Nandyal District News
-
ముగిసిన ఇంటర్ మూల్యాంకనం
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్కు చెందిన 1,93,831 జవాబు పత్రాలను 29 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్గా ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాకాధికారి శంకర్నాయక్ వ్యవహరించారు. సాధారణంగా ఇప్పటి వరకు మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్)ను విడదీసి బండిళ్లు ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించే వారు. అక్కడ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఓఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, మార్కుల నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించే వారు. ఈ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు గత ఏడాది తొలిసారిగా ప్రతి స్పాట్ కేంద్రానికి స్కానర్ను అందజేశారు. స్కానింగ్ అనంతరం మరొకసారి మార్కు ల నమోదును నిర్ధారించడం వలన విద్యార్థికి నష్టం కలగదు. స్కానర్ ద్వారా ‘స్పాట్’ కేంద్రంలో మూ ల్యాంకనం చేసిన అనంతరం మార్కుల నమోదు చేపట్టారు. స్పాట్ ముగియడంతో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి ఫలితాలపై పడింది. ఈ నెల 15న ఇంటర్ ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి శంకర్నా యక్ నేతృత్వంలో మూల్యాంకన ప్రక్రియ సజావుగా సాగింది. 690 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లను మూల్యాంకనం చేయగా, 111 మంది స్క్రూటినైజర్లు తనిఖీ చేశారు. మూల్యాంకన ప్రక్రియలో 83 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 18 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్, జెన్1, జెన్2, ఇద్దరు చీఫ్ కోడింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ– గ్రేడ్
కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అకడమిక్ అడ్వయిజర్లు పరిశీలించి ఏ– గ్రేడ్ ప్రకటించారు. అకడమిక్ అడ్వయిజర్లు హనుమంతరెడ్డి, కాశీంసాహెబ్ కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కళాశాలలో మౌలిక వసతులు, అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని గుర్తించి కళాశాలకు ఏ– గ్రేడ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కళాశాలకు ఉత్తమ గ్రేడ్ రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏటా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ కళా శాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నా రని అన్నారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వ కర్త భాస్కర్రెడ్డి, అధ్యాపకులు రామసుబ్బారెడ్డి, నరేంద్రనాథరెడ్డి, కృష్ణశశాంక, కృష్ణదాసు,నాగేశ్వరరెడ్డి, రాజశేఖర్, అన్నపూర్ణ, రమణారెడ్డి, లక్ష్మిదేవి, షహనాజ్, తదితరులు పాల్గొన్నారు. గురుకుల ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డుల విడుదల నంద్యాల(న్యూటౌన్): 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ర్యాంకు కార్డులను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ ఎంఈ గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ ర్యాంకు కార్డు కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు https:// apbragcet. apcfss. in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచారం శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలోని సందర్శనీయ స్థలాల లో ఒకటైన సాక్షి గణపతి ఆలయం వద్ద సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించినట్లు సీసీఫుటేజ్లో కనిపించింది. ఆలయం పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి ఆలయ గ్రిల్ గేట్ వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు దాటి వెళ్లడం కనిపించింది. రాత్రి వేళ శ్రీశైలం – సున్నిపెంట మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాల ని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులు? నంద్యాల(అర్బన్): పట్టణం క్రాంతినగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తాలూకా పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకే కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి ● మద్యం సేవించి విధులకు హాజరైన పంచాయతీ సెక్రటరీపై వేటు గోస్పాడు: సమయ పాలన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె పసురపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదన్నారు. గ్రామంలోని సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేని విషయాన్ని గుర్తించారు. ‘స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్’ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీఓపై చార్జీలు ఫ్రేమ్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు కూడా సచివాలయాలు, ఇతర శాఖల్లో సిబ్బంది పని తీరు పట్ల పర్యవేక్షణ లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్ మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు కలెక్టర్ గమనించారు. వెంటనే పోలీసులను పిలిపించి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి సంబంధిత సెక్రటరీపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, సచివాలయంలో ఆన్లైన్ హాజరు నమోదు చేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐ పదోన్నతి ఎంపిక పరీక్ష
కర్నూలు: పోలీసు శాఖ సర్వీసులోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో మంగళవారం సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. రాయలసీమ జోన్ పరిధిలోని ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు 72 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. డ్రిల్, ఆయుధాలపై పరిజ్ఞానం, నేర స్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై బుధవారం పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనపరచిన వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తారు. డీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ హుసేన్ పీరా, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ డీఎస్పీలు శ్రీనివాసులు, బాలస్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్తో సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేంద్ర నిధుల వినియోగంపై విచారణ
రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం, కొండమాయపల్లె గ్రామాల్లో మంగళవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం లీడర్లు అశోక్కుమార్, సాసో అండర్ సెక్రటరీ రబల్కుమార్, ఎకనామిక్ అధికారి మోర్డు జిల్లాలో కేంద్ర నిధుల వినియోగంపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వారు స్థానిక చంద్రునిపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహలను పరిశీలించారు. అలాగే పడమటి వీధిలో పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసుకున్న గేదెల యూనిట్ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఈజీపీ పథకం ద్వారా కుటుంబ జీవన ప్రామాణాలు పెరిగాయా అనే అంశంపై విచారణ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ శ్రీధర్రెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరెడ్డి, ఏపీడీ సాంబశివరావు, ఏపీఓ గౌరీబాయ్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ నాగరాజు, ఏపీఎం వసంతకుమారి ఉన్నారు. నంద్యాల: జిల్లాలో భూగర్భ జలాల శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరులన్నింటినీ క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, యథావిధిగా పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాల స్థాయి క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. ఉపాధి హామీ పనులను శాతం వంద పూర్తిచేయాలన్నారు. అలాగే వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించేందుకు తహసీల్దార్లు తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా భూగర్భ శాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివ శంకర్, డ్వామా పీడీ సూర్యనారాయణ మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవా న్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, కుంభహారతి, సాత్వికబలి, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వి కబలిని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం అమ్మవారి కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించారు. ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జపపారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా చేపట్టారు. అలాగే శాంతి ప్రక్రియలో భాగంగా అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజలు చేసిన తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన ఐదు వేలకుపైగా కొబ్బరికాయలు, 20 వేల గుమ్మడికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు కూడా పూజలు చేపట్టారు. స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. తొలి విడత సాత్వికబలి అనంతరం హరిహరరాయగోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు చేసి సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. అమ్మవారికి కుంభహారతి.. సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. కుంభోత్సవ పూజ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవో, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చివరిగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభరాశి వద్ద పూజలు చేస్తున్న భక్తులుఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించిన దృశ్యం కుంభహారతితో వస్తున్న స్త్రీ వేషదారణలో పురుషుడు మహిషాసురమర్ధినికి పూజలు చేస్తున్న దృశ్యం -
మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
● గూగుల్ మ్యాప్ ద్వారా కాల్వబుగ్గ ఆలయ పరిసరాలు గుర్తించి చోరీ ● సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన పోలీసులు కర్నూలు: కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. గత నెల 17వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవారికి చెందిన వెండి వస్తువులు అపహరించారు. దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ, నరసింహశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు సునీల్ కుమార్, ధనుంజయ, అఖిల్లతో కలసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి 20 రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా పక్కా ఆధారాలతో మహారాష్ట్ర ముఠానే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర పూణెకు చెందిన అర్జున్ పూనం కుంబ్హర్, మహారాష్ట్రలోని చించ్వడ్కు చెందిన అక్షయ్ జైసింగ్ ఠాకూర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తమ సహచరులు జర్నల్, అమిత్, బజరంగిలతో కలసి ఈ నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. గూగుల్ మ్యాప్లో గుర్తించి దోపిడీ... నిందితులు ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి మొత్తం ఐదుగురు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించారు. అలాగే టోల్గేట్లలోని సీసీ ఫుటేజీ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మిగిలిన మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేసి మిగిలిన వెండి ఆభరణాలు కూడా రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అ రెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఆలయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
మరణంలోనూ వీడని బంధం
● మూడు గంటల వ్యవధిలోనే గూళ్యంలో దంపతుల మృతి హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం. -
జీడీపీలో మట్టి తోడేళ్లు!
● టీడీపీ నేతల అండ ● యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపుగోనెగండ్ల: టీడీపీ నేతల అండతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం జేసీబీలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల సమీపంలోని తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 20 రోజుల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిని పలు గ్రామాల్లోని ఇళ్లు, వెంచర్లు నిర్మించే వారికి అమ్ముతున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1300 దాకా వసూలు చేస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. జీడీపీ ఎగువ ప్రాంతంలో మట్టిని తవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే టీడీపీ నేత అండ ఉండటంతో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి మాయం అవుతోందని, గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. గుంతలమయం అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నుల్లోనే ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులే అక్రమ ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్కు రూ.200 ఇవ్వాలని ఆ నాయకులు వసూలు చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వడంతో జీడీపీ ఎగువ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతాలను రైతులు తమ పశువులను మేపించేందుకు వెళ్తుంటారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్తుంటారు. గతంలో గుంతలు పడిన ప్రదేశంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇప్పుడు కూడా మట్టి మాఫియా కోసం జేసీబీతో గుంతలు గుంతలు తవ్వడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలకు ఉన్నతాధికారుల నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారం రోజులుగా మా సిబ్బందిని రాత్రి 12 గంటలకు వరకు కాపాలగా పెట్టాం. అయినా తప్పించుకొని తెల్లవారు జామున 3 గంటల సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. – మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ కళ్లుగప్పి తరలింపు రాత్రిపూట అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండడంతో ఉదయం చూడగానే పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ప్రాజెక్టు సిబ్బంది నలుగురు కాపలాగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● రాష్ట్రంలో పోలీసులు పేరుకు మాత్రమే ● శాంతిభద్రతలను గాలికి వదిలేశారు ● ప్రతిపక్షనేతను తిట్టేందుకే అనితకు మంత్రి పదవి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం బొమ్మలసత్రం: ‘అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నార’ని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళ్యాణి హాజరుకాగా ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూర్య నారాయణరెడ్డి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, జోనల్ ఇన్చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాల నుంచి ఆవిర్భవించిందన్నారు. 2024 ఎన్నికల్లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. చంద్రబాబు సర్కారు ఏర్పడి 22 నెలలు గడిచినా ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను గర్భిణి చేసి 5 సార్లు కడుపు తీయించటం దారుణమన్నారు. జరిగిన అన్యాయంపై బాధితురాలు ప్రశ్నిస్తే కర్రతో నడిరోడ్డుపై దాడి చేశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించటంతో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత ప్రతిపక్షనేతను తిట్టేందుకే సరిపోయారని నియోజకవర్గం దాటి గంజాయి తరలివెళ్తున్నా ఆమెకు పట్టడం లేదన్నారు. పీఏని అడ్డుగా పెట్టుకొని ఆమె వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. పవన్వి అన్ని ప్రగల్భాలే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను గాలికి వదిలేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడానికి సరిపోయారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే తాటా తీస్తామని ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస పరిసరాల్లో మత్తుపదార్థాల విక్రయాలు జరగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ సేవించి పట్టుబడితే అతనిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తిరిగి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి సర్కారు నీరుగార్చిందన్నారు. ఈ బిల్లును టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసా, మాజీ డైరెక్టర్ సునీతా అమృతరాజ్, జెడ్పీటీసీలు దివ్య, ఖలీమున్నీసా, ఎంపీపీలు వెంకటేశ్వరమ్మ, హుస్సేన్బీ, శారదమ్మ, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
శుభగాత్రి..గిరిజాపుత్రి!
మహాశక్తి పీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి రూపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. అయితే, ఎప్పుడూ ఆమె నిజరూపంలో కనిపించరు. ప్రత్యేక అలంకరణలో మాత్రమే భక్తులకు అనుగ్రహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు అది కూడా కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారు నిజరూపదర్శనంలో అగుపిస్తారు. నేడు వార్షిక కుంభోత్సవం సందర్భంగా భక్తులకు ఆ దర్శన భాగ్యం లభించనుంది. ఒకప్పుడు చెంచుల ఉత్సవంగా ఉన్న ఈ కుంభోత్సవం నేడు సకల జనులదిగా మారడం విశేషం. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ఆలయపు జానపద ఆచారాల్లో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. గతంలో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమ్మవారి ఆలయం మూసివేసేవారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత గుడి తెరచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమలతో పూజించేవారు. ముందుగానే అమ్మవారి గర్భాలయం తెరచినప్పటికీ ముఖమండపంలోని శక్తియంత్రం వెనుకాల వండిన అన్నం పెద్ద రాశిగా పోసి ఒక దున్నపోతును తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి దాని తల నరికేవారు. తర్వాత ఆ తలను అన్నపురాసిపై దేవి విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంచేవారు. అలాగే నాలుగు మేకపోతులను బలిఇచ్చి అన్నపు రాశికి నాలువైపులా వాటి తలలను ఉంచి అవి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఉంచేవారు. కాలక్రమేణ చెంచుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికితోడు జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలు, జంతుప్రేమికుల విన్నపం మేరకు దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయశాఖ చట్టం చేసింది. దీంతో జంతుబలి నుంచి సాత్వికబలి దిశగా కుంభోత్సవం మారింది. ప్రస్తుతం సాత్వికబలిలో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు, తమ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కుంభోత్సవం రోజు పూజలు ఇలా కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యధావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జపపారాయణలు చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకం జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. నిజరూప దర్శనంఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరింపబడి ఉంటుంది. అయితే, సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు, 9 రకాల పిండివంటలతో మహానివేదన గావించాక ఈ ఉత్సవం ముగుస్తుంది. కుంభోత్సవం రోజు సాయంత్రం ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు చీరను ధరించి సీ్త్ర వేషంలో అమ్మవారికి హారతి తీసుకువస్తాడు. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులను నిర్వహించే ఉద్యోగి సీ్త్ర వేషాన్ని ధరిస్తాడు. స్వామిఅమ్మవార్ల సహస్రదీపాలంకరణ సేవా మండపం నుంచి భాజాభజంత్రీలతో ఈ హారతి తీసుకుని రావడం జరుగుతుంది. దీనికే కుంభహారతి అని పేరు. ఈ హారతి తెచ్చేటప్పుడు సీ్త్ర వేషధారి ముఖం కనపడకుండా చీరకొంగుతో ముసుగువేస్తారు. కుంభహారతి గర్భాలయం వద్దకు చేరుకున్న వెంటనే అర్చకులు గర్భాలయ ద్వారాలు తెరచి ఆ వేషధారి అమ్మవారికి హారతిని సమర్పించి అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారిని మొదటగా దర్శించుకునేది ఈ సీ్త్ర వేషధారే. శ్రీశైల భ్రమరాంబాదేవికి నేడు వార్షిక కుంభోత్సవం దక్షిణాచార సంప్రదాయంతో జంతు బలులు నిషేధం నాటి చెంచుల ఉత్సవం.. నేడు సకల జనుల ఉత్సవం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో అమ్మవారికి సాత్వికబలి అమ్మవారి నిజరూపదర్శనంతో పులకించనున్న భక్తజనం -
ఏ‘మనీ’ చెప్పాలి?
నగదు లేక ఖాళీగా ఉన్న ఏటీఎం కేంద్రం కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచి ఉంచినా డబ్బు అంతంతమాత్రమే ఉండటంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నగదు కొరతతో కర్నూలులోని కలెక్టరేట్, గాయత్రీఎస్టేట్, బుధవారం పేట, పెద్దాసుపత్రి, యూకాన్, సెంట్రల్ ప్లాజాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ఈ దుస్థితి ఏర్పడింది. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఉపాధి కల్పనపైనే ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్ ● తప్పిన ప్రమాదం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. -
ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తాం
నంద్యాల: ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోరుమానుకొండకు టీబీ రహిత పురస్కారం బేతంచెర్ల: మండల పరిధిలోని గోరుమాను కొండను 2025 సంవత్సరానికి టీబీ రహిత గ్రామంగా ప్రకటించారు. సోమవారం డీఎంహెచ్ఏ వెంకట రమణ అందుకు సంబంధించిన ప్రశంసాపత్రం, మెమోంటోను వైద్య సిబ్బందికి అందజేశారు. రానున్న రోజుల్లోనూ టీబీ రహిత గ్రామంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాజీ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, అధికారులు, వైద్య సిబ్బంది కృషితోనే తమ గ్రామం టీబీ రహిత పురస్కారం అందుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా భూమి నాకు ఇప్పించండి నంద్యాల(అర్బన్): ఇండియన్ ఆర్మీలో పని చేసిన తనకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సాగు భూమిని ఇతరులు ఆక్రమించుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని రిటైర్డు ఆర్మీ జవాన్ ఈఎస్పీ ప్రసాదరావు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక నూనపల్లె సమీపంలోని రిటైర్డు ఆర్మీ ఉద్యోగుల కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బండిఆత్మకూరు మండలం జీసీపాలెం గ్రామం సర్వేనం. 328/2లో మూడున్నర ఎకరాల సాగు భూమి ఇస్తూ తాత్కాలిక పొజిషన్ పట్టా కేటాయించారన్నారు. నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రెన్యూవల్ చేయించుకున్నానన్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడటంతో భూమి సాగు కష్టమైందన్నారు. ఈ క్రమంలో అధికారులు తన భూమిని స్థానికులు పెద్దినేని మురళీమోహన్ పేరు మీద ఆన్లైన్ చేశారని, దీనిపై పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి తన భూమి తనకే చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డు ఆర్మీ జవాన్ల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు మార్చుకోవాలి
● 412 మందిలో 106 మంది అధికారులకు ‘సున్నా’ మార్కులు ● అధికారులపై కలెక్టర్ రాజకుమారి అసంతృప్తి నంద్యాల: జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 412 మంది అధికారుల పనితీరును ఓపీటీఎస్ ద్వారా అంచనా వేయగా 106 మందికి గ్రీవెన్స్ పరిష్కారంలో ‘సున్నా’ మార్కులు రావడం ఆందోళనకరమన్నారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎండార్స్ చేసిన పిటిషన్లను సైతం కొందరు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మొత్తం 35 ముఖ్యమైన అర్జీలను పెండింగ్లో ఉంచడం లేదా తప్పుడు కారణాలతో మూసివేయడాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యక్ష విచారణ సాగుతోందన్నారు. దేవదాయ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ర్యాంకులు కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చేవారం నుంచి పీజీఆర్ఎస్ 9.30గంటల నుంచే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహణ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. -
ఉమ్మడి జిల్లాకు 21 నూతన కోర్టులు
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. -
విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని ఈఈలు, డీఈఈ, ఏడీఈలను విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాలిపోయిన ఆశలు
2024లో ఎకరాకు సగటున 6–8 టన్నుల దిగుబడి వచ్చింది. 2025లో 2–3 టన్నుల వరకే దిగుబడి పరిమితమైంది. ఈ సారి మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్ల తామర విజృంభించింది. దీనికి తోడు తేనెమంచు పురుగులు చుట్టుముట్టి తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే మొత్తం రాలిపోయింది. మామిడిలో కనిపించని పిందె, కాయలుకర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల వచ్చినా మార్కెట్లో మామిడి కనిపించని పరిస్థితి. మామూలుగా మార్చి రెండో వారం నుంచే మధుర ఫలం నోరూరిస్తుంది. మే నెల వరకు మామిడి మార్కెట్ను తనవైపు తిప్పుకుంటుంది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి గల్లంతవడం రైతులతో పాటు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే బేనిసా మామిడి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి. దీనినే బంగినపల్లి మామడిగా వ్యవహరిస్తారు. మొదటిసారి ఈ బేనిసా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం ఎకరాకు సగటున 4 టన్నులు వస్తుంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 53వేలకు పైగా టన్నుల దిగుబడి రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక తోటల్లో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మామిడి కూడా లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా పూత వచ్చింది. ఈ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 95 శాతంపైగా రాలిపోయింది. దాదాపు 10వేల ఎకరాల్లో అస్సలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో ఎకరాకు అర్ధ టన్ను వరకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లబోదిబోమంటున్న వ్యాపారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్, కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెళగల్, హాలహర్వి, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాల్లో తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్లతామర, తేనెమంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగుమందులు పిచికారీ చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండాపోయింది. కాయలు లేక వెలవెలబోతున్న చెట్లను చూసి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామిడి పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్లతామర. నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏప్రిల్ నెలలోనూ కనిపించని మధుర ఫలం ముంచిన నల్లతామర, తేనేమంచు పురుగులు దాదాపు 10 వేల ఎకరాల్లో కనిపించని కాయలు పంట లేక టన్ను ధర రూ.లక్షకు పైనే.. లబోదిబోమంటున్న వ్యాపారులు -
తర్తూరు జాతరకు వెళ్లొస్తుండగా..
● రుద్రవరం వద్ద ఆటో బోల్తా ● ఒకరు దుర్మరణం..పలువురికి గాయాలు పాములపాడు: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో జరిగే తిరునాలకు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఆత్మకూరు మండలం నాగలూటి గూడెం చెందిన ఆరుగురు ఆటోలో తర్తూరు తిరునాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆటోను డ్రైవర్ పులిచెర్ల బయ్యన్న వేగంగా నడుపుతూ రుద్రవరం వద్ద ఎన్హెచ్ 340సీ ఫ్లైఓవర్ వంతెనపై డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో అందులోని వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైదశాలకు తరలించగా నిమ్మల బయమ్మ అనే మహిళ మృతి చెందారు. గుర్రప్ప, అంకమ్మ అనే మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ధ్రువీకరించిన విత్తనాలు మేలు కర్నూలు(అగ్రికల్చర్): లైసెన్స్ కలిగిన డీలరు దగ్గర ధ్రువీకరించిన విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు చేసిన విత్తనం బిల్లు, ఖాళీ ప్యాకెట్, పంట చివరి వరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. విత్తనాల అమ్మకాల్లో అక్రమాలు గమనిస్తే సంబంధిత వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకరావాలని, టోల్ఫ్రీ నంబరు 83413 02863కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
స్ఫూర్తిప్రదాత జగ్జీవన్ రామ్
నంద్యాల: దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాన్ని ముందుగా వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సమాజానికి మార్గదర్శకమన్నారు. సమాజంలో కార్మిక చట్టాల ప్రాముఖ్యతను వివరిస్తూ, చట్టాల సహాయంతో సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, దీనికి బాబూజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, ఏ. చిన్న వెంకట సుబ్బయ్య, దండు వీరయ్య, ఎన్. లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
రేపు శ్రీశైల భ్రామరీకి కుంభోత్సవం
● సాత్వికబలిగా గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ● సీ్త్ర వేషంలో పురుషుడు అమ్మవారికి కుంభహారతి శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు. మంగళవారం ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. తరువాత అమ్మవారి ఆల యం ముందు రజకునిచే ముగ్గు వేయించి, భ్రమ రాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్వికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేపడుతారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తాడు. అనంతరం రెండో విడత సాత్వికబలిని సమర్పిస్తారు. తరువాత భక్తులను అమ్మ వారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. -
నిర్వహణ ఇంత అధ్వానమా?
