తీవ్ర మానసిక వేదన
సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహించాలని రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు చేస్తున్న ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాం. ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు లేవని, సంబంధిత శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. మాకు రావాల్సిన పదోన్నతులు, బకాయిలు, నోషనల్ ఇంక్రిమెంట్స్, ఏఏఎస్పై మాత్రం నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం.
– ఎం రవికుమార్, ఏపీ జీఎస్డబ్ల్యూఎస్
ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్


