శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కి ంచగా నగదు రూపేణా రూ.5,45,55, 035 లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థానం అలంకార మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత 27 రోజులలో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. అలాగే బంగారం 127 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి–3కేజీల 680 గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. అలాగే 93రోజుల్లో అన్నదాన భవనంలోని అన్నప్రసాద వితరణ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.8,80,396 లభించిందన్నారు.