డోన్: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజాప్రయోజన పనుల నిర్వహణను గాలికొదిలేయడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఉదయం తన స్వగృహం నుంచి వాకింగ్ చేస్తూ స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను సందర్శించారు. రెండేళ్ల క్రితం రూ.3.50 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ఆవరణ కళాహీనంగా తయారై కుక్కలు, పందులకు ఆవాసంగా మారడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరగడంతో అసహనం వ్యక్తం చేశారు. జాతి సంపద అయిన వసతిగృహం నిర్వహణకు కనీసం వాచ్మెన్ను కూడా నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. వాకర్ల కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడం శోచనీయమన్నారు. పట్టణంలో రూ. లక్షల ప్రజాధనంతో తమ హయాంలో నిర్మించిన ఏడు పార్కులు నేడు ఆలనాపాలనా లేక బోసిపోయాయన్నారు. పార్కుల్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల కోసం దుకాణాలను ఏర్పాటు చేస్తే వాటిని నేటి వరకు తెరిపించకపోవడం దారుణమన్నారు. స్విమ్మింగ్ పూల్, పార్కులు మూత పడటానికి కారణం టీడీపీ నాయకులేనన్నారు. అనవసరమైన స్థల వివాదాన్ని సృష్టించి ప్రజాధనాన్ని వృథా చేశారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్కు, స్విమ్మింగ్ పూల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎంపీపీ భవనం పరిశీలన.. రూ.3.50 కోట్లతో పట్టణ నడిబొడ్డున నిర్మించిన ఎంపీపీ నూతన భవనాన్ని ఆదివారం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పరిశీలించారు. ఈ సంద ర్భంగా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు శ్రమించిన ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి సోదరులతో పాటు వైస్ ఎంపీపీ ఎర్రిస్వామిని అభినందించారు. యూరోపియన్ మోడల్లో నిర్మించిన ఈ భవనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాజీ మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, క్లస్టర్ యూనివర్సిటీ మాజీ సభ్యులు నాగభూషణం రెడ్డి, పార్టీ నాయకులు మల్యాల శ్రీనివాసరెడ్డి, తాడూరు జయచంద్ర, విశ్వనాథ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, క్వాలిటీ అబ్దుల్లా, ఆర్ట్ రమణ, వంశీ, డీలర్ కృష్ణ, మేడా రఘు, ఉమామహేశ్వరరావ్, ధనుంజయరెడ్డి, రాజా మహేష్, సుభాన్, పాలుట్ల రఘురాం, ఫారెస్ట్ మౌళాలి, మహేశ్వరరెడ్డి, గడ్డం సురేష్, సుంకన్న తదితరులు ఉన్నారు. పార్కులు, స్విమ్మింగ్ పూల్ను ఎందుకు పట్టించుకోవడం లేదు పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
ప్రత్యేక ప్రొటోకాల్తో దోపిడీ
హౌస్కీపింగ్ నుంచి ఒకరిని, శానిటేషన్ నుంచి ఒకరిని ఇద్దరు సూపర్వైజర్లను ప్రొటోకాల్ కింద ఏర్పాటు చేసుకుని తనకు తెలిసిన వారు వస్తే వారిని దర్శనాలకు పంపిస్తూ ఏజెన్సీ ప్రతినిధులు దర్శనాల దందా నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనం టికెట్లు కూడా ఎన్ని అడిగితే అన్ని ఆ విభాగపు అధికారులు వీరికి రెడ్ కార్పెట్ వేసి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని సార్లు టికెట్లు లేకుండానే దర్శనం చేయించి వారి వద్ద నుంచి టికెట్టు డబ్బులు వసూలు చేస్తూ ప్రోటోకాల్కు వెళ్లే సూపర్వైజర్, ఏజెన్సీ ప్రతినిధులు..వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పద్మావతి ఏజెన్సీపై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దేవస్థాన ఉన్నతాధికారులు, చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభం
కల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ఈనెల 5 నుంచి 14వ తేదీ (బాబు జగ్జీవన్ రామ్ జయంతి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి) వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ అన్నారు. ఆదివారం కల్లూరు మండలం ఎ.గోకులపాడులో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూర్య ఘర్ పథకం, రాష్ట్ర ప్రభుత్వ యూఎల్ఏ మోడల్ ద్వారా పెద్ద ఎత్తున సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 23,077 గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కిట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శుభకార్యానికి వచ్చి.. మృత్యుఒడికి.. ● కుందూనదిలో జారిపడి పదేళ్ల బాలిక మృతి బండిఆత్మకూరు: బంధువుల శుభాకార్యానికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ మృత్యుఒడి చేరింది. నంద్యాల మండలం హైస్కూల్ కొట్టాల గ్రామానికి చెందిన షేక్ సుభాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పార్నపల్లి గ్రామంలో జరిగే బంధువుల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. సరదాగా గడుపుతున్న సమయంలో సుభాన్బాషా కుమార్తె షబానా (10) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు మహానంది: ఎండలను దృష్టిలో ఉంచుకుని మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవస్థానంలోని రాజగోపురం ముందు భాగంతో పాటు ఆలయంలో ఉన్న క్యూలైన్లు, కోనేరు ప్రాంతాలు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, తదితర ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, కొబ్బరిపీచు మ్యాట్లను వేయించారు. ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది ఆదివారం ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వం ఉపాధ్యాయు ల సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామపక్కీర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నూర్మహమ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్ రద్దుకు కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. -
నగదు కొరత!
● మూతపడుతున్న ఏటీఎంలుకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు మూత పడుతున్నాయి. ఐదారేళ్లుగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ తాగినా, పల్లీలు కొన్నా.... ఫోన్పేను వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో 90 శాతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఆర్బీఐ నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి నగదు రావడం లేదు. గతంలో వారానికి కనీసం ఒకసారి నగదు వచ్చేది. ప్రధానంగా ఆర్బీఐ నుంచి రూ.500 నోట్లు వచ్చేవి. ఆర్బీఐ నుంచి జిల్లాల్లోని కరెన్సీ చెస్ట్లకు నగదు సరఫరా దాదాపు నెల రోజులుగా లేకుండా పోయింది. గతంలో పెట్రోలు బంకులు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగేది. నేడు ఇందులో కూడా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో నగదు సర్క్యులేషన్ తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎంతమేర ఉన్నప్పటికీ చేతిలో అవసరాలకు కొంత నగదు ఉంచుకోవడం సర్వసాధారణం. చేతిలో రూ.1000, రూ.2000 ఉంచుకునేందుకు కూడా నగదు లభించడం లేదు. నగదు లేకపోవడంతో జిల్లాలోని ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఏటీఎంలో రూ.500 నోట్లు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ నోట్లు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఏటీఎంలు మూత పడుతున్నాయి. బ్యాంకులు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చారు. నగదు లభ్యతను బట్టి బ్యాంకులు ఏటీఎంల్లో పెడుతున్నాయి. పలు బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు పడిపోవడంతో ఏటీఎంలను మూసేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 153 ఉన్నాయి. ఇందులో బ్రాంచీల ఆధ్వర్యంలో 63, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 90 పనిచేస్తున్నాయి. వీటిలో 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో అత్యధిక ఏటీఎంలు పనిచేయడం లేదు. కలెక్టరేట్లోని ఎస్టీఐ ట్రెజరీ బ్యాంకు ఏటీఎం కొద్ది రోజులుగా మూత పడింది. దీంతో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు ప్రధానంగా రూ.500 నోట్లు సరఫరా పెరిగితేనే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంది. -
గమ్యం చేరేదెట్టా
నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో గత ఏడాది జూలై నెల నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిచేది. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు తిరుపతికి వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరుంగా ఉండేది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక రైలును రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుపతి ఒకే రైలు ఉండటంతో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. – డీసీ ఉసేన్, కోవెలకుంట్ల నంద్యాల నుంచి రేటిగుంట వరకు ప్రస్తుతం ఒకే డెమో రైలు నడుస్తోంది. ఈ రైలు ఉదయం 6.45 గంటలకు కోవెలకుంట్లకు చేరుకుంటుంది. ఈ రైలు వెళ్లిన తర్వాత రాత్రి వరకు రైళ్ల రాకపోకలు లేవు. ఇదే సమయంలో రేణిగుంట నుంచి నంద్యాలకు మరో ప్యాసింజర్ రైలు నడిపితే ప్రయాణికులకు అన్ని విధాలా రైలు ప్రయాణం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలి. – రాజేశ్వరరెడ్డి, జోళదరాశి గ్రామం, కోవెలకుంట్ల మండలంకోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గం లో రైళ్ల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండటంతో రెండు జిల్లాల ప్రయాణికులు అవస్థలు పడుతు న్నారు. ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిమీ మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపా డు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగాన పల్లె, మద్దూరు, నంద్యాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని 2016 ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంత పురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో డెమో రైలు మినహా మిగిలిన ఎక్స్ప్రెస్ రైళ్లు రాత్రి వేళల్లో మాత్రమే తిరుగుతుండటం, ఇటీవలే ఒక ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ప్రజలకు రైలు ప్రయాణం కష్టతరంగా మారింది. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి నంద్యాల మీదు గా తిరుపతికి ప్రత్యేక రైలు తిరుగుతుండేది. నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాలకు గురువారం ఉదయానికి నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా తిరు పతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంట లకు నంద్యాలకు చేరుకునేది. ఈ ప్రత్యేక రైలును మార్చి 1వ తేదీ నుంచి రద్దు చేయడంతో ఈ మార్గం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లుకు మాత్రమే పరిమితమైంది. నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల రాకపోకలను పెంచాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నా రైల్వేశాఖ రైళ్ల పెంపును కంటితుడుపుగా చేపడుతోంది. ఉన్న రైలును రద్దు చేయడం, ప్రస్తుతం నడుస్తున్న తిరుపతి రైలుకు కోవెలకుంట్లలో శాశ్వత స్టాపింగ్ లేకపోవడంతో రైల్వేశాఖ ఆరు నెలలకొకసారి స్టాపింగ్ ప్రక్రియను రెన్యువల్ చేయాల్సి వస్తోంది. రైల్వే అధికారులు ఏమాత్రం అనుమతి నిరాకరించినా ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు కోవెలకుంట్లలో స్టాపింగ్ ఉండదు. నిత్యం వందల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే అధికారులు పగటి వేళ్లలో ఈ మార్గంలో రైళ్లను నడపకపోవడంతో అవస్థలు పడుతున్నారు.● తిరుమల ఎక్స్ప్రెస్ రైలును కడప నుంచి నంద్యాల వరకు పొడిగించాలని ప్రతిపాదన ఉన్నా ఆ రైలును నంద్యాలకు కాకుండా అనంతపురం జిల్లా గుంతకల్లు వరకు పొడిగించడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ● ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురంకు కొత్తగా ప్యాసింజర్ రైలును మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రైలు గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా కడప వరకు ఉంటుందని ప్రజలు భావించారు. అలా కాకుండా నంద్యాల నుంచి మార్కాపురానికి మార్చడంతో ప్రజలకు నిరాశే మిగిలింది. ఆరు నెలలు గడిచినా గుంతకల్లు– మార్కాపురం రైలు పట్టాలెక్కలేదు. ● ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వ్యాపించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించలేదు. నాందేడ్ – నంద్యాల– తిరుపతి రైలు రద్దు ఎర్రగుంట్ల రైల్వేమార్గంలో పట్టాలెక్కని ప్రతిపాదన రైళ్లు అరకొరగా నడుస్తున్న రైళ్లలో కిక్కిరిసి ప్రయాణం రెండు జిల్లాల ప్రయాణికులకు తప్పని నిరీక్షణ -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు తరలివచ్చారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీ సుదర్శన హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో ఈ కార్యాక్రమాన్ని ముగించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలంకరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. -
ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి బీసీ హామీ నిలుపుకోవాలి
బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్రెడ్డి దంపతులు ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా తాను నిరుపయోగంగా ఉన్న ఎస్సార్బీసీ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయగా బీసీ కోర్టు ద్వారా అడ్డుకున్నారన్నారు. చివరకు న్యాయస్థానంలో స్టే తొలగింపుతో పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగాయని, అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పట్టాల పంపిణీ జరగలేదన్నారు. నాడు ఎస్సార్బీసీ స్థలంలో పట్టాల పంపిణీ ప్రమాదమని పేర్కొన్న బీసీ జనార్దన్రెడ్డి నేడు అదే స్థలంతో పాటు పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని మంత్రి బీసీ పేర్కొనడం శోచనీయమన్నారు. దాత లు వెంకటేశ్వరస్వామికి భక్తితో దానంగా ఇచ్చిన భూమిని దేవాలయ అభివృద్ధికి వినియోగించాలన్నారు. మండలంలోని పలుకూరు గ్రామంలోని శివాలయానికి చెందిన 308 సర్వే భూమిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు యథేచ్ఛగా అక్రమమైనింగ్కు పాల్పడటంతో ఆలయ పూజారి జిల్లా కలెక్టర్, మైనింగ్ దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హిందూ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సంఘాలు, సంబంధింత అధికారులు స్పందించాల ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో తమకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి దంపతులు పట్టణంలో ఇంటింటి వద్దకు వెళ్లిన సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ భూమితో సంబంధం లేకుండా, తమ సొంత డబ్బుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయండి ఆలయ భూముల్లో మంత్రి అనుచరులు దర్జాగా మైనింగ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆల య క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పాలిసెట్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభమైనట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ శైలేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి రోజున 200 మంది హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్ విద్య తో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అభ్యర్థు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్స్లో ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైందన్నారు. పదో తరగతి విద్యార్థులందరూ https//:polycet ap.ap.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఈనెల 9 వరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. సమాచారం కోసం 9912377723 సంప్రదించాలని పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి నంద్యాల: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామాల్లో ఉన్న బోర్వెల్స్కు తప్పనిసరిగా జియో మ్యాపింగ్ చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ జూనియర్ ఇంజినీర్లు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార మాధ్యమాల్లో వెలువడే తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్కు నివేదికలు అందజేయాలన్నారు. ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర శనివారం క్వింటా రూ.9,079 గా నమోదయ్యింది. గత వారం రోజుల నుంచి రోజుకు రూ.100 చొప్పున పెరుగుతూ శనివారానికి రూ.9 వేలు పైనే ధర పలికింది. ఈ మేరకు 1248 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ట ధర రూ. 9,079, మధ్య ధర రూ.8,742, కనిష్ట ధర రూ.4,189గా నమోదయ్యింది. -
నాసరరెడ్డి సేవలు ఆదర్శం
● జెడ్పీ సీఈఓను సన్మానించిన అధికారులు, ఎంపీడీఓలుకర్నూలు(అర్బన్): తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మన్ననలను పొందిన జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి అందరికీ ఆదర్శమని పులువురు కొనియాడారు. జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తూ డీఎస్జీఎస్డబ్ల్యూఓగా అనంతపురానికి పదోన్నతిపై వెళ్తున్న జి. నాసరరెడ్డి సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి భాస్కర్, ఆదోని డీడీఓ బాలకృష్ణారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీడీఓ, జెడ్పీ ఏఓ, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ఎంపీడీఓలు జ్యోతి, దస్తగిరిబాబు, దశరథరామయ్య మాట్లాడుతూ నెలలుగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను కూడా తక్కువ సమయంలోనే సులభంగా పరిష్కరించారని తమ అనుభవాలను వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్లో ఎప్పుడు జెడ్పీలో జాప్యం జరగలేదన్నారు. నాసరరెడ్డిని మార్గదర్శకంగా తీసుకొని విధులు నిర్వహిస్తామని పలువురు ఎంపీడీఓలు భావోద్వేగంతో అన్నారు. -
పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉన్నప్పటికీ స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పాఠశాలకు పిలిపించి విద్యాబోధన అందిస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పడడంతో అరవింద్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలను పర్యవేక్షించి వాటిని సరి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి... ఆదోనిలో నిబంధనలకు విరుద్ధంగా చదువులు కొనసాగించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పైకప్పు పెచ్చులూడి గాయాలపాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు సంజయ్, శశిధర్ పరామర్శించారు. -
బోరుకు తాళం తొలగింపు
పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంప్నకు ఓ వ్యక్తి వేసిన తాళాన్ని పోలీసులు తొలగించారు. ‘చేతి పంప్ బోర్కు తాళం’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర స్పందించారు. శుక్రవారం సిబ్బందితో ఎస్ఐ వెళ్లి వివరాలు తెలుసుకుని తాళాన్ని తొలగించారు. కాగా బోరు వద్ద బండలు పగిలిపోవడం వలన తాళం వేసినట్లు సమీపంలో నివాసముంటున్న వేణు భార్య రాజమ్మ పోలీసుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇదే బోరుకు ప్రత్యేక మోటార్ అమర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయగా ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకున్నారు. దళితుల ఆత్మ గౌరవంపై దాడి కోవెలకుంట్ల: నర్సీపట్నంలో డప్పుకొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం వారి ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్ విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార దర్పంతో దళితులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో దళిత భాస్కర్రావును స్పీకర్ దుర్భాషలాడి దాడి చేసిన తీరు మరింత ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయన్నారు. అధికార మదంతో ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల గౌరవాన్ని కించపరిచేలా చోటు చేసుకున్న ఘటనకు బాధ్యత వహించి స్పీకర్ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత సమాజం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడతామని హెచ్చరించారు. మూడు గడివాములు దగ్ధం కల్లూరు: దొడ్డిపాడు గ్రామంలో శుక్రవారం మూడు గడివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చిన్న చాంద్ బాషా పశువుల మేత కోసం రెండు వేరుశనగ, ఒక సొప్ప వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తూ గడివాములకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. హమాలీల కూలి రేట్లు పెంచాలి కర్నూలు(సెంట్రల్): సివిల్ సప్లై హమాలీల కూలి రేట్లను పెంచాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాలని కోరుతూ రెండో రోజు కర్నూలు ఎంఎల్ఎస్ పాయింట్లో హమాలీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ హాజరై మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త కూలి రేట్లను పెంచకుండా కాలయాపన చేస్తోందన్నారు. జీతాలను పాత పద్ధతిలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ఒక వ్యక్తి అకౌంట్లో వేసి ఇవ్వడం సరికాదన్నారు. అంతేకాక ఫేషియల్ యాప్ నుంచి హమాలీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను కల్పించాలని కోరారు. రిటైర్ అయిన హమాలీకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి సోలోమన్ రాజు, బజారి, శివ, బాలరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, రాజేష్ పాల్గొన్నారు. -
తండ్రి హత్య కేసులో కుమారుల అరెస్ట్
కౌతాళం: ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరుల సమావేశంలో సీఐ అశోక్కుమార్ వివరాలు వెల్లడించారు. కుంటనహాల్ గ్రామంలో గత నెల 30వ తేదీన తెల్లవారు జామున నన్నేసాబ్ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం కుమారులే తండ్రిని చంపారని విచారణలో తేలింది. పరారీలో ఉన్న నన్నేసాహెబ్ పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, చిన్న కుమారుడు జునైద్, జునైద్ స్నేహితుడు రీహన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్తిలో తమ వాటా ఇవ్వకుండా తండ్రి అలసత్వం వహిస్తున్నాడన్న అనుమానంతో మానసికంగా కుంగి నిందితులు తండ్రి హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే ముగ్గరు కలిసి గత నెల 30వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న నన్నేసాబ్ను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడు నన్నేసాబ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, పీడిబాకు, సెల్ఫోన్ను స్వాదినం చేసుకుని నిందితుల్ని రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు. -
వైభవంగా సుశమీంద్ర తీర్థుల ఆరాధన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థులు శతమహోత్సవ జయంతి ఆరాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా డోలోత్సవ మండపంలో జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. వేడుకల్లో భాగంగా సుశమీంద్ర తీర్థులు మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీసుశమీంద్ర తీర్థుల బృందావనానికి పంచామృతాభిషేకాలు, మంగళహారతులు చేపట్టారు. అనంతరం శ్రీ సుశమీంద్ర తీర్ధులు చిత్రపటానికి పుష్పార్చన, దీపారాధన చేశారు. ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మట్లాడుతూ.. శ్రీరాఘవేంద్రస్వామి మఠం గురువులు పూర్వపీఠాధిపతి శ్రీ సుశమీంద్ర తీర్థుల సేవలు మరవరానివి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, మంత్రాలయం మఠం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. అన్నదాన కోసం రెండు లక్షల విరాళం: ప్రముఖ పుణ్యక్షేత్రంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కోసం ఆదోనికి చెందిన మీనప్ప కుటుంబ సభ్యులు రెండు లక్షలు రూపాయలు అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు.అనంతరం ఆ కుటుంబ సభ్యులకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలతో శ్రీరాఘవేంద్రల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. -
విండ్ పవర్లో టీడీపీ నాయకుడి పెత్తనం
● వాహనాల యజమానుల నుంచి కమీషన్లు ● తాజాగా సెక్యూరిటీ సూపర్వైజర్పై దాడి సాక్షి టాస్క్ఫోర్స్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు రెచ్చిపోతున్నారు. ఏమి చేసినా తమను అడిగేవారు లేరంటూ హద్దుమీరి ప్రవరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొద్ది రోజులుగా విండ్ పవర్లో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నాయకుడు తాజాగా సెక్యూరిటీ సూసర్వైజర్పై దాడికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం యర్రగుడి సమీపంలోని కొండల్లో ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ విండ్ వపర్ (గాలిమరలు) ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలో ఎవరైనా వాహనాలు, జేసీబీలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ వారి నుంచి నెలకు కొంత మొత్తాన్ని కమీషన్గా ఇవ్వా లని వాహనాల యజమానులను బెదిరిస్తూ వచ్చాడు. అలాగే అక్కడ పని చేస్తున్న కొందరిని మచ్చిక చేసుకు ని హవా నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీన యర్రగుడి సమీపంలో విండ్పవర్ వద్ద సెక్యూరిటీ సూసర్వైజర్ శ్రీనివాస యాదవ్పై రాజగోపాల్ దాడి చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విండ్ పవర్ సంస్థకు యాక్ట్వ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సంస్థ 84 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. అయితే ఏజెన్సీ నుంచి వచ్చే వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా మధ్యవర్తులు కోత విధిస్తున్నారంటూ వైఎస్సార్ కడప జిల్లా వద్దిరాలకు చెందిన సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసయాదవ్ సంస్థలోని ప్రతినిధులను ప్రశ్నిస్తూ వచ్చాడు. గార్డులు సైతం ఈ విషయంలో మద్దతు పలికారు. అందరూ సంతకాలు చేయడంతో కొద్ది రోజుల క్రితం జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దాడి చేసి.. వేటు వేసి! వేతనాల విషయంలో గార్డుల కడుపుకొడుతున్నారని శ్రీనివాస యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే తరచూ ప్రశ్నిస్తునందుకు అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో ఏజెన్సీకి చెందిన కొంత మంది ప్రతినిధులు శ్రీనివాస యాదవ్ను తెలంగాణ రాష్ట్రం నల్గొండకు బదిలీ చేయడంతో వెళ్లేదిలేదని భీష్మించాడు. అయితే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం అతను సైట్లోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు రాజగోపాల్ సంబంధం లేక పోయినా ఐదారుగురిని వెంట తీసుకెళ్లి శ్రీనివాస యాదవ్ను దుర్బాషలాడి దాడికి దిగాడు. గార్డులు అడ్డుపడి కాపాడారు. చివరకు గార్డుల వేతనాల వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. ఏజెన్సీ ప్రతినిధులు, సెక్యూరిటీ సూపర్వైజర్తో మంతనాలు చేపట్టారు. చివరకు అతనికి చెందిన బకాయిలన్నీ ఇచ్చి, నల్గొండకు వెళ్లేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
దొంగ అరెస్ట్
● రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి నగదు స్వాధీనం నంద్యాల: జిల్లాలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ వివరాలు వెల్లడించారు. నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్సార్నగర్కు చెందిన షేక్ బాబావలీ నంద్యాల తాలూకా, బండిఆత్మకూరు, రేవనూరు, సంజామల, గడివేముల, బేతంచెర్ల, అవుకు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శుక్రవారం నందమూరి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్లేని బైక్పై వస్తున్న బాబావలీ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 98 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.54,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ సురేష్ కుమార్తోపాటు నంద్యాల తాలూకా సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ మందాజావళి, ఎస్పీ అభినందించారు.దొంగ అరెస్ట్ చూపుతున్న ఎస్పీ సునీల్ షెరాన్స్వాధీనం చేసుకున్న పోలీసులు -
వైభవంగా శ్రీవారి రథోత్సవం
క్రిష్ణదొడ్డిలో జనసందోహం మధ్య సాగుతున్న శ్రీ వారి రథోత్సవం సి బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో కొండపై వెలసిన శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా సాగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామికి భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజార్లు గణపతి పూజ, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభం ప్రారంభించారు. కుంభం కాగు రథం దగ్గరకు చేరుకోగా శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు మహారథోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. పార్వేటకు బయలుదేరిన స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పూజార్లు వేంకటేశ్వర స్వామికి పార్వేట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను అశ్వ, గజారోహణం తదనంతరం పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. శనివారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్!
పాణ్యం: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. గోరుకల్లు గ్రామంలో శుక్రవారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తన రాజకీయ అనుభవంలో ఇంతలా టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడటం చూడలేదన్నారు. యూరియా, మద్యం, ఇసుక, ఇతర అభివృద్ధి పనుల్లో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకే పనులు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు అధికారులు ప్రజల వినతులను కూడా స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయించి సామాన్య ప్రజలను సైతం వేధిస్తున్నారన్నారు. మహిళలపై టీడీపీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న లైంగిక దాడులపై కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాజధాని పేరుతో రేట్లు పెంచి దోచుకుంటున్నారన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వస్తాయని కాటసాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోవడంపై వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రేగటి పెద్దస్వామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. పెద్దస్వామి దర్గాలలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జింకల సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ఉసేన్సా, వెంకటరామిరెడ్డి, లక్ష్మీమద్దయ్య తదితరులు పాల్గొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదు ప్రజల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తాం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
జూనియర్ సివిల్ జడ్జిగా మహమ్మద్ ఆజం
కర్నూలు: కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ ఆజం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి అల్లాబకాష్ కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి షేకున్బీ గృహిణి. మహమ్మద్ ఆజం ప్రాథమిక విద్య కర్నూలులో, పెండేకంటి లా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్డీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆజాం మాట్లాడుతూ.. జ్యుడీషియల్ పరీక్షలు రాయాలంటే కృషి, పట్టుదల ప్రధానమని, తల్లిదండ్రులు, చిన్నమ్మ, చిన్నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆజాంకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్జి ఉద్యోగం సాధించిన రాచర్ల యువకుడు ప్యాపిలి: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని ఎందరో నిరూపిస్తున్నారు. ఇదే కోవలో రాచర్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రామచంద్రారెడ్డి, విజయలక్ష్మిల కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాచర్లలోనే పదో తరగతి, హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. పంజాబ్లోని నేషనల్ లా యూనివర్సిటీలో 2024లో బీఏఎల్ఎల్బీ హానర్స్ పూర్తి చేసి 2025 జనవరిలో జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకుని ప్రణాళికతో చదివారు. 2025 జూలైలో ప్రిలీమ్స్, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు రాసి, 2026 మార్చిలో ఇంటర్వ్యూలో ప్రతిభ చాటారు. ఏప్రిల్ 2 వ తేదీ విడుదలైన సెలెక్షన్ జాబితాలో 250 మార్కులకు గాను 175.75 మార్కులు సాధించి జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి మేనమామ కంబిరెడ్డి స్ఫూర్తితో చదివినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జడ్జిగా ఎంపిక కావడం వెనుక తల్లిదండ్రుల పోత్సాహంతో పాటు మేనమామ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంపై రాచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
నిబంధనలకు పాతర.. మందు జాతర!
