కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు | West Asia Conflict Chokes Indian Trade 38000 Containers Stranded at Ports | Sakshi
Sakshi News home page

కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు

Mar 6 2026 11:30 AM | Updated on Mar 6 2026 12:22 PM

West Asia Conflict Chokes Indian Trade 38000 Containers Stranded at Ports

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో ఉంచితే పెరిగే భారీ అద్దెలను భరించలేక ఎగుమతిదారులు ఇప్పుడు తమ కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్నారు.

సగానికి పైగా కంటైనర్లు వెనక్కి!

తాజా అధికారిక సమాచారం ప్రకారం, నిలిచిపోయిన కంటైనర్లలో దాదాపు 50 శాతం అంటే సుమారు 19,000 కంటైనర్లను ఎగుమతిదారులు వెనక్కి రప్పించుకుంటున్నారు. దీనికోసం కస్టమ్స్ శాఖకు ‘బ్యాక్ టు టౌన్’ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, ఔషధాల విషయంలో ఎగుమతిదారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.

వీటిని ఏం చేస్తారు?

విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతీ బియ్యం ఇప్పుడు భారతీయ మార్కెట్లలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల దేశీయంగా వీటి ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల రూపంలో నష్టం తప్పదనే అభిప్రాయాలున్నాయి. పోర్టుల్లో కంటైనర్ నిలిచి ఉంటే నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. షిప్పింగ్ లైన్లు కూడా 2,000 డాలర్ల వరకు అదనపు సర్‌ఛార్జీలు విధిస్తుండటంతో ఎగుమతి లాభదాయకం కాదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కింద తెలియజేశాం.

ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

West Asia Conflict1
1/2

West Asia Conflict2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement