ఎంచక్కా.. ఎద్దుల బండిలో..
పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎద్దుల బండ్లు కనుమరుగై పోయాయి. వ్యవసాయం చేసే రైతులు సైతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదివారం కొలిమిగుండ్ల మండలంలోని తోళ్లమడుగుకు చెందిన ఓ రైతు ఎద్దుల బండిలో కుటుంబ సభ్యులతో కోర్నపల్లె సమీపంలోని పట్టాభిరామాలయంలో విగ్రహాల ప్రతిష్టకు వెళ్తూ కనిపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు వాహనాల్లో వెళుతూ ఎద్దుల బండిలో వెళ్తున్న మహిళలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. – కొలిమిగుండ్ల