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో మద్యం విక్ర యాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎకై ్సజ్ పోలీసుల జాడ లేదు. జాతరలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఒకరి పేరున లైసెన్స్ పొంది.. మరొకరు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోవటం లేదు. తర్తూరు గ్రామానికి చెందిన కమాల్బాషా పేరున జాతరలో ఈనెల 2 నుంచి 5 వరకు మద్యం విక్రయించేందుకు ఎకై ్సజ్, ప్రొహిబిషన్ జిల్లా అధికారులు ఈవెంట్ పర్మిషన్ ఇచ్చారు. సదరులైసెన్స్ దారుడు కర్నూల్లోని ఐఎంఎఫ్ఎల్ పాయింట్ వద్ద 12 శాతం రుసుం అధికంగా చెల్లించి మద్యం కొనుగోలు చేసి జాతరలో విక్రయించుకోవాలని ఎక్సైజ్శాఖ అధికారులు ఆదేశించారు. ఈ రుసుం చెల్లించకుండా జూపాడుబంగ్లాలోని మద్యం దుకా ణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వార్టర్ మద్యం సీసాపై రూ.20లు అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నా సివిల్ పోసులు సైతం కన్నెత్తిచూడటం లేదనే విమర్శలున్నాయి. కేసులు నమోదు చేస్తాం తర్తూరు జాతరలో నిర్వహిస్తున్న ఈవెంట్ మద్యం దుకాణంలో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన మద్యం కాకుండా అక్రమ మద్యం విక్రయిస్తే దుకాణం సీజ్చేసి లైసెన్స్దారునిపై కేసు నమోదు చేస్తామని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ స్క్వాడ్ సీఐ సుభాషిణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె తర్తూరు జాతరలోని మద్యం దుకాణాన్ని తనిఖీ చేశారు. -
సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంక్షేమ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరు తగిన స్థాయిలో ఉన్నప్పటికీ, బీసీ వెల్ఫేర్ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్నా రు. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్ర కారం నాణ్యమైన ఆహారం అందుతుందో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి హాస్టల్లో మెనూ వివరాలతో పెద్ద హోర్డింగ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పేద విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, తాగునీరు, పారిశుద్ధం, ఆహార నాణ్య త, వార్డెన్ అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయా లన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ అధి కారి చింతామణి, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యాలయానికి మార్కెట్ యార్డు భూమినా?
నంద్యాల: పట్టణ నడిబొడ్డున ఉన్న రూ. కోట్ల విలువ చేసే రెండెకరాల మార్కెట్ యార్డు భూమిని టీడీపీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి 33 ఏళ్ల పాటు తక్కువ ధరకు లీజుకు కేటాయించి రైతుల పొట్టకొడుతున్నారన్నారు. రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డ్ భూమిని తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి ఇవ్వడం దారుణమన్నారు. ఎకరాకు కేవలం ఏడాదికి రూ. వెయ్యికే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని 33 ఏళ్ల పాటు అప్పనంగా అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నంద్యాలలో టీడీపీ నేతల భూదాహంతో మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా వదలడం లేదన్నారు. ఎకరాకు వెయ్యి రూపాయల లీజు అంటే అది ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడం కాదా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై రైతుల తరుఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వివాదా స్పద నిర్ణయాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రెండేళ్లు గడిచినా నంద్యాలలో అభివృద్ధి శూన్యమని, కేవలం సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. పట్టణ నడిబోడ్డున ఉన్న రెండెకరాలకు ఏడాదికి రూ.2 వేలకే లీజుకిస్తారా అధికార దాహానికి అడ్డూ అదుపు లేదా? మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డి -
పడిపోయిన టమాట ధర
పెద్దకడబూరు: టమాట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో మూడుకిలలో ధర రూ.4 పలుకుతోంది. దీంతో పెద్దకడబూరులోని సోమన్నాచారి అనే రైతు తన రెండు ఎకరాల్లో టమాట కాయలను తెంపకుండా అలాగే వదిలేశారు. రెండు ఎకరాల్లో టమాటాను రూ.1.50లక్షల ఖర్చుపెట్టి సాగు చేశానని, మొక్కలకు పందిరి వేసినా దిగుబడికి ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కిలోకు రూ. 2 ధర కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. రహదారులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి కృష్ణగిరి: రహదారులు బాగుండి, రవాణా సౌకర్యం పెరిగినప్పుడే గ్రామాలు అభివృద్ధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమారి అన్నారు. వెల్దుర్తి క్రాస్ నుంచి టి.గోకులపాడు, తొగర్చేడు గ్రామాలకు ఇటీవల నాబార్డు నిధులతో వేసిన బీటీ రహదారులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. టి.గోకులపాడు గ్రామ సమీపాన హంద్రీపై బ్రిడ్జి, కటారుకొండ క్రాస్ రహదారి నుంచి పులిచెర్లకు బీటీ రహదారికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఈమె వెంట పీఆర్ ఈఈ మహేశ్వరరెడ్డి, డీఈ శేషయ్య, క్వాలిటీ కంట్రోల్ డీఈఽ దనిబాబు, మండల పీఆర్ ఏఈ జాకీర్హుసేన్ ఉన్నారు. తుంగభద్ర నుంచిఎల్లెల్సీకి నీటి విడుదల హొళగుంద: వేసవిలో ప్రజల గొంతులు తడిపేందుకు తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. డ్యాం నుంచి పవర్ కెనాల్కు విడుదలైన 1,500 క్యూసెక్కులు నీరు గుండ్లకెరె (చెరువు)కు చేరి అక్కడ నుంచి ఎల్లెల్సీకి విడుదలవుతున్నాయి. ప్రస్తుతం వదిలిన నీరు మరో మూడు రోజుల్లో ఆంధ్ర (250 కి.మీ)కు చేరనున్నాయి. దాదాపు 15 రోజుల పాటు నీటిని వదిలి మళ్లీ ఈ నెల 18 లేదంటే 20వ తేదీకి నిలిపివేయనున్నారు. టీబీ డ్యాం పూర్తి స్థామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.121 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయి. రానున్న 4 రోజులు భానుడి భగభగలే! కర్నూలు(అగ్రికల్చర్): రానున్న నాలుగు రోజులు జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ వరకు పొడి వాతావరణం( డ్రై వెదర్) ఉంటుందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా రుద్రవరంలో 40.4 డిగ్రీలు, ఉయ్యాలవాడలో 40.3, కోవెలకుంట్లలో 40.3 డిగ్రీలు, కౌతాళంలో 40 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆరోగ్యశ్రీ బంద్ కొనసాగింపు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవల బంద్ కొనసాగుతోంది. బకాయిల వసూలుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నెల ఒకటో తేది నుంచి సమ్మె చేస్తున్నాయి. గురువారం సైతం మెజారిటీ ఆసుపత్రులు బంద్ పాటించాయి. జిల్లా మొత్తం 60 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా గురువారం సైతం సగానికి పైగా ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని బోర్డు ఏర్పాటు చేశారు. వైద్యసేవ సేవలు కొనసాగిస్తున్న ఆసుపత్రుల్లోనూ కొన్నింటిలో అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్న ఆసుపత్రులకు రోగులు వెళ్లాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో హైకోర్టు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆర్ఆర్బీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు కర్నూలు(అర్బన్): ఆర్ఆర్బీ గ్రూపు–డీ పోస్టుల ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేది వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్ఎస్సీలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా వచ్చి అందించాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణ 60 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ అందిస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన వారికి స్టైఫండ్ మంజూరవుతుందన్నారు. వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. వేరుశనగ ధర పతనం కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్ వర్షన్ మారడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ–నామ్ సెకండ్ వర్షన్తో అనేక సమస్యలు ఏర్పడటంతో వ్యవసాయ ఉత్పత్తులను గతంలో ఉన్న పాత పద్ధతి ద్వారా(మాన్యువల్) క్రయవిక్రయాలు చేపట్టారు. వ్యాపారులు సిండికేట్గా మారి వేరుశనగ ధరను అడ్డంగా కోసేశారు. ఇటీవల క్వింటా ధర రూ.12,500 వరకు వెళ్లిన వేరుశనగ ధర నేడు నేల ను తాకింది. మార్కెట్కు 2260 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. కనిష్ట ధర రూ.3,412, గరిష్ట ధర రూ.7909 లభించగా.. సగటు ధర రూ.6,077 నమోదైంది. ● కందులకు కనిష్ట ధర రూ.2,690, గరిష్ట ధర రూ.7,709 లభించగా.. సగటు ధర రూ.7,070 మాత్రమే పలికింది. ● శనగలకు కనిష్ట ధర రూ.3,069 లభించగా.. గరిష్ట ధర రూ.5290 పలికింది. సగటు ధర రూ.4759 నమోదైంది. -
మాస్టర్స్ క్రీడల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు
కర్నూలు: మాస్టర్స్ క్రీడల్లో జిల్లా పోలీసు శాఖకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత నెల 30, 31వ తేదీల్లో 35 – 45 సంవత్సరాల వయస్సు విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాప్(ఎస్ఏపీ) లీగ్ మాస్టర్స్ క్రీడలలో జిల్లా పోలీసు శాఖకు చెందిన ఆర్ఎస్ఐ మహేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్లు పాల్గొని పథకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన వీరు గురువారం జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ మెడల్స్, శాలువాతో సన్మానించి అభినందించారు. ఆర్ఎస్ఐ మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం సాధించారు. అలాగే ట్రాఫిక్ పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ లాంగ్జంప్లో కాంస్య పతకం సాధించారు. కార్యక్రమంలో ఆర్ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్గోస్పాడు: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని డాక్టర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. గురువారం నంద్యాల పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తుంటారని, వారికి సరైన చికిత్సను సకాలంలో అందించాలన్నారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్పేషెంట్ (ఓపీ), రిజిస్ట్రేషన్ బ్లాక్, మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న చికిత్స, వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందే విధంగా చూడాలన్నారు. ఆసుపత్రులలోని వార్డులలో ఆయా విభాగాల అధిపతులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. -
ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గత నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై గురువారం ముగిశాయి. చివరి రోజు జిల్లాలో మొత్తం 2,4701 మంది విద్యార్థులకు గాను 24,412 మంది పరీక్షలకు హాజరు కాగా 289 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది అంతా కష్టపడి చదివి తొలి సారి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష ముగియగానే విద్యార్థులు సంతోషంగా వారి స్వగ్రామాలకు బయల్దేరి వెళ్లారు. చేతి పంపునకు తాళం పగిడ్యాల: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన చేతి పంపునకు తాళం వేసిన ఉదంతం తూర్పుప్రాతకోట గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంపు నీటిని పట్టుకోవడానికి స్థానికులు వస్తుండేవారు. అయితే బోరుకు తాళం వేయడంతో ప్రజలు నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి పడమర ప్రాతకోటలోని వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి క్యాన్ రూ.50కు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి చేతి పంప్కు వేసిన తాళాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమిత్రమ్మను అడుగగా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలిసెట్ దరఖాస్తుకు 9 వరకు గడువు నంద్యాల(న్యూటౌన్): పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 9వ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు. 4వ తేదీ వరకు గడువు ఇచ్చిన అధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 9 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా జీవీ రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈఓగా విధులు నిర్వహించిన జి.నాసరరెడ్డిని అనంతపురం డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమించారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని సీఈఓగా నియమిస్తూ పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఈఓని డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులవాణి, కర్నూలు డీఎల్పీఓ టి.లక్ష్మి, జెడ్పీ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రథమ స్థానం కర్నూలు(అర్బన్): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవా లు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాలు లక్ష్యం కాగా 7,982 ప్రసవాలను నిర్వహించారన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5,881 కాగా, సిజేరియన్ 2,101 కాన్పులు ఉన్నాయన్నారు. 30 శాతానికి మించి సిజేరియన్ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్ కాన్పులు చేసి, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేశారన్నారు. ఎంసీహెచ్ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్ సీహెచ్సీల్లో ఈ ప్రసవాలు జరిగాయన్నారు. -
దేవుడి భూమిని తవ్వేస్తున్నారు!
● ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మకం ● టీడీపీ నాయకుల బరి తెగింపు నంద్యాల: టీడీపీ నాయకుల బరితెగింపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధనార్జనేధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. డబ్బుల కోసం దేవుడి భూములను కూడా వదలడం లేదు. గోస్పాడు మండలం జూనేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన భూమిలో యథేచ్ఛగా మట్టి తవ్వి అమ్మేస్తున్నారు. ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు పెట్టి భూమిని తవ్వి ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు. ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తూ.. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు 23 ఎకరాలు ఇచ్చారు. అనాదిగా ఈ భూములకు వేలం పాటలు వేస్తూ వచ్చిన డబ్బులతో ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 23 ఎకరాల్లోని 7.50 ఎకరాల్లో ఉన్న మట్టిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఈ భూమిలోనే మట్టిని అమ్మేస్తే రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చని ఆలోచించారు. దేవుడి మాన్యం అని కూడా చూడకుండా వెంటనే పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లు ఎక్కి ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు. గ్రామస్తులు అడిగితే గ్రామ, దేవాలయ అభివృద్ధి కోసం మట్టిని అమ్ముతున్నామని చెబుతున్నారు. దేవస్థానం అధికారులు మట్టిని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పి మరీ మట్టిని తవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాతలు శివాలయం అభివృద్ధి చెందాలని ఆలయ నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భూమి ఇస్తే ఆ భూమిని తవ్వి డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన టీడీపీ నాయకులకు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలేపల్లె గ్రామంలో మట్టిని తవ్వుతున్నారన్న విషయం మాకు తెలియదు. ఓ ట్రాక్టర్ మట్టి అమ్మినా చర్యలు తీసుకుంటామని అక్కడ అర్చకుడికి తెలియజేశాం. దేవస్థానం భూమిని తవ్వి మట్టిని అమ్ముకోవడానికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దేవస్థానం అధికారుల పేరు చెప్పి మట్టిని అమ్ముకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – మోహన్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, నంద్యాల -
దొంగ మస్టర్లతో నిధుల మేత!
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26లో దొంగ మస్టర్లలో లక్ష్యాన్ని సాధించామనిపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలే నియమితులయ్యారు. టీడీపీ నేతలకు భారీగా ముడుపులు ఇచ్చుకొని ఏపీఓలు, ఈసీలు ఆదాయం బాగా ఉన్న మండలాలకు పోస్టింగ్లు తెచ్చుకున్నారు. వెరసి 2025–26లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పనులకు 10 మంది వస్తే వంద మంది హాజరైనట్లు మస్టర్లు వేసి నిధులు కొల్లగొట్టారు. 2025–26లో కర్నూలు జిల్లాలో 58 లక్షలు, నంద్యాల జిల్లాలో 58 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 64,87,635, నంద్యాల జిల్లాలో 61,37,869 పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దొంగ మస్టర్లు వేసి ఫీల్డ్ అసిస్టెంటు మొదలుకొని ఏపీఓల వరకు నిధులు కొల్లగొట్టారు. ఉమ్మడి జిల్లాలో 1,26,25,504 పనిదినాలు కల్పించినట్లు లెక్కలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు. నిజంగా ఈ పనిదినాలు కల్పించి ఉంటే వంద రోజుల పని దినాలను వినియోగించుకున్న కుటుంబాలు భారీగా ఉండాలి. కర్నూలు జిల్లాలో 3702 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 4550 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించినట్లు స్పష్టమవుతోంది. అలాగే పల్లె పండుగ కింద చేపట్టిన షెడ్లకు స్పందన కరువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1400 చొప్పున పశువుల షెడ్లు నిర్మించాలనేది లక్ష్యం. అయితే కర్నూలు జిల్లాలో 561, నంద్యాల జిల్లాలో 257 పశువుల షెడ్లు మాత్రమే నిర్మించారు. కర్నూలు జిల్లాలో ఫాంఫాండ్స్ 4 వేలు నిర్మించాలనేది లక్ష్యం కాగా 488, నంద్యాల జిల్లాలో 2 వేలు లక్ష్యం కాగా కేవలం ఐదు మాత్రమే నిర్మించడం గమనార్హం. తుగ్గలి మండలంలో ఉపాధి పనులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మండలంలో సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఏపీఓ టీడీపీ నేతలకు పెద్దఎత్తున ముడుపులు ఇచ్చుకొని పోస్టింగ్ పొందారనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు దొంగ మస్టర్లు ఎన్నైనా వేసుకోండి మాకు మాత్రం వారం.. వారం ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని రేటు పెట్టినట్లు తెలుస్తోంది. తుగ్గలి, కౌతాళం, ఆదోని, కొసిగి, సి.బెళగల్, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల తదితర మండలాల్లో దొంగ మస్టర్లదే పైచేయి కావడం గమనార్హం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసి కొత్తగా వీబీ జీ రామ్జీ అమల్లోకి వస్తుండటంతో నిధుల స్వాహాపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. ఉపాధిలో 2025–26లో సాధించిన ప్రగతి ఇదే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించినట్లు లెక్కలు -
ప్రయాణం.. ‘పది’ంతల నరకం
పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. ఆనందంగా ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోగా అక్కడి పరిస్థితిని చూసి నివ్వెరపోయారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు, మరోవైపు పల్లెల్లో బంధువుల వివాహాలకు వెళ్లే ప్రయాణికులు, ఇంకోవైపు ఊర్లలో జాతర్లకు వెళ్లే బంధువులతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోతుండటంతో రెండు మూడు గంటలపాటు వేచి చూసిన ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఇలాగైతే ఇళ్లకు చేరుకోలేమనుకొని వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతూ కిటికీల్లోంచి దూరడం, వస్తువులను సీట్లలో పెట్టడం చేస్తూ పలు అగచాట్లు పడ్డారు. ఎలాగోలా సీట్లు పట్టుకున్న వారు కూర్చొని ప్రయాణించగా మిగతావారు కిక్కిరిసిన బస్సులో ఉక్కపోతతో అల్లాడుతూ అలాగే ప్రయాణించారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కర్నూలు బస్టాండు నుంచి పదో తరగతి పరీక్షలు ముగిసిన వేళ అదనపు బస్సులు కల్పించలేరా? అంటూ ప్రయాణికులు నిట్టూర్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుపాపను కీటికీ నుంచి సీట్లోకి తోసేద్దాం.. -
ఏకపక్షంగా మున్సిపల్ వేలం పాటలు
● ఇతరులు పాల్గొనకుండా టీడీపీ నేతల బెదిరింపులు ● మున్సిపల్ ఆదాయానికి గండిడోన్: అధికార టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల లోపాయకారి ఒప్పందం వల్ల గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటలు కాస్తా నాలుగు గోడల మధ్య జరగడంతో ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొని అతి తక్కువ ధరకే హక్కులను దక్కించుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ ఎడాది వారపు సంత రూ.3,38,000, దినసరి మార్కెట్ రూ.8,25,000, మాంసం దుకాణాలు రూ.2,28,000, బస్టాండ్ రూ.7,65,000లకు అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. అంతకు ముందు వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన కొండపేటకు చెందిన వ్యక్తులను అధికార పార్టీ నేతలను బెదిరించడంతో వారు వేలం పాటలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. కేవలం నలుగురు టీడీపీ నేతలు వేలంలో పాల్గొని గతేడాది కంటే రూ.2,56,000 హెచ్చు పాడి హక్కులు దక్కించుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా రూ.19 లక్షలు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.21,56,000 పలికినట్లు అధికారులు వెల్లడించారు. సరైన ప్రచారం చేసి ఉంటే వేలం పాటలో పాల్గొనేందుకు అధిక మంది వచ్చి ఉండేవారని ఇలా గుట్టుచప్పుడు గాకుండా వేలం నిర్వహించడంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుండంపాడుకు చెందిన గాలి ప్రవీణ్కుమార్ (25) మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాలు.. ప్రవీణ్కుమార్ నంద్యాలలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి యర్రగుంట్లకు చెందిన అనుష్కతో గతేడాది వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఈ నెల 1వ తేదీన రాత్రి ప్రవీణ్కుమార్ నంద్యాల నుంచి బైక్పై బయలుదేరాడు. నంద్యాల డిపోకు చెందిన బస్సు మరమ్మతులు చేయించుకొని సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో బైక్పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జోజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 9న రైతు సంబరాలు శిరివెళ్ల: కాలేషా మస్తాన్ వలి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన యర్రగుంట్లలో రాష్ట్రస్థాయి రైతు సంబరాలు (ఎద్దుల పందేలు) నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకుడు శంకర్ గురువారం తెలిపారు. ఒంగోలు జాతి సీనియర్ విభాగంలో రాతి దూళం లాగే పందెంలో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు మొదటి బహుమతి రూ.70 వేలు తరువాతి స్థానాలకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే 8వ తేదీన గాడిదల పందేలు జరుగుతాయన్నారు. గెలుపొందిన గాడిదల యజమానులకు మొదటి బహుమతి రూ.10 వేలు, తరువాతి స్థానాలకు రూ.6 వేలు, రూ.3 వేలు అందించనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి: స్థానిక రాణితోటకు చెందిన ఎరుకల జయంత్ (9) కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతూ కొలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేశ్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు,కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు జయంత్ స్థానిక శర్మాస్ యూపీ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 31న జ్వరం, వాంతులతో స్థానిక సీహెచ్సీలో చేరాడు. ఈ నెల 1న కడుపునొప్పి, ముఖం వాపు తీవ్రం కావడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బస్సు దిగుతూ మృత్యువాత దొర్నిపాడు: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగుతూ దొర్నిపాడుకు చెందిన సాలయ్య (60) గురువారం మృతి చెందాడు. ఆయన ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఆళ్లగడ్డ చేరుకున్నారు.బస్టాండులో బస్సు దిగుతూ కిందపడిపోయారు. అక్కడున్న వారు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తండ్రీకుమారుడి అరెస్ట్ ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని కోటేకల్ పంచాయతీ పరిధిలోని నాగలాపురంలో భారతి (29) ఆత్మహత్య కేసులో భర్త నాగరాజు, మామ చిన్నబసప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. భారతిని భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండటంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. -
జీసస్ అక్షరాలతో యేసు చిత్రం
నంద్యాల(వ్యవసాయం): పట్టణానికి చెందిన బ్యాంకు ఉద్యోగి మాణిక్యరావు గుడ్ఫ్రైడే పురస్కరించుకొని జీసెస్ అక్షరాలతో మైక్రో ఆర్ట్ చిత్రాన్ని గురువారం చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. జీసెస్ పేరులోని అక్షరాలతో చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. వైద్యుడికి చార్జ్ మెమో చాగలమర్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఇమ్రాన్కు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చార్జి మెమో జారీ అయినట్లు వైద్యాధికారిణి అంజలి తెలిపారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆరోగ్యశ్రీ, జేఎస్ఎస్కే తదితర పథకాల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తోటి వైద్యులు, సిబ్బందితో పాలనాపరమైన సమన్వయం పాటించడంలో విఫలమయ్యారని అభియోగాలు నమోదయ్యాయి. దీనివల్ల పీహెచ్సీ పనితీరుకు ఆటంకం కలిగిందని మెమోలో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించినట్లు డాక్టర్ అంజలి వివరించారు. -
‘పది’ పరీక్ష కేంద్రం తనిఖీ
శిరివెళ్ల: స్థానిక మోడల్ స్కూల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని గదులను పరిశీలించి విద్యార్థులకు తాగునీరు, బెంచీల సదుపాయాలపై ఎంఈఓ నాగార్జునరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్విజిలేటర్లు, పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థినులపై తేనెటీగల దాడి డోన్ టౌన్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తేనెటీగలు దాడిలో ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. బుధవారం తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థినులు చెట్ల కింద వేచి ఉన్నారు. ఆ సమయంలో సమీపంలోని తేనెటీగలు దాడి చేయడంతో 7, 8, 9 తరగతి చదివే ఐదుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మల్లన్న భక్తులపై భారం ● కొబ్బరికాయపై రూ. 10 పెంపు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తులపై భారం మోపుతుంది. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో కొబ్బరికాయ ధర రూ.25గా ఉండగా దానిపై రూ.10 అదనంగా పెంచుతూ కొబ్బరికాయ ధరను రూ.35గా నిర్ణయించారు. శ్రీశైల దేవస్థానంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. దర్శనానికి తరలివచ్చిన భక్తుల్లో చాలా మంది స్వామిఅమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టి తమ కోర్కెలను కోరుకుంటారు. అలాగే మొక్కులు నెరవేరిన భక్తులు కొబ్బరికాయలు కొడతారు. ప్రసుత్తం ఒక కొబ్బరికాయ ధర రూ.25గా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. బుధవారం నుంచి దేవస్థానం విక్రయిస్తున్న కొబ్బరి కాయ ధర రూ.35గా పెంచి విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా రూ.10 పెంచడంపై భక్తులు మండిపడుతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి బండిఆత్మకూరు: పీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నారాయణాపురం గిరిజన ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్సీ, ఆభా లింకేజ్, హెచ్పీవీ టీకాలు, ప్రసవానంతరం తల్లులకు అందిస్తున్న వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐపీడీ సేవల కింద గర్భిణులకు అందిస్తున్న ఐరన్, సుక్రోజ్ ఇంజెక్షన్లపై ఆరా తీశారు. అనంతరం నారపురెడ్డి కుంట గిరిజన గూడెంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీ ఇంటికి – మీ డాక్టర్’ కార్యక్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎన్సీఏడీసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కాంతారావు, సిబ్బంది ఉన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలి నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ ప్రసాద్, సుధాకర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుకు పోయిన రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఐజయ్య, సుజాత, జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్బరాయుడు, సత్యప్రకాష్, కిశోర్, రామకృష్ణకుడు, ముర్తుజావలి, నాగచెన్నమ్మ, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ, ఉద్యోగులను విస్మరించడం తగదు
నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను విస్మరించడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాధవస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 11వ వేతన సవరణ కమిషన్ కాలపరిమితి పూర్తయి 32 నెలలు గడుస్తున్నా.. 12వ వేతన సవరణ కమిషన్ చైర్మన్ను నియమించకపోవడం మోసం చేయడమేనన్నారు. పెండింగ్లోఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలను, 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా గౌరవవాధ్యక్షులు కమలాకర్రావు, జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మరియానందం, నంద్యాల జిల్లా ఉపాధ్యాక్షులు శ్రీదేవి, సుంకన్న, కార్యదర్శి శ్రీరాములు, నాయకులు స్వామినాథం, రాఘవరెడ్డి, వెంకటరాముడు, మహబూబ్బాషా, అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లతో పతనం తప్పదు
● బీజేపీ, టీడీపీలను హెచ్చరించిన కార్మిక సంఘాలు ● ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహణ కర్నూలు(సెంట్రల్): ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లను అమలు చేస్తున్న బీజేపీ, టీడీపీలకు పతనం తప్పదని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించాయి. బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలు పట్టుకొని లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా బ్లాక్ డే పాటించారు. ఏఐటీయూసీ నగర కార్యదర్శి బి.వెంకటేష్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మునెప్ప, జిల్లా కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, మాట్లాడుతూ.. బ్రిటీషు కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అన్యాయమన్నారు. ఫీక్స్ టర్మ్ ఎంప్లాయిమెంట్తో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికుల శ్రమను కార్పొరేట్కు దోచి పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ భవిష్యత్లో సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం.నాగన్న, తిరుపాలు, జి.చంద్రశేఖర్, ఎస్.రంజాబీ, ఈ.ఈశ్వర్, నగేష్, నాయకులు అబ్దుల్ దేశాయ్, గోపాల్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఈనామ్ కొత్త వెర్షన్తో అవస్థలు
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనామ్ 2.0 కొత్త వెర్షన్ రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులుగా కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త వెర్షన్లో రైతు ఊరు, పేరు, సెల్ నంబర్తో పాటు ఓటీపీ కూడా చెప్పాలనడంతో ఒక్కసారిగా రైతులు, ఏజెంట్లు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఓటీపీ చెప్పవసరం లేదనడంతో వారు వెనుదిరిగారు. కొత్త వెర్షన్లో మంగళవారం సాయంత్రం 5 – 6 గంటల సమయంలో టెండర్ ధర ప్రకటన రావడంతో రైతులు, ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం సాయంత్రం అయినా టెండర్ ధర ప్రకటన రాకపోవడంతో రైతులు యార్డు కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. టెక్నికల్ సిబ్బంది వచ్చారని, సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. అయితే రైతులు సాయంత్రం టెండర్ ధర ప్రకటన వస్తే దిగుబడులను కాటా ఎప్పుడు వేసుకోవాలి, తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతి అయినా పెట్టండి లేదా మాన్యువల్గా నిర్వహించాలని కోరారు. పాత పద్ధతి ఈనామ్ డెలీట్ చేసి కొత్త వెర్షన్ తెచ్చినట్లు చెప్పడంతో రైతులు, ఏజెంట్లు మండిపడ్డారు. ఇలాంటి కొత్త వెర్షన్లను అన్ సీజన్లో ప్రయోగం చేయాలే గానీ, సీజన్లో తెచ్చి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఉదయం 8 గంటలకు పల్లెల నుంచి దిగుబడులు వేసుకొస్తే రాత్రి బస్సులు లేక ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్ను వివరణ కోరగా.. కొత్త వెర్షన్ రావడంతో త్వరగా నమోదుకావడం లేదని, ఈనామ్ వారు వచ్చారని, త్వరలో సమస్యను పరిష్కరిస్తారన్నారు. -
వార్డుల సంఖ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం మరోసారి పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు డాక్టర్ పి.సంపత్కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కి పెంచేందుకు చర్యలు చేపట్టింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పదేళ్లుగా ఎన్నికలు లేని కర్నూలు కార్పోరేషన్కు ఎన్నికల ప్రక్రియ చేపట్టింది. అప్పట్లో 49 వార్డులకు గాను కర్నూలు నగర శివారులోని పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు వంటి మూడు గ్రామాలను కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 52కు చేరుకుంది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను పరిగణలోకి తీసుకొని ఈ సంఖ్యను పెంచారు. తాజగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఇక వార్డుల పనర్విభజనపై దృష్టి సారించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన కర్నూలు కార్పొరేషన్లో 2011 లెక్కల ప్రకారం 4,50,184 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రకారం వార్డుల సంఖ్యను 68కు పెంచాలని నిర్ణయించడంతో జనాభా సంఖ్య కుదించాల్సి ఉంది. గతంలో వార్డుకు 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు. తాజాగా 16 వార్డులను పెంచేందుకు ఒక్కో వార్డుకు 6,500 నుంచి 7,300 మంది జనాభా ప్రకారం లెక్కలు తేల్చాల్సి ఉంది. పాతబస్తీ, కోడుమూరు అర్బన్లో.. పాతబస్తీ జనాభా 2 లక్షల వరకు ఉంది. ఇక్కడ ప్రధానంగా కర్నూలు నియోజకవర్గం పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే ఇక్కడ ఉన్న 33 వార్డులు తాజాగా 38కి పెరిగే అవకాశం ఉంది. ఇక కోడుమూరు పరిధిలో మూడు వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే 30 వేల జనాభా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ సంఖ్య 4 లేదా 5కు చేరుకుంటుంది. ఇలా పునర్విభజనలో వార్డుల తారుమారు తప్పదు. రేపటి నుంచి ఫీల్డ్లోకి మున్సిపల్ సిబ్బంది కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కు పెంచాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల వ్యవధిలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అదికారులు, సచివాలయాల ఉద్యోగులతో కలిసి వార్డుల పర్యటన చేపట్టాల్సి ఉంది. మునిసిపాలిటీ ప్రస్తుతం ఉన్న పెరగనున్న కర్నూలు 52 68 ఆదోని 42 52 ఎమ్మిగనూరు 3544 గూడూరు 2023 నంద్యాల 42 52 డోన్ 3236 నందికొట్కూరు 29 32 ఆత్మకూరు 28 32 ఆళ్లగడ్డ 27 32 బేతంచెర్ల 2028 కర్నూలు కార్పొరేషన్ వార్డులు 52 నుంచి 68కి పెంపు 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా కుదింపు అత్యధికంగా పాతబస్తీ, కోడుమూరులో పెరగనున్న వార్డులు రేపటి నుంచి వార్డుల్లో సర్వే షురూ -
శ్రీమఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు
మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీమఠం ప్రాంగణంలో ఉదయం సంస్కృత విద్యార్థులతో వేద మంత్రోచ్ఛరణల మధ్య పీఠాధిపతి తైల అభ్యంగణ, కుటుంబ సభ్యులచే హారతి గావించారు. పీఠాధిపతికి శ్రీమఠం సిబ్బంది భక్తిశ్రద్ధలతో గురు వందనం సమర్పించి, పుష్ప వృష్టి, గజమాలతో సన్మానించారు. యాగశాలలో పవిత్ర యజ్ఞహోమాలు చేశారు. శ్రీ మూల రాములకు ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి మహామంగళ హారతి గావించారు. సుజయింద్ర ఆరోగ్య శాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారు. అనంతరం భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేశారు. -
పంచాయతీ నిధులపై పచ్చ పెత్తనం
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఆర్థిక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నాయ కులు ఏకంగా సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్నారు. గొర్విమానుపల్లె సర్పంచ్ బోయ రామాంజనేయులు రెండు రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన వాస్తవాలు విస్తుగొల్పాయి. సర్పంచ్ ప్రమేయం లేకుండా పంచాయతీ నిధులను పంచాయతీ కార్యదర్శి సాయంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరెడ్డి తన వ్యక్తిగత అకౌంట్లోకి మళ్లించుకున్నట్లు మండల మీట్లో అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యుల సమక్షంలోనే జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి చేసిన పనులకు సైతం బిల్లులు చేయకుండా నిలుపుదల చేయించారని సర్పంచ్ ఆరోపించారు. అంతా ఆయన కనుసన్నుల్లోనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో గొర్విమానుపల్లెలో టీడీపీ మండల అధ్యక్షుడు చేతుల్లోకి పంచాయతీ పాలన వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ను రెండేళ్ల నుంచి పూర్తిగా పక్కకు నెట్టి అన్నీ తానై వ్యహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి అధికారులు కూడా జీహుజూర్ అన్నారు. రూ.3 లక్షలకు పైగానే పంచా యతీ నిధులు ఆయన ఖాతాలోకి జమ అయినట్లు తెలుస్తోంది. మండల మీట్లో సర్పంచ్ ఆరోపించిన విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూలె రామేశ్వరరెడ్డి పేరు మీదనే పంచాయతీ నిధులు జమ అయినట్లు సాక్ష్యాధారాలు సైతం వెలుగు చూశాయి. వాస్తవాలు బట్టబయలు కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్కు తెలియకుండానే కార్యదర్శిని అడ్డుపెట్టుకొని నిధులు కొల్లగొట్టడంపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన పంచాయతీ కార్యదర్శితో పాటు నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్న టీడీపీ మండల అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని మరో వైపు సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నా రు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సర్పంచ్కు తెలియకుండానే నిధుల మళ్లింపు కార్యదర్శి సాయంతో టీడీపీ నేత అకౌంట్లో జమ -
శ్రీశైలం డ్యాం పరిశీలన
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాంను బుధవారం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. డ్యాం వ్యూ పాయింట్ సమావేశ మందిరంలో శ్రీశైలం డ్యాం ఇంజినీర్లతో సేఫ్టీ బృందం సమావేశమైంది. శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజినీర్ కబీర్బాషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీశైలం డ్యాం స్థితి గతులను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో డ్యాం పటిష్టతపై పరిశీలన చేట్టారు. రెండు రోజులపాటు జరిగే పరిశీలనలో డ్యాం పునాదులు, బ్లాక్లు, రేడియల్, స్లూయిస్ గేట్లు, పునాది భాగం ముందున్న సిలిండర్లు, ఫ్ల్లంజ్పూల్ ప్రాంతాల పటిష్టతపై పరిశీలన చేస్తారు. డ్యాంకు ఇరువైపులా ఉన్న కొండగట్ల పటిష్టతకు షార్ట్ క్రీటింగ్ ప్రక్రియలపై తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, ఆర్ధిక రుణం అందజేసే ప్రపంచబ్యాంక్కు అందజేస్తారు. డ్యాంను పరిశీలించిన సేఫ్టీ బృందంలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలవనరుల శాఖ, ఎన్డీఎస్ఏలకు చెందిన నిపుణులు, చైర్మన్ డీకే శర్మ, హైడ్రో మెకానికల్ నిపుణులు గుల్షన్రాజ్, డ్యాం ఎక్స్పర్ట్ టీకే శివరాజన్, భూగర్భ నిపుణులు జేఎం గౌతంతో పాటు డ్యాం ఎస్ఈ బాలచంద్రారెడ్డి, ఇంజినీర్లు ఉన్నారు. -
కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించే భ్రమరాంబాదేవి కుంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వార్షిక కుంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అమ్మవారికి కుంభోత్సవ కై ంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలన్నారు. అమ్మ వారి దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశామన్నారు. అలాగే 8వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు మొదలవుతాయని తెలిపారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించబడిందన్నారు. ఈ విషయమై భక్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు శాఖల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. కుంభోత్సవం నేపథ్యంలో ఈనెల 6, 7 తేదీల్లో సున్నిపెంటలో మద్యం దుకాణాలను మూసి వేసేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాసినట్లు ఈఓ తెలిపారు. -
ట్రిపుల్ఐటీ డీఎంలో స్పోర్ట్స్ మీట్
కర్నూలు సిటీ: జగన్నాథగట్టుపై ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీ డీఎం) లో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇండోర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 ట్రిపుల్ ఐటీల నుంచి మొత్తం 357 మంది క్రీడాకారులు ఇండోర్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడల్లో పోటీలు జరుగనున్నాయి. గుండెపోటుతో బాలుడి మృతి కోసిగి: బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే రైలులో ప్రయాణిస్తూ కోసిగి రైల్వే స్టేషన్ చేరుకునే సమయంలో ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా తుముకూరు గ్రామానికి చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆ కుటుంబం బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లి పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాలుడు ఛాతిలో నొప్పి అంటూ అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు కోసిగి రైల్వేస్టేషన్లో దిగి హుటాహుటిన పీహెచ్సీకి తరలించగా వైద్య పరీక్షలు చేసేలోపు బాలుడు మృతి చెందాడు. చిన్న వయస్సులోనే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. దాడిలో గాయపడిన వ్యక్తి మృతి ఓర్వకల్లు: దాడి ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన వ్యక్తి కోలుకోలేక ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కన్నమడకల గ్రామంలో ఈ నెల 29వ తేదీన బోయ మహేష్ అదే గ్రామానికి చెందిన కప్ప రమేష్ను కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. గాయపడిన రమేష్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ఘర్షణకు గల కారణాలను తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి పెద్ద కుమారుడు కప్ప హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు బోయ మహేష్, బాలకృష్ణపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య మహేశ్వరి, ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు కర్నూలు: వేసవిలో రోడ్లపై ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది రక్షణ కోసం చలువ అద్దాలు, వాటర్ బాటిళ్లు, కూల్ వాటర్ క్యాన్లు, టోపీలు, గ్లూకోజ్–డి ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించేలా పోలీసు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో సేకరించిన రక్షణ కిట్లను బుధవారం కొండారెడ్డిబురుజు వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు మహబూబ్నగర్ కెనరా బ్యాంకు సహకారంతో ఇండికేటింగ్ కోన్స్, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు (రేడియం), కంబళ్లు, సుత్తెలు వంటి పరికరాలను అందజేశారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్ రావు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. -
వంకాయ రైతు విలవిల
● 30 కిలోల బస్తా రూ.50 కూడా పలకని వైనం ● రోడ్డుపక్కన పారబోస్తున్న రైతులు దేవనకొండ: ఘుమఘుమలాడే గుత్తి వంకాయను చూస్తే ఎవరికై నా నోరూరుతుంది. అయితే అదే వంకాయ ఇప్పుడు రైతులకు గుదిబండగా మారింది. సరైన గిట్టుబాటు లేక, మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు రాకపోవడంతో వంకాయ సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను అలాగే వదిలేస్తే పాడవుతుందని మున్ముందు అయినా రేటు పెరగకపోతుందా? అనే ఆశతో కూలీలచే వంకాయలు తెంపి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. వంకాయకు ధర లేకపోవడంతో సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో 30 కిలోల బస్తా రూ.40 నుంచి రూ.50 కూడా పలకడం లేదు. అయితే వ్యాపారులు మాత్రం ప్రజలకు కిలో రూ.30 నుంచి రూ.40కు అమ్ముకుంటున్నారు. రైతుల వద్ద 30 కిలోల బస్తాను రూ.50కి కూడా వ్యాపారులు కొనడం లేదు. దీంతో చాలామంది రైతులు వంకాయలను గొర్రెలకు వదిలేస్తున్నారు. కొద్ది మంది రైతులు మున్ముందు రేటు పెరుగుతుందన్న ఆశతో తోటను కాపాడుకునేందుకు వంకాయలు తెంపి రోడ్డున పారపోస్తున్నారు. -
డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్హక్ ఉర్దూ విశ్వ విద్యాలయం డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మహబూబ్ బాషా బుధవారం విడుదల చేశారు. డిగ్రీ 3, 5 సెమిస్టర్లు, పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశామన్నారు. విద్యార్థులు ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.ah uuk.ac.in నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇర్ఫాన్, సైన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ నబియా సుల్తానా, ఆర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో పలువురు అవుట్ సోర్సింగ్ ద్వారా షిఫ్ట్ ఆపరేటర్లుగా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు వెల్లడైంది. నకిలీ ధ్రువపత్రాలతో అనేక మంది ఉద్యోగాలు పొందినట్లు సీఎండీకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి నిర్వహించిన విచారణలో 16 మంది షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందినట్లు స్పష్టమైంది. నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు రాయలసీమ జిల్లాల్లో 69 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 16 మంది ఉన్నారు. ఐటీఐ చేయకుండానే ఎలక్ట్రీషియన్లో ఐటీఐ పూర్తి చేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపధ్యంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా సంబంధిత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయాలని కర్నూలు, నంద్యాల సర్కిళ్ల ఎస్ఈలను సీఎండీ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కారు ఢీకొని ఉద్యోగి దుర్మరణం ఓర్వకల్లు: కర్నూలు, కడప జాతీయ రహదారిపై రాక్గార్డెన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని కన్నమడకల గ్రామ సచివాలయంలో రంగస్వామి (33) ఇంజినీరింగ్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. కర్నూలు నుంచి బైక్పై కన్నమడకల చేరుకుని విధులకు హాజరయ్యేవాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని కర్నూలుకు బైక్పై బయలుదేరాడు. స్థానిక ఎయిర్పోర్టు వద్ద ముందు వెళుతున్న బైక్ను వెనుక నుంచి నంద్యాల నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంగస్వామి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక రంగస్వామి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
హరోం.. హర
ఎమ్మిగనూరురూరల్: పట్ణణంలోని కోసిగి రోడ్డులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. భక్తులు ఉదయాన్నే పాత ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పురుషులు, మహిళలు, బాలికలు పెద్ద ఇనుప కడ్డీలను దవడకు గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. వీపున ఇనుప కొక్కీలను తగిలించుకుని తాడుకట్టి స్వామివారి రథాన్ని లాగారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు తీరుతాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. రథోత్సవం ఆంజనేయస్వామి ఆలయం నుంచి షరాఫ్ బజార్, సోమేశ్వర, శ్రీనివాస సర్కిల్ మీదుగా కోసిగి రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. రథం ముందు భక్తులు నృత్యాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా నీలకంఠప్ప, నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త యూజీ కేశవర్ధన్ చెప్పారు.దవడకు కడ్డీలు గుచ్చుకొని భక్తిభావంకలశాలతో వెళ్తున్న భక్తులు -
దస్తావేజు లేఖర్లపై చర్యలు తీసుకోండి
● ఎస్ఆర్ఓను ఆదేశించిన కలెక్టర్ రాజకుమారి పాణ్యం: నిబంధనలు అతిక్రమించే దస్తావేజు లేఖర్ల (డాక్యుమెంట్ రైటర్లు)పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమా రి పాణ్యం ఎస్ఆర్ఓ నరేంద్రనాథ్రాజును ఆదేశించారు. బుధవారం ఆమె పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రోజూ కార్యాలయంలో నమోదవుతున్న డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తనిఖీ సమయంలో కార్యాలయానికి ఎదురుగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలను వదిలి పారిపోయారు. గమనించిన కలెక్టర్ ఆ దుకాణాలను తనిఖీ చేశారు. తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వహణ చేపడితే వెంటనే దుకాణాలను సీజ్ చేయాలని ఎస్ఆర్ఓను ఆదేశించారు. ప్రతి శాఖలోనూ పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక భవిత కేంద్రాన్ని, 5, 6 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత స్థానిక ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసి మెనూ అమలు, పరిసరాల శుభ్రతపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శివశంకర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దొంగలు దొరికారు!
● నాలుగు రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు ● 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు రికవరీ కర్నూలు: కర్నూలు వెంకటరమణ కాలనీ శివారులోని అమీన్ అబ్బాస్ నగర్లో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు దొరికారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. నిందితులిద్దరూ మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఇంటి తాళం పగులగొట్టి చోరీ అమీన్ అబ్బాస్ నగర్లో నివాసముంటున్న వెంకట సుబ్బయ్య పేపర్ మిల్లులో పనిచేసి రిటైరయ్యారు. గత నెల 27న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కడపకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు 29వ తేదీ రాత్రి వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. నిందితులు బాలాజీ నగర్లో నివాసముండే ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. బుధవారం ఉదయం మునగాలపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ, మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డితో కలిసి వెల్లడించారు. నిందితులు గతంలో గణేష్నగర్ శివారులోని సాయివైభవ్ నగర్లో ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు రాగానే మళ్లీ నేరాల బాట పట్టారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన క్రైం పార్టీ సిబ్బంది మురళీధర్, సుబ్బరాయుడు, సుంకన్న, చెంచన్న, శేఖర్, వాసులను డీఎస్పీ అభినందించారు.జల్సాల కోసం జతకట్టి.. నిందితులు ఒకరు ఇంటర్, మరొకరు పదో తరగతి వరకు చదువుకున్నారు. జులాయిగా తిరుగుతూ గంజాయి, బెట్టింగ్లకు అలవాటుపడ్డారు. జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులను ఎంచుకున్నారు. ప్రస్తుతం బంగారు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బంగారు నగలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. -
కాటసాని చొరవతో రైతులకు న్యాయం
కల్లూరు: వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవతో నే తమకు న్యాయం జరిగిందని ఓర్వకల్లు మండల రైతులు అన్నారు. ఓర్వకల్లు మండల పరిధిలోని పాలకొలను, హుసేనాపురం గ్రామాలకు చెందిన డీఆర్డీఓ భూనిర్వాసితులైన 21 మంది రైతులు మంగళవారం కాటసాని రాంభూపాల్రెడ్డిని స్వగృహంలో కలిసి, శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవ తీసుకోవడంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున మొత్తం రూ. 1.30 కోట్లకు పైగా పరిహారం వచ్చిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాటసాని రాంభూపాల్రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోగులన్నీ ఒక్కటై..
