breaking news
Nandyal District News
-
మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు!
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలు పేకాట స్థావరాలుగా వెలుగొందుతున్నాయి. 2024లో సంజామల మండలంలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 80 మందిని అరెస్ట్ చేసి రూ.83,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 10 కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేసి రూ.63,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసులకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసి రూ.15,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొలిమిగుండ్ల మండలంలో రెండేళ్లలో 11 కేసులు నమోదయ్యాయి. కనకాద్రిపల్లి, కల్వటాలలో టీడీపీ నేతలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు.● ఆదోని ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు చెందిన జిన్నింగ్మిల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ్రామగ్రామాన పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. పేకాట నిర్వాహకులు టీడీపీ నేతలతోపాటు పోలీసులకు వారం వారం మూమూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం.● మార్చి 15వ తేదీన ఆస్పరి మండలం చిన్నహోతూరు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కర్నూలు స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.5.30 లక్షల నగదు, 17 సెల్ఫోన్లు, 8 బైక్లు స్వాధీనం చేసుకొని 18 మందిపై కేసు నమోదు చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 16 మందిపై కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు కొన్ని.. కోసిగిలో 2025 సంవత్సరంలో 12 పేకాట కేసుల్లో 48 మందిని అరెస్టు చేసి రూ.62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆరు పేకాట కేసులు నమోదు చేసి 18 మంది అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.24,800 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 19 మందిపై కేసులు నమోదు చేసి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసుల్లో 32 మందిని అరెస్టు రూ.1,73,950 స్వాధీనం చేసుకొని ఆరు బైక్లను సీజ్ చేశారు. 2026లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు రూ.26,700 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో మందిని అరెస్టు చేసి రూ.28,860 నగదును స్వాఽధీనం చేసుకోగా.. 2026లో మరో 8 మందిపై కేసులు నమోదు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి మండలంలో 2025 సంవత్సరంలో మూడు కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి రూ.34,630 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 16 కేసుల్లో 87 మందిపై కేసు నమోదు చేసి రూ.1,93,935 నగదును స్వాధీనం చేసుకున్నారు. 2026లో ఏడుగురిపై కేసు నమోదు చేసి రూ.17,230 స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు కర్నూలు నగరంలోని అద్దె భవనాల్లో నిర్వహణ చర్చనీయాంశంగా ఓ మొబైల్ వాహనం అడ్డాగా మారిన మంత్రి బీసీ నియోజకవర్గం ఆటగాళ్లకు ఆహ్వానం పలుకుతున్న కుందూతీరం ప్రత్యేక వాహనాల్లో కర్ణాటకలోని రాయచూరుకు.. పచ్చ నేతల అండతో మితిమీరిన జూదం -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.96 లక్షలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ గురువారం భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.96,53,938 వచ్చినట్లు ఆలయ డప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 13 కేజీల 450 గ్రాములు, బంగారం 6 గ్రాముల 300 మిల్లీగ్రాములు వచ్చినట్లు చెప్పారు. లోన్స్ పేరుతో సైబర్ మోసాలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): లోన్లు మంజూరు చేస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్న సైబర నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మరిన్ని డబ్బులు చెల్లించాలని కోరడం, లేదంటే ఫోన్ స్విచ్చాఫ్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే లోన్ ఆఫర్లు నమ్మవద్దన్నారు. ఓటీపీ, ఏటీఎం పీన్, సీవీవీ, బ్యాంకు వివరాలు ఎవరకీ చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయాలన్నారు. శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. ఎడమగట్టు కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జున సాగర్కు 40,751 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి 34,803 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 167.8764 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 875.90 అడుగులకు చేరుకుంది. బేతంచెర్లలో బాలుడిపై కుక్కల దాడి బేతంచెర్ల: కుక్కలు దాడిచేయడంతో బేతంచెర్లలోని హనుమాన్నగర్కు చెందిన ఆరేళ్ల బాలుడు సయ్యద్ మహీర్ తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలకు శుక్రవారం సెలవు కావడంతో ఇంటి సమీపాన ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. బాలుడి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో కుక్కలు పారిపోయాయి. శరీర భాగాలతో పాటు చేతి సంకలో తీవ్రంగా గాయపడిన బాలుడిని శేషారెడ్డి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు 108లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఏడాది మే 2వ తేదీన ఇదే కాలనీలో నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ వీధి కుక్కలు దాడి చేయడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. -
నిర్లక్ష్యం ‘పెచ్చు’ మీరి.. పైకప్పు భయపెట్టి!
శ్రద్ధగా చదువుకోవాల్సిన విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 6 గదులు ఉండగా 5 గదులను వినియోగిస్తున్నారు. వరండాలో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. అక్కడే భయం గుప్పిట్లో విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు వెంటనే వరండా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మంత్రాలయం రూరల్ -
వారానికే ఒట్టిపాయె!
నీరు లేక ఒట్టిపోయిన హంద్రీ నదిగోరంట్ల గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఇరిగేషన్ అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 4 రోజుల పాటు హంద్రీనదికి నీటిని విడుదల చేశారు. అయితే హంద్రీనదికి నీటిని వదిలి వారం రోజులు కూడా గడవకముందే నీటి విడుదల నిలిపేశారు. దీంతో గ్రామంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. నీటి సమస్య పరిష్కరించాలంటూ రెండు నెలల పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే హంద్రీనదికి తూతూ మంత్రంగా నాలుగు రోజులు వదిలి బంద్ చేయడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని రోజులు హంద్రీనదికి నీటి విడుదల కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – కోడుమూరు రూరల్ -
ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ స్థల పరిశీలన
కర్నూలు: ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆ శాఖ డీజీ వెంకట రమణ పరిశీలించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఆయన కర్నూలు చేరుకోని జిల్లా అధికారులతో కలిసి ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న 60 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతం ఇండిస్ట్రియల్ హబ్గా మారుతున్నందున అందుబాటులో ఫైర్ స్టేషన్ ఉండేందుకు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డీజీ వెంకట రమణ జిల్లా అధికారులకు సూచించారు. ఆయన వెంట రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ బాలరాజు, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ బజారి, నంద్యాల జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్ ప్రసాద్, తదితరులు ఉన్నారు. విధుల నుంచి సీఎస్ఓ తొలగింపు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం సీఐ, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధ్య ఫోన్ సంభాషణ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సంభాషణ వివాదంపై ఈఓ అంతర్గత విచారణ చేయించారు. దేవస్థాన నిబంధనలు అతిక్రమించి ఫోన్ ఆడియో లీక్ చేసి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించారనే కారణంతో సీఎస్ఓ బి. శ్రీనివాసరావుపై దేవస్థాన ఈఓ వేటు వేశారు. ఇంచార్జీ సీఎస్ఓగా పర్యవేక్షకులు మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించారు. పెట్టుబడి మట్టిపాలు నందికొట్కూరు: ఎల్నినో దెబ్బకు తొమ్మిది ఎకరాల మినుము పంటను రైతు ఆండ్రడ్డి వెంకటరెడ్డి శుక్రవారం దున్నేశారు. జూలై నెల మొదటి వారంలో మినుము పంటను రైతు సాగు చేశారు. మూడు ఎకరాలు సొంత భూమి, ఆరు ఎకరాలు భూమిని రూ. 20 వేల చొప్పున కౌలుకు తీసుకొని రైతు సా గు చేశారు. ఒక ఎకరాకు రూ. 26 వేలు ఖర్చు వచ్చిందని, తొమ్మిది ఎకరాలకు వెచ్చించిన పెట్టుబడి రూ.2.34 లక్షలు మట్టిపాలు అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. -
దిగువ కాల్వకు నీరివ్వాల్సిందే
ఎమ్మిగనూరుటౌన్: తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఎల్లెల్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ నియోజవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బీఆర్ బసిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణం నుంచి ఎల్లెల్సీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వరినారుతో బైఠాయించి సాగునీరు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఈ మణికంఠకు అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రబీ సీజన్లో తుంగభద్ర గేట్ల మరమ్మతుల పేరుతో నీరివ్వకుండా అడ్డుకోవడంతో పంటలను కోల్పోయామన్నారు. ప్రస్తుతం టీబీ డ్యామ్లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. చాలా మంది రైతులు నారుమళ్లు పోసి నీటి విడుదల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయకట్టు ఎండుతున్నా పట్టించుకోరా? రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి రైతులతో కలసి ఎల్లెల్సీ కార్యాలయం ముట్టడి డ్యామ్లో నీరున్నా ఎందుకు ఇవ్వడం లేదు.. తుంగభద్ర డ్యామ్లో నీటి కోటా ఉన్నా ఖరీఫ్ సాగుకు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఎల్లెల్సీ రైతుల బాధలు పట్టవా అని ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ కేశన్న, సోగనూరు భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, బుట్టారంగయ్య, వెంకటేశ్వర్రెడ్డి, తిరుమల్రెడ్డి, మల్లికార్జున రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూర్, మాచాని వెంకటేష్, కోటేకల్ లక్ష్మన్న, రంగస్వామి, సునీల్ కుమార్, సావిత్రమ్మ, భాస్కర్, రాముడు నియోజకవర్గంలోని రైతులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎంతో చంద్రబాబు చీకటి ఒప్పందం!
నంద్యాల: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందం చేసుకున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీరును తెలంగాణ రాష్ట్రానికి మళ్లిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, సాగునీటి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని రిజర్వాయర్లు, కాల్వలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ఇప్పటికి 4 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నాయన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ 12.5 టీఎంసీల సామర్థ్యం కాగా 6 టీఎంసీల నీరే ఉందన్నారు. అవుకు రిజర్వాయర్ 4.5 టీఎంసీల సామర్థ్యం కాగా ఒక టీఎంసీ మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను జైళ్లకు పంపారు! ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఆన్న్లైన్ అప్లికేషన్లు పెట్టించడం, పంపిణీలో రాజకీయ రంగులు పులమడం సిగ్గుచేటన్నారు. మద్దతు ధర అడిగిన రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు వంటి అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రంగంలో ఉంటారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏ స్థానం ఏకగ్రీవం కానివ్వమని, ప్రతి స్థానానికి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ మార్కె ట్ యార్డు చైర్మన్ పురుషోత్త్తం రెడ్డి, వైఎస్సార్సీపీ డోన్ నియోజకవర్గం పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సాగు, తాగునీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమను కరువు నుంచి మహానేత కాపాడారని గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి ఈ ప్రాంతానికి తీవ్రద్రోహం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తోడుకుంటున్నా, ఏపీ ప్రభుత్వంవాటా నీటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందన్నారు. నంద్యాల మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉందని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణ తాగునీటి అవసరాలు, మిట్నాల చెరువు నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయకపోతే, రైతులను సమీకరించి స్వయంగా వెళ్లి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం
ఆశలు ఎండిపోయి..వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలను చివరకు జీవాలకు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది 38 వేల హెక్టార్లలో పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. 20 వేల హెక్టార్లలో అత్యధికంగా పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టి రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు చేసి కంది పంట సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా వర్షాలు రాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. – ఆలూరు రూరల్కురుకుంద గ్రామంలో పత్తిపంటను గొర్రెలను వదిలేసిన దృశ్యం బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అభిషేకం, మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేపట్టారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. శ్రీమఠంలో.. మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర వరలక్ష్మీ పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో పూజలు చేపట్టారు. పూజా మందిరంలో లక్ష్మి పూజ, మూల, జయ, దిగ్విజయ రాముల పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే గ్రామ దేవత మంచాలమ్మకు విశేషాలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు కానిచ్చారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. వి.గిరికుమార్రెడ్డి ప్యానల్ మాత్రమే పోటీకి దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్ష, కార్యదర్శులుగా వి.గిరికుమార్రెడ్డి, ఎం.వెంకటరాజులు ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా ట్రెజరర్ పునీత్, అబ్జర్వర్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్ వ్యవహరించారు. వి.గిరికుమార్రెడ్డి ప్యానల్ అన్ని స్థానాలకు పోటీకి దిగింది. అయితే జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి మాత్రమే జిల్లా అధ్యక్ష స్ధానానికి పోటీ చేశారు. ఆయన తిరిగి తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
నీ ఇల్లు బంగారం కానూ..
పిట్ట కొంచెం.. కూత ఘనం. కూతనే కాదు.. దాని నైపుణ్యం ముందు ఇంజినీర్లు సైతం చిన్నబోవాల్సిందే. గిజిగాడు తన గూడు పని తనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గడ్డి పరకలు, పుల్లలు సేకరించి, ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అళ్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లనే మించిపోతాయి. అలాంటి ఒక్క గూడును చూస్తేనే ఆహా అని మురిసిపోతుంటాం. అలాంటివి పదుల సంఖ్యలో ఒకే చోట కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. క్రిష్టిపాడు సమీపంలో కుందూనది ఒడ్డున చెట్లకు గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తికి సిద్ధం అవుతున్నాయి. – దొర్నిపాడు -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆస్పరి: ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రానికి వెళ్లే మలుపు దగ్గర శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆస్పరి సీఐ శ్రీనివాస్నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామతీర్థం క్షేత్రంలో వెలసిన గాయత్రీ మాత ఆలయంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజకు పత్తికొండ మండలం దేవనబండ గ్రామానికి చెందిన దామోదరమ్మ (75) వచ్చింది. పూజ ముగిసిన తరువాత స్వగ్రామానికి వెళ్లేందుకు మలుపు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’పై ఇంటెలిజెన్స్ ఆరా
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో టీడీపీ ముఖ్య నేత అనుచరుడి దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’ కథనంపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది. టీడీపీ ముఖ్య నేత అనుచరుడి పేరు, పార్టీలో తనకు ఉన్న పదవి, ముఖ్య నేత అప్పగించిన బాధ్యతలు ఏంటి.. అని ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన దేవస్థానంలో అధికారులను బెదిరించి తన కార్యకర్తలకు ఇప్పించిన ఉద్యోగాలు, ఏజెన్సీలు, ఇంజినీరింగ్ టెండర్లు, తలనీలాలు టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై తన కార్యకర్తలతో చేయించిన దాడి గురించిన పలు విషయాలను ఇంటలిజెనన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తలనీలాల కాంట్రాక్టర్లను రింగ్ చేసి కమిషన్ దండుకున్న విషయాలను సైతం రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నేత అనుచరుడు దేవస్థానంలో చేస్తున్న దందాపై ఇంటెలిజెన్స్ అధికారులు ఒక నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు పార్టీ అధిష్టానానికి సైతం పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులుశ్రీశైలం టెంపుల్: వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉచిత సామూహికవ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వీరికి కావలసిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. ప్రతి ఒక్కరికి వేర్వేరుగా కలశాలను నెలకొల్పారు. తొలుత మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై ఆశీనులను చేయించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా ఆవాహన చేశారు. శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమావిశేషాలను భక్తులకు తెలిపారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వక్షప్రసాదంగా తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీనును కూడా ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగంలో చేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుమతి దంపతులకు ముగ్గురు కుమారు లు. చివరి కుమారుడు ఎం. అశ్విత్(26) ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉండగా, రెండో కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కాకినాడకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అశ్విత్కు ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు అన్న బైక్ తీసుకుని గురువారం రాత్రి సొంతూరుకు బయలుదేరాడు. మార్గమధ్య లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద రాజస్థాన్ డాబా వద్ద ప్రమాదవశాత్తు హైవే రైలింగ్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించగా కోలుకోలేక అశ్విత్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు నమోదు చేశామన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసిన యువకుడు తీరా ఉద్యోగంలో చేరే సమయంలో మృతి చెందడం విషాదం. -
వేగంగా మారెమ్మ ఆలయ నిర్మాణం
● పుట్లూరులో రూ. 5 కోట్లతో కోవెల నిర్మాణంకృష్ణగిరి: రాజుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో శిల్పాలు మహా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిని పోలిన విధంగా మండలంలోని పుట్లూరు గ్రామంలో మారెమ్మ అమ్మవారికి నూతన దేవాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. రెండేళ్లుగా దాదాపు రూ.5 కోట్లతో ఆలయాన్ని అతి సుందరంగా నిర్మిస్తున్నారు. అమ్మవారికి వచ్చిన కానుకలతోపాటు, గ్రామస్తుల చందాలు, దాతల సహాయంతో వేగంగా పనులు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా భాద్రపద శుక్ల చతుర్ధశి మొదలు బహుళ చవితి వరకూ అమ్మవారికి బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలను తిలకించేందుకు రాయలసీమ జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. దేవాలయాన్ని మరో 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి నుంచి రాయిని తీసుకొచ్చి అక్కడే శిల్పులు సుందరంగా చెక్కి నిర్మిస్తున్నారని చెప్పారు. -
విద్యుత్ తీగల దొంగ అరెస్ట్
సి.బెళగల్: పొలాల్లో వ్యవసాయ విద్యుత్ బోరు మోటార్లు, తీగలను అపహరిస్తున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో దొంగను అరెస్ చూపుతూ, కేసు వివరాలను వెల్లడించారు. సి.బెళగల్, గూడూరు మండలాల్లో రైతుల వ్యవసాయ విద్యుత్ బోరు మోటర్లు, తీగలు చోరీకి గురైనట్లు పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు చేపట్టగా.. గుండ్రేవుల గ్రామానికి చెందిన పాలాక్షి రెడ్డి నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సి.బెళగల్ మోడల్ స్కూల్ దగ్గర అరెస్ట్ చేసి, రిమాండ్ పంపారు. నిందితుడి నుంచి దాదాపు రూ.1.30 లక్షల విలువ చేసే 600 మీటర్ల కాపర్ వైరు, మూడు విద్యుత్ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్కానిస్టేబుళ్లు ప్రసాద్, తిమ్మప్ప, క్రిష్ణగౌడ్, కానిస్టేబుళ్లు సత్యరాజు, శ్రీని వాసులు, సుధాకర్, జానకిరాముడును ఎస్ఐ అభినందించారు. గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ ● 82 గొర్రెలు మృత్యువాత తుగ్గలి: గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 82 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గిరిగెట్ల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గిరిగెట్ల గ్రామానికి చెందిన గొర్ల పక్కీరప్ప గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పక్కీరప్ప కుమారులు గొర్రెలు మేపుకుంటూ సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక డాబా వద్ద ఆదోని నుంచి గుత్తికి పశువులు తీసుకెళుతున్న ఆల్విన్ లారీ బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదవ శాత్తూ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 166 గొర్రెల్లో 82 మృత్యువాత పడగా..మరో 25కు పైగా తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధిత కాపరి వాపోయాడు. ప్రమాదస్థలాన్ని తుగ్గలి, జొన్నగిరి ఎస్ఐలు నరేష్, మల్లికార్జున పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్ఐ తెలిపారు. వాల్మీకి నగర్లో పోలీసుల సోదాలు ఆదోని: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్ ప్రాంతంలో డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆదోని వన్ టౌన్ సీఐ వెంకటరమణ, టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డితో పాటు టూ టౌన్, త్రీ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల ఎస్ఐలు, 25 మంది పోలీసులు వాల్మీకి నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని రౌడీషీటర్లు, అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో 10 లీటర్ల నాటు సారా లభించడంతో పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. శేఖర్పై ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే విధంగా వాల్మీకి నగర్ ప్రాంతంలో సుమారు 25 మోటార్ సైకిళ్లకు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేని వాటిపై జరిమానాలు విధించారు. కురువళ్లి చెరువు నిండేదెన్నడూ! ఆలూరు రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఒట్టిపోయాయి. నిండుకుండల్లా ఉండాల్సిన చెరువులు నేడు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. ఆలూరు మండలంలోని కురువళ్లి గ్రామ చెరువు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3 వందల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ చెరువు కింద రైతులు వరి, పత్తి తదితరులు పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులో చుక్కనీరు చేరలేదు. దీంతో బోర్ల ఎండిపోయాయని, చెరువు కింద పంట సాగు చేయకుండా పొలాలను బీడుగా వదిలేశామని రైతులు వాపోతున్నారు. -
శ్రీశైలంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో 1,500 మంది ముత్తైదువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మూడవ శుక్రవారం ప్రత్యేకంగా శివసేవకులకు, నాల్గవ శుక్రవారం 750 మంది చెంచు ముత్తైదువులకు, 750 మంది సాధారణ ముత్తైదువులకు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మ వారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, లడ్డూప్రసాదం, శ్రీశైలప్రభ, తులసి, ఉసిరి మొదలైన దేవతావృక్షాలను, కై లాస కంకణాలను అందజేస్తామని అన్నారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించి, ధార్మిక చింతనను పెంపొందించుటకు వ్రతాలు నిర్వహిస్తున్నామన్నారు. వీబీఆర్కు నిలిచిన ఇన్ఫ్లో వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)కు కృష్ణా జలాల ఇన్ఫ్లో నిలిచిపోయింది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి 4.624 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్లోకి ఎలాంటి నీటి ప్రవాహం లేదని తెలుగు గంగ అధికారులు తెలిపారు. టీజీపీ లింక్ కాలువ నుంచి కూడా ఇన్ఫ్లో నమోదు కాలేదు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఉంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్వే ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు. లోకో ఫైలెట్ సమయస్ఫూర్తి ● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు డోన్ రూరల్: డెమో రైలు లోకో ఫైలెట్ సమయస్ఫూర్తితో ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. గురువారం సాయంత్రం డోన్ నుంచి కర్నూలుకు గుంతకల్ డెమో రైలు బయలుదేరింది. అయితే స్థానిక రాముల దేవాలయం సమీపంలో రైలు పట్టాలపై మతిస్థిమితం లేని మహిళ (70) పడుకుని ఉండటంతో లోకో ఫైలెట్ దూరం నుంచి గమనించి రైలు నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో ఆమెను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. తన వివరాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేని స్థితిలో ఉంది. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన డెమో లోకో ఫైలెట్ను పలువురు అభినందించారు. స్వల్ప కాలిక పంటలు సాగు చేసుకోవాలి నంద్యాల(అర్బన్): వరి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా స్వల్ప కాలిక పంటలైన ఉలువలు, మినుములు, కొర్ర వంటి పంటలు సాగు చేసుకోవాలని ఆర్ఏఆర్ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ కవిత, డీడీఏ గంగాధర్రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం శిక్షణ, సందర్శన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో సాగు అవుతున్న పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే రైతులు లాభాలను గడించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ ఖాద్రి, పీరానాయక్, తదితరులు పాల్గొన్నారు. క్వింటా ఉల్లి రూ.3,749 కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర జోరుమీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలు కేవలం రెండు లాట్లు మాత్రమే వచ్చాయి. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక లాట్కు రూ.3,569, మరో లాట్కు రూ.3,749 ధర లభించడం విశేషం. -
ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత కల్పించాలి
నంద్యాల: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నెల తనిఖీల్లో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్ గోడౌన్లో గురువారం కలెక్టర్ రాజకుమారి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సీలింగ్, ఫైర్ సేఫ్టీ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథన్, ఎలక్షన్ డీటీ మనోహర్, నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురం
గోస్పాడు: ఎటువంటి కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురాన్ని గుర్తించినట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం సత్యనారాయణాపురంలో సద్భావన దివస్ ప్రాధాన్యత, మధ్యవర్తిత్వం 3.0 జాతీయ లోక్ అదాలత్పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రజలకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, వివాదాల నివారణ, వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, పరస్పర చర్చలు, రాజీ ద్వారా పరిష్కరించుకోవడం, అవసరమైనప్పుడు న్యాయ సేవలు పొందడం వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాన్ని కేసులు లేని గ్రామంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా వివాదాలకు దూరంగా, శాంతియుతంగా ఉండేలా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలచే సద్భావ ప్రతిజ్ఞను కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసాలను పక్కనబెట్టి హింసాత్మక మార్గాలను నిరాకరిస్తూ రాజ్యాంగ బద్ధమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ సుధాకర్రెడ్డి, షహనా, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయాలి
బనగానపల్లె రూరల్: అవుకు రిజర్వాయర్కు జీఎన్ఎస్ఎస్ ద్వారా కాకుండా ఎస్సార్బీసీ ద్వారా నీటిని విడుదల చేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్వగృహంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీ కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీటి విడుదల చేస్తే చిన్నచిన్న చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటాయన్నారు. అలాగే పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్ను నీటితో నింపడంతో ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. అవుకు రిజర్వాయర్ను నింపి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు విక్రయించేందుకే అని విమర్శించారు. హంద్రీనీవా, మల్యాల కాల్వలకు నీరు విడుదల చేస్తున్న అధికారులు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు అడ్డుకోవడం దారుణమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 35,315 క్యూసెక్కులు, ఏపీ 18,792 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారే కానీ.. రైతులకు సాగునీరు అందించలేకపోతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు స్పందించరు? ఎస్సార్బీసీకి నీటి విడుదలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేద ని మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా వారి లో చలనం కలగడం లేదన్నారు. రెండేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఒక్కొక్క ఎరువు బస్తాపై సుమారు రూ.1,500 వరకు ధర పెంచడం రైతులపై భారం మోపడమేనన్నారు. ధరలను నియంత్రించి, రైతులకు కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే పంపిణీ చేయాలని కాటసాని కోరారు. రైతుల పక్షాన పోరాటం.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీరు విడుదల చేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల నీటిని రైతుల అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలకు విక్రయించి లబ్ధిపొందాలనుకోవడం మంచిదికాదన్నారు. ఈ నీటిని దుర్వినియోగం చేస్తే రైతులతో కలిసి అవుకు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం కూడా చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, గడ్డం బాషా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు మళ్లించేందుకే జీఎన్ఎస్ఎస్ ద్వారా తరలింపు ప్రభుత్వం స్పందించకపోతే అవుకు ప్రాజెక్టును ముట్టడిస్తాం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
సీఎం చీకటి ఒప్పందంతోనే నీటి కష్టాలు
● కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి ● శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల రైతులతో కలిసి నంద్యాల పట్టణం పద్మావతినగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పా సమీక్ష నిర్వహించారు. తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై రైతుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్లో 857 అడుగుల మేర నీటి నిల్వలు ఉండి, 110 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, పశువుల తాగునీటి అవసరాలు తీర్చడానికై నా ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ఎడమ గట్టు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, శ్రీశైలం బ్యాక్ వాటర్ను దిగువ రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు నీటి సమస్య పొంచి ఉందని, ఈ పరిస్థితిలోనైనా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వెంటనే దృష్టి సారించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, సుజాతమ్మ, మహేశ్వరరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, సంజీవరెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం రైతు నాయకులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొబ్బరికాయల గోడౌన్ పక్కనే పూజా ద్రవ్యాల దుకాణం
● టెండర్ ప్రకటనలో పొరపాటు జరిగింది ● దేవస్థాన రెవెన్యూ విభాగ ఏఈఓ శ్రీనివాసరెడ్డి శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద ఉన్న కొబ్బరికాయల గోడౌన్ పక్కనే పూజాద్రవ్యములు, ఒత్తులు అమ్ముకునే షాపు ఉంటుందని శ్రీశైల దేవస్థాన రెవెన్యూ విభాగ సహయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టెండర్ నిబంధనలు భేఖారత్’ అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవస్థానం అధికారులు ఈ నెల 15వ తేదీన ఇచ్చిన దుకాణాల టెండర్ నోటీసు ప్రకటనలో చిన్నపాటి పొరపాటు జరిగిందని, అందులో దుకాణం నిర్వహించుకునే స్థలం ప్రచురితం కాలేదని, అంతేతప్పా ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ దుకాణం బహిరంగ వేలం, ఇ–టెండర్ నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలను ఇ–టెండర్లో పొందుపర్చామని, అలాగే ఆసక్తి కలిగిన వారు సంప్రదించేందుకు ముగ్గురు అధికారుల ఫోన్ నంబర్లు పొందుపర్చామని పేర్కొన్నారు. దుకాణాలు తొలగించి.. మళ్లీ అదే ప్రదేశంలో కేటాయింపు? శ్రీశైల క్షేత్ర అభివృద్ధి, రథోత్సవం తిలకించేందుకు భక్తులకు అసౌకర్యం లేకుండా రహదారుల విస్తరణ కోసం ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి లలితాంబా వాణిజ్య సముదాయంలో దుకాణాలు కేటాయించారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో సాలు మండపాలు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రదేశంలో దుకాణాలు కేటాయిస్తే ఎలా అని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా ప్రతి దుకాణంలోనూ నాణ్యమైన నూనె, పూజా ద్రవ్యములు, ఒత్తులు విక్రయించుకుంటున్నామని, గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా షాపు ఏర్పాటు చేస్తే లలితాంబా వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు భక్తులు ఎలా వస్తారని వాపోతున్నారు. టెండర్ నోటీసులో పొందుపర్చిన సైజు ప్రకారం గతంలో ప్రధానాలయానికి ఎదురుగా రెండు వైపులా ఉన్నవారికి కూడా దుకాణాలు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అర్ధరాత్రి అక్రమ రవాణా
● విజిలెన్స్ దాడుల్లో మూడు ఇసుక, రెండు మట్టి టిప్పర్ల పట్టివేతమంత్రాలయం: ఇసుకాసురులు హద్దులు దాటుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇసుక దందాను దర్జాగా నడుపుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 5 టిప్పర్లు పట్టుబడ్డాయి. వివరాలివి.. కౌతాళం మండలం గుడికంబాళి, నదిచాగిలో ఇసుక రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఇసుకను తెచ్చుకుంటారు. అయితే కొందరు స్వార్థపరులు రీచ్లపై పడ్డారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుకను గుట్టుగా తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి మైనింగ్ విజిలెన్స్ అధికారులు అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడికంబాళి నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లకు (ఏపీ 39 డబ్ల్యూక్యూ 6839, ఏపీ 39 డబ్ల్యూపీ 8439, ఏపీ 39 డబ్ల్యూఏ 8752) అనుమతులు లేవని గుర్తించి మాధవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అలాగే మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు మట్టి టిప్పర్లు పట్టేశారు. నందవరం మండలం గంగవరం నుంచి మట్టిని స్థానిక బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మిగనూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టి మాఫియా సాగిస్తున్నారు. పట్టుబడిన రెండు టిప్పర్లు (కేఏ 36 సీ 9316, ఏపీ 39 యూఎం 1187)ను మంత్రాలయం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
బొలెరో బోల్తా.. ఒకరి మృతి
● 13 మందికి గాయాలు శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం దిగువ భాగంలోని మలుపు వద్ద బుధవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సోముల నాయక్ (60) చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. 60 ఏళ్ల వయసున్న బిక్యా నాయక్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అచ్చంపేట తాలూకా బుడ్డా తండాకు చెందిన 14 మంది మత్స్యకారులు కూలి పనులకు దోర్నాల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అచ్చంపేటకు వెళుతుండగా డ్యాం వద్ద ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం డ్యాం సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేశారు. జీవాలకు మేతగా మొక్కజొన్న పంట చాగలమర్రి: ఎన్నో ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేయగా సరిగా మొలవకపోడం, పైరు ఎదుగుదల లేక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కౌలు రైతు బాధను దిగమింగుకొని జీవాలకు మేతగా వదిలేశాడు. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన దాదనగాళ్ల చాంద్ బాషా రూ.40 వేలు చెల్లించి రెండెకరాల పొలంను కౌలుకు తీసుకొని రూ.70 వేలు ఖర్చు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే వాతావరణ మార్పుల వల్లనో, నకిలీ విత్తనాల వల్లనో పంట సరిగ్గా మొలవలేదు. అలాగే పైరు ఎదుగుదల లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధను దిగమింగుకొని బుధవారం పంటను తొలగించే క్రమంలో మొక్కజొన్న పైరులో జీవాలను మేపడానికి వదిలేశాడు. నష్టాన్ని పూడ్చుకోవటానికి రెండెకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కౌలు రైతు చాంద్బాషా తెలిపారు. పంట నష్టపోయిన తనను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ● విద్యార్థికి తీవ్ర గాయాలుగుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్ అనే ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల పట్టణంలోని శ్యాం నగర్కు చెందిన మనోజ్ (26) గుత్తి మండలం సేవాఘడ్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత ఆరో తరగతి విద్యార్థి రిషిద్తో కలిసి బైక్లో గుత్తికి బయలుదేరారు. మార్గం మధ్యలో చెరువు కట్ట వద్ద గుంతకల్లు డిపో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన పీడీ మనోజ్ను స్థానికులు 108 అంబులెన్స్లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి రిషిద్ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మనో జ్ పీడీగా ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ శోకసంద్రంలో నెట్టింది. ఘటనపై సీఐ రామారావు విచారణ చేపట్టారు. ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి బనగానపల్లె రూరల్: పొలంలో ట్రాక్టర్తో సేద్యం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి హైదర్ సాహెబ్గారి ఆరీఫ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని చెరువుపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద అబ్బాస్ కుమారుడు ఆరీఫ్ గ్రామ సమీపంలోని తమ సొంత పొలంలో పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాడు. దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న ఆరీఫ్ కిందపడిపోగా.. ట్రాక్టర్ అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇవేనా నాణ్యమైన బ్యాగులు..లోకేశ్బాబూ!
