్డలు వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్ వాహనదారులను, ఆటోలను ఆశ్రయిస్తూ ఇళ్లకు చేరుతున్నారు. డ్రైవర్ల వేతనాల చెల్లింపులో అలసత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న 21 మంది డ్రైవర్లకు నెలకు రూ.7,870 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కూడా నెలనెలా చెల్లించడం లేదు. వాటి చెల్లింపులోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నాలుగు నెలలకు గాను రెండు రోజుల క్రితం రెండునెలల వేతనాన్ని చెల్లించారు. బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే వారు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వేతనాలు రాని కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు. వాహనాలకు బాగాలేని టైర్ల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తల్లీబిడ్డల సేవలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. –నవీన్కుమార్, జిల్లా మేనేజర్ జిల్లాలో 19 వాహనాలతో సేవలు టైర్లు అంతంత మాత్రమే ఎక్కడ నిలిచిపోతాయో తెలియని దుస్థితి డ్రైవర్లకు సకాలంలో అందని వేతనాలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మెరాయింపు ఇలా.. జిల్లాలోని 19 వాహనాల్లో వైఫర్ బ్లేడ్లు లేవు. వర్షాకాలం కావడంతో వాహనాలు బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్లుండి వర్షం వస్తే వాహనం ముందుకు కదల్లేదు. పది వాహనాలకు టైర్లు దెబ్బతిన్నాయి. స్టెప్నీ టైర్లు కూడా లేదు. గత రెండు రోజులుగా బనగానపల్లె వాహనం నిలిపోయింది. గత 20 రోజుల క్రితం నంద్యాల, వెలుగోడులలో వాహనాలు నిలిచిపోయాయి. టైర్లు వచ్చేవరకు తిరగలేని పరిస్థితి. కోవెలకుంట్లలోని వాహనానికి బ్యాటరీ లేక దాదాపుగా తొమ్మిది నెలలు గడుస్తోంది. గతంలో వాహనాలకు డీజిల్ కొరత ఉండేది కా దు. ప్రస్తుతం నెలకు రెండు ఫుల్ ట్యాంకులు దా టితే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరి. -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో శనివాం నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 34.4 మి.మీ, ఆత్మకూరు మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. అదే విధంగా ఆళ్లగడ్డలో 22.2, శిరివెళ్ల, గోస్పాడులో 21.6, డోన్, పాములపాడులలో 18.8, బనగానపల్లెలో 18.6, నంద్యాల అర్బన్ 18.4, నంద్యాల రూరల్ 17.6, వెలుగోడు, జూపాడుబంగ్లాలో 13.8, అవుకు 13.2, సంజామల 11.0, మిడుతూరు, మహా నంది 10.2, కోవెలకుంట్ల, బేతంచెర్ల 9.2, రుద్రవరం 8.8, కొలిమిగుండ్ల 8.4, ఉయ్యాలవాడ 7.6, పగిడ్యాల 6.8, దొర్నిపాడు 6.4, బండిఆత్మకూరు 6.2, గడివేముల 5.8, ప్యాపిలి 4.6, నందికొట్కూరు 4.2, శ్రీశైలం 2.4మి.మీ వర్షం కురిసింది. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దర ఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చ న్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సోమవారం ఉద యం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు గేట్ల నుంచి నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుండడంతో తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మూడు రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు 79,269 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలంకు 1,83,263 క్యూసె క్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాజెక్ట్లకు జలాశయం నుంచి 2,25,017 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 1,23,396 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 69,862 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 29,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 4.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.251 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.868 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 195.6605 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 881.40 అడుగులకు చేరుకుంది. ఉప్పొంగిన వేదావతి నది హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామం వద్ద వేదావతి నది ఉప్పొంగింది. దీంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వేదావతి నదికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. అతి కష్టంపై నదిలో పుట్టి ప్రయాణం చేస్తూ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోని గూళ్యం గ్రామానికి చేరుకుంటున్నారు. నదిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బడ్జెట్ ల్యాప్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాం
ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పనులను ఈ నెలాఖరుకు పూ ర్తి చేయకుంటే కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ అయ్యే ప్రమా దం ఉంది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ శాఖలను హెచ్చరించాం. ఇదే విషయాన్ని స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా సమీక్షించారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాం. – జి.నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన డీఈఈలతో మాట్లాడి ఆయా పనులను పూర్తి చేయాలని కోరాం. నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదాన్ని వారికి గుర్తు చేసి పనులను పూర్తి చేయాలని చెబుతున్నాం. బిల్లుల జాప్యం కారణంగా ముందుకు రాని కాంట్రాక్టర్లతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. – ఎస్ఈసీ మద్దన్న, పీఆర్ ఇన్చార్జి ఎస్ఈ -
ఆటోలపై ‘కూటమి పిడుగు’
కొలిమిగుండ్ల: డ్రైవింగ్ వచ్చి ఆటో చేతిలో ఉంటే చాలు కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ధీమాతో ఉన్న వారు ఇప్పుడు డీలా పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్రశక్తి పేరిట ఉచిత బస్సు పథకం సాఫీగా సాగిపోతున్న ఆటోవాలా జీవన ప్రయాణంపై పిడుగులా పడింది. ఇప్పటికే ఇంటికో బైక్, కారు ఉండటంతో ఆటోలు ఎక్కే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఫ్రీ బస్సు ఏర్పాటుతో ఆటో డ్రైవర్లు మరింత కష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలిమిగుండ్ల మండలంలో 150కి పైగానే మూడు, నాలుగు చక్రాల ఆటోలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ రోజుకురూ. 500 నుంచి రూ. 700 మేర సంపాదిస్తుండేవారు. ఆటోల్లో ఎక్కువ భాగం మహిళలే ప్రయాణించే వారు. రెండు రోజుల నుంచి ఆటోలు ఎక్కే వాళ్లు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉచిత బస్సు పథకంతో తమ బతుకు బండి నడిచేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సర్వీసులు లేని గ్రామాల్లో మాత్రమే కొంత వరకు మహిళలు ఆటోల్లో వెళుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు అకౌంట్లలో జమ కావడతో కొంత వరకు ఊరట కలిగించిందన్నారు. ఆ డబ్బుతో వాహనాల ఆటోల ఫిటెనెస్, బీమా ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో వాలాలకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, 14 నెలలు అవుతున్నా ఆ ఊసేత్తడం లేదన్నారు. కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందని, ఆటోవాలాలకు చేయూత ఇవ్వాలని కోరుతున్నారు. ఉచిత బస్సుతో ఆటోవాలా జీవనోపాధిపై ప్రభావం రూ. 15 వేల హామీ అమలు చేయాలని డిమాండ్ -
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా పరిషత్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.15.51 కోట్లతో 348 పనులను మంజూరు చేసింది. ఇందులో ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు కూడా వాటా మేరకు నిధులను కేటాయించి పనులను అప్పగించారు. అయితే ఈ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 10 శాతం కాంట్రిబ్యూషన్/సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరిగినా, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ ఏడాది సెప్టెంబర్ 5లోగా సబ్మిట్ చేయాల్సి ఉంది. అలాగే పురోగతిలో ఉన్న పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. లేని పక్షంలో మంజూరు చేసిన పనులు కాస్తా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇయర్ మార్క్డ్ ఫండ్ కింద చేపట్టిన పనులు ● షెడ్యూల్డు కులాల సంక్షేమానికి(15 శాతం నిధులు) రూ.2,18,95,000 నిధులతో 52 పనులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ మరమ్మతులు తదితరాలను చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ పనుల్లో ఇప్పటి వరకు 8 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 44 పనులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 16 పనులు, నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పరిధిలో 12 పనులు పెండింగ్లో ఉన్నాయి. ● షెడ్యూల్డు తెగల సంక్షేమానికి(6 శాతం నిధులు) రూ.78 లక్షలతో 17 పనులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 3 పనులు పూర్తి కాగా, 14 పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులతో ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పెండింగ్లో ఉన్న పనుల్లో అత్యధికంగా కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 4, ఆదోని పీఆర్ ఈఈ పరిధిలో 4 పనులు ఉన్నాయి. ● మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు, శిశు గృహల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు(15 శాతం నిధులు) రూ.2.94 కోట్లతో 58 పనులను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 2 పనులు మాత్రమే పూర్తి కాగా, 56 పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ పనుల్లో అత్యధికంగా నంద్యాల పీఐయూ ఈఈ పరిధిలో 22, కర్నూలు పీఆర్ ఈఈ పరిధిలో 11 పనులు పెండింగ్లో ఉన్నాయి. నత్తనడకన మిగిలిన గ్రాంట్ల పనులు ● జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ● జెడ్పీ సాధారణ నిధులు(23 శాతం) రూ.5.64 కోట్లతో 119 పనులను మంజూరు చేశారు. ● ఇప్పటి వరకు 78 పనులు మాత్రమే పూర్తి కాగా.. మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ● గ్రామీణ నీటి సరఫరా విభాగానికి(12 శాతం నిధులు) రూ.1.89 కోట్లతో 51 పనులను మంజూరు చేయశారు. ● కేవలం 14 పనులను మాత్రమే పూర్తి చేశారు. ● వేసవిలో ఈ పనులను పూర్తి చేయాలని జెడ్పీ పాలకవర్గం ఎంత ఒత్తిడి చేసినా, నేటికి పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ● సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద (10 శాతం నిధులు) రూ.1.85 కోట్లతో 51 పనులకు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 8 పనులు పూర్తి కాగా, 43 పనులు పెండింగ్లో ఉన్నాయి. మంత్రాలయంలో జిల్లా న్యాయమూర్తులు మంత్రాలయం రూరల్/కౌతాళం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని ఆదివారం జిల్లా జడ్జి కబర్ది, ఆదోని రెండవ ఆదనపు జిల్లా జడ్జి సుధ, ఆదోని సబ్ జడ్జి నారాయ ణ దర్శించుకున్నారు. వీరికి ఆల య అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ లు చేయించారు. న్యాయమూర్తులకు పూలమాల, శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే ఉరుకుంద ఈరన్నస్వామిని కూడా వారు దర్శించుకున్నారు. శ్రావణమాస ఉత్సవాలపై ఈఓ వాణిని అడిగి జిల్లా న్యాయమూర్తులు తెలుసుకున్నారు. వీరి వెంట ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, పర్యవేక్షకుడు వెంకటేష్, కౌతాళం సీఐ అశోక్కుమార్ ఉన్నారు. నంద్యాల: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమి త్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ (నెంబరు 08514–293903) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. నదులు, వంకలు పరివాహక ప్రాంతాల్లో ప్రజ లను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సచివాలయమే రక్ష -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో 8 బెటాలియన్లకు సంబంధించిన సిబ్బంది పరేడ్లో పాల్గొనగా కర్నూలు రెండవ బెటాలియన్కు సంబంధించి ఆర్ఐ అనిల్ కుమార్, ఆర్ఎస్ఐలు సర్దార్, మునాఫ్ల ఆధ్వర్యంలో చక్కటి కవాతు ప్రదర్శన(పెరేడ్) నిర్వహించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కంటింజెంట్ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో బెటాలియన్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్లో చక్కటి నైపుణ్యత ప్రదర్శించి కంటింజెంట్ అవార్డును అందుకున్నందుకు పటాలం సిబ్బందిని కమాండెంట్ దీపిక పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్రవరం రేంజర్గా ముర్తుజావలి రుద్రవరం: రుద్రవరం రేంజ్ అధికారిగా ముర్తుజావలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023లో రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డీఆర్వోగా విధుల్లో చేరాడు. ఇటీవలె రేంజి అధికారిగా ఉన్న శ్రీపతినాయుడు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఆర్వోగా ఉన్న ముర్తుజా వలికి రేంజర్గా పదోన్నతి కల్పించి రుద్రవరానికి నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలు దొర్నిపాడు: తొలిపంటగా సాగుచేసిన నల్లబంగారం చేతికిరాని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పూర్తిగా దెబ్బతినింది. కేవలం 90 రోజుల్లో చేతికి వస్తుందని రైతులు విస్తారంగా మినుము పంట వేశారు. ఒక్క దొర్నిపాడు మండలంలోనే దాదాపు 700 హెక్టార్లకు పైగా ఈ పంట సాగైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా కోత సమయంలో రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు మినుము పంటంతా నీటిలోనే ఉంది. దీంతో కోత పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోతమిషన్లు పనులు లేక గ్రామంలో నిలబడిపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో కోతకు నేల అనుకూలించక రైతులు దిగాలు చెందుతున్నారు. కాసిన అరకొర గింజలు సైత నేల రాలుతున్నాయని వాపోతున్నారు. -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు(టౌన్): కార్పొరేషన్ పదవుల పేరుతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడుతుందని వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇటీవల 31 కార్పొరేషన్ పదవులను ప్రకటించిందన్నారు. అయితే, నిజమైన కులాలకు కాకుండా బెస్తయేతర వారికి ఆ పదవులు కట్టబెట్టి చిచ్చురాజేసిందన్నారు. బెస్త సంక్షేమ, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా పట్టపు సామాజిక వర్గానికి చెందిన బొమ్మన శ్రీధర్ను ప్రకటించి నిజమైన బెస్త సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పట్టపు రాజు లేదా పట్టపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయ నకు బెస్త కార్పొరేషన్ చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీమలో ఫ్యాక్షన్కు బలి అవుతున్న బెస్తలకు కనీసం కుల కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కూడా న్యాయం జరగలేదన్నారు. అలాగే గత జులై నెల 7 వ తేదీ న జీవో 81 ప్రకారం కొల్లు పెద్దిరాజును మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారన్నారు. పదవుల విషయంలోనే కాకుండా మత్స్య కార సమస్యలు పరిష్కారంలోనూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బెస్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేకపోతే భవిష్యత్తులో వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు గ్రామం పెండేకంటినగర్లో నివాసముంటున్న సుబ్బరాయుడు కొడు కు భానుప్రకాష్కు, అదే గ్రామానికి చెందిన రెడ్డిపోగు మాదన్న కూతురు భారతి(31)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప,బాబు సంతానం. అయితే ఆటో నడిపే భాను ప్రకాష్ మద్యానికి అలవాటుపడి సంపాదనంతా మందుకే ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో భార్య భారతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి మాద న్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ పేర్కొన్నారు. అప్పులబాధతో.. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కై ప గ్రామానికి చెందిన రైతు వెంకటరమణరెడ్డి(37) అనే వ్యక్తి అప్పుల బాధతో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతేడాది రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే, పంట పండక తీవ్రనష్టం వచ్చింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె సంతానం. జీవితంపై విరక్తి చెంది.. మిడుతూరు మండలం అలగనూర్ గ్రామానికి చెందిన షేక్ జుబేదాబేగం (20) అనే యువతి గురువారం రాత్రి బలవన్మరణం చేసుకుంది. అనారోగ్యంతో పాటు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ మేరకు తండ్రి ఉసేన్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కల్లూరు మండలం తడకపల్లె గ్రామంలో జరుగుతున్న మొహర్రం 40 రోజుల జార్తాలకు భార్య దుర్గ, మరో ఇద్దరితో కలిసి బైక్పై రాజు గురువారం వెళ్లాడు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరాడు. తడకనపల్లె క్రాస్ రోడ్డులో మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైలింగ్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నూర్ అహమ్మద్, పోలీసులు వారిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్ దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మై హోమ్ గ్రానైట్ దుకాణంలోకి శుక్రవారం నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బెంగళూరు సర్వీస్ దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి వస్తున్న ఈ బస్సులో డ్రైవర్ కలిముల్లాకు బీపీ డౌన్ అయింది. దీంతో స్టీరింగ్ పట్టు తప్పడంతో బస్సు గ్రానైట్ దుకాణంలోకి వెళ్లి బండలను ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయలు కాలేదని వెల్లడించారు. కాగా బస్సు ఢీకొనంతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే గ్రానైట్ బండలు పగిలిపోయినట్లు గ్రానైట్ యజమాని సద్దాం తెలిపారు. కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి కర్నూలు(రూరల్): కుక్కల దాడి లో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బైరి పెద్ద మద్దిలేటి జీవాలు పెంచుతుంటాడు. శుక్రవారం గ్రామ సమీపాన కేసీ కెనాల్ వంతెన దగ్గర ఉన్న దొడ్డిలో గొర్రె పిల్లలను ఉంచి మందను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 6 కుక్కలు దొడ్డిలొకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డా యి. ఈ ఘటనలో 15 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత దొడ్డికి వచ్చి చూడగా గొర్రె పిల్లలు చనిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో రూ.90 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బైక్ అదుపు తప్పి.. ఆళ్లగడ్డ: అహోబిలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతియాజ్ బాషా (24) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. నంద్యాల రూరల్ మండలం కానాల గ్రామానికి చెందిన ఇంతియాస్ బాషా ఓ శుభకార్యానికి అహోబిలం వచ్చాడు. మధ్యాహ్న సమయంలో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్తుండగా మార్గమధ్యంలో మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈఘటనలో ఇంతియాజ్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న వెంకట సునీల్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
ఆకట్టుకున్న శకటాలు...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ, శక్తి టీం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, డ్వామా, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయం, వైద్య, 108, 104, ఉద్యానవన, డీఆర్డీఏ, సహకార బ్యాంక్, గృహ నిర్మాణ, రవాణా, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ సూర్యఘర్ ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉద్యాన సూక్ష్మ నీటి సాగు శాఖకు ప్రథమ, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకు ద్వితీయ, పోలీసు శాఖ శక్తిటీమ్కు తృతీయ స్థానంలో నిలువగా, ఆ శాఖ అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు. -
వడ్లరామాపురంలో నేడు చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: మహారాష్ట్ర – ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ భవనాశి శంక ర్ అంత్యక్రియలు శనివారం ఆయ న స్వగ్రామం వడ్లరామాపురంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర రాజ్నంద్ గావ్ జిల్లాలోని మొహాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం తెల్లవా రే సరికి చిన్నన్న మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న వ్యక్తి విగతజీవిగా గ్రామానికి చేరుకోనుండడంతో గ్రామస్తులు ఆఖరి చూపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
అంగట్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు
● పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూళ్లు ● కర్నూలు పెద్దాసుపత్రిలో దందా కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆశావహుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను ఈగల్ హంటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ గత జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో 40 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 60 మంది సెక్యూరిటీ గార్డులతో సేవలందించేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు టోకుగా రూ.16 వేలకు పైగా జీతం వస్తుందని అధికారులకు చెప్పారు. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పోస్టుకు అభ్యర్థి కనీసం టెన్త్ చదివి ఉండాలని, 45 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, శారీరక ధృడత్వం ఉండాలని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తమకు సబ్లీజుకు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్దన్రెడ్డి అనుచరులు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు పంతం పట్టారు. ఈ మేరకు ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విష్ణువర్దన్రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వారు ఈ సంస్థను సబ్లీజుకు తీసుకున్నట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరు ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 25 మందికి పైగానే భర్తీ చేశారు. ఇందులో ఒక్కో పోస్టుకు రూ.లక్షకు పైగా చేతుల మారినట్లు చర్చ నడుస్తోంది. కొందరు దళారులు రంగప్రవేశం చేసి మనం చెప్పినట్లే నడుస్తుందని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకూ పోస్టులు కావాలని మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు వచ్చి గొడవ చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంకా ఖాళీగా ఉన్న వందకు పైగా సెక్యూరిటీ గార్డు పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి మధ్యలో దళారులు సైతం చక్రం తిప్పుతున్నారు. తాము చెప్పిన వారికి పోస్టులు ఇవ్వాలని మరోవైపు కొందరు ప్రజాప్రతినిదులు సైతం ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోస్టుల అమ్మకాలు ఆసుపత్రిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జీతంలోనూ భారీ కోత ఎంఓయూ ప్రకారం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.16 వేలకు పైగా జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ నెలలో సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే ఇచ్చారు. కొత్త ఏజెన్సీ వచ్చినా పాత జీతాలేనా అని సెక్యూరిటీ గార్డులు నిట్టూరుస్తున్నారు. పెంచిన మేరకు తమకు జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. -
‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం!
● మండలానికి రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశాలు ● గతంలో రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ఇదే తంతు ● దళారులుగా వ్యవహరిస్తున్న ఏపీఓలు ● హడలెత్తిస్తున్న ఏపీడీలు ● బెంబేలెత్తిపోతున్న డ్వామా క్షేత్ర సిబ్బంది ఆళ్లగడ్డ: జాతీయ పర్వదినాలైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ పేరుతో కొందరు అధికారులు వసూళ్ల పర్వానికి తెరలేపడం విమర్శలకు తావిస్తోంది. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఓ అధికారి ఎవరు ఎంత ఇవ్వాలన్న దానిపై నిర్ణయిస్తున్నారు. అనేక సార్లు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి నిరసనలు వ్యక్తమైనా వసూళ్ల బాగోతాన్ని వీడలేదు. సందట్లో సడేమియాలా కొందరు మండల స్థాయి ఉద్యోగులు సైతం ఇదే దారిలో పయనిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు షరా మామూలే అన్న చందంగా తాయరైంది. జిల్లా అధికారి నుంచి మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది (ఫీల్డ్ అసిస్టెంట్లు) నుంచి రకరకాలుగా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా జిల్లా కేంద్రం నంద్యాలలో శుక్రవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధి పథకం తరఫున శకటం ఏర్పాటు చేసేందుకు ఒక్కో మండలం నుంచి రూ. 10 నుంచి రూ. 15 వేలు వసూలు చేయాలని అనధికారకంగా ఉత్తర్వులు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.3 లక్షల వసూలు జిల్లాలో ఏ శాఖ ఏర్పాటు చేయని విధంగా ఉపాధి హామీ పథకం శకటం ఉండాలని అధికారి ఆదేశం. ఇందు కోసం 32 టైర్ల లారీ తీసుకుని దానిపై చెరువు మట్టి నింపి ఫాంపాండ్ ఏర్పాటు చేసి దాని చుట్టూ పెద్దపెద్ద చెట్లు పెట్టించాలని ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందో అంతా క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏపీడీలు, ఏపీఓలు కలిసి చర్చించి పెద్ద మండలం అయితే రూ.15 వేలు, చిన్న మండలం అయితే రూ.10 వేలు తగ్గకుండా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని 28 మండలాల పరిధిలో కనీసం రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీఓలు, టీసీలు గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లతో వసూళ్లు సాగించినట్లు చర్చ జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం డబ్బులు వసూలు చేయలేదు. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు. – సూర్యనారాయణ, పీడీ, డ్వామా రిపబ్లిక్ డే వేడుకలకు రూ. 2 లక్షలు ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సైతం ఇలాగే అందరికంటే ‘ఉపాధి’ శకటమే బాగుండాలని గోకులం (పశువుల షెడ్డు) ఏర్పాటు చేసేందుకు రూ. 2 లక్షలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో మండలం నుంచి రూ. 8 వేలు వసూలు చేసి ఇచ్చామని ఇలా మాటిమాటికీ వేలకు వేలు ఇవ్వాలంటే ఎలా అని క్షేత్ర, మండల స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి. -
బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్ఆర్ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ (వీబీఆర్)కు 11,000, జీఎన్ఎస్ఎస్కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు. శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్ గోస్పాడు: విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న శ్రీశైలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం తెలిపారు. ఇటీవల సీఎం శ్రీశైలం పర్యటన సందర్భంగా డాక్టర్ షహనాజ్ విధులకు గైర్హాజరు కావడంతో పాటు తరచూ విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ రోగులకు అందు బాటులో ఉండటం లేదన్నారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షహనాజ్ను సస్పెండ్ చేశామన్నారు. మహానందిలో మహాలక్ష్మీ హోమాలు మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదాలు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధులయ్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి. ముగిసిన మొహర్రం సంతాప దినాలు బనగానపల్లె: మొహర్రం సంతాప దినాలు శుక్రవారంతో ముగిశాయి. మొహర్రం వేడుకలు గత నెల 6వ తేదీ పీర్ల నిమజ్జనంతో ముగిసింది. అప్పటి నుంచి షియా మతస్తులు 40 రోజుల పాటు సంతాప దినాలుగా భావిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన మొహర్రాన్ని బనగానపల్లెలో షియా మతస్తు లు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శుక్రవారం మొహర్రం సంతాప దినాలు ముగియడంతో కొండపేటలోని పీర్లచావిడి నుంచి బయల్దేరిన ఇమాంహసన్, ఇమాంహుస్సేన్ పీర్లతో భక్తిగీతాలు అలపిస్తూ మాతం నిర్వహిస్తూ రక్తాన్ని చిందించారు. ఈ మాతం కార్యక్రమం పాత సిండికెట్ బ్యాంకు వరకు సాగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజల్ అలీఖాన్తో పాటు షియా మతస్తులు పాల్గొని మాతం చేసుకుంటూ నవాబు కోట వరకు వెళ్లారు. కార్యక్రమంలో పలువురు షియా మత పెద్దలతో షీయా మతస్తులు పాల్గొన్నారు. మాతం చూసేందుకు అధిక సంఖ్యలో హిందూ, ముస్లింలు తరలివచ్చారు. -
జెడ్పీలో 34 మందికి పదోన్నతులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు జెడ్పీ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 34 మందికి పదోన్నతులు కల్పించారు. శుక్రవారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి ఉత్తర్వులను అందించారు. పదోన్నతులు పొందిన వారిలో సీనియర్ అసిస్టెంట్ నుంచి పరిపాలనాధికారిగా ఒకరు, రికార్డు అసిస్టెంట్ నుంచి జూని యర్ అసిస్టెంట్లుగా ఐదుగురు పదోన్నతులు పొందారు. అలాగే ఆయా కార్యాలయాల్లో ఆఫీసు సబార్డినేట్, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి అర్హతలను అనుసరించి రికార్డు అసిస్టెంట్లుగా 21, లైబ్రరీ అసిస్టెంట్గా 1, ల్యాబ్ అసిస్టెంట్లుగా 6గురికి పదో న్నతి కల్పించారు. ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకాల కింద ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పిస్తు వివిధ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. -
నేత్రదానంపై అపోహలు తొలగిపోవాలి
కర్నూలు(హాస్పిటల్): నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పెద్దమార్కెట్ ప్రాంతంలో జయలక్ష్మి(77) అనే మహిళ గుండెపోటుతో మరణించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి వెళ్లి నేత్రదానానికి ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. వారి సమాచారంతో స్థానిక బుధవారపేటలోని సుశీల నేత్రాలయ సిబ్బంది వెళ్లి ఆమె నేత్రాలను సేకరించారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. సుశీల నేత్రాలయ కంటి వైద్యులు డాక్టర్ పి.సుధాకర్రావు మాట్లాడుతూ ఒకరి నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని, అందుకే తమ ఆసుపత్రిలో నేత్ర సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రెండేళ్ల కాలంలో 110కి పైగా కార్నియా ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించినట్లు తెలిపారు. నేత్రదానం చేయదలచిన వారు 8886306308ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ సావిత్రి, కంటి వైద్యులు డాక్టర్ నేహ సుధాకర్, డాక్టర్ రాఘవప్రీతమ్ పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్రకు అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మహేశ్వరి(28)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా మహేశ్వరి అనారోగ్యానికి మానసికంగా కుంగిపోయింది. మనస్తాపంతో చెందిన ఆమె శనివారం ఉదయం ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎద్దులను శుభ్రం చేసేందుకు వెళ్లి..
రైతు మృత్యువాత రుద్రవరం: చెరువులో అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ఓ రైతుతో పాటు రెండు ఎద్దుల ప్రాణం తీశాయి. ఆలమూరు గ్రామంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందిన్నె వుశేన్బాషా (42) అనే రైతు కొద్దిగా ఉన్న సొంత పొలంతో పాటు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పర్వీన్ కూడా మేసీ్త్రగా ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేయిస్తోంది. రోజులాగే వుశేన్బాషా శనివారం శీల బోయిన చెరువు వైపు సేద్యపు పనులకు వెళ్లాడు. పనులు పూర్తయిన తర్వాత ఎద్దుల బండిపై ఇంటికి వస్తూ మార్గమధ్యలో ఎద్దులను శుభ్రం చేసేందుకు చెరువు లోపలికి దింపాడు. రైతు ఎద్దులను నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గుంతలో బండి పోవడంతో ఎద్దులతో పాటు రైతు మునిగిపోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి బయటకు తీయగా వుశేన్బాషా అప్పటికే మృత్యుఒడి చేరాడు. ఎద్దులు సైతం నీట మునిగి మృతి చెందాయి. రుద్రవరం ఎస్ఐ మహమ్మద్ రఫి సిబ్బందితో చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య పర్విన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రైతు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్యతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మట్టి తవ్వకాల వల్లే.. ఆలమూరు శీలబోయిన చెరువులో శనివారం జరిగిన ప్రమాదానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కొందరు చెరువులో అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలుగు పక్కనే కట్ట మీదుగా వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ రాకపోకలు సాగేవి. అయితే అది దారి అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కట్టకు కొద్ది దూరంలోనే పెద్ద గుంతలు తవ్వారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువులోకి భారీగా నీరు చేరింది. ఆ నీటితో పెద్ద గుంతలు సైతం నిండి పోయాయి. గుంతలు గమనించక పోవడంతో ప్రమాదం జరిగి రైతుతో పాటు ఎద్దులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. -
27 నుంచి గణేశ్ ఉత్సవాలు
● వచ్చే నెల 4న కర్నూలులో నిమజ్జనోత్సవం కర్నూలు కల్చరల్: గణేశ్ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, గూడూరు, ఇతర పట్టణాల్లో 27 నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 4వ తేదీ నిమజ్జనోత్సవం ఉంటుందన్నారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోరంట్ల రమణ మాట్లాడుతూ.. మట్టివినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. నగర అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తులో కాకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాల నిర్వహణకు పోటీ పడాలన్నారు. మండపాల నిర్వాహకులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. క్రెడో స్కూల్లో విద్యార్థులకు 24న వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నగర కార్యదర్శి గురిరాజవర్మ, సభ్యులు కొట్టే చెన్నయ్య, భాను ప్రకాష్, అక్కెం విశ్వనాథ్ పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శ్రీమఠం కారిడార్లో సందడి నెలకొంది. శనివారం ప్రత్యేక పర్వదినం, గోకులాష్టామి సెలవు దినం కావడంతో భక్తుల కోలాహలం కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాధిగా భక్తులు తరలివచ్చి రాఘవేంద్రులు మూలబృందవాన్ని దర్శించుకున్నారు. కర్నూలు: గ్రామీణ ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చే సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించేది లేదని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు తమ ఆటోలను కర్నూలు నగర శివారులోనే నిలుపుకోవాలని సూచించారు. నంద్యాల చెక్పోస్టు, గుత్తి పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తా, సెయింట్జోసెఫ్ కాలేజీ వరకు మాత్రమే ఆటోలకు అనుమతి ఉంటుందని, పోలీసు ఆదేశాలను ఖాతరు చేయకుండా నగరంలోకి ప్రవేశిస్తే కేసులతో పాటు భారీగా చలానాలు విధిస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని పాతబస్తీలో రాధాకృష్ణ టాకీస్ నుంచి నెహ్రూ రోడ్డు మీదుగా (బొంగుల బజార్), మించిన్ బజార్ రూట్లలో ఒకవైపు ప్రయాణం మాత్రమే (వన్వే) అనుమతిస్తామన్నారు. -
గుట్టుగా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం
జూపాడుబంగ్లా: తంగడంచ గ్రామరెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. తంగడంచ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 358, 359, 368లో ఆద్యా అగ్రిక్రాప్ సైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ఇప్పటిదాకా తంగడంచ గ్రామస్తులకెవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానంతో పాటు గ్రామస్తుల అభిప్రాయసేకరణ, మండల రెవెన్యూ, అభివృద్ధి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్తుల అభిప్రాయసేకరణ తీసుకోకుండానే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చూసేందుకు కూడా అక్కడున్న వారు లోపలికి వెళ్లనివ్వటం లేదంటే ఎంత పకడ్బందీగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మండల, జిల్లా స్థాయి అధికారులు తంగడంచ వద్ద జరుగుతున్న ఫ్యాక్టరీలో భవిష్యత్లో ఎలాంటి ఉత్పత్తుల్తు చేస్తారో, స్థానిక నిరుద్యోగులకు ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివ రణ కోరగా తంగడంచ భూములు ఏపీఐఐసీ వారికి అప్పగించినందున ఫ్యాక్టరీలకు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం ఉండదని, ఏపీఐఐసీ అధికారులే కంపెనీల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన అన్ని అనుమతులు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. -
విప్లవ జోహార్లతో చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: విప్లవ జోహార్లతో సుగులూరి చిన్నన్న అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. నాలుగురోజుల కిందట మహారాష్ట్ర –ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ సుగులూరి చిన్నన్న మృతిచెందారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి శనివారం ఉదయం 10 గంటలకు మృతదేహం వచ్చింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల రెండింటి నుంచి పలువురు వడ్ల రామాపురం చేరుకున్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిన్నన్న అలియాస్ శంకర్, అలియాస్ విజయ్ అంత్యక్రియలు విప్లవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించారు. చిన్నన్న పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి ‘అమర వీరుల ఆశయాలను సాధిద్దాం ... కామ్రేడ్ చిన్నన్న అమర్ రహే’ అని నినదించారు. చిన్నన్న మృతదేహాన్ని ట్రాక్ట పై ఉంచి గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీతో ఆయన కుటుంబ పొలంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన మృతదేహాన్ని విప్లవ సంప్రదాయాలతో ఖననం చేశారు. అమరుల బంధుమిత్రుల కమిటీకి చెందిన పద్మ, భవాని, శోభ, అంజమ్మ, విరసం సభ్యులు పినాకపాణి, ఏపి పౌరహక్కుల సంఘం నాయకులు అల్లాబకాష్, కరీంబాషా, తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు ఆర్.రాజానందం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నర్సింహయ్య, సీపీఐ ఎంఎల్ జనశక్తికి చెందిన సుంకన్న, వైద్యులు డాక్టర్ నాగన్న, డాక్టర్ గౌరీనాఽథ్, వివిధ దళిత సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం అసాధ్యం మావోయిస్టు పార్టీ సభ్యులను కాల్చి చంపడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్మూలించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ రచయితల సంఘం పూర్వ కార్యదర్శి పాణి అన్నారు. ఆత్మకూరు మండలం వడ్లరామాపురంలో శనివారం కామ్రేడ్ చిన్నన్న అంత్యక్రియలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో అత్యంత పాశవికంగా ‘కగార్ ఆపరేషన్’ జరుపుతోందన్నారు. అక్కడ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు గిరిజనులకు అండగా నిలుస్తున్న మావోయిస్టులను హతం చేస్తున్నారని ఆరోపించారు. కామ్రేడ్ చిన్నన్న మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదన్నారు. -
ఉచితం.. అగమ్యగోచరం
● మహిళలకు తప్పని తిప్పలు ● మూలపడిన పల్లెవెలుగు బస్సులు ● శ్రీశైల క్షేత్రానికి కొత్త బస్సు సర్వీసులు నిల్ఆత్మకూరు: మహిళలకు ఉచిత బస్సు అని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. బస్టాండ్కు వెళ్లిన వారు ఉచిత బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సు వస్తుందో.. రాదో తెలియని దుస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాక మూలనపడిన వాటికి మరమ్మతులు సైతం చేయలేదు. దీంతో ఉచిత బస్సు కోసం చూసే మహిళలకు నిరాశే ఎదురవుతోంది.గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేనప్పుడు ఉచిత ప్రయాణం ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి రావాలంటే, పట్టణం నుంచి పల్లెలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయని చెబుతున్నారు. మరమ్మతులు చేసినా? నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ డిపోల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అధికారులు విద్యార్థి బస్సులను వాడుతున్నారు. మరమ్మతులకు గురైన పల్లె వెలుగు బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ బస్సులే అదనపు సర్వీసులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి డిపోలో దాదాపు 10 నుంచి 14 బస్సులకు మరమ్మతులు చేసి వాటిని అదనపు సర్వీసుల కింద నడపనున్నారు. కాగా ఈ బస్సులకు మరమ్మతులు చేసినా ఎంత దూరం ప్రయాణిస్తాయి, అసలు ఇవి కండిషన్లో ఉంటాయా? మహిళలను, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయా లేదో వేచి చూడాలి. పాత బస్సులే దిక్కు నంద్యాల, కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లా, వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లడం పరిపాటి. మహిళలకు ఉచిత బస్సు పేరుతో పాతవాటినే నడుపుతున్నారు. మహిళలు అధికంగా ఉంటే ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా 110 కి.మీ. దూరం ఆ బస్సు శ్రీశైలం వెళ్తుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంత దూరం మహిళలు బస్సులో నిలబడి ఎలా ప్రయాణిస్తారు? మహిళలకు కావాల్సిన సీట్లు ఖాళీగా ఉంటాయా? రిజర్వేషన్ సౌకర్యం, ఇతర భక్తులు ఉచితంగా దర్శనానికి వెళ్లే మహిళల పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మహిళలు శ్రీశైల క్షేత్రానికి పోటెత్తే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించి శ్రీశైలం మహాక్షేత్రానికి అదనపు బస్సు సర్వీసులను వేయాల్సి ఉంది. మహిళల కోసం అదనపు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థి బస్సు సర్వీసులతో పాటు షెడ్లో రిపేరీ ఉన్న బస్సులకు కూడా మరమ్మతులు చేస్తున్నాం. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేందుకు బస్సులకు మరమ్మతులు చేయించి ఘాట్ ఎక్కేలా చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం క్షేత్రానికి మంచి ఇంజన్ కలిగిన బస్సులను నడుపుతాం. పల్లె వెలుగు సర్వీసులైనా మంచి బస్సులను ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. – రజియాసుల్తానా, ఆర్టీసీ ఆర్ఎం, నంద్యాల పల్లె వెలుగు సర్వీసులన్నీ తొలగింపు! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె వెలుగు బస్సు సర్వీసులు చాలా వరకు తొలగించారు. గతంలో పల్లెలకు ఎన్నో బస్సు సౌకర్యాలు ఉండేవి. కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం, ఎర్రమఠం, పెద్దగుమ్మడాపురం, గువ్వలకుంట్ల గ్రామాలకు తిరిగేవి. అలాగే పాములపాడు మండలంలోని మద్దూరు, వాడాల, వేంపెంట గ్రామాలకు బస్సు వెళ్లేది. కురుకుంద, కొట్టాల చెరువు, వెలుగోడు మండలంలోని రేగడగూడూరు, గుంతకందాలకు ప్రతిరోజూ రెండు బస్సులు తిరిగేవి. ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రతి రోజూ పల్లెలకు 15 బస్సులు సర్వీసులు ఉండేవి. ప్రస్తుతం ఈ బస్సు సర్వీసులన్నీ తొలగించారు. దీంతో గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బడిపిల్లలకు మాత్రం ఉదయం, సాయంత్రం కేవలం రెండుసార్లు మాత్రమే కొన్ని గ్రామాలకు ఒకే బస్సును కేటాయించారు. దీంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూనే విద్యార్థి బస్సు సర్వీసు పొందుతున్నారు. -
రమణీయం.. ఉట్లోత్సవం
● శ్రీమఠంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు మంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల స్వయంగా ఉట్టి కొట్టి అందరిలో భక్తిభావాన్ని నింపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుడి మూలవిరాట్కు పీఠాధిపతి విశిష్ట పూజలు చేశారు. సాయంత్రం శ్రీ మఠం మధ్వ కారిడార్లో ఉట్లోత్సవం కార్యక్రమం చేపట్టారు. రంగు నీళ్లు చల్లుకుంటూ ఉట్లోత్సవం వైభవంగా కొనసాగింది. ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి ఉత్సవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది
నేను టైర్ల పనిచేస్తూ జీవనం సాగిస్తుంటా. ఈ నెల 10న పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క వెంటపడి మరీ కరిచింది. దీంతో భయమేసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. టౌన్లో ఏ వీధి చూసినా కుక్కల భయమే. కొత్తవాళ్లను చూస్తే వెంటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోంది. – పవన్కుమార్, పాతబస్టాండ్, కర్నూలు మా కుమారుడు దేవాన్స్కు ఐదేళ్లు. ఈనెల 8న వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత రెండో డోసు కూడా వేయించాం. మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తేనే గుండె జారుతోంది. పిల్లలు కనిపిస్తే చాలు మీదకొస్తున్నాయి. – దేవరాజు, ఎన్టీఆర్ కాలనీ, కర్నూలు -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. శాస్త్రోక్తంగా గోపూజ శ్రీశైలంటెంపుల్: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని శ్రీగోకులంలో శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, పండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థాన గోసంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గోపూజ జరిపించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. యూరియా పక్కదారి! మహానంది: రైతు సేవాకేంద్రానికి వచ్చిన యూరియా పక్కదారి పడుతోంది. టీడీపీ నేతల సహకారంతో ప్రైవేటు గోడౌన్లకు తరలుతోంది. మసీదుపురం గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్కు రెండు లారీల యూరియా వెళ్లడం చర్చనీయాంశమైంది. రైతులకు యూరియా అందించకుండా పక్కదారి మళ్లిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మసీదుపురం గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జునరెడ్డి కోరారు. ఈ విషయంపై ఏఓ నాగేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. గ్రామ సమీపంలో వంతెన మరమ్మతులు జరుగుతుండటంతో యూరియా నిల్వలు అక్కడే ఉంచి రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 26వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను 0.05 అడుగు మేర ఎత్తి నీటినిఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 12వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్ఎస్ఎస్)కాల్వకు 10వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విద్యుదాఘాతంతో చిరుతపులికి గాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: విద్యుదాఘాతంతో శనివారం రాత్రి లింగాలగట్టు గ్రామం వద్ద చిరుతపులికి గాయాలు అయ్యాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం దిగువన, లింగాలగట్టు గ్రామం పొలిమేరలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పులి కొండ చరియలను దాటుకొనే ప్రయత్నంలో జారి పడింది. ఆ ప్రాంతంలో లింగాలగట్టు వాసుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడి విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. గాయాలతోనే అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. -
శ్రీశైలండ్యాం నీటిమట్టం 882.10 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి శనివారం సాయంత్రం నాటికి 5 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా నాగార్జునసాగర్కు 1,33,720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి శ్రీశైలానికి 2,05,212 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువ ప్రాంతాలకు జలాశయం నుంచి 1,89,111 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 91,270 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం 70,082 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 25,333 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,426 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.357 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 199.7354 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. వెరిఫికేషన్ పేరిట వికలత్వం శాతం తగ్గించింది. పింఛన్ల రద్దుకు కుట్ర పన్నింది. వంద నుంచి 80 శాతం వికలత్వం సర్టిపికెట్ ఉన్న వారికి నెలకు రూ.15 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు వికలత్వం 60 నుంచి 70 శాతానికి కుదించి రూ. 6 వేల పింఛన్ ఇవ్వడానికి కుట్ర చేశారు. గతంలో డాక్టర్లు శాశ్వత సర్థిఫికెట్లు జారీ చేశారు. అప్పుడు ఇచ్చిన డాక్టర్, ఇప్పుడు ఇచిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్కు తేడా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం. – మరియదాసు, దివ్యాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు -
నీటి సంరక్షణ పనులు చేపట్టాలి
నంద్యాల: జిల్లాలో నీటి సంరక్షణ పనులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులకు సూచించారు. గురువారం విజయవాడ సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు భూగర్భజలాల సంరక్షణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జేసీ విష్ణు చరణ్, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో కురిసిన వర్షపు నీరు అక్కడే ఇంకిపోయేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. నీటి సంఘాల సభ్యులు నీటి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. -
జెండా పండుగకు సర్వం సిద్ధం
నంద్యాల: స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ముస్తాబైంది. జెండా పండుగను తిలకించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలను తీర్చిదిద్దారు. విద్యార్థులు, మహిళలు, ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీగా హాజరు కానున్నారు. డీఆర్డీఏ, డ్వామా, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు సంబంధించి శకటాలను ప్రదర్శనలకు సిద్ధం చేశారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. -
‘ నాకు ప్రాణహాని ఉంది’
● వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిర్వాహకుడి సెల్ఫీ వీడియో వైరల్ బనగానపల్లె: తనకు ప్రాణహాని ఉందని పాతపాడు – యాగంటి క్షేత్ర రహదారిలో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం నిర్వాహకుడు వలిస్వామికి చెందిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వలిస్వామి గత 25 ఏళ్లుగా దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే గత రెండు నెలలుగా కొందరు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో బెదిరిస్తున్నారని వీడియోలో ఆరోపించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలం విలువ రూ. కోట్లు చేస్తుందని, ఎలాగైనా ఆలయాన్ని ఆక్రమించుకోవాలని కొందరు కుట్ర పన్నుతున్నట్లు ఆయన వాపోయారు. ఈ విషయాన్ని తాను కొందరి పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
దేశభక్తి ప్రతిబింబించేలా..