ఎమ్మిగనూరుటౌన్: తమ జీవనాధారమైన వైడబ్ల్యూ సీఎస్ను కాపాడుకునేందుకు చేనేతలు ఒక్క తాటిపై నిలిచారు. కలసికట్టుగా కూటమి కుట్రను ఛేదించారు. చేనేతలు, స్థానిక వైడబ్ల్యూసీ సభ్యులు అధికార పార్టీకి షాకిచ్చారు. కోట్లాది రూపాయల ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా 16 వైడబ్ల్యూసీఎస్ ఔట్లెట్లు ఉన్న సొసైటీని నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంతో పాటు మరో మూడు అంశాలను మహాజన సభలో ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ నాయకులు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ఈ మేరకు మంగళవారం స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయ ఆవరణలో సొసైటీ మహాజన సభను ఆర్డీఓ అజయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్తో పాటు హెచ్.మురవణి వద్ద సంఘ సభ్యులకు ఇచ్చిన 18.98 ఎకరాల భూమి గురించి చర్చించడం, 2024–25 ఆర్థిక సంవత్సర అడిట్ రిపోర్ట్తో పాటు అజెండాలోని 3వ అంశం చేనేత జౌళీశాఖ కమిషనర్ సూచనల మేరకు వైడబ్ల్యూసీఎస్ ఎంపోరియంలను ఆప్కోలో విలీనం చేసేందుకు అధికారులు సభలో ప్రతిపాదించారు. సభ్యులు ఒక్కసారిగా లేచి మూకుమ్మడిగా వ్యతిరేకించారు. తమ సొసైటీని ఆప్కోలో విలీనం చేయనీయమని, ఈ అంశాన్ని ఒప్పుకునే ప్రశ్నేలేదని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్డీఓ, చేనేత జౌళిశాఖ ఏడీ, స్థానిక వైడబ్ల్యూసీఎస్ ఇన్చార్జ్ కార్యదర్శి అయిన నాగరాజారావుతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. లాభాల్లో ఉన్న తమ సొసైటీని నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోలో ఎలా విలీనం చేస్తారని ధ్వజమెత్తారు. ఈ విలీనం వెనుక కుట్ర దాగుందన్నారు. అయితే వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేయబోమని, ఆప్కో ఉత్పత్తులతో పాటు సొసైటీ ఉత్పత్తులను విక్రయించేందుకే ఆప్కోలో ఉంచుతామని ఏడీ వివరించే ప్రయత్నం చేసినా.. సభ్యులు ససేమిరా అన్నారు. తామంతా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమని సభ అజెండాలోని మూడవ అంశాన్ని తాము ఆమోదించమని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఏదో ఒక విధంగా సభ్యులను నచ్చజెప్పి విలీన అంశాన్ని ఆమోదింపజేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో మహాజన సభకు హాజరైన 225 మంది సభ్యుల్లో వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా 210 మంది సభ్యులు సమావేశపు అజెండా పుస్తకంలో సంతకాలు చేశారు. మిగిలిన వారు సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు సంతకాలు చేశారని ఏడీ ప్రకటించారు. వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనానికి సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ అజయ్కుమార్, ఏడీ నాగరాజారావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు చేపట్టారు. కార్యదర్శి బదిలీ వెనుక రాజకీయం.. వైడబ్ల్యూసీస్, చేనేతల అభ్యున్నతికి పనిచేస్తూ, నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న సంఘ కార్యదర్శి అప్పాజీని చేనేత జౌళీ శాఖ కమిషనర్ గత ఆదివారం రాత్రి విధులను తప్పించి రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేసినట్లు సమాచారం. ఆయన స్థానికంగా ఉంటే వైడబ్ల్యూసీస్ ఆప్కోలో విలీనంతో పాటు సంఘ ఆస్తులను కొల్లగొట్టేందుకు అవకాశం ఉండదనే నెపంతోనే కార్యదర్శి అప్పాజీని మహాజన సభకు రెండు రోజుల ముందు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆగమేఘాల మీద ఆదేశాలిచ్చినట్లు సభ్యులు విమర్శిస్తున్నా రు. కార్యదర్శి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏడీ సమాధానమిస్తూ.. ఆప్కోలో విలీన అంశంపై ఆయన తప్పిదం చేశారని, ఈ మేరకు కమిషనర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేకు చేనేతల ఝలక్.. చేనేతలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డికి వైడబ్ల్యూసీఎస్ సభ్యులు మహాజన సభలో ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులు వైడబ్ల్యూసీఎస్ ఆస్తులను కొల్లగొట్టేందుకే తమ సంస్థను ఆప్కోలో విలీనం చేసే కుట్ర పన్నారని చేనేతలు పసిగట్టారు. విలీనాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో చేనేతలు తమవైపే వున్నారని చెప్పుకునే టీడీపీ నాయకులకు ఒక గుణపాఠం చెప్పినట్లు అయ్యిందని సభ వద్ద చేనేతలు బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. -
వైడబ్ల్యూసీఎస్ పక్షాన పోరాటం
నేతన్నల అభ్యున్నతికి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప పట్టణంలో స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ సంస్థను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి వేర్వేరు గా చేనేతలు, పార్టీ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు లేకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కుట్రపన్నుతున్నారని బుట్టారేణుక విమర్శించారు. మార్కెటింగ్ పేరుతో ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చేనేతలపై ప్రేమ వుంటే సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. చేనేతలకు ఆధారమైన వైడబ్ల్యూసీఎస్ను ఆప్కోలో విలీనం చేస్తే వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందన్నారు. -
విపత్తుల నివారణకు పకడ్బందీ చర్యలు
నంద్యాల: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే కరువు పరిస్థితులు కూడా విపత్తులలో భాగమేనన్నారు. విపత్తు సంభవించిన తర్వా త చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు ప్రణాళిక, సన్నద్ధత అత్యంత కీలకమన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను ఎలా రక్షించుకోవాలో రైతులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని, భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని హార్టికల్చర్ మల్చింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పశువుల నీటి తొట్టెల వద్ద ఎలాంటి లీకేజీలు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంకతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, కూటమి నేతలు ఇప్పుడు అదే విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే విధానంలో ప్రజలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఏకంగా స్మార్ట్ మిటర్లు బిగించి ప్రీపెయిండ్ విధానాన్ని తీసుకొస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.520.37 కోట్ల బకాయిలు ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించని పరిస్థితి. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చారు. నేడు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డివిరిచే దిశగా స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం చెల్లించడానికి జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఆయా శాఖల హెచ్వోడీలు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెల వారీగా ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం విని యోగించాల్సి ఉంది. ఇందుకు అన్ని శాఖలకు ప్రభు త్వం నిధులు వెచ్చించాలి. అప్పుడే ప్రీ పెయిడ్ విద్యుత్ సాధ్యమవుతుంది. అయితే ఉమ్మడి జిల్లా లో 25,060 ప్రభుత్వ కనెక్షన్లు ఉన్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యు త్ కనెక్షన్ల బకాయి రూ.520.37 కోట్లు ఉన్నాయి. 2024 జూన్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 20,828 స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం సర్కారు కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తోంది. కర్నూలు జిల్లాలో 10,643, నంద్యాల జిల్లాలో 10,188 ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఉమ్మడి జిల్లాలో స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే రూ.348.78 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం చెల్లించకుండానే స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రీ పెయిడ్ విద్యుత్ -
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ కళాశా ల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియెట్ విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు డీఐఈఓ శంకర్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు హాల్టికెట్ ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. టీసీ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. 6వ తేదీన అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లకు గడువు ఉందన్నారు. మొదటి సంవత్సరం తరగతులు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో అన్నింటిలో 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు కళాశాలలు ఆఫ్డే నిర్వహిస్తారన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. అన్నదాన పథకానికి రూ.3లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలు అందించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టి.అచ్యుత రామారావు రూ.లక్ష, తెనాలికి చెందిన కేఎన్వీఎస్వీ ప్రసాద్ రూ.లక్ష, అలాగే తెనాలికి చెందిన వై.శంకరబాబు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ముగ్గురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం 94 శాతం హాజరు నమోదైంది. 5,311 మందిలో 4990 మంది హాజరు కాగా 318 మంది గైర్హాజరయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా వారిని డిబార్ చేశామన్నారు. 1,031 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4,47, 648 పింఛన్లకు రూ.196.3 కోట్లు విడుదలయ్యా యి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 1,031 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో ఏర్పాటైంది. దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ హామీని కూడా కొండెక్కించడం గమనార్హం. -
ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
ఆళ్లగడ్డ: లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కమ్మరి రఘునా థాచారి ఓ వ్యక్తిని రాయితో కొట్టారని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వర్రావు నిందితుడి రఘునాథాచారితో రిమాండ్కు పోకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ. 40 వేలు డిమాండ్ చేశారు. దీంతో గత వారం రోజుల క్రితం రఘునాథాచారి హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్రావుకు రూ. 20 వేలు ఇవ్వడం జరిగింది. అయినా మిగతా సొమ్ము ఇవ్వాలని బెదిరించడంతో రఘునాథాచారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ. 15 వేలు ఇస్తానని రఘునాథాచారి ఒప్పందం చేసుకోవడంతో హెడ్ కానిస్టేబుల్ అహోబిలం బైపాస్ రోడ్డుకు వస్తాను అక్కడ ఇమ్మని చెప్పాడు. అక్కడ రఘునాథాచారి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. దీని వెనుక ఎవరై నా ఉన్నారా.. అన్న కోణంలో విచారణ చేస్తామన్నారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు చేకూరింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు మంగళవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో 27 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ మేరకు రూ.21,57,817 నగదు, ఐదు గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వివరించారు. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ శ్రీనివాసరావు
శ్రీశైలం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా శ్రీశైలంలో తెలుగు వర్సిటీ పీఠాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయు డు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలుగు వర్సిటీ నుంచి ఎంఫిల్, పీహెచ్డీ చేసిన ఆయన తన పర్యవేక్షణలో ఎనిమిది మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు పొందగా, 17 మంది విద్యార్థులు తమ పరిశోధనలు పూర్తి చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు. -
వసతి గదిలో ఇద్దరు యువకులు, ఓ యువతి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థాన వసతి గదిలో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు, ఒక యువతి ఉండడం, వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతానికి చెందిన ఓ యువతితో దేవస్థానంలో హౌస్కీపింగ్ నిర్వహణ చేపడుతున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంచార్జ్ సీఎస్వో తన సిబ్బందితో దాడులు నిర్వహించగా రెడ్హ్యండెడ్గా ఇద్దరు యువకులు, ఒక యువతిని గుర్తించారు. వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో శ్రీశైలం పోలీసుస్టేషన్కు తరలించారు. అసలేం జరిగిందంటే.. శ్రీశైలం దేవస్థానంలోని సిద్దిరామప్ప వాణిజ్య సముదాయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గదులను నిర్మించారు. మార్చి 29న నరేంద్రారెడ్డి పేరుతో భార్య, భర్త విడిది చేశారు. వీరు మంగళవారం ఉదయం 10.30గంటలకు వసతి విభాగాన్ని ఖాళీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్తో రసీదుపై సంతకం చేయించుకున్నారు. అనంతరం దేవస్థానం సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసులో రసీదు చూపిస్తే వారికి రావాల్సిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చి, రూము ఖాళీ అయినట్లు నమోదు చేసుకుంటారు. అయితే వారికి ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు అక్కడ విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ ఇచ్చి పంపించేశాడు. అనంతరం ఓ యువతితో ఎ–3 వసతి గదిలో తన సన్నిహితుడైన శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నారు. పెళ్లి సంగతి తేల్చుకోవాలనట! శ్రీశైలం పోలీసు స్టేషన్లో యువతి, యువకులను విచారించారు. పద్మావతి ఏజెన్సీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సాయికృష్ణ, గదిలో ఉన్న యువతి బంధువులు అవుతారని.. వాళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే సాయికృష్ణ ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తుండడంతో విషయం తెలుసుకున్న యువతి సాయికృష్ణతో పెళ్ళి విషయం మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. అర్హత లేని వ్యక్తికి వసతి విభాగం బాధ్యతలు శ్రీశైలం దేవస్థానంలో ఆయా విభాగాలకు అధిపతులుగా (సహాయ కార్యనిర్వహణాధికారి) ఏఈవోలను నియమిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఎలాంటి అర్హత లేకపోయినా వసతి విభాగం ఏఈవోగా దేవస్థానం పీఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఆ విభాగంపై పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ వసతి విభాగంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది. వీరిలో పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, మరో వ్యక్తి -
సంస్కరణల పేరుతో సతాయింపు!
కర్నూలు సిటీ: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యాసంస్థలకు దోచి పెట్టేందుకు పూనుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ మొదలయ్యే అకడమిక్ ఇయర్ను మార్పు చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. విద్యా వ్యవస్థల్లో మార్పుల కంటే అయిన వారి విద్యాసంస్థల కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 2026–27 అకడమిక్ ఇయర్ను ప్రారంభించి సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్ను జారీ చేశారు. ఈ ప్రకారం 314 రోజులు, 82 సెలవు దినాలు, 232 పని దినాలు ఉన్నాయి. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ థీయరీ పరీక్షల మూల్యాంకనం జరుగనుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం సైతం అమలు చేయనున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్ ఇయర్ను ఎలా ప్రారంభిస్తున్నారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు కాలేజీకి హాజరవుతారో? లేదోనని అధ్యాపకులు వాపోతున్నారు. 6 నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఏప్రిల్ 6 నుంచి 23వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు షెడ్యుల్ జారీ చేశారు. ఈ నెల 2వ తేదీ పదో తరగతి పరీక్ష జరుగనుంది. మూల్యాంకనం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆ తరువాత సుమారుగా 20 రోజుల తరువాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడం బట్టి చూస్తే కార్పొరేట్, సెమీ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఏటా షెడ్యుల్ కంటే ముందుగా అడ్మిషన్లు చేసుకోవడంపై జరిగే ఆందోళనలు లేకుండా వారికి పరోక్షంగా సాయం చేసేందుకే ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చినట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పుస్తకాలు లేకుండా తరగతులు? ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు, ఆ తరువాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం ద్వారా భోజనం అందించేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన జూనియర్ కాలేజీలు 161 ఉన్నాయి. ఇంటర్మీడియెట్ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా బుధ వారం నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1న కాలేజీలు తెరవనున్నారు. ఏప్రిల్ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఒక్క నోటు బుక్కు కానీ, పాఠ్య పుస్తకం కానీ రాకపోవడం గమనార్హం. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
బేతంచెర్ల: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం మధ్యా హ్నం దొంగతనం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. పాతరెడ్డి హోటల్ ఎదురు వీధిలో నివసించే విష్ణుమోహన్ భార్య మద్దాల పరిమళ ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆమె మరిది సత్యబాబు అడ్రస్ కావాలంటూ మాటల్లో దించి ఒక్కసారిగా పరిమళ మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. అనంతరం ఆమెను గదిలో వేసి బయట గొళ్లెం పెట్టి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి గొళ్లెం తీయడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరేసుకొని మహిళ ఆత్మహత్య నందికొట్కూరు రూరల్: మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో వేదావతి అలియాస్ నీలమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఎస్ఐ మణికంఠ తెలిపిన వివరాలు.. నీలమ్మకు చిన్నతనంలో తల్లి చనిపోవడంతో కోడుమూరు నియోజకవర్గంలోని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన మేనమామ శ్రీనివాసులు పెంచి పెద్ద చేశారు. గత ఫిబ్రవరిలో 10 బొల్లవరం గ్రామానికి చెందిన వెంకటరాముడుకు ఇచ్చి వివాహం చేశారు. ఇదిలాఉండగా నీలమ్మ నానమ్మ లింగమ్మ సోమవారం చనిపోయింది. దీన్ని జీర్ణించుకోలేక ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మేనమామ భార్య సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండాయా? అంటూ బంధువులు రోధించిన తీరు అక్కడివారిని కంటితడి పెట్టించింది. డోన్ టౌన్: పట్టణంలోని శ్రీనివాస నగర్లో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల్లో ఒకరు స్థానికులకు పట్టుబడ్డారు. సోమ వారం రాత్రి దుండగులు చైన్స్నాచింగ్కు యత్నించగా మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. నిందితులు మోటార్ సైకిల్పై పారిపోవడానికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. పట్టుబడిన యువకుడు కర్నూలు పట్టణం బుధవారపేటకు చెందిన అబ్దుల్ కరీంగా పోలీసుల విచారణలో తెలిసింది. పరారైన ముగ్గురు నిందితులపై గతంలో బండిఆత్మకూర్, నంద్యాల, పాణ్యం, నందికోట్కూ రు, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పట్టుబడిన అబ్దుల్ కరీంపై తెలంగాణ రాష్ట్రం గద్వాల పోలీసు స్టేషన్లో కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు అప్పజెప్పి, పరారైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ఇంతియాజ్బాషా వెల్లడించారు. -
రూ.2833 కోట్లతో జిల్లా అవుట్రీచ్ బడ్జెట్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 52 శాఖలకు సంబంధించి రూ.2833 కోట్లతో అవుట్రీచ్ బడ్జెట్కు ఆమోదం తెలిపినట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్కుమార్, జేసీ నూరుల్ ఖమర్తోపాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ అవుట్ రీచ్లో రూరల్ డెవలప్మెంట్, వైద్యం, విద్య, పాఠశాల విద్య, పీఆర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్లకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ఇవే కాక సూపర్సిక్స్లో రూ.2394 కోట్లను జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. త్వరలోనే పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బడ్జెట్ అవుట్ రీచ్పై ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి హొళగుంద: హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని నెరణికి తండాకు చెందిన రామునాయక్పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలైనట్లు ఎస్ఐ దిలీప్కుమార్ మంగళవారం తెలిపారు. రామునాయక్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ప్రస్తుతం రామునాయక్ ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్రనాయక్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ వెల్లడించారు. వాహనం ఢీకొని జింక మృతి మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఎమ్మిగనూరు టూ మంత్రాలయం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. జింక కళేబరానికి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేస్తామని ఎఫ్బీఓ నాగేష్ తెలిపారు. మద్యం మత్తులో వీరంగం కేసులో ఏడాది జైలు శిక్ష బేతంచెర్ల: పట్టణంలోని కొత్త బస్టాండులో మద్యం సేవించి మారణాయుధం పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారని సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలు.. పట్టణంలోని శేషారెడ్డి నగర్కు చెందిన కే.నాగ శేషు 2018లో మద్యం సేవించి కొత్త బస్టాండులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్ఐ తిరుపాలు ఘటనా స్థలానికి చేరుకొని మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. డోన్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు నాగశేషుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరు పరచడంలో కృషిచేసిన సీఐ వెంకటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ మాధవ్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పాణ్యం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాణ్యంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఖలీల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన గని గోపాల్రెడ్డి (45), భార్య లక్ష్మీదేవి మధ్య గొడవ జరగడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గోపాల్రెడ్డి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పాణ్యంలోని తాటికాయ చెరువు వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఉదయం ట్రాక్ను పరిశీలించిన సిబ్బంది మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతుడి కుమారుడు భీష్మరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ముప్పు తప్పేలా..!
శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగ రోప్ వే వద్ద మంగళవారం ఉదయం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) పదో బెటాలియన్ కమాండర్ ప్రసన్నకుమార్ రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గోపాలకష్ణ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను రోప్ వే క్యాబిన్ నుంచి సురక్షితంగా ఎలా కిందకు చేర్చాలి. ఆ తర్వాత వారికి ఎలా ప్రథమ చికిత్స నిర్వహించాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. కిందకు చేరిన వ్యక్తికి స్ట్రెచర్పై ప్రథమ చికిత్స -
చౌడేశ్వరీ దేవి హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవస్థానంలో హుండీలోని కానుకలను లెక్కించగా రూ.20,35,355 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. గత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. నగదుతో పాటు 11 గ్రాముల బంగారు ఆభరణాలు, 390 గ్రాముల వెండి అభరణాలు వచ్చినట్లు వెల్లడించారు. గ్రూపు ఆలయాల ఈఓ బ్రహ్మనందరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, పాలక మండలి సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయొద్దు
● ఎమ్మెల్సీ ఇసాక్బాషాబొమ్మలసత్రం: ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరు తో అప్పులపాలు చేయొ ద్దని సీఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హితవు పలికారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ.. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అమీర్, ఎస్ఈసీ మెంబర్లు గోపవరం సాయినాథరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రెటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసాతో కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి కొన సాగుతూ శాసనసభలో అడ్డుకొనే వారు లేక పోయినా అత్యవసర తీర్మానం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తిరిగి గెలవలేరేమో అన్న అనుమానం బలంగా ఉండటంతోనే రాజధానిని మార్చకుండా ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం మొదటి దశకు రూ. 1 లక్ష కోట్లు, రెండవ దశకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయటం చూస్తే భవిష్యత్తులో రాష్ట్రం ఎలాంటి దుస్థితికి వెళ్తుందోనని ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారన్నారు. భవన నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో ఒక చదరపు అడుగు రూ. 11 వేల ప్రకారం ఖర్చు చూపడం చూస్తే రాజధాని పేరుతో దోపిడికి పాల్పడుతున్నారన్న అనుమానం రాకతప్పదన్నారు. రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు భూములు సరిపోవని మరోసారి భూసేకరణ చేయటం వెనుక నేతలకు ఆభూములను రియల్ ఎస్టేట్ దందా చేసేందుకేనని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టీవై శివయ్య, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, లీగల్సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, సెక్రటరీలు దేవనగర్బాషా, శివనాగిరెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్ పాల్గొన్నారు. -
బెట్టింగ్తో భవిష్యత్ అంధకారం
● జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ నంద్యాల: క్రికెట్ అనేది వినోదం కోసం మాత్రమేనని, బెట్టింగ్కు ఆశపడి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాల తో నిరంతర నిఘా ఉంటుందన్నారు. బెట్టింగ్ నిర్వహించినా.. ప్రోత్సహించినా.. పాల్గొనే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. కష్టపడకుండా వచ్చే సొమ్ము శాశ్వతం కాదని, అది భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి, స్మార్ట్ ఫోన్లలో ఏ యాప్స్ వాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పనుల కోసం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.. అనేది గమ నిస్తూ ఉండాలన్నారు. పరిసరాల్లో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఆసుపత్రి నుంచి పరీక్షకు..
బేతంచెర్ల: విద్యార్థి జీవితంలో పదో త రగతి ఎంతో కీలకం. ఉన్నత చదువులకు ఇక్కడే మలుపు. అ యితే ఓ విద్యార్థి పరీక్ష వేళ విషమ పరీక్ష ఎదుర్కొన్నా డు. ఓ వైపు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు అనారోగ్యం వేధి స్తోంది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు అత్యవసర ఆపరేషన్ చేశారు. అయినా మరుసటి రోజు పరీక్ష రాశాడు. ఈ సంఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక శ్రీనారాయణ స్కూల్ పదో తరగతి చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డికి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆదివారం అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. సోమవారం సోషల్ పరీక్ష ఉండటంతో విద్యార్థి తల్లిదండ్రులు విషయా న్ని ఎంఈఓ సోమశేఖర్ ద్వారా డీఈఓ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరీక్ష రాసేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర కు విష్ణువర్ధన్రెడ్డి ఆస్పత్రి నుంచి వాహనంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు. ఈ మేరకు విద్యార్థుల తల్లి దండ్రులు విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లుశిరివెళ్ల: జిల్లాలో రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లయ్యాయని డీఎల్పీఓ రాంబాబు అన్నారు. సోమవారం శిరివెళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై ఆరా తీశారు. జిల్లాలో రూ.18 కోట్ల మేరకు ఇంటి పన్నులు వసూలు కా వాల్సి ఉండంగా సిబ్బంది కృషితో లక్ష్యాన్ని చేరువ లో ఉన్నామన్నారు. స్థానిక పంచాయతీలో రూ. 40 లక్షలకు గాను రూ. 34 లక్షలు వసూళ్లయ్యాయన్నా రు. ఏప్రియల్ 2 న గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్ల నియామకం జాబితా వెలువడుతుందన్నారు. 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశ్వనికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ. 32.29 లక్షలు మహానంది: మహానంది క్షేత్రంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 32,29,396 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు వివిధ ఆలయాల హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల ద్వారా రూ. 31,91,727 రాగా, అన్నప్రసాదం విభాగం ద్వారా రూ. 22,986, గో సంరక్షణ ద్వారా 14,683 వచ్చిందని చెప్పారు. 31 రోజులకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బందితో పాటు శ్రీ బాలాజీ, తిరుమల బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
శేషవాహనంపై శ్రీరంగనాఽథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు వెలసిన శ్రీలక్ష్మిరంగనాథస్వామి శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పట్టువస్త్రాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకెళ్లి శేషవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ రథంపై స్వామివారిని ఉంచారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి స్వామివారికి సాష్టాంగనమస్కారాలు చేసుకొన్న అనంతరం భక్తులు జయజయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి గ్రామోత్సవ రథాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి శేషవాహనోత్సవానికి ప్రత్యేక ఉంది. ప్రజలు, రైతులు పొలంగట్లవెంట తిరిగేటప్పుడు నాగశేషుని నుంచి తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా శేషవాహనం రోజున స్వామివారికి మల్లెపూలలను సమర్పించి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి. నేడు హనుమద్వాహనసేవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం స్వామి వారికి హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వరరెడ్డి, చైర్మన్ నారాయణరెడ్డి, ఈఓ సాయికుమార్ తెలిపారు. -
అమరావతి పేరిట హైడ్రామా
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు. అదుపు తప్పిన కారు నంద్యాల(అర్బన్): అబాండం తండా గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి కాల్వలో పడింది. హైవే పనుల్లో భాగంగా అబాండం తాండ దాటిన తర్వాత మహానంది రస్తాలో నూతన వంతెన పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్కు చెందిన ప్రభాకర్రెడ్డి పనుల నిమిత్తం మహానందికి బయల్దేరగా వంతెన వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో కారు కాల్వలో పడింది. ప్రమాదంలో ప్రభాకర్రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు కర్నూలు: శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని బుధవారపేటలో నివాసముంటున్న పొలిశెట్టి అశోక్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదన మేరకు జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ సిరి ఉత్తర్వులిచ్చారు. పొలిశెట్టి అశోక్పై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. గతంలో తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్యలకు సంబంధించిన కేసుల్లో పాల్గొని పోలీసుల రికార్డులకెక్కాడు. రాబోవు కాలంలో ప్రజల్లో భయాందోళన సృష్టించే అవకాశమున్న నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం జిల్లా బహిష్కరణకు పోలీసు అధికారులు ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన తొమ్మిది మందిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీన కుట్ర?