పుట్లూరులో 20 రోజులకే చిరిగిన బ్యాగ్లుకృష్ణగిరి: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ బ్యాగ్లను చూస్తే అర్థమవుతోంది. పాఠశాలలు తెరిచిన రెండు నెలలకు బ్యాగ్లు ఇచ్చినా వాటిలో నాణ్యత లేదనే విషయం కేవలం 20 రోజుల్లోనే బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 రోజుల కింద స్కూల్ బ్యాగ్లు, షూలు, బెల్ట్ ఇచ్చారు. కొత్త బ్యాగ్లు అప్పుడే చిరిగి పనికి రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. మూడేళ్ల కిందట జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్లను నేటికీ పిల్లలు వాడుతున్నారని, అలాంటిది చంద్రన్న ఇచ్చిన బ్యాగులు 20 రోజులకే చిరిగిపోవడం చూస్తే ప్రభుత్వ విధానం అర్థమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. తమ ప్రభుత్వం విద్యార్థులను నాణ్యమైన కిట్లు అందిస్తోందని డప్పాలు చెప్పుకునే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. బుధవారం అమకతాడు, పుట్లూరు గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులతో అవస్థలు పడుతూ కనిపించారు. -
కంకర పరిచి వదిలేశారు!
కోడుమూరు రూరల్: కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం నత్తలతో పోటీ పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రూ.20 కోట్లతో ఎంతో ఆర్భాటంగా కోడుమూరు నుంచి వెల్దుర్తికి రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర కిందట చేపట్టింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే కోడుమూరు నుంచి వెల్దుర్తి, డోన్కు వెళ్లే వాహనదారులతో పాటు, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, అమడగుంట్ల వంటి సుమారు 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ఐదారు నెలల్లో పూర్తి చేయాల్సిన రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర గడిచినా 50 శాతం మేర కూడా ప్రభుత్వం పూర్తి చేయించలేకపోయింది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ కోడుమూరు నుంచి వెంకటగిరి వరకు రోడ్డుకిరువైపులా కంకర, గ్రావెల్ పరిచి వదిలేయగా, వెంకటగిరి నుంచి గోరంట్ల మధ్య కంకర పరిచి వదిలేయడంతో వాహనదారులంతా చిల్లబండ క్రాస్ రోడ్డు మీదుగా గోరంట్లకు చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి తమ ఇబ్బందులను తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏడాదిన్నరగా సాగుతున్న కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలు
చాగలమర్రి: జేబులో పెట్టుకున్న సెల్ఫోన్ పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన లక్కబోయిన హరి వారం రోజుల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ తాను విధులు నిర్వహిస్తున్న రాణిగంజ్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో లిఫ్ట్లో వెళ్తుండగా తాను ధరించిన ప్యాంటు జేబులో సెల్ఫోన్ నుంచి పొగలు వెలువడి కాలిపోతుండటంతో వెంటనే ఫోన్ను బయటకు తీసి పక్కకు విసిరేశాడు. క్షణాల్లోనే సెల్ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. సెల్ఫోన్ కాలుతుండగా అప్రమత్తమై దూరంగా విసిరేయడంతో గాయాలతో బయటపడ్డాడు. అతని ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. సెల్ఫోన్ బ్యాటరీలో ఉండే లిథియం–అయాన్లు అంతర్గతంగా విచ్చిన్నమై వేడి రసాయన చర్యను సృష్టించడం వల్ల పేలుడు సంభవించినట్లు నిపుణులు చెప్పారని బాధితుడు వెల్లడించారు. -
సౌర విద్యుదుత్పత్తికి రుణాలు ఇవ్వండి
● బ్యాంకర్లతో విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి సూర్యఘర్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తికి బ్యాంకులు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ కోరారు. బుధవారం కర్నూలులోని విద్యుత్ భవన్లో బ్యాంకు అధికారులు, సౌర విద్యుత్ వెండర్లతో నిర్వహించిన సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్డీఎం)తో కలసి పాల్గొన్నారు. ముందుగా సౌర వెండర్లు మాట్లాడుతూ రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్ వినియోగం ఎంతో కీలకమన్నారు. సౌర వెండర్లు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్డీఎం మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10వేల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన దరఖాస్తులను బ్యాంకులకు పంపామన్నారు. దరఖా స్తుల పరిశీలన, రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియ ను బ్యాంకులు వేగవంతం చేయాలని కోరారు. -
న్యాయవాదులు విధుల బహిష్కరణ
కర్నూలు: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసనను తెలియజేశారు. సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఈ గందరగోళాన్ని నివృత్తి చేసి ఆలస్యం చేయకుండా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో జరిగిన నిరసన ప్రదర్శనలో రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై.జయరాజుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రుడు, మహేశ్వర రెడ్డి తదితరులు నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చాలని, లేకపోతే రాయలసీమ ప్రాంతమంతటా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ న్యాయవాదులు శివరామయ్య, ఎల్లారెడ్డి, ఏఆర్ఎస్ రెడ్డి, సి.నాగేంద్రనాథ్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ.40 లక్షలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయలంలో బుధవారం హుండీలోని కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఈఓ రామకృష్ణ మాట్లాడుతూ హుండీలో నగదు రూ. 40.93 లక్షలు, 1. 20 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండిని భక్తులు బహూకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి నేటి వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్డ్రైవ్లో ఇద్దరికి జైలు డోన్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష, ఒకరికి రూ.10 వేలు జరిమానా విధించారు. విజయవాడలోని కుమ్మరిపాలెం వీధికి చెందిన జరకు రవి శేఖర్రెడ్డికి ఏడు రోజుల జైలు శిక్ష, డోన్ పాతపేటకు చెందిన ఎం శ్రీనివాసులుకు మూడు రోజులు జైలు శిక్ష, డోన్ చిగురుమానుపేటకు చెందిన జి అంజికు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం డోన్ స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్ సీఐ ఇంతీయాజ్ బాషా తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు ,జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): పర్యాటక, మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం అధికారి సునిల్కన్న తెలిపారు. స్థానిక పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్సులు ఉన్నాయన్నారు. బీఎస్సీ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్ పాస్ అయిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పాస్ అయిన విద్యార్థులు క్రాప్ట్ కోర్స్ ఇన్ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్, బేవరేజ్ సర్వీస్ కోర్స్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పై కోర్సులకు వయో పరిమితి లేదని, బాలబాలికలకు లోన్ సదుపాయంతో పాటు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 9701343846, 9700440604 నంబర్లను సంప్రదించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 29లోగా కాలేజీకి పంపాలన్నారు. కార్యక్రమంలో శివరామకృష్ణ, భార్గవి పాల్గొన్నారు. క్వింటా ఉల్లి రూ.3,813 కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లిగడ్డలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా మార్కెట్కి ఉల్లిగడ్డలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 75 శాతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెళ్తోంది. దీంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం కర్నూలు మార్కెట్కు కేవలం ముగ్గురు రైతులు 185 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. కనిష్ట ధర రూ.3,589, గరిష్ట ధర రూ.3,813 లభించగా.. సగటు ధర రూ.3803 నమోదైంది. వేరుశనగకు కర్నూలు మార్కెట్లో గరిష్టంగా రూ.9,270, ఆదోని మార్కెట్లో రూ.8,891, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.8,304 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్లో పత్తి ధర కాస్త తగ్గింది. మార్కెట్కు 678 క్వింటాళ్ల పత్తి రాగా.. కనిష్ట ధర రూ.4వేలు, గరిష్ట ధర రూ.9,929 లభించగా.. సగటు ధర రూ.9,570 నమోదైంది. కర్నూలు జిల్లాకు 1,078 పశువుల షెడ్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): వీబీ జీ రామ్ జీ నిధులతో 1,078 పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఉపాధి హామీ జాబ్కార్డుతో పాటు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేశారు. 2, 4, 6 పశువులకు షెడ్లు నిర్మించుకోవడానికి 90 శాతం వీబీ జీ రామ్ జీ నిధులు వినియోగిస్తారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి పశువులు ఉన్న రైతులను గుర్తించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు అప్పగిస్తామని జిల్లా పశసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. డ్వామా సాంకేతిక సహాయకులు, ఈసీలు ఎస్టిమేట్లు వేసి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్కు పంపుతారన్నారు. యూనిట్ కాస్ట్లో 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. 10 శాతం రైతులు భరించాల్సి ఉందన్నారు. -
అధికారుల ముందే ఆత్మహత్యాయత్నం
● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్ ఖాన్ను పరామర్శించిన కాటసానికల్లూరు/ఓర్వకల్లు: తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక అధికారుల ముందే చిన్న హజామ్ ఖాన్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఈయనకు సర్వే నంబర్ 339లో 2.50 ఎకరాల భూమిని కొన్నేళ్ల నుంచి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ భూమిలో 45 సెంట్లు ఆక్రమించుకున్నాడని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. అంతేగాక ఆ భూమికి కొలతలు వేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మండల సర్యేయర్, గ్రామ సర్వేయర్లు కొలతలు వేసేందుకు పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడే అధికారులకు, అజామ్ ఖాన్ మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అధికారుల ముందే అజామ్ఖాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా విధులకు ఆటంకం కల్గించిన అజామ్ ఖాన్పై అధికారుల బృందం ఓర్వకల్లు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రజలను వేధిస్తున్నారు టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి సామాన్య ప్రజలను వేధిస్తూ అధికార దుర్వినియోగానికి పాలపడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్ ఖాన్ను పరామర్శించి, బాధితుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అరకొర భూమితో జీవనం సాగిస్తున్న చిన్న హజామ్ ఖాన్కు రెవెన్యూ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. అతనికి ఏదైనా జరిగితే ఓర్వకల్లు తహసీల్దార్, సంబంధిత సర్వే అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పనిచేయాలని, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
ఎరువులు ఇవ్వరు.. తెచ్చుకుంటే వదలరు!
ఆళ్లగడ్డ: సమయానికి ఎరువులు ఇవ్వకపోగా ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తే అధికారులతో వేధించడం పరిపాటిగా మారింది. రుద్రవరం చిత్రేనిపల్లె గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి రైతులు పండించే నంద్యాల సోనా రకం బియ్యానికి డిమాండ్ ఉంది. పంట పండించేందుకు ప్రభుత్వం ఎరువుల్లో కనీసం పదిశాతం కూడా సరఫరా చేయలేదు. దీంతో అనేక మంది రైతులు ఏదో విధంగా బస్తాలు సమకూర్చుకుని వాటిని తమ ఇళ్లలో భద్ర పరుచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు తమను అడగకుండా ఎలా తెచ్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేయాలని వ్యవసాయాధికారులకు చెబుతున్నారు. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి రైతుల ఇళ్లపై వ్యవసాయ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎరువుల బస్తాలు అక్రమంగా ఉంచారని సీజ్ చేస్తున్నారు. అలాగే జరిమానాలు వేస్తున్నారు. టీడీపీ నాయకులతో రాజీ పడాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. పేదోళ్లపై ప్రతాపం పేద రైతులు తమ ఇళ్లలో పది ఎరువుల బస్తాలు నిల్వ చేసుకుంటే ఇవి ఎక్కడివి అని వ్యవసాయాధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల సంబంధించిన గోదాముల్లో వేలకు వేలు బస్తాలు నిల్వ చేసుకున్నా పట్టించుకోవడం లేదు. తాము దాచుకున్నది పొలానికి అవసరమైన ఎరువుల బస్తాలే కదా.. బెదిరింపులు ఎందుకని రైతులు అంటే ఇందులో తమ పాత్ర లేదని, టీడీపీ నాయకుల ప్రమేయమేనని అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు టీడీపీ నేతలతో రాజీ పడి రూ. 50 వేలు ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీకి మేలు జరిగేలా సామాన్య రైతులు అఽధికారులు వేధించడం మానుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు సీజ్ చేసిన ఎరువుల బస్తాలు పేద రైతుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు ఎరువుల బస్తాలు సీజ్ చేస్తూ బెదిరింపులు టీడీపీ నాయకుల మాట వినాలని ఒత్తిళ్లు -
జూడాల ఆందోళన ఉద్ధృతం
● కర్నూలులో జూనియర్ వైద్యుల బైక్ ర్యాలీకర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంపునకు జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. బుధవారం కూడా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ ఓపీ, ఐపీ సేవలతో పాటు అత్యవసర, ఐసీయూ వైద్యసేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. 10వ రోజుకు చేరుకున్న ఆందోళన ఫలితంగా ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం కంటే బుధవారం ఓపీ సంఖ్య మరింత తగ్గి 1500 లోపే నమోదైంది. ఇన్పేషెంట్ల సంఖ్య సైతం 500 పైగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు అత్యవసరం, సీరియస్గా ఉన్న రోగులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వార్డుల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని సైతం కాస్త కోలుకుంటే సమ్మె ముగిశాక రావాలని సూచించి డిశ్చార్జ్ చేస్తున్నారు. కాగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి నుంచి కొండారెడ్డి బురుజు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వైద్యలందరం రోడ్లపైకి వచ్చి మా ఆవేదనను శాంతియుతంగా వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. -
ఇక ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక!
● 31 ఏళ్ల తరువాత నిర్ణయం ● వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం కర్నూలు (టౌన్): ఉమ్మడి రాష్ట్రంలో 31 సంవత్సరాల క్రితం కర్నూలు కార్పొరేషన్లో మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిన నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇదే విధానాన్ని మళ్లీ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇద్దరు డిప్యూటీ మేయర్లకు గాను ఒక్కరికే అవకాశం కల్పిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. గతంలో కర్నూలు కార్పొరేషన్లో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం, 44 వార్డులు ఉండేవి. మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరు 2002లో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెరిగింది. స్టాంటన్ పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలను 2017లో విలీనం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 52కు చేరింది. పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్ ప్రాంతాలు కర్నూలు కార్పొరేషన్లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరోసారి వార్డుల సంఖ్యను 52 నుంచి 68కు పెంచింది. ఇదీ చరిత్ర ● కర్నూలు మున్సిపాల్టీని 1994లో కార్పొరేషన్గా అప్ గ్రేడ్ చేశారు. ● ఎన్నికలు 1995లో నిర్వహించగా ప్రత్యక్ష పద్ధతిన మేయర్గా బంగి అనంతయ్య ఎన్నికయ్యారు. ● వరుసగా ప్రత్యక్ష ఎన్నికల్లో 2000లో ఫిరోజ్ బేగ, 2005లో రఘరామిరెడ్డి ఎన్నికయ్యారు. ● 2010 నుంచి 2020 వరకు రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించలేదు. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2020న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను పరోక్ష పద్ధతిన ఎన్నుకున్నారు. ● కార్పొరేషన్లో 31 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష పద్ధతిన మేయర్ ఎన్నుకోవాలని నిర్ణయించారు. వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేపట్టింది. ‘సర్’ ప్రక్రియలో అభ్యంతరాలకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చింది. వచ్చే నెల 3వ తేదీ నాటికి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రెండు నుంచి నాలుగు వార్డులకు ఒక అధికారిని నియమించేందుకు జాబితా పంపించాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కమిషనర్లకు లేఖ రాసింది. తాజాగా ప్రభుత్వం మేయర్ల ఎన్నిక విషయంతో పాటు ఒక్కరికే డిప్యూటీ మేయర్కు అవకాశం కల్పించింది. అలాగే బీసీ రిజర్వేషన్లను 33 శాతం అమలు చేస్తామని ప్రకటిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉంటుంది. బరిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఉన్నాయి. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిపై అక్రమ కేసు
కర్నూలు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జిల్లా జైలులో ఉంచారు. ఆయనతో ములాఖత్ కావడానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 13న కర్నూలు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందంటూ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలు బళ్లారి చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారంటూ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 189(2), 126(2), 287, 125 రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా బొమ్మలసత్రం: నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలంటే నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నివారించాలని ఆదేశించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలు జరిగిన నిమిషాల్లో నేరస్తులను గుర్తించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, ఏఎస్పీ సుస్మిత, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, రామాంజినాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్మృతివనంలో ‘త్రీడీ’ నల్లమల దర్శనం ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామ శివారులోని వైఎస్సార్ స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సౌకర్యం ఒకటి కొత్తగా ప్రారంభించారు. త్రీడీ ఎఫెక్ట్తో ఉండే కళ్లజోడులో నల్లమల అడవిని చిత్రీకరించిన వీడియోలను ఉంచారు. ఈ కళ్లజోడు ధరిస్తే మనం స్వయంగా నల్లమల అడవుల్లో సంచరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇందుకోసం కేవలం రూ.50 మాత్రమే చార్జ్ చేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని ఆత్మకూరు అటవీ డివిజన్ డిడి విగ్నేష్ అపావ్ సోమవారం స్వయంగా పరిశీలించారు. ● వైద్య సిబ్బందిపై డీసీహెచ్ఎస్ ఆగ్రహం బేతంచెర్ల: ‘రోగుల బెడ్లు ఇలాగేనా ఉండేది.. మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా’ అంటూ వైద్య సిబ్బందిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతంచెర్లలోని శేషారెడ్డి సీహెచ్సీని మంగళవారం అమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్పత్రి అపరిశుభ్రంగా ఉండటం, రోగుల బెడ్లు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. క్యాజువాలిటీ, కాన్పుల వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అస్పత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల కోసం స్కానింగ్, ఎక్సేర్ పరీక్షలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో అస్పత్రిలో స్పష్టంగా రాసి ఉంచాలని సూచించారు. వైద్యులు వాణి స్వప్నప్రియ, వెంకటేశ్వర్లు, విజయా భాస్కర్ పాల్గొన్నారు. -
కేసుల రాజీపై దృష్టి పెట్టండి
కర్నూలు: రాజీపూర్వకంగా కేసుల పరిష్కారంపై న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి గణనీయ సంఖ్యలో కేసులను రాజీ ద్వారా పరిష్కరించే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మంగళవారం నందికొట్కూరు పరిధిలోని పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి దివ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణకు సన్నద్ధత
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: మున్సిపాలిటీల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, తాగునీటి సరఫరా , పరిశుభ్రతపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. జెడ్పీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని లలితాబాయి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలో వార్డులవారీగా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సెప్టెంబర్ 3న సంబంధిత కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, ప్రచురణ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై మందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. -
అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత విద్య అభ్యశించే విద్యార్థినులు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.30 వేలు మంజూరవుతుందన్నారు. ఈ స్కాలర్షి ప్ అర్హత పొందాలంటే విద్యార్థిని 10, 12వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ప్రైవేటు కళాశాలలో అయితే డిగ్రీ, డిప్లమా అభ్యసిస్తూ ఉండాలన్నారు. డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు తమ పరిధిలో ఉన్న డిగ్రీ, డిప్లమా, ఇంజినీరింగ్ కళాశాలల్లో డిగ్రీకి సమానమైన ఇతర కోర్స్లను అందించే విద్యాసంస్థలకు ఈ స్కాలర్షిప్పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. స్కాలర్షిప్నకు పోర్టల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు డోన్ రూరల్: డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష పడింది. పట్టణంలోని కొండపేటకు చెందిన బోయ సునీల్, విజయ్ కుమార్కు 8 రోజులు, చాకలి గోపాల్కు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. పీజీఆర్ఎస్కు 112 వినతులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 112 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. చట్టపరిధిలో ఉన్న అన్ని సమస్యలను ఆయా స్టేషన్ అధికారులు పరిష్కరించాలని, సమస్యలు తిరిగి పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సివిల్ తగాదాలు ఏవైనా ఉంటే బాధితులకు నచ్చజెప్పి కోర్టును ఆశ్రయించేలా చూడాలన్నారు. ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు నంద్యాల(న్యూటౌన్): స్కూల్ ఆఫ్ స్సోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 29న మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు ఉత్తమ పాఠశాలలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక అవుతాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో పాఠశాలలో సాధించిన ప్రదర్శన, అత్యున్నత విజయాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20వ తేదీన దరఖాస్తులకు చివరి తేదీ అని వివరించారు. -
బైక్పై నుంచి పడి మహిళ మృతి
నందికొట్కూరు: నేషనల్ హైవే – 340సీ లో బైక్పై వెళ్తూ పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాల వద్ద ప్రమాదవశాత్తు కింద పడి కృష్ణవేణి (39) అనే మహిళ మృతి చెందింది. ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎం.చెన్నయ్య తెలిపిన వివరాలు.. కృష్టవేణి దంపతులు నందికొట్కూరు పట్టణంలోని ట్యాంకు ఏరియాలో నివాసం ఉంటున్నారు. మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామానికి పని నిమిత్తం వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కృష్ణవేణి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తుండగానే ఆమె మృతి చెందింది. తల్లి మానవపాటి రాములమ్మ ఫిర్యాదు మేరకు భర్త శివమల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హెడ్ కానిస్టేబుల్ చెప్పారు. వివాహిత బలవన్మరణం నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్కు చెందిన బోయ శివకుమార్ భార్య రమాదేవి (ప్రియ) (20) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ మండలం కొన్నేరు గ్రామానికి చెందిన రమాదేవికి నందికొట్కూరుకు చెందిన శివకుమార్తో రెండున్నరేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని టౌన్ సీఐ అశోక్కుమార్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. మృతురాలికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు.ఇదిలాఉండగా తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారనే అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి నాగరాజు బోరున విలపించారు. చర్చి ఫాదర్ దుర్మరణం ● ప్రార్థనలు చేసేందుకు బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జూపాడుబంగ్లా: బైక్ను ట్రాక్టర్ ఢీకొనటంతో చర్చి ఫాదర్ మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలుకు చెందిన దాసరి శేషు(55) భాస్కరాపురం గ్రామంలోని ఏబీఎం చర్చి ఫాదర్గా పనిచేస్తున్నారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు ఫాదర్, అతని భార్య జ్యోతి భాస్కరాపురం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మసీదు సందులోంచి చర్చి వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన శివచెన్నయ్య కుమారుడు శివాజీ నంబర్ లేని స్వరాజ్ ట్రాక్టర్ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఫాదర్ బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంతో కింద పడిపోయిన ఫాదర్ దాసరి శేషుకు తల, ముక్కు, కాలికి తీవ్రగాయాలు కాగా అతని భార్య జ్యోతికి కుడి కాలికు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మధ్యాహ్నం చర్చి ఫాదర్ దాసరి శేషు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
గాలేరులో పెరుగుతున్న నీటి ప్రవాహం
పాణ్యం: గాలేరు నగరి సుజలస్రవంతి కాల్వలో నీటి ప్రవా హం పెరుగుతోంది. గోరుకల్లు నుంచి బ్యాక్ వాటర్ను తాగునీటి కోసం అవుకు జలాశయానికి తరలిస్తున్నారు. అయితే ఆదివారం గాలేరు గేట్లను తాకిన నీరు సోమవారం వెయ్యి క్యూసెక్కులకు పెరిగింది. బానకచెర్ల నుంచి ప్రస్తుతం ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు కాగా గోరుకల్లులో 5.50 టీఎంసీలు నిల్వ ఉండేలా చూస్తూ ఆపై వచ్చిన నీటిని యథావిధిగా గాలేరు కాల్వ ద్వారా అవుకు తరలిస్తున్నారు. అయితే ఎస్సార్బీసీ కాల్వ ద్వారా తరలించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
మార్చురీలో రాబందులు
కర్నూలు(హాస్పిటల్): అనాథ శవాలను రాబందులు పీక్కుతింటాయి. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు అక్కడి వైద్యులు, సిబ్బంది బాధిత కుటుంబసభ్యులను డబ్బు కోసం పీడిస్తున్నారు. చేతిలో పచ్చనోట్లు పడితేనే పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడిగిన మేర డబ్బులు ఇవ్వకపోతే కేసును ఎక్కడ వ్యతిరేకంగా రాస్తారోనని భయపడి డబ్బులు ఇచ్చి పనిచేయించుకుని వెళ్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజూ 18 నుంచి 20 మంది దాకా వివిధ కారణాలతో మరణిస్తుంటారు. ఇందులో నాలుగు నుంచి ఐదు దాకా మెడికో లీగల్ కేసులు ఉంటాయి. ఇలాంటి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మరణించినప్పటి నుంచే వసూళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణిస్తే, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు కింది స్థాయి సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.500 వసూలు చేస్తారు. ఆ తర్వాత పోలీసులు పంచనామా రాస్తారు. దీంట్లో కొందరు పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మృతుడి వివరాలు, జరిగిన ఘటన వంటివన్నీ అందులో పేర్కొంటూ ఒక నివేదిక తయారు చేస్తారు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ఒక రేటు, బాధిత కుటుంబీకులకు ఇబ్బంది లేకుండా రాస్తే మరొక రేటు ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పోస్టుమార్టం సామగ్రి తేవాలని సిబ్బంది రూ.1500 నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తారు. పోస్టుమార్టం జరుగుతుండగానే డాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుందని రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగిన పలు పోస్టుమార్టంల విషయంలోనూ ఇదే విధంగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు వీడియో, ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మార్చురీలో ఎవరైనా మృతుల కుటుంబీకుల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్ల పేరు చెప్పి కొందరు పోలీసులు వసూలు చేస్తున్నారని తెలిసింది. పోలీసులు వసూలు చేస్తే మేమేమీ చేయలేం. సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ డబ్బులివ్వందే పోస్టుమార్టం జరగదు మృతుల కుటుంబీకుల నుంచి బలవంతంగా వసూళ్లు -
భూ సేకరణ వేగవంతం చేయండి
డోన్: గుంటూరు – గుంతకల్ రైల్వే డబ్లింగ్, విద్యు ద్దీకరణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డివిజనల్ అధికారి నరసింహులును ఆదేశించారు. సోమవారం ఆమె డోన్ మండలం దొరపల్లె గ్రామం వద్ద భూసేకరణను పరిశీలించారు. గుంతకల్ రైల్వే మార్గంలో 47 కి.మీ మేర సేకరించిన భూముల వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భూసేకరణలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, రహదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఆనంద్, డోన్ తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు. -
హామీల అమలులో కూటమి విఫలం
నంద్యాల(న్యూటౌన్): ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలన్నారు. నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యే క ప్యాకేజీ కేటాయించాలని, ఇందుకు జిల్లా నేతలు గళం విప్పాలని కోరారు. కరోనా సందర్భంగా రద్దయిన రైళ్లను వెంటనే పునఃప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జిల్లాలో సీడ్హబ్ను ఏర్పాటు చేయాలని, అలగనూరు రిజర్వాయర్ను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ, పవర్గ్రిడ్, సోలార్ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్బాబు, రఘురామ్మూర్తి, భార్గవ్, భాస్కర్, రాముడు, నాగరాముడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. మోదీ అసమర్థ పాలనతో దేశంలో ఆర్థిక సంక్షోభం సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య -
ఐటీడీఆర్ పనుల పరిశీలన
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐటీడీఆర్) పనులను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి సోమవారం పరిశీలించారు. డోన్ మండలం కొత్తకోట గ్రామం వద్ద 10 ఎకరాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ భవనాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం 90 శాతం పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పనుల పురోగతిపై డాక్టర్ సుందర్రెడ్డి ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. పనులు నాణ్యతగా చేపట్టాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఏటా వందలాది మంది నిరుద్యోగులకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడమే కాక భారీ వాహనాలు నడిపే వారి కొరత దేశంలో తీరుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్అండ్బీ డీఈ మదనగోపాల్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాంత్రి కుమార్ ఉన్నారు. -
రైతు మెడపై వేలం కత్తి!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిల వసూలుకు రైతుల మెడపై వేలం కత్తి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే వందలాది మంది రైతుల స్థిరాస్తులను అమ్మకానికి పెట్టేందుకు డీసీసీబీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమం ద్వారా అధికారిక లెక్కల ప్రకారమే ఉమ్మడి జిల్లాలో 60వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు బకాయిలు చెల్లించలేదనే కారణంతో తనఖా పెట్టిన ఆస్తులను అమ్మకానికి పెట్టడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలను ముమ్మరం చేసింది. మొత్తం 139 మంది రైతుల స్థిరాస్తులను వేలం వేసేందుకు షెడ్యూలు ఖరారు చేయడం, వేలం పాటలో పాల్గొనాలని గ్రామాల్లో దండోర వేయడం, వేలం పాట వేదికలను ప్రకటించడం పట్ల గ్రామాల్లో కలకలం రేగుతోంది. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఈ సమయంలో ఆస్తుల వేలం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది వేలం ద్వారా విక్రయానికి చర్యలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది నుంచే డీసీసీబీ జప్తులు, ఆస్తుల స్వాధీనం, వేలం ద్వారా విక్రయానికి చర్యలను ముమ్మరం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో వరుస కరువులు వచ్చాయి. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వాన్ని కొనసాగించారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 139 మంది రైతులకు చెందిన స్థిరాస్తులను వేలం ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 నుంచి వేలం ద్వారా ఆస్తులను విక్రయించేందుకు ఇప్పటికే ఆయా గ్రామాల్లో టాంటాం వేయించడం గమనార్హం. ప్రస్తుతం జిల్లా సహకార కేంద్రబ్యాంకు శాఖల నుంచి దీర్ఘకాలిక రుణాలతో పాటు వివిధ పథకాల కింద పంపిణీ చేసిన రుణాలను రాబట్టుకునేందుకు వేలం అస్త్రాన్ని డీసీసీబీ ప్రయోగించింది. వేలం పాట నిర్వహించేందుకు బ్రాంచీ వారీగా సేల్ ఆఫీసర్ కూడా నియమితులయ్యారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు కృష్ణానగర్ శాఖ పరిధిలోనే 18 మంది రైతులకు చెందిన 95 ఎకరాల రైతుల భూములను వేలం ద్వారా విక్రయించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మరో 386 మంది రైతుల ఆస్తులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు దాఖలయ్యాయి. రూ.280 కోట్లకు చేరుతున్న నిరర్థక ఆస్తులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు నిరర్ధక ఆస్తులు కొండలా పెరగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.183 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి నిరర్థక ఆస్తులు రూ.280 కోట్లకు చేరడం గమనార్హం. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. లాబాల బాట పట్టించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంనష్టాల ఊబిలో చిక్కుకొన్న డీసీసీబీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీననమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం గమనార్హం. వేలంలో ఆస్తుల విక్రయానికి డీసీసీబీ చర్యలు ఈ నెలలోనే వేలంపాట.. గ్రామాల్లో దండోరా -
ప్రోటోకాల్ దర్శనాలు.. ఆన్లైన్లో కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ఇటీవల దేవస్థాన వెబ్సైట్లో ప్రోటోకాల్ మాడ్యూల్లో మార్పులు చేసి ఈ నెల 15వ తేదీ నుంచి ఆ మేరకు దర్శనాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ప్రోటోకాల్ మాడ్యూల్తో అవస్థలు తప్పడం లేదు. శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే వీవీఐపీ, వీఐపీలు, సిఫార్స్ లేఖలతో దర్శనాలకు వచ్చే వారు 48 గంటల ముందు లెటర్ పంపాలని దేవస్థానం సూచించింది. టీటీడీ తరహాలో ఆన్లైన్ ద్వారానే మల్లన్న స్పర్శదర్శనం టికెట్ల లింక్ భక్తుల మొబైల్కు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని, భక్తులే నేరుగా వారి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి, టికెట్లను ప్రింట్ తీసుకుని దర్శనానికి రావాలని దేవస్థానం సూచించింది. అయితే ప్రోటోకాల్ మాడ్యూల్ సరిగ్గా పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం 35 వీఐపీ లెటర్లు వస్తే అందులో 30 లేఖలకు పేమెంట్ అవ్వలేదని సమాచారం. అలాగే ఆదివారం 15 లేఖలను అప్లోడ్ చేస్తే అందులో ఒక్కటి మాత్రమే పేమెంట్ కాగా.. మిగిలిన 14 లేఖలకు పేమెంట్ మోడ్ రాలేదని సమాచారం. సోమవారం కూడా పలువురు వీఐపీల నుంచి వచ్చిన సిఫార్స్ లేఖలను వెబ్సైట్లో కాల్ సెంటర్ సిబ్బంది అప్లోడ్ చేసినప్పటికీ భక్తులకు టికెట్ల లింక్ వెళ్లకపోవడం గమనార్హం. లింక్ పోయిన వారికి పేమెంట్ మోడ్ రావడం లేదు. లింక్ పోయి, పేమెంట్మోడ్ వచ్చిన వారికి కూడా టికెట్లలో దర్శన తేదీ, దర్శన సమయం కనిపించడం లేదు. దీంతో వారికి గతంలో మాదిరిగానే కౌంటర్ల వద్దకు పిలిపించుకుని మాన్యువల్ టికెట్లను అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రోటోకాల్ మాడ్యూల్ను సిద్ధం చేసిన తరువాత భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, అలా కాకుండా భక్తులను ఇబ్బంది పెట్టడం తగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే గతంలో దేవస్థానానికి ఉచితంగా వెబ్సైట్ చేస్తామని ముందుకొచ్చిన 9 అండ్ 9 సాఫ్ట్వేర్ కంపెనీని తొలగించి.. గతంలో సాఫ్ట్వేర్ను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడిన ఏపీటీఎస్ టీఎంఎస్ సాఫ్ట్వేర్కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. పూర్తిగా సిద్ధం కాని ప్రోటోకాల్ మాడ్యూల్ భక్తులకు చేరని టికెట్ల లింక్, వెళ్లినా.. పేమెంట్లో జాప్యం టికెట్లపై కనిపించని దర్శన సమయం -
మహానేత విగ్రహంపై దుశ్చర్య
● కళ్లకు గంతలు కట్టి.. నల్లరంగు పూసి ● ఆళ్లగడ్డలో హైఅలర్ట్ ఆళ్లగడ్డ: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, విగ్రహం అంతా నల్లటి రంగు (కందెన) పూసి తమ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్న ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడగా సోమవారం తెల్లవారు జామున వాకింగ్కు వచ్చిన స్థానికులు కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహానేతను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. ఇది విగ్రహంపై జరిగిన దాడికాదని.. కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. విగ్రహానికి నల్లరంగు పూసినంత మాత్రన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ప్రతిష్ట ఏమాత్రం మసకబారదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణంపై సమగ్ర దర్యాపు జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి రిమాండ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, నల్ల రంగు పూసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఘటనపై వైఎస్సార్ సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనకు పాల్పడింది పట్టణ శివారులోని చింతకుంట గ్రామానికి చెందిన రమణారెడ్డిగా గుర్తించామన్నారు. నంద్యాలోని ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకుని నల్ల రంగు బాటిల్, ఒక సుత్తి, ఉలి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడు వీటిని అమేజాన్లో కొనుగోలు చేసినట్లు వెల్లడైందన్నారు. కేవలం విగ్రహ ధ్వంసమే కాకుండా రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల కు విఘాతం కలిగించే చర్యగా విచారణలో గుర్తించామన్నారు. విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగరాజారావు పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
ఈ ఏడాది ఇంతవరకు గ్రాంటు రాలేదు. ప్రతి పనికి చేతి నుంచి పెట్టుకో వాల్సి వస్తోంది. ఇప్పటికి చేతి నుంచి ఒక్కొ క్కరు రూ.3 వేల దాక పెట్టుకున్నారు. పాఠశాలకు వచ్చేది అంతా నిరుపేదలే. వారికి అన్ని ఉచితంగానే సమకూర్చాలి. నిధులు ఒక్క రూపాయి కూడా రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – రమణయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటిపోతోంది. ఇంత వరకు మెయింటెనెన్సు గ్రాంటు రూపాయి కూడా రాలేదు. గత రెండు విద్యా సంవత్సరాల్లో సైతం సగం నిధులు మాత్రమే ఇచ్చారు. అన్ని గ్రాండ్గా నిర్వహించాలని ఆదేశాలు ఇస్తారు వాటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. నిధులు లేకుండా ఎలా నిర్వహించాలి. ఇప్పటికై నా నిధులు వెంటనే విడుదల చేయాలి. – ఐజయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
వెలుగోడు: పట్టణంలోని సిద్ధబావి వీధికి చెందిన పరుచూరి సరస్వతి (50) అనారోగ్య సమస్యలతో విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బాలకృష్ణ సుమారు 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, సరస్వతికి పిల్లలు లేరని బంధువు కటకం ఎల్లా సుబ్బమ్మ సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న సరస్వతికి పది రోజులుగా రక్త విరేచనాలు అవుతున్నాయని, అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు. ఈ క్రమంలో వెలుగోడులోని రెడ్డిగారి వీధిలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కటకం ఎల్లసుబ్బమ్మ పోలీసులకు వెల్లడించారు. రైతు దుర్మరణం వెల్దుర్తి: మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రవి (40) సోమవారం ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ రవి తన సొంత పొలంలో బెండకాయ సాగు చేశాడు. పొలంలోని రింగు బావి నుంచి మోటారు సాయంతో సాగునీరందించేవాడు. బావిలో నీరు బాగానే ఉన్నా పైప్ ద్వారా పైకి రాకపోవడంతో మంగళవారం బావిలోని ఫుడ్బాల్కు చెత్త అడ్డుపడి ఉంటుందని భావించాడు. చెత్తను తొలగించేందుకు తాడు సాయంతో రింగుబావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. తాడు ఒక్కసారిగా తెగడంతో గోడరాయికి తగిలి బావిలో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే మరో తాడు సాయంతో బావిలోకి దిగి రవిని పైకి తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న రవిని 108 అంబులెన్స్లో స్థానిక సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికెన్ బిర్యానీలో నిషేధిత రంగులు కర్నూలు (హాస్పిటల్): నిషేధిత సింథటిక్ రంగులతో చికెన్ బిర్యానీ తయారు చేస్తుండడాన్ని ఆహార భద్రత అధికారులు గుర్తించారు. సోమవారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని హజ్మండ్ హబ్ అనే బిర్యానీ సెంటర్ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సతీష్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తనిఖీ చేశారు. అక్కడి ఫ్రిజ్లో ముందు రోజు తయారు చేసిన చికెన్ ఫ్రై నిల్వ ఉండటాన్ని గమనించి పారబోయించారు. చికెన్ పీసులపై నిషేధిత రంగులు వాడి ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సాగర్ అనే ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు. బిర్యానీ సెంటర్లో ఆహార పదార్థాలతో పాటు వంట గది సైతం అపరిశుభ్రంగా ఉందని, దీన్ని సరిచేసుకోవాలని బిర్యానీ సెంటర్ వారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగులు కలిపిన చికెన్ పీసులను శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. టెంకాయ కొట్టేందుకు సుంకం! మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో వసూళ్ల జాతర కొనసాగుతూనే ఉంది. టెంకాయ కొట్టేందుకు భక్తులు ప్రత్యేకంగా టికెట్లు తీసుకుంటున్నా కొట్టుడుకు మాత్రం మేటీలు సుంకం వసూలు చేస్తున్నారు. సోమవారం లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. స్వామికి జోడు టెంకాయలు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. టెంకాయ కొట్టేందుకు ఆలయం రూ.5 టికెట్ పెట్టింది. అయితే ఇవేమీ మేటీలు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ముక్కుపిండి టెంకాయకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. టెంకాయ కొట్టేందుకు డబ్బులు వసూలు చేయరాదని ఆలయ అధికారులు అక్కడే ఫ్లెక్సీలు పెట్టడం గమనార్హం. మేటీలకు ఇదేమీ పట్టడం లేదు. తమ దోపిడీని షరామామూలే అన్నట్లుగా మార్చుకున్నారు. తమ ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులను దోచుకుంటున్నారు. ఈ వసూళ్లు అధికారుల కళ్లెదుటే సాగిపోతున్నా నోరు మెదపని వైనం. అడగడుగునా వసూళ్లు ఉండటంతో భక్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేమి దోపిడీ అంటూ విస్తుపోతున్నారు. -
ఆశ్రిత జనపాల.. అశ్వత్థ బృందలోల
● ఉరుకుంద క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం ● వేకువ జామునే దర్శనాల కోసం క్యూ మంత్రాలయం: అశ్వత్థ వృక్షంలో లీనమై ఆశ్రిత జనపాలకుడిగా ఉరుకుంద నరసింహా ఈరన్న స్వామి వర్ధిల్లుతున్నారు. ఇష్టదైవాన్ని కొలిచేందుకు భక్తజనం పోటెత్తుతున్నారు. మొదటి సోమవారం రెండు లక్షల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఎంతో పవిత్రంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో క్షేత్రం శోభిల్లింది. దర్శన క్యూలైన్లు, స్నానపు ఘాట్లు, అన్నదాన సత్రం, ప్రసాద, తలనీలాల కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి. భక్తుల సందడితో క్షేత్ర వీధులు కనువిందు చేశాయి. విశేషంగా ఈరన్న పూజలు వేడుకల్లో భాగంగా ఈరన్న స్వామికి వేకువజామున సుప్రభాత సేవతో పూజోత్సవాలు ప్రారంభమయ్యాయి. పండితులు వేదపఠనం గావిస్తూ నిర్మల్య విసర్జన, జల, విశేష పంచామృతాభిషేకంతోపాటు పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కానిచ్చారు. నైవేద్య సమర్పణ, మహా మంగళహారతులు పట్టి పూజోత్సవాలు చేపట్టారు. పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శనాలకు నిరీక్షణ ఇలవేల్పును కొలిచేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు దర్శన క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు క్యూలైన్ల గేట్లు తెరవలేదు. దీంతో నిరీక్షణలో ఉన్న భక్తులు అసహనానికి లోనయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రాతఃకాలంలోనే దర్శనాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు ఉదయం 5 గంటలకు తలుపులు తెరవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాసేపు గేట్ల వద్ద తోపులాట చోటుచేసుకుంది. భక్తులు స్థానిక ఎల్లెల్సీ కాలువలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాలకు వెళ్లారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిపడా శౌచాలయాలు లేకపోవడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. కొందరు తాగునీటి ట్యాంకులతోనే స్నానాలు కానిచ్చారు. మరికొందరు ట్యాంకులపైకి ఎగబాకి స్నానాలు చేసిన దృశ్యాలు కనిపించాయి. -
సమాజ మార్పులో జర్నలిస్టుల పాత్ర కీలకం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యలు, లోపాలు, దాగిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం వెంకటరమణ కాలనీలోని కీర్తన అనాథ శరణాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నిర్వహించిన 70వ ఆవిర్భావ దినోత్సవానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఏపీయూడబ్ల్యూజే జెండాను సీనియర్ పాత్రికేయులు జీ.చంద్రశేఖర్ ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పరిధిలో ఉన్నవి తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ తరఫున సాధ్యమైనంత వరకు కృషి చేస్తామన్నారు. అనంతరం అనాథ శరణాలయం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, చిన్నారులకు తినిపించారు. అలాగే పిల్లలకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఇండియా జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, సీనియర్ జర్నలిస్ట్ జి.చంద్రశేఖర్, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి పాల్గొన్నారు. -
రూ. 25 లక్షలు దుర్వినియోగం?
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రూ.25 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ బండారం బయట పడుతుందని గతంలో ఇన్చార్జ్ ఈఓగా పని చేసిన ఓ అధికారిణి.. ఆమె స్థానంలో బదిలీపై ఈఓగా వచ్చిన సబియాకు నెల రోజులు గడిచినా పూర్తి బాధ్యతలు అప్పగించడం లేదు. గత నెల జూలై 13వ తేదీన సబియా ఈఓగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె డిజిటల్ కీ, లాగిన్ అప్పగించ లేదు. పూర్తి బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేస్తుండటంతో అనుమానాలు రెకెత్తుత్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచి వివిధ పన్నుల ద్వారా పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని చలానా కట్టి పంచాయతీ ఖాతాలో జమా చేయకుండా దుర్వినియోగం చేసినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడకుండా దాచి పెట్టేందుకు చార్జ్ అప్పగించడం లేదనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సబియా నాలుగు రోజుల క్రితం తనకు పూర్తి స్థాయి చార్జ్ అప్పగించాలని ప్రత్యేక అధికారి తాహెర్ హుస్సేన్కు వినతి పత్రం అందజేశారు. చాగలమర్రి పంచాయతీలో పన్ను వసూలు పక్కదారి ఈఓకు చార్జ్ అప్పగించని ఇన్చార్జ్ అధికారిణి అక్రమాలు వెలుగుచూడకుండా దాచిపెడుతున్న వైనం -
శ్రీగిరిపై శ్రావణమాస రద్దీ
● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిపై శ్రావణమాసోత్సవ రద్దీ నెలకొంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. శ్రావణమాస మొదటి ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు రద్దు చేశారు. కేవలం రాత్రి వేళలలో మాత్రమే స్పర్శదర్శనాలకు అవకాశం కల్పించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై దేవస్థాన ఈఓ పరిశీలించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకలలాడాయి. భారీగా ట్రాఫిక్ జామ్ శ్రీశైలం: వరుస సెలవు రోజులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక టోల్గేట్, నంది సర్కిల్, సాక్షి గణపతి, హాటకేశ్వరం, ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి సుమారు గంటపాటు వాహనదారులు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్, వన్టౌన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. -
పరిహారం అందక..
ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఎం.జాకీర్కు సొంత భూమి ఐదు ఎకరాలు ఉండగా... 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. టమాట, పత్తి, కంది వంటి పంటలు సాగు చేయగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్నీ దెబ్బతిన్నాయి. అప్పులు పెరిగిపోవడంతో 2024 అక్టోబరు 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను త్రీమెన్ కమిటీ నిర్ధారించింది. జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా.. వ్యవసాయ శాఖ కమిషనరేట్లో పెండింగ్లో ఉంది. ఈయనకు భార్య సుబాన్బీ, కుమార్తె సాదియా(13), కుమారుడు మస్తాన్వలి(8) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి తల్లి పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి. -
అప్పుల ఊబిలోకి..
దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి చెందిన రాగుల నాగేంద్ర కౌలుకు తీసుకున్న భూముల్లో పత్తి విత్తనోత్పత్తి చేపట్టారు. పంట చేతికి రాక తలకు మించిన అప్పులు చుట్టుముట్టాయి. అప్పుల బాధతో 2024 ఆగస్టు 4న ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య లక్ష్మిదేవి, కుమారుడు నాగశేషు, కూతురు యామిని ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో పిల్లల చదువులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు చొరవ తీసుకొని నాగశేషును పదో తరగతి చదివిస్తున్నారు. రెక్కల కష్టంతో రాగుల లక్ష్మిదేవి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వానికి దయ కలగలేదు. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. -
మల్లన్న సేవలో..
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆల యం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. పీఠాధిపతి భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల(అర్బన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 17వ తేదీ సోమ వారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నా రు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు. ఘనంగా బాలవీరాచారి శత జయంతి వేడుకలు ఆళ్లగడ్డ: తెలుగు నేలపై శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పిన ప్రసిద్ధ మహాశిల్పి దివంగత దురుగడ్డ బాలవీరాచారి శత జయంతి వేడుకలు ఆదివారం ఆళ్లగడ్డలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శారదా శిల్పకళా మందిరం ఆవరణలో జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి భారీగా శిల్ప కళాకారులు, కళాభిమానులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. శిల్ప కళకు తొలినాళ్లలో ఆయన చేసిన సేవ, కృషిని కొనియాడారు. ఆళ్లగడ్డ పేరును ప్రపంచ శిల్పకళా పటంలో నిలిపిన ఘనత బాలవీరాచారికే దక్కుతుందన్నారు. అనంతరం మహాశిల్పి దురుగడ్డ బాలవీరాచారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన జీవిత విశేషాలు, శిల్పకళా ప్రస్థానాన్ని వివరిస్తూ తెచ్చిన ఈ పుస్తకం నేటి తరం యువ శిల్పులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అన్నారు. గాలేరుకు నీటి విడుదల పాణ్యం: గోరుకల్లు జలాశయం నుంచి జీఎన్ఎస్ఎస్ (గాలేరునగరి సుజల స్రవంతి) కాల్వలకు అధికారులు ఆదివారం కాల్వకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఈఈ శివప్రసాద్ మాట్లాడుతూ అవుకు జలాశయానికి నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. గోరుకల్లు జలాశయంలో 5.5 టీఎంసీలు నిరునిల్వ ఉండగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 5 వేల క్యూసెక్కులు వస్తున్నట్లు తెలిపా రు. ఉదయం గేట్లు ఎత్తగా సాయంత్రానికి నీరు గేట్లును తాకినట్లు తెలిపారు. పై నుంచి వచ్చిన నీటిని దిగువకు పంపుతున్నట్లు తెలిపారు. నూర్బాషా విభాగం జిల్లా అధ్యక్షుడిగా దస్తగిరి కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దూదేకుల దస్తగిరి జిల్లా నూర్బాషా(దూదేకుల) విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడులైంది. అనుబంధ విభాగాల కమిటీలో చోటు కల్పించడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
బసవన్నా.. లేచి రంకె వేయన్నా!
కర్నూలు కల్చరల్: బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయ నిర్మాణం అద్భుతం. ఆలయ సందర్శనకు, యాగంటి బసవన్నను చూడడానికి మన రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి సైతం ప్రజలు వస్తుంటారు. సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఆలయం ఉంది. ఆలయంలో ఎలాంటి నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టాలన్నా, ఆలయ ఆవరణ చుట్టూ 300 మీటర్ల పరధిలో పనులు చేయాలన్నా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తప్పని పరిస్థితి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల ఆలయ పరిసర ప్రాంతంలో గదులు, నిత్యాన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర పనులు జరగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగానే వివిధ రకాలు పనులు చేపట్టామని దేవదాయశాఖ అఽధికారులు చెబుతున్నా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి, మంత్రి అండదండలతోనే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అధికార బలంతో నిబంధనలను తుంగలో తొక్కి పనులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పిటిషన్ వేసిన రైతులు యాగంటి దేవాలయంలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్, ఆలయ నిర్మాణంలో మార్పులు/ రెనోవేషన్ పనులు సంబంధిత అఽధికారుల అనుమతులు లేకుండా చేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పురాతన ఆలయ నిర్మాణంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఆలయంలో జరుగుతున్న నిర్మాణ, మార్పుల పనులను పరిశీలించాలని, అవసరమైన అనుమతులు లేకుండా పనులు చేయకుండా చేడాలని, ఏఎమ్ఏఎస్ఆర్ యాక్ట్, ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కింద ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు అదనంగా కేసు తుది నిర్ణయం వచ్చే వరకు గర్భగుడిలో నిర్మాణ పనులు చేయకూడదని, ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ చేయకూడదని మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆలయం అధికారులు తాము ఆలయాన్ని ధ్వంసం లేదా బ్లాస్టింగ్ చేయడం లేదని భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కొన్ని మార్పులు మాత్రమే చేశామని కోర్టుకు తెలిపారు. అయితే ఆ పనులకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు, ఆమోదాలు తీసుకున్నట్లు ఆధారాలు లేవని కోర్టు రికార్డుల్లో ఉంది. అలాగే అప్పటికే పనులన్నీ పూర్తయ్యాయని, ప్రస్తుతం జరగడం లేదని ఆలయం తరుపు అధికారులు తెలిపారు. యాగంటీశ్వరాలయం అభివృద్ధిలో భాగంగానే నిర్మాణ పనులు చేపడుతున్నాం. రెండింటికి మాత్రమే కోర్టు స్టేటస్కో ఉంది. అయినా పరిపాలన, టెక్నికల్ అనుమతులతోనే పనులు చేపట్టాం. త్వరలోనే నిత్యాన్నదానాన్ని ప్రారంభించనున్నాం. అందు కోసం రూ.1.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నాం. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నాం. – పాండురంగారెడ్డి, ఇన్చార్జ్ ఈఓ, యాగంటీశ్వరాలయం హైకోర్టు స్టేటస్కో ఉన్నప్పటికీ.. రైతుల పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆలయం అధికారుల వాదనను విన్న తరువాత మే 4న ఉన్న పరిస్థితినే (స్టేటస్ కో) తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి అక్కడ పనులు జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. హైకోర్టు స్టేటస్ కో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి నోటీస్లు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు రాత్రిపూట చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యాగంటీశ్వర ఆలయ ఆవరణలో అడ్డదిడ్డంగా నిర్మాణ పనులు ఆలయం ప్రాశస్త్యం దెబ్బతింటుందని పిటిషన్ వేసిన భక్తులు హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నా నిర్మాణ పనులు రాత్రిళ్లు సైతం కొనసాగుతున్న వైనం స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో -
మొలకెత్తిన మోసం!
దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అక్కల రవి భూములను కౌలుకు తీసుకొని పత్తి విత్తనోత్పత్తి చేపట్టాడు. పంట పండక మానసికంగా దెబ్బతిని 2024 డిసెంబరులో మృతి చెందాడు. తండ్రి మృతి, కొండలాగా ఉన్న అప్పుల బాధలు భరించలేక అక్కల రవి కుమారుడు కరుణాకర్ 2025 మార్చి 4న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలు తండ్రి, కుమారులను బలి తీసుకున్నాయి. ఒకవైపు భర్త, మరోవైపు చేతికి వచ్చిన కుమారుడు మరణించడంతో అక్కల రవి భార్య అక్కల రాణి ఒంటరిగా మిగిలిపోయారు. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం కలసిరాక.. అప్పుల తీర్చే మార్గం కనిపించక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరి కుటుంబాలు వీధిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 116 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవడంలో చేతులెత్తేసింది. రైతు ఆత్మహత్యలపై మండల స్థాయి అధికారులైన సబ్ ఇన్స్పెక్టర్, తహసీల్దారు, వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తూ ప్రాథమిక రిపోర్టులు పంపిస్తారు. దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపాలి. త్రీమెన్ కమిటీలో ఏడీఏ, ఆర్డీవో, డీఎస్పీలు ఉంటారు. త్రీమెన్ కమిటీ సైతం రైతులు ఆత్మహత్యలను ధ్రువీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనర్కు పంపుతున్నారు. ఈ నివేదికలన్నీ వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర మరుగున పడిపోతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 జూన్ తర్వాత 116 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క కుటుంబానికి కూడా పరిహారం చెల్లించలేదు. నాటి పరిస్థితులే నేడు ‘వ్యవసాయం ఎందుకు దండగ’ అంటూ ఒకప్పుడు చంద్రబాబు అన్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో 2014, 2019, 2024 ఎన్నికల్లో రైతు సంక్షేమం అంటూ కొత్తపల్లవి ఎంచుకున్నారు. అయినా 2014 నుంచి 2019 వరకు 321 రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరంపర 2024 జూన్ నుంచి మళ్లీ ఊపందుకుంది. అనావృష్టితో 2024–25లో, అతివృష్టితో 2025–26లో, ఎల్నీనోతో 2026–27లో వ్యవసాయం కలసి రాలేదు. చంద్రబాబు 26 నెలల పాలనలో కర్నూలు జిల్లాలో 64, నంద్యాల జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత వ్యవసాయం దండగ అనే మాట నిజం అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. పెండింగ్లో నివేదికలు కర్నూలు జిల్లాలో 32 మంది రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. మరో 15 మంది రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనరేట్లో పెండింగ్లో ఉండిపోయాయి. మిగిలిన 17 మంది రైతు ఆత్మహత్యలపై విచారణ మండల వ్యవసాయ అధికార, తహసీల్దారు, ఆర్డీవో దగ్గర పెండింగ్లో ఉంది. నంద్యాల జిల్లాలో 37 మంది రైతులకు పరిహారం అందించే నివేదికలు కమిషనరేట్లో పెండింగ్లో ఉండిపోయాయి. ఆర్డీవో దగ్గర ఒకటి, తహసీల్దార్ల దగ్గర 12 పెండింగ్లో ఉన్నాయి. రెండింటికి అర్హత ఉన్నా తిరస్కరించారు. చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ నేతల మాటల్లోనే రైతుల సంక్షేమం ఉంటుంది తప్ప చేతల్లో ఉండదనే విమర్శలు వస్తున్నాయి. మృతిచెందిన రైతుల భార్యలకు వితంతువు పింఛన్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు. పరిహారం..పరిహాసం! టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన కొన్ని కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించారు. మృతిచెందిన రైతుకు చెందిన నామిని, సంబంధిత తహసీల్దారుతో ప్రారంభించిన జాయింట్ ఖాతాలో పరిహారం జమ చేసేవారు. ఇందులో కొంత మొత్తం అప్పులకు చెల్లించాలని చెప్పేవారు. మిగిలిన మొ త్తం వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. జాయింట్ అకౌంటులో ఉండటంతో తహసీలార్లు దయ చూపాల్సి వచ్చేది. అప్పట్లో ఆత్మహత్యలకు పాల్పడిన 180 కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో భరోసాగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. మృతి చెందిన రైతు నామినీ బ్యాంకు ఖాతాకు నేరుగా పూర్తి పరిహారాన్ని జమ చేసింది. త్రీమెన్ కమిటీ రిపోర్టు అందిన నెల రోజుల్లోపే పరిహారం విడుదల అయ్యేది. ఇది రైతు కుటుంబాల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపింది. అంతేగాక ఉచిత పంటల బీమా అమలు చేసి ప్రతి ఏటా పరిహారం అందించింది. పంటలకు ధరలు పడిపోయిన పక్షంలో మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. దురదృష్టవశాత్తు బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు మూడు నెలల్లోపే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందేది. రుణమాఫీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తూతూమంత్రంగా చేశారు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారు. రైతు సంక్షేమం అంటూ 2019 ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పినప్పటికీ చంద్రబాబును నమ్మలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తామని 2024 ఎన్నికల్లో ప్రకటించి మోసం చేశారు. కర్నూలు జిల్లాలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, ఉల్లి, మిర్చి, నంద్యాల జిల్లాలో వరి, మినుము, మొక్కజొన్న, పత్తి విత్తనోత్పత్తి, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. అరకొర వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరతోనైన అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అదీ గాక పంటల బీమా జాడే లేకుండా పోయింది. మోసం మొలకెత్తడం, అప్పులు కొండలా కనిపించడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అక్కల రాణి -
క్రికెట్ టోర్నమెంట్ విజేతకు బహుమతులు ప్రదానం
కర్నూలు: జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన నంద్యాల జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ జట్టు సభ్యులు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగులకు జిల్లాస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో నంద్యాల జ్యుడీషియల్ టీమ్ కెప్టెన్ జి.మురళికృష్ణ, జట్టు సభ్యులు గిరిధర్, శీత్యా నాయక్, నరేష్, తాజ రాలి, శివ, గోపాల్, పృథ్వీరాజ్, రాహుల్, దేవేంద్ర, ఖలీల్, ప్రశాంత్ తదితరులు శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా జడ్జి చేతుల మీదుగా ప్రథమ బహుమతిని అందుకున్నారు. -
పెళ్లి వద్దని చెప్పడంతో..
పత్తికొండ రూరల్: ‘ఈ ఏడాది పంటలు సరిగా లేవు, పెళ్లి చేసే వయస్సు కూడా కాదు’ అని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .. పందికోన గ్రామానికి చెందిన సంజప్ప కుమారుడు నరసింహుడు (18) ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయాలని కోరగా తల్లిదండ్రులు ఇప్పుడే వద్దనడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి జూపాడుబంగ్లా: నేషనల్ హైవే 340సీపై మండ్లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పారుమంచాల గ్రామానికి చెందిన సామేలు(45) ఉదయం ఆటోలో నందికొట్కూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో మండ్లెం గ్రామం నుంచి తర్తూరు అంచెవద్ద హైవే 340సీ రోడ్డును క్రాస్ చేస్తుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆటో డ్రైవర్ సామేలు కిందపడటంతో అతని తలకు తీవ్ర గాయం కావడంతో 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే లోపు మృతి చెందాడు. కారులో ఉన్న వారు తృటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు (టౌన్): నరసరావుపేటలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 7వ మాస్టర్స్ అంతర్ జిల్లాల అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో కర్నూలు మాస్టర్ స్విమ్మర్లు పతకాలు సాధించారు. మాస్టర్ స్విమ్మర్ గఫూర్మియ్యా 65–69 సంవత్సరాల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ అలాగే 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు బట్టర్ ఫ్లై విభాగంలో 5 బంగారు మెడల్స్ సాధించారు. 60 నుంచి 64 సంవత్సరాల వయస్సులో రమణారెడ్డి 400 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో బంగారు. 100 మీటర్ల ఫుల్ స్టైల్లో వెండి, 200 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో కాంస్యం, 50 మీటర్లు, 100 మీటర్లు బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో కాంస్యం, అలాగే 35 నుంచి 39 సంవత్సరాల విభాగంలో పి.నాగర్జున 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో బంగారు, 100 మీటర్లు, 200 మీటర్లు ఫ్రీ స్టైల్లో వెండి, 50 మీటర్లు, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన మాస్టర్స్ స్విమ్మర్లను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, డీఎస్ఏ స్విమ్మింగ్ కోచ్ నటరాజరావు, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహా ఆచారి, రామకృష్ణ యాదవ్ అభినందించారు. -
ఎకై ్సజ్ అధికారులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ఎకై ్సజ్ డైరెక్టర్ చేతుల మీదుగా మంగళగిరిలో రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంటున్న జిల్లా అధికారులుకర్నూలు: జిల్లా ఎకై ్సజ్ శాఖలో నవోదయం 2.0 అమలు, ఆదాయ పెంపు, నేర నిరోధం వంటి కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించినందుకు గాను ఆ శాఖ జిల్లా అధికారులకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో శనివారం అధికారులు అవార్డులను అందుకున్నారు. కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ప్రొహిబిషన్ కర్నూలు జిల్లా అధికారి ఎన్.సుధీర్ బాబు మొదటి ప్రాధాన్యత కింద ఆ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డిలు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అలాగే సీఐలు సువర్ణ లత, చంద్రహాస్, జాన్సైదులు, లలితాదేవి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కిషోర్కుమార్ తదితరులు కూడా డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
తప్పుడు కేసులకు బెదిరేది లేదు
● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరు సుభాష్ చంద్రబోస్ కర్నూలు (టౌన్): కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు బెదిరేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అధికార మదంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై , కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం పిరికి పంద చర్య అన్నారు. అక్రమ కేసులతో ప్రజా గళాన్ని అణిచి వేయలేరన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాశ్వతం కాదని, చట్టాలను గౌరవించి పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఎటువంటి నిరసనలు చేసినా పోలీసులు కేసు పెట్టడం లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. కర్నూలుకు తలమానికమయిన కొండారెడ్డి బురుజు పైకి వందలాది మంది ఉపాధ్యాయులు కూటమి నేతల ఫ్లెక్సీలతో నిరసనలు చేస్తే వారిపైన పోలీసులు ఎందుకు కేసులు పెట్ట లేదని ప్రశ్నించారు. అదే కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి ఉంటే తమపై వెంటనే కేసులు పెట్టేవారన్నారు. ప్రజా వ్యతిరేక పాలనలో కక్ష సాదింపులు, వేధింపులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అజెండాగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మంత్రాలయంలో చోరీ మంత్రాలయం రూరల్: మండల కేంద్రం మంత్రాలయం రామచంద్రనగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. హెడ్కానిస్టేబుల్ మురళీధర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రనగర్లో నివసించే సి. వెంకటేష్కు నెలరోజుల నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమారుడు అనిల్ సైతం ఈనెల 8న ఇంటికి తాళం వేసి తండ్రి వద్దకెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి ల్యాప్ట్యాప్ ,ఒన్ప్లస్ టీవీ, 20 తులాల వెండి పట్టీలు, 10,000 నగదు, బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈనెల 15న ఇంటికి రాగా తాళం చెవి తెరిచి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఆకట్టుకున్న శకటాలు
స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా అభివృద్ధిని ప్రతిబింభించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, మున్సిపల్ శాఖల శకటాలకు మొదటి బహుమతి లభించింది. రవాణా శాఖ, శ్రీశైలం దేవస్థానం శకటాలకు రెండో బహుమతి, ఉద్యానవన సూక్ష్మ నీటి సాగు శాఖ, శక్తి టీంలకు మూడో బహుమతి వచ్చింది. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.నృత్యం చేస్తున్న గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఫరూక్ నంద్యాల(అర్బన్): రేనాటి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడియాడిన నేలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావును స్మరించుకుంటూ.. పెండేకంటి వెంకటసుబ్బయ్య, బీవీ సుబ్బారెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, నంద్యాల కాదర్బాద్ నర్సింగరావు, యాళ్లూరి స్వామిరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, గామాగో ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునిల్షెరాన్, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, డీఆర్ఓ రామునాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ సమన్వయంగా పనిచేసి అభివృద్ధిలో నంద్యాల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు అంకితం కావాలన్నారు. తాగునీటి అవసరాలకే శ్రీశైలం నీరు శ్రీశైలం నుంచి వచ్చే నీటిని సాగుకు కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. జిల్లాలో 293 గ్రామాల్లో రీ సర్వే, 233 గ్రామాలకు సంబంధించి 1.35 లక్షల పాసు పుస్తకాల ముద్రణ పూర్తయిందన్నారు. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. నంద్యాలలో వైభవంగా పంద్రాగస్టు వేడుకలు జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ హాజరైన కలెక్టర్, జేసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు -
కళ్లెదుటే నీళ్లున్నా.. కన్నీళ్లే!
● ఎండిపోతున్న పత్తి, కంది ● ఒక తడి ఇవ్వాలంటున్న రైతులు జూపాడుబంగ్లా: కేసీ కాల్వలో నీరు ప్రవహిస్తున్నా పంటలకు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే మొక్కజొన్న పంటను దున్నేసిన రైతులు పత్తి చేతికొస్తుందని ఆశించారు. మల్యాల ఎత్తిపోతల నుంచి ఓ మోటారు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు వదులుతున్నాయి. అయితే పంట కాలువలకు ఇవ్వడం లేదు. తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే ఇస్తామని అధికారులు పేర్కొంటూ రైతుల ఆశలపై నీళ్లుచల్లారు. కళ్లెదుటే కాల్వలో నీళ్లుపారుతున్నా పంటలను కాపాడుకోలేకపోతున్నామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 25,430 ఎకరాల్లో సాగు కేసీ కాల్వ ఆయకట్టు కింద నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండిఆత్మకూరు మండలాల పరిధిలో 25,430 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మినుము, సోయాబీన్, కంది తదితర పంటలను సాగుచేశారు. పంటలు సాగుచేసి 50 రోజులు అవుతోంది. ఎదుగుదల లోపించడంతో 15,243 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్, మినుము పంటలను రైతులు దున్నేవారు. ప్రస్తుతం పత్తి, కంది పంటలు మాత్రమే కొన ఊపిరితో ఉన్నాయి. వాటికి ప్రస్తుతం ఓ తడినీరు ఇస్తే ఎకరాకు కొంత దిగుబడి అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య కర్నూలు(టౌన్): మాది బీసీల పార్టీ, అన్ని ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంకెంత కాలం మోసం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కర్నూలు నగర మాజీ మేయర్ బి.వై.రామయ్య ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిందని, బీసీ రిజర్వేషన్ల పేరుతో రిటైర్డు ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో వేసిన డెడికేషన్ కమిటీ వల్ల కాలయాపన తప్ప ఒరిగిందేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. శనివారం ఆయన స్థానిక మాజీ మేయర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచాయతీ యాక్టు– 176 ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారిని బ్యాక్వర్డు క్లాస్గా కాకుండా బ్యాక్బోన్గా రాజకీయ పదవుల్లో ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారన్నారు. ఓసీలకు కేటాయించిన ప్రాంతాల్లోనూ బీసీలకు సీట్లిచ్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు. శ్రీకాకుళం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నుంచి కర్నూలులో అలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వరకు అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారన్నారు. చంద్రబాబుకు బీసీలంటే పడదన్నారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కలిసికట్టుగా సత్తా చాటుతారని స్పష్టం చేశారు. -
ఎల్లెల్సీలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట
● టీబీ డ్యాంలో నీరున్నా జిల్లా రైతులకు తొలగని కష్టాలు హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) 155 కి.మీ వద్ద ఇసుక బస్తాలతో శుక్రవారం అడ్డుకట్ట వేయడంతో శనివారం హొళగుంద సెక్షన్లో నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆంధ్ర కాలువ 250 కి.మీ వద్ద నీటి ప్రవాహం జీరో క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో కాలువలో నీరులేక బోసిపోతుండగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 92 టీఎంసీల మేర నీరుండి కర్ణాటక కోటా కింద 650 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఆంధ్రా వారి నీటిని తీసుకెళితే తమవాటా కూడా ముందుకు వదులుతామని కాలువలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఇరిగేషన్ అధికారులు ఇండెంట్ ఇవ్వకపోవడంతో కేవలం కర్ణాటక నీరు మాత్రమే కాలువలో ప్రవహిస్తున్నాయి. కాలువలో ఆంధ్ర కోటా నీరు కూడా చేరితే పూర్తిస్థాయిలో నీరు పారుతూ వరి, ఇతర పంటలను సాగు చేసు కోవచ్చని కర్ణాటక రైతులు భావించారు. తక్కువ నీరు పారుతుండడంతో ఏపీ తీరు ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు చేరుతున్నా తాము పంటల సాగుకు నోచుకోలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కాలువలో వచ్చే నీరు కూడా ఆగిపోవడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందోనని తీవ్ర ఇందోళనకు గురవుతున్నారు. దీనిపై పాలకులు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాంలో 92.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు ఇండియన్ పోలీస్ మెడల్
డోన్: నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు జాతీయ స్థాయిలో ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)ను కేంద్రం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో జరిగిన వేడకల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీనివాసులుకు మెడల్ను ప్రదానం చేశారు. డీఎస్పీ ఐపీఎంకు ఎంపిక కావడంపై ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, వైఎస్సార్సీపీ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గోరుకల్లులో 4 టీఎంసీల నీరు పాణ్యం: గోరుకల్లు జలాశయంలో 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి శనివారం ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు ఉందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. సాంబగల్లులో చిరుత సంచారం ఆదోని: మండలంలోని సాంబగల్లు గ్రామంలో చిరుత సంచారం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రైతులు ఉదయం పొలాల పనులకు వెళ్లిన సమయంలో చిరుతను చూసి గ్రామంలో తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ సైఫుల్లాను వివరణ కోరగా... ఈ విషయం తమదృష్టికి రాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలుడి ప్రాణం తీసిన విద్యుదాఘాతం ఆలూరు రూరల్: విద్యుదాఘాతంతో మల్లికార్జున (12) అనే బాలుడు మృతి చెందాడు. మనేకుర్తి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ ఈరన్న ఇంటి ముందు ఉన్న మహేంద్ర ఇంట్లో పెళ్లి వేడుకల కోసం ఇనుప పైపులకు విద్యుత్ లైట్లతో డెకరేషన్ చేశారు. బాలుడు మల్లికార్జున షామియానా పైపులను అనుకోవడంతో విద్యుత్ షాకై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్న, సరస్వతి దంపతుల మొదటి కుమారు మల్లికార్జున కమ్మరచేడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గంజాయి మత్తులో పట్టుబడిన యువకులు రీహాబిటేషన్ సెంటర్కు తరలింపు ఎమ్మిగనూరురూరల్: గంజాయి సేవించి పట్టుబడిన యువకులను విశాఖపట్టణంలోని రీహా బిటేషన్ సెంటర్కు పంపినట్లు పట్టణ సీఐ కంబగిరి రాముడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో గంజాయిని అరికట్టడంతో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులను కిట్ ద్వారా పరీక్షించగా గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో విశాఖపట్న ంలోని గ్రీన్ వ్యాలూ ఫౌండేసన్ ( రీహాబిటేషన్ సెంటర్) పునరావాస కేంద్రానికి పంపామన్నారు. మీ ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలిస్తే టౌన్ సీఐ–91211 01147, టౌన్ ఎస్ఐ–91211 01145 నెంబర్లకు తెలియజేయాన్నారు. హెబ్బటంలో మొసలి కలకలం హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామ సమీపంలో మొసలి సంచారం కలకల రేపింది. గ్రామం పక్కన ఉన్న మంచి నీటీ పథకం పరిసరాలో శుక్రవారం మొసలి సంచరించినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. ఎల్లెల్సీ నుంచి మంచినీటి పథకానికి నీటి సరఫరా జరిగే పంప్ హౌస్ వద్ద మొసలిని కనుగొన్నట్లు చెప్పారు. ఇటీవల కాలువకు నీటి సరఫర జరిగిన సమయంలో కొట్టుకొచ్చిన మొసలి మంచినీటి పథకం వద్ద చేరిఉంటుందని చెబుతున్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని చేస్తున్న హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంబందిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
చాలా బాధగా ఉంది
వర్షాల్లేక ఇప్పటికే 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దున్నేశా. మూడు ఎకరాల్లో పత్తికి సాగునీరు లేదు. కళ్లెదుటే కేసీ కాల్వలో నీరుపారుతున్నా పంట ఎండిపోవడం చాలా బాధగా ఉంది. తడి నీరివ్వాలని ఏఈని అడిగితే పైనున్న సారోళ్లు అనుమతివ్వాలంటున్నారు. – రవికుమార్ యాదవ్, రైతు నాకున్న ఎకరా పొలంలో పత్తిపంటను సాగుచేశాను. పంటసాగుచేసినప్పటి నుంచి వర్షాల్లేక పంట ఎదుగుదలలేక కేవలం రెండు, మూడు అడుగుల ఎత్తుపెరిగి పూత, పిందవచ్చాయి. చివరిదశలో ఉన్న పంటకు నీళ్లుపెట్టుకొని కాపాడుకొందామంటే సారొళ్లు కాల్వలకు నీరివ్వటం లేదు. – రామకృష్ణ, రైతు కేసీ కాల్వకు వదులుతున్న నీరు తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే. కాల్వ వెంట ఉన్న తూములను అన్నింటినీ పూర్తిగా బంద్చేసి దిగువకు తరలిస్తున్నాం. ఉన్నతాధికారులు అనుతిస్తేనే రైతులు పంటలకు నీటిని పారించుకొనేందుకు అనుమతిస్తాం. – శ్రీనివాసనాయక్, ఏఈ, -
వ్యవసాయ యంత్రం.. లాటరీ తంత్రం!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై పొలాల్లో పంటలు ఎండిపోయి.. రెండోసారి విత్తనం వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత యంత్ర పరికరాలు పంపిణీ చేస్తామని ప్రకటిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించి అర్హుల జాబితా ఇన్చార్జ్ మంత్రి టేబుల్పైకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఆర్థిక (2025–26) సంవత్సరం చివరిలో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు ‘లాటరీ’ ద్వారా ఇస్తామని ఇవ్వలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో మార్కెట్ కంటే రెట్టింపు ధరలతో యంత్రపరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఇవ్వరో, టీడీపీ కార్యకర్తలకు కట్టబెడతారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ మరింత ‘నిమ్మల’ం! ఈ ఆర్థిక సంవత్సరం రైతులకు వ్యక్తిగతంగా హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, విత్తనం గొర్రులు, ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రాక్టర్ ట్రాలీస్ తదితర వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.9.41 కోట్లతో వ్యక్తిగత వ్యవసాయ యంత్రపరికరాలు పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.89.41 కోట్ల విలువ కలిగిన 7,849 యంత్ర పరికరాల కోసం రైతుల ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి అయి నాలుగైదు నెలలు కాగా.. పలు సార్లు షెడ్యూలులో మార్పు చేశారు. రైతుల జాబితాలను జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడుకు పంపారు. రైతుల ఎంపికలో లాటరీ విధానం అమలు చేయకుండా మంత్రికి పంపడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. టీడీపీ కార్యకర్తలకు యంత్ర పరికరాలు అప్పగించేందుకే ఇలా చేశారని తెస్తోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జాబితాలకు ఆమోదం తెలిపిన తర్వాతనే పంపిణీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు ఏవీ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల వారీగా కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా 2026–27 నుంచి కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా లో రూ.13.30 కోట్ల సబ్సిడీతో సీహెచ్సీ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్బీకే స్థాయి లో రూ.10 లక్షలు, సబ్ డివిజన్ స్థాయిలో రూ.30 లక్షలతో సీహెచ్సీలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే దీనిపై అతీగతీ లేకుండా పోయింది. కాగితాలపై ఆదేశాలు ఇవ్వడం. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, తదుపరి ఎలాంటి చర్యలు లేకపోవడం షరా మామూలుగా మారింది. ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు అందని పరికరాలు ప్రస్తుతం అర్హుల జాబితా జిల్లా ఇన్చార్జ్ మంత్రి టేబుల్పైకి టీడీపీ కార్యకర్తల కోసం కసరత్తు కనిపించని సీహెచ్సీలు! -
సెల్ఫోన్లో బిల్లు చెల్లించడం రాదు
నేను పెద్దగా చదవలేదు. నా వద్ద స్మార్టు ఫోన్ ఉన్నా కరెంట్ బిల్లు చెల్లించడం రాదు. మాకు రూ. 200 బిల్లు వచ్చింది. కార్యాలయానికి వెళ్తే మూతేశారు. బిల్లు చెల్లించలేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. – గోవిందరాలు, ఆలూరు మేం వాడుది చిన్న ఫోన్. స్మార్టు ఫోన్లో నాకు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు రాదు. ఇక్కడ ఆఫీసు ఉంటే బిల్లు కట్టాలని డబ్బులు ఇంటిపక్క వారికి ఇచ్చివేళ్లే వాళ్లం. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. – జోగిబాలి పేడయ్య, ఆలూరు గ్రామాల్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారందరు వినియోగదారులకు స్మార్టు ఫోన్ద్వారా పేమెంట్లను చెల్లించాలని అవగాహన చేస్తున్నారు. కీప్యాడ్ సెల్ను వాడుతున్న వారు ఇతరులతో బిల్లులను చెల్లించాలి. ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులు నిబంధలకు లోబడి పనిచేయాలని. – సంతోష్కుమార్, ఏడీఈ ఆలూరు -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
● స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాల ముస్తాబు నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర సంబరాలకు జిల్లా కేంద్రమైన నంద్యాల ముస్తాబైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు హాజరు కానున్నారు. వీరందరూ కూర్చొని వేడుకలు తిలకించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో, గ్యాలరీల వద్ద తాగునీరు, అల్పాహారం అందించనున్నారు. మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్షెరాన్ శుక్రవారం పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని వేదిక బ్యాక్ డ్రాప్ పోలీసు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, బ్యారికేడింగ్, స్టేజి నిర్మాణం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ విశ్వనాథ్, డీఆర్ఓ రామునాయక్ తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయులకు ‘ఆన్లైన్’ కష్టాలు
● ప్రతి విషయం ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే ● పని భారం.. ఒత్తిళ్లతో సతమతం నంద్యాల(న్యూటౌన్): చదువులు చెప్పే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం బోధనేతర పనుల బరువు మోపుతోంది. నానాటికీ ఈ భారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో 1,345 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలకు కొంత దూరం నుంచే తమ మొబైల్ ఫోన్ తీసి ముఖ హాజరు వేసుకుంటున్నారు. తర్వాత ప్రార్ధన అవుతుండగానే విద్యార్థుల మొత్తం సంఖ్యను లెక్కిస్తారు. అనంతరం తరగతులు వారీగా హాజరు నమోదు చేసి వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. తర్వాత మధ్యాహ్న భోజనం, టాయిలెట్ నిర్వహణ తనిఖీ చేసి మొబైల్స్ ద్వారా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఓ వైపు ఆన్లైన్ పనులు చూసుకుంటూ మరో వైపు రెండు, మూడు తరగతులకు బోధన చేయాల్సి వస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనైతే పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజులో సగం సమయం ఆన్లైన్ పనులకే కేటాయించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒకే పనిని రెండు సార్లు అధికారులు సూచించిన ప్రతీ పనిని ఉపాధ్యాయులు అటు ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో చేయాల్సి వస్తోంది. పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన సమాచారం అంతా రికార్డుల్లో నిక్షిప్త పరచడమే కాకుండా ఆన్లైన్లో కూడా వాటిని క్రమం తప్పకుండా పొందుపరుస్తూ రావాలి. ఒకే పనిని రెండు సార్లు చేయడంతో అధిక సమయం బోధనేతర పనులకే కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు వారాలవుతున్నా చాలా పాఠశాలల్లో ఇప్పటికీ ఒక్క పాఠం కూడా పూర్తికాని పరిస్థితి. మరో పది రోజుల్లో ఎఫ్ఎ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సంబంధించి సుమారు వంద అంశాల వివరాలను యు–డైస్లో అప్డేట్ చేసేందుకు సమయం సరిపోయింది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్కూల్ కిట్లు పంపిణీ తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా చదువు చెబుతున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. టీచర్లతో క్లరికల్ వర్క్ చేయించడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. బడికి వచ్చినప్పటి నుంచి ముఖ హాజరుతో పాటు విద్యార్థులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్ల్లో నమోదు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి సర్వర్ సమస్య వచ్చిన ప్పుడు గంటల కొద్దీ ఫోన్లు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. దీని వల్ల భోధన సక్రమంగా చేయలేకపోతున్నాం. బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇచ్చి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేలా యాప్ల భారం తగ్గించాలి. – శివయ్య, ఏపీటీఎఫ్ సెక్రటరీ, నంద్యాల యాప్లతో బోధన సమయం వృథా అవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాం. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హామీలు అమలు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి. నిత్యం ఏదో ఒక పని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. – నగరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ 1938 సెక్రటరీ, నంద్యాల -
గొర్రెలను అపహరించిన నిందితుల అరెస్ట్
మహానంది: మండలంలో సుమారు 15 గొర్రెలను ఎత్తుకెళ్లిన వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాకు చెందిన కాపరులు దివిటె గౌడప్ప, ముత్తప్ప, కర్రెప్పలు తమ జీవాలను మహానంది మండలం గాజులపల్లె రైల్వేస్టేషన్ గ్రామ పొలాల్లో పగలు మేపుకొని రాత్రికి గ్రామ పొలిమేరలో ఉన్న ఖాళీ పొలంలో ఉంచుకునేవారు. అయితే ఈ నెల 9, 10వ తేదీ రాత్రివేళల్లో గొర్రెల కాపర్లు ఏర్పాటు చేసుకున్న కంచెను కట్ చేసి రూ.1.50 లక్షల విలువైన 15 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అందులో భాగంగా నంద్యాల మండలం చాపిరేవుల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కుందూ నదికి వెళ్లే మట్టి దారిలో బేతంచెర్ల మండలం బుగ్గనిపల్లె గ్రామానికి చెందిన రామావత్ ధర్మానాయక్, పాణ్యంకు చెందిన జయంపు మహేష్, తోట కొత్తూరయ్యను అరెస్టు చేసి వారి నుంచి 15 గొర్రెలతో పాటు ఒక స్కార్పియో వాహనం, వైర్ కటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేధించి దొంగలను అరెస్టు చేసిన మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరాణ్, ఏఎస్పీ సుస్మిత అభినందించారు. -
తపాలా శాఖ పథకాలపై అవగాహన
కర్నూలు: తపాలా శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పోస్టల్ సేవింగ్స్, పెట్టుబడి, బీమా పథకాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర పథకాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పోస్టల్ శాఖ కర్నూలు డివిజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యాయ సేవా సదన్లో న్యాయ అవగాహన కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు అందించే బీమా సౌకర్యాలు, పాలసీల ప్రత్యేకతలు, కుటుంబానికి కలిగే ఆర్థిక భద్రత, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్ క్యాంప్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో ఆధార్ నమోదు, నవీకరణ సేవలు ప్రత్యేక ఆధార్ క్యాంప్ ద్వారా అందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. కర్నూలు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జనార్ధన్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్లోని న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
పెన్సిల్పై స్వాతంత్య్ర యోధుల సూక్ష్మచిత్రాలు
నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ పెన్సిల్పై 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీసి అబ్బురపరిచారు. భారతమాత ముద్దుబిడ్డలైన సమరయోధులను దీవిస్తున్నట్లుగా భరతమాతతో కలిపి మొత్తం 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పెన్సిల్పై చూపించారు. చిత్రంలో భగత్సింగ్, సుభాష్చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, తదితరుల చిత్రాలను చిత్రించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గోనెగండ్ల: మండల పరిఽధిలోని కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము (41) ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము, భార్య గిడ్డమ్మకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఆదాము సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోడుమూరు పట్టాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి కున్నూరు గ్రామానికి బయలు దేరాడు. అయితే ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు దగ్గరకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆదాము తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య గిడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.హంద్రీ నీవా కాల్వలో మృతదేహం లభ్యం పత్తికొండ రూరల్: గుడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి హంద్రీ నీవా కాల్వలో శవమై తేలాడు. ఘటనపై సీఐ జయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాలహర్వి మండలం కామినహాల్ గ్రామానికి చెందిన నాగార్జున (43) పత్తికొండకు చెందిన రమాదేవి అలియాస్ లక్ష్మి దంపతులు. కొద్దిరోజుల కిందట దంపతులు పత్తికొండకు వచ్చారు. ఈ క్రమంలో నాగార్జున రెండు రోజుల క్రితం పత్తికొండ – చిన్నహుల్తి రోడ్డులోని ఈరన్న స్వామిని దర్శించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో భార్య పత్తికొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోపాల్ ప్లాజా సమీపంలోని హంద్రీ కాలువ గట్టున చెప్పులు, బైక్ పడి ఉండటాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు హంద్రీ నీవా కాల్వలో జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం మద్దికెర మండలం హంప వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష డోన్ రూరల్: డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. మండలంలోని తాటిమాను కొత్తూరు గ్రామానికి చెందిన ఆర్.శేఖర్కు 2 రోజులు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం డోన్ స్పెషల్ జ్యుడీషయల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్ సీఐ రాకేష్, ఎస్ఐ మమత తెలిపారు. -
శ్రీ కామేశ్వరీదేవికి విశేష పూజలు
మహానంది: శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఆలయ అర్చకులు మణికంఠశర్మలు ఉదయం నుంచి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి 13 పట్టుచీరలతో, అమ్మవారి ఆలయ మండపంలో సుమారు వంద చీరలతో అలంకరించారు. శ్రావణమాసం శుక్రవారం పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు హైదరాబాద్ వాస్తవ్యులైన వారణాసి రామ్మోహన్రావు దంపతుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆదేశాల మేరకు కేజీబీవీల్లో జిల్లా ప్రొఫెషనల్ మెరిట్ జాబితాలను, ఖాళీల వివరాలను samagrashikshanandyal. blogspot.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు వివరాలను పరిశీలించుకొని దరఖాస్తులు, ఫిర్యాదులు ఉన్నట్లు అయితే తగిన ఆధారాలతో ఈనెల 16లోగా ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చన్నారు. అంతేగాకుండా అభ్యంతరాలను, ఫిర్యాదులను తగిన ఆధారాలతో నంద్యాల సమగ్ర శిక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సమర్పించాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ మూడు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటివిడుదలను కొనసాగిస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం నిలిచిపోయినట్లు తెలిపారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో డ్యాంలో 878.40అడుగుల వద్ద 179.8995 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 877.40 అడుగుల నీటిమట్టం ఉండగా 4,5,6 గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్ఎస్ఎస్కు 8,000 క్యూసెక్కులు, తెలుగుగంగ కాల్వకు 2,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఓపెన్ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెంచాలి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఓపెన్ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెంచాలని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ నరసింహారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూళ్లలో విద్యార్థుల శాతం ఎక్కువగా నమోదు చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాలు, టెస్టు బుక్స్ ద్వారా తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. వివిధ కారణాలతో చదువు మానేసిన పిల్లలకు, పెద్దలకు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా చదువు కొనసాగించడానికి సువర్ణ అవకాశమన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్రెడ్డి, డిప్యూటీ డీఈఓలు శంకర్ప్రసాద్, సార్వత్రిక విద్యాపీఠం సమన్వయకర్త రఘురామిరెడ్డి, ఎంఈఓలు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ప్రజలకు ‘డిజిటల్’ షాక్!
ఆలూరు: విద్యుత్ బిల్లులను ప్రజలు ఇక డిజిటల్ విధానంలో చెల్లించాల్సి ఉంది. ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్) కార్యాలయాలు ఇక పనిచేయవు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులకు స్మార్ట్ ఫోన్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సరిగా లేకున్నా, స్మార్టు ఫోన్ లేకున్నా విద్యుత్ బిల్లు చెల్లించే వీలు పడదు. పల్లెల్లో ఇప్పటికీ చాలామంది కీప్యాడ్ ఫోన్నువినియోగిస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, ఆలూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉప రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7,38,059 మంది రూ. 49.76 లక్షల మేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. నంద్యాల, ఆత్మకూరు, పాణ్యం, కోవెలకుంట్ల బనగానపల్లి, డోన్, విద్యుత్ సబ్డివిజన్లలో ఇదే కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 9,67,500 మంది విద్యుత్ వినియోగదారులు రూ. 58.20 లక్షల చెల్లిస్తున్నారు. ఇక వీరంతా స్మార్ట్ ఫోన్లలో క్యూఆర్కోడ్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలా చేయకలేకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. ఈఆర్వో కార్యాలయాల మూత సిబ్బంది కొరత కారుణంగా 2018లో ఈఆర్వో కార్యాలయాల్లో ప్రభుత్వం ఒప్పంద కార్మికులను నియమించింది. వీరికి ఏజేన్సీ నిర్వాహకులు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వేతనం చెల్లించేవారు. అగ్రిమెంట్లో పని దినాలు ముగిసి పోకుండానే వీరి కడుపు కొట్టి ఈఆర్వోలను తొలగించి కార్యాలయాలను తొలగించాలని జూన్ 15న ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల మొదటివారం నుంచి కార్యాలయాలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఒప్పంద కార్మికులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్టు ఫోన్లో పేద్వారా విద్యుత్ బిలుల్ల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నా పల్లెల్లో సమస్యలు వస్తున్నాయి. ఆంగళ్లు, పిండిమిషన్లు నిర్వహిస్తున్న వారు కొంత సమస్యను అధిగమించారు. బోరుబావులకు వాడిన విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక స్మార్ట్ఫోన్ ద్వారానే విద్యుత్ బిల్లుల చెల్లింపు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేత చిన్న ఫోన్ ఉన్న వారికి తప్పని తిప్పలు -
‘రెడ్బుక్’ కుట్రలు.. ఆగని వేధింపులు
ఆళ్లగడ్డ: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న సామెతను టీడీపీ నాయకులు నిజం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుండగా గ్రామాల్లో ఆపార్టీ నాయకులు వైఎస్సార్సీపీ ఆస్తులే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. తాజాగా యాదవాడ గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్సీపీ నాయకుడు, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వెంట ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొంటారు. ఈ క్రమంలో గురువారం మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు వచ్చిన సందర్భంగా బిజేంద్రారెడ్డితో పాటు కర్నూలుకు వెళ్లారు. అంతకు రెండు రోజుల ముందు డీఎస్సీ అక్రమాలపై జరిగిన ర్యాలీకి సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలతో వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఆయనను ఎలాగైనా నష్ట పరచాలని గురువారం రాత్రి పొలం దగ్గర రూంలో దాచి పెట్టుకున్న 20 మందు బస్తాలను గతి తాళం పగుల గొట్టి ఎత్తుకుపోయారు. శుక్రవారం పొలానికి మందు చల్లుదామని పోతే అక్కడ తాళం పగలగొట్టి ఉండటం కనిపించింది. లోపలకు వెళ్లి చూడగా 28 మందు బస్తాలు కనిపించడం లేదు. మోటార్సైకిల్ పై రోడ్డు మీదకు మోసుకుని అక్కడి నుంచి ఆటోల్లో తరలించినట్లు తెలుస్తోందని నరసింహారెడ్డి తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారీ.. నరసింహారెడ్డి పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోజు ఏదో విధంగా నష్ట పరచడం జరుగుతోంది. గతంలో కూడా పార్టీ ఆదేశించిన కార్యక్రమానికి కార్యకర్తలను తరలించుకు పోవడంతో మరుసటి రోజు పొలం దగ్గర ఉన్న రెండు వరిగడ్డి వాములకు అగ్గి పెట్టి దగ్ధం చేశారు. అంతేకాకుండా పదులసంఖ్యలో మోటర్ వైర్లు, కేబుల్ వైర్లుకట్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడి పొలంలో టీడీపీ నాయకుల దోపీడీ? రూం తాళం పగులగొట్టి 28 బస్తాల మందు బస్తాలు చోరీ గతంలో గడ్డివాములకు నిప్పు పెట్టిన వైనం -
చెరువులపై పచ్చ గద్దల కన్ను
డోన్: వర్షపు నీటిని ఒడిసిపడదాం.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం.. నీటిని సంరక్షిద్దాం.. కరువు రక్కసిని తరిమికొడదాం అంటూ టీడీపీ నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగా తేలిపోయాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని 36 చెరువులకు హంద్రీ నీవా కాల్వ నీటిని మళ్లించి సశ్యశ్యామలం చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాల పేరుతో చెరువులపై టీడీపీ నాయకుల పెత్తనం అధికం కావడంతో నీటి వినియోగం పట్ల నిర్లక్ష్యం పెరిగిపోయింది. దీంతో చెరువులన్నీ చుక్క నీరు లేక ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. గంపలో రొయ్యలేమయ్యాయి! అంతా శాఖాహారులే మరి గంపలో రొయ్యలేమయ్యాయనే చందంగా నియోజకవర్గంలో చెరువుల పరిస్థితి తయారైంది. కొచ్చెర్వు, జగదుర్తి, యాపదిన్నె గ్రామ చెరువులను చేపల వేట పేరుతో నీటిని కిందకు వదిలి ఖాళీ చేయించారు. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉంటే చేపల వేటకు కష్టతరమవుతుంది. అదే నీరు తక్కువగా ఉంటే చేపల వేట సులువుగా సాగించవచ్చు. దీంతో చెరువుల్లో నీరు ఖాళీ చేయించి తద్వారా టీడీపీ నేతలు ఈ ఏడాది చేపలు పట్టే వారి నుంచి వేలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసి జేబులు నింపుకున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వలను కాపాడి సక్రమంగా వినియోగించాల్సిన మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో పడి నీటి వృథాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ చెరువుల్లో చేపల పెంపకం తమ పరిధిలో లేదంటూ మత్స్య శాఖ అధికారులు చేతులేత్తేయడంతో అనధికారికంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం, విక్రయం లాంటి విషయాల్లో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం పెరిగిపోయింది. సిండికేట్ మాయాజాలం అతి చిన్నదైన ఉడుములపాడు చెరువులో చేపల పెంపకాన్ని రెండేళ్లుగా బహిరంగ వేలం వేస్తున్న మత్స్యశాఖ అధికారులు వెంకటాపురం తుమ్మల చెరువు వేలం పాటను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ పచ్చ చొక్కాల నాయకుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే ఈ చెరువు తూమును దొంగలెత్తుకెళ్లినా ఇరిగేషన్ అధికారులు తిరిగి తూముకు అడ్డుకట్టు వేయలేకపోయారు. టీడీపీ నాయకులు, మత్స్యశాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు కాసులకు కక్కుర్తి పడి చెరువుల్లో చుక్క నీరు నిల్వ లేకుండా చేపల వేటగాళ్లకు చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, చెరువుల్లో నీరు లేకపోవడం లాంటి కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ బోర్లు వృథాగా మారాయి. పశువులకు సైతం తాగు నీరు దొరకని దైన్యస్థితి ఏర్పడింది. మత్స్య శాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కు చేపల కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు చెరువులు ఖాళీ జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నాయకులుచెరువు కథ కంచికి.. ఉమ్మడి జిల్లాలో సి.బెళగల్ చెరువు తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి 501 ఎకరాల విస్తీర్ణం, 0.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 112 ఏళ్ల చరిత్ర గత వెంకటాపురం తుమ్మల చెరువు కథ కంచికి చేరింది. ఈ చెరువు కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, మరో 1500 ఎకరాల నన్ఆయాకట్టు సాగవుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల చెరువును నింపేందుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే ఈ చెరువు తూమును (గేట్) దొంగలెత్తుకెళ్లడంతో చెరువులో నీరంతా కిందకు వృథాగా పొతోంది. నీరు వృథా అవుతోందని ఆయకట్టు రైతాంగం నెత్తి, నోరు బాదుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా మారింది. మైనర్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుడడంతో చెరువులో నీరు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● జిల్లా కలెక్టర్ రాజ కుమారినంద్యాల(అర్బన్): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, ట్రైనీ కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ దేశ అభివృద్ధి కేవలం ఆర్థికంతో కాకుండా ప్రజల సంతోష, ఆరోగ్యం, విద్య వంటి ప్రమాణాలతో కూడి ఉంటుందన్నారు. జిల్లా అధికారులు, సీఆర్ఎస్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.1కే బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డు
కర్నూలు(హాస్పిటల్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అందించే ఫ్రీడమ్ 2.0 ప్లాన్స్ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజేశ్వరరావు చెప్పారు. శుక్రవారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1కే సిమ్కార్డును 24 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు ఒక జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లో 47 అదనపు రోజుల వాలిడిటీ, రోజువారీ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు అందిస్తున్నామన్నారు. ఇది వచ్చే నెల 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రూ.499లకే ఫైబర్ బేసిక్ ప్లాన్లో భాగంగా 60 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగం, నెలకు 3300 జీబీ వరకు హైస్పీడ్ డేటా, ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయన్నారు. ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్లో భాగంగా రూ.1,111 (నెలకు) చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్, నెలవారీగా 5వేల జీబీ హైస్పీడ్ డేటా అందిస్తామన్నారు. అలాగే 25కు పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్స్, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ఇందులో లభిస్తాయన్నారు. గతేడాది పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4జీ సేవలను ప్రారంభించామన్నారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 380 టవర్లు, 1,080 బీటీఎస్లతో విస్తరించినట్లు తెలిపారు. కర్నూలు బీఏలో సగటున నెలవారీ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2లక్షల నుంచి 3.4 లక్షలకు పెరిగిందని వివరించారు. మారుతున్న మొబైల్ టెక్నాలజీకి అనుగుణంగా ఈ–సిమ్, యూనివర్సల్ సిమ్ సేవలను కూడా అందిస్తున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్ ఏజీఎం దేవచంద్ నాయక్, ఏడీఈ మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో కర్నూలు పర్యటన చాటింది. పోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకోకుండా నిలువరించారు. ఎయిర్పోర్టు దాటి అభిమాన నేత కారులో బయటకు రాగానే ఊళ్లకు ఊళ్లు దారి పొడవునా ఎదురేగి
బళ్లారి చౌరస్తా వద్ద జన ప్రవాహంసాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు సెంట్రల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో మరింత ఊపు తెచ్చింది. అందరిలోనూ రెట్టించిన ఉత్సాహం నింపింది. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాక్గార్డెన్, నన్నూరు టోల్ ప్లాజా, టీవీ9 ప్రజానగర్, వెంగన్న బావి, రిజిస్ట్రార్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, బాలాజీ నగర్, సంతోష్ నగర్, పంచలింగాల చెక్పోస్టు మీదుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు చేరుకున్నారు. మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం పట్టింది. అడుగడుగునా నిర్బంధం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్ జగన్ కలిశారు. అరగంట పాటు విరూపాక్షితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా తనను జైలులో అధికారులు నిలబెట్టి ఫొటోలు తీసి అవమానించారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంతకింత అనుభవించక తప్పదని హెచ్చరించారు. దాదాపు అరగంట పాటు జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పటికే వేలాదిమంది కార్యకర్తలు జైలు వద్దకు తరలివచ్చారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా నిర్బంధం విధించినా జనం వెనుకడుగు వేయలేదు. జై జగన్ నినాదాలతో జిల్లా జైలు ప్రాంతం హోరెత్తింది. జగన్ వెళ్లేవరకు కార్యకర్తల్లో జో ష్ తగ్గలేదు. జెండాలు చేతబూని చిందులు తొక్కారు. పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ, హఫీజ్ ఖాన్, మాజీ మేయర్ బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్, ఎస్ఈసీ మెంబర్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మద్దూరు సుభాష్ చంద్రబోస్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, సమన్వయకర్తలు ఆదిమూలపు సతీష్, దారా సుధీర్ పాల్గొన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. పోలీసులు అడ్డుకున్నా.. జగనన్న కోసం ప్రజలు సునామీలా తరలి వచ్చారు. జగనన్న జిల్లా పర్యటన విఫలం చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం కలగలేదు. 1300 మంది పోలీసు అధికారులను, పోలీసులను నియమించి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రజలు, మహిళలు, యువకులు ఊహించని స్థాయిలో బ్రహ్మరథం పట్టారు. జగనన్న కోసం వచ్చిన జనాలను చూసి చంద్రబాబుకు నిద్ర పట్టదు. ప్రజలు అక్రమ కేసులకు భయపడరన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు జగనన్నను చూసేందుకు తరలివస్తున్న ఉమ్మడి జిల్లాల్లో పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలను చెక్పోస్టులు పెట్టి అడ్డుకోవడం దారుణం. ఎంత కట్టడి చేస్తే అంతకు రెట్టింపు ప్రజలు వస్తారని ముందుగానే చెప్పాం. అన్నట్లుగానే అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. లక్ష మంది తరలి వచ్చారు. ఆంక్షలతో అభిమానాన్ని నిలువరించలేమని కూటమి ప్రభుత్వానికి తెలిసివచ్చింది. జగనన్న అంటే ఎందుకంత భయం. ప్రభుత్వ తీరు మారాలి. – కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు సైడ్లైట్స్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖద్వారం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్తో ఓ మైనార్టీ మహిళ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కకు తోసేశారు. గమనించిన జగన్ సూచనలతో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి ఆమెను అభిమాన నేత వద్దకు తీసుకొచ్చి కరచాలనం చేయించడంతో ఆమె ముఖంలో సంతోషం విరబూసింది. నన్నూరు వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆ తరువాత నన్నూరు టోల్గేట్ దగ్గర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి దారా సుధీర్తో పాటు ఆ నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మంది పార్టీ కార్యకర్తలు డప్పులతో స్వాగతం పలికారు. ప్రజానగర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంతిపూలు చల్లుతూ స్వాగతం పలికారు. జగనన్నా మాకు మీరే దిక్కంటూ మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా, ఇతర కేటగిరీల్లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ప్రజానగర్ దాటిన తరువాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మరికొంత మంది విద్యార్థులు సార్ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని, ఫీజు చెల్లించలేకపోతున్నామని ప్లకార్డులు ప్రదర్శించారు. హ్యాంగౌట్ వద్ద కానిస్టేబుల్ ఉద్యోగాలను 2,500 నుంచి 10 వేలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆటోనగర్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసిన ఆనందంతో ఓ రైతు తన టవల్ను అందించగా.. ఆ టవల్తో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్లా గిరగిరా తిప్పుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. – కర్నూలు సిటీ హైవేలో జన సునామీ! ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చి కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జై జగన్, సీఎం జగన్, కాబోయే సీఎం జగన్.. అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ జెండాలతో చిందులు తొక్కారు. భారీగా వచ్చిన జనంతో కర్నూలు కిక్కిరిసిపోయింది. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలో భారీ జన సందోహం మధ్య కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో జిల్లా జైలుకు చేరేందుకు ఐదు గంటల సమయం పట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. జై జగన్ నినాదాలతో మార్మోగిన సీమ ముఖద్వారం మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు ఎగబడ్డ ప్రజలు జనసంద్రంగా మారిన కర్నూలు 38 కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పరామర్శ -
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పరిశీలన
పాములపాడు: మండలంలోని బనకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఉన్నత స్థాయి బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైతాంకర్ నేతృత్వంలో సీఈఓ ఆర్కే రెడ్డి, డైరెక్టర్ శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్తో కూడిన అధికారుల బృందం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వారికి క్రాస్ రెగ్యులేటర్ పరిధిలోని గేట్ల పనితీరు, నీటి విడుదల వ్యవస్థ గురించి ఈఈ శంకర్ రెడ్డి, డీఈ నగేష్ వివరించారు. బనకచర్ల నుంచి కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి సుజల స్రవంతి కాలువలకు నీటి విడుదల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా చైన్నె నగర తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీటి సమాచారాన్ని సేకరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాలు, అనుసంధాన కాలువల ద్వారా బనకచర్ల రెగ్యులేటర్కు నీటిని చేర్చే మార్గాలు, సాంకేతిక అంశాలు, డిజైన్లను ఇరిగేషన్ పీపీఎం ఈఈ రామకోటయ్య అధికారులతో కలిసి మ్యాప్ల ద్వారా విశ్లేషించారు. కరువు పీడిత రాయలసీమ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు ఈ అనుసంధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై అధికారులతో విస్తతంగా చర్చించారు. వారి వెంట ఏఈలు దేవేంద్ర , విశ్వనాధ్, విష్ణువర్ధన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
● యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజుకర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకు ఉద్యోగు లు తీవ్రమైన పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ నాగరాజు డిమాండ్ చేశారు. యూఎఫ్బీయూ పిలుపు మేరకు బుధవారం కర్నూలు గాయత్రీ ఎస్టేట్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారపేట శాఖ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వరంగ, ప్రయివేటు, గ్రామీణ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంకు యూనియన్లు కొన్నేళ్లుగా చేస్తున్న డిమాండ్ల్లో ఐదు రోజు ల పని విధానం కల్పించాలనేది ప్రధానమైందన్నారు. ఈ డిమాండ్ను దాదాపు రెండేళ్ల క్రితం బ్యాంకు యూనియన్లతో జరిపిన చర్చల్లో ఐబీఏ అంగీకరించిందన్నారు. 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని అంగీకరించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఐబీఏ ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు సానుకూల స్పందన రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏఐబీఈఏ జిల్లా నాయకులు శివకృష్ణ, అజయ్, వాసుదేవరెడ్డి, అన్వర్, ఏఐబీవోసీ నాయ కులు రాజు, చంద్రమోహన్, పుష్పక్కుమార్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ నాయకులు హనుమంతురెడ్డి, రాఘవేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులపైనే కేసు నమోదు
దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ విషయం పక్కన పెట్టారు. తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని ఆయనతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. -
సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి
కర్నూలు: ర్యాగింగ్ విద్యార్థి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అమానుష చర్య అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు న్యాయ విజ్ఞాన వేదిక, వివేకానంద యువ ఫోరం సంయుక్తంగా జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో బుధవారం యువతలో సామాజిక బాధ్యత అనే అంశంపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి తప్ప ర్యాగింగ్ పేరుతో వేధించడం తగదన్నారు. మాదక ద్రవ్యాల వలలో పడితే యువత భవిష్యత్తు అంధకారం కావడమే కాకుండా వారి కుటుంబానికి, సమాజానికి తీరని నష్టమని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు, బాధితులు టోల్ఫ్రీ నంబర్ 15100 ద్వారా లేదా దగ్గర్లోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. చివరలో విద్యార్థులచే ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో బైక్ దొంగలు
● 15 బైక్లు స్వాధీనం బండిఆత్మకూరు: తెలంగాణతో పాటు తదితర ప్రాంతాల్లో బైక్లను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు ప్రాంతంలో జరిగిన బైకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడిని సమాచారం మేరకు అక్కడి పోలీసులు బుధవారం లింగాపురం గ్రామం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వల్లెం వెంకటరమణ, భూమా శివారెడ్డిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరో బైక్ను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. -
కోవెలకుంట్లలో చోరీ
కోవెలకుంట్ల: పట్టణంలోని బసిరెడ్డిబావి వీధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణ ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు బద్ధలు కొట్టి అందులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5.50 లక్షల నగదును అపహరించుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి తిరుమల నుంచి ఇంటికి చేరుకున్న లక్ష్మీనారాయణ బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. డాగ్సా్వ్క్డ్, క్లూస్టీం రంగ ప్రవేశం చేసి చోరీఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో కోవెలకుంట్ల పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం స్కంద కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బాబయ్య ఇంట్లో దొంగలు ప్రవేశించి రూ. 3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 5 వేలు నగదు అపహరించుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకే మరో చోరీ జరిగి భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. -
కేంద్ర పథకాలను పక్కాగా అమలుచేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎనర్జీ డిపార్టుమెంటు ఓఎస్డీ పీహెచ్ జానకిరామ్ జిల్లా విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలులోని విద్యుత్ భవన్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ అమలులో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్ యూఎల్ఏ మోడల్ కింద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ల పనుల్లో పురోగతి పెంచాలన్నారు. జిల్లాకు మంజూరైన 23,077 సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఈ నెల చివర్లోగా ఏర్పాటు చేసి గ్రిడ్కు అనుసంధానం చేయడంతో పాటు ఎంఎన్ఆర్ఈ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను డిసెంబరు చివరిలోగా పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్– అగ్రికల్చర్ ఫీడర్లలో సోలరైజేషన్ పనుల పురోగతిని సమీక్షిస్తూ.. అగ్రిమెంటులోని నిబంధనల ప్రకారం పనులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్, ఈఈలు రాజశేఖర్, భాస్కరరావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కల్లూరు మండలం ఏ.గోకులపాడులో నిర్మించిన సోలార్ రూఫ్టాప్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత
● వైఎస్సార్సీపీలో చేరిన వంద మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలుచాగలమర్రి: కేవలం రెండు సంవత్సరాల పాలన కాలంలోనే ప్రజావ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. చాగలమర్రి మండలంలోని గొడిగనూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏడు కుటుంబాలకు చెందిన 100 మంది బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ పత్తి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొడిగనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొలికల చిన్న రామిరెడ్డి, పెద్దిరెడ్డి, లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కమటం నరసింహారెడ్డితో పాటు వారి కుటుంబాలకు చెందిన సుమారు 100 మందిసభ్యులకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. పోలీసులపైనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, రాష్ట్రంలో హింస పెచ్చరిల్లిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఆగడాలు చెప్పనలవి కావడం లేదన్నారు. గంజాయి విక్రయం విచ్చలవిడిగా చేస్తుండటంతో యువత మత్తులో మహిళలపై ఘోరాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీదే విజయం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి.కుమార్రెడ్డి, మండల కార్యదర్శి శేషు రమేష్, ఎంపీటీసీ కె. లక్ష్మీరెడ్డి, పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్లు రమణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, షరీఫ్, రామకృష్ణారెడ్డి, చిన్న నాయుడు, మండల నాయకులు సుబ్బారాయుడు, అంకాల్రెడ్డి, చాంద్బాషా, పవన్ కుమార్, కదిరి దస్తగిరి పాల్గొన్నారు. -
శ్రీశైలం డ్యాంను సందర్శించిన సీడబ్ల్యుసీ సభ్యుడు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయాన్ని బుధవారం సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడు యోగేష్ పైతాంకర్ సందర్శించారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాంకు వస్తున్న వరదనీరు, సెల్ఫ్ క్యాచ్మెంట్లో వర్షపాతం, శ్రీశైలం ఆధారిత ప్రాజెక్ట్లకు విడుదల చేస్తున్న వరదనీరు, విద్యుత్ ఉత్పాదన, డ్యాం పటిష్టత, భద్రత వంటి అంశాలపై డ్యాం ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు చీఫ్ ఇంజినీర్ ఓఆర్కే రెడ్డి, డైరెక్టర్ కే శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్, డ్యాం ఇంజనీర్లు వేణుగోపాల్రెడ్డి, రవికుమార్, తిప్పేస్వామి తదితరులు ఉన్నారు. భక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరిదేవి జయంత్యుత్సవం బనగానపల్లె రూరల్: శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంత్యుత్సవాన్ని బుధవారం నందవరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం చేశారు. చండీహోమం అనంతరం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. శాస్త్రోక్తంగా పల్లకి సేవ, సహస్త్ర దీపాలంకరణ జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. జాతీయ ఉపకారవేతన ఫలితాల విడుదల నంద్యాల(న్యూటౌన్): గతేడాది నిర్వహించిన జాతీయ ఉపకారవేతన ఫలితాలు విడుదలైనట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి ిజనార్దన్ రెడ్డి తెలిపారు. వివరాలు ప్రభుత్వ కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే బ్యాంకు అకౌంట్ తెరిచి, ఆధార్ను లింక్ చేయించి, డీబీటీ ద్వారా డబ్బులు జమయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు తనిఖీ చేసుకొని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships. gov.inలో నమోదు చేసుకొని దరఖాస్తును సబ్మిట్ చేయాలని తెలిపారు. 183 టీఎంసీల నీటినిల్వలు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రానికి 183.4198 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. రెండు రోజులుగా జూరాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతోంది. బుధవారం జూరాల నుంచి 83,161 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యామ్ నీటిమట్టం 879.10 అడుగులకు చేరుకుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్లకు శ్రీశైలం నుంచి 41,118 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 13.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి 26,052 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,016 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మార్కెట్ యార్డులో ఇసుక దందా! బండిఆత్మకూరు: ప్రభుత్వ ఆధీనంలోని బండిఆత్మకూరు మార్కెట్ యార్డును టీడీపీ నాయకులు ఇసుక నిల్వ కేంద్రంగా మార్చుకున్నారు. ప్రజా అవసరాలకు కోసం ఽఉద్దేశించిన ప్రభుత్వ స్థలంలో వేల టన్నుల ఇసుక నిల్వ చేయడానికి అనుమతులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగం కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎడమ చేతి వాటం.. అద్భుతం
● ప్రపంచ మేధావుల్లో వారే అధికం ● నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే దొర్నిపాడు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఎడమ చేతివాటం వారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వారు చేసే పనులు, హావాభావాలు, కదలికలు అన్నీ వాళ్లవైపు తిప్పుకునేలా ఉంటాయి. అందుకే వారిని చూసి నేను లెఫ్ట్ అయ్యింటే బాగుండును.. అని అనుకుంటారు చాలా మంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. కుడిచేతివాటం కల్గిన వారి కన్నా ఎడమ చేతివాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని వారికి తెలివి తేటలు గ్రహించే శక్తితో పాటు మంచి ఆలోచన శక్తి ఉంటుందని అంటారు. వీరికి జ్ఞాపకశక్తి, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న విషయాలు వెంటనే మరచిపోవడం వీరికి సహజం. ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు లెక్కలను కూడా చాలా వేగంగా చేయగలుతారని పలు పరిశోధనల్లో వెళ్లడైంది. అబ్దుల్ కలాం, ఐన్స్టీన్, న్యూటన్, మేరీక్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వంటి మేధావులంతా ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. అయితే ఎడమ చేతివాటం కల్గిన టైలర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, కుట్టుమిషన్ డిజైనింగ్ పూర్తిగా కుడిచేతివాటం వారికి సరిపోయే విధంగా తయారైఉంటాయి. కంప్యూటర్ మౌస్, డ్రైవింగ్ చేసే వారు ఇలా చాలా మంది ఇబ్బందులకు గురవుతారు.ఒకే స్కూల్లో 13 మంది..దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మంది లెఫ్ట్హ్యాండర్స్ ఉన్నారు. వీరంతా చదువు, రైటింగ్, క్రీడల్లో ఎప్పుడు ప్రతిభ చూపుతుంటారు. ఒకే స్కూల్లో ఇంత మంది ఉండటం మాకు గర్వకారణం అని హెచ్ఎం చెన్నకేశ్వరి పేర్కొన్నారు. వారిని ప్రతి పనిలో అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారని తెలిపారు.మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురిచేయవద్దు. వయస్సు పెరిగేకొద్ది సంప్రాదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని పద్ధతులను బట్టి నడుచుకోగలరు. – డాక్టర్ నేగల ఉశేని, పీహెచ్సీ, డబ్ల్యూ కొత్తపల్లె -
జీఎస్టీ వసూళ్ల లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలి
కర్నూలు(సెంట్రల్): జీఎస్టీ వసూళ్ల సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వాణిజ్య పన్నుల శఖ ఆధ్వర్యంలో జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచడంతోపాటు పన్ను వసూళ్లలో పారదర్శకతను పెంచాలన్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ బకాయిల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. కొనుగోలు పోర్టల్లో వేలం ప్రక్రియకు సంబంధించినఅంశాలను సమవర్ధంతంగా నిర్వహిస్తూ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. పన్ను డిఫాల్టర్ల పాన్ నంబర్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయాలన్నారు. ఫ్రీజ్ చేసిన అనంతరం లీడ్బ్యాంకు మేనజర్తో అధికారులు సమన్వయం చేసుకోవాలని కమర్షియల్ టాక్స్ జేసీ నీరజను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జెడ్ఎం మధసూదన్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాదు, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి బజారి, జెడ్పీ సీఈఓ సుధాకరరెడ్డి, మైనింగ్ డీడీ నాగిని పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో నలుగురికి జరిమానా డోన్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురిలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు డోన్ స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్ సీఐ రాకేష్, ఎస్సై మమత తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల డ్రైవర్లతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం వెల్దుర్తి: పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హైవే 44పై మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. హైవే పోలీసుల సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ నరేశ్, పోలీసులు విచారించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు గుర్తించారు. మృతుడు కొద్దికాలంగా పట్టణంలో, హైవేపై మానసిక స్థితి సరిగా లేక భిక్షాటన చేస్తూ తిరిగేవాడిగా తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీ మార్చురీకి తరలించారు. మృతునికి 45 ఏళ్లు పైబడి ఉండొచ్చని, షర్టు, ప్యాంటు వేసుకున్నాడని, గుర్తించిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. వృద్ధురాలి ఆత్మహత్య బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులోని కోళ్లఫారం వద్ద నివాసం ఉంటున్న ఎన్. లక్ష్మీదేవి (80) అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీదేవి కొన్ని సంవత్సరాల నుంచి కీళ్ల నొప్పుల వ్యాధి, మూర్చ వ్యాధి సమస్యలతో ఇబ్బందులుపడుతోంది. కుటుంబసభ్యులు పలు వైద్యశాలలో చూపించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెంది రసాయన పౌడర్ను నీటిలో కలుపుకుని తాగి ఆత్యహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కల్పన తెలిపారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం కర్నూలు: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీఎస్పీ రెండో బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాదరెడ్డి కుటుంబానికి సహో ద్యోగులు ఆర్థిక సాయం అందించారు. 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ సిబ్బంది అండగా నిలిచారు. జూలై 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో వరప్రసాద రెడ్డి మృతిచెందారు. సహచరుడు మరణించడంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ యూనిట్ సిబ్బంది అందరూ కలసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. మొత్తం రూ.1.75 లక్షల ఆర్థిక సాయాన్ని బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన తోటి సిబ్బందికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీగిరిలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు
● రద్దీ రోజుల్లో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల ● మూడు శుక్రవారాల్లో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు శ్రావణమాసోత్సవాలు జరుగనున్నాయి. శ్రావణమాసంలో ప్రతిరోజు వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాలపూజలు చేస్తారు. ఉభయదేవాలయాల్లో 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ శుద్ధి అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21న శ్రావణ రెండో శుక్రవారం, 28న మూడో శుక్రవారం, సెప్టెంబరు 4న నాల్గవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను దేవస్థానం నిర్వహిస్తుంది. శ్రావణమాసం మొత్తం 19 రోజుల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేశారు. అలాగే ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవ పూర్తిగా నిలుపుదల చేశారు. ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలో గురువారం నుంచి అఖండశివభజనలను నిర్వహించనున్నారు. -
అక్రమ కేసులు
● మెగా డీఎస్సీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కొందరికి 41ఏ నోటీసులు జారీచేశారు. సోమవారం మెగా డీఎస్సీ అక్రమాలను ఎత్తిచూపుతూ వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించగా ఇందులో పాల్గొన్న నేతలు, కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించినా పోలీసులు కేసులు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● కర్నూలు ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు నగర మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై.రామయ్య, పార్టీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్తో పాటు 53 మంది నేతలు, కార్యకర్తలపై అదే రోజు సాయంత్రానికి పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితోపాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ● ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్రచారకార్యదర్శి చాంద్ బాషాపైన పోలీసులు కేసు పెట్టారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న తనను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయానంటూ ఒక వ్యక్తితో ఫిర్యాదు తీసుకొని పోలీసులు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిని బట్టి పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. ● ఆదోని నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, మాజీ సర్పంచ్ శేషిరెడ్డితోపాటు మరో 50 మందిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరికి ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు మరికొందరికి సైతం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసులు వైఎ్ససార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
పులి మరణం కేసులో ఎఫ్ఎస్ఓపై వేటు
● 7గురు ప్రొటెక్షన్ వాచర్ల తొలగింపు ఆత్మకూరు రూరల్: గత ఏడాది సెప్టెంబర్లో ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం సెక్షన్లో ఒక పెద్దపులి ఉచ్చుకు చిక్కుకోగా విషయం తెలిసి కూడా ఎన్టీసీఏ మార్గదర్శకాలు పాటించకుండా రహస్యంగా పులి కళేబరాన్ని దగ్ధం చేసిన ఘటనపై అటవీశాఖ చర్యలు మొదలు పెట్టింది. అప్పటి ఇందిరేశ్వరం ఎఫ్ఎస్ఓ డి.మహబూబ్బాషాను డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ బుధవారం సస్పెండ్ చేశారు. అలాగే అందుకు సహకరించిన ఏడుగురు ప్రొటెక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పులి ఉచ్చులకు చిక్కుకోవడం ఒక విషాదమైతే.. ఆ విషయాన్ని దాచి పెట్టి సాక్ష్యాలను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమన్నారు. అటవీ శాఖలో మొలచిన కలుపు మొక్కలను పీకివేస్తామని.. తిరిగి నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో ఆత్మకూరు డివిజన్ను దుర్భేద్యంగా నిలబెడతామని ఆశాభావం వెలిబుచ్చారు. -
శుభ ముహూర్తాల శ్రావణం
కోవెలకుంట్ల: ఈ ఏడాది శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో శుభమూర్తాలు రానున్నాయి. జిల్లాలో పలు జంటలు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకునే శుభ గడియలు దగ్గరయ్యాయి. నెల రోజుల తర్వాత తిరిగి ముహూర్తాలకు మంచి రోజులు రావడంతో ఈ నెల 16వ తేదీ నుంచి కల్యాణ వీణలు మోగనున్నాయి. మాంగల్యం తంతునా.. మమజీవనం హేతునా.. కంఠేభద్మామి సుభగే.. త్వంజీవశరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు మార్మోగనున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు పెళ్లి సందడికి రెడీ అయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలోని మహానంది, యాగంటి, నయనాలప్ప, అహోబిలం, ఓంకారం, భోగేశ్వరం, శ్రీశైలం, బుగ్గరామేశ్వరం, తదితర పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, పంక్షన్హాళ్లలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. పల్లెలు, పట్టణాల్లో సందడి శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి సందడి మొదలైంది. నెల రోజుల విరామం తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. పెళ్లికార్డులు అచ్చువేయించడం, పట్టుచీరలు, వస్త్రాలు, బంగారు నగల కొనుగోలు, తదితర పెళ్లి సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఒక పెళ్లి ఎందరికో ఉపాధి చూపుతోంది. వస్త్ర, బంగారు దుకాణాలతోపాటు పెళ్లి మండపాలు, ట్రావెల్స్, పురోహితులు, ఫోటోలు, వీడియో గ్రాఫర్స్, సాంస్కృతిక కళాకారులు, క్యాటరింగ్, ఎలక్ట్రీషియన్స్, బ్యాండుమేళం, పూలఅంగళ్లు, ఇలా ఎందరికో చేతి నిండా పని దొరుకుతోంది. ఆయా ముహూర్తాల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారికి ఉపాధి దొరుకనుండటంతో వారంతా సంబర పడుతున్నారు. రెండు నెలల్లో మంచి ముహూర్తాలుఈ నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా పరాభవనామ సంవత్సర శ్రావణ మాసం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దాదాపు ఈ రెండు నెలల్లో 20 శుభ ముహూర్తాలు ఉన్నాయి. నెల రోజుల బ్రేక్ తర్వాత తిరిగి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఈ నెలలో 14, 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో, వచ్చే నెల 3, 4, 5, 8, 10, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఆగస్టు, సెప్టెంబర్లో మంచి ముహూర్తాలు కిటకిటలాడుతున్న వస్త్ర, జ్యువెలరీ దుకాణాలు ఒక పెళ్లి.. ఎందరికో ఉపాధి -
ఉత్తమ ఫొటోగ్రాఫర్గా వడ్డె శ్రీనివాసులు
అవార్డుకు ఎంపికై న చిత్రం కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీపీజేఏ) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటో కాంపిటీషన్లో కర్నూలులో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్న వడ్డె శ్రీనివాసులు ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 19న జరిగే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీపీజేఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు 110 మంది ఫొటోగ్రాఫర్లు 440 ఫొటోలను పంపారు. ఇందులో అచీవ్మెంట్ విభాగంలో శ్రీనివాసులు తీసిన ఫొటోకు అవార్డు దక్కింది. -
కూలీల రైలు బండి!
రైలెక్కుతున్న కూలీలుకోసిగి: రోజు వారీ కూలీలు పని కోసం అన్వేషిస్తూ బతుకు పోరు సాగిస్తున్నారు. ఉదయాన్నే రైలులో బయలుదేరి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని రాత్రికి స్వగ్రామానికి చేరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెళ్లిన చోట పనులు దొరక్కపోతే మధ్యలో మరో రైలు పట్టుకుని కడుపు మాడ్చుకుని ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి. కోసిగి మండలంలోని కోసిగి, నేలకోసిగి, వందగల్లు, డి.బెళగల్, గౌడుగల్లు, జుమ్మాలదిన్నె, భూంపల్లి, గ్రామాలతో పాటు కౌతాళం మండలం కరణి, చిరుతపల్లి గ్రామాల నుంచి దాదాపు 600 నుంచి 700 మంది కూలీలు రోజు ఉదయం 7 గంటలకంతా కోసిగి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. కోసిగి నుంచి తుంగభద్ర, మఠమారి, రాయచూరు, కృష్ణ, సైదాపూర్ వరకు రైలులో ప్రయాణం సాగించి ఆయా ప్రాంతాల్లో పని వెతుక్కుంటారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పత్తి పొలాల్లో కలుపు మొక్కలు ఏరేందుకు వెళుతున్నారు. మగవారితో పాటు మహిళలు కూడా రోజూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎకరం పొలంలో కలుపు తీసేందుకు రూ.2 వేలు చొప్పున ఇస్తున్నట్లు కూలీలు చెబుతున్నారు. మండలంలో వర్షాలు లేక పంటలు అంతంత మాత్రమే ఉన్నాయని, ఇక్కడ పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వీబీ జీ రాంజీ పనులు గిట్టుబాటు కావడం లేదని ఆరోపించారు. -
మొక్కజొన్న వైపు మొగ్గు
ఎల్నినో ప్రభావంతో జిల్లా రైతులు తక్కువ నీటితో పండించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బోర్లు బావులు, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట కాల వ్యవధి కేవలం 3 నెలలు కావడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. పంటకు 15 రోజులకోసారి నీటి తడులు అందిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 26,364 హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ.30 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59,626 హెక్టార్లలో సాగవగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రైతులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. మరింత వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. – నంద్యాల(అర్బన్) -
వీబీఆర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు టీజీపీ లింక్ చానల్ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్లో నీటిమట్టం 254.01 మీటర్లు (833.33 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం 3.661 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 264.70 మీటర్లు కాగా, స్థూల సామర్థ్యం 16.95 టీఎంసీలు. ప్రస్తుతం క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేదు. టీజీపీ లింక్ చానల్ ద్వారానే 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 80 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 60 క్యూసెక్కులు ఆవిరీభవనం, సీపేజ్, ఇతర వ్యవస్థ నష్టాల రూపంలో నమోదవుతున్నాయి. ఇక 1ఎల్, 1ఆర్ కాలువలకు, టీజీపీ మెయినన్ కెనాల్కు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్వే ద్వారా అదనపు నీటి ప్రవాహం కూడా లేదు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
● మృతుడు పశ్చిమబెంగాల్ వాసి ● ఎల్సీ తీసుకోకముందే స్తంభం ఎక్కించడంతో ప్రమాదం జూపాడుబంగ్లా: విద్యుత్ అధికారులు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కాంట్రాక్టర్, సూపర్వైజర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండ్లెం గ్రామంలో ఆర్డీఎస్ఎస్ (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) పనులు చేస్తూ విద్యుదాఘాతంతో పశ్చిమబెంగాల్కు చెందిన రాజాషేక్ (28) మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు, అఽధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్డీఎస్ఎస్ పనులు చేసేందుకు సూపర్వైజర్లు శివ, అఖిల్ అధ్వర్యంలో కార్మికులు ఉదయం 10 గంటల మండ్లెం గ్రామంలోని పుల్లారెడ్డి బంకు వద్దకు చేరుకున్నారు. లైన్మెన్ రాజశేఖర్ ఆర్డీఎస్ఎస్తో పాటు మండ్లెం ఫీడర్ రెండింటికీ ఎల్సీ తీసుకోవాల్సి ఉండగా కేవలం మండ్లెం ఫీడర్కు మాత్రమే 10.20 గంటలకు ఎల్సీ తీసుకున్నట్లు విద్యుత్ సబ్స్టేషన్ రికార్డుల్లో నమోదు చేశారు. ఘటన ప్రాంతం వద్ద సీసీ కెమెరా దృశ్యాల్లో ఉదయం 10.16 గంటలకు విద్యుదాఘాతంతో స్తంభంపై నుంచి రాజాషేక్ కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. దీంతో లైన్మెన్ ఎల్సీ తీసుకోకముందే కార్మికుడిని విద్యుత్ స్తంభం ఎక్కించినట్లు తెలుస్తోంది. విద్యుత్షాక్తో స్తంభం పైనుంచి కిందపడిన రాజాషేక్ను అక్కడున్న కార్మికులు హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు అక్కడి నుంచి ఎస్కేప్ కావడం గమనార్హం. ఎస్ఐ మల్లికార్జున నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడు రాజాషేక్ పశ్చిమబెంగాల్ రాష్ట్రం, లక్ష్మిపూర్బెల్దాగ్ గ్రామం, వీటీసీ బాగ్బరి, పీఓ మలీహా, మల్దా జిల్లా వాసిగా ఆధార్కార్డు ప్రకారం వివరాలు బహిర్గమయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మృతుడి కుటుంబ సభ్యులెవరూ లేకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. బాధిత కుంటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పి సమస్యలేకుండా మృతదేహాన్ని పశ్చిమబెంగాల్కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
వేరుశనగను మేసిన వారిపై చర్యలు తీసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు ఉచితంగా విత్తన కాయలను పంపిణీ చేసి వేరుశనగ సాగును ప్రోత్సహించాల్సిన వ్యవసాయ అధికారులు లోపాయికారిగా అమ్ముకోవడం దారుణమని, దీనికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘సబ్సిడీ వేరుశనగలో ‘విశిష్ట’ దోపిడీ’ శీర్షికతో వార్తా కథనం ప్రచరితమైంది. దీనిపై సమగ్రంగా విచారణ జరుపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కాగా అంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, నాయకులు రాముడు, మహబూబ్బాషా తదితరులు వేరుశనగను దారి మల్లించడంపై జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చారు. డీఏఓ అందుబాటులో లేకపోవడంతో అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ.. జిల్లాలోని 16 మండలాలకు వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విశిష్ట రకం వేరుశనగ సరఫరా కాగా 90 శాతం దారిమల్లించి అమ్మేసుకున్నారని వాపోయారు. రైతులకు తీరని అన్యాయం చేసిన వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వసతి గృహాల నిర్మాణానికి రూ.25 లక్షల విరాళం
మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వర సదనం వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మ హైదరాబాద్లో పలువురు భక్తులను కలిశారు. హైదరాబాద్కు చెందిన డి.సుబ్రహ్మణ్యం, సంధ్యారాణి దంపతులు సూట్ రూమ్ నిర్మాణానికి రూ. 15 లక్షల చెక్కును వారికి అందించారు. అలాగే కూకట్పల్లిలో ఉంటున్న సన్నిధి సురేష్బాబు, లత దంపతులు రూ. పది లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి అందులో భాగంగా రూ. 2.50 లక్షలు మొదటి విడతగా చెల్లించారు. గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలకు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వసతి గృహాల నిర్మాణానికి దాతలు సహకరిస్తుండటం శుభపరిణామమని ఈఓ అన్నారు. గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్వైజర్ మృతి మహానంది: మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత (45) గుండెపోటుతో మృతి చెందారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన సూపర్వైజర్ కవిత మంగళవారం అంగన్వాడీ టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమానికి స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం సమావేశానికి వెళ్లిన ఆమె పాఠశాలలో ప్రేయర్ అనంతరం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, రిసోర్స్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే రెయిలింగ్పై కుప్ప కూలిపడిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు కారులో నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. కవిత మృతి విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ లీలావతి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ. 25 వేలు అందించారు. ఎంఈఓ రామసుబ్బయ్య, ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా నాయకులు హుసేన్రెడ్డి, తదితరులు కవిత మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాకు తెలుసులే.. రోడ్లు ఎక్కడేయాలో! ● సమస్యను విన్నవించిన ప్రజలతో ఎమ్మెల్యే జయసూర్య జూపాడుబంగ్లా: ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి దండాలు పెట్టి ఓట్లు అడిగిన నాయకుడు.. గెలిచిన తర్వాత అదే ప్రజలను చులకనగా మాట్లాడటం చూసి జూపాడుబంగ్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. మంగళవారం జూపాడుబంగ్లాలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసానగర్ కాలనీలో సిమెంటు రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని త్వరగా రోడ్లు నిర్మించి పుణ్యం కట్టుకోవాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. అయితే ‘మాకు తెలుసులేవయ్యా...ఎక్కడెక్కడ రోడ్లు లేవో, దెబ్బతిన్నాయో తెలుసు.. కొత్తరోడ్లు వేయించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మంజూరైన వెంటనే నిర్మిస్తామంటూ’ బదిలివ్వటంతో కాలనీవాసులు షాక్కు గురయ్యారు. అలాగే తమ కాలనీలో తాగునీటి ఇక్కట్లు తీర్చి పుణ్యం కట్టుకోండంటూ క్వార్టర్స్ కాలనీవాసులు మొర పెట్టుకున్నారు. ముస్లిం కాలనీలో శిథిలమైన 40 ఏళ్ల క్రితం నాటిని ట్యాంకును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ లు బషీర్, నాగేంద్రబాబు, ఏఓ కృష్ణారెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మిగనూరులో చోరీ
● 40 తులాలు వెండి, రూ.20 వేలు నగదు అపహరణ ● కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లడంతో దొంగల చేతివాటం ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని లక్ష్మీపేటలో రమేష్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలు.. లక్ష్మీపేటకు చెందిన బజ్జిల వ్యాపారి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల క్రితం అరుణాచలం, తిరుపతితో పాటు తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తలుపులకు లాక్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉంచిన రూ.20 వేల నగదు, 40 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. తీర్థయాత్రల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న రమేష్ కుటుంబ సభ్యులు గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా డోర్ లాక్ తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కంబగిరి రాముడు, ఏఎస్ఐ కిష్టప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పట్టణ పోలీసుల తెలిపారు. గడ్డివాముల దగ్ధం ● సుమారు రూ.3 లక్షలు నష్టం దొర్నిపాడు: మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో మంగళవారం గడ్డివాములకు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మద్దుబైగారి హుసేన్బాషాకు చెందిన మూడు గడ్డివాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే ఆళ్లగడ్డ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు కాలిపోయిన గడ్డివాములను పరిశీలించారు. కాడెద్దులు, గేదెలకు నోటికాడి మేత లేకుండా పోయిందని ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయంతో పాటు పశుగ్రాసం అందించాలని బాధితుడు కోరారు. సుమారు రూ.3 లక్షలు వెచ్చించి చొప్ప, వరిగడ్డితో వాములు వేసుకున్నట్లు చెప్పారు. అగ్నిమాపక కేంద్రం అధికారి భీముడునాయక్, ఎల్ఎఫ్ మనోహర్రెడ్డి, సిబ్బంది రమణయ్య, గుర్రప్ప ఉన్నారు. వాటర్ గ్రిడ్ పైప్ లీకేజీ బేతంచెర్ల: ఆర్ కొత్తపల్లె గ్రామ సమీపంలో మంగళవారం గోరుకల్లు వాటర్ గ్రిడ్ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృఽథాగా పోతోంది. బేతంచెర్ల నుంచి డోన్ వైపు వెళ్తున్న ప్రధాన పైపులైను పగిలి నీరు ఎగసిపడుతోంది. వాటర్ గ్రిడ్ అధికారులు స్పందించి పైప్లైన్కు మరమ్మతులు చేపట్టి విలువైన నీరు నేలపాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గుణీత్ రెడ్డి గురి తప్పలేదు! వెలుగోడు: రేగడగూడూరు గ్రామానికి చెందిన ఎన్. గుణీత్ రెడ్డి ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. జిల్లా క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి అమరావతిలో ఎస్ఏఏపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. గుణీత్ రెడ్డి ఇప్పటికే 2026 మార్చిలో ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటుకున్నాడు. తాజాగా జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తండ్రి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గుణీత్ రెడ్డి క్రమశిక్షణతో నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. -
కన్నీళ్లు దిగమింగి.. పైర్లను దున్నేసి!
తుగ్గలి: ప్రాణంతో సమానంగా చూసుకునే పైరును రైతు కన్నీళ్లు దిగమింగుకొని స్వయంగా ట్రాక్టర్తో దున్నేశాడు. వర్షాభావంతో పంట చేతికందకుండా పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆముదం, కంది పైర్లను ట్రాక్టర్తో దున్నేశారు. తుగ్గలి మండలంలోని ఉప్పర్లపల్లికి చెందిన రైతు సూర్యనారాయణాచారి తనకున్న 1.15 ఎకరాల్లో రెండు నెలల క్రితం ఆముదం, కంది పంటలు సాగు చేశాడు. సేద్యపు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు రూ.20 వేలకు పైగా ఖర్చు పెట్టారు. తర్వాత రెండు నెలలు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో పైర్ల ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు వర్షం కురిసినా పంట దిగుబడులు రావనే ఆవేదనతో మంగళవారం ట్రాక్టర్ గుంటెకతో పంటను దున్నేశాడు. మున్ముందు వర్షం వస్తే ప్రత్యామ్నాయ పంట ఏదైనా వేసుకునే అవకాశం ఉంటుందని పంటను దున్నేసినట్లు రైతు వాపోయాడు. -
శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకానికి పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఐదు రోజుల పాటు శ్రీశైల దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక క్రతువులు పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం స్వామివారి ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రుష్యశృంగ జపం, వారుణానుక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వ పారాయణలు, పంచాక్షరి జపం మొదలైనవి జరిపించారు. అలాగే యాగశాల ప్రవేశం, ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గోనెగండ్ల: మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బేస్త రమేష్ (20) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లికి చెందిన పెద్ద బడేసావ్, ఈశ్వరమ్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండెకరాల పొలం ఉంది. నాలుగేళ్ల క్రితం పెద్ద బడేసావ్ మృతిచెందాడు. దీంతో పెద్ద కుమారుడు రమేష్ పొలం పనులు చేస్తున్నాడు. గత నెలలో రూ.1.50 లక్షలు పెట్టి రెండు ఎద్దులను కొనుగోలు చేశాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా ఎద్దులు కట్టేసి ఉన్నాయి. రమేష్ సెల్ఫోన్ చెట్టుకింద పడిఉంది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మంగళవారం మల్లెల వాగు వంకలో రమేష్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని కొందరు రమేష్ను కొట్టి చంపి నీటి గుంతలో పడేశారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసుకున్నామని, శవ పరీక్ష నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. -
బంగారు నగలకు గిరాకీ
శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, గోస్పాడు మండలాలకు చెందిన మహిళలు బంగారు నగల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉంగరం మొదలుకుని అన్ని రకాల నగల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నారు. తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు పైగా పలుకుతున్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో బంగారు నగల వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాం. – పెండేకంటి సుబ్రమణ్యం, బంగారు నగల వ్యాపారి, కోవెలకుంట్ల -
టీడీపీ అక్రమ కేసులకు భయపడబోం
కల్లూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తేల్చి చెప్పారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలు రానున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి నేరుగా కర్నూలు జైలుకు చేరుకుని అక్కడ విరూపాక్షిని పరామర్శించనున్నారని తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లపై మంగళవారం కల్లూరులోని తన నివాసంలో జిల్లా ముఖ్యనేతలతో కాటసాని సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజ య మనోహరి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వకర్త కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య, నేతలు అహమ్మద్ అలీఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కల్లూరు అర్బన్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై నాయకులకు కాటసాని దిశానిర్దేశం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాటసాని ఆరోపించారు. కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ● రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. వీటిపై స్పందించని ప్రభుత్వం కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ● అక్రమ అరెస్టులు, దాడులతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పార్టీ మైనార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. జననేత స్ఫూర్తితో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ● 2029 ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య అన్నారు. ● రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య పాలన సాగుతుందా? అని.. కోట్ల హర్షవర్దన్రెడ్డి ప్రశ్నించారు. దాడులు, బెదిరింపులకు భయప డేది లేదన్నారు. రేపు కర్నూలుకు వైఎస్ జగన్ రాక వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో జాతీయ జెండా ఎగురవేయాలి
● 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలి ● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇళ్లు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల14న నిర్వహించే ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వామం కావాలన్నారు. డీఎఫ్ఓ, డ్వామా, డీఆర్డీఏ, డీఈఓ, మెప్మా శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలతోపాటు ప్రజలు తమ ఇళ్ల ఆవరణల్లో కూడా మొక్కలను పెంచుకోవాలని సూచించారు. అవసరమైన మొక్కలను డీఆర్డీఏ, మెప్మా శాఖలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అనే నేను భావనతో ప్రత్యేక సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించాలని, ఈకార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించే బాధ్యతను సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధానంగా చేపట్టాలని సూచించారు. ఆగస్టు 14,15 తేదీల్లో కలెక్టరేట్తోపాటు అన్ని ప్రభుత్వ భవనాలు, ప్రధాన ప్రజా ప్రదేశాలు, రైల్వే, బస్ స్టేషన్లలో జాతీయ పతాకం రంగుల్లో విద్యుత్ అలంకారణ చేపట్టాలన్నారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో దేశ నిర్మాణంలో తనవంతు బాధ్యత వహిస్తానని ప్రతిజ్ఞ చేయించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. యువత నేషనల్ బిల్డింగ్లో భాగస్వాములు పేరిట ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. -
వక్ఫ్బోర్డు ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తాం
● వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్కర్నూలు(సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల్లో కమర్షియల్పరంగా ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాలు వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండడంతో వాటిని కమర్షిల్ పరంగా వినియోగించేందుకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వక్ఫ్ విలువైన ఆస్తులను లీజు ప్రతిపాదికన 30 ఏళ్లకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత మసీదులకు, దర్గాలకు మాత్రమే చెందుతుందన్నారు. దానిలో కేవలం 7 శాతం మాత్రమే వక్ఫ్ బోర్డుకు వస్తుందన్నారు. విలువైన వక్ఫ్ ఆస్తులను గుర్తించి లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఆయన పలు వక్ఫ్ ఆస్తులను సందర్శించి అందులో షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు కట్టేందుకు చర్యలు తీసకుంటున్నట్లు చెప్పారు. వక్ఫ్బోర్డు ఆస్తులను ఎవరూ కొనడానికి, అమ్మడానికి వీలు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ తరువాత రాష్ట్రంలో 61 వేల ఎకరాల నుంచి 82 వేల ఎకరాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడినట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నామని, తద్వారా ఆస్తుల సంరక్షణకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కర్నూలులో రీజినల్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. 2016 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి సంబంధించిన వక్ఫ్ రికార్డులను ఇవ్వలేదని, ఇటీవల 2,800 రికార్డులను అప్పజెప్పిందని, వాటిని డిజిటలైజేషన్ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహా పర్వీన్ పాల్గొన్నారు. -
ఆయకట్టు తడిచేదెలా?
జూపాడుబంగ్లా: ఎత్తిపోతల పథకాల పనితీరు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈనెల 7వ తేదీన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకంలోని రెండు మోటార్ల స్విచ్ఛాన్ చేసి రైతులకు సాగునీటిని విడుదల చేశారు. అయితే మూడు రోజులకే జూపాడుబంగ్లా–1లోని మోటారు స్విచ్ఛాఫ్ కావటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011లో రూ.84.46 కోట్లతో పారుమంచాల, తంగడంచ, పి.లింగాపురం, తరిగోపుల, 80 బన్నూరు గ్రామాల్లోని 9,289 ఎకరాలకు సాగునీరు అందించేందకు ఒక్కో మోటారు 25 క్యూసెక్కుల సామర్థ్యంతో ఐదు మోటార్లతో జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. నీటిపంపింగ్ మోటార్లు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు మినహా మిగిలిన మైనర్ రిపేర్లు ఆయకట్టు రైతులు నీటితీరువా వసూలుతో చేయించుకోవాల్సి ఉంది. పొలాలకు నీటిని పారించుకొన్న తర్వాత రైతులు నీటితీరువా సక్రమంగా చెల్లించకపోవటంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జూపాడుబంగ్లా–1 పథకం కింద మూడు మోటార్లు ఉండగా ప్రస్తుతం ఓ మోటారు మినహా మిగిలిన రెండు మోటార్లు మరమ్మతులకు గురయ్యా యి. మిగిలిన ఓ మోటారు 60 శాతం మాత్రమే పనిచేస్తుండగా దాంతో మాత్రమే నీటిని పంపింగ్ చేసుకుటుండంతో పథకం కిందున్న 5,200 ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. బంగ్లా–2 పథకంలో రెండు మోటార్లు ఉండగా ఓ మోటారు మరమ్మతులకు గురవ్వగా ప్రస్తుతం ఓ మోటారు ద్వారా మాత్రమే సాగునీటిని పంపింగ్ చేస్తుండగా 4,089 ఎకరాల్లో కేవలం 30 శాతం మేర సాగునీరు అందుతోంది. ప్రతిపాదనలకు పరిమితమైన నిధుల మంజూరు జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకాల మోటార్ల మరమ్మతుల కోసం ఏపీఎస్ఐడీసీ అధికారులు రూ.3కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఇప్పటిదాకా నిధులు మంజూరు కాలేదు. నెలరోజుల క్రితం కలెక్టర్ రాజకుమారి గణియా తంగడంచ చెరువును పరిశీలించడానికి రాగా రైతులు ఆయకట్టు దుస్థితిని వివరించారు. దీంతో ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని రైతులకు హామీనిచ్చారు. వెంటనే ఏపీఎస్ఐడీసీ అధికారులు రూ.8 లక్షలకు ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నా పంటలు సాగు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రారంభించిన మూడు రోజులకే మొరాయించిన ఎత్తిపోతల–1 మోటార్లు ఎత్తిపోతల –2లో ఒక మోటారు ద్వారా మాత్రమే నీటి పంపింగ్ కలెక్టర్ హామీ ఇచ్చినా నిధులు నిల్ సాగునీరందక ఆయకట్టు రైతుల ఆందోళన ఎత్తిపోతల పథకం నీటితో పంటలు సాగు చేసుకున్న రైతులు నీటితీరువా చెల్లించటం లేదు. దీంతో మైనర్ రిపేర్లు కూడా చేసుకోవడం కష్టమవుతోంది. మరమ్మతులకు గురైన మోటార్ల రిపేరీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం జూపాడుబంగ్లా–2లో ఒక మోటారు ద్వారా మాత్రమే నీటిని పంపింగ్ చేస్తున్నాం. – సాంబశివుడు, ఏపీఎస్ఐడీసీ టీఏ -
ఆది దంపతులకు పూజలు
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణరథారూఢులైన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. సోమవారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు అర్చకులు వైదికపరమైన విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథంపై కొలువై ఉన్న స్వామిఅమ్మవార్లకు పూజలు చేపట్టారు. సహస్ర ఘటాభిషేక విశేష పూజలు నిర్వహిస్తున్నందున స్వర్ణరథోత్సవ ఊరేగింపును నిలుపుదల చేశారు. ఈ పూజల్లో దేవదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 121 వినతులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సునీల్ షోరాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 121 వినతులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాటాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ల పోలీసులు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. బాధితుల ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించిన వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం చేరవేయాలని సూచించారు. వీబీఆర్కి 4 వేల క్యూసెక్కులే వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తెలుగుగంగ ప్రాజెక్టు లింక్ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో వీబీఆర్లో 3.322 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 264.70 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 253.54 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.32 టీఎంసీలుగా ఉంది. తెలుగుగంగ లింక్ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి ప్రస్తుతం ఎలాంటి నీటి ప్రవాహం లేదు. వీబీఆర్ నుంచి సగటున 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ప్రజా వినతులపరిష్కారంలో నిర్లక్ష్యమొద్దు నంద్యాల: ప్రజల వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించా రు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూర జ్ ధనుంజయ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. అలాగే రెవెన్యూ క్లినిక్ల ద్వారా మొత్తం 165 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. -
బిల్లులు ఇవ్వడంలో జాప్యమెందుకు?
కోవెలకుంట్ల: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రెండేళ్లు దాటిపోయినా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలకు చేరుకుని బిల్లుల జాప్యంపై అధికారులను నిలదీశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో కాంట్రాక్టర్లు సీసీరోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథక పనులను సొంత నిధులు వెచ్చించి పూర్తిచేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్రెడ్డి బిల్లులు మంజూరు చేయవద్దని అడ్డు చెప్పారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల జీవితాలతో చెలగాటమాడుతారా అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించి బిల్లులు తక్షణమే విడుదల చేయకపోతే కాంట్రాక్టర్లతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డు ఎద్దుల మార్కెట్ వద్ద సోమ వారం మధ్యాహ్నం కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ టైర్ పేలిపోవటంతో అదుపు తప్పి బోల్తా పడింది. వివరాలు.. చైన్నె నుంచి ఎంహెచ్04ఎన్ బీ3278 అనే నెంబర్ గల లారీ ముంబాయికి కట్టెల లోడ్తో వెళ్తుంది. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ వద్దకు రాగానే లారీ వెనుక రెండు టైర్లు పేలడంతో లారీ అదుపుతప్పి రోడ్డు డివైండర్ మధ్యలో బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ సాజిద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ బోల్తా పడినప్పడు ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. చెలరేగిన కర్నూలు బ్యాటర్లు అనంతపురం: ఏసీఏ సీనియర్ మెన్స్ సౌత్జోన్ అంతర్ జిల్లా మల్టీడే క్రికెట్ టోర్నీలో కర్నూలు జట్టు బ్యాటర్లు చెలరేగారు. ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న పోటీల్లో సోమవారం అనంతపురం, కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 375 పరుగులు సాధించింది. బ్యాటర్ ఎ.సాయి సూర్యతేజారెడ్డి 133 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. తౌఫిక్ హుస్సేన్ 72 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. అనంత బౌలర్లలో పి.గిరినాథరెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
మహానందిలో భక్తుల సందడి
మహానంది: మహానంది క్షేత్రంలో భక్తుల సందడి కొనసాగుతోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్థానిక కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండరామాలయం, ఆంజనేయస్వామి, వినాయకనంది, గరుడనంది క్షేత్రాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవారికి కల్యాణం, రాత్రి యాగశాలలో ఏకాంత సేవ పూజలు చేశారు. మహానంది, నంద్యాల, శిరివెళ్ల తదితర మండలానికి చెందిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వేకువజామున ఆలయ మాడవీధుల్లో శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసి పూజలు చేపట్టారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందిస్తున్నారు. గాజులపల్లె రైల్వేస్టేషన్ గ్రామంలో వెలిసిన శ్రీ గంగ, గౌరీ సమేత మరకతలింగేశ్వరస్వామి, నవగ్రహ దేవాలయాల్లో వెలిసిన మరకతలింగేశ్వర స్వామి సన్నిధిలో లయ వ్యవస్థాపకులు కనమర్లపూడి మస్తాన్రావు ఆధ్వర్యంలో సోమవారం ఆరుద్ర నక్షత్రోత్సవం పూజలు వైభవంగా చేపట్టారు. -
నష్టం మొలకెత్తి.. కష్టం మట్టిలో కలసి!