జెండా పండుగకు పిల్లలూ.. పెద్దలూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సన్నద్ధమ వుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమ య్యారు. ఓ వైపు జెండా ప్రదర్శనలు, మరో వైపు మూడు రంగుల జెండాలు, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తదితర వస్తువుల అమ్మకాలతో కర్నూలు నగరంలో సందడి నెలకొంది. – సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలుదుకాణం వద్ద త్రివర్ణ రంగుల వస్తువుల అమ్మకాలుజాతీయ పతకాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యంకలెక్టరేట్ వద్ద మాంటిస్సోరి విద్యార్థుల ప్రదర్శన -
వైద్యసేవలు విస్తృత పరచాలి
డోన్: కర్నూలు, నంద్యాల జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలకు అందుబాటులో ఉన్న డోన్ వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలను మరింత విస్తృతపరచాలని వైద్యులను నంద్యాల జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్) డాక్టర్ లలిత ఆదేశించారు. ఆసుపత్రిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి ఇక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సరైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హనీఫ్కు సూచించారు. జిల్లాలో మోస్తరు వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షం కురియగా చాగలమర్రి మండలంలో అత్యల్పంగా 2.2 మి.మీ వర్షం కురిసింది. ప్రజాస్వామ్యం ఖూనీ నంద్యాల: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా పాలిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో జరిగిన ఎన్నికల తీరు చూస్తే, ఆయన పాలన ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ఏజెంట్లను లేకుండా చేసి మోసపూరిత పద్ధతుల్లో గెలిచిందన్నారు. చివరికి పోలీసు అధికారులు సైతం కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి, వారి ఆదేశాలను పాటిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో రాక్షసత్వం, రౌడీయిజం చేసే టీడీపీని అధికారం నుంచి తొలగించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. వీబీఆర్లో 15 టీఎంసీల నీరు వెలుగోడు: బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(వీబీఆర్)కు కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. గురువారం సాయంత్రం సమయానికి వీబీఆర్లో 15.598 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శివనాయక్ తెలిపారు. వీబీఆర్ నుంచి దిగువకు 7365 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నంద్యాలలో నకిలీ టీటీడీ సిఫార్సు లెటర్లు నంద్యాల: టీటీడీ నకిలీ లెటర్లు తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వ్యక్తిని నంద్యాల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నంద్యాల వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల బైర్మల్ వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు తయారు చేశాడు. అంతేకాకుండా ఎంపీ సంతకాన్ని పోర్జరీ చేసి విక్రయించాడు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన జగదీష్ అనేవ్యక్తి వద్ద రూ.1,500 తీసుకొని ఎంపీ పేరుతో పోర్జరీ చేసిన లెటర్ప్యాడ్ను ఇచ్చి తిరుమల దర్శనానికి పంపారు. తిరుమలలో నకిలీ లెటర్ అని, దర్శనం లేదని చెప్పడంతో మోసం బయట పడింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన దినేష్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు. -
చోరీకి పాల్పడిన కేర్ టేకర్ అరెస్ట్
● రూ. 6.90 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాఽధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని గాంధీనగర్లో ఓ వ్యక్తి ఇంట్లో కేర్ టేకర్గా ఉంటూ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 6.90 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. గాంధీనగర్కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తండ్రి ధనుంజయుడు రిటైర్డ్ ఉద్యోగి. కుమారస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ తండ్రికి కొంత దూరంగా నివాసముంటున్నాడు. తండ్రి బాగోగులు చూసుకోవటానికి హైదరాబాద్లోని ఓ సంస్థ నుంచి అనంతపురం టౌన్కు చెందిన నిమ్మగంటి చరణ్సాయి అనే వ్యక్తిని ఈ ఏడాది జూన్ నెలలో కేర్ టేకర్గా నియమించుకున్నాడు. అయితే ఇంట్లో నగలు భద్ర పరిచిన చోటును పసిగట్టిన చరణ్సాయి పనిలో చేరిన 15 రోజుల్లోనే ఇంటికి కన్నం వేశాడు. అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు పొరల బంగారు చైన్, రెండు ఉంగరాలు, జత కమ్మలతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎంఎన్ భార్గవి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు, హెచ్సీ మద్దిలేటి, క్రైం పార్టీ పోలీసులు ఉసేని, రఘునాథ్, సుధాకర్, గోపాల్ బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి చరణ్ సాయిని అనంతపురం టౌన్ తన ఇంటి సమీపంలోని అన్న క్యాంటీన్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను ఒక గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. దీంతో ఆ సంస్థకు నోటీసు జారీ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టౌన్ సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో కొత్తవారిని పనిలో తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విచారించాలన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఎస్ఐ–2 శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
ఉప్పలపాడులో యువకుడి ఆత్మహత్య
ఓర్వకల్లు: ఉప్పలపాడు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కూతురు నందిని బేతంచెర్ల నుంచి వచ్చి ఉప్పలపాడులో నివాసముంటున్న తలారి సునీల్కుమార్ (21)తో ఏడాది క్రితం ప్రేమించి పెళ్లిచేసుకోంది. సునీల్ కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య నందిని కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సునీల్ భార్య వద్దకు వెళ్లగా మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగి శ్రీనివాసులు అల్లుడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సునీల్ గురువారం తన సొంతింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
స్కూటీని ఢీకొన్న కారు
● దంపతులు, బాలుడికి తీవ్ర గాయాలు ఎమ్మిగనూరురూరల్: ఆదోని – కర్నూలు రహదారిలో బనవాసి జవహార్ నవోదయ విద్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడికి చెందిన గంగన్న, భార్య భాగ్యలక్ష్మీ కుమారుడు ఉపేంద్రలు ఉదయం స్కూటీపై దేవబెట్ట గ్రామానికి కొత్త బట్టలు పెట్టుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. బట్టలు పెట్టుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తున్నారు. కర్నూలుకు చెందిన దినేష్రెడ్డికి కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య ఆదోనిలో ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. ఆ స్కూల్లో సెలవు పెట్టి తిరిగి కర్నూలుకు బయలు దేరారు. బనవాసి నవోదయ దగ్గర ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న గంగన్న, భాగ్యలక్ష్మీ, బాలుడు ఉపేంద్రలు ఎగిరి పక్కనే కాలువలో పడిపోయారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్ణవశాత్తు విద్యుత్ స్తంబం విరిగి కింద పడకపోవటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో దంపతులతో పాటు కుమారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులకు కెనరా విద్యా జ్యోతి
కర్నూలు(అర్బన్): కెనరా విద్యా జ్యోతి పథకం పేరుతో ప్రతి ఏడాది 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ మేనేజర్ సుశాంత్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్లో విద్యాజ్యోతి పథకం కింద ఎంపికై న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల విద్యాభివృద్ది దేశ ప్రాధాన్యత అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెనరా బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి మాట్లాడుతూ.. కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా విద్యార్థినులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించడంతో పాటు అమ్మాయిల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. గతంలో పేద ప్రతిభావంతురాలైన ఎస్సీ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక లాప్టాప్ను కూడా కెనరా బ్యాంకు అందించిందన్నారు. కార్యక్రమంలో డివిజినల్ మేనేజర్ సురేష్కుమార్, బ్రాంచ్ మేనేజర్ శంకర్, చైతన్య శివరాజ్ పాల్గొన్నారు. -
చెరువు గండికి టీడీపీ నాయకులే కారణం
● వేగవంతంగా పనులు చేపట్టాలి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు: మద్దిగుండం చెరువుకు గండి పడటానికి టీడీపీ నాయకులే కారణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. మిడుతూరు మండల పరిధిలోని మద్దిగుండం చెరువుకు పడిన గండిని గురువారం బైరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు కట్టపై చెట్లను తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడిందన్నారు. ఇంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. సొంత జేసీబీలతో ఇష్టానుసారంగా పనులు చేయడంతో గండిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద చెట్లను తొలగించే సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. చెట్లు తొలగించడంతోనే చిన్న రంధ్రం పడి పెద్దగా గండి పడి చెరువులో నీరంతా పంట పొలాల్లోకి వెళ్లి పంట నష్టం జరిగిందన్నారు. చెరువు పని చేసిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న తప్పులు చేస్తేనే కేసులు పెడుతున్నారని, చెరువు పనులు ఎలా పడితే అలా చేసిన కాంట్రాక్టర్లపై ఇరిగేషన్ అధికారులు ఏమైనా కేసులు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. త్వరితగతిన అధికారులు చెరువుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. అవసరం లేని పనులు చేసి నాయకులు జేబులు నింపుకుంటున్నారే తప్ప నాణ్యతగా చేయలేదన్నారు. గండిపడి మూడు రోజుల అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్రెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివనాగిరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, గుండం హరిస్వరోత్తమరెడ్డి, రవికుమార్, స్వామిరెడ్డి, సాంబశివుడు, పుల్లయ్య, లింగారెడ్డి, రాముడు, రాము పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: నగరంలోని కృష్ణానగర్లో నివాసముంటున్న ఇ.విశ్వనాథ్ గౌడ్ (35) అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ్ గౌడ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్నూలుకు చేరుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 11వ తేదీన దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. 12వ తేదీ తన భర్త కనిపించడం లేదని భార్య నాగమణి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని నీళ్లలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి జేబులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ గట్టుపై విశ్వనాథ్ గౌడ్ ద్విచక్ర వాహనం లభించింది. దీంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో చివరిరోజు సంబరాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం మండలంలోని అను మంత్రాలయం (తుంగభద్ర)లోని మఠంలో రాఘవేంద్రస్వామి రథోత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సమూర్తి ప్రహ్లాదరాయలకు చామర్ల సేవతో హారతులు పట్టారు. అనంతరం రథంపై కొలువుంచి గ్రామ పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆరాధన ఉత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఉత్సవమూర్తికి పంచ వాహనాలతో రథయాత్ర చేపట్టారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి. -
నాల్గోసారి ఉత్తమ స్కూల్గా..
కర్నూలు సిటీ: నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూల్కు ఎంపికై ంది. విజయవాడలో శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ప్రధానోపాధ్యాయుడు కె.శివప్రసాద్ అందుకోనున్నారు. ఈ పాఠశాల 2018లో అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్గా ఎంపికై ంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో (2020లో) భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం పేరుతో స్కూల్ ఏర్పాటుకు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 60 సీట్ల చొప్పున అనుమతులు ఇస్తూ 2021 మార్చి 10న విద్యావాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ ఎం.ఎస్ నంబరు 20ని జారీ చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. తొలుత 2021–22లో , తర్వాత 2022–23లో, 2023–24లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2024–25 విద్యా సంవత్సరంలో 43 మంది పరీక్షలు రాస్తే 43 మంది పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. దీంతో వరుసగా నాల్గోసారి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ స్కూల్గా ఎంపికై ంది. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో భాగంగా ముందుగా విజిలెన్స్ సిబ్బంది రైతుల రూపంలో అన్ని దుకాణాలకు వెళ్లి ధరలను విచారించారు. ఇందులో నాలుగు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఆయా దుకాణాలపై వెంటనే విజిలెన్స్ సీఐ, ఆ శాఖ ఏఓ విశ్వనాథ్, స్థానిక ఏఓ అక్బర్ బాషా దాడులు చేసి ముందుగా లైసెన్స్, రికార్డులు, స్టాకు పరిశీలించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని గుర్తించి నాలుగు దుకాణాలలోని 390 బస్తాల రూ.3,74,407ల విలువైన ఎరువుల అమ్మకాల నిలిపివేస్తూ, నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఓ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 32 వేల నుంచి 22 వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా నీటి విడుదలను తగ్గించామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను కిందికి దించి 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని తెలుగుగంగ క్వాకు 8వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ నుంచి జీఎన్ఎస్ఎస్కి 9వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 5వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు: 1,620 మినీ అంగన్వాడీ కేంద్రాలు: 43 0–6 నెలల శిశువులు: 16,785 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు: 66,824 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులు: 42,104 గర్భిణులు: 17,246బాలింతలు: 18,112
● నత్తనడకన నెట్వర్క్ ● పనిచేయని యాప్లు ● పెరిగిన పని ఒత్తిడి ● సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఆళ్లగడ్డ: పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు తదితర వాటిని అప్లోడ్ చేసేందుకు ఇచ్చిన వివిధ రకాల యాప్లతో అంగన్వాడీ కార్యకర్తలు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో బోధన పక్కదారి పడుతోంది. ‘పనిచేయలేమని ఫోన్లు మాకొద్దు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఫోన్లు, సిమ్లు వెనక్కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ్ ట్రాకర్, రాష్ట్ర యాప్ బాల సంజీవని, కిశోర వికాస్, మిషన్ వాత్సల్య, సఖి వంటి యాప్ల్లో నిత్యం డేటా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పీఎంఎంవీవై యాప్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా కేంద్రాలకు పాలు సరఫరా చేసెందుకు ఏర్పాటు చేసిన మిల్క్ యాప్తో పాటు ప్రతి మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కోసం ఉన్న యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయాలి. ఇంతవరకు ఏఎన్ఎంలు చేసే మాతృవందన పథకానికి సంబంధించిన యాప్ త్వరలో అంగన్వాడీలకు అప్పగించనున్నారు. నెలకు 5 జీబీ డేటా! ఇప్పటికే రాష్ట్ర ప్రభత్వం ఇచ్చిన బాల సంజీవని యాప్తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పోషణ ట్రాకర్ యాప్ లో కూడా నిత్యం అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆన్లైన్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం నెలకు 5 జీబీ డేటాను మాత్రమే ఇస్తోంది. అది అయిపోతే సొంతంగా రీచార్జ్ చేసుకుందామన్నా వీలుండదు. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు ఎందుకు చేయలేదని ఉన్నతాధికారులు వేధింపులు.. సూటిపోటి మాటలతో మానసికంగా కుంగిపోతున్నారు. బాలింతలకు పోషకాహారం ఇచ్చేందుకు ఆధార్ను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అనేక మంది బాలింతల ఫొటో ఆధార్ కార్డులో 12 నుంచి 15 సంవత్సరాల వయసులోది మాత్రమే ఉంటుంది. ఆ ఫొటోలోని ముఖ కవలికలను గుర్తు పట్టేందుకు యాప్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కో సారి ఫోన్లో డాటా చాలక ఆ ప్రక్రియ మధ్యలోనే నిలచిపోతోంది. ‘రికార్డు’ స్థాయిలో అవస్థలు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు 15 రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం, పిల్లలు, బాలింతలు, గర్భిణులు నమోదు, ఫ్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతిరోజు విధిగా నమోదు చేయాలి. మరో వైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్ – ఏ రికార్డులు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శన రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర రికార్డులు నమోదు చేయడంతో సమయం అంతా గడిచి పోతోంది. ఆటంకాలు ఇవీ.. ● గతంలో అంగన్వాడీ కేంద్రాల దగ్గరే పోషకాహారం ఇచ్చేవారు. దీనిని టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్)గా మార్చారు. పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు సార్లు ఇంటి దగ్గరే అందిస్తున్నారు. రెండు సార్లు పోషక్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదుకే ఎక్కువ సమయం పడుతోంది. ● బాల సంజీవనిలోని ఆరు రకాల వస్తువులు కలిపి ఒక కిట్గా లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అవి ఇచ్చే సమయంలో ఫొటో పోషణ ట్రాకర్లో అన్లోడ్ అవుతుంది. అయితే జిల్లాలోని కాంట్రాక్టర్లు అంతా టీడీపీ నేతలే కావడంతో వారు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ఇవీ కష్టాలు.. కొత్త యాప్లను అప్లోడ్ చేసేందుకు 2జి ఫోన్లు పనిచేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న తల్లులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇళ్ల వద్దకే పోషకాహారాన్ని అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత గుర్తింపు) ప్రవేశ పెట్టింది. సెల్ఫోన్లు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా మారింది. బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో నమోదు తర్వాతే సరుకులు అందించాలి. అయితే సెల్ఫోన్లు ఐదేళ్ల క్రితం 2జీ నెట్వర్క్ తో ఇచ్చినవి కావడంతో ఆయా యాప్లు తరుచూ మొరాయిస్తున్నాయి. పోషణ్ ట్రాకర్ యాప్లో ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ తప్పనిసరి. నెట్వర్క్ సరిగా లేకపోయినా, లబ్ధిదారుల మొబైల్స్లకు మెసేజ్ బ్యాలెన్స్ లేక ఓటీపీ రాకపోయినా సరుకులు అందడం లేదు. కొత్త 5జీ ఫోన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ స్పందన లేదు. ఒత్తిడికి గురవుతున్నాం 2 జీబీ ర్యామ్తో ఉన్న 2జీ నెట్వర్క్ సిమ్తో ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన సెల్ఫోన్లతో ఇప్పుడు ఇచ్చిన కొత్త యాప్లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. యాప్ల భారమైనా తగ్గించండి. లేదంటే 5జీ సెల్ఫోన్లు కాని, ట్యాబ్లు కానీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – ఉదయలక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు, దొర్నిపాడు యాప్లు మొరాయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్లు తరుచూ మొరాయిస్తున్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో తంటాలు పడుతున్నాం. ఉన్న యాప్లతోనే ఇబ్బందులు పడుతుంటే మల్లీ ఏఎన్ఎంలు చేసే పీఎంఎంవీవై పని కూడా అప్పగించడం దారుణం. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు పాత ఫోన్లను సీడీపీఓ కార్యాలయంలో అప్పగించాం. – వసుంధర, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు -
విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలి
గోస్పాడు: విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, సర్వజన ప్రభుత్వాసుపత్రి డాక్టర్ మల్లేశ్వరి అన్నారు. బుధవారం యాంటీ ర్యాగింగ్ డే సందర్భంగా మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిస్థాయిలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వైస్ప్రిన్సిపాల్, డాక్టర్లు రాజశేఖర్, కళావతి, హెచ్ఓడీలు లోకేశ్వరరెడ్డి, పద్మజ, డాక్టర్ నిరంజన్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత ఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని ఎనిమిది చెరువులకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ మురళీకృష్ణ, ప్రాజెక్టు చైర్మన్ పూజా మల్లికార్జునరెడ్డి తెలిపారు. వడ్లరామాపురం, కురుకుంద గ్రామాల్లో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున పాఠశాల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎవరూ వాగులు వెంట వెళ్లొద్దని సూచించారు. దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు నంద్యాల(న్యూటౌన్): ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలో పేద పిల్లలకు అందించాల్సిన 25శాతం మిగిలిన సీట్ల కోసం ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, సమగ్ర శిక్ష అనదపు అధికారి జగన్మోహన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులు సచివాలయంలో, www.csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేస్తామన్నారు. పాఠశాలలో ప్రవేశాలు ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ 18004258599 నంబరును సంప్రదించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన నంద్యాల: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను బుధవారం అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. అధికారులకు, వీఐపీలకు గ్యాలరీల ఏర్పాటు చేయాలని, వేడకులకు హాజరయ్యే అందరికీ మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు నంద్యాల(అర్బన్): ఎరువుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పట్టణంలోని అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్, సుదర్శన్ ట్రేడర్స్లలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టార్లు, బిల్ బుక్స్, నిల్వలు, ఈ పాస్ మిషన్లో స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. హోల్సేల్, రిటైల్ డీలర్లు నిర్ణయించిన ధరలతోనే రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించాలన్నారు. డీఏఓ వెంట ఏడీఏ ఆంజనేయ, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఉన్నారు. -
ఉపాధిలో అక్రమాలకు ‘ఫొటో’ చెక్!
నంద్యాల(అర్బన్): మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమ హాజరు నమోదుకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉపాధి సిబ్బంది, టీడీపీ నాయకులు కలసికట్టుగా అవినీతి చేయలేరు. కూలీల హాజరు నమోదుపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ను తీసుకురావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. జాబ్కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫొటోలను ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో సదరు ఉపాధి వేతనదారు పనికి వచ్చిన అనంతరం అతని ఫొటో(ఐరిస్) తీస్తారు. ఒకవేళ యాప్లో నమోదు చేసిన వ్యక్తి ఫొటోకు మ్యాచ్ అవ్వకుంటే నగదు చెల్లింపులు చేసేందుకు వీలుండదు. ఈ యాప్ను ఇటీవల క్షేత్రస్థాయిలో ప్రవేశ పెట్టింది. దీంతో మండల స్థాయిలో ఉండే ఉపాధి అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఉపాధి ఏపీవోలు పని జరిగే ప్రాంతాల్లో కూలీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకరు తరఫున మరొకరు హాజరైతే! జిల్లాలో 2,65,737 జాబ్ కార్డులు ఉండగా 5,00,513 మంది కూలీలుగా నమోదయ్యారు. యాక్టివ్ కార్డులు 2,15,195 ఉండగా 3,82,050 మంది పనులకు హాజరయ్యేవారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లును తొలగించి తమ వారిని నియమించుకుంది. ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా కూలీల ఫొటోలను సెల్ఫోన్లలో తీసుకుని జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థకు (ఎన్ఎంఎంఎస్)కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసే కూలీల ఫొటోలను తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒకరు తరఫున మరొకరు హాజరైనట్లు చూపితే ఆన్లైన్లో హాజరు తీసుకోదు. దీంతో అటు ఉపాధి సిబ్బందికి, ఇటు కూటమి నాయకుల జేబులు నింపుకునే విధానానికి పెద్ద గండి పడినట్లు అవుతుంది. పకడ్బందీగా పర్యవేక్షణ ఎన్ఎంఎంఎస్ యాప్లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వెరిఫై చేసి రిపోర్టును ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్కు సంబంధం లేని ఫొటోను అప్లోడ్ చేశారా.. పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాతది పెట్టారా... ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా అన్న వివరాలు గమనించాలి. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ కార్యాలయంలోని ఏపీఓ, కాంట్రాక్ట్ స్టాఫ్, పర్మినెంట్ స్టాఫ్ అదే రోజు పరిశీలించి నివేదికను కలెక్టర్, డీఆర్డీఓలకు పంపించాలి. ఫొటో ఉంటేనే హాజరు కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటేనే హాజరుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోతే కూలీలకు వేతనం రాదు. ఈజీఎస్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకే గత నెలలో నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. – సూర్యనారాయణ, జిల్లా డ్వామా పీడీ, నంద్యాల ఇకపై రెండు ఫొటోలు దిగితేనే వేతనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కూలీ మంజూరు జిల్లాలో 2.05 లక్షల జాబ్ కార్డులు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 4 గంటల తర్వాతే ఫొటో అప్లోడ్ పని ప్రదేశంలో మొదటి ఫొటోను ఉదయం 6 గంటలకు తీసి అప్లోడ్ చేస్తే, అనంతరం 4 గంటల తర్వాత అనగా ఉదయం 10 గంటలకు ఫోన్లో మరోసారి ఫొటో అప్లోడ్ చేయాలని సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత ఫొటో అప్లోడ్ చేయకపోతే ఆరోజు కూలీలకు నగదు చెల్లింపులు ఉండవు. మూడు నెలలుగా వేతనదా రులకు నగదు చెల్లింపులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నగదును విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించింది. అయితే త్వరలో కొత్త విధానం ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో తమకు రావాల్సిన మూడు నెలలు వేతనాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
శుభకార్యానికి వచ్చి.. అనంతలోకాలకు
ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు. -
రూ.82.79 కోట్ల ఉచిత పంటల బీమా విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం కింద ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే మరోసారి రూ.82.79 కోట్ల ప్రయోజనం కలిగింది. 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉచిత పంటల బీమా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం గత రెండు రోజులుగా విడుదలవుతోంది. ఈ పరిహారం కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే. కేంద్రం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపజేయడంతో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమాను మరచిపోయిన రైతుల బ్యాంకు ఖాతాలకు బీమా పరిహారం విడుదలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా పరిహారం విడుదల చేయడంలో చేతులెత్తేసింది. దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకం కేంద్రం వాటా బీమా నిధులు విడుదల చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం -
మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి
కర్నూలు: మద్యం బార్ల పాలసీ నెలాఖరుకు ముగుస్తున్నందున కొత్త పాలసీ గురించి వ్యాపారులకు వివరించి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఎకై ్సజ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీ కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఇందుకు సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉన్న దుకాణాల నుంచి రూ.5 లక్షలు, రూ.65 లక్షలకు పైగా లైసెన్స్ ఫీజు ఉన్న దుకాణాల నుంచి ఏడాదికి రూ.7.50 లక్షలు పర్మిట్ రూమ్లకు రుసుం వసూలు చేయాలన్నారు. అలాగే నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై చర్చించారు. కర్నూలును సారా రహిత జిల్లాగా నెలాఖరుకు ప్రకటించాల్సి ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లా అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, జాన్ సైదులు మంజుల, రమేష్ రెడ్డి, లలితా దేవి, స్వర్ణలత, రామాంజినేయులు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వరలక్ష్మి, సతీష్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎకై ్సజ్ నేర సమీక్ష సమావేశంలో నోడల్ డిప్యూటీ కమిషనర్ -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల వత్తాసు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆలూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న గూండాగిరీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం ఎన్నాళ్లు ఉండదని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, పార్టీ ఆలూరు మండలం అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు. రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి నంద్యాల: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని గుడిమెట్ట వద్ద మద్దయ్య(42) అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ఈనెల 11న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంగళవారం రాత్రి రైలులో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుడిమెట్ట వద్ద రైలు నుంచి జారి కింద పడి మృతి చెందినట్లు బుధవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎడతెరపి లేకుండా వర్షాలు
కొత్తపల్లి మండలం బండినాయునిపాలెంలో నీట మునిగిన వరిపైరునంద్యాల(అర్బన్): జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 163.8మి.మీ వర్షం కురిసింది. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 20.4మి.మీ వర్షం కురియగా డోన్ మండలంలో అత్యల్పంగా 0.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా మిడుతూరు మండలంలో 16.4, రుద్రవరంలో 15.2, ఆత్మకూరులో 12.8, పగిడ్యాలలో 12.4, పాములపాడులో 11.4, జూపాడుబంగ్లా, నంద్యాల అర్బన్లో 10.2 మి.మీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో రైతులు సాగు చేసిన వరిపైరు నీట మునగింది. కురుస్తున్న వర్షాలతో పూత దశలో ఉన్న మినుము నేలకొరిగి పూత, పిందె రాలిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుందూ నది ఉప్పొంగి ప్రవహిస్తోందని, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
శోభాయమానం.. ఆరాధనోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో 6వ రోజు బుధవారం ఉత్సవాలు రమణీయంగా సాగాయి. వేకువ జామున 5.30కు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ, శ్రీరాఘవేంద్రస్వామి మఠం 13వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధనలు కనుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అశ్వ వాహనంపై విశ్వ మోహనుడు బుధవారం రాత్రి 10 గంటలకు ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కడు వైభవంగా ఊరే గారు. మంగళ వాయిద్యాలు, దాస సాహిత్య మండలి మహిళల భజనలు, అశేష భక్త జనం హర్ష ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో విహరించారు. అనంతరం చెక్క, వెండి, అంబారి, స్వర్ణ రథాలపై ఉత్సవమూర్తికి రథయాత్రలు నిర్వహించారు. ఈ వేడు కలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వా మి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ కుమా ర్రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆరాధన సప్తరాత్రోత్సవాలు సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెంది న విదూషి సంగీత కులకర్ణి దాసవాణి, సుధా స్కూలు బృందం హరిదర్శన నృత్య రూపకం భక్తులను మంత్రముగ్దులు చేసింది. నేడు సర్వ సమర్పణోత్సవం ఉత్సవాల ఆఖరిరోజు అయిన గురువారం సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఏక కాలంలో పంచ వాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉద యం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. అశ్వ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
యువకుని అవయవ దానం
● ముగ్గురికి కొత్త జీవితం కర్నూలు (హాస్పిటల్): ఒక యువకుడు చేసిన అవయవ దానం ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన టి.శివరామ సుబ్బయ్య (39)కు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఈనెల 10న స్నేహితులతో కలసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడ జారిపడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అతను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపారు. అదే రోజు ఓమ్నీ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు మెడికవర్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. కానీ అతనిని బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని జీవన్దాన్ ట్రస్టు వారు అవయవ దానం గురించి శివరామ సుబ్బయ్య కుటుంబానికి చెప్పగా వారు అంగీకరించారు. కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సాయిసుధీర్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ సమద్, డాక్టర్ సిద్ధార్థ హెరూర్, డాక్టర్ బి.ప్రవీణ్, డాక్టర్ శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్కు, మరో కిడ్నీని మెడి కవర్ హాస్పిటల్లోనే ఒక రోగికి, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలు ఎంతో మేలు
నంద్యాల: జిల్లాలోని ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 27వ తేదీ జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. రసాయనాలతో చేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంతో పర్యావరణానికి పెను నష్టం వాటితోందన్నారు. ప్రజలు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. 25న వినాయక విగ్రహాల పంపిణీ... వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈనెల 25వ తేదీ నంద్యాల కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్రెడ్డి, ఏఈఈ రామకృష్ణ, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
మళ్లీ మొదటికొచ్చిన వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బదిలీల్లో అన్యాయంపై సుమారు 40 మంది వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మూడు వారాల క్రితం ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు జిల్లాల నుంచి కోర్టును ఆశ్రయించగా.. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో బదిలీల కౌన్సెలింగ్ తిరిగి చేపట్టాలని ఈనెల 11న ఆదేశించడం గమనార్హం. చేతులు మారిన రూ.16లక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 474 మంది వీఏఏలు ఉండగా 447 మందిని బదిలీ చేశారు. రేషనలైజేషన్ వల్ల ఉమ్మడి జిల్లాలో 188 రైతుభరోసా కేంద్రాలు మూత పడ్డాయి. ప్రధానంగా నంద్యాల జిల్లాలో 117 ఆర్బీకేలు మూతపడ్డాయి. ఈ కారణంగా చాలామంది వీఏఏలు కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే బదిలీల్లో ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16లక్షలు చేతులు మారినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీఓ(23, 5)లను ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్న ఉద్యోగులనూ దోచుకున్నారు గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల్లో రాజకీయ సిఫారసులకే పెద్దపీట వేశారని తెలుస్తోంది. కూటమి పార్టీల నేతలు చిన్న ఉద్యోగులను కూడా వదలకుండా అందిన కాడికి వసూలు చేసుకొని సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు ప్రకారం వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏకంగా 115 మంది వీఏఏలు ప్రజాప్రతినిధుల సిఫారుసుతో కోరుకున్న చోటుకు బదిలీ అయినట్లు హైకోర్టు గుర్తించింది. సిఫారసులు లేకుండానే కొరుకున్న చోటుకు బదిలీ చేసినందుకు కొందరు అధికారులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ ఏఓల్లో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 115 మందికి ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు రూ.16లక్షల వరకు వసూలు చేసిన కూటమి నేతలు ప్రత్యేక కౌంటర్ తెరిచిన కొందరు అధికారులు నిబంధనలకు లోబడి బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం అభాసుపాలైన వ్యవసాయ శాఖ ముడుపులు ఇచ్చుకొని కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకున్నాం.. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటని వీఏఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు పోయి, తిరిగి పోస్టింగ్ ఆ ప్రాంతానికే వస్తుందో రాదోననే కొందరు వీఏఏలు సతమతం అవుతున్నారు. ఇటీవల చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీలతో వ్యవసాయ శాఖ అభాసుపాలైంది. గ్రామస్థాయిలోని వీఏఏల బదిలీల్లో సైతం ముడుపుల వ్యవహారం ఈ శాఖ పరువును బజారున పడేసింది. -
కుందూలో పడి..
బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడ లు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమా దాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రూ. 5లక్షల నగదు అపహరణఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన బాధితుడు గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలున్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. చోరీ విషయాన్ని బాధితుడు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి కోరారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ కబర్థి సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్లో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, ఎస్సీ, ఎస్టీ, పౌర హక్కుల రక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల రక్షణ, అమలు పథకం 2015, ఆదివాసీలు, సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.శాంతికళ, ఆర్ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, డీసీపీఓ శారద, జిల్లా సాంఘీక సంక్షేమం, సాధికారత అధికారిణి బీ రాధిక, నంద్యాల ఏటీడబ్ల్యూఓ హుసేనయ్య, నంద్యాల జిల్లా సీఐ పీ గౌతమి, రెండు జిల్లాలకు చెందిన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి -
యువకుడి అనుమానాస్పద మృతి
నంద్యాల: ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాణ్యం మండలం కౌలూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాల మధ్య మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గడివేముల మండలం కొర్రపోలూరుకు చెందిన రామసుబ్బయ్య కుమారుడు సూర్య (23) డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కెళ్లాడు. ఇటీవలే అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు పని ఉందంటూ రెండు రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కౌలూరు సమీపంలో రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతుడు ఓ యువతిని ప్రేమించాడని..అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలో యువకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి అక్కడ పారవేశా రా లేక ప్రేమ విఫలమై యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమ కుమారుడిది హత్యేననివిచారించి న్యాయం చేయాలని సూర్యతల్లిదండ్రులు కోరుతున్నారు. -
మన పండు బ్రహ్మాండం!
డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా లభిస్తున్న పండు. ఇదివరలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇప్పుడు మనపక్క జిల్లా అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో విరివిగా సాగవుతోంది. అయితే ఇంతకు వెయ్యి రెట్లు బీ12, ఏ, సీ విటమిన్లు లభించే మొక్క మన దేశంలోనే ఉన్న బ్రహ్మజెముడు(పాపిచ్చి కాయ)ను విస్మరిస్తున్నాం. చైనాకు, మన పండుకు ఉన్నా తేడా ఒక్క ముళ్లు మాత్రమే. కేవలం ఈ ఒక్క కారణంతో ముళ్లు తీసుకునే సమయం లేక చైనా పండ్లను ప్రోత్సహిస్తున్నాం. పైగా ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఎవరూ పెంచకుండానే మొండిగా బతికేస్తుంది. అయితే చైనా పండు(డ్రాగన్ ఫ్రూట్)ను మాత్రం కేజీ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే ఫ్రీగా లభిస్తున్న, డ్రాగన్ ఫ్రూట్ను మించి పోషకాలను అందిస్తున్న మన బ్రహ్మజెముడును పట్టించుకోకపోవడం గమనార్హం. కార్పొరేట్, కాంక్రీట్ జంగిల్స్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు వీటి గురించి అవగాహన లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పాపాసికాయలు తెలియనివి కావు. పండును బండరాయికేసి రుద్దితే ముళ్లు విరిగిపోతాయి, ఆ తర్వాత తోలు తీసి గుజ్జును తినేయడమే. చివరగా వచ్చే విత్తనాలను మాత్రం పడేయటం విస్మరించొద్దు. ఈ పండ్లు తిన్నామంటే ఎట్టే గర్తుపట్టేయొచ్చు. చేతులు, నాలుక కొద్ది సమయం వరకు ఎరుపు, గులాబి రంగులోకి మారిపోవడం చూస్తే పాపాసికాయలు తిన్నావా అని అడగాల్సిందే. ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజెముడు పండ్లతో కాలేయ, క్యాన్సర్ వ్యాధులను సైతం నయం చేస్తోంది. అంతేకాదు.. స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉండటం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
మూడోసారి ..
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్టగేట్లను ఈ ఏడాది మూడవసారి తెరిచారు. జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు తెరచి 1,08,628 క్యూసెక్కుల నీటని దిగువకు వదులుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 2,27,094 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,606 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 69,988 క్యూసెక్కులు, బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాలలో 4.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.107 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.802 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. మంగళవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 204.3520 టిఎంసీల నీరు లభ్యతగా ఉంది. డ్యాం నీటిమట్టం 883 అడుగులకు చేరుకుంది. -
కూటమి సర్కార్ ‘రాజకీయ కూల్చివేతలు’
● వైఎస్సార్సీపీ నాయకుడు భూమా కిషోర్రెడ్డి కాంపౌండ్ వాల్ కూల్చివేత ఆళ్లగడ్డ: నంద్యాల నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కూల్చివేతలకు తెర తీశారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్రాం కక్ష సాధింపునకు అధికారులు బేషరతుగా జీ హుజూర్ అంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా భార్గవ్ డైరెక్షన్లో అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి తన స్థలానికి ఎప్పుడో నిర్మించుకున్న ప్రహరీ కూల్చివేతకు అధికారులు యత్నించడం మంగళవారం పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డికి సర్వే నెం.574/2 లో 3.50 ఎకరాల పొలం ఉంది. ఈ స్థలం కబ్జాకు గురికాకుండా సుమారు 4 సంవత్సరాల క్రితం చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే ఆమె భర్త భార్గవరాం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ ప్రహరీ కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గిన కమిషనర్ గోడ కూల్చేందుకు జేసీబీ తీసుకునిపోయి కూల్చివేత మొదలు పెట్టారు. అంతలో భూమా కిషోర్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకుని కమిషనర్ కిషోర్తో వాగ్వాదానికి దిగి కూల్చివేతను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మాణానికి అనుమతులు లేవంట.. గోడ కూల్చేందుకు వచ్చిన కమిషనర్ను ఎందుకు కూల్చుతున్నారని అడగ్గా ముందుగా గోడ నిర్మాణానికి అనుమతులు లేవని, అనంతరం గోడ అంత ఎత్తు కట్టుకోకూడదని.. మరోసారి పక్కన అనుమతులు లేకుండా ప్లాట్లు వేశారని ఇలా పొంతన లేని మాటలు చెప్పడం అక్కడున్న వారికి వింతగా అనిపించింది. అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించారంటే ఇదే సర్వే నంబర్లో పదుల సంఖ్యలో ప్రహరీలు నిర్మించారు. ఎత్తుగా ఉందంటే దీని పక్కనే ఎమ్మెల్యే నిర్మాణం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంది, మరి వీటన్నింటిజోలికి పోకుండా ఇక్కడకే రావడం ఏంటని ప్రశ్నించారు. కక్ష సాఽధింపు కాకుంటే పక్కనున్న వాటిపై కూడా కమిషనర్ చర్యలు తీసుకోవాలి కదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాంపౌండ్ వాల్ కూల్చివేస్తున్న దృశ్యం ప్రజలే బుద్ధి చెబుతారు ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆస్తులను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ చేస్తున్న దౌర్జన్య కాండకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇదే సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాలు అధికారులకు కనిపించవా? వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు అధికారపార్టీ నేతలు ఎలా చెబితే అలా తలాడించడం విచారకరం. – భూమా కిషోర్రెడ్డి -
దేశభక్తి ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా !
నంద్యాల: ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టెక్కె మా ర్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మంత్రి, కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు జిల్లా అధికారులు కలిసి 100 మీటర్ల జాతీయ పతాకం ర్యాలీలో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశ అభివృద్ధికి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజ కుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. నేపథ్యంలో స్వాంత్రంత్యం కోసం ప్రాణాల ర్పించిన మహనీయుల త్యాగనిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న.. మురిపించేనా..!
కోవెలకుంట్ల: గతేడాది నష్టాలు మూటగట్టుకున్న మొక్కజొన్న రైతులు దేవుడిపై భారం వేసి ఈ ఏడాది మళ్లీ అదే పంట సాగు చేస్తున్నారు. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగు కావడం గమనార్హం. ఇటీవల ఎస్సార్బీసీ, కేసీకెనాల్, తెలుగుగంగ కాల్వల్లో నీరు పుష్కలంగా చేరడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో అత్యధికంగా 6,745 హెక్టార్లలో, కొత్తపల్లె 5,793, పాణ్యం 5,279, నందికొట్కూరు 4,607, ఆళ్లగడ్డ 4,288, ఆత్మకూరు 4,033, బనగానపల్లె 3,964, మిడుతూరు 3,635 హెక్టార్లలో రుద్రవరం 3,225, పగిడ్యాల మండలంలో 2,406 హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. గత ఏడాది జిల్లాలోని 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం కాగా ఆయా డలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభా పంట చేతికందే తరుణంలో తుపాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు.కత్తెర పురుగు భయంజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. ముందుగా సాగు చేసిన మొక్కజొన్నను కత్తెర పురుగు వెంటాడే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరును కత్తెర పురుగు ఆశిస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సుంకుదశలో ఉన్న మొక్కజొన్న పైరు ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మొక్కజొన్న కంకి కట్టే దశలో భారీ వర్షాలు కురిస్తే నష్టం చేకూరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో కోటి ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయా, ప్రకృతి వైపరీత్యాలు మరోసారి దెబ్బతీస్తాయన్న ఆందోళన నెలకొంది.మిరపకు ప్రత్యామ్నాయంగా.. రెండేళ్ల నుంచి మిర్చి సాగు రైతుల కళ్లలో కారం కొడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మిర్చి ఎర్ర బంగారం కాగా గత ఏడాది నుంచి భారంగా మారింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా ఎండు మిరపకాయలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు ధర పలికాయి. గతేడాది నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది నవంబర్ నెలలో క్వింటా రూ. 15 వేల నుంచి రూ. 16 వేలు పలుకగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ధర రూ. 10 వేలకు పడిపోయింది. మిరప సాగుకు ఎకరాకు రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మిర్చికి తెగుళ్లు ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా గిట్టుబాటు ధర లేకపోవడంతో గతేడాది ఎకరాకు రూ. 50 వేల నష్టం వాటిల్లింది. దీంతో ఈ ఏడాది మిరప సాగు చేయాలంటే నే రైతు లు భయపడుతున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 5–6 వేల హెక్టార్లకు మించి మిరప సాగయ్యే సూచనలు లేవని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది మిరపసాగు తో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది అంతమొత్తం పెట్టుబడి పెట్టి సాగు చేసేందుకు సాహ సం చేయడం లేదు. మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న విస్తారంగా సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, మూడు నుంచి నాలుగు సాగునీటి తడులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పెట్టుబడులు వెచ్చించాల్సి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న రెండు నెలల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల దశలో ఉంది. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.ఐదు ఎకరాల్లో సాగు చేశాఈ ఏడాది ఐదు ఎకరాల సొంత పొలంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 12 వేలు వచ్చింది. గత ఏడాది రెండు ఎకరాలు సాగు చేయగా ఏడాది అదనంగా మరో మూడు ఎకరాల్లో వేశాను. నాలుగు నెలల పంటకాల కాగా ఇప్పటి వరకు పైరు ఆశాజనకంగా ఉంది. – రాంభూపాల్రెడ్డి, రైతు, కోవెలకుంట్లఈ ఏడాది దిగుబడులపై ఆశలుగత ఏడాది మొక్కజొన్న సాగు చేసి నష్టాలు చవి చూశాను. ఈ ఏ డాది ఎకరా రూ. 15 వేలు మేరకు మూడు ఎకరాలు కౌలుకు తీసుకు ని రెండు నెలల క్రితం మొక్కజొన్న పంట సాగు చేశాను. పెట్టు బడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 10 వేలకు పైగా పెట్టాను. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాగు కలిసొస్తుందని భావిస్తున్నాను. – కృష్ణారెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం -
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): వచ్చే నెల 5వ తేదీన గురుపూజ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో పదేళ్లు పూర్తి చేసిన, అభియోగాలు లేని, క్రిమినల్ కేసులు లేని వారు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డుకు అర్హులన్నారు. ఈనెల 19, 20వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి దరఖాస్తులు పంపాలన్నారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.69.12 లక్షలు బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.69.12 లక్షలు వచ్చింది. స్వామి అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులను మంగళవారం లెక్కింపు చేపట్టారు. దేవదాయశాఖ అధికారి మోహన్, ఇన్స్పెక్టర్ రమేష్ పర్యవేక్షణలో ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 76 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 69,12,094 నగదు, 33 గ్రాముల బంగారు, 2.300 కేజీల వెండి వచ్చింది. కార్యక్రమంలో బాలజీ సేవా ట్రస్ట్ సభ్యులు మహిళా భక్తులు, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రవ్వలకొండకు దారేది? బనగానపల్లె: ఎంతో చారిత్రాత్మక విశిష్టత ఉన్న రవ్వలకొండకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో పర్యాటకులు, భక్తులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని గరిమిరెడ్డి అచ్చమ్మమటం, సమీపంలోని రవ్వలకొండపై ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, కాలజ్ఞానం గుహల సందర్శనకు పర్యాటకులు నిత్యం వస్తుంటారు. అయితే రవ్వలకొండకు వెళ్లే రోడ్డు కంకర తేలి శిథిలావస్థకు చేరడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ రహదారిని బీటి రోడ్డుగా మార్చాలని గతంలో రూ.కోటి నిధులు కూడా మంజూరయ్యా యి. అయితే పనుల్లో జాప్యం కావడంతో నిధులు రద్దయ్యాయి. రహదారి సమస్య మాత్రం పర్యాటకులను వేధిస్తోంది. ప్రతి రోజు రవ్వలకొండను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్లే రహదారిలో కంకర తేలి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రవ్వలకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మెరుగైన వసతులు కల్పించాలని గతంలో పంపిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి రవ్వలకొండకు బీటీ రోడ్డు నిర్మించాలని యాత్రికులు కోరుతున్నారు. -
భువనమోహనుడికి బ్రహ్మరథం
● అశేష జనవాహిని మధ్య సాగిన రాఘవేంద్రుల రథయాత్ర ● అలరించిన కళాకారుల నీరాజనాలు మహాద్వారం కూడలిలో అశేష భక్తజన వాహిని మధ్య రాయరు రథం మంత్రాలయం: భువనమోహనుడు మహారథంపై ఊరేగిన వేళ.. తుంగభద్రమ్మ మది పులకించిపోయింది. వేదభూమి పరవశించి ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లింది. భక్తజనం హర్షధ్వానాలతో జపించింది. రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహారథోత్సవం కనులపండువగా సాగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. అక్క డ పాఠశాల విద్యార్థులు ఉత్సవమూర్తికి వేద పఠనం గావించి దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామి వారికి విశేష పూజలు గావించి వసంతోత్సవానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై కొలువుంచగా.. భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ దర్శించుకు న్నారు. పీఠాధిపతి ప్రవచనం ముగియగానే భక్తులను ఆశీర్వచనం చేస్తూ 12.15 గంటలకు రథయాత్రకు అంకురార్పణ పలికారు. మధ్వ కారిడార్ చేరుకోగానే స్వామిజీ హెలికాప్టర్తో పుష్పవృష్టి కురిపించారు. మంగళ వాయి ద్యాలు, డోలు దరువులు, రంగుల ఆటలు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాల మధ్య మహారథం ముందుకు కదిలింది. రాఘవేంద్ర సర్కిల్ వద్ద స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కు లు తీర్చుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రూ.250 కోట్లతో జలాశయం మంత్రాలయం క్షేత్రం సౌకర్యార్థం రూ.250 కోట్లతో జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. వేడుకలో స్వామిజీ ప్రసంగిస్తూ క్షేత్రంలో అంతర్గత రహదారులతో పాటు రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాఘవేంద్ర సర్కిల్ వరకు కారిడార్ నిర్మిస్తామన్నారు. శ్రీమఠం దినదినాభివృద్ధికి అంతరంగిక భక్తుల సహకారం ఎంతో ఉందన్నారు. వేడుకల్లో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, తహసీల్దార్ రమాదేవి, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
గోశాలలో పశుగ్రాసం దగ్ధం
● రూ.5 లక్షల నష్టం మంత్రాలయం రూరల్: శ్రీమఠం గోశాలలో జరిగిన ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధమైంది. గోశాలలో పశుగ్రాసం ఉంచిన గౌడౌన్లో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు ఏర్పడి వరిగడ్డికి వ్యాపించాయి. మంటలను గమనించిన మఠం సిబ్బంది గోవులను బయటకు వదిలేశారు. అనంతరం ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలకు గౌడౌన్లో ఉన్న పశుగ్రాసం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. మైనారిటీ హాస్టల్లో ప్రవేశం పొందండి కర్నూలు(అర్బన్): కళాశాల విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు నగరంలోని వెంకటా చలపతి నగర్లో ఉన్న ప్రభుత్వ పోస్టు మెట్రిక్ మైనారిటీ బాలుర వసతి గృహంలో ప్రవేశం పొందాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని సోమవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కళాశాల విద్యను అభ్యసిస్తున్న పేద మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బావిలో పడి భక్తుడి మృతి కౌతాళం: ఈరన్నస్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ భక్తుడు మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడా మండలం హనుమాపురానికి చెందిన పెద్దింటి అనిల్కుమార్ (50) శ్రావణమాసం సోమవారం సందర్భంగా ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి కుటుంబంతో వచ్చాడు. ఉరుకుందకు మజరా గ్రామం అయిన తిమ్మాపురం గ్రామం వద్ద బావిలో అనిల్ స్నానానికి వెళ్లి కాలుజారి పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోతుండటంతో గ్రామస్తులు వెంటనే బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడికి పూజారి శఠగోపం
● మట్కా ఆడి అప్పులపాలైన పూజారి ● దేవుడి వెండి ఆభరణాలు విక్రయించేందుకు యత్నం ● ఆభరణాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులుఆదోని అర్బన్: దేవుడి సేవలో తరించాల్సిన పూజారి మట్కాకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఏకంగా దేవుడి ఆభరణాలపై కన్నేశాడు. వాటిని గుట్టుగా అపహరించి విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో వెలిసిన శ్రీ వసిగేరప్ప దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న గొర్రెల వసిగేరప్ప మట్కా ఆడుతూ అప్పులపాలయ్యాడు. బెంగళూరులో ఉంటూ మట్కా ఆడి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో దేవుడి ఆభరణాలు అమ్మేసి బయటపడాలని భావించాడు. దీంతో గుడిలో ఉన్న విగ్రహాలను పది రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే ఆలయంలో 4.386 కేజీల వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు బాసింగం కనిపించడం లేదని ఆ గ్రామానికి చెందిన కురి చంద్ర ఈనెల 10వ తేదీన ఇస్వీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పూజారి వసిగేరప్ప తన ఇంట్లో దాచిన ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయించేందుకు సోమవారం తరలిస్తుండగా చాగి గ్రామం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ముఖద్వారం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ బంగ్లాలో డీఎస్పీ హేమలత మీడియాకు వివరించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ప్రదర్శించారు. కేసును ఛేదించిన ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఇస్వీ ఎస్ఐ డాక్టర్ నాయక్, హెడ్కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుళ్లు సుదర్శన్, ఖాసీంను డీఎస్పీ అభినందించారు. -
ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం
కర్నూలు: ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని చెప్పి కర్నూలు బుధవారపేటకు చెందిన బోయ శేఖర్ రూ.60 వేలు తీసుకుని మోసం చేశాడని మంత్రాలయంకు చెందిన వీరేష్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల్లో కొన్ని... ● కర్నూలు అశోక్ నగర్కు చెందిన వినయ్ కుమార్ కడప రిమ్స్లో తన భార్యకు స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన ప్రదీప్ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు మండలం పసుపుల, రుద్రవరం, నూతనపల్లె గ్రామాల రైతుల నుంచి పసుపల గ్రామానికి చెందిన పకిడి ఖాజా అనే వ్యాపారి రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా అదే గ్రామానికి చెందిన సుల్తాన్ ఫిర్యాదు చేశారు. ● నన్నూరు గ్రామానికి చెందిన గుర్రం నాగన్న, వెంకటస్వామి, వెంకటరాముడు, ఉపేంద్రలు కలసి తన పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, సర్వే చేయించడానికి కూడా సహకరించడం లేదని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కనకమ్మ ఫిర్యాదు చేశారు. ● కర్నూలుకు చెందిన రవీంద్ర పాతబస్తీలోని పూలబజార్కు చెందిన కొంతమంది మహిళల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ కార్డు, ఫొటోలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి వారికి తెలియకుండా వారి పేర్ల మీద ఏసీలు, టీవీలు, సెల్ఫోన్లు తీసుకుని మోసం చేస్తున్నాడని కర్నూలు వడ్డెగేరికి చెందిన షేక్ సన ఫిర్యాదు చేశారు. ● రాజు, మహేష్ అనే వ్యక్తులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసుకుని తమ ఆస్తిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, నన్ను, మా నానమ్మను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆదోని పట్టణానికి చెందిన రాహుల్ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు -
భక్తుల కష్టాలు కనుమా?
ఈరన్న స్వామి..కౌతాళం: శ్రావణ మాసం మూడో సోమవారం. దారులన్నీ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం వైపు అన్నట్లుగా భక్తులు తరలివచ్చారు. రద్దీకి తగ్గ ఏర్పాట్లలో దేవస్థానం చేతులేత్తేసింది. అదే ట్రాఫిక్.. అదే అపరిశుభ్రతతో భక్తుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి ఏటా సుమారు రూ. 20 కోట్ల ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో వెనుకడుగు వేస్తోంది. ● క్షేత్రానికి సమీపంలో ఎల్లెల్సీ కాల్వ ఉన్న పుణ్య స్నానాలు చేసేందుకు కాల్వ వెంట మెట్లు వంద మీటర్ల పొడువు మాత్రమే ఉన్నాయి. దేవస్థానం ముందు చూపుతో కాల్వకు ఇరువైపులా భక్తుల రద్దీకి అనుగుణంగా మెట్లు నిర్మాణం, షవర్లు ఏర్పాటు చేస్తే స్నానానికి ఇక్కట్లు తప్పేవి. శానిటేషన్ సిబ్బంది తగినంత మంది లేక పోవడంతో క్షేత్ర పరిధిలో ఎక్కడి చూసినా అపరిశుభ్రత కనిపించింది. ● ఓ వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్, ఇంకో వైపు పంట పొలాలు ఉండటంతో భక్తులు క్షేత్రానికి కాలి నడకన వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ మళ్లింపులో అధికారులు ముందు చూపులేక పోవడంతో ప్రతి సోమవారం ఇదే సమస్య తలెత్తుతోంది. ● కౌతాళం రూట్లో ఈచనహాల్ వరకు ట్రాఫిక్ జామ్తో హాల్వి రూట్లో చిరుతపల్లి వరకు, కోసిగి రూట్లో జుమ్మలదిన్నె వరకు, ఆదోని రూట్లో రెండు కి లోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ● ఉదయం 10 గంటల ప్రాంతంలో ట్రాిఫిక్లో ఇరుక్కున వారు సాయంత్రం ఐదు తర్వాత బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వృద్దులు,వికలాంగులు చాలా ఇబ్బందుల పడ్డారు. ట్రాఫిక్తో చాల మంది భక్తులు కాలనడకన పొలాల వెంట ఉరుకుందకు చేరుకోగా కొంత మంది అక్కడే పొలాల్లోనే వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. ● ట్రాఫిక్ కంట్రోల్లో కేవలం కౌతాళం సీఐ అశోక్కుమార్ వారి సిబ్బందితో పాటు కొంతమంది ఎస్సైలు మాత్రమే నియంత్రించే పని చేశారే గాని బందోబస్తు వచ్చిన ఇతర సిబ్బంది చాలా వరకు కనిపించక పోవడం గమనార్హం. -
వీరభద్రస్వామికి పెళ్లి కుమార్తె నచ్చింది...
● కార్తీక మాసంలో నిశ్చితార్థంఆస్పరి: శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లి చూపులు కార్యక్రమం వైభవంగా సాగింది. మధ్యవర్తులు పుప్పాలదొడ్డి గిడ్డాంజనేయస్వామి, చెన్నంపల్లి కాత్రికేయ స్వామి సమక్షంలో సంప్రదాయం ప్రకారం చేపట్టిన పెళ్లి చూపుల్లో వీరభద్రస్వామికి కాళికాదేవి నచ్చడంతో కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే మొదటి సోమవారం నిశ్చితార్థం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉగాది వేడుకల్లో భాగంగా వీరభద్రస్వామికి, కాళికాదేవికి పెళ్లి జరిపిస్తామని గ్రామస్తులు తెలిపారు. శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా సోమవారం కై రుప్పల గ్రామస్తులు తంగభద్ర జలాలు తెచ్చి వీరభద్రస్వామి, కాళికాదేవిలకు అభిషేకం చేశారు. సంప్రదాయం ప్రకా రం ప్రతి ఏటా గ్రామస్తులు భజన చేసుకుంటూ పాద యాత్ర ద్వారా తుంగభద్ర జలాలలను తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేస్తామని చెప్పారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పూల పల్లకీలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. -
కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు
నంద్యాల: ‘కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాకు మా నాన్న మిత్రుడు కిశోర్ తన సోదరుడు డాక్టర్ సునీల్ ద్వారా కిడ్నీ మార్పిడి చేయిస్తానని నమ్మించి రూ. 19.84 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఆపరేషన్ చేయించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా భయపెడుతున్నాడు’ అంటూ నంద్యాల పట్టణానికి చెందిన ధనుంజయ్ ఎస్పీ అధిరాజ్సింగ్ను ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో 89 వినతులు వచ్చాయని, వాటిపై పూర్తిస్థా యి విచారణ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధి లో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.... ● ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామంలో నాకు 1.27 సెంట్ల భూమి ఉంది, నా పక్కన పొలం ఉన్న దస్తగిరిరెడ్డి నా పొలంలోని 17 సెంట్లను ఆక్రమించుకొని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. విచారణ చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆ గ్రామానికి చెందిన మోహన్రావు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● నాకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు సంతానం. నా భర్త పేరు మీద 2.64 సెంట్ల భూమి ఉంది. ఆయన మరణానంతరం నాకు రావాల్సిన ఆ భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కొడుకు మద్దిలేటి అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నాడు. ఇందులో 1.28 సెంట్ల భూమిని వేరే వాళ్లకు అమ్ముకున్నాడు. మద్దిలేటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన కె.నరసమ్మ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. 19.84 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడు ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు -
జాతీయ సమైక్యత కోసం‘తిరంగా’ ర్యాలీ
నంద్యాల: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యత కోసం ఈనెల 12న నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకూ హర్ ఘర్ తిరంగాపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాలో నిర్వహించే ’హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహణపై సోమవారం జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో, జిల్లా కేంద్రంలో నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పౌరులు, విద్యార్థిని, విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్ సరోవర్ పనులు జరిగిన ప్రాంతాల్లో ఫొటోలు దిగి సంబంధిత సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను త్రివర్ణ రంగులతో కూడిన దీపాలతో అలంకరించాలన్నారు. అదే విధంగా హర్ ఘర్ తిరంగా సైట్లో అందరూ నమోదై, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్జీల నియామకం
నంద్యాల(వ్యవసాయం): జిల్లాకు జడ్జీను నియమిస్తూ సోమవారం హైకోర్టు రిజిస్టార్ ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఎస్.శ్రీనివాసులు నంద్యాల పీడీఎం కోర్టుకు, నెల్లూరు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ పి.వినోద్ డోన్కు బదిలీపై రానున్నారు. జడ్జి వినోద్కుమార్ సెప్టెంబర్ 14వ తేదీ వరకు ట్రైనింగ్ తర్వాత బాధ్యతలు చేపట్టనున్నారు. నంద్యాల పీడీఎం కోర్టు ఇన్చార్జిగా ఉన్న జడ్జి లక్ష్మికర్రి యథాతథంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతారని కోర్టు సిబ్బంది తెలిపారు. సర్టిఫికెట్లతో హాజరు కావాలి నంద్యాల(న్యూటౌన్): డీసెట్– 2025లో అర్హత సాధించిన విద్యార్థులు సంబంధిత డైట్ కాలేజీల్లో 11 నుంచి 14వ తేదీ వరకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. తాగు, సాగునీరు అందక సీమలో కరువు నంద్యాల(న్యూటౌన్): తాగు, సాగునీరు అందక రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పందికోన రిజర్వాయర్ కింద 61,400 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉందని, అయితే నేటికీ 10వేల ఎకరాలకు కూడా అందించని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాల్వ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు అందించేలా కార్యచరణ చేపట్టాలన్నారు. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో 106 చెరువులకు హంద్రీ–నీవా నీటిని నింపి కోనసీమ చేస్తామన్న ముఖ్యమంత్రి దీన్ని 66 చెరువులకు కుదించారన్నారు. ఆటో డ్రైవర్ల నిరసన కొలిమిగుండ్ల: రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని కోరుతూ ఆటోడ్రైవర్లు సోమవారం కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే ఆటోడ్రైవర్లకు ఉనికిలేకుండా పోతుందన్నారు. ఈ పథకంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు. -
ఒక్క మాత్రతో ‘నులి’పేద్దాం!
● ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి చర్యలు ● జిల్లాలో 4,38,475 మంది పిల్లలు ● 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ మాత్రలు ● రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం మాత్రల పంపీణీకి పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 12న జిల్లా అంతటా ఆల్బెండాజోల్ మాత్రలు పిల్లలకు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 4,38,475 మంది పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నాం. నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. కాలకృత్యాల తీర్చుకున్న అనంతరం తప్పనిసరిగా చేతులను శుభ్రపరుచుకోవాలి. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, నంద్యాల. అవగాహన కల్పించాం ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. మాత్రలను చప్పరించడం లేదా నమిలి మింగటం చేయాలి.మాత్రలు తీసుకున్న తర్వాత ఏవిదమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి. అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలను అందించనున్నాం. – డాక్టర్ కాంతారావునాయక్, జిల్లా ప్రోగ్రాం అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్య్థ కార్యక్రమం గోస్పాడు: చిన్నారులను పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల కడుపులో చేరి మెలిపెడుతూ పిల్లల్లో పేలతనం, నీరసం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తరచూ కనిపిస్తుంటుంది. అలాగే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. నిర్లక్ష్యంగా ఉంటే జీవితాలనే నులిమేస్తాయి. 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. ఒకే ఒక్క మాత్ర ఆల్బెండ్ జోల్తో ఈ సమస్యను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈనెల 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలు, పాఠశాలలు, జూనియర్, కళాశాల ల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్ర లు పంపిణీ చేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాలు, 2,141 పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా గుర్తించారు. వీటి పరిధిలో1,22,094 మంది ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు, 3,16,381 మంది 6 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఏదైనా పరిస్థితుల దృష్ట్యా 12వ తేదీన మాత్రలు తీసుకొని వారు ఉంటే వారి కోసం మాప్ అప్ డే రోజున ఈనెల 20వ తేదీ మరోమారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రలు అందజేయనున్నారు. అపరిశుభ్రతే కారణం... పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. పండ్లను నీటితో కడిగి తినాలి. ఆహార పదార్థాలపై ఎప్పడూ మూతలు మూసి ఉంచాలి. వ్యాపించే విధానం... శరీరంలో నులిపురుగులు ఉన్న వారు చేసిన మల విసర్జన ద్వారా కలుషితం అయి తద్వారా వాటి గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాక తాగు నీరు, గాలి ద్వారా ఆహార పదార్థాలపై చేరుతాయి. మురికి చేతులు ద్వారా ఈ లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా మిగతా పిల్లలకు నులి పురుగులు సంక్రమిస్తాయి. అనేక రకాలుగా అనర్థాలు.. నులిపురుగులు అపరిశుభ్రత వల్లే శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల రక్తహీనతకు దారితీస్తాయి. మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపునొప్పి, వికారము కలగజేస్తాయి. ఆహారం సహించదు ,ఆకలి ఉండదు. నీరసంగా ఉంటుంది.పిలల్ల కడుపులో కొంకి, నులి, బద్దె, గుండ్రని పురు గులు రక్తాన్ని పీల్చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ పురుగుల పునరుత్పత్తి, ఎదుగుదల మొత్తం మన కడుపులోనే జరగడంతో మనం తీసుకునే ఆహారాన్ని ఆ పురుగులు శోషించుకుంటాయి. మాత్రల డోస్ ఇలా.. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్ర (200 మిల్లీగ్రాములు) నీటిలో కలిపి తాపాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 మిల్లీగ్రాముల మాత్రను మధ్యాహ్నం భోజనం తరువాత చప్పరించేలా చూడాలి. మింగకుండా వైద్య సిబ్బంది పర్యవేక్షించాలి. -
తెగిపోయిన రోడ్డు
● స్తంభించిన రాకపోకలు కొలిమిగుండ్ల: భారీ వర్షానికి అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలోని రోడ్డు తెగిపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా సరిహద్దుకు 50 మీటర్ల సమీపంలో అనంతపురం జిల్లా బుగ్గకు చేరువలో అనంతపురం–అమరావతి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో అక్కడ వాహనాల రాక పోకల కోసం సర్వీస్ రోడ్డు నిర్మించారు. భారీ వర్షం కురవడంతో వాగు నీటికి రోడ్డు కొట్టుకుపోయింది. వందల సంఖ్యలో వాహనాలు ఇరువైపులా బారులుతీరాయి. చాలా మంది ట్రాఫిక్లో నిలిచిపోవడంతో పెళ్లిళ్లకు చేరుకోలేక పోయారు. ఆదివారం కావడంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లల కోసం పాఠశాలలు, కాలేజీల వద్దకు వెళ్లెందుకు తెల్లవారు జాము నుంచి బస్సులు కోసం నిరీక్షించినా ఫలితం లేకుండా పోయింది. మూడు జిల్లాలకు సరిహద్దులో ఉన్న కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణిలకులతో రద్దీగా మారిపోయింది. బనగానపల్లె, జమ్మలమడుగు డిపో బస్సులు జిల్లా సరిహద్దులో ఉన్న రాయల్టీ చెక్పోస్టు వరకు మాత్రమే వెళ్లి అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చాయి. బస్సుల కోసం గంటల సమయం ఎదురుచూడాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రవాణా స్తంభించడంతో కొలిమిగుండ్లతో పాటు అవుకు, బనగానపల్లె, వైఎస్సార్జిల్లా, తాడిపత్రి ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. -
‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి
పాణ్యం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను, దోపిడీని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు గమనించాలని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు అక్కడున్న ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డల్లాస్లో ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర ప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు ఆయన కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. జగనన్న పాలన అంటే ప్రజలకు నమ్మకమన్నారు. జగనన్న పాలనలో 15,004 గ్రామ, వార్డు సచివాయాలు ఏర్పాటయ్యాయని, 2.6 లక్షల మంది వలంటర్లీ సేవలు అందించారని, స్పందన కార్యక్రమంతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీలోకి 3 వేలలకు పైగా చికిత్స చేరి సామాన్యులకు ఆరోగ్య భరోసా కలిగిందన్నారు. పదివేలకు పైగా వైఎస్సార్ఆరోగ్య క్లినిక్లు తీసుకొచ్చారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 50వేల పైగా పాఠశాలలను ఆధునికీకరణ చేశారన్నారు. మొత్తం 6.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 28.89లక్షల ప్రయివేట్ ఉద్యోగాలు కల్పించారన్నారు. సీఎస్డీపీ వృద్ధిరేటు 11.43శాతంగా దేశంలో మొదటి స్థానంలో నిలించిందన్నారు. జగనన్న పాలనలో కాగ్ నివేదిక కేంద్ర గణాంకాలు ఉన్నాయన్నారు. టీడీపీ, జనసేన, కూటమి తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశాయని, సోషల్ మీడియా పోస్టులతో ప్రజలకు నిజం చెప్పాలన్నారు. జగనన్న నాయకత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియాలన్నారు. నిజం మాట్లాడే గొంతులుగా ఎన్ఆర్ఐలు ముందుకు రావాలన్నారు. అమెరికా డల్లాస్లో కాటసాని ఆత్మీయ సమావేశం -
భార్య కాపురానికి రాలేదని..
కోవెలకుంట్ల: పట్టణంలోని ఎల్ఎం కాంపౌండ్కు చెందిన ఓ యువకుడు ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మిద్దె అశోక్(35) స్థానిక ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ పద్ధతిన బస్సులు స్వీపింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. నకిలీ సమాచారాన్ని నమ్మొద్దు నంద్యాల(వ్యవసాయం): ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిణి రజియాసుల్తానా ఆదివారం తెలిపారు. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పర్సనల్ అధికారి తెలిపినట్లుగా ఒక దిన పత్రికలో వార్త ప్రచురితమయిందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, పర్సనల్ అధికారి ఎలాంటి ప్రకటనను జారీ చేయలేదని, కావున ప్రజలు, నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉపాధ్యాయుడు మృతి కర్నూలు సిటీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎమ్మిగనూరు బాలురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వి.శివనాగరాజు(45)కు ఉల్చాల రోడ్డు జంక్షన్లో ఈ నెల 8న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తలకు గాయాలు కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు హాస్సిటల్లో శస్త్ర చికిత్స చేశారు. అయితే చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందారు. వి.శివనాగరాజుకు భార్య ప్రియాంక, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. విషయం తెలుసుకున్న డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రెక్రిష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాముడు, గట్టు తిమ్మప్ప, గోట్ల చంద్రశేఖర్లు హాస్పిటల్కి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు
కర్నూలు(అర్బన్): ప్రజల హక్కులను పరిరక్షించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కట్టుబడి ఉంటుందని కౌన్సిల్ రాష్ట్ర ఇన్చార్జ్ ఈదురు పద్మాకర్ అన్నారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా కౌన్సిల్ వెంటనే స్పందిస్తుందన్నారు. వారి హక్కులను కాపాడేందుకు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. ఆయా వర్గాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు కౌన్సిల్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికై నా వారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో అలాంటి వారిని గుర్తించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. తమ హక్కులను కాపాడుకోవడంలో భాగంగా తమ పరిధిలో జరిగే అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆయా సమస్యలు వెలుగులోకి రావడంతో పాటు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు అక్బర్, ప్రధాన కార్యదర్శి బెస్త గోవిందరాజులు, రమణ, సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఐస్ ఫ్యాక్టరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని కౌన్సిల్కు డోన్కు చెందిన లక్ష్మణస్వామి వినతి పత్రాన్ని అందించారు. -
‘ఆకర్ష్’ సేవలు అభినందనీయం
● కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఓర్వకల్లు: ‘అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్’(ఆకర్ష్) పేరుతో పాఠశాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ రంజిత్ బాషా అభిప్రాయపడ్డారు. ఆదివారం మండలంలోని కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1992–93, 1998–99వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి ఆకర్ష్ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర గురుకుల పాఠశాల సొసైటీ ఛీప్ సెక్రటరీ మస్తానయ్య, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపాల్ ప్రసాదరావు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి అసరమైన నిధుల మంజూరుకు సంబంధించిన నివేదికలను కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆకర్ష్లో చేరిన ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ల సమీపంలో రూ.5 కోట్లతో జాతీయ స్థాయిలో స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఆకర్ష్ బోర్డు గౌరవ సభ్యులు కిరణ్కుమార్, సొసైటీ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ వరప్రసాద్, జిల్లా, రాష్ట్ర, దేశ విదేశాలల నుంచి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డెంగీ బూచీ.. రోగులను దోచి!
ఎలీసా టెస్ట్ ద్వారానే డెంగీ నిర్ధారణ చేయాలి కర్నూలు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్ట్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరపీడితులకు ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తి రక్తాన్ని ఎలీసా టెస్ట్ కోసం పంపించాలి. ఎలీసా టెస్ట్లో డెంగీ నిర్ధ్దారణ అయితేనే చికిత్స చేయాలి. డెంగీగా చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – నూకరాజు, మలేరియా అధికారి, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): దోపిడీ జబ్బు ఉన్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ బూచీతో జ్వరపీడితుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. జ్వరంతో వెళ్తే చాలు ర్యాపిడ్ టెస్ట్ చేయడం, ప్లేటెలెట్స్ తగ్గాయని భయపెట్టడం, తర్వాత చికిత్స పేరుతో రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు బిల్లులు బాదడం పరిపాటిగా మారింది. డెంగీ జ్వరం నిర్ధారణ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా గాకుండా ఎలీసా టెస్ట్ ద్వారా చేయాలని అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటితో పాటు మరో 12 ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటితో పాటు 28 అర్బన్హెల్త్ సెంటర్లు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. వీటితో పాటు కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో 170కి పైగా రిజిస్టర్డ్ ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 190 మంది వరకు డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదైంది. ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న వారు దీనికి మూడింతలు ఉన్నారు. చాలా మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న వారు మాత్రం ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల సంఖ్య పెరగడం, అందరికీ డిమాండ్ లేకపోవడం, రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో కొందరు వైద్యులు వచ్చిన వారి నుంచే ఎక్కువగా వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు ఆర్ఎంపీలకు 50 శాతానికి పైగా కమీషన్లు ముట్టజెబుతూ వారి ఆసుపత్రులకు రోగులు తెచ్చేలా చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిని ముందుగా రూ.5వేలకు తగ్గకుండా వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించి చికిత్స చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లినా రూ.6వేలకు తక్కువగాకుండా వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఎక్కువగా కర్నూలులోని కొత్తబస్టాండ్, ఎన్ఆర్ పేట, గాయత్రి ఎస్టేట్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. వైద్యులకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని కొందరు రోగులు ప్రైవేటు వైద్యుల వద్ద పరిస్థితిని అర్థం చేసుకుని తాము మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది రోగులు జ్వరం వచ్చిందంటే ముందుగా మెడికల్షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి మందులు కొని వాడి తగ్గించుకుంటున్నారు. డెంగీ ఇలా వస్తుంది డెంగీ జ్వరం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమ శరీరంపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. శరీరంపై చారలు ఉండటం వల్ల దీనిని పులిదోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమ శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదయమైన రెండు గంటల వరకు, సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఈ దోమ తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లను పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక కూడా దాక్కుంటాయి. ఈ దశలోనే ఆసుపత్రిలో చేర్చాలి తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు అవుతుంటే, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవించడం, మలమూత్రాల్లో రక్తం పడటం, మత్తుగా ఉండటం, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చాలి. డెంగీ షాక్ సిండ్రోమ్, డెంగీ హెమరేజిక్ సిండ్రోమ్ దశలో ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి. సాధారణ మనిషిలో ప్లేట్లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సీజన్లో ఈ రక్తకణాల సంఖ్య 10వేలలోపు ఉంటే మాత్రమే జాగ్రత్త పడి ఆసుపత్రిలో చేరాలి. జ్వరం తగ్గినా కూడా వారం తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఈ దశలో శరీరంలో వాపులు వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ర్యాపిడ్ టెస్ట్తో దోపిడీడెంగీ పరీక్ష నిర్ధారణ కోసం మొదట ర్యాపిడ్ కిట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయితే ఆ రోగి రక్తనమూనాలను కర్నూలు మెడికల్ కాలేజిలోని మైక్రోబయాలజి ల్యాబ్, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి. ఈ ల్యాబ్లకు ప్రతిరోజూ 30 నుంచి 40 వరకు రక్తనమూనాలు వస్తున్నాయి. ఇక్కడి నివేదికల ఆధారంగా డెంగీ నిర్దారణ చేస్తారు. ఇక్కడి వైద్యులు ఇచ్చే టెస్ట్ ఆధారంగానే వ్యాధి నిర్దారణ చేస్తారు. కానీ అధిక శాతం ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ర్యాపిడ్ కిట్లో వచ్చిన నివేదికల ఆధారంగా డెంగీగా చెప్పి చికిత్స చేస్తున్నారు. రక్తంలో ప్లేట్లెట్లు(రక్తకణాలు) తగ్గాయని చెప్పి బ్లడ్బ్యాంకులకు పంపి వాటిని తెప్పించి ఎక్కిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా వసూళ్లు ర్యాపిడ్ టెస్ట్ రిపోర్టుతోనే చికిత్స ఎలీసా టెస్ట్ చేయించని ఆసుపత్రులు పలు ల్యాబ్ల్లో తప్పుడు నివేదికలు..! ప్రతి జ్వరమూ.. డెంగీ కాదంటున్న వైద్యులు -
కొండల రాయుడికి నేడు తేళ్ల నైవేద్యం
ఎక్కడైనా దేవుళ్లకు పాలు, పండ్లు, ఫలహారాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కోడుమూరు కొండపై వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడతారు. ఇక్కడ కొండమీద మాత్రం భక్తులు చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుబొంకులేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం విశేషం. తేలు కుట్టినా ఏమీ కాదన్న నమ్మకం స్వామి వారికి సమర్పించేందుకు తేలును పట్టుకునే సమయంలో కుట్టినా ఏమి కాదని భక్తులు చెబుతారు. తేలు కుట్టినపుడు స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందనేది భక్తుల నమ్మకం. కొండపై వెలసిన కొండలరాయుడును దర్శించుకోవాలంటే ప్రజలు కిలోమీటర్కుపైగా ఉన్న కొండను కాలినడకన ఎక్కాలి. – కోడుమూరు రూరల్ -
పూల మాటున ‘పచ్చ’ డ్రామా!
