స్ఫూర్తిగా నిలిచిన సుజాత
నంద్యాల జిల్లా గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత(31) గోస్పాడు మండలం తేల్లపురి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత మే 28న విధి నిర్వహణకు స్కూటీపై వెళ్తూ గోస్పాడు మండలం తెల్లపురి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆమెకు నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకోలేక బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల అవగాహనతో కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకువచ్చారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు దానం చేశారు.