కరువు ఉరమడంతో రైతు కష్టం మట్టిలో కలిసిపోతుంది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలను కాపాడుకోలేక దున్నేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఎల్నినో దెబ్బకు వరుణుడు జాడ లేకపోవడంతో పంటలు బెట్టపోవడంతో రైతులు ఆశలు వదులుకుని చెరిపేస్తున్నారు. పెట్టుబడితో పాటు రైతుల రెక్కల కష్టం మట్టిపాలవుతోంది. చాకరాజువేముల గ్రామానికి చెందిన మిన్నల్ల అనే కౌలు రైతు 25 ఎకరాలు మినుము సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడులు వెచ్చించాడు. కానీ పంట ఎండుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ పంట చేసుకునే క్రమంలో మినుమును ట్రాక్టర్తో దున్నేశాడు – దొర్నిపాడు -
సబ్సిడీ వేరుశనగలో ‘విశిష్ట’ దోపిడీ!
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం కింద రైతులకు వంద శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. కొందరు అధికారుల ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అమలు చేశారనే విమర్శలు వచ్చాయి. డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అక్రమాలు సీఎం కార్యాలయం దృష్టికి కూడా వెళ్లాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు సబ్ డివిజన్లోని మండలాలు, చిప్పగిరి, కౌతాళం, నందవరం మండలాలు మినహా 16, నంద్యాల జిల్లాలో మూడు(ప్యాపిలి, డోన్, బేతంచెర్ల) మండలాల్లో ఈ పథకం అమలవుతోంది. రైతులకు వంద శాతం సబ్సిడీతో టీసీజీఎస్–1694(విశిష్ట) రకం వేరుశనగ విత్తనం కాయలను పంపిణీ చేయాలి. కర్నూలు జిల్లాలో 2 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు 3,000 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 1,000 హెక్టార్లలో సాగు చేసేందుకు 1,500 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు. వ్యవసాయ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కుమ్మకై ్క వేరుశనగను దారిమళ్లించారు. పర్యవేక్షణ లేక.. సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను డి–క్రిషి యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ అధికారులు తమకు కావాల్సిన రైతుల పేర్లను డి– క్రిషి యాప్లో నమోదు చేశారు. రెండు మండలాల్లో కొంత మేర పంపిణీ కాగా .. మిగిలిన చోట్ల దారిమళ్లించారు. పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 4,500 క్వింటాళ్ల విశిష్ట రకం వేరుశనగను కేటాయిస్తే కేవలం 10 శాతం పంపిణీ చేశారు. అది కూడా పంపిణీ చేసినట్లు అనిపించుకోవడానికి ఫొటోలు దిగేందుకు మాత్రమే అని తెలుస్తోంది. మొత్తం 4,000 క్వింటాళ్లకుపైగా బ్లాక్ మార్కెట్కు తరలించారు. సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల క్వింటా ధర రూ.10200 ఉండా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉమ్మడి జిల్లాకు రూ.4.59 కోట్ల వ్యయంతో సరఫరా చేయగా..రూ.3 కోట్ల విలువైన వీటిని దారిమళ్లించి జేబులు నింపుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యాపారులకు అమ్మేసి.. విశిష్ట రకం వేరుశనగ విత్తన కాయలను హెచ్సీఎల్ కంపెనీ సరఫరా చేసింది. వీటిని రైతులకు పూర్తి సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయాలి. అయితే వ్యాపారులకు క్వింటా రూ.7,000 నుంచి రూ.8,000 ధరతో అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో జిల్లా, డివిజినల్ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షించాల్సిన అధికారులే చూసీనట్లు వ్యవహరించడంతో హెచ్సీఎల్ కంపెనీ నుంచి కమిషన్లు వసూలు చేశారు. తొలుత ఈ కంపెనీ రెండు లారీల విత్తన కాయలను సరఫరా చేసింది. కమిషన్ల ఒప్పందం ఖరారు కాకపోవడంతో నాణ్యత లేదనే కారణంతో తిప్పి పంపారు. కమిషన్లు అందడంతో వెనక్కి పంపిన దాన్నే తిరిగి తీసుకున్నారు. పక్కదారి పట్టిన జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం రూ.4.59 కోట్ల వేరుశనగ 4,500 క్వింటాళ్లు సరఫరా పంపిణీ ఫొటోలకు పరిమితం బ్లాక్ మార్కెట్కు 90 శాతం వేరుశనగ రూ.3 కోట్లకుపైగా దండుకున్న వైనం -
ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు ఎత్తేయాలి
కర్నూలు(సెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలని బోయ వాల్మీకి సమితి డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు వాల్మీకి నాయుడు, కప్పట్రాళ్ల రాజశేఖర్, సర్పంచ్ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, వాల్మీకి రైతు సంఘం నాయకులు కృష్ణ, మద్దిలేటి మాట్లాడుతూ.. చిప్పగిరి మండలం సంగాలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఆ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన భార్య దుస్తులను చింపిన వైనాన్ని చూసి చెప్పవచ్చన్నారు. కేవలం ఎమ్మెల్యేపై కేసు పెట్టడం కోసం భార్య బట్టలు చింపిన నాగరాజు.. ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తించాడో బయటకు వచ్చిన వీడియోనే సాక్ష్యమన్నారు. మహిళను అవమానించిన నాగరాజుపై పోలీసులు కేసు పెట్టకుండా బోయ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై కేసు పెట్టడం అన్యాయమన్నారు. మరోవైపు గ్రామాల్లో ఎస్సీలు, బోయలు/వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా సంగాలలో పావులు కదిపారని చెప్పారు. నాయకులు తిరుమలేష్, మోహన్, హేమంత్ పాల్గొన్నారు. -
108లో గర్భిణి ప్రసవం
ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి గర్భవతి అరికంటి శైలును తరలిస్తుండగా 108 అంబులెన్స్లో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఏనుగుబాల గ్రామానికి చెందిన ఈమెకు నొప్పులు రావటంతో ఆదివారం అర్ధరాత్రి 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో కాన్పు కావటంతో గ్రామానికి చేరుకున్న అంబులెన్స్లో ఎమ్మిగనూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా కలుగొట్ల గ్రామ సమీపంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇద్దరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినట్లు ఈఎంటీ కై లాస్ తెలిపారు. అంబులెన్స్లో పైలెట్ పరుశురాం, బంధువులు ఉన్నారు. వామ్మో కోడెనాగు మహానంది: తిమ్మాపురం నుంచి జమాలయ్యదర్గా వెళ్లే మార్గంలో ఉన్న అశోక్కుమార్కు చెందిన అరటి పొలంలో సోమవా రం కోడెనాగు ప్రత్య క్షం కావడంతో వ్యవసాయ కూలీలు భ యాందోళనకు గురయ్యారు. అశోక్కుమార్ వెంటనే అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించడంతో వెంటనే పొలం వద్దకు చేరుకుని సుమారు ఆరు అడుగుల పొడవున్న కోడెనాగును పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు. డ్రంకన్ అండ్ డ్రైవ్లో ముగ్గరికి జైలు శిక్ష డోన్ రూరల్: వివిధ ప్రాంతాల్లో డ్రంకన్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 8 మందిలో ముగ్గురికి జైలు శిక్ష, ఐదుగురికి ఒక్కొక్కరి చొప్పున రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. డోన్ టౌన్ పోలీస్ సేష్టన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన పట్టణానికి చెందిన టీఆర్ నగర్కు చెందిన పి.వెంకటేష్కు ఏడు రోజులు జైలు శిక్ష, పాతపేటకు చెందిన ఈడిగ ప్రతాప్కు, చిగురుమానుపేటకు చెందిన డి. మహబూబ్ బాషాకు నాలుగు రోజులు జైలు శిక్ష పడింది. కొత్తపేటకు చెందిన డి. బాలాంజనేయులు, వైఎస్ నగర్కు చెందిన జి విజేయుడు, టీఆర్ నగర్కు చెందిన విష్టు వర్ధన్ ఆచారి, చిగురుమానుపేటకు చెందిన రామాంజినేయులు, సుజాతమ్మనగర్కు చెందిన శ్రీరాములుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం డోన్ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. -
మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీశైల మల్లికార్జున స్వామివారికి శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. సోమవారం వేకువజామున రుద్రహోమం నిర్వహించారు. చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు జరిపించారు. ఆరుద్రోత్సవ పూజాదికాల తర్వాత అర్చకులు ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. అనంతరం మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీమాతల్లికి పూజాదికాలు జరిపి కలశాలలో పుణ్య జలాలను అర్చకులు తీసుకువచ్చారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు కృష్ణవేణినదీజలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాది అర్చనలను నిర్వహించారు. అనంతరం జలకలశాలను తలపై ఉంచుకుని వేదమంత్రాల నడుమ భజంత్రీలతో నంది ఆలయం వద్దకు చేరుకున్నారు. నందిగుడిలో నందీశ్వరస్వామివారికి, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి, క్షేత్రపాలకుడు బయలువీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలు జరిపించారు. జలకలశాలతో ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో ఉన్న ప్రధాన కలశాలకు, ఇతర కలశాలకు, కృష్ణవేణినదీజల కలశాలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత మల్లికార్జున స్వామివారికి సహస్రఘటాభిషేకం ప్రారంభించారు. ఈ ఘటాభిషేకం పూర్తయ్యేంత వరకు నిరంతరంగా అర్చకులు రుద్రమంత్రాలను పఠించారు. అభిషేక అనంతరం మహానివేదన, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు జరిపించారు. ఘటాభిషేక సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు డుగుల మేర తాత్కాలికంగా గోడ కట్టారు. దీంతో రోజంతా స్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు. వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 9.15గంటలకు పూర్ణాహుతి, కలశద్వాసన, మహాదాశీర్వచనంతో వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక విశేష పూజలు ముగుస్తాయి. పూజల్లో దేవదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ఘోరకల్లు
● అటకెక్కిన జలాశయ మరమ్మతులు ● పూర్తిగా దెబ్బతిన్న రిజర్వాయర్ కట్ట ● గోరుకల్లులోకి వచ్చిన కృష్ణా జలాలు పాణ్యం: రాయలసీమకు సాగు, తాగు నీటిని తరలించడంలో కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేర్ నుంచి ఎస్సార్బీసీకి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా అవి ఆదివారం గోరుకల్లు జలాశయానికి చేరాయి. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది జలాశయంలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ తాత్కాలిక పనులు పది శాతం కూడా పూర్తికాలేదు. ఈ జలాశయం సామర్థ్యం 12.4 టీఎంసీలు కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 11.2 టీఎంసీల నీటిని నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. ఈ కట్టను పరిశీలించేందుకు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి చూసి తాత్కాలిక పనులకు డీఎంఎప్ నిధుల కింద రూ. 2.50 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ పనులను గత నెలలో ప్రారంభించారు. ఓటీ రెగ్యులేటర్ వద్ద కుంగిన కట్టను పూర్తి చేయలేదు. దాదాపుగా ఐదు ప్యానెళ్లు దెబ్బతిన్న కట్ట పది అడుగులపైగానే కుంగిపోయింది. కేవలం రెండు ప్యానెళ్లు మాత్రమే పూర్తి చేశారు. నిర్వహణ గాలికి! గోరుకల్లు జలాశయం నిర్వహణను గాలికొదిలేశారు. కట్టపై కనీసం కంపచెట్లు తొలగించలేదు. అంతేగాక కట్టకు భారీగా నెర్రలిచ్చాయి. దాదాపు 10 అడుగులపైగానే గోతులు పడ్డాయంటే నిర్వహణ ఎంత మాత్రంగా ఉందో అర్థమతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 60లక్షలు ఖర్చు చేసి కట్టపై కంపచెట్లు తొలగించారు. అంతేగాక కట్ట రివ్యూట్మెంట్ పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం గోరుకల్లులో 2.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడే! పనులు పూర్తికాకుంటే గోరుకల్లు భద్రతకు అటంకం కలుగుతుందని నిపుణులు కమిటీ నిర్ధారించింది. తక్షణమే పనులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే మంత్రి పరిశీలిన తర్వాత పెండింగ్ పనులకు రూ. 53కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు కేటాయించి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో జలాశయ భద్రత దేవుడికెరుక అన్నట్లు తయారైంది. పనులు పూర్తికాకపోవడంతో తరచూ సమస్య నెలకొంటోందని సీనియర్ ఇంజినీర్లు అభిప్రాయ పడుతున్నారు. -
బూటకపు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిడోన్: మోసాలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి అధోగతి పాలైందన్నారు. సూపర్ సిక్స్ హామీల మాటున అనేక బూటకపు వాగ్దానాలను ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారన్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రతి నెలా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల పింఛన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి 60 ఏళ్లపైబడిన వారిలో ఒక్కరికై నా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఆచరణ యోగ్యం కాని హామీలిచ్చి మహిళలను మరోసారి మోసగించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందన్నారు. ర్యాలీని విజయవంతం చేయండి.. డీఎస్సీ – 2025లో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమ వారం డోన్ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కొత్తబస్టాండ్ సమీపంలోని మధు ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ కంబాలపాడు సర్కిల్, పాతబస్టాండ్ మీదుగా సమైక్యాంధ్ర కట్ట వద్దకు చేరుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులు, యువత, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలన్నారు. -
శ్రీశైలానికి పడిపోయిన ఇన్ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: జూరాల నుంచి శ్రీశైలంకు వస్తున్న వరద ప్రవాహం ఆదివారం పడిపోయింది. గత కొద్ది రోజుల వరకు 2.11 లక్షల పైచిలుకు ఉన్న ఇన్ఫ్లో శనివారం 1.68 లక్షలకు పడిపోయింది. ఆదివారం జూరాల నుంచి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 60,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జునసాగర్కు 48,511 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.883 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 11.400 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 181.0590 టీఎంసిల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 878.60 అడుగులకు చేరుకుంది. పోటెత్తిన భక్తులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజుల రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడంతో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. క్వింటా వేరుశనగ రూ.8,702 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.8,702 ధర లభించింది. మార్కెట్కు 2,932 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.2,100, మధ్యస్థ ధర రూ.6,230 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. -
13న కర్నూలుకు వైఎస్ జగన్ రాక
● ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జననేతకల్లూరు: అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లపై కల్లూరులో ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇసాక్బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం సమీక్షించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విలేకరులకు వివరించారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఆగస్టు 13న చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కర్నూలులోని పంచలింగాల సబ్జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి వద్దకు వెళ్తారన్నారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులను పరామర్శిస్తారని తెలిపారు. ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులకు ధైర్యాన్ని ఇచ్చేందుకే.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమో దు చేస్తున్నారని కాటసాని ఆరోపించారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేరుగా వస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దనే సందేశాన్ని ఇచ్చేందుకు తమ పార్టీ అధినేత వస్తున్నారని తెలిపారు. పోలీసు వ్యవస్థను రాజకీయాలకు వినియోగించుకుంటూ సామా న్య ప్రజలపై కూడా నేడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హద్దులు దాటి విధులు నిర్వహించే అధికారులు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ నాయకుల అక్రమ కేసులు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శ్రీదేవి, గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, నియోజకవర్గ ఇన్చార్జ్లు రాజీవ్రెడ్డి, ధారా సుధీర్, కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఆదిమూలపు సతీష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, మంత్రాలయం నేత ప్రదీప్రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
● 25 ఏళ్లుగా పనిచేస్తున్న 13 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల నిర్దయగా తొలగింపు ● చాగలమర్రి మేజర్ పంచాయతీలో వాటర్ వర్కర్లపై కక్షసాధింపు ● టీడీపీ నాయకుల ఒత్తిడి ముందు మోకారిల్లిన అధికారులు ● అనుచరులకు పోస్టులు అమ్ముకునేందుకు నాయకుల కుట్ర ● ఒక్కో పోస్టుకు
గత 25 సంవత్సరాలుగా ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేశాం. మోటార్ పాడైనా, పైపులైన్ పగిలినా అర్ధరాత్రి, తెల్లవారు జామున, వర్షం వచ్చినా, చలి పెడుతున్నా ఆగలేదు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోయినా అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొచ్చాం. ఇటీవల ఘుగర్ ఎక్కువై కాలు తీశేశారు. ఈ సమయంలో ఉన్న ఫలంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలా? ఏం తినాలి? ఎలా బతకాలి? 25 ఏళ్లుగా గ్రామ పంచాయతీకీ చేసిన సేవకు ఇదేనా అధికారులు మాకిచ్చే బహుమానం?. – ఇర్ఫాన్ 25 ఏళ్లుగా మాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఏదైనా ఆ వీధిలో నీళ్లు రాలేదు, ఇక్కడ పైపులైన్ లీక్ అయింది.. అని ఫిర్యాదులు వస్తాయి. అధికారులు చెబితే వెంటనే అక్కడకు వెళ్లి పునరుద్ధరించడం జరుగుతుంది. ఇన్నేళ్ల చరిత్రలో ఎవరూ మమ్మలను ఉద్యోగంలో నుంచి తీసేయమని ఫిర్యాదు చేయలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేవలం మమ్మలను తొలగించేందుకు రాజకీయ కుట్ర చేశారు. వయస్సంతా ఇక్కడే అయిపోయింది. ఈ వయస్సులో ఏం పనిచేస్తాం. – ఎస్. ఫారూక్ ఆళ్లగడ్డ: అబద్ధాలు చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు రోజురోజుకు పరాకాష్టకు చేరుతున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల్లో అల్ప వేతనాలకు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే చిరు ఉద్యోగులకు రాజకీయ రంగు పులిమి రోడ్డున పడేస్తోంది. చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీలో తెలుగు దేశం పార్టీ నేతలు అధికార బలంతో సామాన్య కార్మికుల పొట్ట గొట్టి వారి స్థానాల్లో తమ అనుచరులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాతికేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసే 13 మంది తాగునీటి కార్మికుల (వాటర్ వర్కర్స్, పంప్ ఆపరేర్లు)పై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా వారిని తొలగించి తమ వారికి ఈ పోస్టులను అమ్ముకోవాలన్న ‘పచ్చ’ కుట్రతో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నేతలకు గులాంలా మారిన అఽధికారులు మానవత్వాన్ని తుంగలో తొక్కి 13 మంది చిరుద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల్లోంచి తొలగించారు. దీని వెనుక పెద్ద రాజకీయ దుశ్చర్య దాగి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతలు ఆదేశించారు.. అధికారులు పాటించారు చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీలో 2000లో నాసిర్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 13 మంది నీటి సరఫరా ఉద్యోగులు, ముగ్గురు వీధి దీపాల నిర్వహణ సిబ్బందిని తీసుకున్నారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా.. స్థానికంగా ఎవరు అధికారంలోకి వచ్చినా వీరినే రెన్యువల్ చేస్తూ కొనసాగిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు నీటి సరఫరా చేస్తున్న 13 మందిని తొలగించి వారి స్థానంలో అనుచరులను నియమించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి సిబ్బందిని పిలిచి ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నామని చెప్పడంతో చిరుద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాతికేళ్ల సుదీర్ఘ సర్వీసును కూడా లెక్కచేయకుండా, పేద కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు కుట్రలు పన్నడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చక్రం తిప్పుతున్న కంప్యూటర్ ఆపరేటర్ ప్రస్తుతం నాసిర్ ఏజెన్సీలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ప్లేట్ ఫిరాయించి అధికార పార్టీకి జై కొట్టాడు. అంతే ఇన్ని రోజులు జీతం ఏజెన్సీ ని రద్దు చేసి కొత్తగా అధికార పార్టీ నేతకు సంబందించిన ఏజెన్సీని రిజిస్టర్ చేయించడంతో పాటు వారికే టెండర్ వచ్చేలా చేశారు. అంతే ఈ 13 ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు బేరం కూడా అతడే కుదర్చడంతో పాటు అందులో ఎవరికి ఎంత అని పంపకాలు రాసిపెట్టుకున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా కేవలం ఉద్యోగాలను అమ్ముకోవడానికే చిరుద్యోగులపై వైఎస్సార్ ముద్ర వేసి తొలగించడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల అరియర్స్తో ఐఫోన్ గిఫ్ట్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన అరియర్స్ నిధులను కంప్యూటర్ ఆపరేటర్ స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమానికి అడ్డు రాకుండా ఉండేందుకు ఆ డబ్బుతోనే ఓ అధికారికి సుమారు రూ. 1.40 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ కూడా ప్రస్తు తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడం గమనార్హం. కోర్టు తీర్పులంటే లెక్కే లేదు..కార్మికుడిపై ఫిర్యాదు వస్తే.. తప్పు చేశాడని భావిస్తే అధికారి ప్రొసిజర్ ప్రకారం చార్జ్ మెమో ఇవ్వడం, వివరణ కోరడం ప్రాథమిక నియమం. ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించ డం సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన అని, అది చాలా పెద్ద శిక్ష అని ఇటీవల ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సైతం ఇలాంటి కేసుల్లో అధికారులకు మొట్టికాయలు వేసింది. అయినా చాగలమర్రి పంచాయతీ అధికారులు, టీడీపీ నాయకులు ఆ తీర్పులను పూర్తిగా తొంగలో తొక్కారు. అలా.. ఎలా? ఎక్కడైనా ఉద్యోగులు సక్రమంగా పని చేయలేదంటే వారిపై అప్పుడప్పుడు ఫిర్యాదులు రావడం సహజంగా జరుగుతుంటుంది. అయితే చాగలమర్రి పంచాయతీలో మాత్రం ఒకే రోజు గత నెల 17వ తేదీ మొత్తం 13 మంది సిబ్బందిపైనా 13 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని అదే రోజు విచారించి వీరు తప్పు చేసినట్లు ధ్రువీకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం, మరుసటి రోజే వీరిని విధుల నుంచి తొలగించడంతో పాటు కొత్త ఎజెన్సీకి అనుమతి ఇవ్వడం పై ప్రజలు నవ్వుకుంటున్నారు.ఉన్నట్టుండి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 13 మందిని తొలగిస్తున్నామని ఈఓ చెప్పారు. ఎందుకు అంటే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. సరే మాకు రావాలిసిన 3 నెలల జీతమైనా ఇవ్వండి అంటే.. జీతం ఇవ్వాలంటే రూ. 100 స్టాంపుపై మేము కోర్టుకు వెళ్లం, ఏ రాజకీయ పార్టీల నాయకుల దగ్గర పంచాయితీ పెట్టమని రాసి స్తే జీతాలు ఇస్తామంటున్నారు. ఒక వేళ కోర్టుకు పోతే మాకు ఇవ్వాల్సిన జీతాలతోనే కోర్టు ఖర్చులు పెట్టుకుంటామని అధికారులు బెదిరిస్తున్నారు. – ఫారూక్ 16 మంది సక్రమంగా పనిచేయలేదని రాత పూర్వకంగా ఫిర్యా దులు వచ్చాయి. గత సెక్రటరీ వాటిని విచారించి జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించడంతో కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే వారికి అప్పగించడం జరిగింది. అయితే ఇందులో తక్కువ ఫిర్యాదులు వచ్చిన వారిని మళ్లీ కొత్త ఏజెన్సీ ద్వారా కొనసాగిస్తున్నాం. పెండింగ్లో ఉన్న జీతాలు త్వరలో ఇస్తాం. – సబియాబేగం, పంచాయతీ సెక్రటరీ -
గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: గిరిజనుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్ను నిర్మించుకోవాలన్నారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో ని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యా ర్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డీడీ, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిరసనాగ్రహం
నంద్యాల: డీఎస్సీ – 2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. శనివారం మూడవ రోజు పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలకు భారీగా హాజరయ్యారు. జిల్లాలోని నంద్యాల, చాగలమర్రి, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, కొత్తపల్లిలో చేపట్టిన రిలే నిరహార దీక్షకు ప్రజలు, యువత నుంచి విశేష స్పందన లభించింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని యువత, నిరుద్యోగులు నినాదాలు చేశారు. -
సున్నిపెంట ఆక్రమణలపై నివేదిక సిద్ధం చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: సున్నిపెంటలోని ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో కలిసి సున్నిపెంటలోని ఆక్రమణలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సున్నిపెంట పరిధిలోని ఆక్రమణలకు సంబంధించి అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, భూ సర్వే వివరాలను ఆధారంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలన్నారు. ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాల సంఖ్య, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, గతంలో ఎవరికై నా పట్టాలు జారీ చేశారా? లేదా అనే అంశాలను కూడా పరిశీలించి డేటాను సిద్ధం చేయాలన్నారు. గతంలో జరిగిన పరిశీలనలు, సంబంధిత కేసులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు. కోర్టు కేసుల పరిధి, అందుబాటులో ఉన్న రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేయాలన్నారు. హైకోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్కు అవసరమైన వాస్తవ వివరాలను సంబంధిత రికార్డుల ఆధారంగా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ వెంకట శివ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీరాం, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలోకి జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం వరకు శ్రీశైలానికి 2,11,632 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం నాటికి ఇన్ఫ్లో 1,68,020 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 47,278 క్యూసెక్కుల నీరు విడుదలైంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగర్జునసాగర్కు 37,141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,133 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం జలాశయంలో 176.7402 టీఎంసిల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 877.70 అడుగులకు చేరుకుంది. -
బాల శాస్త్రవేత్తలకు అవకాశం
● విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇన్స్పైర్ మనక్ ● నమోదుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ● నవీన ఆలోచనలు ఆవిష్కరణకు ప్రోత్సాహంనంద్యాల(న్యూటౌన్): బాల్యం నుంచే పిల్లల్లో సైన్స్పై ఆసక్తిని పెంపొందించి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్ మనక్’ను అమలు చేస్తోంది. నవీన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలతో ప్రతిభ చాటిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశాలను కల్పిస్తోంది. అవార్డు 2026–27కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇన్స్పైర్ మనక్లో ప్రతిభ కనబరిచి సమాజాన్ని ప్రభావితం చేసే అత్యుత్తమ ఆవిష్కరణలు రూపొందించే విద్యార్థులకు నేరుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాగే జాతీయ సాంకేతిక ప్రదర్శనల్లో పాల్గొనే వెసులుబాటు కూడా దక్కుతుంది. అర్హులు వీరే.. 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు కలిగి ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, ఏపీ మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాల నుంచి గైడ్ టీచర్తో కలిసి విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుంది. పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్లు చొరవ తీసుకుని విద్యార్థుల నూతన ఆలోచనలను పోర్టల్లో నమోదు చేయించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఇలా... ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడి సహాయంతో www.inspireawards.gov.in వైబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో 2022–23 గాను జిల్లా స్థాయిలో 183, రాష్ట్ర స్థాయిలో 17, 2023–24కి సంబంధించి జిల్లా స్థాయిలో 126, రాష్ట్రస్థాయిలో 12, 2024–25కి సంబంధించి జిల్లాస్థాయిలో 153, రాష్ట్రస్థాయిలో 14, 2025–26వ సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయిలో 143 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగం కోసం విద్యార్థి ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై తే రూ.25 వేలు, జాతీయస్థాయికి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభావంతులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తారు. నవీన ఆవిష్కరణపై పేటెంట్తో పాటు ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు ఇన్స్పైర్ మనక్ దోహదపడుతుంది. గైడ్ టీచర్లు విద్యార్థులతో మాట్లాడి, సమాజంలో రోజువారీ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న ప్రాజెక్టులను ఎంపిక చేయాలి. నామినేషన్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అర్హత ఉన్న ఏ విద్యార్థి కూడా అవకాశాన్ని కోల్పోకూడదు. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల -
గోవింద.. గోవిందా !
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రం కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తు లు శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.సంగమేశ్వరానికి సందర్శకుల తాకిడి కొత్తపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిగా కృష్ణానది జలాలో జలాదీవాసం అయ్యింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా జూరాల నుంచి 2,32,308 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటిమట్టం 876.20 అడుగులకు చేరుకుంది. దీంతో మండలంలోని సంగమేశ్వరాలయం ఎగువ పుష్కరఘాట్ వద్ద శ్రీశైలం వెనుక జలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రెండవ శనివారం సెలవుదినం కావడంతో భక్తులు సందర్శకులు ఎగువ పుష్కరఘాట్ వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను ఆస్వాదించారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి ఎగువన ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేసుకున్నారు. విదేశాలకు పార్సిల్ సౌకర్యం నంద్యాల(వ్యవసాయం): విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు, వినియోగదారులకు సరుకులు, ఇతర పార్సిళ్లను ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీస్ నుంచే పంపే అవకాశం ఉందని నంద్యాల డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ అప్పలస్వామి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ నాలుగు రకాల అంతర్జాతీయ సేవలను అందుబాటులో తీసుకొచ్చిందని తెలిపారు. ఇంటర్నేషనల్ ట్రాక్ట్ ప్యాకెట్ సర్వీస్లో తక్కువ బరువు ఉన్న బహుమతులతో సహా రకరకాల వస్తువులను పంపుకోవచ్చు అని తెలిపారు. ఎయిర్ పార్సిల్ సర్వీస్లో ఎక్కువ బరువును కలిగిన పార్శిల్ను పంపుకునే వెసులుబాటును కల్పించారని వివరించారు. పార్సిల్ బరువు, పంపుతున్న దేశ ఆధారంగా ధర ఉంటుంది అని తెలిపారు. -
శ్రీగిరిపై భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. శనివారం ప్రభుత్వ సెలవురోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయా యి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
అవుకులో సినిమా షూటింగ్
కొలిమిగుండ్ల(అవుకు): ఉప్పులపాడు రోడ్డులోని అవుకు రిజర్వాయర్ వద్ద శనివారం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హైందవ సినిమా షూటింగ్ జరిగింది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. రిజర్వాయర్ బ్రిడ్జితో పాటు పరిసర ప్రాంతాల్లో హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. 400 ఏళ్ల నాటి గుడి చరిత్ర ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘సాగు’తున్న నిర్లక్ష్యం!