● పూల వ్యాపారంలో పోటీ లేకుండా టీడీపీ నేత ఎత్తుగడ ● సహచరుడి జీపులను పోలీసులకు పట్టించిన తెలుగు తమ్ముడు ● పూలమండి ఎత్తేస్తే కేసు లేకుండా చేస్తానంటూ హామీ ● వాహనాలు వదిలేసేందుకు పోలీసులు రూ.3 లక్షలు డిమాండ్? ఆళ్లగడ్డ: అధికార పార్టీ అనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. అధికారులు, పోలీసులు తమ చేతుల్లో ఉన్నారంటూ పచ్చ డ్రామాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు, కట్టడాలను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న చాగలమర్రికి చెందిన టీడీపీ నేత తాజాగా తన వ్యాపారానికి అడ్డొస్తున్నాడని ఓ వ్యాపారిని స్థానిక పోలీసుల సహాయంతో బెదిరించి భయబ్రాంతులకు గురిచేశాడు. టీడీపీ నాయకుడి తీరు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో చర్చనీయాంశమవుతోంది. చాగలమ్రరిలో కొన్నేళ్లుగా పూల వ్యాపారం (మండి) చేస్తున్న టీడీపీ నేత తన పలుకుబడి, రౌడీయిజంతో పోటీగా ఎవరినీ వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటూ రూ. కోట్లు గడిస్తున్నాడు. ఎవరూ పోటీ లేక పోవడంతో ఇతను చెప్పిందే ధర. ఇతను ఎంత చెబితే అంతకే రైతులు విక్రయించాల్సిన దుస్థితి. అయితే ఈ మధ్య కాలంలో పొరుగునే ఉన్న వైఎస్సార్ జిల్లా ఇడమడక గ్రామానికి చెందిన హుస్సేన్బాషా అనే వ్యాపారి చాగలమర్రిలో పూల వ్యాపారం (మండి) ప్రారంభించాడు. దీంతో అతనికి పోటీగా రైతులకు ధర ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావించిన టీడీపీ నేత తనకు పోటీగా పూల వ్యాపారం (మండి) నిర్వహిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులతో కలసి నాటకం మొదలు పెట్టాడు. వాహనాలు పట్టించి .. విడిపించినట్లు కలరింగ్ ఇచ్చి.. శుక్రవారం రాత్రి దాదాపు రూ. 8 లక్షల విలువైన పూల లోడ్తో హుస్సేన్బాషాకు చెందిన రెండు వాహనాలు హైదరాబాద్కు బయలుదేరాయి. అయితే టీడీపీ నేత ఆదేశాలతో పోలీసులు హైవేపై కాపు కాసి రెండు జీపులను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్కు చేరాల్సిన పూలు స్టేషన్కు తరలించారు. ఆలస్యమైతే పూలు పాడైపోతాయంటూ సహచర పూల వ్యాపారి అయిన టీడీపీ నేత రంగంలోకి దిగినట్లు నటన మొదలు పెట్టాడు. ప్రస్తుతం పూలు అయినా వదిలి పెడితే వేరే వాహనంలో హైదరాబాద్ తరలిస్తామని పోలీసులతో మాట్లాడినట్లు షో చేశాడు. ఎస్ఐకి రూ. 50 వేలు ఇస్తే పూలు తరలించుకోవచ్చని టీడీపీ నేత చెప్పడంతో అంత ఇవ్వలేమని రూ. 40 వేలు ఒప్పుకుని వ్యాపారి హుస్సేన్బాషా టీడీపీ నేతకు ఫోన్పే చేశాడు. పూలను ఇతర వాహనంలో హైదరాబాద్కు తరలించాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వ్యాపారి తీవ్రంగా నష్టపోయాడు. కిలో రూ.250 నుంచి రూ. 400 వరకు విక్రయించాల్సిన పూలు కేవలం రూ.100కే అమ్ముడుపోయాయి. దీంతో సుమారు రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోతున్నాడు. రూ. 3 లక్షలు ఇస్తావా.. మండి ఖాళీ చేస్తావా? రికార్డులు సరిగా లేకుంటే జరిమానా వేసి తమ జీపులు వదిలి పెట్టాలని వ్యాపారి శనివారం పోలీసులను ఆశ్రయించగా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన కనిపించ లేదు. అంతలో స్థానిక పూల మండి యజమాని అయిన టీడీపీ నాయకుడు బాధిత యజమానిని పిలిపించి రెండు వాహనాలు స్టేషన్ నుంచి విడిపించాలంటే చాగలమర్రిలో పూల మండిని ఎత్తేయాలని ఆదేశించాడు. అందుకు వ్యాపారి ఒప్పుకున్నాడు. తర్వాత పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్లండి ఎస్ఐతో మాట్లాడతానని చెప్పి పంపించాడు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన బాధితుడు పోలీసుల తీరు చూసి అవాక్కయ్యాడు. ‘మీరు.. మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా మాకేంటి’ అంటూ గట్టిగా మందలించడంతో నిర్ఘాంత పోయాడు. మళ్లీ టీడీపీ నేతను సంప్రదించగా ‘పోలీసులు రూ.3 లక్షలు అడుగుతు న్నారు.. ఇచ్చి వాహనాలు తీసుకుపో’ అని అనడంతో వ్యాపారి ఏమి చేయాలో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు
మంత్రాలయం: మేళతాళాల సుస్వరాలు.. పండితుల వేద ఘోషలు.. కేరళ డోలు ధ్వానాలు.. భక్తజనుల కోలాహలం మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహవాహనంపై దేదీప్యమానంగా ఊరేగాడు. శ్రీరాఘవేంద్రుడి 354వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటి సేవలు చేశారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉదయం రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకంతో పాటు పుష్పాలంకరణతో విశేషంగా అలంకరించారు. పూజా మదిరంలో రాయరు, మూల, జయ, దిగ్విజయ, రాములకు సంస్థాన పూజ నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ, ఫల, పూల, మంత్రాక్షింతలతో ఆశీర్వచనలు చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మండపంలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన బెట్ట వెంకటేష్ బృందం నాద తరంగిని, జుగల్బందీ చేపట్టారు. రాయచూరుకు చెందిన మంగళకలార్చన సంది నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనుగ్రహ ప్రశస్థి అవార్డులు రాఘవేంద్రస్వామి ఉత్సవాలను పురష్కరించుకుని పలువురు ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేశారు. ఆదివారం యోగీంద్ర మంటపంలో కాశి యూనివర్సిటీ రిటైర్డు వైస్ చాన్స్లర్, పండిట్ రాజారామ్ శుక్లా, కోయంబత్తూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ పీఆర్ విఠల్కు పీఠాధిపతి చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. భక్తుల కోరిక మేరకు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు పుష్పవృష్టికి గావించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీధర్రావు, ఏఏవో మాధవశెట్టి అవార్డు గ్రహీతల బయోడేటా భక్తులకు పరిచయం చేశారు. ఘనంగా పూర్వారాధన ఉత్సవాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
బుజ్జి పిట్ట.. చిట్టి గూళ్లు!
పిట్ట కొంచెం కూత ఘనమే కాదు.. గూడు కట్టడంలో ఎవరైనా తన తర్వాతనే అని చెప్పవచ్చు. తన పొదరిల్లు నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇతర జీవాల నుంచి రక్షణగా చిటారు కొమ్మన గూడు కట్టుకుంటోంది. తేలికపాటి గడ్డి పోచలతో మెత్తని పాన్పు వల్లె అల్లుకుంటుంది. కళాత్మకమైన గిజిగాడు గూళ్లను చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. గార్గేయపురం సమీపంలోని ఓ వ్యవసాయ బావి గట్టుపై ఉన్న చెట్టు కొమ్మలకు బుజ్జి పిట్టలు చిట్టి గూళ్లను ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నాయి. – కర్నూలు(రూరల్) -
శ్రీశైలానికి భారీ వరద
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాజెక్ట్ల నుంచి సగటున 1,90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దిగువ ప్రాజెక్ట్లకు సగటున 1,31,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. జలాశ య పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో మంగళవారం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని సాగర్కు విడుదల చేయనున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు 1,49,604 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,729 క్యూసెక్కుల నీటిని వదిలారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 68,510 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.741 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.232 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 880.60 అడుగులకు చేరుకుంది.మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులుశ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామస్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.ప్రకృతి వ్యవసాయంలో రాణించాలిశిరివెళ్ల: ప్రకృతి వ్యవసాయంలో రైతులు రాణించాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చెన్నూరులో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన వివిధ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఔత్సాహిక మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. మహదేవపురం, బోయలకుంట్ల, యర్రగుంట్ల, కాదరబాదరలో ఆకు కూరలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నా రు. ఆయన వెంట ఎంటీ రామాంజనేయ రెడ్డి, ఎన్ఎప్ఎస్ డీఏ రాముడు పాల్గొన్నారు. -
దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలు(సెంట్రల్): దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గద్దెనెక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య ఆరోపించారు. సీపీఐ 24వ జిల్లా మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజ్విహార్ నుంచి పాతబస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీ టూరిజం పున్నమి సమావేశ భవనంలో జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభను నిర్వహించారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.20 వేల కోట్లను కేటాయించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తోపాటు సహా య కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య పాల్గొన్నారు. -
‘పీఎం జన్ధన్’తో చెంచులకు 600 ఇళ్లు
నంద్యాల: పీఎం జన్ధన్ పథకంతో చెంచులకు 600 ఇళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. చెంచుగూడేల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.1.80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ల్లోని పీజీఆర్ఎస్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. చెంచు గూడేల్లోని గిరిజనులకు ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ దృష్టికి చెంచుల సమస్యలను గిరిజన సంఘాల నాయకులు తీసుకొచ్చారు. ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.వెండి శ్రీచక్రం బహూకరణబనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి శనివారం బెంగళూరుకు చెందిన ఎస్పీ రావు కుటుంబ సభ్యులు వెండి శ్రీచక్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రీచక్రం విలువ రూ.1,17,800 ఉంటుందన్నారు.పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపుజూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 35 వేల నుంచి 32వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహించకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నాపరు. వర్షాలు తగ్గిన తర్వాత నీటి విడుదలను పెంచే అవకాశాలున్నాయని తెలిపారు.డ్రోన్తో ట్రాఫిక్ నియంత్రణశ్రీశైలంప్రాజెక్ట్: డ్రోన్ సహాయంతో శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. శ్రీశైలం టూటౌన్ సీఐ జి.చంద్రబాబు తన సిబ్బందితో శనివారం డ్రోన్ను ప్రయోగించి పర్యవేక్షణ చేపట్టారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుస సెలవు దినాలు రావడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. డ్యాం పరిసరాల్లో డ్రోన్ను ఉపయోగించి వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తు సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చేస్తున్నారు.శ్రీశైలం డ్యాం నీటిమట్టం 879 అడుగులుశ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 879.10 అడుగులకు చేరుకుంది. శ్రీశైలానికి వస్తున్న ఇన్ఫ్లోల కన్నా ఔట్ఫ్లో ఎక్కువగా ఉండడంతో నీటిమట్టం తగ్గుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 91,641 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,05,336 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 67,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 32,750 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కుల నీటిని వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 14.982 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 15.776 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 183.4198 టిఎంసీల నీరు నిల్వ ఉంది. -
పురుగుమందుల పరీక్ష ల్యాబ్కు ఎన్ఏబీఎస్ గుర్తింపు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులోని క్రిమి సంహారక మందుల పరీక్షా కేంద్రానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబోరేటరీ (ఎన్ఏబీఎస్) గుర్తింపు లభించింది. ఈ ల్యాబ్ క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తోంది. కర్నూలు పురుగుమందుల నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ ప్రయోగశాల 2010 ప్రాంతంలో వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే పురుగుమందుల శాంపిల్స్ను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. మొదటిసారిగా కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంద్రానికి ఎన్ఏబీఎస్ గుర్తింపు లభించడం పట్ల వ్యవసాయ శాఖ అధికారులు హర్షం ప్రకటించారు. ఇదిలాఉంటే ఈ ప్రయోగశాలకు ప్రభుత్వం ఎలాంటి పోస్టులు మంజూరు చేయలేదు. మామూలుగా అయితే ఈ ల్యాబ్కు ఏడీఏ, ఏఓ, ఏఈఓలు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ల్యాబ్ అయితే ఏర్పాటైంది తప్ప ఒక్క పోస్టు కూడా మంజూరు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఏఓ, ఏడీఏ, ఏఈఓలందరు డిప్యూటేషన్పై మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. -
సీఐ, డాక్టర్ మధ్య ‘పోస్టుమార్టం’ వివాదం
శ్రీశైలంప్రాజెక్ట్: పోస్ట్మార్టం విషయంలో శుక్రవారం సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ లీలా వినయ్రెడ్డి, శ్రీశైలం సీఐ ప్రసాదరావు మధ్య సెల్ఫోన్లో వివాదం నెలకొంది. శ్రీశైలం రామయ్య టర్నింగ్ వద్ద గురువారం రాత్రి ఎదురెదురుగా బైక్లు ఢీకొన్న ఘటనలో శ్రీశైలానికి చెందిన హరినాయక్ మృతి చెందాడు. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం ఫారం, ఇంక్వెస్ట్, పాస్పోర్ట్లను డాక్టర్కు పోలీసులు సమర్పించారు. పోలీసులు సమర్పించిన రిపోర్టులు సక్రమంగా లేవని ఇన్వెస్టిగేషన్ అధికారి సీఐ ప్రసాదరావు స్వయంగా రావాలని డాక్టర్ మొండికేశారు. దీంతో సీఐ తన ఫోన్లో డాక్టర్తో మాట్లాడారు. ‘నీవు చదువుకున్నావా లేదా, నీకు అసలు చదువు వచ్చా, 1(12) ఫారంలోని కాలం 30 ప్రకారం ఇన్వెస్టిగేషన్ అధికారి పోస్టుమార్టానికి హాజరు కావాల్సిన అవసరం లేదు’ అని తెలుసుకో అని మాట్లాడారు. ఈ విషయంపై ఒకరినొకరు వాదులాడుకున్నారు. పోస్టుమార్టం ఆలస్యం అవుతుండడంతో మృతుని బంధువులు ఆసుపత్రివద్ద గొడవకు దిగారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఫారం1(12), ఇన్క్వెస్ట్ రిపోర్టు సక్రమంగా లేవని, సీఐ ప్రసాదరావు తనను ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని డాక్టర్ వినయ్ రెడ్డి ఆసుపత్రి బయట శనివారం ఓపీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ.. గతంలో వాహనాల తనిఖీ, ట్రాఫిక్ కంట్రోల్ సమయాలో వైద్య సిబ్బంది వాహనాలు పట్టుకున్నామని, వీటిని వ్యక్తిగతంగా తీసుకొని వైద్యులు, సిబ్బంది తమకు సహకరించడం లేదని తెలిపారు. -
శ్రీమఠం.. భక్తి పరిమళం
● పరిమళ తీర్థంలో తొలిసారి అంగరంగ వైభవంగా తెప్పోత్సవం ● ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఘనంగా ఊంజల సేవమంత్రాలయం: వేదభూమిలో తొలి వేడుక.. సద్గురు రాఘవేంద్రుడి క్షేత్రంలో శుభకార్యం.. తిరుమల వేంకన్న, శ్రీశైల మల్లన్న తరహాలో శ్రీమఠంలో పురుడోసుకున్న తెప్పోత్సవం.. చూసిన కనులదే భాగ్యం..ఈ వేడుకను చూసి భక్తజనం పరవశించింది. తుంగభద్ర నది తీరంలో ఆధ్యాత్మికభావం వెల్లివిరిసింది. శ్రీ రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాలు రెండోరోజు శనివారం వైభవంగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో సూర్యాస్తమయ సమయాన ఉత్సవమూర్తి తెప్పోత్సవం శోభాయమానంగా సాగింది. తొలుత రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి ఉత్సవమూర్తిని మేళతాళాలతో శ్రీమఠం నుంచి పరిమళ తీర్థం పుష్కరిణికి చెంతకు తీసుకొచ్చారు. అక్కడ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పరిమళ తీర్థానికి పూజలు చేసి ఉత్సవమూర్తిని తెప్పపై అధిష్టింపజేశారు. ఉత్సవమూర్తికి పుష్పార్చనలు, హారతులు పట్టి తెప్పోత్సవానికి అంకురార్పణ పలికారు. పుష్కరిణి చూట్టూ వేలాది భక్తుల హర్షధ్వానాలు, వేద ఘోషలు, మంగళవాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలు విహరించారు. -
ఊరూరా సారా బట్టీలు!
● ఆత్మకూరు డివిజన్లో ప్రతి నెలా రూ.10 కోట్లకు పైగా వ్యాపారం! ● దాడులు నిర్వహించాలంటే పోలీసులకు సైతం వణుకే ఆత్మకూరు: కుటీర పరిశ్రమలా జిల్లాలో ఊరూరా నాటుసారా బట్టీలు వెలిశాయి. రాత్రి, పగలు తేడా లేకుండా విక్రయాలు సాగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల నుంచి ప్రకాశం, కర్నూలు జిల్లాలకు నాటుసారా వెళ్తోంది. నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించాలంటే పోలీసులకు సైతం వణుకుతున్నారు. ఆత్మకూరు డివిజన్లో ప్రతినెలా రూ.10 కోట్లకు పైగా మద్యం వ్యాపారం సాగుతోంది. ప్రతిరోజూ వేకువజామున సారా విక్రయాలు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని సిద్ధాపురం గ్రామం నాటుసారా తయారవుతోంది. ఇక్కడ బిందె సారా రూ.1,400 నుంచి రూ.2,000 వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి నుంచి ఆత్మకూరు డివిజన్లోని అన్ని గ్రామాలపాటు ప్రకాశం జిల్లాలోని దోర్నాల సమీప గ్రామాల్లోనూ, గిద్దలూరు, మార్కాపురం పరిసర ప్రాంతాలతో పాటు నంద్యాల పట్టణ సమీప గ్రామాలకు కూడా సారా సరఫరా అవుతోంది. ఇక్కడ తయారైన నాటుసారాను మోటార్ బైకుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ బట్టీదారులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నల్లమల అటవీ పరిధిలో 70కి పైగా ... శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ పరిధిలోని సిద్ధాపురం గ్రామంతో పాటు బైర్లూటి, నాగలూటి, ముష్టపల్లి, సిద్ధపల్లి, అమలాపురం తదితర గ్రామాల్లో నాటుసారా బట్టీలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వెలుగోడు మండలంలోని తండా, శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లంబాడీ కాలనీ, బండిఆత్మకూరు మండలంలోని గ్రామాల్లో బట్టీలు ఉన్నాయి. మహానంది మండలం గాజులపల్లి సమీపంలో నాటుసారా బట్టీలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నల్లమల అటవీ పరిధిలో 70కి పైగా సారా బట్టీలు ఉన్నాయి. ‘బెల్టు’ హవా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామ గ్రామాల్లో బెల్టుషాపులు కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వైన్ షాపులే నిబంధనల ప్రకారం దేవాలయాలు, మసీదులు, విద్యా సమస్యలు, బస్టాండు ప్రాంగణ సమీపానికి సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాంటి నిబంధనలనలను తుంగలోకి తొక్కి ఆత్మకూరు పట్టణంలోని కొత్త బస్టాండు, దేవాలయాలు, పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా బెల్టుషాపులు కూడా కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఒక్క ఆత్మకూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 2 నుంచి 4 బెల్టుషాపులు ఉన్నాయి. ప్రతి బెల్టుషాపులు అధిక ధరలకు చీఫ్ లిక్కర్ విక్రయిస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. వందకు పైగా కేసులు నమోదు చేశాం ఆత్మకూరు డివిజన్ పరిధిలో నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నాం. అయినప్పటికీ నాటుసారా బట్టీలు కొనసాగుతున్నాయి. దాడులు చేస్తున్నాం. ఇప్పటికే వందకు పైగా నాటుసారా విక్రేతలపై కేసులు నమోదు చేశాం. గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్టుషాపులను అదుపులోకి తెస్తున్నాం. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – మహేశ్వర్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ, ఆత్మకూరు పుట్టగొడుగుల్లా.. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సిద్ధాపురం, బైర్లూటీ, నాగలూటి చెంచుగూడేల్లో నాటుసారా బట్టీలు ఎకై ్సజ్ పోలీసులకు, స్థానిక పోలీసులకు సవాల్గా మారాయి. ప్రతినెలా జిల్లా ఎకై ్సజ్ పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు చేసి సారా బట్టీలను బంద్ చేయించినప్పటికీ యథాతథంగా గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వాసులకు ఓ కుటీర పరిశ్రమలా మారింది. ఈ గ్రామాలకు పోలీసులు భారీ బందోబస్తుతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
పూజ్యాయ.. రాఘవేంద్రాయ
● వైభవంగా ప్రారంభమైన రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు ● ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించిన శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులుమంత్రాలయం: వేదభూమి వేదఘోషతో మార్మోగుతుండగా.. మంగళవాయిద్యాల సుస్వరాలు ఆలపిస్తుండగా.. భక్తజనం నీరాజనాలు పలుకుతుండగా దైవాంశ సంభూతుడు రాఘవేంద్రస్వామి మఠం శిఖరాన ధ్వజం ఎగిరింది. అమరగుడి ఉత్సవాలకు అంకురార్పణ శంఖం పూరించింది. దైవాంశ సంభూతుడు శ్రీరాఘవేంద్రుల 354వ సప్తరాత్రోత్సవాలు శుక్రవారం వైభవోపేతంగా మొదలయ్యాయి. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు అమృత హస్తాలతో శ్రీమఠం శిఖరాగ్రన స్వర్ణ బృందావన ధ్వజారోహణ చేశారు. ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి పీఠాధిపతులు ఊరేగింపుగా ఆలయ ముఖధ్వారం ముంగిటకు చేరుకున్నారు. గోపూజ, అశ్వపూజ నిర్వహించి ధ్వజారోహణ గావించారు. ధ్వజారోహణ వేళ భక్తజనం ‘నమో.. రాఘవేంద్రా’ అంటూ స్వరించారు. అనంతరం కార్యనిర్వాహణ కార్యాలయం చేరుకుని లక్ష్మీపూజ, ఏఏఓ, మేనేజర్, జోనల్మేనేజర్ తదితర కౌంటర్లలో పూజలుచేశారు. యోగీంద్ర మంటపంలో రాఘవేంద్రుల మైనపు విగ్రహానికి పుష్పార్చన, మంగళ హారతులు పట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రాంగణ వీధుల్లో అశేషభక్తజనం మధ్య ప్రభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. పరిమళ తీర్థం పుష్కరిణి ప్రారంభోత్సవం శ్రీమఠం చరిత్రలో తొలిసారిగా రాఘవేంద్రస్వామికి తెప్పోత్సవం జరగనుంది. ఉత్సవ నిర్వహణ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఎంఆర్జీ గ్రూపు సీఈవోలు ఆశా ప్రకాష్, శ్రీప్రకాశ్ శెట్టి సహకారంతో రూ.3.8 కోట్ల వ్యయంతో పరిమళ తీర్థం పుష్కరిణి నిర్మించారు.. శ్రీమఠం ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అలాగే భక్తుల సహకారంతో మూల బృందావన మంటప స్తంభాలకు బంగారు కవచధారణను ఆవిష్కరించారు. రూ. రూ.40 లక్షలతో నిర్మించిన కవీంద్ర నిలయ డార్మిటరీ, రూ.65లక్షలతో నిర్మించిన వాగీశ డార్మిటరీ, బెంగళూరు వాసులు ఏర్పాటు చేసిన డిజిటల్ లాకర్ సముదాయాలను ప్రారంభించారు. ఉత్సవాల్లో మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, జోనల్మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ధ్వారపాలక అనంతస్వామి, సంస్కృత పాఠశాల ప్రధానాచార్యులు వాదీరాజాచార్ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో పూర్తిస్థాయి విద్యుదుత్పాదన
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్ట్ల నుంచి వస్తున్న వరద ప్రవాహం కన్నా దిగువకు అధిక మొత్తంలో నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పడిపోతుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి 71,021 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,06,692 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 65,474 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 51.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.117 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 15.308 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 182.2185 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 878.90 అడుగులకు చేరుకుంది. ఉరుకుంద ఈఓ విజయరాజుపై బదిలీ వేటు ● నూతన ఈఓగా కె.వాణిమంత్రాలయం: ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడిపల్లి విజయరాజుపై బదిలీ వేటుపడింది. గుంతకల్లులోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా ఆయనను బదిలీ చేశారు. అక్కడ ఈఓగా పని చేస్తున్న కె.వాణి ఉరుకుంద ఈరన్న ఆలయ ఈఓగా నియమితులయ్యారు. విజయరాజు గత ఏడాది సెప్టెంబర్ 24న ఇక్కడ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తన సూసైడ్ నోట్లో ప్రధాన అర్చకుడు, వేదపండిట్ మాటలు విని ఈఓ తనతో పాటు ఇతర అర్చకుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈఓ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే కాంట్రాక్టర్ల అక్రమార్జనకు అడ్డుపడుతున్నాడనే కారణంతో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనపై బదిలీ వేటు వేసినట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో ఈఓగా పని చేసిన హెచ్.జి.వెంకటేష్ కూడా అర్చకుల తట్టను తీయించి ఆలయ ఆదాయాన్ని పెంచడానికి శాఖాపరమైన నిర్ణయం తీసుకోవడం ఆయన బదిలీకి కారణమైంది. అప్పట్లో ఆయ నను కూడా ఉత్సవాల వేళనే బదిలీ చేయడం గమనార్హం. తాజాగా విజయరాజు కూడా అదే తరహాలోనే బదిలీ అయినట్లు సమాచారం. డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణకర్నూలు(సెంట్రల్): డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు కర్నూలు ట్రిబుల్ ఐటీడీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. కలెక్టరేట్లోని తన క్యాంపు కార్యాలయంలో ట్రిబుల్ ఐటీడీఎం ఆధ్వ ర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తక్షణమే వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యవస్థ వైద్యులు, ఆసుపత్రుల మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ నెట్వర్కు ఏర్పరుస్తుందన్నారు. ఈ వ్యవస్థను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కె.కృష్ణానాయక్, విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేకాట ఆడాలంటే అనంతపురం, కడప, కర్నూలు పేకాట రాయుళ్లు ఏడాది కిందటి వరకూ వెళ్లే ప్రాంతం రాయచూరు. ఇప్పుడు నంద్యాల జిల్లాలోని బనగానపల్లి ప్రాంతం. ‘మా ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్న మంత్రి అయ్యాడు. మీకు ఏ ఇబ్బందీ ఉండదు. రండి’ అని ఆహ్వానిస్తున్నారు. గూగుల్ లొకే
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఇలాఖాలో విచ్చలవిడి పేకాట ● కోవెలకుంట్లలోని ఆరు ప్రాంతాల్లో శిబిరాలు ● బనగానపల్లిలో మంత్రి పీఏ సమీప బంధువు ఆధ్వర్యంలో నిర్వహణ ● సంజామల మండలం మెట్ల కొత్తూరులో రూ.4–5లక్షలతో పేకాట శిబిరం ● కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు ● ఇప్పటివరకు పేకాటకు పెట్టింది పేరు రాయచూరు ● ఇప్పుడు బనగానపల్లి వైపునకు అధిక శాతం ఆటగాళ్లు ● రూ.లక్ష నుంచి రూ.2లక్షల బ్యాంక్ ఆటలు అన్ని చోట్లా హేస్టేక్స్ శిబిరాలే.. పేకాట స్మాల్ స్టేక్(చిన్న బ్యాంకులు), హైస్టేక్(పెద్ద బ్యాంకులు) రెండు రకాలుగా జరుగుతుంది. స్మాల్స్టేక్లో రూ.10వేల నుంచి రూ.30వేల వరకూ ఆడతారు. హైస్టేక్లో రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు చొప్పున మూడు రకాల బ్యాంకులు ఆడతారు. కోవెలకుంట్ల, బనగానపల్లిలో జరిగే పేకాట మొత్తం హైస్టేక్స్ ఆడుతున్నారు. ఇక్కడ రూ.లక్ష, 50వేల బ్యాంకు ఎక్కువగా ఆడుతున్నారు. స్టేక్(బ్యాంకు) ఏదైనా ఒక్కో బ్యాంకుకు 250 పాయింట్లు ఇస్తారు. పేకాట నిర్వాహకుడు డబ్బులు ఇస్తే వారికి 250 పాయింట్ల లెక్కన కాయిన్లు ఇస్తారు. పేకాట శిబిరం వద్ద డబ్బుకట్టలు ఉండవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన ఒక కారు వద్దకు వెళ్లి డబ్బులు ఇస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లు ఇస్తారు. అయితే స్టేక్ను బట్టి పాయింట్ల విలువ మారుతుంది. రూ.50వేల బ్యాంకు అయితే ఒక్కో పాయింట్ విలువ రూ.200, రూ.లక్షకు రూ.400, రూ. 2లక్షలకు రూ.800గా ఉంటుంది. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటోంది. ● ఒక్కో గేమ్ 10మంది ఆడతారు. కొన్ని సందర్భాల్లో 7గురు ఉంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి. ● రూ.50వేలు బ్యాంకు ఆడేవారు 8 పాయింట్లు, రూ.లక్ష బ్యాంకు ఆడితే 6, రూ.2లక్షలు ఆడితే 5 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ.50వేల బ్యాంకు ఒక ఆటకు నిర్వాహకుడికి రూ.1,600, రూ.లక్ష బ్యాంకు ఆటకు రూ.2,400, హైస్టేక్ అయిన రూ.2లక్షల బ్యాంకు ఆటకు రూ.4,800 చొప్పున వస్తుంది. ఒక శిబిరంలో రోజూ కనీసం వంద ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన రూ.50వేలు బ్యాంకు రోజుకు రూ.1.60లక్షలు, రూ.లక్ష బ్యాంకు ఆడితే రూ.14.40లక్షలు(వంద ఆటలు ఆడితే), రూ.2లక్షల బ్యాంక్ ఆడిస్తే రోజుకు రూ.24లక్షలు( వంద ఆడితే) నిర్వాహకుడికి ఆదాయం వస్తుంది. సగటున ఒక్కో శిబిరంలో రోజూ రూ.10–15లక్షల ఆదాయం నిర్వాహకులకే ఉంటోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్, మట్టి తదితర సహజ వనరులతో పాటు ఆదాయం ఉన్న ఏ మార్గాన్నీ ఆ పార్టీ నేతలు వదలని పరిస్థితి. వీటి ద్వారా ఇప్పటికే వీరు భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పుడు అత్యంత సులువుగా, భారీగా ఆదాయం వచ్చే ‘పేకాట’ను ఎంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పేకాటరాయుళ్ల నోళ్లలో నానుతున్న పేర్లు బనగానపల్లె, కోవెలకుంట్ల. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 10 శిబిరాల్లో పేకాట సాగుతోంది. మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి అనుచరుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు కొనసాగుతున్నట్లు అక్కడి రాజకీయనేతలతో పాటు అధికారులకు తెలియంది కాదు. అయినా ఏ ఒక్క అధికారి, పోలీసులు అరికట్టే సాహసం చేయడం లేదంటే నిర్వాహకులకు మంత్రి బీసీ ఆశీస్సులు ఉండటమేనని తెలుస్తోంది. గ్రామస్తుల తిరుగుబాటుతో మకాం మార్పు మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామం గుమ్మనూరులో గతంలో నిర్వహించిన పేకాట శిబిరాలను ఆదర్శంగా తీసుకుని సంజామల మండలం మెట్లకొత్తూరులో ఓ టీడీపీ నేత రూ.4–5లక్షలతో షెడ్డు నిర్మించాడు. ఇందులో పేకాట ఆడించారు. అయితే గ్రామస్తుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘మహిళలు ఈ రోడ్డుపై తిరుగుతుంటారు. వేరే ఊర్ల నుంచి భారీగా కార్లు వస్తున్నాయి. ఇది పద్ధతి కాదు. మరొకచోట ఆడుకోండి..’ అని గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఆ శిబిరాన్ని తాత్కాలికంగా మూసేశారు. రోజూ ఒకచోట పేకాట ఆడిస్తూ, అడ్రస్ గూగుల్ మ్యాప్లో షేర్ చేస్తున్నారు. రాయచూరు నుంచి బనగానపల్లి వైపు.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రిక్రియేషన్ క్లబ్లలో పేకాట కొనసాగింది. గత ప్రభుత్వంలో క్లబ్లు పూర్తిగా నిషేధించారు. దీంతో చిత్తూరు మినహా రాయలసీమ జిల్లాల పేకాటరాయుళ్లు రాయచూరు క్లబ్కు వెళ్లేవాళ్లు. రాయచూర్లో ఇప్పటికీ పేకాట నడుస్తోంది. తెల్లవార్లూ గ్యాంబ్లింగ్ ఆడుతారు. అయితే బనగానపల్లిలో టీడీపీ నేతలు పేకాట నడపడం మొదలయ్యాక ప్రొద్దుటూరు, కడప, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, మహబూబ్నగర్, గద్వాల నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు. తెలంగాణ వాసులు కొద్దిరోజులు రాయచూర్, కొన్ని రోజులు బనగానపల్లికి వస్తున్నారు. తక్కిన ‘సీమ’ ప్రాంతాల నుంచి బనగానపల్లికి రోజూ ఒక్కో శిబిరానికి 15–20కి పైగా కార్లలో వస్తుండటం గమనార్హం. పేకాట రాయుళ్లకు కల్పించే సదుపాయాలు ఇవీ.. శిబిరం నిర్వాహకుడికి పాయింట్లు ఇచ్చినందుకు పేకాట ఆడేందుకు సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. రూ.2లక్షల బ్యాంకు ఆడే వారికి డబుల్బ్లాక్, గ్లెన్లివెట్ లాంటి విదేశీమందు ఇస్తారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టిక్కెట్లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువమందిని పేకాటకు తీసుకొచ్చే వారికి నెలకు రూ.లక్ష–2లక్షలు గిఫ్ట్గా ఇస్తారు. ఈ స్థాయిలో బయటి వ్యక్తులు రోజూ వచ్చిపోతూ మద్యం సేవిస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో స్థానికుల గౌరవం, రోజు వారీ జీవనం ఎలా ప్రభావితం అవుతుందో ఇట్టే తెలుస్తోంది. కోవెలకుంట్లలో పేకాట శిబిరాలు ఎక్కడెక్కడంటే.. జమ్మలమడుగు రోడ్డులోని ఓ ఫంక్షన్హాలు పక్కన వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఓ ఇండిపెండెంట్ ఇల్లు. సంతపేటలోని ఓ ఇల్లు. ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఎస్టీకాలనీలో. చాకలి తిమ్మయ్య ఇంటి సమీపంలోని ఇల్లు. బస్టాండ్ రోడ్డులో ఓ స్కూలు ఎదురుగా ఉన్న ఇల్లు. మార్కెట్యార్డులోని ప్రభుత్వ అతిథి గృహం. బనగానపల్లెలో ఇలా.. కరెంట్ ఆఫీసు సమీపంలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పీఏ సమీప బంధువులు పేకాట ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. బత్తలూరుపాడుకు చెందిన ఓ టీడీపీ నేత బనగానపల్లెలో ఉంటూ పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. అవుకు మండలం రామాపురంలో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట సాగుతోంది. -
వరలక్ష్మీ.. నమోస్తుతే!
● శ్రీశైల ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రీశైలంటెంపుల్: చంద్రవతి కల్యాణమండపంలో శుక్రవారం 1,600 మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. వేదికపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట వరలక్ష్మీవ్రత కలశానికి పూజలు చేశారు. భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవి వారిని సమంత్రకంగా ఆవహన చేశారు. గణపతిపూజ, వ్రత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని వరలక్ష్మీదేవికి, ఉత్సవమూర్తులకు శ్రీసూక్తవిధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవి వారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేశారు. ఆ తరువాత వరలక్ష్మీ వ్రత కథను పఠించి, వ్రత మహిమ విశేషాలను భక్తులకు వివరించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలు అర్పించి కలశోద్వాశన చేశారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఆలయ ఏఈవో హరిదాసు, స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణ శర్మ, అధ్యాపకులు పూర్ణానంద, అన్ని యూనిట్ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొండెక్కిన కొబ్బరి.. చేదెక్కిన బెల్లం!
నంద్యాల(న్యూటౌన్): నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ఎర్రగడ్డలు, ఎండుమిరప పప్పు, ఉప్పు, బెల్లం, అల్లం.. అన్ని నిత్యావసర సరకులు ప్రియం అయ్యాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మార్కెట్కు రూ.100 నోటు తీసుకుని వెళితే కనీసం రెండు రోజులకు సరిపడా కూరగాయలు కొనలేని దుస్థితి నెలకొంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో కూరగాయల సాగు ప్రారంభం కాలేదు. దీంతో మిర్చి, క్యారెట్, బీట్ రూట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ ధరలు చుక్కలను చూపుతున్నాయి. రైతు బజార్లు ఏవీ? నంద్యాల పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. పట్టణంలో, మండల కేంద్రంలో మరి కొన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసినట్లయితే రైతులు నేరుగా తీసుకువచ్చి ప్రజలకు కూరగాయలు అమ్ముకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ఇష్టారాజ్యంగా మారింది. కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉద్దానంలో పండే బీర, కాకర, సొర, బెండ కాయలు ఆగస్టు నెలాఖరు నాటికి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ధరలపై నియంత్రణ ఉండేలా రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తాత్కాలికంగానైనా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర ధరలు ఇవీ.. (కిలోకు రూపాయల్లో..) గతేడాది ప్రస్తుతం కొబ్బర 180 350 ఎండు మిర్చి 120 160 చింతపండు 100 140 బెల్లం 50 65 పామాయిల్ 90 120 సన్ఫ్లవర్ 112 145 కూరగాయల ధరలు ఇవీ... (కిలోకు రూపాయల్లో..) ప్రస్తుతం గత మూడు రోజుల క్రితం బీన్స్ 120 100 చిక్కుడు 80 60 క్యాప్సికం 100 80 క్యారెట్ 70 50 కాకర 60 40 బీర 60 40 బీట్రూట్ 60 50 వంకాయాలు 60 40 దొండ 60 40 మిర్చి 100 40 బెండ 50 40 క్యాలీఫ్లవర్ 100 80 టమాటా 60 40 ధరలు మండిపోతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. సామాన్యులుగా మంచి కూరగాయల కొనలేకపోతున్నాం. ధరలను ప్రభుత్వం నియంత్రించకుంటే ఎలా? తోట కూర కట్ట రూ.20 అమ్ముతున్నారు. రెండు అరటి కాయలు రూ.20 పలుకుతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటడం బాధకరం. అధికారులు ధరలు నియంత్రించాలి. – లక్ష్మీదేవి, నంద్యాల రైతు బజార్లు ఏర్పాటు చేయాలి నంద్యాల పట్టణంలో రైతు బజార్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. పండించే కూరగాయలను రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా చూడాలి. ప్రస్తుతం నంద్యాల మార్కెట్లో కూరగాయలు కొనలేకపోతున్నాం. కిలో బెండకాయులు రూ.50, ఆగాకర కాయలు రూ.280 చెబుతున్నారు. కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నాం. – వెంకటేశ్వరమ్మ, నంద్యాల భగ్గుమంటున్న నూనె ధరలు సామాన్యుడికి కూర‘గాయాలు’ -
అవసరమైన ప్రాంతాలకు యూరియా
నంద్యాల: జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో యూరియా నిల్వలను వినియోగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనవసరంగా యూరియా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్లో భాగంగా నమోదైన బంగారు కుటుంబాలకు త్వరితగతిన మార్గదర్శులను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు. పెండింగ్ ఉన్న నీడ్ అసెస్మెంట్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. డీఆర్ఓ రామునాయక్, సీపీఓ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ లలిత, అదనపు మున్సిపల్ కమిషనర్ దాసు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ఇవీ దారుణాలు..
● నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడటమే కాకుండా శుత్రవులపై పగ తీర్చుకునేందుకు సైతం ఉపయోగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ● కొంత కాలం క్రితం అహోబిలంలో భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నాటు తుపాకీ గాయాలతో మృతి చెందారు. ● గత కొంత కాలం క్రితం వివాహేతర సంబంధం అనుమానంతో వేటకోసం అని రామాంజనేయులు అనే వ్యక్తి నరసింహులను అడవిలోకి తీసుకుపోయి నాటుతుపాకీతో కాల్చగా గురి తప్పి పెద్దన్న అనే వ్యక్తికి తగలడంతో తీవ్రంగ గాయపడ్డ సంఘటన సంచలనం లేపింది. ● గత మూడు రోజుల క్రితం ఐదుగురు వేటగాళ్లు రెండు దుప్పులను వేటాడి వాటి చర్మాలు తీసి దాచి పెట్టి తలలు కాల్చి వండుకుని తిని, మాసం ఓ టీడీపీ నేత దుకాణంలో కవర్లలో ప్యాక్ చేస్తు తుపాకులతో సహా దొరికిపోయారు. స్థానికంగానే తయారీ.. అవసరమైన ట్రిగ్గర్, బ్యారెల్, గార్డ్, వాలా కమ్మీలు వేలూరు నుంచి తెచ్చుకుని స్థానికంగానే నాటు తుపాకులు తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. పేర్నంబట్ , గుడియత్తంలో నల్లమందు, గుండ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. వేటగాళ్ల నాటుతుపాకుల కారణంగా ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నా పోలీస్, అటవీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రూ. 10వేలు ఇస్తే నాటు తుపాకీ దొరుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
శ్రీశైలంలో 184 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 879.30 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 184.2774 టిఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి 31,222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,10,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 70,124 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వార 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.253 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.844 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. అలగనూరు గేట్లు బంద్ పాములపాడు: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లు బంద్ చేశామని ఏఈ శ్రీనివాసనాయక్ గురువారం విలేకరులకు తెలిపారు. లాకీన్స్లా నుంచి నిప్పుల వాగుకు 200, తూడిచెర్ల సబ్చానల్కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సుంకేసుల నుంచి కేసీ కెనాల్కు 2,200క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. పసుపు కొమ్ములతో మాలలు మహానంది: శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి రేపు (శ్రావణ మాసం మూడో శుక్రవారం) సుమారు 250 కిలోల పసుపు కొమ్ములతో మాలలు అలంకరించనున్నారు. అందులో భాగంగా పసుపు కొమ్ములతో మాలలను సిద్ధం చేస్తున్నారు. ఇలా అలంకరించిన అమ్మవారిని దర్శించడం ద్వారా భక్తులకు శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్ఏ(ఏఎన్ఎం) కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ వై. జయమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు మీడియంలో నిర్వహించే ఈ కోర్సు వ్యవఽ ది రెండు సంవత్సరాలు కాగా.. ఇంటర్, వొకేషనల్, వన్స్టింగ్ ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నా రు. మొత్తం 40 సీట్లు ఉన్నాయని, 17 సంవత్సరాలు దాటిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. దరఖాస్తున్ను రీజనల్ సెంటర్ లేదా cfw.in వెబ్సైట్ నుంచి తీసుకుని సెప్టెంబర్ 30వ తేదిలోగా సమర్పించాలన్నారు. అక్టోబ ర్ 15న ఎంపిక జాబితా ప్రచురిస్తామని, అదే నెల 21 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణలో ఉన్నప్పుడు నెలవారీ స్టైఫండ్ రూ.2వేలు మొదటి సంవత్సరం, రూ.2,500 రెండవ సంవత్సరం ఇస్తారని పేర్కొన్నారు. జిల్లా టూరిజం శాఖ అఽధికారిగా లక్ష్మీనారాయణ కర్నూలు కల్చరల్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) కర్నూలు డివిజినల్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. డీటీఓగా విధులు నిర్వహిస్తున్న విజయ ఆమె సొంత శాఖ ఐసీడీఎస్కు పీడీగా వెళ్లడంతో ఆ స్థానంలో లక్ష్మినారాయణకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అఽథారిటీ(ఏపీటీఏ) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వేద భూమి.. నేటి నుంచి ఉత్సవ దీప్తి
మంత్రాలయం: వేద భూమి అయిన మంత్రాలయంలో శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ఉత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంత్రాలయం పుర వీధులు విద్యుద్దీపాలతో వెలుగుగొందుతున్నాయి. శ్రీమఠం కారిడార్, ప్రాకారాలు, వసతి నిలయాలు దీపకాంతుల తేజస్సుతో విరాజిల్లుతున్నాయి. మఠం ప్రాకారాలు విరుల పరిమళాలు వెదజల్లుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణతో ఆరాధనకు అంకురార్పణ పలకనున్నారు. లక్ష్మీపూజ, ధాన్యపూజ, గజ, అశ్వ, గోపూజలు అశేష భక్తజనవాహిని మధ్య జరగనున్నాయి. శుక్రవారం రాత్రి ఊంజల మంటపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, ఛామర్ల సేవలు ఉంటాయి. -
పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిగోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గోస్పాడులోని పీహెచ్సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరం అని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్ర ఆవరణలో పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం వైద్య చికిత్స కోసం వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా, లేదా, గడువు తేదీ ముగిసిన ఔషధాలను ఏం చేస్తున్నారు అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతు సేవాకేంద్రం పరిశీలన.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ అనంతరం సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంటలకు సరిపడా యూరియా మాత్రమే వినియోగించేలా రైతులకు అవగాహన కల్పింలన్నారు. అనంతరం గోస్పాడుతలోని శ్రీ వెంకట సాయి ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.70 అడుగులు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 880.70 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 191.6512 టిఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి 69,457 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,10,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 69,323 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 18.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. స్థానిక బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 144వ జట్టుకు శిక్షణ ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 29లోగా దరఖాస్తులను బంగారుపేటలోని తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఽఉదయం 10.30 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావా లని కోరారు. -
రాజేంద్రనాథరెడ్డి కుమారుడి రిసెప్షన్కు వైఎస్ జగన్
జననేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన వెంటనే పెల్లుబుకిన ఆనందం.. కరచాలనం చేసేందుకు ఉరికిన ఉత్సాహం... ‘సీఎం.. సీఎం..జై జగన్’ అంటూ నింగిని అంటేలా నినాదం.. ఎటు చూసినా జనమే జనం.. ఉత్తేజం.. ఉల్లాసం.. బుధవారం డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం అభిమాన సంద్రంగా సాగింది. ప్రతి చోటా జననేతపై ప్రజలంతా పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. ‘అమ్మఒడి పథకంతో మమ్మల్ని అందుకున్నారు ’ అంటూ మహిళలు చేతులెత్తి నమస్కరించారు. ‘మేమంతా సిద్ధం’ అనే జెండాలతో యువత కదం తొక్కారు. ‘వ్యవసాయాన్ని పండుగ చేశారు’ అంటూ కర్షకులు కదలి వచ్చారు. అడుగడుగునా ప్రజలు అభిమానాన్ని హోరెత్తించారు.డోన్: ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ వివాహ రిసెప్షన్ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు బుగ్గన అర్జున్ అమర్నాథరెడ్డి, అనన్యలకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. డోన్ శివారులోని దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. నూతన దంపతులకు వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా డోన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు జగన్కు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద భారీగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ‘జై జగన్న్’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అక్కడి నుంచి వివాహవేదిక వద్దకు జగన్ చేరుకున్నారు. జగన్ను చూడగానే అభిమానుల ఈలలు, కేకలు, ‘జై జగన్, సీఎం...సీఎం’ నినాదాలతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. జగన్కు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్పై జగన్ వస్తున్నంత సేపు జనాభిమానంతో ప్రాంగణం హోరెత్తింది. అందరికీ జగన్ ఆప్యాయంగా అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ కదిలాడు. చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, నూతన దంపతుల తల్లిదండ్రులైన బుగ్గన దంపతులు, చల్లా సతీశ్రెడ్డి దంపతులు, సమీప బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఫొటోలు దిగారు. ఆపై వేదికపై నుంచి అందరికీ అభివాదం చేసి నేరుగా హెలిప్యాడ్కు చేరుకుని తిరుగుపయనమయ్యారు. జగన్ రాకతో డోన్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. వేదిక ఏర్పాటు చేసిన ఎన్హెచ్–44 సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం ఉన్నారు. జగన్ కాన్వాయ్ వెళ్తుంటే జైజగన్ అంటూ హోరెత్తించారు. కారులో నుంచి జగన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. వేడుకకు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మధుసూదన్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్, దారా సుధీర్, కోట్ల హర్షతో పాటు నంద్యాల, కర్నూలుతో పాటు పలు జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ప్రత్యేక ఆకర్షణగా బుగ్గన ఇంటి సెట్రిసెప్షన్ కోసం వేదికపై ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేశారు. బుగ్గన సొంతూరు బేతంచెర్లలో వారి పూర్వీకులు 1923లో ఇంటిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఇంట్లో బుగ్గన నివాసం ఉంటున్నారు. వేదికపై తన ఇంటి నమూనాతో సెట్ వేయించారు. అచ్చం బుగ్గన నివాసం ఎలా ఉందో అలాగే సెట్ ఉండటంతో వేడుకకు హాజరైన వారు ప్రత్యేకంగా తిలకించారు. ఇంటి ముందే రిసెప్షన్ జరిగిన భావన కల్పించారు. -
చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!
పాత పథకానికి కొత్త ‘షో’కు ఒక్క హామీ నెరవేర్చని కూటమి ప్రభుత్వం ● హామీలు మాటలకే పరిమితం ● జీఓలు విడుదల చేస్తున్నా అమలు కరువు ● ఉమ్మడి జిల్లాలో రాణించిన 4,148 చేనేత కుటుంబాలు ● కూటమి ప్రభుత్వంలో 2,842 కుటుంబాలకే పరిమితం ● గత ప్రభుత్వంలో ఆదుకున్న వైఎస్సార్ నేతన్న నేస్తం ● నేడు జాతీయ చేనేత దినోత్సవం చేనేతలకు పొదుపు నిధి ఎప్పటి నుంచో అమలులో ఉంది. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేజ్లో పొదుపు కింద 8 శాతం కట్ చేస్తే, దానికి 16 శాతం ప్రభుత్వం కలుపుతుంది. దీనినే పొదుపు నిధిగా వ్యవహరిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం తామే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది.కర్నూలు(అగ్రికల్చర్) : ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2023–24 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 4,148 చేనేత కుటుంబాలు ఉండగా.. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేల ఆర్థిక తోడ్పాటును అందించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోవడంతో ఈ స్వల్ప కాలంలోనే 1,306 కుటుంబాలు చేనేత వృత్తికి స్వస్తి పలకడం గమనార్హం. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉమ్మడి జిల్లాలో కేవలం 2,842 కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత పరిశ్రమ మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. చేయూత కోసం ఎదురు చూపులు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్నా చేనేత కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకునేందుకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, చేనేతకార్మికుల ఆరోగ్య భద్రతకు బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. చేనేతలకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాద్యం కాకపోతే కట్టిన జీఎస్టీని వెనక్కు ఇస్తామన్నా ఉలుకూపలుకూ లేదు. చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చని పరిస్థితి. నేడు జాతీయ చేనేత దినోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాకు సంబందించి ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లి మండలం నందివర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వంలో అరకొర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభలో రెండు సార్లు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. అయితే రెండేళ్లలో చేనేతలకు కేటాయించిన బడ్జెట్ రూ.10 కోట్లు మాత్రమే. నామమాత్రపు బడ్జెట్తో చేనేతల సంక్షేమం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేతన్న సంక్షేమానికి ఏటా రూ.200 కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో రూ.1000 కోట్లు వెచ్చించిన విషయాన్ని చేనేతలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేనేతలకు రూ.47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడకపోవడం విశేషం. చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలతో సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతినెలా రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.24వేలు చెల్లించింది. ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల ఆర్థిక లబ్ధి చేకూరింది. ఐదేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేతలకు రూ. 47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు లభించింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.36 వేలు చెల్లించాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసింది. నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేలు చేయూతనిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ.36 వేల ప్రకారం తోడ్పాటును అందించాలి. అద్దె మగ్గాలకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేయాలి. 40 శాతం సబ్సిడీపై యార్న్ సరఫరా చేయాలి. – బి.మాధవస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, చేనేత కార్మిక సంఘం జీఓలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కరువు 2014–15 నుంచి 2018–19 వరకు చేనేతకారుల సంక్షేమం మాటల్లో ఊదరగొట్టడం.. జీఓలు విడుదల చేయడం మినహా ఒక్కటీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చేనేతల సంక్షేమానికి విడుదల చేసిన జీఓల విలువ దాదాపు రూ.200 కోట్లు. అయితే కాగితాలకే పరిమితమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి ఏటా చేనేతకారులకు వేజ్లాస్ కింద నెలకు రూ.2వేల ప్రకారం మూడు నెలల పాటు పరిహారం ఇచ్చేందుకు జీఓలతో సరిపెట్టారు. ఒకప్పుడు జిల్లాలో రూ.200 కోట్ల వరకున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి టీడీపీ హయాంలో రూ.40 కోట్లకు పడిపోయింది. ఒకప్పడు ఉమ్మడి జిల్లాలో 45 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడుకు పడిపోవడం గమనార్హం. -
అధిక వర్షాలు ఉన్నా.. రైతులకు సుఖం లేదు!
హాలహర్వి: నిట్రవట్టి గ్రామంలో మంగళవారం శ్రావణ శుద్ధ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసిగేరప్ప తాత భక్తుడు కె.ఏజీ భవిష్యవాణి వినిపించారు. ముంగారి వర్షాలు విశేషంగా గాలి నుంచి మేఘాల ద్వారా వస్తాయని, అయినా రైతులకు సుఖం ఉండదన్నారు. హింగారి వర్షాలు ఏడు కార్తీలు ఉరుములు, మెరుపుల ద్వారా వస్తాయన్నారు. రెండు తుపాన్లు ఉంటాయన్నారు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం వెనుకా ముందు పరుగులు పెడతాయని చెప్పారు. ఆరు మూడు అవుతుంది, మూడు ఆరు అవుతుందని వివరణ ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో భవిష్యవాణిని వినేందుకు తరలించ్చారు. ● భవిష్యవాణి వినిపించిన వసిగేరప్పతాత భక్తుడు -
విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం సమీపంలోని స్టోన్ క్రస్రర్ మిషన్ ఫ్యాక్టరీ దగ్గర మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై సంతోష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ యువకుడు కొన్ని రోజు క్రితం తమ ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ద్వారా చెన్నాపురం స్టోన్ క్రస్రింగ్ మిషన్ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. రోజు మాదిరిగానే ఉదయం ఫ్యాక్టరీ దగ్గర వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో వర్షం రావడంతో షార్ట్ సర్క్యూట్కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు సంతోష్ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ మల్లికార్జున ప్రభుత్వాసుప్రతికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం విషయం తెలియజేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య జూపాడుబంగ్లా: కుటుంబ కలహాలతో మండలంలోని తర్తూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్కు చెందిన గనిమల్లేశ్వరి (23)కి తర్తూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. భర్త మతిస్థిమితం లేకపోవటం, మామ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా గనిమల్లేశ్వరిపై పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం నందికొట్కూరుకు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మల్లేశ్వరి మృతికి భర్త, మామే కారణమని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మెట్లపై నుంచి జారి లారీ డ్రైవర్ మృతి బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ మెట్లపై నుంచి జారీ పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ వివరాల మేరకు.. సానె దుశ్యంత్ కుమార్ (33) సోమవారం ఇంటి పైనుంచి కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ మంగళవారం వెల్లడించారు. డివైడర్ను ఢీకొన్న కారు కర్నూలు (రూరల్): కారు అతివేగంతో డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు.. హైదరాబాదుకు చెందిన సోదరులు శివ, మంజునాథ్, శివ సతీమణి, కూతురుతో కలిసి బెంగళూరులో గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరుగు పయనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి పంచలింగాల సమీపాన శివ కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో పక్కన కూర్చున్న సోదరుడు మంజునాథ్ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో శివ, ఆయన భార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలూకా అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. -
అట్టహాసంగా బిషప్ పట్టాభిషేకం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల డయాసిస్ బిషప్గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల డయాసిస్ పరిధిలో ఉన్న పాస్టరేట్ డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, కౌన్సిల్ మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(చైన్నె) మోడరేటర్ రూబెన్ మార్క్ నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సంతోషరావు క్రమంగా బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బిషప్ ప్రసన్నరావును రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఎస్నగర్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ ఆలయ ఆవరణలో బిషప్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బిషప్లు ఐజక్ వరప్రసాద్, జార్జికొర్నెలి, పద్మారావు, తిమోతి, రవీందర్, హేమచంద్రకుమార్, జయసింగ్ ప్రిన్సిన్స్ ప్రభాకరన్లతో పాటు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్, డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియం, సెంటినరీ చర్చి సెక్రటరీ ప్రభుదాసు, నందం ఐజక్తో పాటు అన్ని పాస్టరేట్ల డీనరీ చైర్మన్లు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం చైన్నె కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గంలో నడుస్తా క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్) సంతోష్ ప్రసన్నరావు అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాసిస్ పరిధిలో ఉన్న ఆస్తులను కాపాడుతూ, నంద్యాలలో విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలి నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుకు మోడరేటర్ రూబెన్మార్క్ పిలుపు -
భ్రామరీ సమేత మల్లన్నకు ఊయల, పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించి, మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీ లో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అలాగే ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. తిరుమల అన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం కోవెలకుంట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు కోవెలకుంట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగళవారం విరాళం అందజేశారు. నిత్యాన్నదాన ట్రస్టుకు తమ వంతు సాయంగా ఉపాధ్యాయుడు నాగరాజు, వరలక్ష్మి దంపతులు రూ.10 లక్షల చెక్కును టీటీడీ ఏడీఎల్ ఈఓ వెంకయ్య చౌదరికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు పర్యాయాలు రూ.10 లక్షల చొప్పున అన్నదాన ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలిపారు. సమస్యలపై బుగ్గన ఆరా బేతంచెర్ల: ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తదితర విషయాలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, నాయకులు ముర్తుజావలి, ఖాజా గూని నాగరాజు, రామచంద్రుడు, మురళీ కృష్ణ, పిట్టల జాకీర్, తిరుమలేశ్వర్ రెడ్డి, వెంకి రెడ్డి, నారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన తీరుపై చర్చించారు. ముఖ్యంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా? వ్యవసాయ దిగుబడులకు మద్దతు ధర లభిస్తుందా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డోన్ పట్టణంలో బుధవారం జరిగే తన తనయుడు బుగ్గన అర్జున్రెడ్డి వివాహ రిసెప్షన్ వద్దకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు. -
సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ిసంగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ, జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్, సేల్ టాక్స్ తదితరాలలో రాయితీ ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు. గత త్రైమాసిక కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం 139 దరఖాస్తులు రాగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 131 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. మిగ తా 8 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. జిల్లాలో స్కిల్ హబ్స్, ఈఎస్ఈలలో జాబ్ మేళాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంత మంది యువత నైపుణ్య శిక్షణను పొందుతున్నారన్న అంశాన్ని వెబ్సైట్లో కలెక్టర్ పరిశీలించి, ప్రగతి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా 2025లో నిర్వహించే జాబ్ మేళా బ్రోచర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఎస్.మహబూబ్ బాషా, నైపుణ్య అభివృద్ధి శిక్షణా అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, ఎల్డీఎం రవీందర్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజమహేంద్రనాథ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం(2019–20 నుంచి 2023–24)లో ఎలాంటి షరతులు లేకుండా నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తించింది. ఈ ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. నేడు రైతుల ఆశలను ఇటు కూటమి ప్రభుత్వం.. అటు బ్యాంకులు దెబ్బతీస్తున్నాయి. ఉచిత పంట బీమాకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడంతోనే రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికి ప్రీమియం చెల్లించి బీమా పొందే విధానాన్ని అమలులోకి తీసుకరావడంతోనే 90 శాతం పైగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. కొంతమంది రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ముందుకొచ్చినా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన కొందరు రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ బీమాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రైతుల అమాయకత్వం, లోనింగ్ను పెంచుకోవాలనే తపనతో బ్యాంకులు రైతులను బీమాకు దూరం చేస్తున్నాయి. స్కేల్ ఆఫ్ ౖఫైనాన్స్ ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు బ్యాంకులు లోనింగ్ పెంచుకునేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(రుణ పరిమితి) ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాధారం కింద సాధారణంగా కంది, సజ్జ, జొన్న, కొర్ర, ఆముదం వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తక్కువ. రైతులు ఏ పంట వేశారు.. ఏ పంట వేస్తున్నారో పక్కాగా తెలుసుకొని ఆ పంటకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకా రం పంట రుణం ఇవ్వాలి. కానీ ఏ బ్యాంకు కూడా వాస్తవంగా సాగు చేసిన పంటలకు రుణాలు ఇవ్వని పరిస్థితి. సాగు చేయని పంటలకు రుణాలు ఇస్తున్నాయి. ఎండు మిర్చికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ. ఈ పంటకు ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల వర కు ఉంది. బ్యాంకులు లోనింగ్ను పెంచుకునేందుకు ఎండుమిర్చి పంట పేరుతో పంట రుణాలు ఇస్తున్నాయి. రైతులు కూడా ఎక్కువ మొత్తంలో లోన్ వచ్చిందని తాత్కాలికంగా సంతోషపడుతున్నారు. పంటల బీమా సాయం దక్కనప్పుడు ఏ స్థాయిలో నష్టపోతున్నారో ఊహించలేకపోతున్నారు. బీమా చేసుకున్న రైతులు 26,955 మందే! కర్నూలు జిల్లాలో 3.75 లక్షల మంది రైతులుండగా జూలై నెల 31 నాటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 11,438 మంది రైతులు మాత్రమే ప్రీమి యం చెల్లించారు. నంద్యాల జిల్లాలో 3.25 లక్షల మం ది రైతులు ఉండగా 220 మంది మాత్రమే ప్రీమి యం చెల్లించడం గమనార్హం. వాతావరణ ఆధారిత బీమా కింద కర్నూలు జిల్లాలో 11,056, నంద్యాల జిల్లాలో 4,241 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లి ంచారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారిలో వాతావరణ ఆధారిత బీమా కోసం కర్నూలు జిల్లాలో 16,666, నంద్యాల జిల్లా నుంచి 7,156 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద కర్నూలు జిల్లాలో 3,740, నంద్యాల జిల్లాలో 266 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బ్యాంకులు రైతులకు ఇచ్చే పంట రుణంలో ప్రీమియం కట్ చేసి బీమా కంపెనీలకు బదిలీ చేస్తారు. ప్రీమియం చెల్లించిన రైతుల్లో 90 శాతం మంది రైతులు కంది, సజ్జ, కొర్ర, జొన్న పంటలే సాగు చేశారు. అయితే బ్యాంకు ల్లో మాత్రం మిర్చికి పంట రుణం పొందినట్లు ఉంటు ంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉమ్మడి జిల్లాలో రూ.1,675 కోట్ల బీమా పరిహారం మంజూరైంది. పంట రుణాలతో సంబంధం లేదు.. మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, బ్యాంకులకు వెళ్లి ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి లేకపోయింది. సర్వర్ సమస్యలు లేవు. కేవలం నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమాకు అర్హత లభించింది. తాజా పరిస్థితులతో రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలనను గుర్తు చేసుకొని తాము ఏం కోల్పోయామో చర్చించుకుంటున్నారు. రుణం పొందిన పంటే ఈ–క్రాప్లో ఉండాలి పంటల బీమా పరిహారం పొందడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బీమా పరిహారం మంజూరు చేసే సమయంలో వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రైతులు సాగు చేసిన లేదా సాగు చేసే పంటకే రుణం తీసుకోవాలి. ఆ పంట విధిగా ఈ–క్రాప్లో నమోదు కావాలి. అప్పుడే పరిహారం లభించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో ఒక పంటకు రుణం తీసుకొని.. మరో పంట ఈ–క్రాప్లో నమోదైతే అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితుల్లో బీమా పరిహారం కోల్పోతారు. రైతులు ఏ పంట సాగు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకొని ప్రీమియం కట్ చేయాలని అన్ని బ్యాంకులకు సూచించాం. – రామచంద్రరావు, ఎల్డీఎం, కర్నూలు లోనింగ్ పెంచుకోవడంపైనే బ్యాంకర్ల దృష్టి స్కేల్ ఆఫ్ ౖఫైనాన్స్ ఎక్కువున్న పంటలకే రుణాలు బ్యాంకులో ఒక పంట.. ఈ క్రాప్లో మరో పంట అధిక శాతం మిర్చి పేరిటే లోన్లు సాగు చేస్తున్న పంటలు కంది, సజ్జ, ఆముదం, జొన్న, కొర్ర అతివృష్టి, అనావృష్టి సమయంలో దక్కని బీమా బీమాను పట్టించుకోని 90 శాతం పైగా రైతులు -
పరిశ్రమలు ఎక్కడ బాబూ..!
జూపాడుబంగ్లా: పరిశ్రమలతో కళకళలాడాల్సిన భూములు వెలవెలబోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తంగడంచ ఎంఎస్ఎంఈ పార్క్ చిన్నబోయింది. తొమ్మిదేళ్లు అయినా ఒక్క పరిశ్రమను స్థాపించటానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తండగంచ గ్రామ సమీపంలో కేజీ రోడ్డు నుంచి 1.25 కిలోమీటర్ల దూరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఉన్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. 2016లో దాదాపు 211 ఎకరాల తంగడంచ ఫారం భూములను అప్పట్లో సీఎం చంద్రబాబునాయుడు గుజరాత్ అంబుజా పరిశ్రమకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమ స్థాపన నిమిత్తం కర్నూలు–గుంటూరు రోడ్డు నుంచి రూ.3.09 కోట్ల ప్రత్యేక అభివృద్ది నిధులతో 1.25 కిలోమీటర్ల మేర రెండులైన్ల రోడ్డును నిర్మించారు. అయితే అంబుజా కంపెనీవారు కాలు పెట్టకుండానే వెనుదిరగటంతో ఆ భూములను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ (ఏపీఐఐసీ)కు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీకి కేటాయించిన 211 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) పార్కులో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా రూ.7కోట్లతో అంతర్గత బీటీరోడ్లు, డ్రైనేజీలు, త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిమిత్తం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 211 ఎకరాల్లో 50 ఎకరాలను స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ స్థాపించేందుకు ఏడు, పది సెంట్ల ప్రకారం 260 ప్లాట్లను ఏర్పాటుచేశారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 30 శాతం చొప్పున ప్రాధాన్యతనిస్తూ చదరపు మీటరు రూ.840 చొప్పున స్థలాన్ని కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనపై ఏపీఐఐసీ అధికారులు పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు అవగాహన కల్పించకపోవటంతో రూ.12కోట్ల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు స్థలాల్లో తొమ్మిదేళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ స్థాపించకపోవటాన్ని బట్టిచూస్తే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చుననే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కు లేఅవుట్ చిత్రపటం అవగాహన కల్పించే వారు లేక.. పరిశ్రమల ఏర్పాటుపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించడడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పరిశ్రమలు స్థాపించుకునే వారికి ఎంఎస్ఎంఈలో స్థలం కేటాయించాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి సవాలక్ష ఆంక్షలు విధి ంచటంతో కొంత మందికి అవగాహన లేకపోవడంతో మొదట్లోనే వెనుకడుగు వేస్తున్నారు. దరఖాస్తు చేసినా కొన్ని నిబంధనలతో తిరస్కారానికి గురవుతున్నాయి. ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు తంగడంచ ఫారంలో పరిశ్రమలు స్థాపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిరుద్యోగులు, నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. భూముల అధిక ధరలు.. ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు బంగారు పంటలు పండే తంగడంచ ఫారంలోని నల్లరేగడి భూములను ప్రభుత్వం నుంచి ఏపీఐఐసీ ఎకరా రూ.4.50లక్షల చొప్పున కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో ఎకరా ఫారం భూమి ధర రూ.15 నుంచి రూ.20 లక్షల ఉంటుంది. ఏపీఐఐసీ మాత్రం చదరపు మీటరు రూ.840 ప్రకారం పారిశ్రామిక వేత్తలకు ఇస్తుంది. ఈ లెక్కన ఎకరా భూమి విలువ రూ.33.98 లక్షలు అవుతుంది. కొన్నదానికంటే అత్యధిక ధరకు విక్రయిస్తుండటంతో పాటు ఏడాదిలోగా పరిశ్రమను స్థాపించకపోతే ఇచ్చిన భూమిని వెనక్కితీసుకొంటామనే పలు నిబంధనలను విఽధించటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. తంగడంచ ఎంఎస్ఎంఈ పార్క్ వెలవెల పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించని ఏపీఐఐసీ అధికారులు తొమ్మిదేళ్లల్లో ఒక్క పరిశ్రమ రాని వైనం ఎంఎస్ఎంఈ స్థలాలు నిరుపయోగం -
నేడు వైఎస్ జగన్ డోన్కు రాక
డోన్: పట్టణంలో బుధవారం జరిగే రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్రెడ్డి, మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని హెలిపాడ్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి డోన్ పట్టణ శివారులోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు 11.40 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంబాలపాడు సర్కిల్, ఉడుములపాడు మీదుగా 44వ జాతీయ రహదారిపై స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి తిరిగి కారులో ఎం కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుని అనంతరం హెలికాప్టర్లో బెంగళూరుకు 12.20కి ప్రయాణమవుతారు.ఏర్పాట్ల పరిశీలన..వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఎం కన్వెన్షన్ హాల్ వద్ద నిర్మించిన హెలిపాడ్తో పాటు దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదిక, భోజనశాల షెడ్లను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు 40 వేల మంది ప్రజలకు వివాహ విందు ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మాజీ మంత్రి వెంట పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.