ఎమ్మిగనూరుటౌన్: ఎన్నికల ముందు చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కార్మికులను ఆదుకుంటానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా అందే రూ. 24 వేల సాయాన్ని కూడా అటకెక్కించాడు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆర్థికంగా కుదేలైంది. అలాంటి ఈ సంస్థలోకి ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ సొసైటీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టేందుకే అధికారపార్టీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని స్థానిక చేనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైడబ్ల్యూసీఎస్కు దేశంలోనే గుర్తింపు ఎమ్మిగనూరులో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 సంవత్సరంలోనే వైడబ్ల్యూసీఎస్ను స్థాపించారు. అప్పట్లో 60కిపైగా చేనేత వస్త్ర దుకాణాలను నడిపి 600 మందికి పైగా సభ్యులతో సొసైటీ నడిపారు. వైడబ్ల్యూసీఎస్ బ్రాండ్తోనే దుప్పట్లు, దోమతెరలు, టవళ్లు, చీరలు తదితర జనతా వస్త్రాలను ఉత్పత్తి చేయిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చేనేత వస్త్ర దుకాణాలు నెలకొల్పి సొసైటీని లాభాల బాటలో నడిపించారు. ఇలా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు సొసైటీని సందర్శించారు. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న వైడబ్లూసీఎస్కు ఎమ్మిగనూరులో కోట్లాది రూపాయల విలువైన దుకాణాలు, భవనాలు, భూములున్నాయి. అలాంటి సొసైటీని నష్టాల ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదన చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరిలోనే ప్రతిపాదనలు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎమ్మిగనూరు పరిధిలోని 12 డిపోలు, అవుట్లెట్లు తెలంగాణలోని 1, కర్ణాటకలోని మూడు అవుట్లెట్లను ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు గత జనవరి నెలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఓ అధికారి హ్యాండ్లూమ్స్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చేనేత పరిశ్రమ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే విలీన ప్రతిపాదనలు అని అధికారులు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే సొసైటీలోని మెజారిటీ సభ్యులతో విలీన అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు చేనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ విలీన ఆమోదాన్ని వ్యతిరేకించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తులను కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ 31న సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన విలీనాన్ని వ్యతిరేకించాలని వైడబ్ల్యూసీఎస్ సభ్యులు నిర్ణయం -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కర్నూలు(అర్బన్): మైనార్టీ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహా పర్వీన్ హెచ్చరించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ మైనార్టీ బాయ్స్ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్లో వసతి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా అవసరమైన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, ఆకు కూరలు వాడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: బ్యాంకుల దగ్గర చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వి. శ్రీనివాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ప్రమీల అనే మహిళ కెనరా బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకొని స్కూటీలో పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆమె కళ్లుగప్పి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. తర్వాత చోరీ విషయం తెలుసుకున్న బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ముర్రవాడ భార్గవి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్లను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి దొంగలు కర్ణాటక రాష్ట్రం భద్రావతి ప్రాంతానికి చెందిన శంకర్ బోవి, కార్తీ బోవిగా గుర్తించారు. ఆదివారం మంత్రాలయం రోడ్డులోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గర వారిని అదుపులోకి తీసుకొని 13 గ్రాముల బంగారు చైన్, 17 గ్రాముల బంగారు నెక్లెస్, చోరీలకు ఉపయోగించే బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. -
వేసవి భగభగలు
జనాభా గణన దేశాభివృద్ధికి కీలకం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జనాభా గణన దేశాభివృద్ధికి కీలకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కుటుంబాల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి జనాభా గణన ఎంతో అవసరమన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు, 20 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా ఉందన్నారు. జనగణనలో వయస్సు ఆధారంగా జనాభా విభజన, యువత సంఖ్య వంటి ముఖ్యమైన వివరాలు సేకరిస్తామన్నారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి గృహానికి ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్లు కేటాయిస్తారని చెప్పారు. జనగణన కోసం మొత్తం ప్రాంతాన్ని బ్లాకులుగా విభజిస్తారని, ప్రతి బ్లాక్లో సుమారు 200 ఇళ్లు, 700 నుంచి 800 మంది జనాభా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారన్నారు. మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా తమ గృహ వివరాలను జియో ట్యాగ్ చేసి నమోదు చేయవచ్చని, అనంతరం ఫీల్డ్ అధికారులు వాటిని ధ్రువీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, మాస్టర్ ట్రైనర్లు విష్ణు, మాధురి, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్
వెల్దుర్తి: బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాళ్లగడ్డ గ్రామం కుర్ర రమేశ్. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం హైవే 44పై మండల పరిధిలోని సూదేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కుర్ర రమేశ్ను వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అతని వద్ద అనుమానాస్పద మత్తుపదార్థాలు లభించడంతో ఎస్ఐ బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, వ్యవసాయశాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సమన్వయంతో పంచనామా చేశారు. 20గ్రాముల గంజాయి, ఎమ్డీఎమ్ఏ(నిషేధిక మత్తు పదార్థం–పార్టీ డ్రగ్) మత్తు పదార్థాలుగా గుర్తించారు. నిందితుడు కుర్ర రమేశ్ను విచారించగా బెంగళూరులోని వంశీ అను వ్యక్తి చెప్పిన మేరకు హైదరాబాద్లోని పార్టీ కోసం డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వెలుగోడులో దారుణం ● పదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. సీపీ నగర్ ప్రాంతంలో కార్పెంటర్ పని చేసే వృద్ధుడు చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయమాట లు చెప్పి సమీపానికి రప్పించుకున్నాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం ఎమ్మిగనూరురూరల్: భర్త, మామ వేధింపులు తాళలేక భారతి(30) అనే మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన భారతి(30)తో తొమ్మిది ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గ్రామం సమీపంలోని పొలంలో గుడిసెవేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప భారతిని వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఒంటిపై పెట్రోల్పోసుకొని భారతి నిప్పంటించుకున్నారు. మంటలతో బయటకు కేకలు వేస్తు రావటంతో అక్కడ ఉన్న వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. తమ కుమార్తెను భర్త, మామలు కాల్చిచంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: గుంతకల్–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాములు వెల్లడించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదానికి గురైడా అన్నది తెలియరాలేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే గుంతకల్ రైల్వే పోలీసులకు లేదా సెల్ నంబర్: 9247575606ను సంప్రదించాలన్నారు. జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 15 ఏళ్ల బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. చదువులో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. మొబైల్ ఫోన్లో పిల్లల్లో దుష్ప్రభావం చూపుతుందని, పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చూడాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కళల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి దోహదమన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జనార్దన్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ వెంకటరావు, ఆర్బిటర్ సుజాత, 150 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన ఏసు
నంద్యాల(న్యూటౌన్): మానవుల్లో ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన మహానీయులు ఏసుక్రీస్తు అని నంద్యాల డయాసిస్ పీఠాధిపతులు బిషప్ ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు అన్నారు. మట్టల ఆదివారం సందర్భంగా పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–2 ఆల్ సెయింట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీనరీ చైర్మన్ ఎంఐడీ ప్రసాద్ గురువులు, డేవిడ్ వేణు, రెవరెండ్ మారడోన గురువులతో పాటు పాస్టరేట్–3లో డీనరీ చైర్మన్ సామేలు రత్నరాజు గురువులతో పాటు పాస్టరేట్–4, 5, 6లో రెవరెండ్ విక్టర్ బాబులతో పాటు కమిటీ సభ్యులు, క్రైస్తవ పెద్దలు, చిన్నా, పెద్దలు, మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మట్టలు చేతపట్టుకొని దేవున్ని స్తుతిస్తూ ప్రత్యేక పాటలు పాడుతూ ఆలయాల చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు. ఈ రోజు నుంచి గుడ్ఫ్రైడే వరకు ఏసు అనుభవించిన శ్రమలను ప్రతి రోజూ ధ్యానిస్తూ మంచి మార్గంలో నడవాలని సూచించారు. అందరూ శాంతి సమాధానం కలిగి ఏసు మార్గం జీవించాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు విజయ్కుమార్, టెక్కె పాస్టరేట్ చైర్మన్ జోయల్బాబు, పాల్రాజారావు, సీయెను ప్రార్థనామందిరం నిర్వాహకులు ఏసుదాసు, ఏసుకృప పాస్టర్ అందం సుధాకర్, జాన్బెన్నిలతో పాటు అన్ని సంఘాల పాస్టర్లు ఆయా సంఘాల్లో మట్టల ఆదివారం సందేశాన్ని వినిపించారు. -
రైతులను మభ్యపెట్టడానికే అసెంబ్లీలో రాజధాని తీర్మానం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: అమరావతి ప్రాంత రైతులను రాజధాని పేరుతో మరోసారి మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రాబాబు ఆసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్మాణం పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాటాలు చేసిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం లాభం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్లాట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చాలా మంది రైతులకు తెలియదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదన్నారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే తిర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు పాల్గొన్నారు. -
దొంగ దొరికాడు
నంద్యాల: జల్సాలకు అలవాటు పడి జిల్లాలో చోరీల కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షెరాన్మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన సోహెల్ ఖాన్ నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశారు. చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సోహెల్ఖాన్ను ఆదివారం వెలుగోడు ఎస్సార్బీసీ కేసీ కెనాల్ కోట్ల కింద ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతని వద్ద నుంచి ఆత్మకూరు స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడిన 40 తులాల బంగారు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన రెండు తులాల బంగారు ఆభరణాలను సీజ్ చేశామన్నారు. చోరీలకు పాల్పడిన సొమ్ము ను వెలుగోడు దగ్గర ఉన్న ఎస్సార్బీసీ కెనాల్ దగ్గర దాచి పెట్టేవాడన్నారు. ఇతని గతంలో కుప్పం, పెనుగొండ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో గాలించి అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో దొంగను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. ● 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
నంద్యాల: జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సంయమనం పాటించాలన్నారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు. వచ్చే రోజుల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అపోహతో గ్యాస్ వినియోగదారులు అధికంగా అదనపు బుకింగ్ చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా తగిన చర్య తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు పాఠశాలలు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆటంకం లేకుండా గ్యాస్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబంధిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు, సంబంధిత మండల తహసీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967, కమాండ్ కంట్రోల్ నంబర్ 08514–293903కు ఫిర్యాదు చేయాలన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాల అడ్డగింత
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీ పక్కన జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను ఆదివారం వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇటుకల బట్టీల కోసం ప్రొక్లెయిన్ల ద్వారా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో కాలనీవాసులు ఆ పనులను నిలిపి వేయించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. కాలనీ పక్కనే ఉన్న పొలాల్లో గతంలో మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ చేరి గడిచిన పది సంవత్సరాల కాలంలో దాదాపు ఏడుగురు పిల్లలు నీటి గుంతల్లో పడి మృతి చెందారన్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా కొందరు వ్యక్తులు ఆదివారం మట్టి తవ్వి తరలించుకపోతున్నారన్నారు. పొలాల్లో మట్టి తవ్వగా గుంతలు ఏర్పడి మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకోనే ఆస్కారం ఉందన్నారు. సంబంధిత అధికారులు మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ రఘు, అరదేశి దేవా, కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఆప్కోలో విలీనం చేయొద్దు
ఎమ్మిగనూరుటౌన్: అధికారపార్టీ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుట్టారంగయ్య, డాక్టర్ కేఎస్ రఘు,పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆశయాలకు తూట్లు పొడిచి సొసైటీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని కోరారు. చేనేతలపై ప్రేమ ఉంటే వైడబ్ల్యూసీఎస్ను అభివృద్ధి చేయా లే కాని నష్టాల ఊబిలో ఉన్న ఆప్కోలో విలీనం చేయరాదన్నారు. అధికారపార్టీ నాయకులు సొసైటీకి సంబంధించిన విలువైన అస్తులను కొల్లగొట్టేందుకే విలీన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ను కాపాడుకునేందుకు తమ పార్టీ అవసరమైతే పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు రాము, నాగేంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్ వీల్ పనిచేయకపోవడంతో డ్రై వర్ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ప్రభుత్వం కండిషన్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఆప్కోలో విలీనం చేస్తే పోరాటం
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే పోరాటానికి దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో లాభాల్లో ఉన్న వీవర్స్ సొసైటీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్లను కలిసి శనివారం ఆమె వినతిపత్రాన్ని ఇచ్చారు. ఎమ్మిగనూరు అంటే చేనేతలు..చేనేతలు అంటే ఎమ్మిగనూరు అనేలా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీవర్స్ సొసైటీనే కారణమన్నారు. మాచాని సోమప్ప 1938లో ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి సొంత ఆస్తులను ఇచ్చారన్నారు. దీని ద్వారా సుమారు 200 మంది మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీకి 16 అవుట్లేట్లు ఉన్నాయని, విలీనం చేస్తే వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీన విలీనానికి సంబంధించిన సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాదు, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడ చేనేత మళ్లి పాల్గొన్నారు. -
క్యూ కాంప్లెక్స్ల్లో కూలర్లు ఏర్పాటు చేయండి
శ్రీశైలం టెంపుల్: ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం క్యూ కాంపెక్స్ల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి సక్రమంగా పనిచేసే విధంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలని దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆకస్మికంగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరగా దర్శనమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైనచోట్ల చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లలోని నిర్దిష్ట ప్రదేశాల్లోని వాటరు పాయింట్లకు అంతరాయం లేకుండా నీటిసరఫరా ఉండాలన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్యం నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్యదర్శి వారికి స్వామివార్ల ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేశారు. 30న పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 30వ తేదీన సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు ఉదయం టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం పీ–4 కార్యక్రమం నిర్వహణ ఉండటంతో పీజీఆర్ఎస్ను రద్దు చేయాల్సి వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా జిల్లా కేంద్రం నంద్యాలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచించారు. కాగా డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ పట్టణాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. బీసీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంపై విచారణ కోవెలకుంట్ల: పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేయడంపై శనివారం అధికారులు విచారణ చేపట్టారు. బీసీ వసతిగృహాల జిల్లా అధికారి జగ్గయ్య స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని చేరుకుని హాస్టల్ విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు మండలంలోని గుళ్లదూర్తి బీసీ బాలుర వసతిగృహాన్ని మండల ప్రత్యేకాధికారి కల్యాణి, తహసీల్దార్ పవన్కుమార్రెడ్డి చేరుకుని శుక్రవారం హాస్టల్లో మధ్యాహ్న భోజనం నిలిపివేయడంపై వివరాలు అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. 1,413 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం నంద్యాల(న్యూటౌన్): ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశం పొందేందుకు జిల్లాలో 1,856 మంది దరఖాస్తు చేసుకోగా 1,413 మంది అర్హత సాధించారని జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదలైనట్లు తెలిపారు. ఏప్రిల్ 7లోగా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. -
పంట నష్టం.. పరిహారం కష్టం!
ఎకరా రూ. 35 వేలు వెచ్చించి ఎకరన్నర పొలంతోపాటు నాలుగున్నర ఎకరాల సొంత పొలంలో ఖరీఫ్ సీజన్లో మిరప పంట సాగు చేశాను. నారు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో అక్టోబర్ ఆఖరు నాటికి ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించాను. భారీ వర్షాలు కురిసి అధిక తేమతో మొక్కలు చనిపోవడంతో నాలుగు ఎకరాల్లో మిరప పైరును తొలగించాను. మిగిలిన రెండు ఎకరాల్లో మిరప అరకొరగా ఉంది. తుపాన్ కారణంగా మిరప సాగుతో భారీ నష్టాలు వచ్చాయి. – రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం మోంథా తుపాన్ కారణంగా గతేడాది అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు మినుము, కంది పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 35 వేలు ఖర్చు చేసి పది ఎకరా ల్లో మినుము సాగు చేశాను. భారీ వర్షాలు తర్వాత పొగమంచుతో పూత, పిందె రాలిపోయి నష్టం వాటిల్లింది. కందిపూత దశలో వర్షాలు కురియడంతో నష్టాలు తప్పలేదు. పంటనష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: రైతులకు అడుగడుగునా సాయమందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మోంథా తుపాన్తో గతేడాది అక్టోబర్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందలేదు. అప్పుల బాధతో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో గతేడాది ఖరీఫ్ సీజన్లో 76,672 హెక్టార్లలో వరి, 76,025 హెక్టార్లలో మొక్కజొన్న, 35,713 హెక్టార్లలో కంది, 12,011 హెక్టార్లలో మిను ము, 7,581 హెక్టార్లలో వేరుశనగ, 6,426 హెక్టార్లలో పత్తి, 6,786 హెక్టార్ల మిరప పంటలు సాగు చేశారు. రబీ సీజన్లో 53,801 హెక్టార్లలో పప్పుశనగ, 29,395 హెక్టార్లలో జొన్న, 29,413 హెక్టార్లలో మొక్కజొన్న 11,643 హెక్టార్లలో మినుము పంటలు సాగయ్యాయి. తుపాన్ ప్రభావంతో వారం రోజులపాటు భారీ వర్షా లు కురవడంతో రైతులకు పంటలు చేతికందలేదు. నష్టం ఇలా.. వరి, మొక్కజొన్న, కంది, మినుము పంటల సాగుకు ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఖర్చు వచ్చింది. మిరప సాగుకు ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. పప్పుశనగ, జొన్న, త దితర పంటల్లో ఎకరాకు రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వరుస వర్షాలతో కంది, మినుములో పూత, పిందె రాలిపోయి నష్టం చేకూరింది. మిరపలో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయింది. చాలాచోట్ల మిరప పైరును తొలగించారు. ఖరీఫ్లో సాగు చేసిన వరి కోత దశలో భారీ వ ర్షాలతో నేలివాలి పనికిరాకుండా పోయింది. కల్లాల్లో ఆరబోసినదిగుబడులు తడిచిపోవడంతో రైతులు నష్టా లు మూటగట్టుకున్నారు.రబీసీజన్లో జిల్లాలో రై తులు విస్తారంగా పప్పుశనగ, జొన్న పంటలు సాగు చే శారు. విత్తనం వేసిన నెల రోజులకే భారీ వర్షాలు కు రి యడ ంతోపొలాల్లో నీరునిల్వ చేరి మొక్కలు చనిపోయాయి. రైతులు తిరిగి విత్తనం వేసుకోవాల్సి వచ్చింది. ఐదు నెలలుగా ఎదురు చూపులు మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 22,554 మంది రైతులకు సంబంధించి వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. నష్టపరిహారం విడుదలకు ప్రతిపాదనలు పంపారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, మినుము, కంది పంటలకు రూ. 15వేలు, మిరపకు రూ. 35వేల చొప్పున నష్టపరిహారం అందాల్సి ఉంది. పంటనష్ట సంభవించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహార ఊసే లేకపోవడంతోరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం దెబ్బతిన్న విస్తీర్ణం (హెక్టార్లలో) బనగానపల్లె 1181 శ్రీశైలం 4075 ఆళ్లగడ్డ 2960 నందికొట్కూరు 2015 నంద్యాల 898 పాణ్యం 452 (పాణ్యం, గడివేముల)వైఎస్సార్సీపీ హయాంలో అదే సీజన్లో అందిన పరిహారం ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం సంభవిస్తే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. నంద్యాల జిల్లాలో 2021వ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 84.33కోట్లు, 2022వ సంవత్సరంలో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 100 కోట్లను ఇన్సూరెన్స్ రూపంలో అందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా రైతులకు నిలిచింది. ముంచిన మోంథా తుపాన్ దెబ్బతిన్న మిరప, కంది, మినుము, వరి పంటలు జిల్లాలో నష్టపోయిన రైతులు 22,554 మంది మొత్తం 11,581 హెక్టార్లలో పంటనష్టం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కార్ -
ప్రజలకు అందించే సేవలతోనే గుర్తింపు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలకు అందించే ఉత్తమ సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించి నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ యాజమా న్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారి అభీష్టం మేరకే వారు కోరుకున్న ప్రాంతాల్లో నియమిచామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్గా ఉద్యోగాలు పొందిన ఎస్ గణేష్ (ఎంపీపీ ఆళ్లగడ్డ), ఆర్ నరేంద్రకుమార్ (ఎంపీపీ కల్లూరు), వీ అభిషేక్ (ఎంపీపీ కౌతాళం)కు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
యువకుడి దారుణహత్య
సి.బెళగల్: పాత కక్షలతో కె.సింగవరం గ్రామంలో ఓ యువడిని శనివారం దారుణంగా హత్య చేశారు. ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున (27)కు అదే గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు శనివారం ఘర్షణ పడి బోయ మల్లికార్జునను చేతులు, కాళ్లతో కొట్టడమే గాక వేటకొడవలితో కుడి కాలును నరికారు. తీవ్ర రక్తస్రావమై బోయ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తల్లి హత్య కేసులో కుమారుడు అరెస్ట్
అవుకు(కొలిమిగుండ్ల): ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఎస్ఐ అశోక్తో కలిసి నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవుకు పట్టణంలోని కోటవీధికి చెందిన పోతుల శేఖర్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇంటిని తన పేరున రాయించాలని తరచూ తల్లితండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలోనే ఈనెల 19న ఉగాది పండుగ రోజున ఆస్తి విషయంలో గొడవకు దిగాడు. తల్లిదండ్రులను చంపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న రాయితో తండ్రిపై దాడి చేయడంతో కింద పడగా కట్టెతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన తల్లి లక్ష్మీదేవిని అదే కట్టెతో బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందింది. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. నిందితుడు రామాంజనేయులు కోసం వెతుకుతుండగా మెట్టుపల్లి రోడ్డులోని చిన్న చెరువు కట్ట సమీపంలో ఉన్న విషయం తెలుసుకొని అరెస్ట్ చేశాని సీఐ తెలిపారు. జల్సాకు అలవాటు పడి.. తల్లిని హత్య చేసిన నిందితుడు రామాంజనేయులు చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటు పడి ఊర్లో చెడు వ్యక్తులతో సావాసం చేస్తూ మద్యానికి బానిస య్యాడు. జల్సాల కోసం పలువురి దగ్గర డబ్బులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు, జల్సాలకు ఇంట్లో డబ్బులు అడిగితే తల్లిదండ్రులు నిరాకరించా రు. ఎలా గైనా అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో కొంత మందితో కలిసి 2023లో రామాపురంలో చోరీకి పాల్పడ్డాడు. ఆ డబ్బులతో కొంత అప్పులు చెల్లించి మిగిలిన డబ్బుల ను జల్సాలకు వాడుకున్నాడు. ఈ దొంగతనం కేసులో అవుకు పోలీస్ స్టేషన్లో అప్ప ట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా అప్పులు చేయడం, జల్సాలు మానుకోలేదు. డబ్బుల కోసం తల్లిదండ్రులను కొన్ని నెలల నుంచి ఇబ్బంది పెడు తున్నా వాళ్లు ఇవ్వలేదు. వారి పేరున ఉన్న ఆస్తి రాసివ్వలేదనే కారణంతో తల్లిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. -
‘పది’ పరీక్షల తనిఖీ
డోన్ టౌన్: పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. శనివారం డోన్కు వచ్చిన ఆయన మొదటగా పట్టణ పోలీసు స్టేషన్లో భద్ర పరిచిన ప్రశ్నా పత్రాలను పరిశీలించి డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలో పరీక్ష కేంద్రాలైన శ్రీసుధ, నారాయణ, జెడ్పీ గ్లర్స్ హైస్కూల్ను తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. ఆయన వెంట డోన్ మండల విధ్యాధికారులు ప్రభాకర్, రఘునాయక్ ఉన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కర్నూలు (టౌన్): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. అందులో భాగంగానే ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం హొళగుంద, మంత్రాలయం, చిన్న పెండేకల్, కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈగల్ ఐజీ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డీస్పీ భార్గవి, కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అప్పులు వద్దని.. చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల్లో తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పాల శీతలీకరణ కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాజమహేంద్రవరంలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ కలిసిన పాలు తాగి పలువురు మరణించిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్స్ కలిసిన పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత పాల నాణ్యత, స్వచ్ఛతపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో పశు సంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏరి యా హాస్పిటల్స్ ఏడీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. పైప్లైన్లు ఎలా ఉన్నాయి.. శీతలీకరణకు వాడుతు న్న కెమికల్ ఏది.. తదితర విషయాలను పరిశీలించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్కుమార్ కూడా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఇథిలిన్ గ్లైకాల్ వినియోగించడం లేదని, అమ్మోనియా, ప్రియాన్లను వాడుతున్నారని, ఇవి ప్రమాదకరమైనవి కాదని ఆయన పేర్కొన్నారు. గతేడాది ‘స్పాట్’ రెమ్యునరేషన్ ఇప్పించండి నంద్యాల(న్యూటౌన్): గత ఏడాది పదవ తరగతి మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించలేదని, వెంటనే ఇప్పించాలని ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ జనార్దన్రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్పాట్కు సంసిద్ధతను తెలిపిన ఉపాధ్యాయులనే సీనియార్టీ ప్రాతిపదికన నియమించాలన్నారు. స్పాట్ – 2025 రెమ్యునరేషన్ ఇప్పటికీ క్రెడిట్ కాలేదని, అలాగే కస్టోడియన్, పేపర్ కరెక్షన్ సంబంధించి అమౌంట్ చాలా మంది ఉపాధ్యాయులకు జమ కాలేదన్నారు. స్పాట్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నియామకాలకు సందర్భంలో బ్లాక్ చేసిన కేటగిరి–1, 2, 3 పోస్టులను రానున్న బదిలీల్లో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 257 నాయకులు జాకీర్హుసేన్, వీరేశ్వరరెడ్డి, దస్తగిరిబాషా పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
● దేవుడి మాన్యం భూముల్లో అక్రమ తవ్వకాలు ● మట్టి ట్రాక్టర్ల అతి వేగాన్నిప్రశ్నించినందుకు హత్యకు కుట్ర ● ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని బాధితుడి ఆరోపణ ఆత్మకూరురూరల్: వడ్ల రామాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శేషిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గ్రామంలో పల్లెపాడు ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగస్వామికి చెందిన ట్రాక్టర్లు ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ గ్రామంలో వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని డ్రైవర్లకు వేగం తగ్గించాలని చెప్పాలని సింగస్వామికి శేషిరెడ్డి చెప్పాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తమ్మలూ రు ముర్తుజా వెంటనే శేషిరెడ్డికి ఫోన్ చేసి ‘మమ్మల్ని అడిగే వాడివా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ బెదిరించాడు. ఈ విషయంపై పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో శేషిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ముర్తుజా నేరుగా ట్రాక్టర్తో శేషిరెడ్డి ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు నిలుచున్న ఆయనను ట్రాక్టర్తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే చంద్రమౌళీశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కూడా తగిలేలా వెళ్లింది. వెంటనే వారు తేరుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ట్రాక్టర్ శేషిరెడ్డి ఇంటి ప్రహరీని ఢీకొంది. శేషిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామానికి బిత్తర పోయి తేరుకునేలోగా ముర్తుజా అక్కడ నుంచి ట్రాక్టర్తో పరారయ్యాడు. శేషిరెడి వెంటనే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు శేశాడు. ఈ మేరకు సీఐ మహేశ్వరరెడ్డి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. పోలీసులు గాలించి ముర్తుజాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్రమ మైనింగ్ను పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని వడ్లరామాపురం గ్రామస్తులు కోరుతున్నారు. చంపాలనే ట్రాక్టర్తో ఢీకొట్టాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వెళ్తున్న ట్రాక్టర్లను కాస్త నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే నన్ను చంపాలనే ట్రాక్టర్తో ఢీ కొట్టారు. ముర్తుజా నన్ను చంపుతానని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. ఇంట్లోకి పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ముర్తుజాపై తగిన చర్యలు తీసుకోవాలి. దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు ఆపాలి. – శేషిరెడ్డి, బాధితుడు -
సాంకేతిక విద్య.. ఉద్యోగానికి భరోసా
● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు ఏప్రిల్ 4వ తేదీతుది గడువు ● పది విద్యార్థులకు చక్కటి అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రా రంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు ఇలా.. ఉజ్వల భవిష్యత్కు బాటలు.. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాలిసెట్ ఇలా.. పాలిసెట్ 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవ ల తరచూ ఉద్యోగ మేళా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లభించే కోర్సులు... పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. నంద్యాల జిల్లాలో 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 60, మెకానికల్ 120, ఈసీఈ 120, ఎలక్ట్రికల్ 120 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
నంద్యాల(అర్బన్): ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం పెద్దకొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. అయ్యలూరు మెట్టకు చెందిన శంకర్(45) ఇటుకల లోడ్తో పెద్దకొట్టాల మీదుగా కొత్తపల్లె గ్రామానికి వెళుతున్నాడు. పెద్దకొట్టాల చర్చి వద్ద మట్టి కుప్పపై ట్రాక్టర్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు డ్రైవింగ్ సీటులో ఉన్న శంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
కర్నూలు: నగర శివారులోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాశీం బాషా (45)కు ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. వీరు ప్రస్తుతం కర్నూలు శివారులోని మాంటెస్సోరి ఇండస్ స్కూల్లో చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కొడుకు సొహైల్కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని ద్విచక్ర వాహనంపై బనగానపల్లె నుంచి శుక్రవారం కర్నూలుకు వచ్చాడు. పాఠశాలలో తన పిల్లలను చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై ఎన్హెచ్ 44 మీదుగా కర్నూలు నగరంలోకి వస్తుండగా కృష్ణానగర్ రావూరు ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జిపైన వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాశీం బాషా ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ ఊడి పక్కనే పడింది. తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టు పక్కల ఉన్నవారు గుర్తించి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ట్రాఫిక్ పోలీసులు మార్చురీకి తరలించారు. మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిప్పుల కొలిమి
● పలు మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో జిల్లా నిప్పుల కుంపటిగా మారే ప్రమా దం ఏర్పడింది. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వడగాల్పులు, ఎండల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు లో నమోదవుతుండటం గమనార్హం. ఇదిలాఉంటే కర్నూలు నగరం సహా ఎక్కడా చలివేంద్రం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి లైన్ డిపార్టుమెంట్లతో వేసవి ఉపశమన చర్యలపై సమావేశం నిర్వహించి సంబందిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు అధికారులు పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. అహోబిలం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది. మండలం ఉష్ణోగ్రత జూపాడుబంగ్లా 40.64 రుద్రవరం 40.68 కొత్తపల్లి 40.44 కోడుమూరు 40.4 పెద్దకడుబూరు 40.4 కల్లూరు 40.29 శిరువెళ్ల 40.18 -
రాయల్టీ పేరుతో నిలువుదోపిడీ
● సుధాకర్ ఇన్ఫ్రా సిబ్బందికి మైనింగ్ అధికారుల వత్తాసుపాములపాడు: ఎస్ఆర్ ఎంసీ కెనాల్ వేస్ట్ బిల్కు (రాళ్ల మట్టి)ను తరలిస్తున్న వారిని సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సిబ్బంది దోచుకుంటోంది. ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్నామని, రోడ్డుపై కంకర, ఇసుక, మట్టి తదితరం తరలించే వాహనాల నుంచి రాయల్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులను నియమించి దందాకు పాల్పడుతున్నారని వాహన యజమానులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని కంబాలపల్లి గ్రామం వద్ద బిల్కు లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లను అడ్డుకున్నారు. సుధాకర్ ఇన్ఫ్రా చెందిన వ్యక్తుల వెంట మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రషీద్ అహ్మద్ ఉన్నారు. ట్రిప్పర్ డ్రైవర్ల వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వెంకటేష్, కో ఆప్టెడ్ సభ్యుడు ముర్తుజాఅలీ, మరి కొందరు వాహన యజమానులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికే బిల్కు తరలించడానికి ఇరిగేషన్ శాఖకు చలానా చెల్లించామని, రాయల్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు రాయల్టీ చెల్లించవద్దని జీఓలో కనబరిచిన విషయాన్ని కూడా చూపించారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశా మని వాహన యజమానులు తెలిపారు. స్థానిక రైతు లు శ్రీశైలం ముంపులో భూములు కోల్పోయామని అందులో తమ ఆస్తులు ఉన్నాయని, పరిహారం అప్ప ట్లో అరకొరగా ఇచ్చారని, ఇప్పుడు బిల్కు తరలిస్తే వేలల్లో వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. దీంతో డ్రైవర్ల నుంచి తీసు కున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి, అధికారులు, రాయల్టీ వసూలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం
బొమ్మలసత్రం: గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, జాన్వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో క్రిస్టియన్లకు పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డాక్టర్ బీఅర్ అంబే డ్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకుల చేతిలో కీలు బొమ్మ ల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్సీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో కోవిడ్ సంభవించినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఇంత ఆదాయ వనరులు ఉన్నా టీడీపీ ప్రభుత్వం అప్పుల దిబ్బలా రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనలో క్రిస్టియన్లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపి తిరిగి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నార. సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనా రిటీ సెల్ సెక్రటరీ విల్సన్పాల్, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మనో జ్ కుమార్, పట్టణాధ్యక్షులు ఇమ్మానియేలు, రవిప్రకాష్, కరుణాకర్, ప్రేమ్కుమార్, కిరణ్ పాల్గొన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
● పది మందికి గాయాలు నంద్యాల(అర్బన్): ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు టైర్ పగలడంతో డివైడర్ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నంద్యాల మండలం చాబోలు గ్రామ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పగలడంతో డివైజర్ను దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. అనంతరం బస్టాండ్కు తరలించి సొంత ప్రాంతాలకు వెళ్లేలా సౌకర్యం కల్పించారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో మంటలు కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ మండల కేంద్రానికి సమీపంలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గుట్టపాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా, లేదంటే మరే ఇతర కారణంతో సంభవించిందా అనే విషయమై స్పష్టత రాలేదు. మరోవైపు ప్ర మాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు కోరగా.. ఉత్పత్తి ప్రక్రియలో ఇలాంటి ఘటనలు సాధారణమని, ఉత్పత్తి సమయంలో కొంత భాగం పక్కకకు వెళ్లడంతో పొగలు వ్యాపిస్తాయని యాజమాన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బనగానపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని డోన్కు చెందిన మేరీ భర్త విల్సన్ (32)ను ప్రియుడు మధుతో కలిసి ఈ నెల 15న రాత్రి హత్య చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. నిందితులు మేరీ, మధు, వీరికి సహకరించిన నంద్యాలకు చెందిన మహమ్మద్, అశోక్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు పంపారు. కేసు వివరాలను బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐ వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం నంద్యాలకు చెందిన మేరీకి డోన్కు చెందిన విల్సన్తో వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి పదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరి కుటుంబం డోన్ నుంచి నంద్యాలలోని బోగ్గులైన్కు మారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ స్థితిలో మూడు నెలల క్రితం నంద్యాల మండలం బాపూజీ నగర్కు చెందిన మధుతో మేరికి వివాహేతర సంబంధం ఏర్పడగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మేరీ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ నెల 15న మధు, అతని స్నేహితులు రఫీ, అశోక్ కలిసి విల్సన్కు అతిగా మద్యం తాగించారు. ఆటోలో బనగానపల్లె నుంచి కై పకు వెళ్లే రహదారిలో ప్లాట్లలోకి తీసుకెళ్లి బెల్టుతో విల్సన్ మెడకు బిగించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు హంతకుల గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 24న కై ప వీఆర్ఓ ద్వారా లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. -
ముగిసిన రాతిదూలం పోటీలు
బనగానపల్లె రూరల్ : మండలంలోని నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో జ్యోతి మహోత్సవాల సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా నిర్వహించిన న్యూకేటగిరీ విభాగం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో వరుస స్థానాల్లో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షరరెడ్డి వృషభాలు, అదే జిల్లా రాయవరంకు చెందిన అక్షరరెడ్డి వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామానికి చెందిన గోవర్థన్రెడ్డి ఎద్దులు, నంద్యాల జిల్లా చిన్నకానల గ్రామానికి చెందిన చెన్నరెడ్డి వృషభాలు, కోటకందుకురుకు చెందిన నరసింహారెడ్డి ఎద్దులు, సోమయాజులపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, నరసయ్యయాదవ్ వృషభాలు, రోళ్లపాడుకు చెందిన ప్రభాకర్రెడ్డి, గుల్లదుర్తికి చెందిన శశికాంత్ వృషభరాజములు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40 వేలు, రూ.30వేలు,రూ.20వేలు,రూ.15వేలు, రూ.10వేలు, రూ.8 వేలతో పాటు జ్ఞాపికను అందజేశారు. -
మళ్లీ అక్రమాలు!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించిన 106 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీకి పెద్దపీట వేయాలి. రాజకీయ నేతల సిఫార్సులు, ముడుపులకు అవకాశం ఇవ్వరాదు. కానీ వీఏఏల బదిలీల్లో లోలోపల ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా యూనిట్గా జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా కౌన్సెలింగ్ నిర్వహించే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గతేడాది జూలైలో జరిగిన బదిలీల్లో కర్నూలు, నంద్యాల డీఏఓలు కుమ్మకై ్క సీనియారిటీకి పాతర వేశారు. సిఫార్సు లేఖలు, ముడుపులకు పెద్దపీట వేశారు. సిఫార్సు లేఖ లేకపోతే తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. ఫలితంగా అర్హులు మారుమూల ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు మండలాలకు బదిలీ అయ్యారు. అనర్హులు దగ్గరి మండలాల్లో నియమితులయ్యారు. వీరందరూ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఎక్కడ పనిచేసే వారు అక్కడే కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మళ్లీ కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీలు గురువారం చేపట్టనున్నారు. వీఏఏల బదిలీల్లో మళ్లీ అక్రమాలే.. నిబంధనల మేరకు వీఏఏలను ఖాళీ పోస్టుల్లోనే నియమించాలి. అయితే ముడుపులు దండుకొని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లీవ్ వేకెన్సీల్లో సైతం పోస్టింగ్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులకు.. వీఏఏలకు కర్నూలులో పనిచేసే ఓ ఏఓ మధ్యన ఉండి ముడుపుల బాగోతం నడుపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది వీఏఏలు మెటర్నటీ లీవ్లో ఉన్నారు. మరికొందరు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇటువంటి ఖాళీల్లో ఎవరినీ నియమించరాదు. కానీ ముడుపుల మహిమ వల్ల ఇటువంటి లీవ్లు భర్తీ కానున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీవ్ వేకెన్సీలు భర్తీ చేయడం వల్ల కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, కోసిగి, హొళగుంద, హలహర్వి, మంత్రాలయం తదితర మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యథావిధిగా ఖాళీలు మిగిలిపోయే పరిస్ధితి ఏర్పడింది. పనిలోపనిగా కొందరు వీఏఏలను మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తంగా 2025 జూలైలో జరిగిన అక్రమాల కంటే తాజాగా జరుపుతున్న బదిలీల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలు వీఏఏల బదిలీలపై దృష్టి సారించి అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీఏఏల బదిలీల్లో ముడుపులు, సిఫార్సులకు పెద్దపీట లీవ్ వేకెన్సీలు కూడా భర్తీకి రంగం సిద్ధం కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఖాళీల భర్తీ వట్దిదే నేడు వీఏఏల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ అబాసుపాలవుతున్న వ్యవసాయ శాఖ గతేడాది చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీల్లో అబాసుపాలైన వ్యవసాయ శాఖ ప్రస్తుతం గ్రామ స్థాయిలో వీఏఏల బదిలీల్లో సైతం పెద్ద ఎత్తున ముడుపులు దండుకొని అపఖ్యాతిని మూట కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులు, ఏడీఏల బదిలీల్లో రూ.లక్షలు ముడుపులు చేతులు మారాయి. కూటమి పార్టీల నేతలకు బదిలీల పర్వం కాసుల పంట పండించింది. తాజా బదిలీల్లోనూ అక్రమాలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లెరూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చౌడేశ్వరిదేవి రాయబారాది జ్యోతి రథ మహోత్సవాలు బుధవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్వామి వార్ల విగ్రహాలకు వసంతోత్సవ పూజలు నిర్వహించి తిరిగి ఆలయాలకు చేర్చారు. ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం విఫలం
మౌలిక వసతుల కల్పనలో నంద్యాల(అర్బన్): వైఎస్సార్నగర్ ఏర్పాటుకు మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని, నేడు చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు కాలనీవాసులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. గత సోమవారం బుడగజంగాల కాలనీలో మిగులు భోజనం ఆరగించి అస్వస్థతకు గురైన కుటుంబాలను బుధవారం శిల్పారవి పరామర్శించారు. దాదాపు 80 మంది బుడగ జంగాల సామాజిక వర్గాలను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమన్నారు. వారికి అవసరమైన వైద్యం, ఆహార పదార్థాలు, తాగునీరు అందించడకుండా పరిసరాల పరిశుభ్రత చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, తక్షణమే సంఘటనపై విచారణ జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. బుడగజంగాల కాలనీ వాసులకు ఏదైనా తలెత్తితే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, 38వ వార్డు ఇన్చార్జి రమణ, మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు జయప్రకాష్రెడ్డి, సోమశేఖర్, అంకాలయ్య, రామకృష్ణారెడ్డి, అన్వర్బాషా, సాయి, కిరణ్, నాయక్, బాబు, చిరు, ప్రసాదరెడ్డి, గీతారాణి, వెంకి, వెంకటస్వామిశెట్టి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించలేకపోయారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి -
జూనియర్ సివిల్ కోర్టుకు తాత్కాలిక భవనం
● పరిశీలించిన జిల్లా జడ్జి కబర్ధిబనగానపల్లె రూరల్: బనగానపల్లె జూనియర్ సివిల్ కోర్టు కోసం తాత్కాలికంగా బుధవారం బనగానపల్లె ప్రభుత్వ పశువైద్యశాల భవాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, జడ్జి ప్రతిమ పరిశీలించారు. బనగానపల్లెలో కోర్టు భవనం నిర్మించి 120 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో బనగానపల్లెలో అదనంగా మరో కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.9.15 కోట్లు మంజురయ్యాయి. నూతన కోర్టు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనం కోసం ప్రభుత్వ పశువైద్యశాల భవనాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆర్డీఓ నరేంద్రనాథ్రెడ్డి, ఎంపీడీఓ నాగరాజు, ఆర్అండ్బీ ఏఈ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మంజులరెడ్డి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. -
‘తూడిచెర్ల’ గేట్లు ఎత్తిన రైతులు
పాములపాడు: అధికారులతో పనిలేకుండా బుధవారం రైతులే కేసీ కెనాల్ 120వ కిలోమీటరు లాకీన్స్లా వద్ద తూడిచెర్ల సబ్ చానల్ గేట్లను ఎత్తారు. ఇందుకోసం పాములపాడు మండలంలోని శాంతినిలయం గ్రామ సమీపానికి వందలాది మంది రైతులు వచ్చారు. కేసీ కెనాల్ సిబ్బంది వారిస్తున్నప్పటికీ వినలేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 510 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారని, ఈ నీరు నేరుగా ఆళ్లగడ్డ ప్రాంత పొలాలకు వెళ్తోందన్నారు. యర్రగూడరు, మిట్టకందాల, శాంతినిలయం, మద్దూరు, తూడిచెర్ల గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, జొన్న, మినుము పంటలు ఎండాల్సిందేనా అని ప్రశ్నించారు. కేసీ కెనాల్లో నీరున్నందున ఐదు రోజులుగాు నీటి విడుదల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు రైతులు తెలిపారు. -
ఫుడ్ పాయిజన్ కలకలం
● వాంతులు, విరేచనాలతో 60 మంది ఆసుపత్రిలో చేరిక ● పెళ్లిలో మిగిలిన ఆహారం తినడమే కారణమంటున్న అధికారులు నంద్యాల(అర్బన్): పట్టణ శివారులోని నందమూరినగర్ వద్ద ఉన్న బుడగ జంగాల కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 60 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని తెచ్చుకొని తినడం వల్లే ఫుడ్పాయిజన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. వివరాలు.. పట్టణ సమీపంలోని బుడగజంగాల కాలనీలో దాదాపు 210 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఓ పెళ్లిలో మిగిలిన ఆ హారాన్ని తెచ్చుకొని పలు కుటుంబాలు తిన్నాయి. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో దాదాపు 60 మంది ఆసుపత్రులకు పరుగు లు తీశారు. చిన్న పిల్లలు సైతం ఫుడ్ పాయిజన్కు గురి కావడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. తక్షణమే కాలనీకి వెళ్లి బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్ఓ, ఫుడ్సేఫ్టీ అధికారి వెంకటరాముడు, పలు శాఖల అధికారులు కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. గతంలో పలు మార్లు మిగులు అన్నాన్ని తెచ్చుకొని తిన్నామని, ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. మిగులు ఆహారం తినడం వల్లే ఫుడ్పాయిజన్ అయ్యిందని, తాగునీటి శ్యాపింల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. -
లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు
నంద్యాల: లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు, నంద్యాల పట్టణంలోని విజయ పాల డెయిరీ సమీపంలో రూ.2.40 లక్షల వ్యయంతో, గంటకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. తమ విజ్ఞప్తిని గౌరవించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్ను లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదాయ వృద్ధి సాధించేందుకు ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో రూ.15 వేలకుపైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ వసూలు చేయడానికి అవసరమైన వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కొరత లేదని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా వినియోగించే విద్యుత్ ఉపకరణాలు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. -
హామీలు విస్మరిస్తే పుట్టగతులుండవు
నంద్యాల(న్యూటౌన్): అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎన్నికల హామీలు విస్మరించిన ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్ అన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి సాధనకై సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుంచి మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సోమన్న, లక్ష్మిదేవి, ధనుంజయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరురూరల్: మండలంలోని కలుగోట్ల పంచాయతీ పరిధిలో మొక్కజొ న్న పొలంలో మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు దాదాపు చేధించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణమని ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. మృతుడు గోనె గండ్ల మండలం పెద్దనెలటూరి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మంగళవారం మృతుడి కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని గుర్తించి గుండెలు బాధుకుంటూ రోధించారు. హత్యకు గురైన నరేంద్ర అలియాస్ ఏసేబు (30)ను భార్య, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి ఎమ్మిగనూరులోని ఇంట్లో హత్యచేసి, శవాన్ని పొలం వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రూరల్ పోలీసులను వివరణ కోర గా హత్యకు గల కారణాలను విచారిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ముగిసిన ఎద్దుల పోటీలు గోస్పాడు: ఉగాదిని పండుగను పురస్కరించుకొని శ్రీవీరభద్రస్వామి, శ్రీ గుమ్మిత మల్లికార్జునస్వామి తిరుణాల సందర్భంగా మండలంలోని దీబగుంట్ల గ్రామంలో పామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు మూడురోజు మంగళవారం ముగిశాయి. రాష్ట్రమార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 9 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పాలపండ్ల విభాగంలో పాల్గొన్న ఎద్దులు 15నిమిషాల సమయంలో తమ సత్తా చా టాయి. మొదటి బహుమతి రూ. 50 వేలు నంద్యాల జిల్లా సాంబవరం గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి ఎద్దులు, రెండో బహుమతి రూ.30 వేలు బీఎంకేబుల్స్ కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన శశాంక్శ్రయ ఎద్దులు, మూడో బహుమతి రూ. 20 వేలు మార్కాపురం జిల్లా కంభం, సాంబవరం చెందిన వెంకటకృష్ణ, ప్రభాకర్రెడ్డి ఎద్దులు, నాల్గవ బహుమతి రూ. 10 వేలు ప్రకాశం జిల్లా పొట్లపాడుకు చెందిన హర్షవర్ధన్రెడ్డి ఎద్దులు సాధించాయి. వైఎస్సార్సీపీ నాయకులు చిన్ననాగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జనార్దన్రెడ్డి, శ్రీశైల నియోజక వర్గ పరిశీలకుడు మదుసూదన్రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
ఓటర్ల మ్యాపింగ్లో పురోగతి సాధించాలి
కర్నూలు(సెంట్రల్): ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఆమె మంగళవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి పటిష్ట భద్రతకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకముందు ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత నియోజక వర్గాల తహసీల్దార్లు బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పురోగతి తీసుకురావాలన్నారు. ఆలూరు, కోడుమూరులో ఓటర్ల పురోగతి బాగుందన్నారు. అదేవిధంగా క్లెయిమ్స్, డెమోగ్రాఫిక్ కరెక్షన్కు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్కుమార్ పాల్గొన్నారు. -
ఫేక్ డాక్యుమెంట్తో మ్యుటేషన్
కర్నూలు(సెంట్రల్): ఆస్పరి మండలం కై రుప్పలలో ఫేక్ డ్యాకుమెంట్లతో రెవెన్యూ అధికారులు మాయజాలం చేశారు. గ్రామానికి చెందిన విజయమోహన్ అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి పేరిట ఆయనకు తెలియకుండానే మ్యుటేషన్ చేశారు. ఆయన తన కుమారులకు భూ మి భాగ పరిష్కారాల సమయంలో జరిగిన మోసా న్ని తెలుసుకున్నారు. న్యాయం కోసం రెండేళ్లుగా కలెక్టరేట్, పత్తికొండ ఆర్డీఓ, ఆస్పరి తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఊరులో లేని విషయాన్ని పసిగట్టి పన్నాగం విజయమోహన్ స్టేట్ బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ తరువాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. కై రుప్పలలో సర్వే నంబర్ 70లో అతనికి 1.54 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.30లక్షలకు పైగా పలుకుతోంది. ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కొందరు పన్నాగం పన్నారు. గ్రామ వీఆర్వోగా పని చేసిన ఎస్టీ వీరన్న ఇందులో కీ లక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి ద్వారా కథ నడిపించి రా త్రికి రాత్రే భూమిని ఆమె పేరిట బదలాయించారు. గుడ్డిగా మ్యుటేషన్ చేసిన తహసీల్దార్ మ్యుటేషన్ చేసే సమయంలో రెవెన్యూ అధికారులు కనీసం నిబంధనలు పాటించలేదు. ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్ ఈసీ చూడలేదు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వలేదు. వీఆర్వో, ఆర్ఐ, త హసీల్దార్ గుడ్డిగా సంతకాలు చేశారంటే వారికి భారీ గా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి రెండేళ్లుగా పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓఆర్ కేసు కూడా పెండింగ్లో ఉంది. ఎలా మోసం చేశారంటే..! కురువ లక్ష్మి అదే గ్రామానికి చెందిన చిన్న వీర న్న వద్ద నుంచి సర్వే నంబర్ 52లో 1.33 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్ను సర్వే నంబర్ 70లో విజయమోహన్కు చెందిన 1.54 ఎకరాలను కొల్లగొట్టేందుకు వినియోగించారు. డాక్యుమెంట్లో సర్వే నంబర్, విస్తీర్ణం స్థానాల్లో వైట్నర్తో రుద్ది సర్వే నంబర్ 70కి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణాలను నమోదు చేశారు.ఆ ఫేక్ డ్యాకుమెంట్తో 2024 జూలై 24న ఆస్పరి తహసీల్దార్తో మ్యుటేషన్ చేయించారు. -
జడ్జి బాధ్యతల స్వీకరణ
చాగలమర్రి: ఆళ్లగడ్డ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణానికి చెందిన గొడుగు రవికుమార్ను నియమిస్తూ అమరావతిలోని హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆళ్లగడ్డ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ భాస్కర్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఒంటిమిట్ట తలంబ్రాల సమర్పణ నంద్యాల(వ్యవసాయం): నంద్యాలకు చెందిన మన ఊరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు గోటితో ఒలిచిన తలంబ్రాలను మంగళవారం ఒంటిమిట్ట రామాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివకుమార్రెడ్డి, రఘువీర్ మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతుల్లో వడ్లను పండించి వాటిని కొన్ని నెలలుగా మహిళలు భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యాన్ని ఒంటిమిట్ట రామాలయ అధికారులకు అందజేశామన్నారు. అనంతరం ఆలయంలో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో పాల్గొన్నారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం గోస్పాడు: పట్టణంలోని విష్ణు ఆసుపత్రిలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం మంగళవారం ప్రత్యేకంగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోఫెడిక్ వైద్యులు డాక్టర్ వికాస్తో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు సహకారం అందించేందుకు ఈనెల 30న ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో రూ.5,560 విలువ గల పరీక్షలు, డాక్టర్స్ కన్సల్టేషన్ను కేవలం రూ.499కే అందించనున్నట్లు తెలిపారు. రేపు వీఏఏల బదిలీల కౌన్సెలింగ్ కర్నూలు(అగ్రికల్చర్): హైకోర్టు ఆదేశాల మేర కు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26న ఉమ్మడి జిల్లా యూనిట్గా వీఏఏల బదిలీల ప్రక్రియను కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనున్నారు. గతేడాది జూలైలో జరిగిన వీఏఏల బదిలీల్లో అక్రమాలు జరిగాయని, రాజకీయ సిఫార్సు లు, ముడుపులకు పెద్దపీట వేసి అర్హులకు అన్యాయం చేశారని 106 మంది హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హైకోర్టు 106 మంది వీఏఏ బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ వీఏఏల బదిలీలకు వ్యవసాయ శాఖకు అనుమతి ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించిన 106 మంది వీఏఏల సీనియారిటీ జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రంలోపు రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్గా, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి సభ్యుడుగా ఉంటారు. ఇప్పటికై న రాజకీయాలు, ముడుపులకు అతీతంగా బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుందా అనేది చర్చనీయాంశం అయ్యింది. కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడులు కౌతాళం: తెలుగుదేశం నేతలు అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. ఇసుక మాఫియా కాడి నుంచి ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఇసుకను తమ గ్రామంలో నుంచి గాకుండా దారి మళ్లించాలని కోరినందుకు మరాణాయుధాలతో దాడి చేసిన ఘటన ఉరుకుంద గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్లను ఉరుకుంద గ్రామం మీద నుంచి గాకుండా దారి మళ్లించాలని తెలుగుదేశం పార్టీలోని తిక్కారెడ్డి వర్గం వారు కోరగా దీనికి మంత్రాలయం ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి వర్గం ససేమిరా అనింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువురుకి గాయాలయ్యాయి. మరాణాయుధాలతో, కళ్లల్లో కారం చల్లి దాడులకు తెగబడ్డారు. ఘటనలో ఇరువర్గాలపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. -
ఇంటి జాగైనా ఇవ్వు.. అద్దైనా చెల్లించు బాబూ!
