ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు 617 మంది విద్యార్థుల గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్–1, హిందీ, ఉర్దూ, అరబిక్, సాంస్కృతం పరీక్షలకు జిల్లాలో 617 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాలలో 14,359 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా 13,861 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1385 మందికిగాను 1266 మంది హాజరు కాగా.. 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు.