● టీబీ డ్యామ్లో ఆశాజనకంగానే నీటి లభ్యత ● ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై తర్జనభర్జన కర్నూలు (సిటీ): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి కొంత ఆలస్యంగానైనా వరద నీరొచ్చి చేరుతోంది. నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టీబీ డ్యాంలోకి నీరొస్తుందనే ఆశతో వేలాది మంది ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను చూసి తట్టుకోలేని చాలామంది తొలగించారు. టీబీ డ్యాంలో నీరొస్తే ఆరుతడి పంటలను సాగు చేయొచ్చని ఆశించారు. అయితే జల వనరుల శాఖ ఇంజినీర్లు, టీబీ డ్యాం ఇంజినీర్లు సాగు నీటి విషయంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల సాకు! ప్రస్తుతం డ్యాంలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది, డ్యాంలోకి 47 వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. బోర్డు నిబంధనల ప్రకారం 40 టీఎంసీలకుపైగా నీరు ఉండి, ఎగువ నుంచి ఇన్ఫ్లో ఆవుట్ ఫ్లో కంటే ఎక్కువగా ఉంటే సాగు నీటిని విడుదల చేయాలి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను సాకు చూపించి కాల్వలకు నీటిని విడుదల చేయకపోవడం బట్టి చూస్తుంటే ఖరీఫ్ పంటలకు సాగు నీటిని అందించే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉందని, ఒకటి, రెండు రోజుల్లో కర్ణాటక సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి ఖరీఫ్ పంటలకు నీరు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు. 4.46 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. జూన్ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది 62 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఆగస్టు 7వ తేదీ నాటికి 208.90 టీఎంసీల తుంగభద్ర జలాల నీటి లభ్యత వచ్చింది. గత పదేళ్లలో సరాసరిగా 76.49 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 ప్రకారం ఉమ్మడి జిల్లాల్లోని దిగువ కాలువకు 29.5 టీఎంసీలు ఇవ్వాలి. అలాగే కర్నూలు–కడప కాలువకు 39.90 టీఎంసీల(ఇందులో 29.9 టీఎంసీలు తుంగభద్ర నది ప్రవాహం నీటి నుంచి, 10 టీఎంసీలు టీబీ డ్యాంలో నిల్వ నీటి నుంచి) నీరు ఇవ్వాలి. ఆ నీటిపై ఆధారపడి సుమారు 4.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్న గణాంకాల ప్రకారం జూలై చివరి నాటికి కనీసం డ్యాంలోకి 80 టీఎంసీలకు పైగా రావాలని ఆ స్థాయిలో ఈ ఏడాది నీటి లభ్యత లేకపోవడంతోనే ఆయకట్టుకు ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కేసీ పక్కనే నీరు...అయినా కన్నీరే! తుంగభద్రనదిపై ఆధారపడిన కేసీ కాలువ ఆధారిత తాగునీటి పథకాలను నీరు అందడం లేదు. ఆ పథకాలపై ఆధారపడిన గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మల్యాల దగ్గర కేసీకి నీటిని పంపింగ్ చేసేందుకు ఉన్న రెండు మోటర్లను ఆన్చేస్తే తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ప్రజలు కోరుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేసీ కెనాల్పై నందికొంట్కూరు నగర పంచాయతీకి తాగు నీటిని అందించే వాటర్ స్కీం ఉంది. అలాగే లక్ష్మాపురం తాగు నీటి పథకం, మిడ్తూరు మండలానికి తాగు నీటిని అందించే స్కీంకు నీరు లేదు. ఆ స్కీంలపై ఆధారపడిన ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు పక్కనే ఉన్నా తమ దాహం తీర్చేందుకు అవకాశం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 70 టీఎంసీల వరకు నీరు ఉంది. తాగునీటి అవసరాలకు కోసమే విడుదల చేస్తున్నాం. ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి సాగుకు ఎలాంటి ఇండెంట్ రాలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంది. ఎగువన వర్షాలు తగ్గుతుండడంతో నీటి చేరికలు హెచ్చు, తగ్గులు ఉన్నాయి. – నారాయణ నాయక్, టీబీ డ్యాం, ఎస్ఈ -
చేనేత కార్మికులను మోసం చేసిన చంద్రబాబు
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక కర్నూలు (టౌన్): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులను సీఎం చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక విమర్శించారు. కర్నూలులోని వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు బుట్టా శివ నీల కంఠం, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతూల్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు, కుర్ని నాయకులు రాధక్రిష్ణ హాజరయ్యారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి, చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన మాచాని సోమప్ప చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నర్ర ఏళ్ల తరువాత నేతన్న కు రూ.25 వేలు ఇస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా వంటి ఇబ్బందులు ఉన్నా ఐదేళ్ల పాటు రూ. 24 వేలు అందించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక వెయ్యి పెంచి రెండేళ్ల తరువాత మంజూరు చేస్తోందన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని, కొర్రీలు పెట్టి ఎగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అద్దె ఇంట్లో ఉన్నా.. అద్దెకు మగ్గం తీసుకొని వృత్తిని కొనసాగిస్తున్న వారందరికీ నిధులు ఇవ్వాలన్నారు. త్వరలోనే బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతన్నల కోసం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. చేనేత సోసైటీలను కాపాడుకుంటామన్నారు. అనంతరం కర్నూలు, కల్లూరు, ఎమ్మిగనూరు ఇతర ప్రాంతాల నుంచి నేతన్నలు బుట్టా రేణుకను ఘనంగా సత్కరించారు. -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
కర్నూలు (టౌన్): సీసీ కెమెరాలు నిఘాను మరింత పటిష్టం చేస్తాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బి.తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్షిప్లో శుక్రవారం 35 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్, వ్యా పార సంస్థల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. పోలీసులు, ప్రజల సమన్వయంతో నే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ కేశవ రెడ్డి,తాలూకా సీఐ తేజమూర్తి,కాదంబరి టౌన్షి ప్కాలనీఅసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో అవమాన భారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బుడగజంగాల శేఖర్ గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తూర్పాటి వెంకటేశ్వర్లు శేఖర్ వద్ద దాదాపు రూ. 2 లక్షల వరకు అప్పు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండు రోజుల క్రితం అప్పు డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకటేశ్వర్లును శేఖర్ ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడం వలన శేఖర్పై వెంకటేశ్వర్లు దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకుని దాదాపు మూడేళ్లు అవుతున్నా తిరిగి చెల్లించకపోగా అడిగినందుకు తనపైనే దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని శేఖర్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని కుటుంబీకులు కర్నూలుకు తరలించారు. లాకర్ విరాళం ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానానికి దేవస్థాన పూర్వ మేనేజర్ దివంగత లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు రూ.1.50 లక్షల విలువైన లాకర్ను శుక్రవారం మణియందార్ సౌమ్యనారాయణ్కు అందజేశారు. ఈ సందర్భంగా లాకర్ను ఆలయంలో ఉంచి అందులో స్వామి, అమ్మవార్ల నగలు, పట్టు వస్త్రాలు భద్రపరిచేందుకు ఉపయోగిస్తామని మణియందార్ తెలిపారు. దాతలకు తీర్థ ప్రసాదాలు, స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. సారా బట్టీలపై దాడులు డోన్ రూరల్(ప్యాపిలి): అలేబాద్ తండా సమీపంలోని కొండ ప్రాంతంలో ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం సారా బట్టీలపై దాడి చేసి సుమారు 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాషిణి, నంద్యాల ఈఎస్టీఎఫ్ సీఐ లక్ష్మణ్దాసు, డోన్ ఎకై ్సజ్ సీఐ జఫరుల్లా, ఎస్ఐలు దౌలత్ ఖాన్, సొమశేఖర్, రమేష్ బాబు, రవితేజ, సిబ్బంది సుధాకర్ రెడ్డి, శేషన్న, ఉమాకాంత్ రెడ్డి, గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ విభేదాలతో యువకుడి దారుణ హత్య
కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పాతబస్తీకి చెందిన షేక్ ఇంతియాజ్(32) 2024 కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇతను టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్ అనుచరుడిగా తెలుస్తోంది. ఇంతియాజ్కు ప్రత్యర్థులు మహబూబ్ అలీ, ఇమ్రాన్ అనే వ్యక్తులతో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. గతంలో మృతుడు ప్రత్యర్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో వారిపై రాజకీయ, మోసం కేసులను నమోదు చేశారు. గతేడాది ఏప్రిల్లో ఇంతియాజ్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. గతంలో వీరి మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా కక్ష పెంచుకున్న నిందితులు ఉస్తాద్ మహబూబ్ అలీ, ఇమ్రాన్ వారికి అనుచరులుగా ఉన్న జవాద్, ఇర్ఫాజ్ అర్ధరాత్రి సమయంలో మాసుం బాషా దర్గా సమీప పాన్ షాపు వద్ద ఇంతియాజ్తో గొడవ పడ్డారు. నిందితులు బండరాయితో ఇంతియాజ్ తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన మృతుడి స్నేహితులు సుభాన్, అల్తాఫ్ కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. ఇంతియాజ్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి తమ్ముడు షేక్ ఇలియాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. -
కరువు తెచ్చిన నష్టం
పగిడ్యాల/జూపాడుబంగ్లా: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని మొక్కజొన్న పైర్లలో ఎదుగుదల లోపించింది. రెండు నెలలు అయినా ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. దీంతో వర్షధార పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టం తప్పదని భావించిన రైతులు పంటలను చెరిపేసి మద్యకారు కింద మినుము సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పగిడ్యాల గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు సాగు చేసిన మూడు ఎకరాల మొక్కజొన్న పైరును గొర్రెల మేతకు అప్పగించి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే జూపాడుబంగ్లా మండలం తర్తూరులో సుంకిరెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను శుక్రవారం రొటావేటర్తో దున్నేశాడు. తనకు రూ.80వేల నష్టం, నాగిరెడ్డి అనే రైతు 12ఎకరాల్లో సాగుచేసిన పంటను రొటావేటర్తో దున్నేయగా తనకు రూ.2.50 లక్షల పంటనష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తర్తూరులో మొక్కజొన్న పంటను దున్నేస్తూ.. -
డబ్బుల పంచాయితీలో కొట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఏమి సంబంధం?
కర్నూలు (టౌన్): తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు డబ్బుల పంచాయితీలో బజారులో రాళ్లతో కొట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఏమి సంబంధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో అన్యాయంగా ఇమ్రాన్, వస్తాద్లను ఇరికించారన్నారు. కత్తులు, కటార్లు పట్టుకుని దాడి చేశారా, అప్పటికప్పుడు రాళ్లతో కొట్టుకుని చనిపోతే వీరికేమి సంబంధమని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీలోని మాసూం బాషా దర్గా వద్ద జరిగిన హత్య ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా వీడియోలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతల ఒత్తిడితోనే సంబంధం లేని వ్యక్తులను హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారని, న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటామన్నారు. ఇటువంటివి మంచి పద్ధతి కాదని, ప్రభుత్వం మారితే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. హత్య కేసులో నమోదు చేసిన పేర్లకు సంబంధించి పోలీసులు నిజానిజాలు తేల్చాలన్నారు. గురువారం రాత్రి కర్నూలు పాతబస్తీలో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. అనవసరంగా హత్య ఘటనలో లేని వ్యక్తులను ఇరికించడం టీడీపీకి నేతలకు తగదన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు.సంబంధం లేని వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా పోలీసు యంత్రాంగానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు. – మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇమ్రాన్, వస్తాద్లను అక్రమంగా కేసులో ఇరికించారు హత్య ఘటనలో సీసీ కెమెరాలను పోలీసులు బయటపెట్టాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుదుత్పాదన
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860 అడుగులకు పైబడగానే మంగళవారం రాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉత్పాదన మొదలుపెట్టింది. జలాశయ ం నుంచి 4,267 క్యూసెక్కుల నీటిని వాడుకొని 2.087 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి ంది. బుధవారం కూడా విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తోంది. అలాగే బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేక ఉత్పాదనను ఇప్పటికీ ప్రారంభించనట్లు తెలుస్తోంది. -
అధికార టీడీపీ ఇప్పటికీ కక్ష సాధింపు రాజకీయాలనే నమ్ముకుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. పోలీసులను పావులుగా వాడుకొని బలమైన నాయకులను కటకటాల్లోకి పంపే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: చంద్రబాబు పాలనలో పోలీ సులు పెట్రేగిపోతున్నారు. పచ్చపార్టీ నేతలమెప్పుకోసం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసు లు బనాయిస్తున్నారు.శాసనసభ్యులన్న గౌరవం లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. నిర్భంధించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో ఇదే జరిగింది. పక్కా ప్రణాళికతో పోలీసులను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేపై పలుకేసులు నమోదు చేయించి జైలుకు పంపారు. ఎస్సీ మహిళ వస్త్రాలను చింపివేశారని ఆయనతోపాటు సోదరుడు, కుమారుడిపైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగక పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనా కేసులు బనాయించారు. అయితే ఎస్సీ మహిళ వస్త్రాలు ఎమ్మెల్యే చింపలేదని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించేందుకు మహిళ భర్త ఉద్దేశపూర్వకంగా భార్య బట్టలు చింపినట్లు ఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాన్ని ఈ వీడియో ప్రశ్నిస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ కేసులు -
పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని ధర్నా
నంద్యాల(న్యూటౌన్): పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై బుధవారం కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ ంగా డీవైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలన్నారు. కేవలం 2,500 పోస్టులొద్దని మొత్తం11,639 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థులు వయస్సును కోల్పోతున్నారన్నారు. జనరలైజేషన్ పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ధర్నాలో కానిస్టేబుల్ అభ్యర్థులు యాకూబ్, అజారుద్దీన్, నారాయణస్వా మి, వినయ్, కుమార్, సుమంత్, ఓబయ్య, సా యి,అశోక్,రాజశేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్టులకు తక్షణమే నీరు విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): సీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శ్రీశైలం నీటి విడుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి రైతాంగ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని సమితి ఉపాధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, శంకర్రెడ్డి హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని కాపాడి, సీమకు రావాల్సిన నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బుధవారం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జలవనరుల శాఖ అధికారులు ప్రతాప్లకు సమితి నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత వర్షా కాలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ప్రస్తుతం ఎగువన ఉన్న కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులతో అనుసంధానమైన రిజర్వాయర్లు, గ్రామీణ చెరువులకు తక్షనమే నీటి విడుదల చేయాలన్నారు. సీమ ప్రజల చట్టబద్ధమైన జలహక్కులను పరిరక్షిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, సుధాకర్రావు, దామోదర్రెడ్డి, సదాశివారెడ్డి, చిన్నరామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, పెద్దన్న, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసుల అక్రమ కేసులు కొన్ని..
● అక్టోబర్ 2, 2024 పవన విద్యుత్ సబ్ స్టేషన్లలో సామగ్రిని ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీకి చెందిన 24 మందిపై కేసు నమోదు చేశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్, ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్దనున్న సబ్ స్టేషన్, దేవనకొండ మండలంలోని సబ్ స్టేషన్లపై దాడికి పాల్పడిననట్లు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు వెంకటేష్తో పాటు దేవనకొండ జెడ్పీటీసీ రామకృష్ణ, ఆస్పరి మండలంలోని బిణిగేరి సర్పంచ్ వెంకటేష్, హాలహర్వి మండలం ఎంపీపీ భర్త పరశురాము, ఇదే మండలంలోని నిట్రవట్టి గ్రామ ఎంపీటీసీ గోపాల్తో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన నియోజకవర్గ నాయకులపై కేసుపెట్టారు. ● నవంబర్ 3, 2024 తుగ్గలి మండలం శభాషపురానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం జిల్లా కార్యదర్శి హనుమంతును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో చిన్నపాటి గొడవకు సంబంధించి టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు 326 సెక్షన్ కింద జొన్నగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గద్వాలకు పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా హనుమంతును ప్యాపిలి హైవేపై పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలుకు తరలించి వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్రామంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ● నారాలోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా శభాషపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి హనుమంతు కారణమని రెడ్బుక్ కుట్రల్లో భాగంగా అక్రమ కేసు బనాయించి వేధించారు. ● జూన్ 30, 2024 నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షులు రసూల్ ఆజాద్పై టీడీపీ నేత అంజాద్ ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు 406,408,420,467,468,471,506 సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించారు. ● డిసెంబర్ 12, 2024 నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరిముల్లాపై టీడీపీ నాయకుడు జావిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు 329, 351, 133, 308 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు కరీముల్లాపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ● జూన్ 22, 2024 నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసాపై టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ● కక్ష సాధింపునకు పరాకాష్ట కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ విలేజ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టి నాలుగు సార్లు అక్రమ కేసులు పెట్టించినట్లు ప్రచారం ఉంది. 2024 ఏప్రిల్లో గడ్డివాములు కాలిపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయించి జైలుకు పంపారు. 2024 సెప్టెంబర్ 11న తన పొలంలో చేతబడి పూజలు జరిపించాడని, 2024 అక్టోబర్ 15న రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని, 2026 ఫిబ్రవరి 25న రుద్రవరం పొలంలో చేతబడి చేశాడనే కారణాలతో బోయ వెంకటేశ్వర్లుపై పలు కేసులు పెట్టించారు. ● పాత కేసును తిరగతోడి.. 2013లో గాంధీచౌక్లోని జుమ్మామసీదు నిర్వాహణలో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారని ఇషాక్బాషా అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆయనపై టీడీపీ నేతలు కక్షగట్టి వన్టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో పాత కేసును తిరగతోడారు. పోలీసుల ద్వారా నోటీసులు పంపి రిమాండ్ చేయించాలని చూశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు. -
నేడు జెడ్పీలో సాగు, తాగునీటిపై సమీక్ష
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, సాగునీటి కాలువల ద్వారా నీటి విడుదల అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు.సమావేశానికి ఉమ్మడి జి ల్లాకు చెందిన జెడ్పీటీసీ,ఆర్డబ్ల్యూఎస్, ఇరిగే ష న్ అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు. హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీరు విడుదల నందికొట్కూరు: హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు హెచ్ఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీ రాజన్బాబు తెలిపారు. మల్యాల ఎత్తిపోతల పథకంలో బుధవారం మోటార్లకు,గంగమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హంద్రీ–నీవా కాలువకు ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. కొలనుభారతిలో రేపు శాకంబరీ ఉత్సవం శ్రీశైలంటెంపుల్: శ్రీకొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం సరస్వతి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటలో బుధవారం తెలిపారు. లోకకల్యాణం కోసం మొట్టమొదటిసారిగా సరస్వతి అమ్మవారికి ఈ విశేష ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారిని పలు రకాల అకుకూరలు, కూరగాయలు, ఫలాలతో అలంకరింపజేసి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ ఉత్సవంలో పాల్గొనాలని కోరారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలు డోన్ రూరల్: మద్యం మత్తులో వాహనం నడిపిన ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు. వై చౌడప్ప(23) అనే వ్యక్తి డ్రంక్ డ్రైవ్లో పట్టుబడగా పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో బుధవారం హాజరు పరిచారు. రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు నిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పవని సీఐ రాకేష్, ఎస్ఐ మమత తెలిపారు. ప్రశాంతంగా ‘టెట్’ నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో బుధవారం టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్టు) ప్రశాంతంగా జరిగిందని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో310 మందికిగాను 278 మంది (89.68 శాతం), మధ్యాహ్న సెషన్లో 310 మంది గాను 273 మంది(88.06శాతం) హాజరైనట్లు చెప్పారు. పరీక్ష రాసేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొత్త ఓటరు నమోదుకు 30 వరకు అవకాశం నంద్యాల(అర్బన్): కొత్త ఓటరు నమోదుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా హేతుబద్ధీకరణ అనంతరం 1,629 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 134 చేరి మొత్తం 1,763 అయ్యాయని పేర్కొన్నారు. ఓటరు కార్డులో మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందదని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత బీఎల్ఓలు, ఈఆర్ఓల దృష్టికి తేవాలన్నారు. శ్రీశైలంలో రేపటి నుంచి సహస్ర ఘటాభిషేకం శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు గణపతిహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, చండీహోమం, వృద్దమల్లికార్జునస్వామివారి వద్ద జరిగే ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్జితపరోక్ష సేవలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. -
బాబూ.. రాయలసీమపై ద్వేషం ఎందుకు?
● కేసీకి నీరు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం ● వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ పగిడ్యాల: రాయలసీమ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ద్వేషం ఎందుకని నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరిగిరెడ్డి రామచంద్రారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ కమిటీ కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి ప్రశ్నించారు. చలో ముచ్చుమర్రి కార్యక్రమంలో భాగంగా వారు రైతులతో కలిసి బుధవారం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ వద్ద కృష్ణా జలాల సందర్శనకు బయలుదేరారు. ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులను మార్గమధ్యలోనే నెహ్రూనగర్ క్రాస్ రోడ్డు వద్ద నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐలు నరేంద్ర, ఓబులేసు, మల్లికార్జున అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎత్తిపోతల పథకాన్ని సందర్శించరాదని వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించారు. తీవ్ర వర్షాభావం నెలకొని రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతోందని, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆశయంతో కృష్ణా జలాల సందర్శనకు వచ్చామని దారా సుధీర్ వివరించారు. అయినా ప్రాజెక్ట్ సందర్శనకు పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి కేసీ కాలువకు నీటి విడుదల చేయాలని నిరసన తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల కేసీసీ లిఫ్ట్ నుంచి కేసీ కాలువకు 5 టీఎంసీ నీటిని వాడుకునేందుకు అనుమతులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 790 అడుగుల లోలెవెల్ నీటిని కూడా వాడుకోవడానికి మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతలను నిర్మించారని గుర్తు చేశారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కూడా సీఎం చంద్రబాబు నిర్మించలేదని ధ్వజమెత్తారు. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్సార్ 78 ప్రాజెక్ట్లు నిర్మించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ప్రాజెక్ట్ను చేపట్టి 85 శాతం పనులు పూర్తి చేయించారన్నారు. కేసీ కాలువకు రెండ్రోజుల్లో కృష్ణా జలాలు విడుదల చేయలాని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గడప గడపకుకాకుండా పొలం పొలం తిరిగి రైతాంగ సమస్యలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిష్కరించాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక తిరుమలేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, మాజీ సర్పంచ్ మద్దిలేటి, నాగశేనారెడ్డి, బోయ మధు, కాటం వెంకటరమణ, శింగారం రంగా, కళ్యాణ్, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 14 మందిపై కేసు నమోదు ప్రభుత్వ అనుమతి లేకుండా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్, వంగాల భరత్కుమార్రెడ్డి, శిరిగిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు పుల్యాల నాగిరెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, తిరుమలేశ్వరరెడ్డితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్ర బుధవారం తెలిపారు. -
గంటల వ్యవధిలోనే ఏఐ కెమెరా పట్టేస్తుంది!
మహానంది: తప్పిపోయిన వారితో పాటు నేరాల్లో పాల్గొన్నవారి ఫొటోలను అప్లోడ్ చేస్తే చాలు గంటల వ్యవధిలోనే ఆర్టీజీఎస్ సీసీ 360 ఏఐ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోగా 100కు ఫిర్యాదు వచ్చింది. నాలుగు టీముల ద్వారా సీసీ 360 ఏఐ కెమెరాల ద్వారా గంటలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. మహానంది పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఆర్. సుస్మితతో కలిసి ఎస్పీ వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణకొట్కూరు పీఎస్ పరిధిలో ఏడాది క్రితం మిస్సింగ్ అయిన ఒకరిని ఇదే సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. అలాగే రెండు నెలల క్రితం జాతీయ స్థాయి క్రిమినల్ గ్యాంగ్ను పట్టుకున్నామన్నారు. టీచర్ మందలించిందని.. మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో అబ్బీపురం గ్రామానికి చెందిన గోగుల జగదీష్ ఏడో తరగతి, పల్లపు సుధీర్ ఆరో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వేరేవారి మొబైల్ చూస్తుండగా టీచర్ మందలించారు. ఇంటికి వచ్చిన వారు ఎవరికీ చెప్పకుండా ఎక్కడైనా హాస్టల్లో ఉందామని వెళ్లారు. సాయంత్రం వరకు వారి కోసం వెతికిన తల్లిదండ్రులు కంగారు పడి 100కు కాల్ చేయడంతో స్పందించిన ఎస్పీ సునీల్ షొరాణ్ వెంటనే ఏఎస్పీ ఆర్. సుస్మితకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులురెడ్డితో పాటు మహానంది, బండిఆత్మకూరు, గోస్పాడు ఎస్ఐలు రామ్మోహన్రెడ్డి, జగన్మోహన్, సుధాకర్రెడ్డిలతో నాలుగు టీములను ఏర్పాటు చేసి వెతికించారు. అదే సమయంలో తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఫొటోలను సీసీటీవీ 360 యాప్లో అప్లోడ్ చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలో రాత్రి తప్పిపోయిన ఒకరైన జగదీష్ ముఖం మ్యాచ్ అయింది. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆటోడ్రైవర్లు, స్థానికులకు ఫొటోలు చూపించడం, రాత్రి 11.30 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్ వారిని ఓ ప్రదేశంలో చూశానని చెప్పగా వెంటనే అక్కడికి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. దొరికిన ఇద్దరు విద్యార్థులను ఎస్పీ సునీల్ షొరాణ్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో మాట్లాడారు. ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయొద్దని, కష్టపడి చదువుకోవాలని సూచించారు. వారికి నోట్బుక్స్, విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేంగా అభినందించారు. -
హడావుడిగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు జలవనరులశాఖ ఎస్ఈ శివశంకర్రెడ్డి, ఈఈ సుబ్రమణ్యంరెడ్డి, డీఈ నగేష్ హడావుడిగా నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం ఉదయం 8 గంటలకు అనుమతిచ్చినట్లు పేర్కొన్న ఎస్ఈ అరగంటలోనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడాన్ని చూస్తే ఏదో మతలబు ఉందనే విషయం అవగతం అవుతుంది. గేట్లకు పూజలు చేసి 5, 6 గేట్లను స్విచ్ ఆన్ చేసి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు పూజలు చేసి వాయనం సమర్పించి రెగ్యులేటర్ వద్ద ఒక్క అధికారి కూడా ఉండకుండా వెళ్లిపోవటం గమనార్హం. సాయంత్రం 6గంటల సమయానికి నీటి విడుదలను 4వేల క్యూసెక్కులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈ విషయమై ఎస్ఈ శివశంకర్రెడ్డిని ఫోన్లో సమాచారం అడగ్గా.. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం విడుదల చేసుకునేందుకు అనుమతివ్వడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నీటితో వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయని, సాగునీటి సంగతేంటని ప్రశ్నించగా శ్రీశైల జలాశయంలో వరద పెరిగి ప్రభుత్వం అనుమతిస్తే విడుదల చేస్తామని చెప్పారు. మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు ఏటా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు పోటీపడే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మొహం చాటేయడం గమనార్హం. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయి. సాగునీటి కోసం రైతులు ప్రశ్నిస్తారని గ్రహించిన ప్రజాప్రతినిధులు గేట్లు ఎత్తేందుకు మొహం చాటేయ్యడంతో రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
పులి దాడిలో రెండు ఆవులు మృతి
బండిఆత్మకూరు: మండలంలోని సింగవరం గ్రామ సమీపంలోని ఆముదాల చెరువు వద్ద పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్, సెక్షన్ ఆఫీసర్ నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆవులకు కళేబరాలకు పార్నపల్లె పశువైద్యాధికారి జ్యోత్స్న పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన ఆవులు సోమయాజులపల్లెకు చెందిన తెలుగు సుబ్బరాయుడు, శ్రీనివాసులు అనే రైతులకు చెందినవని అధికారులు తెలిపారు. ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. పెద్దపులి సంచరిస్తున్నందున సింగవరం, జీసీ పాలెం, నెమళ్లకుంట, లింగాపురం, నాయినిచెరువు, రామాపురం, సోమయాజుల పల్లె, మణికంఠపురం గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పశువులు మేపడానికి అటువైపు వెళ్లవద్దని రైతులను హెచ్చరించారు. బేతంచెర్ల: పట్టణంలోని కోటపేట కాలనీలో ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామానికి చెందిన పెద్దస్వామి, సుంకమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీను (21) తన అక్క ఓలమ్మ, బావ చిన్నరాముడు ఊరైన బేతంచెర్లకు బుధవారం వచ్చాడు. రాత్రి ఇంటిపైన రెండవ ఫ్లోర్లో పడుకోగా వర్షం రావడంతో కిందకు దిగివచ్చే క్రమంలో ప్రమాదశాత్తు పైనుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చేతికి వచ్చిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి సుంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ కేశవ రెడ్డి వెల్లడించారు. గొర్రెలకు మేతగా పత్తి పైరు గోనెగండ్ల: ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలను ఎదుర్కొని, అప్పులు చేసి మరి సాగుచేసిన పంటలు వర్షాలు లేక కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక కొందరు పైర్లను దున్నేస్తుండగా మరికొందరు పశువులకు మేతగా వదిలేస్తున్నారు. మండల పరిధిలోని వేముగోడు గ్రామానికి కౌలు రైతు రామారావు ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. బోరులో నీళ్లు అడుగంటిపోయాయి. పైరుకు నీరందక ఎదుగుదల లేకపోవడంతో గురువారం గొర్రెలకు మేతగా వదిలేశాడు. రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాను నేను ఎనిమిదెకరాల్లో పత్తి సాగుచేసి రూ.1.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో మొక్క పెరగలేదు. దిగుబడులు ఎలాగు రావని తెలిసి పంటను గొర్రెలకు మేతగా వదిలేశాను. ఆశలన్నీ పంటపైనే పెట్టుకున్నా, చివరకు అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా చేసి ఆదుకోవాలి. – రామారావు, వేముగోడు గ్రామం గోనెగండ్ల : మండల పరిధి లోని అయ్యకొండ గ్రామంలో మాల దాసరి వినయ్ కుమార్(20) అనే యువ కుడు గురువారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేర కు వివరాలు.. గ్రామానికి చెందిన పెద్ద రంగన్న, లక్ష్మిలకు కుమారుడు వినయ్ కుమార్కు నాలుగు నెలల క్రితం గంజిహళ్లి గ్రామానికి చెందిన శ్రీవాణితో వివాహం అయింది. వీరంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.రెండు నెలల క్రితం బతుకు దెరు వు కోసం తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడ ను ంచి మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చారు. గురువారం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వా గ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో మనస్తా పం చెందిన వినయ్ కుమార్ సాయంత్రం గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్నా పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు.మృతుని కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


