ముగిసిన అహోబిలేశుడి పార్వేట ఉత్సవం
రుద్రవరం:అహోబిలేసుడి పార్వేట ఉత్సవం బుధవారంతో ముగిసింది. ఉత్సవమూర్తులైన శ్రీజ్వా లా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారు పల్లకీ ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాలు 33 రోజల పాటు పర్యటించి చివరి మజిలీ అయిన రుద్రవరానికి చేరుకుంది. మూడు రోజల పాటు గ్రామంలోని పలు కాలనీల తెలుపులపై ఉత్సవమూర్తులు పూ జలందుకున్నారు. చివరి రోజున రుద్రవరంలోని బెస్తకాలనీకి ప ల్లకీ చేరుకోగా ఆ కాలనీ వాసులు మేళ తాళాలు పూల వర్షం కురిపిస్తు స్వాగతం పలికారు. అక్కడ విశేష పూజలందుకున్న అనంత రం రాత్రి ఆనవాయితీ ప్రకారం పల్లకీని బోయిలు కాలి నడకన మోస్తూ మండలంలోని హరినగరం సమీపంలో ఉన్న హరేరామ హరేకృష్ణగోశాల వద్దకు చేర్చారు.