కర్నూలు(సెంట్రల్): ఇంటి జాగైనా ఇవ్వూ లేదంటే అద్దైనా చెల్లించూ బాబూ అంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళలు కదం తొక్కారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ మేరకు సొంతిల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలను సీపీఐ శ్రేణులు ముట్టడించారు. కర్నూలులో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అధికారంలో లేని సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మిస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సెంటు స్థలం తమ బాత్రూం అంతా కూడా లేదంటూ వ్యంగ్యం చేశారని, ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. తనకు కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలో భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు ఎన్ని పరిశ్రమలు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు అవుల శేఖర్, కె.జగన్నాథం పాల్గొన్నారు. -
నెలాఖరులోగా స్తంభాలు ఏర్పాటు చేయండి
నంద్యాల: ఆర్డీఎస్ఎస్ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను వేగవంతం చేసి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఎస్ఎస్ పథకం అమలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తూ నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ ట్రిప్పులు తగ్గించి, లో వోల్టేజ్ సమస్యలను నివారిస్తూ స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాటు చేసిన 15 విద్యుత్ స్తంభాల పనులను కూడా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. టోల్ గేట్ల పరిసరాల్లో అధిక సాంద్రత తో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని రైతుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ కార్తీక్, శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కసరత్తు
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం పెరిగే అవకాశం ● ఒక్కో అసెంబ్లీలో 1.60లక్షల ఓటర్లు ఉండేలా విభజన ● పునర్విభజనలో మహిళలకు 33 శాతం సీట్లు ● ఎస్సీ, ఎస్టీలకు కూడా పెరగనున్న సీట్లుఎమ్మెల్యే, ఎంపీలు కావాలని ఆశపడుతున్న రాజకీయ ఆశావహులకు శుభవార్త. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (పునర్విభజన) చట్టాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లు–2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్లమెంట్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పా టు అవుతున్నాయి కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనపై ఆ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని బిల్లులో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం పూర్తవడం, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, ఆపై పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేయడమే తరువాయి. 2029 సార్వత్రిక ఎన్నికలు కొత్తగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతోనే జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలులో పెరగనున్న 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీల చొప్పున ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంతా భావించారు. అయితే 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్లమెంట్కు 3 చొప్పున మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఈ లెక్కన 20 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టంతో ప్రస్తుతం ఉన్న 2 ఎస్సీ స్థానాలు 3కు పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్తో మొత్తం నియోజకవర్గాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 20 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2027 మార్చికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కొత్త జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగనుంది. 1.60లక్షల ఓట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. 1 లేదా 2 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానం కచ్చితంగా పెరుగుతుంది. అయితే రాష్ట్రంలోని పెద్ద జిల్లాలో కర్నూలు ఒకటి. ఆ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక ఎంపీ స్థానం చొప్పున రెండు జిల్లాల్లో పెరగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో కలిపి మరో ఎంపీ స్థానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉండొచ్చు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల పోలీస్స్టేషన్లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్వరరెడ్డి, రాంబాబు సోమవారం ఉదయం నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల బందోబస్తుకు బైక్పై కోవెలకుంట్ల మీదుగా బయలుదేరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు ముదిరెడ్డి సుబ్బారెడ్డి కారును వేగంగా నడుపుతూ మండలంలోని పొట్టిపాడు మెట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డికి కాలు విరగగా, రాంబాబు తలకు గాయాలయ్యాయి. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పంటలు ఎండుతున్నాయ్.. కాపాడండి!
● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్కు విన్నవించిన రైతులు పగిడ్యాల: ‘పంటలు ఎండిపోతున్నాయ్.. కాపాడండి’ అంటూ సోమవారం జిల్లపాడు, శాతనకోట, సుల్తానాపురం, మల్యాల గ్రామాల రైతులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్ను ఆశ్రయించి మొరపెట్టారు. ఎత్తిపోతల నీరు తమ పొలాలకు రావాలంటే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ చేయా లని అభ్యర్థించారు. రెండు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా ఎత్తిపోసే నీరంతా దిగువకు వెళ్తున్నాయని ఎగువ తూములకు పారడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సాగునీరు రాకపోతే పంట చేతికి రాదని డీఈకి వివరించారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ.. 0 నుంచి 120 కి.మీ. వరకు కేసీ కాలువ వెంట తనిఖీ చేస్తున్నామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆన్లైన్లోనే వాహన రిజిస్ట్రేషన్ నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లోనే సాగుతుందని జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వాహన కొనుగోలు దారులు ప్రభుత్వం ఇచ్చిన రసీదును తీసుకొని, అందులో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలన్నారు. టెంపర్వరీ రిజిస్ట్రేషన్ ఫీజు, పర్మినెంట్ ఫీజు, పోస్టల్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు, రోడ్డు సేఫ్టీ, సర్వీస్, నంబర్ ప్లేట్ ఫీజులు వాహనాన్ని బట్టి మారుతాయన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలని షోరూం యజమానులు చెప్పిన మాటలు నమ్మవద్దని సూచించారు. మల్లన్న సేవలో సినీ హీరో శ్రీకాంత్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకున్న సినీ హీరో శ్రీకాంత్ దంపతులు ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్ద సినీ హీరో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామి వారి శేషావస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. సినీ హీరో శ్రీకాంత్తో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు. -
సీసీ రోడ్డును రద్దు చేయండి
● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై జేసీకి సర్పంచ్ ఫిర్యాదుకర్నూలు(సెంట్రల్): కర్నూలు రూరల్ మండలం నిడ్జూరులో ప్రభుత్వ నిధులతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యప్రకాష్ తన ఇంటి కంపౌండ్ నుంచి సీసీ రోడ్డు, మురుగు కాల్వ వేయించుకుంటున్నారని, తక్షణమే ఆ పనులను రద్దు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ మాధవి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆయనే నేరుగా తన ఇంటి కంపౌండ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేయించుకుంటు న్నారని, గ్రామంలో పలు కాలనీల్లో గుంతలమయం అయిన రోడ్లు ఉన్నాయని, వాటిలో సీసీ రోడ్డు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్షణమే ఆ పననులను రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
ప్రజ్వలించిన భక్తి
● వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి రాయబారాది వసంతోత్సవ కార్య క్రమాల్లో భాగంగా సోమవారం జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన కార్యక్రమం సోమవారం ఉదయం ముగిసింది. ముందుగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భాస్కరయ్య ఆచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన తొగట వీర క్షత్రియులు, అమ్మవారి భక్తులు ముందుగానే గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నెయ్యి, గోధమ పిండి, వివిధ సుగంధ ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసుకొని వెలిగించుకొని తలపై పెట్టుకొని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గీతాలు ఆలపిస్తూ, మేళ తాళాలతో చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై మొదట సర్కార్ జ్యోతితో భక్తులు నడిచిన తరువాత మిగిలిన భక్తులు వరుసగా నిప్పులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది దాదాపు 545 జ్యోతులతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం అమ్మ వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ఆలయంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు -
ఇండక్షన్ స్టౌలను ప్రోత్సహించాలి
నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్ స్టౌల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇందుకు ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాధారణంగా రోజుకు 5,500 ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ నమోదవుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10,000 వరకు పెరిగిందన్నారు. జేసీ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. -
అభివృద్ధికి రాజకీయ గ్రహణం
డోన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. కనీసం గత ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కూడా ముందుకు రావడం లేదు. రాజకీయ కక్షతో పట్టణంలో దాదాపు రూ. 3 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులు అలంకార ప్రాయంగా మారాయి. టీడీపీ నేతల మధ్య విభేదాలతో అధికారులు చేతులు కట్టుకుని చోద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న పనులతో పలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా మాకేందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రీడలతో పాటు టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయల వ్యయంతో పార్కులు, రెస్టారెంట్లు, రహదారులను నిర్మించింది. డోన్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్యాపిలి మండలం వెంగలాంపల్లె, డోన్ మండలం వెంకటాపురం తుమ్మలచెరువు ప్రాంతాలను టూరిజం, బోటు షికారు కేంద్రాలుగా, ప్యాపిలి మండలం బోయ వాండ్లపల్లె వాల్మీకి గుహలు, బేతంచెర్ల మండలం ఎర్రజ్వాల గుహలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టణ శివారులో నగరవనం, నియోజకవర్గంలో పచ్చదనం ఉట్టిపడేట్లు పది పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే డోన్ రైల్వేస్టేషన్కు వెళ్లే బుగ్గన శేషారెడ్డి మార్గ్లో రూ.3 కోట్లతో క్లబ్హౌస్ను నిర్మించారు. అత్యంత ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ క్లబ్హౌస్లో మినీ ఫంక్షన్హాల్, రెస్టారెంట్, క్యారమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడేందుకు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివక్ష చూపుతుండటంతో వీటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.3 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు కుట్ర.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వెచ్చించిన ఈ క్లబ్హౌస్ నిర్వహణను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసమే విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికార పార్టీలోని రెండు వర్గాలు ఈ క్లబ్హౌస్ నిర్వహణ కోసం పోటీపడుతుండటంతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో రూ. 3 కోట్ల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. అధికార పార్టీ నేతల తీరును చూసి ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో నిర్మించిన క్లబ్హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను డోన్ యూనియన్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని భావించాం. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పోటీ పడుతుండటం దుర్మార్గమైన చర్య. ప్రజల ఆశయాల మేరకు మాజీ మంత్రి బుగ్గన సహకారంతో నిర్మించిన ఈ భవనాలను త్వరలోనే ప్రారంభించాలి. – సప్తశైల రాజేష్, మున్సిపల్ మాజీ చైర్మన్, డోన్ వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటకం, పట్టణాభివృద్ధి పనులు రెస్టారెంట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మినీ ఫంక్షన్హాల్ నిర్మాణం చిన్న చిన్న పనులతో ప్రారంభోత్సవానికి సిద్ధం టీడీపీ నేతల విభేదాలతో జాప్యం చేస్తున్న అధికారులు రెండేళ్లు గడుస్తున్నా నిరుపయోగం -
నిధులు నిలిపివేయడం అన్యాయం
గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం క్లబ్హౌస్లో ఫర్ని చర్, జిమ్, స్నూకర్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పరికరాల కొనుగోలుకు రూ.18 లక్షలను మంజూరు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపును అన్యాయంగా నిలిపేసింది. దీంతో క్రీడాకారులకు, చిన్నారులకు క్లబ్హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కరకు రాని చుట్టంగా మిగిలిపోయింది. – పోసు్ట్రపసాద్, వైఎస్సార్సీపీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు -
పొగాకు రైతు మృతి
ఓర్వకల్లు: పండించిన పొగాను కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గుండెపోటుతో రైతు షఫీఖాన్(55) మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో ఆది వారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షఫీఖాన్ అనే వ్యక్తి గ్రామంలో కొందరి రైతుల వద్ద 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 10 ఎకరాల్లో పొగాకు సాగుచేశాడు. ఈ ఏడాది పొగాకు బాగా అమ్ముడు పోతుందని, అప్పులు తీరిపోతాయని ఆశించాడు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, పొగాకు కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయానికి, వివిధ అవసరాలకు రూ.10 లక్షలు అప్పుచేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య నజిమాబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన బోయ శ్రీనివాసులు (36) కోడుమూరుకు చెందిన మంజులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిమీద శ్రీనివాసులు బైక్పై వెంకటగిరి గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో అల్లినగరం గ్రామానికి చెందిన బోయ గిరి తన ఆటోలో కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కోడుమూరు శివారులో ప్రమాదవశాత్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు తరలిస్తుండగా బోయ శ్రీనివాసులు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంగమేశ్వరంలో పారిశుద్ధ్య పనులు
కొత్తపల్లి: జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయంలో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టారు. ట్రాక్టర్ డోజర్ తో బురదను తొలగింపు చేపట్టారు. ఆలయంలోని బురద నీటిని మోటర్ల ద్వారా బయటకు పంపింగ్ చేశారు. గర్భాలంయలో బురద తొలగించి పూర్తిస్థాయిలో సంగమేశ్వరుడిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తామని పురోహితుడు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య ఆదోని రూరల్: బైచిగేరి గ్రామానికి చెందిన చాకలి వీర హుసేని(25) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చాకలి శాంతితో ఏడేళ్ల క్రితం వీర హుసేనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తతో, మామ తిక్కన్న, అత్త రాములమ్మతో గొడవపడిన శాంతి మూడేళ్లుగా కాపురానికి రాకుండా దూరంగా ఉంది. పెద్దలు పలుమార్లు పంచాయతీ చేయగా కాపురానికి రాకపోవడంతో భర్త చాకలి వీర ఉసేని మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉన్న తీర్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని అర్బన్: మోసానికి పాల్పడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి, అవని గోల్డ్ ఎండీ వెంకటేశ్వర్లుపై జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు రాంబట్ల ప్రశాంత్ కోరారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవని గోల్డ్ ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయని, అందులో 160 ఎకరాలను 2013లోనే అమ్మేశారని తెలిపారు. అవని గోల్డ్ భూములను ఇప్పిస్తానని తన వద్ద ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు రూ. 25 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు అవని గోల్డ్ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీ, డైరెక్టర్లు తనకు అగ్రిమెంటు రాసిచ్చారని వివరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి 50 ఎకరాలు అడిగారని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తాను విచారణ చేయగా 2013లోనే అవని గోల్డ్ భూములన్నీ అమ్మేశారని, వారిని నిలదీయడంతో ఈరోజు.. రేపు అని కాలయాపన చేస్తూ తనను మోసం చేశారన్నారు. ఈ మేరకు కేసు పెట్టానని తెలిపారు. ఈనెల 9వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఈనెల 18వ తేదీన ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు, అవినీగోల్డ్ సంస్థ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదైందన్నారు. -
ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం
ఓర్వకల్లు: మెకానిక్ వద్దకు తీసుకొచ్చిన 18 బైకులు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఓర్వకల్లులోని ఓ మెకానిక్ షెడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. తిప్పాయపల్లె గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓర్వకల్లు బస్టాండ్ సమీపాన మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చి, రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఓ బైక్ నుంచి మంటలు వ్యాపించి మొత్తం 18 దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. సమీపంలోని ట్యాంకర్ ద్వారా నీటితో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. దుండగుల దుశ్చర్య అనే విషయాలు తెలియరాలేదు. 25న హుండీల లెక్కింపు కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25న హుండీల్లో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు మధ్య హుండీలను తెరిచి లెక్కిస్తామని చెప్పారు. -
గ్యాస్ ‘గోడు’!
చిత్రంలో సిలిండర్లున్నాయి, కానీ జనాలు కనిపించడం లేదని సందేహం వస్తుందా.. గంటల తరబడి క్యూలో నిలబడలేక ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టాల్సి వస్తోంది. గ్యాస్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ దృశ్యం మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ వద్ద ఆదివారం కనిపించింది. గ్రామంలోని గ్యాస్ ఏజెజేన్సీపై గతంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడం, విచారణకు వచ్చిన అధికారులు రద్దు చేయడం చేశారు. అయితే మళ్లీ పాతవారే నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంతో సమస్యలు మళ్లీ మొదటి కొచ్చాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. – మహానంది -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో సర్కారీ సేవగా) నిర్వహిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేపట్టారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. -
వైభవంగా రాయబార మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. జిల్లెల గ్రామరస్తాలో ఉన్న అమ్మవారి పొలిమేర కుంట వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. రాయబార మహోత్సవంలో పాల్గొన్న భక్తులు -
శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ ను సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. పది గడ్డివాములు దగ్ధం హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు. రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణం ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్మెంట్స్కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్మెంట్స్ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. -
పేదలకు కేటాయించిన భూమి పవర్గ్రిడ్కు!
కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు భూ పంపిణీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని పవర్ గ్రిడ్కు అనుసంధానంగా నిర్మించేందుకు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్కు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల కంటే ముందుగానే తిమ్మనాయినిపేట వద్ద 415, 416 సర్వే నెంబర్లలో సుమారు 43 మందికి ఒక్కొక్కరికి ఎకరం భూమి చొప్పున భూపంపిణీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తయింది. సంబంధిత భూమిలో వేలాది రూపాయలు ఖర్చు చేసి జింగిల్ క్లియర్ పనులు చేపట్టారు. ఎన్నికల సమయంలో భూ పంపిణీ జరిగితే తమకు నష్టం చేకూరుతుందని భావించిన టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి పంపిణీని అడ్డుకున్నారు. దీంతో మండల వ్యాప్తంగా పేదలకు పంచే భూపంపిణీ ఆగిపోయింది. అయితే ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భూముల పక్కనే ప్రస్తుతం తిమ్మనాయిని పేట – నందిపాడు మధ్య పవర్ గ్రిడ్ పూర్తయింది. దీనికి అనుసంధానంగా బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు భూములు అవసరం కాగా గతంలో పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన భూములను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం కంపెనీ జీఎంతో పాటు సిబ్బంది ఆ భూమిలో సర్వే చేయడంతో పాటు యంత్రాలతో చదును చేయడంతో రైతులు చర్చించారు. తమకు కేటాయించిన భూమిలో ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. గ్రామంలో చాలా వరకు రైతులు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. ఎక్కువ భాగం పసుసు సాగు చేస్తుంటారు. ఉడికించుకోవడం, ఆరబోసుకునేందుకు వసతులు లేక పోవడంతో రైతులందరూ ఈ భూమికి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో పనులు చేసుకుంటూ ఉంటారని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్కు వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్న భూమిని మళ్లీ పరిశ్రమకు ఎలా ఇస్తారని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలుస్తామని రైతులు తెలిపారు. -
సంగమేశ్వరుడి పూజకు వేళాయె!
ఆలయానికి బురదలోనే వెళ్తున్న భక్తులుకొత్తపల్లి: శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో వెలిసిన ప్రాచీన సంగమేశ్వరుడు జలాధివాసం వీడారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం బయటపడింది. ఆలయంలో చుట్టూ ఒండ్రు బురద పేరుకుపోయింది. గర్భగుడిలో, ఆలయ ముఖమండపంలో బురద నీటితో నిండి ఉంది. అయినా శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాచీన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. బురదలోనే ఒకరి వెంట ఒకరు నడుస్తూ ప్రాచీన ఆలయానికి వెళ్లి స్వామికి పూజలు చేశారు. చుట్టూ నీరు మధ్యలో సంగమేశ్వరాలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. పండుగ సెలవులు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఉంది. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివ లింగానికి, లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయం చుట్టూ బురద, రాళ్లు, రప్పలు ఉన్నాయని, ప్రమాదానికి ఆస్కారముందని, అంతా శుభ్రం చేసే వరకు ఆలయం లోపలికి ఎవరూ రావద్దని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. -
మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహ్మద్ ప్రవక్త బోధనలు మార్గదర్శకం కర్నూలు(సెంట్రల్): మహ్మద్ ప్రవక్త బోధనలు సమస్త ప్రజలకు మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం ఆయన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాత ఈద్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం, పేదలకు సహాయం చేయడం వంటి అంశాలను మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. అంతకముందు ఆయన ప్రార్థనలకు వచ్చిన వారిని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్!
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడటం చంద్రబాబు విజన్కు అద్దం పడుతుందోని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలే అజెండాగా పని చేస్తున్నారని విమర్శించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రెండేళ్లగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్ర బాబు కనీసం స్పందించండం లేదన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు దోచుకోవడం, వారు అభివృద్ధి చెందడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి పోరాటం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. గత ఖరీఫ్లో ప్రారంభమైన యురియా సమస్య నేటికీ తీర లేదన్నారు. ఇప్పటికీ రైతులు యురియాను బ్లాక్లో కొంటున్నారంటే దానికి చంద్రబాబు విజనే కారణమన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చేప్పుకునే చంద్రబాబు ఎక్కడ ఇచ్చారో అధికారికంగా విడుదల చేయాలన్నారు. కేవలం అనుబంధ సంస్థలకు, బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టి రాస్ట్రాలన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు తప్ప టీడీపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, కృష్ణారెడ్డి, వైఎస్సాపీపీ రాష్ట ప్రచార వింగ్ సెక్రటరీ బాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెల్డింగ్ చాంద్, పిన్నాపురం సర్పంచ్ ఎల్లకృష్ణయ్య, నాయకులు బాబి, మున్నా, స్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తిరుగు’లేని భక్తి!
● శ్రీశైలం నుంచి కన్నడిగులు తిరుగు ప్రయాణం ● 25 అడుగుల నందికోళ్లతో స్వగ్రామానికి పాదయాత్ర నందికోళ్లతో కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్న కన్నడ భక్తులుజూపాడుబంగ్లా: ఉగాది ఉత్సవాలకు వందల కిలోమీటర్లు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లిన కన్నడిగుల భక్తి అంచంచలమైనది. మండుటెండలకు వెనుకడగు వేయకుండా.. కొండ కోనలకు భయపడకుండా.. నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొందరు తిరుగు ప్రయాణంలో కూడా పాదయాత్రగా వెళ్తూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా జమ్ఖండి తాలూకా కొన్నూర్ గ్రామానికి చెందిన భక్తులు 25 అడుగుల నందికోలను ఎత్తుకొని, నూతన నందికోళ్ల తయారీకి నూతన వెదురు బొంగులను భుజాన ఉంచుకొని 600 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండటాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన మరికొంత మంది భక్తులు కాడెద్దులతో పాటు కావడిని భుజాన ఉంచుకొని కాలినడకన స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండటం వారి భక్తిని ప్రశంసిస్తున్నారు. -
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి ఈనెల 7వ తేదీన నిర్వహించే కుంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఉద్యో గి కొబ్బరి కాయలు సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.


