అంబాలా: హర్యానాలోని అంబాలా జిల్లా ధనౌరా గ్రామంలో మంగళవారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తన తండ్రి మంజిత్తో కలిసి పొలంలో ఉన్న తాతకు భోజనం అందించడానికి వెళ్లిన నాలుగేళ్ల బాలుడు నిర్వైర్ సింగ్, అక్కడ ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడు ఆ బావి వద్ద ఆడుకుంటూ లోపలికి తొంగి చూస్తున్న సమయంలో, చుట్టూ ఉన్న తడి మట్టి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
Ambala, Haryana: Four-year-old Nirbhay, who had fallen into a borewell in Dhanaura village, Ambala, was finally rescued at around 3:30 am after a prolonged rescue operation and was immediately rushed to Ambala City Civil Hospital. However, doctors declared the child dead. The… pic.twitter.com/EVqv3ZWgKi
— IANS (@ians_india) June 30, 2026
తొమ్మిది అంగుళాల వ్యాసం కలిగిన ఆ ఇరుకైన బోరుబావి నుండి బాలుడిని రక్షించడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. పలువురు అధికారులు, హర్యానా క్యాబినెట్ మంత్రి అనిల్ విజ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు 21 గంటల పాటు రాత్రంతా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది, బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు బాలుడిని బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్లో అంబాలా కాంటోన్మెంట్లోని సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ప్రమాదంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్, బోర్బావిని మూసివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రైతులు తమ పొలాల్లో ఉపయోగించని లేదా వదిలివేసిన బోరుబావులను సీల్ చేయాలని ఆయన ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం


